Loksabha Speaker
-
సభలో మహాభారత కథలొద్దు: స్పీకర్ ఓంబిర్లా ఆగ్రహం
న్యూఢిల్లీ: స్పీకర్ ఓంబిర్లా ఒడిషాకు చెందిన ఎంపీపై శుక్రవారం(ఆగస్టు2) లోక్సభలో మండిపడ్డారు. ఒడిషా బీజేపీ ఎంపీ ప్రదీప్ పురోహిత్ కేంద్ర ఆయుష్ మంత్రిని ఓ ఆయుర్వేద కాలేజీపై ప్రశ్నిస్తూ అక్కడి మూలికల చరిత్రను వివరించబోయారు. దీనికి విసుగు చెందిన స్పీకర్ మహాభారత కథలు వద్దు. ప్రశ్నలడగండి. ఈ మధ్య సభలో మహాభారతం గురించి చెప్పడం ఫ్యాషన్గా మారింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో అడగాలనుకున్న విషయాలు సూటిగా అడగాలని, కథలు చెప్పొద్దని చురకలంటించారు. -
స్పీకర్ పదవికి పోటీ.. ఓం బిర్లా x సురేష్
న్యూఢిల్లీ: పద్దెనిమిదో లోక్సభ స్పీకర్ పదవికి అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఫలితంగా పోటీ అనివార్యమైంది. కీలక నేతలను పాత పదవుల్లో కొనసాగిస్తున్న మోదీ 3.0 సర్కారు దానికి అనుగుణంగానే ఎన్డీఏ అభ్యర్ధిగా ఓం బిర్లాను మంగళవారం స్పీకర్ బరిలో నిలిపింది. ఓం బిర్లా 17వ లోక్సభలో ఐదేళ్లు స్పీకర్గా పనిచేసిన విషయం తెలిసిందే. విపక్ష ఇండియా కూటమి ఆఖరి నిమిషంలో.. కాంగ్రెస్ ఎంపీ కొడైకున్నిల్ సురేశ్ను రంగంలోకి దింపింది. పార్లమెంటరీ సంప్రదాయాలను అనుసరించి విపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవిని ఇస్తే.. ఓం బిర్లాకు మద్దతు ఇస్తామని ఇండియా కూటమి షరతు పెట్టింది. అయితే బీజేపీ సీనియర్ నేతలు దీనిపై ఎలాంటి హామీ ఇవ్వలేదు. స్పీకర్ ఎన్నిక తర్వాత డిప్యూటీ స్పీకర్ ఎంపిక ఉంటుందని, ఆ సందర్భం వచ్చినపుడు చూద్దామని బీజేపీ పేర్కొంది. దీనికి ఇండియా కూటమి నేతలు సమ్మతించలేదు. డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షానికి కేటాయిస్తామని హామీ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. ఎన్డీఏ అభ్యర్థిగా ఓం బిర్లా పేరు ఖరారయ్యాక కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్.. చొరవ తీసుకొని విపక్షాలను సంప్రదించారు. రాజ్నాథ్ ఆఫీసులో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షాలతో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, డీఎంకే నేత టి.ఆర్.బాలు మంగళవారం సమావేశమయ్యారు. ఇరుపక్షాలు తమ తమ వాదనలకే కట్టుబడి ఉండటంతో ఏకాభిప్రాయం కుదరలేదు. కొద్దిసేపట్లోనే ఈ భేటీ ముగిసింది. వేణుగోపాల్, బాలు అర్ధాంతరంగా సమావేశం నుంచి బయటికి వచ్చేశారు. మూడుసార్లు ఎంపీ అయిన ఓం బిర్లా రాజస్థాన్లోని కోటాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఓం బిర్లా తరఫున 10కి పైగా నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డాలతో పాటు, టీడీపీ, జేడీయూ, జేడీఎస్, ఎల్జేపీ (ఆర్) పార్టీలు ఓం బిర్లా తరఫున నామినేషన్లు దాఖలు చేశాయి. కేరళ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దళిత ఎంపీ కే.సురేష్ ఎనిమిదోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. సురేష్ తరఫున మూడుసెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. సంప్రదాయాన్ని పాటించడం లేదు: వేణుగోపాల్ విపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవిని ఇచ్చే సంప్రదాయాన్ని ప్రభుత్వం పాటించడం లేదని వేణుగోపాల్ ఆరోపించారు. ఓం బిర్లాపై తమ అభ్యర్ధిని పోటీకి నిలుపుతామని ప్రకటించారు. విపక్షం ఒత్తిడి రాజకీయాలకు దిగుతోందని, షరతులు పెడుతోందని కేంద్ర మంత్రులు పీయుష్ గోయల్, లలన్ సింగ్ (జేడీయూ)లు అన్నారు. డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకునే సమయం వచ్చినపుడు విపక్షాల డిమాండ్ను పరిశీలిస్తామని సీనియర్ మంత్రులు హామీ ఇచ్చినా పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రజాస్వామ్యం షరతులపై నడవదని పీయూష్ గోయల్ అన్నారు. ఇండియా కూటమిలోని మిగతా పార్టీలు పోటీకి అంత సుముఖంగా లేనప్పటికీ కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తోందని బీజేపీ వర్గాలు తెలిపాయి. మూడోసారి పోటీ స్పీకర్ ఎన్నిక బుధవారం జరుగుతుంది. ఒకవేళ పోటీ అనివార్యమైతే.. లోక్సభ చరిత్రలో స్పీకర్ పదవికి పోటీ జరగడం ఇది మూడోసారి అవుతుంది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో 1952, 1967, 1976లలో మాత్రమే స్పీకర్ పదవికి ఎన్నిక జరిగింది. 1952లో కాంగ్రెస్ అభ్యర్థి జి.వి.మౌలాంకర్ 394 ఓట్లు సాధించి స్పీకర్గా ఎన్నికయ్యారు. ఆయన ప్రత్యర్థి శాంతారాం మోరేకు కేవలం 55 ఓట్లు మాత్రమే వచ్చాయి. 1967లో కాంగ్రెస్ అభ్యర్థి నీలం సంజీవరెడ్డితో తెన్నేటి విశ్వనాథం పోటీపడ్డారు. సంజీవరెడ్డికి 278 ఓట్లు రాగా, విశ్వనాథంకు 207 ఓట్లు పడ్డాయి. 1976లో జరిగిన ఎన్నిక పూర్తిస్థాయి స్పీకర్ పదవికి కాదు. 1975లో ఇందిగాంధీ దేశంలో అత్యయిక పరిస్థితిని విధించారు. ఐదో లోక్సభ ఐదో సెషన్ను ఏడాది పాటు పొడిగించారు. అప్పటి స్పీకర్ జి.ఎస్.ధిల్లాన్ రాజీనామా చేయడంతో.. జనవరి 5, 1976న పొడిగించిన ఏడాది కాలానికి స్పీకర్ ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ నాయకుడు బలిరామ్ భగత్ను స్పీకర్ పదవికి ఇందిరా గాంధీ ప్రతిపాదించారు. జనసంఘ్ నాయకుడు జగన్నాథరావు జోషి బరిలో నిలువడంతో ఎన్నిక జరిగింది. బలిరామ్ భగత్కు 344 ఓట్లు రాగా, జోషికి 58 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం 18వ లోక్సభలో ఎన్డీఏకు 293 మంది సభ్యులు ఉండగా, ఇండియా కూటమికి 233 (రాహుల్ గాంధీ వయనాడ్కు రాజీనామా చేయడంతో విపక్షాల బలం ఒకటి తగ్గింది) ఎంపీలున్నారు. అంతేకాకుండా ఇండియా కూటమికి ముగ్గురు స్వతంత్ర ఎంపీల మద్దతుంది. సంఖ్యా బలాన్ని బట్టి చూస్తే ఓం బిర్లా స్పీకర్గా ఎన్నిక కావడం లాంఛనమే. బుధవారం ఓటింగ్ జరిగితే.. పేపర్ స్లిప్పులనే వాడనున్నారు. నూతన సభ్యులు ఎవరెక్కడ కూర్చోవాలో నిర్ణయించే సీట్ల కేటాయింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. కాబట్టి ఎల్రక్టానిక్ ఓటింగ్ వ్యవస్థ సిద్ధంగా లేదు. ఓం బిర్లా స్పీకర్గా ఎన్నికైతే.. రెండు పర్యాయాలు స్పీకర్గా పనిచేసిన ఐదోవ్యక్తి అవుతారు. కాకపోతే గతంలో కాంగ్రెస్ నేత బలరాం జాఖడ్ ఒక్కరు మాత్రమే రెండుసార్లు (ఏడు, ఎనిమిదో లోక్సభల్లో) స్పీకర్గా పూర్తి పదవీకాలాన్ని పూర్తిచేశారు. అది మా హక్కు: సురేష్ ‘గెలుస్తామా, ఓడుతామా అన్నది ముఖ్యం కాదు. అధికారపక్షం నుంచి స్పీకర్ ఉంటే డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు ఇవ్వాలనేది సంప్రదాయం. గత రెండు లోక్సభల్లో మాకు పత్రిపక్ష హోదా లేదని డిప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వడానికి నిరాకరించారు. ఇప్పుడు మేము గుర్తింపు పొందిన ప్రతిపక్షం. డిప్యూటీ స్పీకర్ పదవి మా హక్కు. కానీ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. మంగళవారం 11:50 గంటల దాకా ప్రభుత్వం నుంచి స్పందన కోసం ఎదురుచూశాం. ఎలాంటి సమాధానం రాలేదు’అని కే.సురేష్ అన్నారు. -
లోక్సభ స్పీకర్ రేసులో ఆ ఇద్దరు?!
న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఎంపికపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ రోజు సాయంత్రం 5గంటలకు ఢిల్లీలోని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో బీజేపీ, మిత్రపక్షాల కేంద్రమంత్రులు భేటీ కానున్నారు. 2014, 2019 ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్ని దక్కించుకోవడంతో బీజేపీ కేంద్రంలో అధికారాన్ని చేపట్టింది. ఆ పార్టీ ఎంపీలే స్పీకర్లుగా బాధ్యతలు చేపట్టారు. 16వ లోక్సభ స్పీకర్గా బీజేపీ ఎంపీ సుమిత్రా మహాజన్ (2014), 17వ లోక్సభ స్పీకర్గా ఓంబిర్లా (2019) సేవలందించగా, ఏఐఏడీఎంకే నేత ఎం.తంబిదురై డిప్యూటీ స్పీకర్లుగా పనిచేశారు.అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పేలవ ప్రదర్శనతో కేవలం 240 స్థానాల్ని దక్కించుకుంది. ఇతర పార్టీలైన జేడీయూ, టీడీపీల పొత్తుతో మూడో దఫా అధికారం చేపట్టింది. దీంతో లోక్సభ స్పీకర్ పదవి తమకూ కావాలంటూ జేడీయూ, టీడీపీలు పోటీ పడుతుండగా.. కమలం అగ్రనాయకత్వం మాత్రం ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బీజేపీ ఎంపీలనే స్పీకర్లుగా ఎంపిక చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.రేసులో ఆ ఇద్దరులోక్సభ ఎన్నికల ముందు ఒడిశా నుంచి బీజేపీలో చేరిన కటక్ ఎంపీ ఎంపీ భర్తృహరి మహతాబ్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా.. ఓం బిర్లానే మరోసారి లోక్సభ స్పీకర్గా నియమించే అవకాశం ఉందంటూ జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.ప్రొటెం స్పీకర్గారాజ్యాంగ నిబంధనలు ప్రకారం.. కొత్త లోక్సభ మొదటి సారి సమావేశానికి ముందు స్పీకర్ పదవి ఖాళీ అవుతుంది. కొత్త ఎంపీలతో ప్రమాణస్వీకారం చేయించడానికి సీనియర్ సభ్యుడ్ని ప్రొటెం స్పీకర్గా రాష్ట్రపతి నియమిస్తారు. ప్రొటెం స్పీకర్ రేసులో కాంగ్రెస్ సీనియర్ నేత కొడికున్నిల్ సురేశ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ప్రొటెం స్పీకర్,స్పీకర్,డిప్యూటీ స్పీకర్ ఎవరనేది ఈ రోజు సాయంత్ర ఎన్డీయే, దాని మిత్రపక్ష పార్టీల కేంద్రమంత్రుల సమావేశం అనంతరం స్పష్టత రానుంది. -
మోదీ 3.0.. స్పీకర్ పీఠం ఎవరికి?
న్యూఢిల్లీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం రాత్రి న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రమాణస్వీకారం చేశారు. మోదీ సహా 72 మందితో కేంద్ర క్యాబినెట్ కూడా ఏర్పాటైంది. ప్రధాని, మంత్రులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు. 30 మందికి క్యాబినెట్ మంత్రులుగా అవకాశం లభించింది. మరో ఐదుగురిని స్వతంత్ర హోదాతో సహాయ మంత్రులుగా, 36 మందిని సహాయ మంత్రులుగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కొత్తగా ఏర్పాటైన నరేంద్ర మోదీ క్యాబినెట్ తొలి సమావేశం సోమవారం జరగనునంది. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని లోక్కళ్యాణ్ మార్గ్లో ఉన్న ప్రధాని నివాసంలో క్యాబినెట్ సమావేశం ఉంటుంది.కాగా ఇటీవల వెలువడిన లోక్షభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి సొంతంగా మెజార్టీ రాకపోవడంతో మిత్ర పక్షాలైన టీడీపీ, నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూతో కలిసి మూడోసారి ప్రధానిగా పదవీ స్వీకరించారు మోదీ. ఫలితాలు వెలువడిన నాలుగు రోజులకే మోదీతో సహా 72 మంది మంత్రులతో కూడిన పూర్తిస్థాయి మంత్రివర్గం ఆదివారం ప్రమాణ స్వీకారం చేసింది.కీలక మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూలకు రెండు మంత్రి పదవులు (ఒక కేబినెట్ ర్యాంకు, ఒక రాష్ట్ర మంత్రి) దక్కాయి. అయితే మరో కీలక పదవి అయిన లోక్సభ స్పీకర్ ఎవరికి దక్కుతుందే ప్రశ్న ఇంకా ఉత్కంఠగానే మిగిలి ఉంది. ఈ ఎన్నికల్లో కింగ్మేకర్గా అవతరించిన టీడీపీ, జేడీయూలు ఈ పోస్టుపై కన్నేసిన్నప్పటికీ.. దానిని వదులుకునేందుకు బీజేపీ ఆసక్తి చూపడం లేదు.అయితే రాజ్యాంగం ప్రకారం, కొత్తగా ఎన్నికైన లోక్సభ మొదటిసారి సమావేశమయ్యే ముందు స్పీకర్ పదవి ఖాళీ అవుతుంది. హౌస్లోని సీనియర్ సభ్యుల నుంచి రాష్ట్రపతి .. ఒకరిని ప్రొటెం స్పీకర్గా నిమిస్తారు. ఈ ప్రొటెం స్పీకర్ కొత్త ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం సాధారణ మెజారిటీతో హౌస్ సభ్యుల నుంచి ఒకరిని స్పీకర్గా ఎన్నుకుంటారు.లోక్సభ స్పీకర్గా ఎన్నికవ్వడానికి నిర్దిష్ట ప్రమాణాలు, ప్రత్యేక నియమాలేవి లేకపోయినా... రాజ్యాంగం, పార్లమెంటరీ నియమాలపై అవగాహన కలిగి ఉండటం అవసంరం. గత రెండు పర్యాయాలలో లోక్షభలో బీజేపీకి మెజారిటీ ఉండటంతో సుమిత్రా మహాజన్, ఓం బిర్లా స్పీకర్లుగా ఎన్నికయ్యారు.కాగా లోక్సభ స్పీకర్ పదవనేది కీలక పదవి. ఫిరాయింపు కారణంగా సభ్యులపై అనర్హత వేటు వేయడానికి సంబంధించిన కేసులను నిర్ణయించడంలో ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం స్పీకర్కు సంపూర్ణ అధికారం ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల్లో ఇలాంటి ఘటనలు కూడా జరిగాయి. పార్టీలో తిరుగుబాటు చేయడం ద్వారా పార్టీ చీలికలకు దారి తీసి ప్రభుత్వాన్నే పడగొట్టిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఇలాంటి వాటికి చోటివ్వకుండా ఉండేందుకు టీడీపీ, జేడీయూ ఈ పదవిని కోరుకుంటోంది. మరి చూడాలి ఎవరిని స్పీకర్ పదవి వరిస్తుంది. -
Parliament :సస్పెండెడ్ ఎంపీలు కోల్పోయేవి ఇవే !
న్యూఢిల్లీ : ప్రస్తుత పార్లమెంట్ సెషన్లో ఎంపీల సస్పెన్షన్ పర్వం కొనసాగుతోంది. ఈ సెషన్లో ఇప్పటివరకు లోక్సభ, రాజ్యసభల్లో కలిపి విపక్షానికి చెందిన 141 మంది ఎంపీలు సస్పెన్షన్కు గురయ్యారు. ఒక్క లోక్సభ నుంచే 95 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ భద్రతా వైఫల్యం ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్టేట్మెంట్ ఇవ్వాల్సిందేనన్న డిమాండ్తో సభను అడ్డుకున్నందుకు స్పీకర్ ఎంపీలపై వేటు వేశారు. అయితే సస్పెండ్ అయిన ఎంపీలకు సంబంధించి మంగళవారం లోక్సభ సెక్రటేరియట్ ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. ఈ సర్క్యులర్ ప్రకారం సస్పెండెడ్ ఎంపీలు కేవలం సభలోకి రాకుండా ఉండడమే కాక ఎంపీలుగా తమకు సంక్రమించిన మరెన్నో హక్కులను తాత్కాలికంగా కోల్పోతారు. ఆ ఎంపీలకు సభతో పాటు పార్లమెంట్ చాంబర్, లాబీ, గ్యాలరీలకు కూడా ప్రవేశం ఉండదు. సాధారణంగా ఎంపీలు వివిధ పార్లమెంటరీ కమిటీల్లో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ సిట్టింగ్లలో కూర్చునే హక్కునూ సస్పెండెడ్ ఎంపీలు కోల్పోతారు. సస్పెండైన ఎంపీలు ఇచ్చే ఎలాంటి నోటీసులనూ సభలో అనుమతించరు. వారి పేరు మీద ఏ రకమైన బిజినెస్ను లిస్ట్ చేయరు. వీటితో పాటు ఆర్థిక పరమైన ప్రభావం కూడా సస్పెండెండ్ ఎంపీల మీద ఉంటుంది. సాధారణంగా ఎంపీలకు చెల్లించే రోజు వారి భత్యాలు కూడా సెషన్ మొత్తం సస్పెండ్ అయిన ఎంపీలకు చెల్లించరని సర్క్యులర్లో లోక్సభ సెక్రటేరియట్ పేర్కొంది. ఇదీచదవండి..కొరియా లేడీ యూట్యూబర్కు వేధింపులు.. వ్యక్తి అరెస్టు -
Parliament Winter Session 2023: సస్పెన్షన్ల పర్వం...78 మందిపై వేటు
పార్లమెంట్లో సోమవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంటు భద్రతా వైఫల్యంపై నినాదాలు, నిరసనలతో హోరెత్తించిన క్రమంలో ఏకంగా 78 మంది విపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది! వీరిలో 33 మంది లోక్సభ సభ్యులు కాగా 45 మంది రాజ్యసభ సభ్యులున్నారు. ఒకే రోజు ఇంతమందిని బహిష్కరించడం పార్లమెంటు చరిత్రలోనే ఇదే తొలిసారి. గత వారమే 13 మంది లోక్సభ, ఒక రాజ్యసభ సభ్యునిపై సస్పెన్షన్ వేటు పడటం తెలిసిందే. దీంతో ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సస్పెండైన విపక్ష సభ్యుల సంఖ్య 92కు చేరింది. భద్రతా వైఫల్యంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వివరణ, రాజీనామాకు డిమాండ్ చేయడమే వీరి సస్పెన్షన్కు కారణం. సస్పెన్షన్లపై సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలకమైన బిల్లులపై పార్లమెంట్లో చర్చ జరగకుండా మోదీ సర్కారు కుట్ర పన్నిందని, అందుకే తమను సస్పెండ్ చేసిందని మండిపడ్డారు. న్యూఢిల్లీ: పార్లమెంట్లో సోమవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఉభయ సభల్లో ఏకంగా 78 మంది ప్రతిపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. ఒకేరోజు 78 మందిని బహిష్కరించడం భారత పార్లమెంట్ చరిత్రలో ఇదే మొదటిసారి. పార్లమెంట్లో ఈ నెల 13వ తేదీనాటి భద్రతా వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ సభలో తీవ్ర అలజడి సృష్టించిందుకు వీరిని సస్పెండ్ చేస్తున్నట్లు లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు. లోక్సభ నుంచి 33 మంది, రాజ్యసభ నుంచి 45 మంది విపక్ష ఎంపీలు సస్పెన్షన్కు గురయ్యారు. గత వారమే లోక్సభలో 13 మంది, రాజ్యసభలో ఒక విపక్ష ఎంపీపై సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సస్పెండైన మొత్తం ప్రతిపక్ష సభ్యుల సంఖ్య 92కు చేరుకుంది. వీరంతా ఒకే కారణంతో వేటుకు గురయ్యారు. భద్రతా వైఫల్యంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వివరణ, రాజీనామాకు డిమాండ్ చేస్తూ ఉభయ సభల్లో ఆందోళనకు దిగారు. ఎంపీల నినాదాలు, నిరసనలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. సస్పెన్షన్ల పర్వంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలకమైన బిల్లులపై పార్లమెంట్లో చర్చ జరగకుండా ప్రభుత్వం కుట్ర పన్నిందని, అందులో భాగంగానే సస్పెండ్ చేసిందని మండిపడ్డారు. లోక్సభలో విపక్షాల రగడ భద్రతా వైఫల్యంపై విపక్ష సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ బిగ్గరగా నినాదాలు చేయడంతో లోక్సభ సోమవారం పలుమార్లు వాయిదా పడింది. కేంద్ర మంత్రి అమిత్ షా సభకు వచ్చి సమాధానం చెప్పాలని, పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. శాంతించాలని, సభా కార్యకలాపాలకు సహకరించాలని స్పీకర్ పలుమార్లు కోరినా ఫలితం లేకుండాపోయింది. దాంతో 33 మంది విపక్ష ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు వేర్వేరు తీర్మానాలు మూజువాణి ఓటుతో ఆమోదం పొందాయి. అనంతరం సదరు ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. వీరిలో 10 మంది డీఎంకే, 9 మంది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, 8 మంది కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు. స్పీకర్ పోడియంపైకి చేరుకొని నినాదాలు చేసిన ముగ్గురు కాంగ్రెస్ సభ్యుల ప్రవర్తనపై విచారణ జరపాలని సభా హక్కుల కమిటీని స్పీకర్ ఆదేశించారు. ఆ నివేదిక వచ్చేదాకా వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మిగతా ఎంపీలను శీతాకాల సమావేశాలు ముగిసేదాకా బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. రాజ్యసభలో అదే దృశ్యం రాజ్యసభలో కూడా అదే దృశ్యం పునరావృతమైంది. చైర్మన్ ఆదేశాలను ధిక్కరించడంతోపాటు సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతూ అనుచితంగా ప్రవర్తించడంతో మొత్తం 45 మంది ప్రతిపక్ష సభ్యులు సస్పెన్షన్కు గురయ్యారు. వీరిలో 12 మంది కాంగ్రెస్, ఏడుగురు తృణమూల్, నలుగురు డీఎంకే సభ్యులున్నారు. 45 మందిలో 34 మందిని ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో మిగిలిన సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు. మిగతా 11 మంది సభలో ప్రవర్తించిన తీరుపై విచారణ జరిపి మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని సభా హక్కుల కమిటీని చైర్మన్ ఆదేశించారు. నివేదిక వచ్చేదాకా సభకు దూరంగా ఉండాలని వారిని చైర్మన్ ఆదేశించారు. దాంతో వారు 3 నెలల దాకా సభకు హాజరయ్యే అవకాశం లేనట్లే. ప్రస్తుత సెషన్ ముగిసేదాకా సస్పెండైన లోక్సభ సభ్యులు అదీర్ రంజన్ చౌదరి, గౌరవ్ గొగొయ్, కె.సురేశ్, అమర్సింగ్, రాజమోహన్ ఉన్నిథాన్, తిరుణావుక్కరసర్, కె.మురళీధరన్, ఆంటోనీ (కాంగ్రెస్); కల్యాణ్ బెనర్జీ, అపురూప పొద్దార్, ప్రసూన్ బెనర్జీ, సౌగతా రాయ్, శతాబ్ది రాయ్, ప్రతిమా మండల్, కకోలీ ఘోష్ దస్తీదార్, అసిత్ కుమార్ మాల్, సునీల్ కుమార్ మండల్ (తృణమూల్ కాంగ్రెస్); టీఆర్ బాలు, ఎ.రాజా, దయానిధి మారన్, టి.సుమతి, కె.నవాస్కని, కళానిధి వీరస్వామి, సి.ఎన్.అన్నాదురై, ఎస్.ఎస్.పళనిమాణిక్కం, జి.సెల్వన్, ఎస్.రామలింగం (డీఎంకే); ఈటీ మొహమ్మద్ బషీర్ (ఐయూఎంఎల్); ఎన్.కె.ప్రేమచంద్రన్ (ఆర్ఎస్పీ); కౌసలేంద్ర కుమార్ జేడీ(యూ) సభా హక్కుల కమిటీ నివేదిక వచ్చేదాకా సస్పెండైన సభ్యులు: కె.జయకుమార్, విజయ్ వసంత్, అబ్దుల్ ఖలీక్ (కాంగ్రెస్) ప్రస్తుత సెషన్ ముగిసేదాకా సస్పెండైన రాజ్యసభ సభ్యులు ప్రమోద్ తివారీ, జైరాం రమేశ్, కె.సి.వేణుగోపాల్, రణదీప్సింగ్ సుర్జేవాలా, అమీ యాజ్ఞిక్, నరేన్భాయ్ జె.రాథ్వా, సయీద్ నాసిర్ హుస్సేన్, ఫూలోదేవి నేతమ్, శక్తిసింహ్ గోహిల్, రజని అశోక్రావు పాటిల్, రంజీత్ రంజన్, ఇమ్రాన్ ప్రతాప్గార్హీ (కాంగ్రెస్); సుఖేందు శేఖర్ రాయ్, మొహమ్మద్ నదీముల్ హక్, అబిర్ రంజన్ బిశ్వాస్, శాంతను సేన్, మౌసమ్ నూర్, ప్రకాశ్ చిక్ బరాయిక్, సమీరుల్ ఇస్లాం (తృణమూల్ కాంగ్రెస్); ఎం.షణ్ముగలింగం, ఎన్.ఆర్.ఇలాంగో, కనిమొళి ఎన్వీఎన్ సోము, ఆర్.గిరిరాజన్ (డీఎంకే); మనోజ్ కమార్ ఝా, ఫయాజ్ అహ్మద్ (ఆర్జేడీ), రామ్గోపాల్ యాదవ్, జావెద్ అలీఖాన్ (ఎస్పీ); రామ్నాథ్ ఠాకూర్, అనీల్ ప్రసాద్ హెగ్డే (జేడీ–యూ); వి.సదాశివన్ (సీపీఎం); వందనా చవాన్ (ఎన్సీపీ); మహువా మజీ (జేఎంఎం); జోస్ కె.మణి (కేసీ–ఎం); అజిత్కుమార్ భూయాన్ (స్వతంత్ర) సభా హక్కుల కమిటీ నివేదిక వచ్చేదాకా సస్పెండైన సభ్యులు: జెబీ మాథర్ హిషామ్, ఎల్.హనుమంతయ్య, నీరజ్ డాంగీ, రాజమణి పటేల్, కుమార్ కేట్కర్, జి.సి.చంద్రశేఖర్ (కాంగ్రెస్); జాన్ బ్రిట్టాస్, ఎ.ఎ.రహీం (సీపీఎం); బినోయ్ విశ్వం, పి.సందోష్కుమార్ (సీపీఐ); మొహమ్మద్ అబ్దుల్లా (డీఎంకే) నియంతృత్వాన్ని పరాకష్టకు తీసుకెళ్లారు. అచ్చం బాహుబలుల మాదిరిగా ప్రవర్తించారు. సభ నడవాలంటే విపక్షాలు ఉండాలనే కనీస నియమాన్నీ మరిచారు. అందర్నీ దారుణంగా సస్పెండ్ చేశారు. – అధీర్ రంజన్ చౌదరి, లోక్సభలో కాంగ్రెస్ నేత లోక్సభలో పొగ ఘటనకు కారకుడైన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహాను సస్పెండ్ చేయాలని మేం కోరుతుంటే మమ్మల్నే సస్పెండ్ చేశారు. ఈ దారుణ ధోరణి ప్రజాస్వామ్యానికే వ్యతిరేకం. – సౌగతా రాయ్, తృణమూల్ కాంగ్రెస్ నేత పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ ఇలాంటిది జరగలేదు. 33 మంది లోక్సభ ఎంపీలను సస్పెండ్ చేస్తారా?. సభను ప్రశాంతంగా నడపాలి. అధికార పార్టీ సభ్యుల వైఖరి మీదే అది ఆధారపడి ఉంటుంది. విపక్షాలు వివరణ కోరుతుంటే ప్రభుత్వం ఈ విధంగా స్పందించడం దారుణం. – టీఆర్ బాలు, డీఎంకే నేత -
రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారు: మంత్రి ఉత్తమ్
సాక్షి, న్యూఢిల్లీ: గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మభ్య పెట్టి, వాస్తవాలను దాచి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిందని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కు మార్రెడ్డి విమర్శించారు. కొత్తగా రాష్ట్రం ఏర్పడే నాటికి రూ.67 వేల కోట్లుగా ఉన్న అప్పులను తొమ్మిదిన్నరేళ్లలో ఏకంగా రూ.4.50 లక్షల కోట్లకు పెంచేశారని ధ్వజమెత్తారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యుత్ కొను గోళ్లకు సంబంధించి రూ.81 వేల కోట్లు, పౌర సర ఫరాల శాఖకు సంబంధించి రూ.56 వేల కోట్లు అప్పులున్నాయని తేలిందని, ఇరిగేషన్కు సంబంధించి రూ.10 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని ఉత్తమ్ తెలిపారు. ఇరిగేషన్, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, మేడిగడ్డ కుంగిన ఘటనలపై విచారణ జరుగుతుందని, విచారణను జాతీయ సంస్థలతో చేయించాలా లేక రాష్ట్ర సంస్థలతోనా? అన్నది ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయిస్తామని మంత్రి చెప్పారు. మేడిగడ్డ డిజైన్, నిర్వహణ లోపాలకు ఎవరు బాధ్యులన్నది తేలుస్తామన్నారు. సోనియా, రాహుల్తో భేటీ హుజూర్నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన నేపథ్యంలో ఉత్తమ్ బుధవారం తన ఎంపీ పదవికి రాజీ నామా చేశారు. స్పీకర్ ఓంబిర్లాను కలిసి రాజీ నామా పత్రం అందజేశారు. అనంతరం తన సతీమణి, ఎమ్మెల్యే పద్మావతితో కలిసి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీలతో భేటీ అయ్యారు. తనకు మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. -
మహువాపై స్పీకర్కు నివేదిక
న్యూఢిల్లీ: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా డబ్బులు తీసుకుని పార్లమెంట్లో ప్రశ్నలడిగిన ఆరోపణలపై విచారణ పూర్తి చేసిన ఎథిక్స్ కమిటీ నివేదికను లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించింది. నివేదికను ఎథిక్స్ కమిటీ చైర్మన్ వినోద్ కుమార్ సోంకార్ శుక్రవారం స్పీకర్ కార్యాలయంలో అందజేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి చట్టవిరుద్ధంగా ప్రతిఫలం స్వీకరించినందుకు మొయిత్రాను సభ నుంచి బహిష్కరించాలంటూ కమిటీ సిఫారసు చేసిన విషయం తెలిసిందే. -
పార్లమెంట్లో వివాదాస్పద వ్యాఖ్యలు.. బీజేపీ ఎంపీ అంశంలో కీలక పరిణామం
ఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై బీజేపీ సభ్యుడు రమేష్ బిధూరి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా, బిధూరి వ్యాఖ్యలను ప్రతిపక్ష నేతలు తీవ్రంగా ఖండించారు. తాజాగా ఈ విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బీజేపీ ఎంపీ రమేష్ బిధూరిపై కఠిన చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో బీజేపీ హైకమాండ్ రంగంలోకి దిగింది. ఆయన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ పార్టీ అగ్రనాయకత్వం రమేష్ బిధూరికి నోటీసులు జారీ చేసింది. ఇక ఈ వివాదాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సభా హక్కుల కమిటీకి నివేదించారు. రమేష్ బిధూరి వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధరి, డీఎంకే ఎంపీ కనిమొళి సహా పలువురు విపక్ష ఎంపీలు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. దీంతో, వీరి ఫిర్యాదులను బీజేపీ ఎంపీ సునీల్ కుమార్ సింగ్ సారధ్యంలోని సభా హక్కుల కమిటీకి స్పీకర్ పంపించారు. ఈ వ్యవహారాన్ని సభా హక్కుల కమిటీకి రిఫర్ చేసినందుకు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే స్పీకర్కు ధన్యవాదాలు తెలిపారు. लोकसभा अध्यक्ष @ombirlakota जी का आभार,उन्होंने दानिश अली प्रकरण में @LokSabhaSectt की कमिटि को जॉंच का ज़िम्मा सौंपा ।आज यह इसलिए संभव हो पाया क्योंकि लोकसभा में भाजपा का बहुमत है,नहीं तो पहले लोकसभा ने 2006 में RJD-JDU-congress का जूता व माईक मारपीट,2012 में सोनिया गांधी जी की… — Dr Nishikant Dubey (@nishikant_dubey) September 28, 2023 ఇదిలా ఉండగా.. బీజేపీ ఎంపీ రమేష్ బిధూరికి కాషాయ పార్టీ కీలక ఎన్నికల బాధ్యతలు అప్పగించడంపై ప్రతిపక్ష పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజస్ధాన్లోని టోంక్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జ్గా రమేష్ బిధూరిని నియమించడం పట్ల బీజేపీపై విమర్శలు వెల్లువెత్తాయి. విద్వేష వ్యాఖ్యలు చేసే వారికి బీజేపీ పట్టం కడుతుందని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టోంక్లో ముస్లిం జనాభా 29 శాతమని, రాజకీయ లబ్ధి కోసం విద్వేష విషం వెదజల్లుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. VIDEO | "I am waiting for the Speaker (Lok Sabha) to take action in this matter. I hope he will definitely take action," says BSP MP @KDanishAli on the issue of derogatory comments made against him by BJP Ramesh Bidhuri in Lok Sabha. pic.twitter.com/ULJKqudtnm — Press Trust of India (@PTI_News) September 28, 2023 ఇది కూడా చదవండి: భారత తొలి ప్రధాని నెహ్రు కాదు.. బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్ -
Defamation Case: రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరించండి
న్యూఢిల్లీ: సత్యమేవ జయతే అని చెప్పడానికి రాహుల్ గాంధీ విషయంలో సుప్రీంకోర్టు ఇచి్చన ఉత్తర్వులే నిదర్శనమని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు. రాహుల్ లోక్సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని శుక్రవారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు చౌదరి విజ్ఞప్తి చేశారు. ఓం బిర్లాను ఆయన చాంబర్లో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చలో రాహుల్ మాట్లాడాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. ఆయన లోక్సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించకుండా బీజేపీ అడ్డంకులు సృష్టించే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. జాప్యం చేయకుండా చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరామన్నారు. ఈ వర్షాకాల సమావేశాలకు హాజరయ్యేందుకు రాహుల్ను అనుమతించాలని శుక్రవారం లోక్సభలో స్పీకర్ స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ను అధిర్ రంజన్ కోరారు. ఈ విషయంలో స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకుంటారని రాజేంద్ర అగర్వాల్ బదులిచ్చారు. -
అరుదైన దృశ్యం.. విపక్షాల హామీతో సభలోకి స్పీకర్ అడుగు
న్యూఢిల్లీ: లోక్సభలో మరో అరుదైన, ఆసక్తికరమైన దృశ్యం చోటుచేసుకుంది. హుందాగా నడుచుకుంటామని పలువురు విపక్ష సభ్యులు హామీ ఇవ్వడంతో స్పీకర్ ఓం బిర్లా మధ్యాహ్నం సభలో అడుగుపెట్టి కార్యకలాపాలను నడిపించారు. సభా కార్యకలాపాలకు సభ్యులు పదేపదే అడ్డుకుంటుండటం పట్ల మంగళవారం ఆయన తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చడం, వారి ప్రవర్తనకు హుందాగా లేదంటూ ఆక్షేపించడం, ఇక సభకు రాబోనని ప్రకటించడం తెలిసిందే. ఆ మేరకు బుధవారమంతా స్పీకర్ లోక్సభకు దూరంగా ఉన్నారు. గురువారం ఉదయం కూడా ప్రశ్నోత్తరాలయ్యే దాకా సభకు రాలేదు. దాంతో, ‘స్పీకర్ సభకు రావాలన్నది విపక్ష సభ్యులందరి కోరిక. ఆయన్ను సభ మొత్తం ఇష్టపడుతుంది’’ అని అదీర్ రంజన్ చౌధరి (కాంగ్రెస్) అన్నారు. ‘‘ఎన్ని భేదాభిప్రాయాలున్నా మాట్లాడుకుని పరిష్కరించుకుందాం. స్పీకర్ మన నాయకుడు’’ అని చెప్పారు. అనంతరం అదీర్ నేతృత్వంలో విపక్ష నేతలు సౌగాథా రాయ్ (తృణమూల్), కనిమొళి (డీఎంకే), సుప్రియా సులే (ఎన్సీపీ) తదితరులతో పాటు మంత్రి గడ్కరీ సైతం బిర్లా చాంబర్కు వెళ్లి సభకు రావాల్సిందిగా కోరారు. జీఎన్సీటీడీ (సవరణ) బిల్లును లోక్సభ ఆమోదిస్తుండగా ఆప్ ఎంపీ సుశీల్ రింకూ వెల్లోకి దూసుకొచ్చి కాగితాలు చించి స్పీకర్కేసి విసిరారు. దాంతో సమావేశాలు పూర్తయ్యేదాకా ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. చదవండి: parliament session: డేటా దుర్వినియోగం చేస్తే రూ.250 కోట్ల జరిమానా -
అప్పటిదాకా లోక్సభకు రాను: స్పీకర్ ప్రకటన
ఢిల్లీ: మణిపూర్ అంశంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముందుకు సాగడం లేదు. ఈ తరుణంలో ఇవాళ(బుధవారం) కూడా ఆందోళనలు కొనసాగాయి. అయితే లోక్సభ జరుగుతున్న తీరుపై స్పీకర్ ఓం బిర్లా ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యుల ప్రవర్తనలో మార్పు వచ్చేంత వరకు తాను సభలో అడుగుపెట్టబోనంటూ ప్రకటించారాయన. ఓవైపు అధికార పక్షం, మరోవైపు విపక్ష సభ్యులపైనా స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ కార్యకలాపాలు జరగకుండా ఇరు పక్షాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారాయన. ఈ క్రమంలో ఇవాళ్టి సెషన్కు సైతం ఆయన హాజరు కాలేదు. అధ్యక్ష స్థానంలో మరొకరు బాధ్యతలు నిర్వహించారు కూడా. అయితే.. ఎంపీలు సభ గౌరవానికి అనుగుణంగా నడుచుకున్నప్పుడే తాను తిరిగి సభలో అడుగుపెడతానంటూ ప్రకటించారాయన. ఇక మణిపూర్ నినాదాల నడమే ఇవాళ్టి లోక్సభ జరగలేదు. రేపటికి సభ వాయిదా పడింది. మణిపూర్ అంశంపై సుదీర్ఘ చర్చ జరగాలనిRule 267.. ప్రధాని మోదీ మాట్లాడాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తుండగా.. స్వల్పకాలిక చర్చతోRule 176 సరిపెడతామని, అదీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడతారంటూ కేంద్రం చెబుతోంది. Lok Sabha Speaker Om Birla has expressed deep displeasure with both the ruling party and the opposition over the functioning of the House. Birla told both sides that he will not come to Lok Sabha until MPs behave according to the dignity of the House. Even today, when the… — ANI (@ANI) August 2, 2023 -
Parliament Monsoon Session 2023: అవిశ్వాసానికి అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు దాదాపు ఏడాది ఉండగానే అధికార బీజేపీ, కాంగ్రెస్ సారథ్యంలోని ‘ఇండియా’ కూటమి తదితర విపక్ష పార్టీల బాహాబాహీకి అనూహ్యంగా రంగం సిద్ధమైంది. అనూహ్యంగా లోక్సభే ఇందుకు వేదికగా మారనుంది! మణిపూర్ హింసాకాండ తదితరాలపై కేంద్రాన్ని ఇరుకున పెట్టే వ్యూహంతో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలైన నాటినుంచీ విపక్షాలు ఉభయ సభలనూ స్తంభింపజేస్తుండటం తెలిసిందే. అందులో భాగంగా మరో అడుగు ముందుకేసి మోదీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని అవి తాజాగా నిర్ణయించాయి. ఆ సవాలు స్వీకరించి విపక్షాల ఎత్తును చిత్తు చేసేలా మోదీ సర్కారు పై ఎత్తు వేయడం, అందులో భాగంగా కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పరిగణనలోకి తీసుకోవడం... ఇలా బుధవారం హస్తినలో అనూహ్య రాజకీయ పరిణామాలు ఒకదాని వెంట ఒకటి చకచకా చోటుచేసుకున్నాయి...! అన్ని పార్టీలతో సంప్రదించాక అవిశ్వాస తీర్మానంపై చర్చకు తేదీ, సమయం తదితరాలు వెల్లడిస్తానని స్పీకర్ ప్రకటించారు. అదే రగడ...: మణిపూర్ హింసాకాండ తదితరాలపై లోక్సభలో బుధవారం కూడా రగడ జరిగింది. దాంతో సభ వాయిదా పడింది. మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి ప్రారంభం కాగానే, కేంద్ర మంత్రివర్గంపై విశ్వాసం లేదని పేర్కొంటూ గౌరవ్ గొగోయ్ (కాంగ్రెస్) ఇచి్చన నోటీసును స్పీకర్ అనుమతించారు. దానికి ఎందరు మద్దతిస్తున్నారని ప్రశ్నించగా కాంగ్రెస్ ఎంపీ సోనియాగాంధీ, ఫరూక్ అబ్దుల్లా (ఎన్సీ), టీఆర్ బాలు (డీఎంకే), సుప్రియా సులే (ఎన్సీపీ) తదితర విపక్ష ‘ఇండియా’ కూటమి సభ్యులతో పాటు ప్రతిపక్ష సభ్యులంతా లేచి నిలబడ్డారు. దాంతో తీర్మానాన్ని అనుమతిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. అంతకుముందు బీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత నామా నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎంపీలు శ్రీనివాసరెడ్డి, రాములు, దయాకర్ లోక్ సభ సెక్రటరీ జనరల్కు అవిశ్వాస నోటీసులిచ్చారు. బీఆర్ఎస్ ఎంపీలు బీబీ పాటిల్, రంజిత్రెడ్డితో పాటు మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా దానిపై సంతకాలు చేశారు. ‘ఇండియా’ కూటమిలో బీఆర్ఎస్ భాగస్వామి కాని విషయం తెలిసిందే. ఇప్పడేమవుతుంది? అవిశ్వాస తీర్మానంపై ఏ రోజు, ఎప్పుడు చర్చ మొదలు పెట్టాలో స్పీకర్ సారథ్యంలో జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయమవుతుంది. ► చర్చలో పాల్గొనేందుకు ఏయే పార్టీకి ఎంత సమయం ఇవ్వాలో స్పీకర్ నిర్ణయిస్తారు. ► చర్చ తర్వాత తీర్మానంపై ప్రధాని సమాధానమిస్తారు. తర్వాత ఓటింగ్ జరుగుతుంది. లోక్సభలో బలాబలాలివీ... లోక్సభ మొత్తం బలం 543. ప్రస్తుతం 5 ఖాళీలున్నాయి. బీజేపీ సారథ్యంలోని అధికార ఎన్డీఏ పక్షానికి 330 మందికి పైగా, విపక్ష ‘ఇండియా’ కూటమికి 140కి పైగా ఎంపీల బలముంది. ఈ రెండు కూటముల్లోనూ లేని ఎంపీలు 60 మందికి పైగా ఉన్నారు. మోదీ జోస్యమే నిజమైంది! విపక్షాలు అవిశ్వాస తీర్మానం ఇవ్వడంతో ప్రధాని మోదీ నాడు చెప్పిన జోస్యమే నిజమైందంటూ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 2019 జూలై 20న మోదీ ప్రభుత్వంపై విపక్షాలు తొలిసారి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం తెలిసిందే. దానికి అనుకూలంగా 126 మంది ఓటేయగా 325 మంది ఎన్డీఏ సభ్యులు వ్యతిరేకించారు. దాంతో భారీ మెజార్టీతో మోదీ సర్కారు గట్టెక్కింది. ఆ సందర్భంగా అవిశ్వాస తీర్మానంపై చర్చకు మోదీ బదులిస్తూ విపక్షాలను ఎద్దేవా చేశారు. ‘2023లోనూ నా ప్రభుత్వంపై అవిశ్వాస పరీక్ష పెట్టేంతగా వాళ్లు సన్నద్ధం కావాలని ఆకాంక్షిస్తున్నా’ అంటూ చెణుకులు విసిరారు. అచ్చం ఆయన అన్నట్టుగానే ఇప్పుడు జరుగుతోందంటూ బుధవారం రోజంతా సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొట్టాయి. -
లోక్సభ స్పీకర్పై అవిశ్వాసం!
న్యూఢిల్లీ: రాహుల్గాంధీపై అనర్హత వేటు పై జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ అంశంపై బహుముఖ దాడితో అధికార బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేయాలని భావిస్తోంది. అందులో భాగంగా ముందుగా ‘ఏకపక్షంగా వ్యవహరించి రాహుల్పై వేటు వేశా’రంటూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని యోచిస్తోంది. కాంగ్రెస్ ఎంపీలంతా మంగళవారం ఉదయమే సమావేశమై దీనిపై మల్లగుల్లాలు పడ్డారు. కోర్టు శిక్ష విధించిన గంటల వ్యవధిలోనే ఆగమేఘాలపై రాహుల్ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేసిన వైనాన్ని అవిశ్వాస తీర్మానం ద్వారా హైలైట్ చేయొచ్చన్న భావన వ్యక్తమైంది. అనంతరం దీనిపై విపక్షాలతో కూడా విస్తృతంగా చర్చోపచర్చలు జరిపినట్టు సమాచారం. అన్నీ కుదిరితే వచ్చే సోమవారం అవిశ్వాసం ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే కొన్ని విపక్షాలు ఇందుకు అభ్యంతరం చెబుతున్నట్టు సమాచారం. ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంటున్న విపక్షాల ఐక్యత యత్నాలకు ఇది గండి కొట్టే ప్రమాదముందన్నది వాటి వాదనగా తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే కనీసం 50 మంది ఎంపీల మద్దతు సంతకాలు అవసరం. పైగా పార్లమెంటు ఉభయ సభలూ రెండు వారాలుగా ఒక్క రోజు కూడా సజావుగా నడవని నేపథ్యంలో తీర్మానం సాధ్యాసాధ్యాలపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ పెట్టినా వీగిపోయే అవకాశాలే ఉన్నప్పటికీ ముందుకెళ్లాలనే యోచనలో ప్రతిపక్ష కాంగ్రెస్ ఉన్నట్లు సమాచారం. త్యాగాలకు సిద్ధమవ్వాలి విపక్షాలకు రాహుల్ పిలుపు రాహుల్పై వేటును నిరసిస్తూ తృణమూల్ కాంగ్రెస్తో సహా 17 ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్కు తాజాగా సంఘీభావం ప్రకటించడం తెలిసిందే. ఈ క్రమంలో పార్లమెంటులో కన్పించిన విపక్షాల ఈ ఐక్యతను మరింత ముందుకు తీసుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందులో భాగంగా ఏప్రిల్ తొలి వారంలో విపక్ష అగ్రనేతలతో కీలక సమావేశం జరపాలని నిర్ణయించింది. సోమవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన విపక్షాల భేటీలోనే ఈ మేరకు ప్రతిపాదన వచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘‘విపక్షాల అగ్ర నేతలు, అధ్యక్షులంతా భేటీ అయ్యేలా కాంగ్రెస్ చొరవ తీసుకోవాలని ఎన్సీపీ చీఫ్ శరద్పవార్తో పాటు డీఎంకే, జేడీ(యూ), సీపీఎం నేతలు ప్రతిపాదించారు. 2024 సాధారణ ఎన్నికలకు అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహాన్ని నిర్ణయించుకోవాల్సిన అవసరం చాలా ఉందని వారు పదేపదే చెప్పారు’’ అని కాంగ్రెస్ ముఖ్యనేత ఒకరు వివరించారు. విపక్షాలన్నీ త్యాగాలకు సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా రాహుల్గాంధీ స్పష్టం చేసినట్టు చెబుతున్నారు. ‘‘విపక్షాల ఐక్యత కోసం ఎంతటి త్యాగాలకైనా కాంగ్రెస్ సిద్ధం. నేనూ సిద్ధం’’ అని ఆయన కుండబద్దలు కొట్టారని సమాచారం. ఆ భేటీకి దూరంగా ఉన్న శివసేన (ఉద్ధవ్ వర్గం) కూడా తమతో కలిసి నడుస్తోందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ వివరించారు అదానీ ఉదంతం పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తృణమూల్ సహా విపక్షాలను కాంగ్రెస్కు దగ్గర చేయడం తెలిసిందే. ‘అదానీ’పై మోదీకి లేఖలు! రాహుల్పై వేటును నిరసిస్తూ, అదానీ అంశంపై జేపీసీ విచారణకు డిమాండ్ చేస్తూ నెల రోజుల పాటు బ్లాక్ స్థాయి నుంచి హస్తిన దాకా దేశవ్యాప్త ఆందోళనలు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మార్చి 24న పార్టీ స్టీరింగ్ కమిటీ, పీసీసీ చీఫ్లు, అనుబంధ విభాగాల చీఫ్లతో జరిగిన భేటీలో అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ వెల్లడించారు. వివరాలు... ► ఢిల్లీలోని ఎర్రకోట నుంచి మొదలు పెట్టి దేశంలోని 35 ప్రధాన నగరాల్లో మంగళ, బుధవారాల్లో ‘లోక్తంత్ర్ బచావో శాంతి మార్చ్’ ► ఏప్రిల్ రెండో వారంలో ‘జై భారత్ మహా సత్యాగ్రహం’. ఇందులో భాగంగా బ్లాక్/మండల కాంగ్రెస్ విభాగాలు సభలు, సమావేశాలు నిర్వహించి రాహుల్పై వేటు, అదానీతో ప్రధాని మోదీ బంధంపై ప్రజలకు వివరిస్తాయి. రాహుల్ సందేశాన్ని పార్టీ సోషల్ మీడియా విభాగాలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తాయి. ► ఏప్రిల్ 15 నుంచి 20 దాకా జై భారత్ మహా సత్యాగ్రహంలో భాగంగా విపక్షాలతో కలిసి జిల్లాల్లో కలెక్టరేట్ల ఘెరావ్. రాష్ట్ర స్థాయిలోనూ భారీ కార్యక్రమం. ఒక్క రోజు ఉపవాస దీక్షలు. అనంతరం ఢిల్లీలో జాతీయ స్థాయిలో భారీ సత్యాగ్రహం. ► మార్చి 31న జిల్లా ప్రధాన కేంద్రాల్లో ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ నేతల మీడియా సమావేశాలు. ► యూత్ కాంగ్రెస్, ఎన్ఎన్యూఐ తదితరాల ఆధ్వర్యంలో పోస్టుకార్డుల ఉద్యమం. అదానీ అవినీతి, రాహుల్పై వేటు తదితరాలపై ప్రశ్నిస్తూ ప్రధాని మోదీకి లేఖలు. ► మహిళా కాంగ్రెస్ నిరసన ర్యాలీ. -
లోక్సభలో నలుగురు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభలో నలుగురు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేశారు స్పీకర్ ఓం బిర్లా. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు వారు సభలోకి రాకుండా నిషేధం విధించారు. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంపై నిరసనలు చేపట్టి సభా కార్యకలాపాలకు అడ్డుపడినందుకు వారిపై ఈ చర్యలు తీసుకున్నారు. అంతకుముందు కాంగ్రెస్ ఎంపీలు మాణికం ఠాగూర్, రమ్య హరిదాస్, జోతిమణి, టీఎన్ ప్రథాపన్ సభ మధ్యలోకి వెళ్లి నిరసనలు చేపట్టారు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించి కేంద్రానికి వ్యతిరేకంగా సభలో పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఆందోళనలను సభ బయట చేపట్టాలని, సభాకార్యకలాపాలకు అడ్డుపడొద్దని స్పీకర్ హెచ్చరించారు. అయినా వారు వెనక్కి తగ్గకుండా నిరసనలు కొనసాగించడంతో సస్పెన్షన్ వేటు వేశారు. 4 Congress MPs suspended for entire Monsoon session over 'unruly behaviour' Read @ANI Story | https://t.co/BFKThevzAm#Congress #MonsoonSession #LokSabha pic.twitter.com/akZYlgGZRr — ANI Digital (@ani_digital) July 25, 2022 స్పీకర్ చర్యపై కాంగ్రెస్ స్పందించింది. నేతలపై వేటు వేసి ప్రభుత్వం తమను భయపెట్టాలని చూస్తోందని ఆరోపించింది. ప్రజా సమస్యలను సభలో లేవనెత్తేందుకే వారు ప్రయత్నించారని పేర్కొంది. సస్పెన్షన్ అనంతరమూ విపక్షాలు ఆందోళనలను కొనసాగించిన నేపథ్యంలో స్పీకర్ సభను మంగళవారానికి వాయిదా వేశారు. చదవండి: మంత్రిగారి లైఫ్ స్టైల్ మామూలుగా లేదుగా.. కుక్కల కోసం ఖరీదైన ఫ్లాట్.. అర్పితకు కానుకలు! -
సభా విలువలు కాపాడాలి
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని అఖిలపక్ష నేతలకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా విజ్ఞప్తి చేశారు. సభలో సభ్యత, క్రమశిక్షణ పాటించాలని కోరారు. సభా సంప్రదాయాలను, విలువలను కాపాడాలన్నారు. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఓం బిర్లా శనివారం అఖిలపక్ష భేటీ నిర్వహించారు. అగ్నిపథ్ పథకం, నిరుద్యోగం, రైతుల సమస్యలపై ఉభయ సభల్లో చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేశారు. అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, డీఎంకే, ఐయూఎంఎల్, ఎల్జేపీ, ఆప్నాదళ్ తదితర పార్టీల నేతలు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం తరపున పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ, సహాయ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ పాల్గొన్నారు. -
ఎంపీ రఘురామకృష్ణరాజు అనర్హత పిటిషన్పై విచారణకు స్పీకర్ ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అనర్హత పిటిషన్పై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా విచారణకు ఆదేశించారు. రఘురామ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు వైఎస్సార్సీపీ చీఫ్ విప్ మార్గాని భరత్ ఇచ్చిన ఫిర్యాదును లోక్సభ స్పీకర్ ప్రివిలేజ్ కమిటీకి పంపించారు. రఘురామకృష్ణరాజు అనర్హత పిటిషన్పై త్వరితగతిన విచారణ జరిపి ప్రాథమిక నివేదిక ఇవ్వాలని ఆయన ప్రివిలేజ్ కమిటీని ఆదేశించారు. ఫిబ్రవరి 3వ తేదీన ప్రివిలేజ్ కమిటీ సమావేశం కానుంది. సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. చదవండి: సోము వీరా.. అది నోరా?: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి -
సీపీ నా గల్లా పట్టుకున్నారు: బండి సంజయ్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్ క్రైం: తనను అరెస్టు చేసేటప్పుడు కరీంనగర్ సీపీ సత్యనారాయణ గల్లా పట్టుకొని వ్యానులోకి తోసేశారని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఎంపీ బండి సంజయ్ సోమవారం ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్లో అక్రమంగా నిర్బంధించారని చెప్పారు. ‘జీవో 317ను సవరించాలంటూ ఉద్యోగులకు మద్దతుగా నేను ఎంపీ కార్యాలయంలో దీక్ష చేపట్టగా సీపీ తన సిబ్బందితో నా కార్యాలయానికి వచ్చారు. లోపలివైపు నుంచి తాళాలు వేసి ఉండటంతో గ్యాస్ కట్టర్లతో వాటిని కోసి తలుపులు బద్దలు కొట్టి లోనికి చొరబడ్డారు. నన్ను అరెస్టు చేసేటప్పుడు సీపీ నా గల్లా పట్టుకున్నారు. నన్ను వ్యానులోకి తోశారు. మానకొండూరు పోలీస్ స్టేషన్లో నన్ను అక్రమంగా నిర్బంధించారు. నాకు ముందస్తు సమాచారం ఇవ్వలేదు. అరెస్టు సమయంలో సరిగా వ్యవహరించలేదు. ఎంపీగా నా గౌరవానికి భంగం కలిగించిన సీపీ సత్యనారాయణ, ఏసీపీ ప్రకాశ్, ఏసీపీ శ్రీనివాసరావు, సీఐ లక్ష్మీబాబుపై చర్యలు తీసుకోవాలి’అని స్పీకర్కు సంజయ్ ఫిర్యాదు చేశారు. గతంలో ఆర్టీసీ సమ్మె సమయంలోనూ కరీంనగర్ పోలీసులు తనతో అసభ్యంగా ప్రవర్తించారని సంజయ్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలను అణచాలని చూస్తున్నారు ప్రతిపక్ష పార్టీలను కేసీఆర్ ప్రభుత్వం అణచివేయాలని చూస్తోందని సంజయ్ ఆరోపించారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్లకు లేఖ రాశారు. ప్రతిపక్ష పార్టీల కార్యక్రమాలకు అనుమతి నిరాకరిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం.. సీఎం, ఇతరుల అధికార పార్టీ కార్యక్రమాలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఉద్యోగుల కోసం జీవో 317కి వ్యతిరేకంగా తాను జాగరణ దీక్ష చేస్తే పోలీసులు తనపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారని మండిపడ్డారు. -
ఇంటిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి: అసదుద్దీన్
సాక్షి, హైదరాబాద్: రెండు రోజుల క్రితం ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఢిల్లీ అధికారిక నివాసంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీని గురించి అసదుద్దీన్ శుక్రవారం లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేస్తూ.. లేఖ రాశారు. తనను చంపేందుకు కుట్ర చేశారని అసదుద్దీన్ ఆరోపించారు. ఎంపీల ఇళ్లపై దాడిని సభాహక్కుల ఉల్లంఘనగా పరిగణించాలని కోరారు. దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అసదుద్దీన్ లేఖలో కోరారు. చదవండి: ఢిల్లీలో ఒవైసీ ఇంటిపై దాడి -
హెడ్మాస్టర్లలా ఉండాలనుకోవడం లేదు: బిర్లా
శ్రీనగర్: పార్లమెంట్ సభ్యులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చే సమయంలో సభా గౌరవాన్ని కాపాడాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. హద్దు మీరిన సభ్యులను స్కూల్ హెడ్మాస్టర్ల మాదిరిగా శిక్షించాలని తాము (ఉభయ సభల అధ్యక్షులు) అనుకోవడం లేదని తెలిపారు. పార్లమెంట్లో ఆటంకాలు, గందరగోళ పరిస్థితులను ఎలా నివారించాలనే దానిపై పార్టీలు కలిసి కూర్చుని చర్చించాలన్నారు. సభ్యులు సభ వెల్లోకి ప్రవేశించి, ప్లకార్డులు ప్రదర్శించకుండా కట్టడి చేసేందుకు అన్ని పార్టీలు చర్చించి, ఒక ప్రవర్తనా నియమావళిని రూపొందించాలన్నారు. ఇటీవల ముగిసిన వర్షాకాల సమావేశాల సమయంలో నిత్యం సభలో గందరగోళం కొనసాగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలన్నిటికీ పార్లమెంట్ ఒక దిక్సూచిగా మారాలని అందరూ ఆశిస్తున్నారు. సభలో అంతరాయాలు, అదుపుతప్పిన పరిస్థితులు ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం మంచివికావు. మనం(ఎంపీలు) అందరం పార్లమెంట్ గౌరవాన్ని కాపాడాలి, ఇంకా ఇనుమడింపజేసేందుకు ప్రయత్నించాలి’అని ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సభ్యులను కట్టడి చేసేందుకు నిబంధనలను మార్చాల్సిన అవసరం ఉందా అని అడిగిన ప్రశ్నకు ఆయన...ప్రస్తుతం ఉన్న నిబంధనలు కఠినమైనవే. పరిస్థితులు చేజారిపోతున్నట్లు భావిస్తే సభాధ్యక్షులు చర్యలు తీసుకోవాల్సి వస్తోంది’అని పేర్కొన్నారు. -
తిరుమలలో లోక్సభ స్పీకర్ ఓంబిర్లా
-
లోక్ సభ స్పీకర్ ఏపీ పర్యటన
-
మూడవ రోజు పార్లమెంట్ సమావేశాలు: లోక్సభ రేపటికి వాయిదా
►లోక్సభ రేపటికి వాయిదా పడింది. తిరిగి శుక్రవారం ఉదయం 11 గంటలకు సమావేశాలు ఆరంభం కానున్నాయి. ►విపక్షాల ఆందోళన మధ్య రాజ్యసభ రేపటికి వాయిదా పడగా.. లోక్ సభ సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా పడింది. లోక్ సభలో వైఎస్సార్ సీపీ ఎంపీల ఆందోళన.. రాజ్యసభ వాయిదా.. మధ్యాహ్నం 12 గంటలకు ఉభయ సభలు తిరిగి ప్రారంభమయ్యాయి. లోక్ సభలో వైఎస్సార్ సీపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. విపక్షాల ఆందోళన నేపథ్యంలో ప్రారంభమైన కొద్దిసేపటికే రాజ్యసభ వాయిదా పడింది. సభ మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ప్రారంభం కానుంది. ఉభయ సభలు వాయిదా : మూడవ రోజు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. విపక్షాల ఆందోళనల మధ్య సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ► లోక్ సభలో వైఎస్సార్ సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అనేక ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం కడుతోంది.. విభజన చట్టానికి భిన్నంగా.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న.. తెలంగాణ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలి’’ అని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి షెకావత్ సమాధానం ఇస్తూ.. ‘‘ ఏపీ వాదన సరైందే, నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న.. తెలంగాణ ప్రభుత్వానికి లేఖలు కూడా రాశాం. ఈ సమస్య పరిష్కారానికే గెజిట్ విడుదల చేశాం’’ అని అన్నారు. కేంద్ర మంత్రి షెకావత్ -
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్సీపీ ఎంపీల నినాదాలు
లైవ్ అప్డేట్స్: ►లోక్సభ గురువారానికి వాయిదా ►లోక్సభ మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా ►వైఎస్ఆర్సీపీ ఎంపీల ఆందోళనలతో రాజ్యసభ తాత్కాలిక వాయిదా ►రాజ్యసభలో దద్దరిల్లిన వైఎస్సార్సీపీ ప్రత్యేక హోదా నినాదాలు ► వెల్లోకి వెళ్లి ఆందోళన చేసిన వైఎస్సార్సీపీ ఎంపీలు ► ఇదే సభలో హోదా ఇస్తామని నాడు హామీ ఇచ్చారు: ఎంపీలు ► కేంద్రం ఇచ్చిన హోదా హామీ నిలబెట్టుకోండి: వైఎస్సార్సీపీ ఎంపీలు ► కరోనా గురించి చర్చిద్దాం.. ఆందోళన విరమించండి.. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని కోరిన పీయూష్ గోయల్ ► ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్సీపీ ఎంపీల నినాదాలు ► రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీల ఆందోళన ► వెల్లోకి దూసుకెళ్లిన వైఎస్సార్సీపీ ఎంపీలు ► ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై చర్చకు వైఎస్సార్సీపీ పట్టు ► ఫ్లకార్డులతో పోడియం వద్ద వైఎస్సార్సీపీ ఎంపీల ఆందోళన ► రూల్ 267 కింద ఇచ్చిన నోటీసును అనుమతించాలని డిమాండ్ ► సభ సజావుగా జరిగేలా సహకరించాలని కోరిన పీయూష్ గోయల్ ► ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్సీపీ ఎంపీల నినాదాలు ► రాజ్యసభలో దద్దరిల్లిన వైఎస్సార్సీపీ ప్రత్యేక హోదా నినాదాలు ► వెల్లోకి వచ్చి ఆందోళన చేసిన వైఎస్సార్సీపీ ఎంపీలు ► ఇదే సభలో హోదా ఇస్తామని నాడు హామీ ఇచ్చారు: వైఎస్సార్సీపీ ► కేంద్రం ఇచ్చిన హోదా హామీ నిలబెట్టుకోండి: వైఎస్సార్సీపీ ఎంపీలు ► రాజ్యసభ ప్రారంభమైన తర్వాత కూడా వైఎస్సార్సీపీ ఎంపీలు ఆందోళన కొనసాగిస్తున్నారు. ►ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై చర్చకు వైఎస్ఆర్సీపీ పట్టు ► రాజ్యసభలో కోవిడ్పై చర్చ ► ప్రధాని ప్రజంటేషన్ కంటే ముందే చర్చకు విపక్షాల పట్టు ► విపక్షాల డిమాండ్కు సుముఖత వ్యక్తం చేసిన రాజ్యసభ ఛైర్మన్ ►మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాజ్యసభ వాయిదా ►మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన రాజ్య సభలో వైఎస్సార్సీపీ ఎంపీల ఆందోళన కొనసాగింది. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై చర్చకు వైఎస్సార్సీపీ ఎంపీలు పట్టుపట్టారు. వైఎస్సార్సీపీ ఎంపీల ఆందోళనతో మరోసారి రాజ్యసభ వాయిదా పడింది. ►రాజ్యసభలో రెండో రోజు ఏపీకి ప్రత్యేక హోదాపై నోటీసు ►ఫ్లకార్డుతో పోడియం వద్ద ఎంపీ విజయసాయిరెడ్డి ఆందోళన ►ప్రత్యేక హోదా అత్యంత ప్రాధాన్యత అంశం: ఎంపీ విజయసాయిరెడ్డి ►రూల్ 267 కింద ఇచ్చిన నోటీసును అనుమతించాలని డిమాండ్ ►పోలవరం ప్రాజెక్ట్ను సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.. ►పోలవరం సవరించిన అంచనాలు వెంటనే ఆమోదించాలి: మాగుంట ►రాష్ట్రానికి రావాల్సిన నిధులపై పార్లమెంట్లో ప్రస్తావిస్తాం: మాగుంట ► లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా ► రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా ► పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కాగా విపక్షాల ఆందోళనల నేపథ్యంలో ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. పెగాసస్ వ్యవహారంపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుపట్టాయి. అదేవిధంగా ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరంపై ఉభయ సభల్లో వైఎస్సార్సీపీ ఎంపీలు ఆందోళన కొనసాగించారు. ► మరి కాసేపట్లో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రెండో రోజు ప్రారంభం కానున్నాయి. మంగళవారం నాటి సమావేశాల్లో విపక్షపార్టీలు పెగాసస్ వ్యవహారాన్ని లేవనెత్తనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కోవిడ్ పరిస్థితులపై ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ► మంగళవారం నాటి సమావేశాల్లో కరోనా పరిస్థితులపై ప్రధాని మోదీ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఫోన్ల హ్యాకింగ్ వార్తలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. పెగాసస్ వ్యవహారంపై ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మధ్యాహ్నం రాజ్యసభలో ప్రకటన చేయనున్నారు. పెగాసస్ స్పైవేర్తో ప్రముఖుల ఫోన్లపై నిఘా ఉంచినట్లు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రజాసమస్యలపై ప్రతిపక్ష పార్టీల ఆందోళనల మధ్య పార్లమెంటు వర్షాకాల సమావేశాలు తొలిరోజు స్తంభించిపోయాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, కోవిడ్ కట్టడి వైఫల్యాలపై కాంగ్రెస్, ఇతర పక్షాలు సోమవారం ఉభయ సభల్లో ఆందోళన చేపట్టాయి. లోక్సభలో పోలవరం ప్రాజెక్టుకు నిధుల అంశంపై, రాజ్యసభలో ప్రత్యేక హోదా అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. పార్లమెంట్లో వైఎస్సార్సీపీ ఎంపీల ఆందోళనలు ఈరోజు కూడా కొనసాగనున్నాయి. -
ఫిరాయింపులపై చర్యలకు గడువుండాలి
సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయింపులకు సంబంధి ంచిన పిటిషన్లను పరిష్కరించేందుకు నిర్దిష్ట కాలపరిమితి ఉండాలని లోక్సభ సభాపతి ఓం బిర్లా అభిప్రాయపడ్డారు. ఈనెల 19 నుంచి వచ్చే నెల 13వ తేదీ వరకు నిర్వహించనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల వివరాలు వెల్లడించేందుకు సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. పార్టీ ఫిరాయింపులపై పిటిషన్ల పరిష్కారంలో నిర్ణీత గడువు ఉండాల్సిన అవసరంపై స్పందన కోరగా ‘మీరు మంచి ప్రశ్న లేవనెత్తారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో నిర్ణీత కాలపరిమితి ఉండాల్సిన అవసరం ఉంది. క్రితంసారి స్పీకర్ల సదస్సు జరిగినప్పుడు ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ సదస్సు నివేదికను ప్రభుత్వానికి నివేదిస్తాం. ప్రభుత్వం ఈ దిశగా ఫిరాయింపుల నిరోధక చట్టంలో మార్పులు చేస్తే నిర్దిష్ట కాలవ్యవధిలో నిర్ణయం తీసుకునే వీలుంటుంది..’అని సభాపతి పేర్కొన్నారు. ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వైఎస్సార్సీపీ ఇచ్చిన అనర్హత పిటిషన్పై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించగా ‘ఏదైనా పిటిషన్ వచ్చినప్పుడు మా సచివాలయం దానిని పరిశీలిస్తుంది. దానిపై నిర్ణయం తీసుకునే వరకు ఆ వివరాలు బహిర్గతం చేయం.. ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నియమావళి మేరకు ప్రక్రియ ఉంటుంది. ఇరుపక్షాల వాదనలు వినాల్సి ఉంటుంది. ఆ తరువాత నిర్ణయం తీసుకుంటాం..’అని పేర్కొన్నారు. అంతకుముందు సభాపతి ఓం బిర్లా మాట్లాడుతూ ఉభయసభలు కోవిడ్కు పూర్వం ఉన్న వేళల ప్రకారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఏకకాలంలో పనిచేస్తాయని వివరించారు. 280 మంది సభ్యులు సభా ఛాంబర్లో, 259 మంది సభ్యులు గ్యాలరీలో కూర్చుంటారని వివరించారు. వ్యాక్సిన్ కనీసం ఒక మోతాదులో తీసుకున్న సభ్యులకు ఆర్టీపీసీఆర్ తప్పనిసరి కాదని వివరించారు. ఇప్పటికే 411 మంది సభ్యులు టీకాలు తీసుకున్నారని, మిగతా సభ్యులు విభిన్న వైద్య కారణాల వల్ల టీకా తీసుకోలేదని స్పీకర్ వివరించారు. టీకా తీసుకోని వారికి పార్లమెంటు భవనంలో ఆర్టీపీసీఆర్ పరీక్ష సౌకర్యం అందుబాటులో ఉంటుందని వివరించారు. కోవిడ్ ఆంక్షల కారణంగా సందర్శకులను అనుమతించబోమని సభాపతి తెలిపారు. అన్ని పార్లమెంటరీ వ్యవహారాలు అందుబాటులో ఉండేలా ఒక యాప్ రూపొందిస్తున్నామని, మరో పదిహేను ఇరవై రోజుల్లో అందుబాటులోకి వస్తుందని వివరించారు. సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలతో పాటు ప్రశ్నోత్తరాలు, చర్చల రికార్డులు అందుబాటులో ఉంటాయని వివరించారు. నిర్ణీత సమయంలోగా కొత్త పార్లమెంటు భవన నిర్మాణం పూర్తవుతుందని వివరించారు. పార్లమెంటు లైబ్రరీ, రాష్ట్ర శాసనసభల లైబ్రరీలు ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. వర్షాకాల సెషన్లో మొత్తం 19 రోజులు సమావేశాలు ఉంటాయని వివరించారు. కోవిడ్ ఉన్నప్పటికీ 17వ లోక్సభ మునుపటి లోక్సభలతో పోలిస్తే మొదటి 5 సెషన్లలో రికార్డు స్థాయిలో పనిచేసిందన్నారు. అంతకుముందు ఆయన సెషన్ ఏర్పాట్లను, పార్లమెంటు భవన కాంప్లెక్స్లో సౌకర్యాలను పరిశీలించారు. -
లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తానన్న కోమటిరెడ్డి
-
రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయండి: విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని దాఖలు చేసిన పిటిషన్పై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పక్ష నేత విజయసాయిరెడ్డి.. లోకసభ స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన స్పీకర్కు లేఖ రాశారు. రఘురామకృష్ణరాజుపై అనర్హత పిటిషన్ దాఖలు చేసి 11 నెలలు గడిచిందని, అయినా ఇప్పటికీ అతనిపై ఎటువంటి చర్యలకు ఉపక్రమించకపోవడం విచారకరమని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటరీ సంప్రదాయాలను పాటించడంలో లోక్సభ స్పీకర్ కార్యాలయం ఆదర్శంగా ఉండాలని, అనర్హత పిటిషన్పై చర్యలు తీసుకోవడంలో జరుగుతున్న విపరీతమైన జాప్యం వల్ల నర్సాపురం ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆయన వాపోయారు. అర్హత లేని వ్యక్తి పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావడం అనైతికమని, ఈ విషయమై లోకసభ స్పీకర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. అనర్హత పిటిషన్పై మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు తీర్పులో పేర్కొన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. -
రఘురామకృష్ణరాజును డిస్ క్వాలిఫై చేయాలని లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు
-
రఘురామకృష్ణరాజును డిస్క్వాలిఫై చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద నర్సాపురం నుంచి ఎంపీగా ఎన్నికై, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కె. రఘురామకృష్ణరాజు పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్ ఫిర్యాదు చేశారు. రఘురామకృష్ణరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ చేసిన వ్యాఖ్యలపై గతంలోనే తాము ఆధారాలను లోక్ సభ స్పీకర్కు సమర్పించామని భరత్ రామ్ తెలిపారు. అనేక పర్యాయాలు రఘురామకృష్ణరాజు డిస్ క్వాలిఫికేషన్కు సంబంధించి స్పీకర్ను కలిసి విజ్ఞప్తి చేశామని గుర్తు చేశారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామకృష్ణరాజును వెంటనే డిస్ క్వాలిఫై చేయాల్సిందిగా ఈరోజు మరోసారి లోక్ సభ స్పీకర్ ను కలిసి విజ్ఞప్తి చేశామని భరత్ తెలిపారు. చదవండి: తీరు మార్చుకోకపోతే.. గుణపాఠం చెబుతాం.. -
ధర్మేగౌడ మృతి.. దర్యాప్తుకు ఆదేశం
సాక్షి, బెంగళూరు: కర్ణాటక శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ ధర్మేగౌడ ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇటీవల సొంతింటి నిర్మాణానికి పూజ చేసిన ఆయన ఆకస్మికంగా మృతి చెందడంపై పలువురు రాజకీయ నేతలు దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సైతం ఆయన మృతికి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. (చదవండి: ఆ..వేదనే అంతు చూసిందా? ) ధర్మేగౌడ మృతి దురదృష్టకమరమని, ఆయన మరణ వార్త తనను ఎంతగానో బాధించిందంటూ ఓం బిర్లా ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా మండలిలో ధర్మేగౌడకు జరిగిన అవమానం ప్రజాస్వామ్యమంపై దాడి అన్నారు. చట్టసభల హుందాతనం, స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. అనంతరం ఆయన మృతి కేసును ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు ఆయన ప్రకటించారు. చదవండి: కర్ణాటక శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ ఆత్మహత్య -
10న పార్లమెంటు కొత్త భవనానికి భూమి పూజ
న్యూఢిల్లీ: కొత్త పార్లమెంటు భవనానికి ఈ నెల 10న ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమి పూజ జరగనుంది. రూ.971 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఈ కొత్త భవనం నిర్మాణం 2022 నాటికి పూర్తి అయ్యే అవకాశాలున్నాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శనివారం తెలిపారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తున్న ప్రజాస్వామ్య దేవాలయం వందేళ్లు పూర్తి చేసుకుందని, ఆత్మనిర్భర్లో భాగంగా మనమే కొత్త భవనాన్ని నిర్మించుకోవడం దేశానికి గర్వకారణమని బిర్లా అన్నారు. కోవిడ్ నిబంధనల మ«ధ్య డిసెంబర్ 10 మధ్యాహ్నం ఒంటిగంటకి భూమి పూజ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించామని కొందరు స్వయంగా హాజరైతే, మరికొందరు ఆన్లైన్ ద్వారా తిలకిస్తారని బిర్లా చెప్పారు. 2022లో జరిగే దేశ 75వ స్వాతంత్య్ర దిన వేడుకల నాటికి కొత్త భవనంలోనే పార్లమెంటు సమావేశాలు జరుగుతాయని బిర్లా ఆశాభావం వ్యక్తం చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించే ఈ భవనాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేస్తూ పేపర్లెస్ కార్యాలయాలను నిర్మించనున్నారు. భవిష్యత్లో పార్లమెంటు నియోజకవర్గాలను పెంచే ఉద్దేశం ఉన్న కేంద్రం అందుకు అనుగుణంగా లోక్సభ కార్యక్రమాలు నిర్వహించే హాలుని 888 మంది సభ్యులు కూర్చోవడానికి వీలుగా, రాజ్యసభ సమావేశ మందిరాన్ని 384 సీట్ల సామర్థ్యంతో నిర్మించనున్నారు. లోక్సభలో 1,224 మంది (ఉభయ సభలు సమావేశమైనప్పుడు) కూర్చునేందుకు వీలుగా సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశముంటుంది. ఈ భవన నిర్మాణంలో 2 వేల మంది ప్రత్యక్షంగా 9 వేల మంది పరోక్షంగా పాల్గొననున్నారు. 64.500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించే ఈ భవనం బయట నుంచి చూడడానికి ప్రస్తుతమున్న పార్లమెంటు మాదిరిగానే ఉంటుందని బిర్లా వివరించారు. -
శశి థరూర్పై స్పీకర్కు బీజేపీ ఎంపీల ఫిర్యాదు
సాక్షి, న్యూఢిల్లీ : ఫేస్బుక్ వివాదానికి సంబంధించి ఎంపీ శశి థరూర్ ట్వీట్పై లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా దిగ్గజం నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టాండింగ్ కమిటీ వివరణ కోరనుందని, ఈ కమిటీకి నేతృత్వం వహిస్తున్న శశి థరూర్ తమతో చర్చించకముందే ఫేస్బుక్కు సమన్లు జారీ చేశారని, బహిరంగ వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఎంపీలు స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. శశి ధరూర్ నిబంధనల ఉల్లంఘనపై తాను స్పీకర్కు లేఖ రాశానని, స్టాండింగ్ కమిటీ సభ్యుడు, కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ వెల్లడించారు. ఏ సంస్ధ ప్రతినిధినైనా పిలిపించి మాట్లాడేందుకు తాము వ్యతిరేకం కాదని, అయితే ఆయన (శశి థరూర్) తమతో చర్చించకుండా మీడియాతో మాట్లాడారని అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత్లో ఫేస్బుక్ బీజేపీకి వత్తాసు పలుకుతూ తమ వేదికపై కాషాయ నేతలు విద్వేష ప్రసంగం, సందేశాలు పోస్ట్ చేసేందుకు అనుమతిస్తోందన్న వాల్స్ట్రీట్ జర్నల్ కథనం కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా, ఫేస్బుక్ను తమ కమిటీ ఎదుట హాజరు కావాలని ఐటీ స్టాండింగ్ కమిటీ చీఫ్ శశి థరూర్ సమన్లు జారీ చేయడంపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే థరూర్పై సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు ఇచ్చారు. పార్లమెంటరీ విధానాలు, పద్ధతులు పాటించకుండా శశి థరూర్ ఫేస్బుక్కు నోటీసులు పంపారని దూబే ఆరోపించారు. చదవండి : కోళీకోడ్ ఘటన: ‘మీరు దేశానికే ఆదర్శం’ -
'ఆ పత్రికల రిపోర్టర్లపై చర్యలు తీసుకోండి'
న్యూఢిల్లీ : తనపై తప్పుడు కథనాలు ప్రచురించినందుకు ఈనాడు, ఆంద్రజ్యోతి పత్రికలపై వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారం లోక్సభ స్పీకర్తో పాటు సభా హక్కుల కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అఖిలపక్ష సమావేశంలో తనకు క్లాస్ తీసుకున్నారని దురుద్దేశ పూర్వకంగా కథనాలు రాసిన రిపోర్టర్లపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. జర్నలిజం ఎథిక్స్ ప్రకారం కనీసం తనని సంప్రదించకుండానే ఇష్టం వచ్చినట్లు కథనాన్ని ప్రచురించారన్నారు. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా తప్పుడు సమాచారం ప్రచురించినందుకు సదరు పత్రిక రిపోర్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు విజయసాయి రెడ్డి వెల్లడించారు. అలాగే వారికి సంబంధించిన పార్లమెంట్లు ఎంట్రీ పాసులు రద్దు చేయాలని కోరినట్లు తెలిపారు. ఇటువంటి తప్పుడు కథనాలు ప్రచురించడం వల్ల ఎంపీగా తనకే కాకుండా పార్లమెంటు వ్యవస్థను సైతం అవమానపరిచారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. -
సభ సజావుగా జరగనివ్వండి
న్యూఢిల్లీ: సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని లోక్సభ స్పీకర్ ఓంబిర్లా సభ్యులకు పిలుపునిచ్చారు. శనివారం జరిగిన అఖిల పక్ష భేటీలో ఈ మేరకు ఆయన సభ్యులను కోరారు. ప్రధాని మోదీ ఈ భేటీలో పాల్గొన్నారు. సభలో చర్చ జరగాలని, చర్చ జరిగేందుకే సభ ఉన్నదన్న విషయాన్ని గుర్తు చేశారు. సభ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, అందుకే ప్రజా సమస్యలను లేవనెత్తాల్సిందిగా సభ్యులను కోరారు. 17వ లోక్ సభ మొదటి సమావేశాల్లాగే ఈ సమావేశాలు కూడా ఫలప్రదం అవుతాయని పార్టీలన్నీ తనకు మాటిచ్చాయని చెప్పారు. భేటీ అనంతరం తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ బంధోపాధ్యాయ్ మాట్లాడుతూ.. పశ్చిమబెంగాల్లో గవర్నర్ సమాంతర పాలన నడుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటివి జరగకూడదని అన్నారు. సభలో నిరుద్యోగం, ఆర్థిక స్థితి వంటి వాటిపై చర్చలు జరుగుతాయని చెప్పారు. ఉత్తర భారతంలో ఉన్న కాలుష్యం గురించి సభ మాట్లాడాలని బీఎస్పీ నేత కున్వార్ చెప్పారు. -
‘లోక్సభ స్పీకర్గా ఉన్నారని గౌరవిస్తున్నాం’
న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ ఘాటుగా స్పందించారు. రాజస్తాన్లోని కోటాలో జరిగిన బ్రాహ్మణ సామాజిక వర్గ ఐక్యత సమావేశానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరైన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మనమంతా (బ్రాహ్మణ) ఐక్యంగా ఉండాలి. అప్పుడే ఉన్నత స్థాయిలోకి చేరుకుంటాం. ప్రస్తుతం దేశంలో మనమే అందరికన్నా ముందున్నాం. సమాజాన్ని శాసించే స్థాయికి చేరుకోవాలి’ అంటూ వ్యాఖ్యానించిన సంగతి విధితమే. ఈ వ్యాఖ్యలపై కపిల్ సిబాల్ ‘పుట్టుకలోనే బ్రాహ్మణులకు గౌరవం ఉంటుంది. కానీ మీరు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వారని గౌరవం ఇవ్వడం లేదు. దేశంలోనే గౌరవప్రదమైన లోక్సభకు స్పీకర్గా వ్యవహరిస్తున్నారని గౌరవం ఇస్తున్నామని’ ట్విటర్ వేదికగా వ్యాఖ్యలు చేశారు. బ్రాహ్మణ కులంలో పుడితే మాత్రమే భారతదేశాన్ని గొప్పగా తీర్చిదిద్దగలమని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఓం బిర్లా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా ఓం బిర్లా ఈ ఏడాది జూన్లో లోక్సభ స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. రాజస్థాన్ నుంచి 2003, 2008, 2013 వరుసగా మూడుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. -
అరుదైన గౌరవం
సాక్షి, కడప : రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి గురువారం స్పీకర్ స్థానంలో కొలువుదీరారు. ప్యానల్ స్పీకర్ హోదాలో లోక్సభను నిర్వహించారు. ఆధార్ సవరణ బిల్లు చర్చ సందర్భంగా అధ్యక్షత వహించారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ సభకు హాజరు కాలేని సమయంలో ప్యానల్ స్పీకర్ లోక్సభను నిర్వహించడం సాంప్రదాయం. ఈక్రమంలో ప్యానల్ స్పీకర్గా అధ్యక్ష స్థానంలో ఆయన కొలువుదీరారు. రాజంపేట నుంచి రెండోసారి ఎంపీగా ఎన్నికైన పెద్దిరెడ్డి మిథున్రెడ్డికి ప్యానల్ స్పీకర్ అవకాశం దక్కింది. దీంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి ఎన్నికైన నాయకుడు భారత అత్యున్నత చట్టసభకు స్పీకర్గా విధులు నిర్వహించడంతో వారి ఆనందానికి హద్దేలేకుండా పోయింది. ఎంపీగా లోక్సభలో ప్రభుత్వతీరును ఎండగట్టి నేడు అదే లోక్సభలో చిన్న వయసులోనే ప్యానెల్ స్పీకర్గా బాధ్యతలు చేపట్టడం నిజంగా గర్వకారణమని అంటున్నారు. 2014లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా తొలిసారి బరిలో నిలిచిన ఆయన బీజేపీ అభ్యర్థి పురందేశ్వరిపై విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అంచెలంచెలుగా ఉద్యమాలు చేపట్టారు. వైఎస్సార్సీపీ నిర్ణయం మేరకు పార్లమెంట్ అభ్యర్థిత్వానికి రాజీనామా చేశారు. అనంతరం 2019లో మరోమారు ఆయన రాజంపేట నుంచి పోటీచేసి టీడీపీ అభ్యర్థి సత్యప్రభపై 2,68,284 ఓట్లు ఆధిక్యతతో ఘన విజయం సొంతం చేసుకున్నారు. ఇటీవల ప్యానల్ స్పీకర్గా నియమితులయ్యారు. ఆమేరకు గురువారం ఆ హోదాలో లోక్సభ నిర్వహించారు. ఆధార్ సవరణ బిల్లుపై చర్చ జరిపారు. -
స్పీకర్గా బిర్లా ఏకగ్రీవం
న్యూఢిల్లీ: పదిహేడవ లోక్సభ స్పీకర్గా బీజేపీకి చెందిన ఓం బిర్లా ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. రాజస్తాన్లోని కోటా నియోజక వర్గం నుంచి పార్లమెంటుకు ఎన్నికయిన బిర్లా అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి, డీఎంకే ఎంపీ టీఆర్ బాలు, తృణమూల్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ తదితరులు మద్దతు తెలిపారు. లోక్సభ ఎన్నికల బరిలో బిర్లా ఒక్కరే ఉండటంతో ఆయనను స్పీకర్గా ఎంపికచేస్తూ ప్రధాని మోదీ తీర్మానం ప్రవేశపెట్టారు. దానిని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం బిర్లా లోక్సభ స్పీకర్గా ఎన్నికయినట్టు ప్రొటెం స్పీకర్ వీరేంద్ర ప్రకటించారు. ప్రధాని మోదీ స్వయంగా బిర్లాను స్పీకర్ కుర్చీ దగ్గరకు తీసుకెళ్లారు. పార్టీలకతీతంగా పలువురు ఎంపీలు పోడియం వద్దకు వచ్చి కొత్త స్పీకర్ను అభినందించారు. సభను నిష్పక్షపాతంగా నిర్వహించాలని ప్రతిపక్షాలు నూతన స్పీకర్కు విజ్ఞప్తి చేశాయి. ‘సభ నిర్వహణలో మీకు పూర్తిగా సహకరిస్తామని ప్రభుత్వం, అధికార పక్షం తరఫున నేను హామీ ఇస్తున్నాను. సభలో మీ మాటే చెల్లుతుంది. మా వాళ్లతో సహా ఎవరు హద్దుమీరినా మీరు కఠిన చర్య తీసుకోవాలి’ అని మోదీ అన్నారు. తనను స్పీకర్గా ఎన్నుకున్నందుకు బిర్లా అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సభను నిష్పక్షపాతంగా నిర్వహిస్తానని, సభ్యులందరికీ సమాన అవకాశాలు ఇస్తానని అన్నారు. సభను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని, ప్రజా సమస్యలను సభలో లేవనెత్తేందుకు విపక్షాలకు తగినంత సమయం ఇవ్వాలని కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ కొత్త స్పీకర్ను కోరారు. స్పీకరే సభకు అధిపతి అని, దేశ స్వాతంత్య్రానికి, జాతికి ఆ పదవి ప్రతిబింబమని నెహ్రూ చెప్పిన మాటలను ఆయన గుర్తు చేశారు. ఇంతవరకు లోక్సభ చాలా తక్కువ బిల్లులనే స్థాయీ సంఘానికి సిఫారసు చేస్తూ వస్తోందని, ఇకనైనా ఆ తీరు మారాలన్నారు. బీజేడీ ఎంపీ పినాకి మిశ్రా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. చర్చల్లో ప్రాంతీయ, చిన్న పార్టీల సభ్యులకు తగినంత సమయం కేటాయించాలని అకాలీదళ్ ఎంపీ సుఖ్బీర్సింగ్ బాదల్, ఆప్నాదళ్ ఎంపీ అనుప్రియ పటేల్ సూచించారు. -
లోక్సభ స్పీకర్: ఎవరీ ఓం బిర్లా..
ఓం బిర్లా.. ఇప్పుడు ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో ఈ పేరు చర్చనీయాంశమైంది. కేవలం రెండుసార్లు మాత్రమే ఎంపీగా ఎన్నికయిన బిర్లా బుధవారం 17వ లోక్సభ స్పీకర్గా ఎన్నికయ్యారు. లోక్సభ స్పీకర్గా ఆయన పేరును బీజేపీ ప్రతిపాదించడం అందరినీ ఆశ్చర్య పరిచింది. సాధారణంగా సీనియర్ నేతలను స్పీకర్ పదవికి పరిగణలోకి తీసుకుంటారు. గత లోక్సభ స్పీకర్గా ఎనిమిది పర్యాయాలు ఎంపీగా గెలుపొందిన సుమిత్రా మహాజన్ను ఖరారు చేసిన సంగతి తెలిసింది. అయితే ఇకపై పార్టీలోనూ, చట్టసభల్లోనూ కురువృద్ధులకు స్థానం ఉండదన్న సంకేతాలను బిర్లాను ఎంపిక చేయడం ద్వారా ప్రధాని మోదీ పంపారనే తెలుస్తోంది. ఎవరీ ఓం బిర్లా.. ఓం బిర్లా 1969 నవంబర్ 23న రాజస్తాన్లోని కోటాలో జన్మించారు. తండ్రి శ్రీకృష్ణ బిర్లా, తల్లి శకుంతల దేవి. బిర్లా బీజేపీకి సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న మార్వారి బనియా సామాజిక వర్గానికి చెందిన వారు. ఓం బిర్లా తన ప్రాథమిక విద్యాభ్యాసం అంతా రాజస్తాన్లోనే పూర్తి చేశారు. 12వ తరగతి అనంతరం బిజినెస్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. కోటాలోని కామర్స్ కాలేజీలో, అజ్మీర్లోని మహర్షి దయానంద సరస్వతి విశ్వవిద్యాలయంలో ఆయన చదివారు. 1991లో గైనకాలజిస్ట్గా పనిచేస్తున్న అమితా బిడాలీని వివాహం చేసుకున్నారు. కాలేజీలో చదివేటప్పుడే విద్యార్థి నాయకుడిగా ఎదిగిన బిర్లా భారతీయ జనతా యువ మోర్చా నాయకుడిగా పనిచేశారు. 1987 నుంచి 1991 వరుకు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన 1997 నుంచి 2003 వరకు భారతీయ జనతా యువమోర్చా రాష్ట్రీయ ఉపాధ్యక్షుడుగా ఉన్నారు. 2003లో కోటా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ నేత శాంతి ధారీవాల్ను 10 వేల ఓట్ల తేడాతో ఓడించి జెయింట్ కిల్లర్గా పేరు తెచ్చుకున్నారు. 2008లో కోటా నుంచి మరోమారు పోటీ చేసి కాంగ్రెస్ నేత రామ్ కిషన్ వర్మను 24 వేల మూడు వందల ఓట్ల తేడాతో ఓడించారు. ఆయన మొత్తం మూడు సార్లు అసెంబ్లీకి, రెండు సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. 2014లో కోటా లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన సునాయాసంగా గెలుపొందారు. 2019 లోక్సభ ఎన్నికల్లోనూ కోట నుంచి పోటీ చేసిన ఆయనను స్పీకర్ పదవి వరించింది. చురుకైన నేతగా, అప్పగించిన పనికంటే ఎక్కువ కష్టపడే వ్యక్తిగా అధిష్టానం వద్ద బిర్లాకు మంచి గుర్తింపు ఉంది. సవాళ్లను స్వీకరించడంలో ఆయనకు ఆయనే సాటి. సభ నియయనిబంధనలను క్షుణ్ణంగా ఆకళింపు చేసుకున్న బిర్లా స్పీకర్ పదవికి అర్హుడనే వ్యాఖ్యలు బీజేపీ వర్గాల్లో వినిపించడంతో ఆయనను సభాపతి పదవి వరించినట్టు తెలుస్తోంది. బిర్లాను స్పీకర్గా బీజేపీ ప్రతిపాదించగా ఎన్డీయే వర్గాలతోపాటు ఏఐఏడీఎంకే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. స్పీకర్గా బిర్లాకు మద్దతునిస్తున్నట్లు లోక్సభ కాంగ్రెస్ పక్ష నేత అధిర్ చౌదరి తెలిపారు. స్పీకర్గా ఎన్నికయిన బిర్లాను ప్రధాని మోదీ సాదరంగా తీసుకువెళ్లి చైర్లో కూర్చోబెట్టారు. మొదటిసారి లేదా రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన వారూ ఈ పదవిని చేపట్టిన సందర్భరాలు గతంలోనూ ఉన్నాయి. 2002లో స్పీకర్గా ఎన్నికైన మురళీ మనోహర్ జోషి అప్పుడు తొలిసారి ఎంపీగా గెలిచారు. ఆయన తరువాత ఆ పదవి చేపట్టిన జీఎంసీ బాలయోగి అప్పటికి రెండుసార్లు మాత్రమే ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే 16వ లోక్సభకు స్పీకర్గా పనిచేసిన సుమిత్రా మహాజన్ ఎనిమిదిసార్లు ఎంపీగా గెలుపొందారు. -
లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా
న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్గా బీజేపీ తరఫున రెండుసార్లు ఎంపీగా గెలిచిన ఓం బిర్లా ఎన్నికకు రంగం సిద్ధమయ్యింది. బుధవారం స్పీకర్ పదవికి ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పదవికి ఎన్డీయే అభ్యర్థిగా బిర్లాను ఖరారు చేసిన బీజేపీ.. ఆ మేరకు ఆయన పేరును ప్రతిపాదిస్తూ, అలాగే ఆయన ఎన్నిక కోసం తీర్మానం ప్రవేశపెట్టేందుకు గాను ఇప్పటికే లోక్సభ సెక్రటేరియట్కు నోటీసు ఇచ్చింది. ఏఐఏడీఎంకే సహా ఎన్డీయే పక్షాలు, వైఎస్సార్సీపీ, బిజూ జనతాదళ్ ఈ తీర్మానానికి మద్దతు పలికాయి. దిగువ సభలో ఎన్డీయేకి పూర్తి మెజారిటీ ఉండటం, అంతేగాక యూపీఏ పక్షాలు సైతం బిర్లాకే మద్దతు ప్రకటించడంతో స్పీకర్గా ఆయన ఎన్నిక ఇక లాంఛనం మాత్రమే. స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేసేందుకు మంగళవారమే చివరి రోజు. కాగా కాంగ్రెస్తో పాటు మిగతా యూపీఏ పక్షాలు ఎన్డీయే అభ్యర్థికే మద్దతు పలకాలని నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి మంగళవారం చెప్పారు. సాయంత్రం జరిగిన యూపీఏ పక్షాల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. డిప్యూటీ స్పీకర్ అంశంపై మాత్రం ఆయన మౌనం వహించారు. కాంగ్రెస్, విపక్షాలు దీనిపై వేచి చూసే ధోరణిలో ఉన్నాయి. మోదీ చాయిస్! స్పీకర్గా ఓం బిర్లా పేరును ప్రధాని మోదీ ప్రతిపాదించినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. సాధారణంగా లోక్సభ స్పీకర్ పదవి విషయంలో సీనియర్ నేతలను పరిగణనలోకి తీసుకుంటారు. అయితే మొదటిసారిగా లేదా రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన వారూ ఈ పదవిని చేపట్టిన సందర్భాలు గతంలో ఉన్నాయి. 2002లో స్పీకర్గా ఎన్నికైనా మురళీ మనోహర్ జోషి అప్పుడు తొలిసారి ఎంపీగా గెలిచారు. ఆయన తర్వాత ఆ పదవి చేపట్టిన జీఎంసీ బాలయోగి అప్పటికి రెండుసార్లు మాత్రమే ఎంపీగా ఎన్నికయ్యారు. అయినప్పటికీ బిర్లాను బీజేపీ స్పీకర్ పదవికి ఎంపిక చేయడం ఒకింత ఆశ్చర్యకరమేనని చెప్పాలి. వరసగా రెండోసారి అధికారం చేపట్టిన ఉత్సాహంలో ఉన్న మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు మరోసారి తమ మార్క్ ప్రదర్శించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక పార్టీలో కానీ, చట్టసభల్లో కానీ కురువృద్ధులకు స్థానం ఉండదన్న సంకేతాలు 17వ లోక్సభకు స్పీకర్గా బిర్లాను ఎంపిక చేయడం ద్వారా బలంగా పంపారని అంటున్నారు. అలాగే పైకి కన్పించకపోయినా క్షేత్ర స్థాయిలో బాగా పనిచేసేవారికి పార్టీ ప్రాధాన్యమిస్తుందనడానికి కూడా ఇది సంకేతమని చెబుతున్నారు. రెండుసార్లు ఎంపీ రాజస్తాన్లోని కోట–బూందీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 57 ఏళ్ల బిర్లా మొత్తం మీద రెండుసార్లు ఎంపీగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. స్పీకర్గా ఎన్నికైతే ఎనిమిది సార్లు ఎంపీగా గెలిచిన సుమిత్రా మహాజన్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. బిర్లా బీజీపీకి సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న మార్వారి బనియా సామాజిక వర్గానికి చెందినవారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ యూనియన్ నాయకుడిగా ఉండగానే ఆయనలో తెలివితేటలు, సృజనాత్మకత బీజేపీ పెద్దలకి అర్థమయ్యాయి. 2003లో మొట్టమొదటిసారిగా కోట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చురుకైన నేతగా, అప్పగించిన పని కంటే ఎక్కువ కష్టపడే వ్యక్తిగా అధిష్టానం వద్ద గుర్తింపు ఉంది. సవాళ్లను స్వీకరించడంలో ఆయనకు ఆయనే సాటి. సభ నియమ నిబంధనలను క్షుణ్ణంగా ఆకళింపు చేసుకున్నారు. స్పీకర్ పదవికి బిర్లా అర్హుడనే వ్యాఖ్యలు బీజేపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. నినాదాలు .. వాగ్వాదాలు రెండోరోజు సోనియా, ములాయం ప్రమాణం లోక్సభ సమావేశాల రెండోరోజు మంగళవారం యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, సమాజ్వాదీ పార్టీ నేత ములాయంసింగ్ తదితరులు సభ్యులుగా ప్రమాణంచేశారు. సభ్యుల ప్రమాణం సందర్భంగా అధికార, విపక్షాల సభ్యులు పెద్దయెత్తున నినాదాలతో పోటీపడ్డారు. సోనియా హిందీలో ప్రమాణం చేస్తుండగా విపక్ష బెంచీల్లో ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన మొబైల్ ఫోన్లో చిత్రీకరిస్తూ కన్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు బల్లలు చరుస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తే.. మరోవైపు బీజేపీ సభ్యులు సోనియా హిందీలో ప్రమాణం చేసినందుకు అభినందించడం విన్పించింది. ఆ తర్వాత వెంటనే బీజేపీ ఎంపీ మేనకా గాంధీ ప్రమాణం చేయగా సోనియా, మేనక ఇద్దరూ ముకుళిత హస్తాలతో ఒకరినొకరు పలుకరించుకున్నారు. కుమారుడు అఖిలేష్ యాదవ్ తోడురాగా అస్వస్థత కారణంగా వీల్ చైర్లో సభలోకి వచ్చిన 79 ఏళ్ల ములాయంను ఆయన సీట్లోనుంచే ప్రమాణం చేసేందుకు అనుమతించారు. కాగా ఓం బిర్లా సభలో ప్రవేశించినప్పుడు, ఆయన ప్రమాణం చేసేందుకు లేచినప్పుడు చప్పట్లు మార్మోగాయి. కొత్తగా ఎన్నికైనా సభ్యులు కొందరు చేసిన నినాదాలు సభ్యుల మధ్య వాగ్వాదానికి దారితీశాయి. ఎవరికి ఇష్టమొచ్చినట్టుగా వారు నినదించడంతో.. నినాదాలేవీ రికార్డుల్లోకి వెళ్లవని ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు. విపక్షాల సభ్యులు ముఖ్యంగా టీఎంసీ ఎంపీలు ప్రమాణ స్వీకారానికి లేచినప్పుడు బీజేపీ సభ్యులు ‘భారత్ మాతా కీ జై’, ‘జై శ్రీరామ్’అంటూ నినదించారు. ఇందుకు ప్రతిగా టీఎంసీ నేతలు ‘జై మా దుర్గ’, ‘జై బెంగాల్’, ‘జై మమత’, ‘జై హింద్’అంటూ నినాదాలు చేశారు. ఒకదశలో రాహుల్ ‘మరొక్కసారి’, ‘మరొక్కసారి’అని బీజేపీ సభ్యులనుద్దేశించి అన్నారు. కాగా నటుడు, మొదటిసారి ఎంపీ సన్నీ డియోల్ ప్రమాణంలోని ‘అప్హోల్డ్’పదాన్ని ‘విత్హోల్డ్’గా చదివి ఆ తర్వాత సరిదిద్దుకున్నారు. ఒవైసీ ‘జై భీమ్ .. అల్లాహు అక్బర్’ అధికార పక్ష సభ్యులు ‘జై శ్రీరామ్’, ‘భారత్ మాతాకీ జై’, ‘వందేమాతరం’అంటూ నినదించడంతో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ‘జై భీమ్, జై మీమ్, తక్బీర్ అల్లాహు అక్బర్, జై హింద్’అని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ ‘ఇంక్విలాబ్ జిందాబాద్’అంటూ నినదించి అధికార పక్ష సభ్యులతో వాదులాటకు దిగారు. ఎంపీగా ప్రమాణం చేస్తున్న సోనియాగాంధీ -
లోక్సభ స్పీకర్ రేస్లో ప్రహ్లాద్ జోషీ
సాక్షి, న్యూఢిల్లీ : దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న క్రమంలో క్యాబినెట్లో ఎవరెవరికి చోటుదక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు క్యాబినెట్ కూర్పుతో పాటు కీలక పదవుల్లో ఎవరిని తీసుకోవాలనే దానిపై కసరత్తు కొలిక్కివచ్చినట్టు తెలిసింది. ధార్వాడ్ నుంచి నాలుగుసార్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించి, గతంలో కర్నాటక బీజేపీ చీఫ్గా పనిచేసిన ప్రహ్లాద్ జోషీని లోక్సభ స్పీకర్గా ఎంపిక చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ చీఫ్ అమిత్ షా ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. కర్ణాటకలో లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్ధానాలు దక్కిన నేపథ్యంలో దక్షిణాదిలో పాగావేయాలన్న బీజేపీ వ్యూహంలో భాగంగా జోషీ పేరు తెరపైకి వచ్చిందని సమాచారం. పలువురు బీజేపీ, మిత్రపక్షాల ఎంపీలకు పార్టీ చీఫ్ అమిత్ షా నుంచి పిలుపు రావడంతో వారికి క్యాబినెట్ బెర్త్లు ఖరారయ్యాయని భావిస్తున్నారు. -
మీ కంటే స్కూల్ పిల్లలు నయం..
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ సభ్యుల వ్యవహారాల శైలిపై లోక్సభ స్పీకర్ సుమిత్రా మహజన్ తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. రఫేల్ ఒప్పందంపై మంగళవారం పాలక, విపక్ష సభ్యుల మధ్య గందరగోళం నెలకొనడంతో సభను సజావుగా నడిపేందుకు ఆమె విఫలయత్నం చేశారు. ఎంత వారించినా సభ్యులు వినకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీ కంటే స్కూల్ పిల్లలు ఎంతో నయమని వ్యాఖ్యానించారు. రఫేల్ ఒప్పందంపై పార్లమెంటరీ కమిటీ విచారణ జరపాలని సభ ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై పాలక బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. సభ కొద్దిసేపు వాయిదా పడి తిరిగి సమావేశమైన తర్వాత ఇదే పరిస్థితి కొనసాగింది. సభా కార్యక్రమాలు కొనసాగించేందుకు స్పీకర్ ప్రయత్నించినా సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. ఈ దశలో ఎంపీల తీరుపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మీరు ప్రవర్తిస్తున్న తీరుతో సభ వెలుపల మంచి సంకేతాలు వెళ్లడం లేదని, భారత పార్లమెంట్లో ఏం జరుగుతోందని విదేశాల్లో ప్రజలు అడగటం తాను గమనించానని వ్యాఖ్యానించారు. పార్లమెంటేరియన్ల కంటే స్కూల్ చిన్నారులే మెరుగ్గా ప్రవర్తిస్తున్నారనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోందన్నారు. కాగా రఫేల్ ఒప్పందంపై ప్రభుత్వం కోర్టుకు అసత్యాలు వెల్లడించిందని, దీనిపై పార్లమెంటరీ కమిటీచే విచారణ జరిపించాలని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టగా, కావేరి నదిపై ప్రాజెక్టు నిర్మించే ప్రతిపాదనను కర్ణాటక ప్రభుత్వం విరమించాలని ఏఐఏడీఎంకే సభ్యులు ఆందోళన చేపట్టారు. ఇక రఫేల్ ఒప్పందంపై ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేయగా, ఈ ఒప్పందంపై దేశాన్ని తప్పుదారిపట్టించిన రాహుల్ గాంధీయే క్షమాపణ చెప్పాలని పాలక బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. -
సలాం ఛటర్జీ..!
-
అవిశ్వాసంపై చర్చ : ఏ పార్టీకి ఎంత సమయం..?
సాక్షి, న్యూఢిల్లీ : అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా వివిధ పార్టీలకు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహజన్ సమయం కేటాయించారు. సభలో ఆయా పార్టీల సంఖ్యా బలాన్ని బట్టి ప్రసంగించే సమయాన్ని కేటాయించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశాల్లో ప్రశ్నోత్తరాలను రద్దు చేసి అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపడతారు. చర్చలో బీజేపీకి మూడు గంటల 33 నిమిషాలు, కాంగ్రెస్కు 38 నిమిషాలు, ఏఐఏడీఎంకే 29 నిమిషాలు, తృణమూల్ కాంగ్రెస్ 27 నిమిషాలు, బీజేడీ 15 నిమిషాలు, శివసేన 14 నిమిషాలు, టీడీపీ 13 , టీఆర్ఎస్ 9, సీపీఎం 7, ఎస్పీ 6, ఎన్సీపీ 6, ఎల్జేఎస్పీకి 5 నిమిషాల సమయం కేటాయించారు. -
స్పీకర్కు మరోసారి వైఎస్సార్ సీపీ ఎంపీల లేఖ
సాక్షి, న్యూఢిల్లీ : తమ రాజీనామాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మరోసారి లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్కు లేఖ రాశారు. తమ రాజీనామాలు ఆమోదించాలని లేఖలో మరోసారి స్పీకర్ను కోరారు. ‘గత నెల 29న రాజీనామాలపై పురాలోచన చేయాలని మీరు కోరారు.. మీ సలహాకు ధన్యవాదాలు. కానీ, మేం రాజీనామాలకే కట్టుబడి ఉన్నాం. 16వ లోక్సభ సభ్యత్వానికి రాజీనామా ఇచ్చాం. తక్షణమే మా రాజీనామాలు ఆమోదించండి’ అని లేఖలో వైఎస్సార్ సీపీ ఎంపీలు పేర్కొన్నారు. ఈ మేరకు తమ రాజీనామాలను మరోసారి ధ్రువీకరిస్తూ.. ఎంపీలు స్పీకర్ కార్యాలయంలో ఎంపీలు లేఖలు అందంజేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ వైఎస్సార్ సీపీ ఎంపీలు ఏప్రిల్ 6న తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు వైఎస్సార్సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్రెడ్డి, వరప్రసాద్, పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డిలు బుధవారం ఉదయం 11 గంటలకు స్పీకర్ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తమ రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్ మహాజన్ను గట్టిగా కోరారు. రాజీనామాల ఆమోదానికి ఎంపీలు పట్టుబట్టడంతో ఆమె అంగీకరించారు. ప్రత్యేక హోదా సాధనలో భాగంగా తాము పదవులకు రాజీనామా చేశామని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామాలు ఆమోదించాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ.. రాజీనామాల ఆమోదంపై తుది నిర్ణయం ఇదేనా అని స్పీకర్ అడిగితే.. అవునని ఆమె సమాధానం చెప్పారని, రాజీనామాలు ఆమోదిస్తున్నట్లు తెలిపారని వివరించారు. రాజీనామాలపై వెనక్కి తగ్గేది లేదని స్పీకర్కు వివరించినట్లు చెప్పారు. వైఎస్సార్ సీపీ ఎంపీల రాజీనామాల ఆమోదంపై నేటి సాయంత్రం లోగా అధికారికంగా ప్రకటన విడుదలయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. -
తక్షణమే మా రాజీనామాలు ఆమోదించండి
-
స్పీకర్ మా రాజీనామాలు ఆమోదిస్తారనే భావిస్తున్నాం
-
హోదా విషయంలో వెనక్కి తగ్గేది లేదు
-
స్పీకర్ను కలుస్తాం.. రాజీనామా ఆమోదం కోరుతాం
సాక్షి, పశ్చిమగోదావరి : ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవులకు రాజీనామాలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు లోక్సభ స్పీకర్ కార్యాలయం నుంచి పిలుపొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై వైసీపీ నేత, రాజీనామా సమర్పించిన నేతల్లో ఒకరైన వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ.. లోక్సభ కార్యాలయం నుంచి వచ్చిన పిలుపు మేరకు ఈ నెల 29న సాయంత్రం లోక్సభ స్పీకర్ను కలవనున్నట్లు తెలపారు. స్పీకర్ను కలిసి తమ రాజీనామాలను ఆమోదించాల్సిందిగా కోరుతామన్నారు. ఏప్రిల్ 6న స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు చేశామని, తర్వాత స్పీకర్ కార్యాలయం నుంచి పిలుపు రాకుంటే లేఖ కూడా రాసినట్టు తెలిపారు. స్పీకర్ను కలిసి తమ రాజీనామాలను ఆమోదింపజేసుకుని ప్రజా తీర్పు కోరుతాం అని అన్నారు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. ధర్మపోరాటం పేరుతో ఇప్పుడు కొత్త నాటకానికి చంద్రబాబు తెరతీశారని విమర్శించారు. ప్రత్యేకహోదా విషయంలో పూటకో మాట మాట్లాడిన చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. -
టీడీపీ డ్రామాలకు చెక్ పెడతాం
-
రాజీనామాలు ఆమోదించకపోవడం అవమానపరిచినట్లే
-
రాజీనామాలు ఆమోదించాలని కోరతాం
సాక్షి, ఒంగోలు : ఈ నెల 29న లోక్సభ స్పీకర్ సుమిత్రా మహజన్ ఎదుట హాజరు కానున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ.. తమ రాజీనామాలపై లోక్ సభ స్పీకర్ నుంచి లేఖ వచ్చినట్లు వెల్లడించారు. తమ రాజీనామాలు ఆమోదించాలని కోరతామన్నారు. నెల దాటినా రాజీనామాలు ఆమోదించకపోవడం 5 కోట్ల ఆంధ్రులను అవమానించడమేనని ఇప్పటికే తెలిపామని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం ఐదుగురు వైఎస్సార్ సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసిన విషయం విదితమే. -
ఫేస్బుక్ లో మంత్రి అచ్చెన్నాయుడు మిస్టేక్!
నూఢిల్లీ: తెలుగుదేశం నేతలకు పొరపాట్లు చేయడం, తరువాత నాలుక్కరుచుకోవడం అలవాటే. సాక్షాత్తు పార్టీ అధినేతే గతంలో బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ సన్మాన సభలో ఒలింపిక్స్లో గెలిస్తే నోబెల్ ప్రైజ్ ఇస్తానని చెప్పారు. అంతకు ముందు ‘బీకాంలో ఫిజిక్స్ చదివా’నంటూ ఎమ్మెల్యే జలీల్ఖాన్ ఫేమస్ అయిపోయారు. తాజాగా ఏపీ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు దివంగత తెలుగుదేశం నేత ఎర్రన్నాయుడు కుమారుడు, శ్రీకాకుళం ఎంపీ కింజర రామ్మోహన్ నాయుడుకు ఇటీవలే వివాహం జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి రిసెప్షన్ వేడుకలను ఢిల్లీలో ఈనెల 19న ఏర్పాటు చేశారు. ఈ విందుకు ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఆ వేడుకకు ఎవరెవరు వచ్చారో తెలుపుతూ అచ్చెన్నాయుడు సోషల్ మీడియా ఫేస్బుక్లో ఫొటోలను పోస్టు చేశారు. అందులో ‘ప్రధాని నరేంద్రమోదీలతో పాటు లోకసభ స్పీకర్ గౌరవనీయులు శ్రీమతి షీలా దీక్షిత్ గారు, ఇతర కేంద్ర మంత్రులు హాజరయ్యారు’. అని రాశారు. వాస్తవానికి లోక్సభ స్పీకర్గా సుమిత్రా మహాజన్ కొనసాగుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో నెట్జన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. లోక్సభ స్పీకర్ ఎవరో తెలియకుండా మంత్రి ఎలా అయ్యారంటూ మండిపడుతున్నారు. అయితే ఆ ఫేస్బుక్ అకౌంట్ సదరు మంత్రిగారిదో లేక నకిలీదో తెలియాల్సిఉంది. -
విశాఖ పోలీసుల తీరుపై స్పీకర్కు ఫిర్యాదు
న్యూఢిల్లీ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు శుక్రవారం లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ను కలిశారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, పార్టీ ఎంపీల పట్ల విశాఖపట్నం ఎయిర్పోర్టులో పోలీసుల దురుసు ప్రవర్తనపై వారు స్పీకర్ మహాజన్కు ఫిర్యాదు చేశారు. పోలీసుల ప్రవర్తనపై ప్రివిలేజ్ కమిటీ విచారణ చేపట్టాలని కోరారు. విశాఖపట్నంలో ప్రత్యేకహోదాకు మద్దతుగా కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ ఎంపీలపై పోలీసులు అత్యంత దురుసుగా, నిరంకుశంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. విశాఖ విమానాశ్రయంలోనే వైఎస్ జగన్, పార్టీ ఎంపీలను నిర్బంధించి పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. వైఎస్ జగన్ను ఎయిర్పోర్టులో అడ్డుకున్న పోలీసులు.. ఆ తర్వాత ఆయనను, పార్టీ నేతలను బలవంతంగా హైదరాబాద్కు పంపించిన సంగతి తెలిసిందే. -
మొబైల్ లైట్ల వెలుగులో లోకసభ స్పీకర్ ప్రసంగం
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని జాంబాగ్లోని వివేకవర్థిని పాఠశాల శతాబ్ది ఉత్సవాల్లో లోక్సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ పాల్గొన్నారు. అయితే ఆమె వేదిక పై కూర్చున్న సమయంలో విద్యుత్ అంతరాయం కలగడంతో సెల్ఫోన్ల వెలుతురులోనే స్పీకర్ ప్రసంగం ప్రారంభించారు. కొన్ని నిమిషాల అనంతరం విద్యుత్ సరఫరా అవడంతో సుమిత్ర మహాజన్ తన ప్రసంగం కొనసాగించారు. -
మీ వాళ్లను మీరే అదుపులో పెట్టండి
లోక్సభలో జరుగుతున్న గందరగోళాన్ని వివిధ పార్టీల పార్లమెంటరీ పార్టీ నేతలే అదుపు చేయాలని లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కోరారు. తీవ్ర గందరగోళం కారణంగా లోక్సభ వాయిదాపడి, తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు సమావేశమైనప్పుడు స్పీకర్ ఈ మేరకు అన్ని పక్షాల నాయకులకు సుదీర్ఘంగా ఓ విజ్ఞప్తి చేశారు. సభ జరుగుతున్న తీరును దేశమంతా చూస్తూనే ఉంటుందని, ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన గౌరవ సభ్యులు ఇలా ప్రవర్తించడం సరికాదని ఆమె అన్నారు. ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేయడం, పదే పదే వెల్లోకి దూసుకు రావడం లాంటివి చేయకుండా, సభ్యులు ఏవైనా సమస్యలను ప్రస్తావించాలనుకుంటే తమ తమ స్థానాల్లోనే నిలబడి ప్రస్తావించాలని కోరారు. వివిధ పార్టీల సభ్యులు ఇలా గందరగోళం సృష్టించకుండా ఆయా పార్టీల పార్లమెంటరీ పార్టీ నేతలే చూసుకోవాలని, అది వారి బాధ్యతే అవుతుందని స్పీకర్ అన్నారు. కాగా, తమ సభ్యులు ముందుకు వచ్చి నినాదాలు చేసిన మాట వాస్తవమేనని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రైల్వే శాఖ మాజీ మంత్రి మల్లికార్జున ఖర్గే అన్నారు. అయితే రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు మోగుతాయని, అందువల్ల ముందుగా అధికార పక్షాన్ని నియంత్రించాలని స్పీకర్ను ఆయన కోరారు. -
'నేను నాయనమ్మ అయిపోయా'
తాను నాయనమ్మను అయిపోయానంటూ లోక్సభకు స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన సుమిత్రా మహాజన్ వ్యాఖ్యానించారు. ఐఎన్ఎల్డీ సభ్యుడు దుష్యంత్ చౌతాలాతో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్త సభ్యులందరిలోకి అత్యంత పిన్న వయస్కుడైన దుష్యంత్ (26).. సీనియర్ ఎంపీ అయిన సుమిత్రా మహాజన్ (71)ను అభినందిస్తూ మాట్లాడారు. ''మీరు మా ముత్తాత చౌదరి దేవీలాల్తోను, తాతయ్య ఓం ప్రకాష్ చౌతాలాతోను, నాన్న అజయ్ చౌతాలాతో కూడా కలిసి ఎంపీగా చేశారు. ఇప్పుడు అత్యున్నత పదవికి ఎంపికయ్యారు. మీ మార్గదర్శకత్వంలో నేను నడుస్తా'' అని దుష్యంత్ అన్నారు. దాంతో, తానిప్పుడు నాయనమ్మ అయ్యానంటూ సుమిత్ర చమత్కరించారు. తనలాగే మొదటిసారి ఎన్నికైన సభ్యులకు ఎక్కువ సమయం ఇస్తారని ఆశిస్తున్నట్లు దుష్యంత్ చెప్పారు. -
సమాజంలో మార్పు రాలేదు:మీరా కుమార్
కోల్కతా: నిర్భయ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటినా సమాజంలో మార్పు రాలేదని, మహిళలపై అకత్యాలు కొనసాగుతూనే ఉన్నాయని లోక్సభ స్పీకర్ మీరాకుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివారమిక్కడ జరిగిన ఓ ఆధ్మాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో గ్యాంగ్రేప్ బలైన నిర్భయం చివరకంటూ మృత్యువుతో పోరాడి సింగపూర్ లో మరణించిన విషయం తెలిసిందే. తదనంతర పరిణామాల తర్వాత సమాజంలో మంచి దిశగా ఏమైనా మార్పు కనిపించిందా అని విలేకరులు అడగ్గా.. ఈ తరహా ఘటనలపై ఇంకా మార్పు రాకపోవడం దురదృష్టకరంగా ఆమె పేర్కొన్నారు. -
రాజీనామా ఆమోదించమని స్పీకర్ను కోరా: ఎస్పీవై రెడ్డి
ఢిల్లీ: తన రాజీనామాను ఆమోదించమని లోక్సభ స్పీకర్ మీరాకుమార్ను కోరినట్లు నంద్యాల ఎంపి ఎస్పివై రెడ్డి చెప్పారు. తాము రాజీనామా చేయకపోతే తమ ప్రజలు ఊరుకోవడంలేదని చెప్పినట్లు తెలిపారు. సమైక్యరాష్ట్రం కోసం రాజీనామా చేసినట్లు చెప్పారు. తాను నిన్ననే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరానని, ఇక ఆ పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సమక్ష్యంలో ఎస్పివై రెడ్డి ఆ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఎస్పీవై రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. -
రాజీనామా చేస్తే ఆమోదిస్తారా...!