Love couple suicide
-
పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్య
ఆత్మకూరు (ఎస్)(సూర్యాపేట): పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండల పరిధిలోని తుమ్మల పెన్పహాడ్ గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుమ్మల పెన్పహాడ్ గ్రామానికి చెందిన గుండగాని సంజయ్, అదే గ్రామానికి చెందిన సల్లగుండ్ల నాగజ్యోతి ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సంజయ్ సూర్యాపేటలో ఉంటూ వాటర్ ప్లాంట్లో మెకానిక్గా పనిచేస్తుండగా.. నాగజ్యోతి బీ–ఫార్మసీ పూర్తిచేసి హైదరాబాద్లోని నాగోల్ క్రాస్ రోడ్లో గల ఓ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసుకుంటూ ఎం–ఫార్మసీ చదువుతోంది. తాను నాగజ్యోతిని ప్రేమిస్తున్న విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు గతంలోనే సంజయ్ తెలియజేయగా వారు వివాహానికి ఒప్పుకోలేదు. అయినప్పటికీ మూడేళ్లుగా వారు ప్రేమలోనే ఉన్నారు. ఇటీవల గ్రామానికి చెందిన కొందరు నాగజ్యోతి తల్లిదండ్రులకు లేనిపోని విషయాలు చెప్పడంతో ఆమెను తండ్రి మందలించాడు. ఉగాది పండుగ తర్వాత నుంచి ఆమెను ఉద్యోగం మాన్పించి ఇంటి దగ్గరే ఉంచాడు.కలిసి ఉండలేమని భావించి..తమ ప్రేమ విషయమై గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అసత్యాలు ప్రచారం చేస్తుండడంతో, ఇకపై తాము కలిసి ఉండలేమని భావించి వారిద్దరు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి సంజయ్, నాగజ్యోతి తమ తమ ఇళ్ల నుంచి బయటికి వచ్చి గ్రామ శివారులోని ఓ వ్యవసాయ భూమి వద్ద పురుగుల మందు తాగారు. ఆదివారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లేవారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి వారి కుటుంబ సభ్యులకు అప్పగించగా.. అంత్యక్రియలు పూర్తిచేశారు.సూసైడ్ నోట్ లభ్యం..తమ ప్రేమకు అడ్డంకిగా మారి ఇబ్బందులకు గురిచేసిన గ్రామానికి చెందిన బెల్లంకొండ నారాయణ, ఆరె లతారెడ్డితో పాటు నాగజ్యోతి బంధువులైన సల్లగుండ్ల అజయ్, సల్లగుండ్ల మల్లయ్య, సల్లగుండ్ల శ్రీను, సల్లగుండ్ల ఉప్పలయ్యతో పాటు నాగజ్యోతి తండ్రి సల్లగుండ్ల శ్రీనుపై చర్యలు తీసుకోవాలని వారు సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లి దుర్గమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏడుగురిపై కేసు నమోదు చేసుకుని దర్యాçప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
తీవ్ర విషాదం.. మైనర్ ప్రేమజంట ఆత్మహత్య
సాక్షి, సిద్దిపేట: జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేటలో మైనర్ ప్రేమజంట ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. లచ్చపేటకు చెందిన కూరపాటి భగీరథ(17), అదే గ్రామానికి చెందిన తోట్ల నేహా(16) దుబ్బాకలో ఇంటర్మీడియట్ చదువుకుంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఒకరినొకరు ఇష్టపడుతూ ప్రేమాయణం కొనసాగించారు. ఇంట్లో వారికి తెలిస్తే విడదీస్తారనే భయంతో భగీరథ ఇంట్లోనే గత రాత్రి ఎవరూ లేని సమయంలో ఇద్దరు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. చదవండి: ‘బతకాలని ఉన్నవారు వెళ్లిపోండి.. ఇక నుంచి ఇలాంటివే జరుగుతాయి’ అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు ఉరి వేసుకుని విగత జీవులుగా మారడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. క్షణికావేశంలో మైనర్ ప్రేమికులు తీసుకున్న నిర్ణయం రెండు కుటుంబాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన దుబ్బాక పోలీసులు.. మృత దేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
వరసకు బాబాయ్! పెద్దలు ఒప్పుకోకపోవడంతో..
కృష్ణ: వరసలు కలవకపోవడంతో తమ ప్రేమను తల్లిదండ్రులు ఒప్పుకోలేదని మనస్తాపానికి గురైన ఓ ప్రేమజంట రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడింది. నారాయణపేట జిల్లా కృష్ణ మండలం చేగుంటలో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్ పరిధిలోని కందానాటికి చెందిన మునికుమార్ (25), పారుపల్లికి చెందిన అనిత (16)ల కుటుంబ సభ్యులు బతుకుదెరువు కోసం కుటుంబాలతో కలసి ఇటీవల కృష్ణ మండలంలోని చేగుంటలో పత్తి తీయడానికి వచ్చారు. అదే ప్రాంతంలో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా మునికుమార్, అనిత ప్రేమించుకుంటున్నారు. అయితే మునికుమార్ అనితకు వరసకు బాబాయ్ అవుతాడు. వీరి విషయం తెలిసిన తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో తమ ప్రేమ ఫలించదని మనస్తాపానికి గురైన వారు ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం రైల్వే గ్యాంగ్మెన్ గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి పంచనామా చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమజంట ఉరి వేసుకుందా.. ఎవరైనా హత్య చేసి ఇలా..
గుంటూరు: తమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ఓ ప్రేమ జంట చెట్టు కొమ్మకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలోని కాకాని కుంట వద్ద జరిగింది. అద్దంకిలోని బత్తులవారిపాలేనికి చెందిన బత్తుల పెద్దిరాజు (22) ఇంటర్మీడియట్ చదివి ఇటుక బట్టీల్లో పొట్టు లారీల పనికి వెళ్తున్నాడు. అదే పట్టణంలోని కొత్తపేటకు చెందిన పల్లపోతు ప్రశాంతి (20) ఇంటర్మీడియట్ చదివి ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. వీరిద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ పెళ్లికి సిద్ధమయ్యారు. ఈ విషయం వారి పెద్దలకు తెలిసి మందలించారు. తమ ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించలేదని ప్రశాంతి ఇటీవల ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి, ప్రశాంతిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇద్దరి తల్లిదండ్రులను పోలీసులు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. యువతి తల్లిదండ్రులు స్టేషన్లో పెళ్లికి అంగీకరించి ఇంటికి తీసుకువెళ్లారు. కానీ పెళ్లి చేయకుండా కాలయాపన చేస్తుండటంతో మనస్థాపం చెందిన పెద్దిరాజు, ప్రశాంతి సోమవారం అర్ధరాత్రి స్థానిక గరటయ్య కాలనీ సమీపంలోని కాకాని కుంట వద్దకు చేరుకుని చెట్టు కొమ్మకు ఉరి వేసుకుని మృతిచెందారు. పెద్దిరాజు తండ్రి బత్తుల కృష్ణ ఫిర్యాదు మేరకు మంగళవారం పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టంనికి తరలించారు. ప్రేమజంట ఉరి వేసుకుందా.. ఎవరైనా హత్య చేసి ఇలా చెట్టుకు వేలాడదీశారా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై దర్యాప్తు జరపాలని కోరుతూ పెద్దిరాజు మృతదేహంతో కొందరు యువకులు ఆస్పత్రి నుంచి స్థానిక భవానీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. -
పెళ్లికి పెద్దలు నిరాకరించారని.. ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
సాక్షి, మహబూబ్నగర్: పెళ్లికి పెద్దలు నిరాకరించారని ఓ ప్రేమజంట పురుగు మందు తాగిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లాలోని కోడేరు మండలం ఎత్తంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. ఎత్తం గ్రామానికి చెందిన గోలగుంట సాయికుమార్(22) అదే గ్రామానికి చెందిన ఓ యువతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విషయం తెలియడంతో అమ్మాయి తరపు కుటుంబీకులు పెళ్లికి నిరాకరించారు. దీంతో యువతి ఇంట్లో పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతుంది. విషయం తెలుసుకున్న సాయికుమార్ ఆందోళన చెంది పురుగు మందు తాగాడు. కుటుంబీకులు కొల్లాపూర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయంలో రెండు కుటుంబాల వారు వివరాలు తెలిపేందుకు నిరాకరించారు. ఎస్ఐ నరేందర్రెడ్డిని వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. చదవండి: ఆమె ప్రవర్తన భయపెట్టింది.. మంత్రి కేటీఆర్ ట్వీట్ ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
బతుకుపై బెంగనా?.. కుటుంబ సభ్యులు బెదిరించారా..?
సాక్షి, చిత్తూరు(చిల్లకూరు): వివాహానికి పెద్దలు ఒప్పుకోలేదన్న మనస్తాపంతో ఓ ప్రేమజంట విషం తాగి తనువు చాలించిన ఘటన గురువారం మండలంలో కలకలం రేపింది. స్థానికులు, పోలీసుల కథనం.. శ్రీకాళహస్తి నియోజకవర్గం, తొట్టంబేడు మండలం, పొయ్య గిరిజన కాలనీకి చెందిన శివమణి, మారెక్క పెద్ద కుమారుడు మారప్ప(26), అదే కాలనీకి చెందిన వెంకటరమణయ్య, చెల్లమ్మ దంపతుల నాలుగో కుమార్తె వనజ (16) కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకోగా.. బాలికకు యుక్తవయసు రాలేదని, కొంత కాలం ఆగాలని పెద్దలు సూచించారు. అయితే వారి సూచనలు పట్టించుకోని ప్రేమ జంట కుటుంబ సభ్యులకు తెలియకుండా రెండు నెలల క్రితం పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత చిల్లకూరు మండలం, తమ్మినపట్నం పంచాయతీ, గుమ్మళ్లదిబ్బలో తమకు తెలిసిన భవన నిర్మాణ కార్మికుడు మేకల వెహేసువ ఇంట్లో ఉంటూ స్థానికంగా రొయ్యల గుంటల్లో పనిచేసుకుని జీవనం సాగించారు. ఏమైందో తెలియదు కానీ గ్రామానికి సమీపంలోని కాలువ దగ్గర పురుగుల మందు తాగి ఇద్దరూ మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బంధువులకు తెలియజేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. ప్రేమికులిద్దరూ బతుకుపై బెంగపెట్టుకుని చావుని ఎంచుకున్నారా..? కుటుంబ సభ్యులు ఎవరైనా బెదిరించారా.. అనేది విచారణలో తేలాల్సి ఉంది. చదవండి: (వివాహిత మిస్సింగ్.. కారణం ఆ ముగ్గురు యువకులేనా?) -
పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేమజంట ఆత్మహత్యాయత్నం..
విజయనగరం/సీతానగరం: తమ ప్రేమను పెద్దలు నిరాకరించడంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సీతానగరం మండలం బగ్గందొరవలస గ్రామంలో బుధవారం జరిగిన ఈ సంఘటనపై పార్వతీపురం జిల్లా ఆస్పత్రి ఔట్పోస్టు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఎల్.స్రవంతి ఇంటరీ్మడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఎం.శ్రీను కార్పెంటర్గా పనిచేస్తున్నాడు. వారిద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. స్రవంతి తల్లిదండ్రులు ఆమెకు వేరే పెళ్లి నిశ్చయించారు. ఈ విషయం ప్రేమికుడికి స్రవంతి చెప్పి గ్రామంలోని సచివాలయం వద్దకు రమ్మంది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేక చనిపోదామని నిర్ణయం తీసుకుని పురుగు మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశారు. విషయం గమనించిన శ్రీను సోదరుడు గణపతి ఆటోలో ఇద్దరిని పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించారు. ఈ ఘటనపై ఔట్పోస్టుపోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అనంతపురం జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య
బెళుగుప్ప/ఉరవకొండ(అనంతపురం జిల్లా): బెళుగుప్ప మండల పరిధిలోని జీడిపల్లి రిజర్వాయరులోకి దూకి ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉరవకొండ మండలం వై.రాంపురం గ్రామానికి చెందిన ఎజిత(16), బెళుగుప్ప మండలం దుద్దేకుంట గ్రామానికి చెందిన అజయ్(19) మృతదేహాలను శుక్రవారం సాయంత్రం జీడిపల్లి రిజర్వాయరులో స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. అప్పటికే చీకటి పడడంతో మృతదేహాలను వెలికితీయడం సాధ్యం కాలేదు. శనివారం ఉదయం వెలికితీశారు. మృతుల కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు స్వీకరించి.. సమగ్ర దర్యాప్తు చేపట్టి వివరాలు వెల్లడిస్తామని బెళుగుప్ప ఎస్ఐ రుషేంద్రబాబు తెలిపారు. చదవండి: నా చావుకు కారణం వారే.. పిన్ని వాయిస్ రికార్డ్ బయట పెట్టడంతో.. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఇద్దరూ మైనర్లే.. పెళ్లి ఒప్పుకోలేదని పేమజంట ఆత్మహత్య
సాక్షి, చెన్నై: తమిళనాడులోని వేలూరు జిల్లా గుడియాత్తం సమీపంలోని సొన్నాంకుప్పం గ్రామానికి చెందిన సుధాకర్ కుమార్తె త్రిష(16) అదే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్లస్వన్ చదువుతోంది. అలాగే కీల్ ఆలత్తూరు గ్రామానికి చెందిన పుణ్యకోటి కుమారుడు యశ్వంత్(18) గుడియాత్తంలో పాలిటెక్నిక్ చదువుతున్నాడు. వీరిద్దరూ గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో మంగళవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. వేకువజామున ప్రేమికులు ఇద్దరు గుడియాత్తం సమీపంలోని కావనూరు రైల్వేస్టేషన్ సమీపంలో రైలు పట్టాలపైకి వెళ్లారు. ఆ సమయంలో చెన్నై నుంచి జోలార్పేట వైపు వస్తున్న ఎలగిరి ఎక్స్ప్రెస్ రైలు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన లోకో పైలెట్ జోలార్పేట రైల్వే పోలీసులకు సమాచారం అందజేశారు. రైల్వే పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలి ఆత్మహత్య.. నీవు లేని లోకం నాకొద్దు అంటూ ..
సాక్షి, నవాబుపేట(మహబూబ్నగర్): పెళ్లికి పెద్దలు నిరాకరించారని ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తండావాసుల సమాచారం మేరకు వివరాలిలా.. నవాబుపేట మండలం వెంకటేశ్వరతండా పంచాయతీలోని మామిడిచెట్టుతండాకు చెందిన శాంతి(21) అదే తండా పక్కన ఉన్న కోమటికుంటతండాకు చెందిన శివ(25) ప్రేమించుకున్నారు. అయితే, వీరి పెళ్లికి పెద్దలు అంగీకారం తెలపలేదు. ఇదిలాఉండగా, శాంతి తన తల్లిదండ్రులతో కలిసి ఈనెల 3వ తేదీన పూణె వెళ్లింది. శివ ఇక్కడే ప్రైవేట్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కాగా, తమ పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోరనే బాధతో పూణెలో ఉన్న ప్రియురాలు శాంతి 14వ తేదీ సోమవారం ఉదయం ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలియడంతో.. నీవు లేని లోకం నాకేందుకు అంటూ ప్రియుడు శివ షాద్నగర్ నుంచి తన తండాకు వస్తు మార్గమధ్యలో సువర్ణకూటీర్ వద్ద పురుగుమందు తాగాడు. చదవండి: ఏడేళ్ల క్రితం పెళ్లి.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆలయానికి వెళ్తున్నానని చెప్పి అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని దారిగుండా వెళ్లేవారు చూసి షాద్నగర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. తల్లిదండ్రులు నీలమ్మ, సేవ్యాలకు శివ ఒక్కడే కుమారుడు కావడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. అటు పూణెలో కూతురును కోల్పోయిన పూల్సింగ్, చంద్రమ్మల కుటుంబం రోదనలతో గిరిజన తండాలో విషాదచాయలు అలుముకున్నాయి. చదవండి: చూడకూడనిది చూసిందని.. కన్నకూతురినే.. -
ప్రేమ జంటల విషాదాంతం..
పెళ్లికి పెద్దలు అంగీకరించారు.. ఉగాది తర్వాత పెళ్లి చేస్తామని చెప్పారు.. ఏం జరిగిందో ఏమో గానీ ప్రేమికులిద్దరూ ‘చేయరాని తప్పుచేశాం, సరిదిద్దుకోలేని స్థితిలో ఉన్నాం’అంటూ చెట్టుకు ఉరివేసుకుని తనువు చాలించారు. ఇదీ సంగారెడ్డి జిల్లాలో ప్రేమికుల ఆత్మహత్య ఘటన తీరు. మరోచోట తొలుత పెద్దలు ప్రేమను అంగీకరించలేదు.. కులం ఒకటే అయినా ఆస్తుల అంతరం అడ్డువచ్చింది.. తర్వాత ఇరు కుటుంబాలు పెళ్లికి ఓకే చెప్పాయి. అయితే విషయం ప్రేమికులకు తెలియక బలవన్మరణం చెందారు. ఇదీ కుమురం భీం జిల్లాలో చోటుచేసుకుంది. – మునిపల్లి(అందోల్)/వాంకిడి(ఆసిఫాబాద్) తెలియక.. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. వాంకిడిలోని రాంపూర్ కాలనీకి చెందిన నాగడే శ్రీకాంత్(22), అదే కాలనీకి చెందిన ఎల్ములె గీత(20) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. 3 నెలల క్రితం ప్రేమ విషయాన్ని గీత ఇంట్లో తెలిపింది. కులాలు ఒకటైనా, శ్రీకాంత్ కుటుంబానికి పెద్దగా ఆస్తులు లేకపోవడంతో గీత ఇంట్లో అడ్డుచెప్పారు. దీంతో ప్రేమికులు ఇద్దరు డిసెంబర్ 27న ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. వాంకిడి మండలం అక్నీ గ్రామ శివారులో శ్రీకాంత్ తండ్రి పాండు పత్తి పంట కౌలుకు సాగుచేస్తున్నారు. చేనులో మోదుగ చెట్టుకు శ్రీకాంత్ ఉరేసుకుని ఉండటం, గీత మృతదేహం చెట్టు పక్కనే ఉండటం సమీప రైతులు గమనించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాల నుంచి దుర్గంధం వెలువడుతుండటంతో మూడు రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకుని ఉంటారని ప్రాథమికంగా నిర్ధారించారు. ఇదిలాఉండగా, ప్రేమికులు ఇంటి నుంచి వెళ్లిపోయిన రెండో రోజే పెళ్లి చేసేందుకు ఇరువురి కుటుంబ సభ్యులు పెద్దల సమక్షంలో నిర్ణయించారు. కానీ ప్రేమికులిద్దరి సెల్ఫోన్లు స్విచాఫ్ రావడంతో సమాచారం చేరలేదు. ఇదేక్రమంలో క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ వెల్లడించారు. తప్పు చేశామని.. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. కోహీర్ గ్రామానికి చెందిన బుగ్గుల అమృత(20) సం గారెడ్డి అంబేడ్కర్ స్టడీ సెంటర్లో ల్యాబ్ టెక్నీషియన్గా శిక్షణ తీసుకుంటోంది. మర్పల్లి మండలం సిర్పూర్ గ్రామానికి చెందిన శివ(22) సంగారెడ్డిలోని సిద్ధార్థ పారామెడికల్ కాలేజీ ల్యాబ్లో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరూ ఇళ్లలో తెలుపగా.. పెద్దలు అంగీకరించారు. ఉగాది తర్వాత పెళ్లి చేస్తామని చెప్పారు. క్రిస్మస్ సెలవుల సందర్భంగా అమృత కోహీర్లోని ఇంటికి వచ్చింది. డిసెంబర్ 31న సంగారెడ్డికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. ఏం జరిగిందోగానీ.. జనవరి 2న రాత్రి 7.30 గంటల సమయంలో శివ తన కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఫోన్ చేసి మునిపల్లి మండలం బుదేరా గ్రామ శివారులో సూసైడ్ చేసు కుంటున్నామని తెలిపాడు. కుటుంబ సభ్యులు రాత్రి బుదేరా శివారులో వెతికినా ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం గ్రామ శివారులో ఓ చెట్టుకు ఇద్దరూ వేలాడుతూ కనిపించారు. అమృత తండ్రి అశోక్బాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ‘చేయరాని తప్పు చేశాం, ఆ తప్పును సరిదిద్దుకోలేని స్థితిలో ఉన్నాం.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాం’ అని శివ రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
పెద్దలు పెళ్ళికి నిరాకరించారని ప్రేమ జంట ఆత్మహత్య
సాక్షి, ఆదిలాబాద్: పెద్దలు పెళ్ళికి నిరాకరించారని యువ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. జిల్లాలోని వాంకిడి మండలం రాంనగర్ గ్రామానికి చెందిన నౌగడే శ్రీకాంత్ (22), గీత(19) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల వారి ప్రేమ విషయం ఇంట్లో పెద్దలకు చెప్పి వివాహం చేయమని కోరారు. దీంతో అబ్బాయి ఇంట్లో ఒప్పుకున్నప్పటికి ,గీతా కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. చివరకు ఈ విషయం గ్రామ పెద్దలు వరకు వెళ్లింది. దీంతో ఇరు కుటుంబాల వారికి నచ్చజెప్పి, కొంత సమయం వేచి చూడాల్సిందిగా పెద్దలు చెప్పారు కొన్ని రోజులు వేచి చూసిన శ్రీకాంత్, గీతలు ఇక తమకు వివాహం జరపరని మనస్తాపానికి గురై గత సోమవారం ఇంటి నుంచి వెళ్ళిపోయారు. అయితే సోమవారం పొలం పనుల కోసం అకిని గ్రామ సమీపంలోని పత్తి చేనుకు వెళ్ళిన కూలీలకు ప్రేమ జంట చెట్టుకు ఉరి వేసుకుని శవాలై కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా సంఘటన స్థలానికి చేరుకున్నారు. శవాలు కుళ్ళిన స్థితిలో ఉండటంతో 3 రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: చికిత్స సమయంలో భార్య మృతి చెందిందని డాక్టర్ను షూట్ చేశాడు! -
ప్రియునికి ప్రియురాలి తండ్రి షరతు.. లాడ్జ్లో రూం తీసుకొని..
మైసూరు: పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని విరక్తి చెందిన ప్రేమికులు ఉరి వేసుకుని తనువు చాలించారు. ఈ విషాద ఘటన మైసూరులో జరిగింది. చామరాజనగర జిల్లా గుండ్లుపేట తాలూకా బొమ్మలాపుర గ్రామానికి చెందిన బీజీ సతీశ్ (21), వరలక్ష్మి (20) అనే ఇద్దరు మృతులు. వీరు గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సతీశ్తో పెళ్లికి వరలక్ష్మి కుటుంబం అంగీకరించలేదు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన తర్వాతనే తమ కూతురును ఇచ్చి పెళ్లి చేస్తామని తెలిపారు. బీఏ చదివిన సతీశ్ పోలీసు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. యువతి నర్సింగ్ చదువుతోంది. కాగా, సతీశ్ మరోసారి పెళ్లి ప్రస్తావన తీసుకురాగా, మొదట ఉద్యోగం తెచ్చుకో అని ప్రియురాలి తండ్రి సిద్ధలింగ తేల్చి చెప్పడంతో ప్రేమ జంట మనస్తాపానికి గురైంది. మైసూరుకు వచ్చిన జంట మంగళవారం సాయంత్రం లాడ్జ్లో రూం తీసుకున్నారు. బుధవారం ఉదయం ఎంతకీ బయటకు రాకపోవడంతో సిబ్బంది కిటికీ నుంచి చూడగా గదిలో కొక్కీకి ఉరి వేసుకుని చనిపోయి ఉన్నారు. లాడ్జ్ యజమాని లష్కర్ ఏరియా పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: (జైళ్లో నేత్ర.. నిర్మానుష్య బంగ్లాలో చోరీ) నదిలో దూకిన మరో ప్రేమజంట మైసూరు: తమ ప్రేమను ఇంట్లో పెద్దవాళ్లు అంగీకరించలేదని ప్రేమజంట కపిలా నదిలోకి దూకింది. నంజనగూడు తాలూకా ముడికట్టె వద్ద జరిగింది. చామరాజనగర జిల్లా సోమవారపేట గ్రామ నివాసి అభి (19), చామరాజనగరకు చెందిన 17 ఏళ్ల బాలిక ప్రేమించుకున్నారు. బాలిక కాలేజీలో చదువుకుంటుండగా, అభి పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడు. వీరి ప్రేమను తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. బుద్ధిగా ఉండాలని మందలించారు. దీంతో యువ జంట ఆవేదనకు గురై కపిలా నదిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించారు. నదిలో తెప్పలు నడుపుతున్నవారు ప్రేమ జంటను రక్షించడంతో గండం తప్పింది. ఇద్దరిని నంజనగూడు ఆస్పత్రిలో చేర్పించారు. పట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయింది. -
Chanda Nagar: యువతి ఆత్మహత్య కేసులో షాకింగ్ ట్విస్ట్..
సాక్షి, చందానగర్: చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 25వ తేదీన యువతి ఆత్మహత్య కేసులో అనేక విషయాలు బయటపడుతున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కరవిడికి చెందిన నాగచైతన్య(24) ఆదివారం హత్యకు గురైన విషయం తెలిసిందే. ప్రియుడు గుంటూరు జిల్లా రెంటచింతలకు చెందిన కోటిరెడ్డి(29) ప్రియురాలిని హత్య చేసి సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారు. చదవండి: ఒంగోలు ఆస్పత్రిలో ప్రేమ..హైదరాబాద్కి వచ్చి కత్తితో పొడుచుకుని.. కేసును క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులకు అనేక విషయాలు తెలిశాయి. ఒంగోలులోని జిన్స్ హాస్పిటల్లో నాగచైతన్య నర్సు. అక్కడే కోటిరెడ్డి మేనేజర్గా పనిచేసేవాడు. వీరిద్దరి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. నాగచైతన్య తనను వివాహం చేసుకోవాల్సిందిగా కోటిరెడ్డిపై ఒత్తిడి తీసుకొచ్చింది. ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని కోటిరెడ్డి ప్లాన్ వేశాడు. 23వ తేదీ ఉదయం సిటిజన్ ఆస్పత్రి వరకు వచ్చిన అతను సాయంత్రం వరకు అక్కడే ఉండి నాగచైతన్యను ఎస్వీఆర్ గ్రాండ్ హోటల్లోని ఓయో రూమ్కు తీసుకెళ్లాడు. చదవండి: ‘సంబంధం’ పెట్టుకుని.. సస్పెండయ్యారు! ఓడ్కా తాగి రాత్రి అక్కడే బస చేసిన అతను స్విగ్గీలో ఇద్దరికీ భోజనం ఆర్డర్ చేశాడు. 24 తేదీ ఉదయం 11 గంటలకు హోటల్ గదికి తాళం వేసి బయటకు వెళ్లిపోయాడు. రాత్రి 10.30 గంటల సమయంలో ఒంగోలులోని ఓ ఆస్పత్రిలో చేరాడు. అతను నాగచైతన్యను హత్య చేసి ట్రైన్లో ఒంగోలుకు చేరుకున్నట్లు తెలిసింది. అనంతరం రాత్రి 11 గంటల సమయంలో హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చి తలుపులు తెరిచి చూడగా నాగచైతన్య రక్తపు మడుగులో మృతి చెందింది. కత్తి, తాడు కొనుగోలు.. 23న నగరానికి వచ్చిన కోటిరెడ్డి ఓ సూపర్ మార్కెట్లో కత్తి, తాడు కొనుగోలు చేశాడు. ఓయో రూమ్కు తీసుకెళ్లిన కోటిరెడ్డి ముందుగానే ఓడ్కా బాటిల్, కత్తి, తాడు తన బ్యాగ్లో తీసుకెళ్లాడు. రూమ్కు వెళ్లిన కొద్ది సేపటికే బయటకు వెళ్లి కూల్డ్రింక్స్ తీసుకొచ్చాడు. స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేశాడు. స్విగ్గీ బాయ్ నుంచి ఫుడ్ డెలివరీ తీసుకున్న అతను రూమ్లోకి వెళ్లి మరుసటి రోజు ఉదయం వరకు బయటకు రాలేదు. దీంతో పోలీసులు బలమైన ఆధారాలు సేకరించారు. రాత్రి ఇరువురు ఓడ్కా సేవించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడయ్యింది. అనంతరం వివాహం విషయంలో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకొని ఉంటుందని ఆ క్రమంలోనే ప్రియురాలిని కత్తితో గొంతుకోసి హత్య చేసి ఉంటాడని ప్రాథమిక సాక్ష్యాధారాలను బట్టి తెలుస్తోంది. అనంతరం ఫ్యాన్కు ఉరి వేసేందుకు చున్నీ ప్రయత్నించి ఉంటాడని పోలీసులు వెల్లడించారు. కులాంతరమే హత్యకు కారణమా? కోటిరెడ్డి రెడ్డి సామాజిక వర్గం కావడంతోనే నాగచైతన్యను వివాహం చేసుకునేందుకు అతడి కుటుంబ సభ్యులు నిరాకరించి ఉంటారని తెలుస్తోంది. దళిత కులానికి చెందిన యువతి కావడంతో కోటిరెడ్డి హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపడుతున్నారు. కాగా ఒంగోలుకు వెళ్లిన సిటీ పోలీసులు అతడిని అరెస్టు చేసి హైదరాబాద్కు తరలిస్తున్నారు. -
బ్యారేజ్లోకి దూకి ప్రేమజంట ఆత్మహత్య
సాక్షి, విజయనగరం: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గరుగుబిల్లి మండలం తోటపల్లి బ్యారేజ్లోకి దూకి ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు బొబ్బిలికి చెందిన రాకేష్, కురుపాంకు చెందిన బాలికగా పోలీసులు భావిస్తున్నారు. తమ చావుకు తన బావ మౌళి అనే వ్యక్తే కారణమంటూ ఆ బాలిక వాట్సాప్ స్టేటస్ పెట్టినట్లు తెలిసింది. బ్యారేజీలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి: తిరుపతి: వివాహిత హత్య కేసులో పురోగతి.. ఆన్లైన్ క్లాస్లోకి హ్యాకర్.. పోర్న్ వీడియోలతో రచ్చ -
నవ జంట ఆత్మహత్య.. మొదటి భర్త అండమాన్లో..
సాక్షి, గాజువాక (విశాఖపట్నం): ప్రేమ వ్యవహారం మూడు నిండు ప్రాణాలను బలి తీసుకొంది. తన భార్య మరో వ్యక్తితో పెళ్లికి సిద్ధమైందని తెలుసుకున్న భర్త మనస్తాపంతో నాలుగు రోజుల కిందట ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా ఆ వివాహిత ప్రేమించి పెళ్లాడిన భర్త (ప్రియుడు)తో కలిసి ఆత్మహత్య చేసుకుంది. స్థానిక సుందరయ్య కాలనీదరి దుర్గానగర్లో శుక్రవారం చోటుచేసుకున్న ఈ సంఘటనపై సౌత్ ఏసీపీ జి.ఆర్.రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పరవాడ మండలం పి.బోనంగి గ్రామానికి చెందిన మోటూరి నాగిణి (24) అదే గ్రామానికి చెందిన బోకం అవినాష్ (28)ను ప్రేమించింది. అయితే ఆమె తల్లిదండ్రులు పాపారావు అనే వ్యక్తికి ఇచ్చి ఐదేళ్ల కిందట వివాహం జరిపించారు. అనంతరం ఉపాధి కోసం పాపారావు తన భార్యతో కలిసి అండమాన్ వెళ్లిపోయాడు. అక్కడే ఓ ప్రైవేట్ కంపెనీలో ఎలక్ట్రిషియన్గా పని చేస్తూ నివాసముంటున్నాడు. వాళ్ల కాపురం నాలుగేళ్లపాటు సాఫీగానే సాగింది. అయితే బోనంగిలోని తమ పుట్టింటికి నాగిణి అండమాన్నుంచి వచ్చింది. పెళ్లికి ముందే ప్రేమించిన అవినాష్తో చనువుగా తిరుగుతోంది. ఈ క్రమంలో నాగిణిని అండమాన్ పంపేందుకు ఆమె తల్లిదండ్రులు రెండుసార్లు టికెట్లు తీసినా వెళ్లలేదు. తన భార్యకు అవినాష్కు మళ్లీ సంబంధం ఏర్పడిందన్న విషయం తెలుసుకున్న పాపారావు తీవ్ర మనస్తాపానికి గురై నాలుగు రోజుల కిందట ఆత్మహత్య చేసుకొన్నాడు. చదవండి: (విషాదం: పోలీస్ దంపతుల ఆత్మహత్య) ఇదిలా ఉండగా, నాగిణి, అవినాష్లు ఈనెల 16న ఇంటినుంచి బయటకు వెళ్లిపోయారు. రాత్రి గస్తీ నిర్వహిస్తున్న పోలీసులకు వారు పరవాడ దరి వాంబేకాలనీలో కనిపించడంతో పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి కౌన్సెలింగ్ నిర్వహించారు. అయినప్పటికీ గురువారం ఉదయం కశింకోటలోని దుర్గా గుడిలో వివాహం చేసుకొని అవినాష్ ఇంటికి వెళ్లారు. అతడి తల్లిదండ్రులు ఈ వివాహాన్ని అంగీకరించకపోవడంతో ఇక్కడి దుర్గానగర్లోని తమ బంధువుల ఇంటికి వచ్చారు. శ్రీనగర్లో ఇల్లు అద్దెకు తీసుకుంటున్నామని, ఇక్కడే కాపురముంటామని చెప్పిన వారిద్దరూ ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. భార్యాభర్తలమని ఇంటి యజమానికి చెప్పి ఆ ఇంటికి అడ్వాన్స్ చెల్లించారు. రెండు రోజుల్లో సామగ్రి తెచ్చుకుంటామని ఇంట్లో దిగారు. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలు దాటుతున్నా తలుపులు తెరవకపోవడంతో ఇంటి యజమాని వెళ్లి చూశాడు. ఇద్దరూ ఆ ఇంట్లో ఫ్యాన్ హుక్కు ఉరి పోసుకొని కనిపించడంతో గాజువాక పోలీసులకు సమాచారం అందించాడు. ఈ విషయం తెలుసుకున్న నాగిణి తల్లిదండ్రులు సంఘటనా స్థలంలో తమ బిడ్డ నిర్జీవంగా ఉండడం చూసి బోరున విలపించారు. చదవండి: (పెళ్లయినా మరదలిపై కన్నేసి.. ఎంత పనిచేశాడంటే..!) సమాచారం అందుకున్న సౌత్ ఏసీపీ జి.ఆర్.రెడ్డి, గాజువాక సీఐ మల్లీశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రాథమిక విచారణ నిర్వహించారు. కుటుంబ సభ్యుల నిరాకరణ, భర్త ఆత్మహత్య చేసుకున్నాడన్న మనస్తాపమో, మరేదైనా కారణం చేతనో వారు ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని ఏసీపీ పేర్కొన్నారు. పూర్తిస్థాయి విచారణలో వాస్తవాలు తెలుస్తాయన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కేజీహెచ్కు తరలించారు. కాగా, మృతుల గదిలో సూసైడ్ నోట్ లభించింది. తమ చావుకు ఎవరూ కారణం కాదని, తమ ప్రేమను కాదంటున్నారనే కారణంతోనే ఆత్మహత్య చేసుకొంటున్నామని ఆ లేఖలో పేర్కొన్నట్టు ఏసీపీ తెలిపారు. తమ మృతదేహాలను ఒకేచోట ఖననం చేయాలని వారు ఆ లేఖలో కోరారు. చదవండి: (మా చావుకు అమ్మే కారణం.. ఎప్పటికీ క్షమించను) -
పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని..
మునగాల/చివ్వెంల: కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోరని ఓ ప్రేమజంట అర్ధంతరంగా ఆయుష్షు తీసుకుంది. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం చందుపట్లకు చెందిన ఆ ప్రేమికులు మునగాల మండలంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. చందుపట్ల గ్రామానికి చెందిన ఓర్సు అంజయ్య కుమారుడు నవీన్ (21) ఇంటర్మీడియెట్ పూర్తి చేశాడు. ప్రస్తుతం గ్రామ శివారులోని కోళ్ల ఫారంలో కూలి పనిచేస్తూ ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన పదో తరగతి చదువుతున్న బాలిక (16)తో నవీన్కు ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు ఆరు నెలలుగా ప్రేమాయణం సాగిస్తున్నారు. పది రోజుల క్రితం వీరి ప్రేమ విషయం ఇరు కుటుంబ సభ్యులకు తెలియడంతో మందలించారు. నాటి నుంచి ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. రాత్రి బైక్పై బయలుదేరి..: ఇక ఇద్దరి కులాలు వేరు కావడంతో తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోరని భావించిన ఆ ప్రేమికులు గురువారం రాత్రి 10 గంటల సమయంలో బైక్పై గ్రామం నుంచి బయలుదేరారు. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి మీదుగా మునగాల మండలం మొద్దులచెరువు స్టేజీ నుంచి రేపాల గ్రామానికి వెళ్లే రహదారికి వంద మీటర్ల దూరంలో ఉన్న ఓ వేపచెట్టు వద్దకు చేరుకున్నారు. వెంట తెచ్చుకున్న చీరతో చెట్టు కొమ్మకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం తెల్లవారు జామున రహదారిపై వెళ్తున్న కొందరు స్థానికులు చెట్టుకు వేలాడుతున్న మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. మునగాల ఎస్ఐ సత్యనారాయణ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని బైక్ నంబర్ ఆధారంగా ముందు మృతుడు నవీన్ అడ్రస్ను గుర్తించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. స్థానికుల సాయంతో మృతదేహాలను కిందికి దించి పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానిక వీఆర్ఓ వీరారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. -
వివాహానికి నిరాకరించారని..
నిజామాబాద్అర్బన్/ఎడపల్లి: ప్రేమ వివాహానికి పెద్దలు ఒప్పుకోవడం లేదని మనస్తాపం చెందిన ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఒకరు మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. బోధన్ పట్టణానికి చెందిన నవనీత (19) డిగ్రీ పూర్తి చేసి ఇంటివద్దే ఉంటోంది. అయితే, ఆమె పాఠశాలలో చదువుకునే సమయంలో తనతో పాటే చదివే మోహన్ (20)తో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. మోహన్ కుటుంబం జీవనోపాధి కోసం చాలా రోజుల క్రితమే వలస వెళ్లింది. అయినప్పటికీ వారిద్దరూ తరచూ కలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారు ప్రేమ వివాహం చేసుకోవాలని ఇంట్లో వారికి చెప్పగా కుటుంబాలకు చెందిన పెద్దలు నిరాకరించారు. దీంతో మనస్తాపం చెందిన నవనీత, మోహన్ ఆదివారం అలీసాగర్ ఉద్యాన వనానికి చేరుకుని, కూల్డ్రింక్లో పురుగుల మందు కలుపుకొని తాగారు. గమనించిన స్థానికులు పోలీసుల సాయంతో వారిరువురినీ నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించగా, నవనీత అప్పటికే మృతి చెందింది. మోహన్ పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసర విభాగంలో వైద్య చికిత్స అందిస్తున్నారు. -
విషం తాగి ప్రేమజంట ఆత్మహత్య
అన్నానగర్: కావేరి తీరంలో విషం తాగి ప్రేమ జంట గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. తిరుచ్చి పుత్తూర్ విషంకుళం వీధికి చెందిన రాజా కుమారుడు రమేష్ (31). సొంతంగా కారు నడుపుతున్నాడు. ఈయన తెన్నూరు ఇలాంతోప్పు ప్రాంతానికి చెందిన కావ్య (23)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహం గత మార్చిలో జరిగింది. వీరికి ఏడు నెలల వయస్సుగల కుమారుడు ఉన్నాడు. రమేష్ ఓ యువతితో తిరుచ్చిపుత్తరసన నల్లూరు సమీపంలో ఉన్న కావేరి తీరానికి కారులో వచ్చాడు. ఆమెతో చాలాసేపు మాట్లాడాడు. తర్వాత వారు బాటిల్లో తెచ్చుకున్న విషాన్ని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అక్కడ స్నానం చేస్తున్న వారు జియాపురం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని చూడగా అప్పటికే వారు మృతి చెందినట్టు తెలిసింది. తిరుచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి పంచనామా నిమిత్తం తరలించారు. తర్వాత పోలీసులు కారులో తనిఖీలు చేయగా అందులో రెండు సెల్ఫోన్లు ఉన్నాయి. వాటిని, కారును స్వాధీనం చేసుకునారు. విచారణలో రమేష్తో పాటు ఆత్మహత్య చేసుకుంది తిరుచ్చి తెన్నూర్ సంగీత పురానికి చెందిన అంతోని కుమార్తె రీనా (18) అని తెలిసింది. ఆమె పుత్తూరులో ఉన్న ప్రైవేటు వైద్య కళాశాలలో మొదటి సంవత్సరం నర్సింగ్ చేస్తున్నట్టు కనుగొన్నారు. అదే సమయంలో రమేష్ కారులో వచ్చి వెళుతున్న సమయంలో వారి మధ్య ప్రేమ చిగురించింది. అయితే వారి ఆత్మహత్యకు గల కారణం తెలియలేదు. వీరి అక్రమ సంబంధం కుటుంబీకులకు తెలియడంతో ఆత్మహత్య చేసుకున్నారా, వేరే కారణమా..? అనే కోణంలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. -
ఒకేరోజు రెండు ప్రేమ జంటల ఆత్మహత్య
ఒకే రోజు రెండు ప్రేమజంటలు ఆత్మహత్యకు పాల్పడ్డాయి. ఈ హృదయ విదారక ఘటనలు రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్నాయి. కుటుంబ సభ్యులు మందలించారన్న బాధతో ఇరు జంటలు బలవన్మరణానికి పాల్పడ్డాయి. – షాబాద్, కేశంపేట ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని.. షాబాద్ మండలం లింగారెడ్డిగూడకు చెందిన కర్రె పల్లవి (19), పోచమోళ్ల మహేందర్ (21) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సంవత్సరం కిందట వీరిద్దరూ శంషాబాద్లో కలసి ఉండటాన్ని గమనించిన పల్లవి కుటుంబసభ్యులు మహేందర్ కుటుంబీకులను మందలించారు. అప్పుడే శంషాబాద్ పోలీసుస్టేషన్లోనూ ఫిర్యాదుచేశారు. పల్లవికి పెళ్లి సంబంధం చూడగా.. తనకు పెళ్లి ఇష్టం లేదని పల్లవి చెప్పింది. దీంతో పల్లవి, మహేందర్లు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆదివారం అర్ధరాత్రి ఇద్దరూ గ్రామ సమీపంలోని ఓ వ్యవసాయ బావి వద్దకు వెళ్లి, అక్కడ మామిడి చెట్టుకు పల్లవి చున్నితో ఇద్దరూ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం ఉదయం తన పొలానికి వెళ్తున్న స్వరూప అనే మహిళ వీరిని గమనించి గ్రామస్తులకు సమాచారం ఇచ్చింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహేందర్ పని మానేసి ఇంటి వద్దే ఉంటుండగా.. పల్లవి కుట్టు శిక్షణా కేంద్రంలో శిక్షణ తీసుకుంటోంది. కులాలు వేరు కావడంతో.. కలసి జీవించాలనుకున్నారు. అందుకు పెద్దలు అడ్డు చెప్పారు. దీంతో కేశంపేట మండల పరిధిలోని తొమ్మిదిరేకులకు చెందిన నాగిళ్ల శ్రీరాములు(23) డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గ్రామానికి చెందిన బత్తిని సుశీల (18) పదో తరగతి వరకు చదివి గ్రామంలో కూలీ పనులకు వెళ్తోంది. వీరిద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం సుశీల కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో వారు సుశీలను నీలదీశారు. కులాలు వేరు కావడంతో వారు పెళ్లికి నిరాకరించినట్లు తెలిసింది. దీంతో సుశీల ఇంట్లోనే ఆదివారం రాత్రి చీరతో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సుశీల మృతి విషయం తెలుసుకున్న శ్రీరాములు గ్రామలోని మర్రిచెట్టు వద్దకు వెళ్లి తన స్నేహితుడికి ఫోన్ చేశాడు. తన ప్రేమికురాలు మరణించిందని, అందుకే తానూ చనిపోతున్నట్లు చెప్పి తమ వ్యవసాయ భూమి లోని మర్రిచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
జిల్లాలో రెండు ప్రేమజంటల ఆత్మహత్య..
సాక్షి, హైదరాబాద్: జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో రెండు ప్రేమజంటలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాయి. వివరాలు.. కేశంపేట మండలంలోని తొమ్మిదిరేకుల గ్రామానికి చెందిన నాగిళ్ల శ్రీరామ్(21), సుశీల(18) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే విషయం తెలిసిన అమ్మాయి తల్లిదండ్రులు సుశీలను మందలించారు. దీంతో ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రియురాలు చనిపోయిన విషయం తెలిసిన శ్రీరామ్ మనస్థాపంతో పొలానికి వెళ్లి అక్కడి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెద్దలు వద్దన్నారని... రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ మండలం లింగారెడ్డిగూడకు చెందిన పోచమొల్ల మహేందర్(21), కర్రోళ్ల పల్లవి(19) ప్రేమించుకున్నారు. కలిసి జీవించాలని ఎన్నో కలలు కన్నారు. కానీ వీరి ప్రేమకు పెద్దలు ఒప్పుకోరన్న భయంతో సోమవారం ఒకే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమజంట మృతి
సాక్షి, తాండూర్(బెల్లంపల్లి): ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రేమజంట ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం మృతి చెందారు. వివరాలలోకి వెళితే.. బెజ్జూరు మండలం లంబాడితండా పరిధిలోని బొగుడ గూడ గ్రామానికి చెందిన గోమాస జీవన్ (35), తాండూర్ మండలం కాసిపేట గ్రామానికి చెందిన ఏల్పుల గౌరు(29) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. సామాజిక వర్గాలు వేరు కావడంతో ఇరు కుటుంబాలు అంగీకరించకపోవచ్చని బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్నేహితులు మంచిర్యాల ఆస్పత్రిలో చేర్పించగా మెరుగైన వైద్యం కోసం కరీంనగర్కు తరలిం చారు. వేర్వేరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం మృతి చెందిన సీఐ సామల ఉపేందర్ తెలిపారు. -
రైలుకు ఎదురుగా వెళ్లి ప్రేమజంట ఆత్మహత్య
సాక్షి, చెన్నై : తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదన్న వేదనతో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు ఒకరి చేతులు మరొకరు పట్టుకుని అతి వేగంగా దూసుకొచ్చిన రామేశ్వరం ఎక్స్ప్రెస్ రైలుకు ఎదురుగా వెళ్లి బలన్మరణానికి పాల్పడ్డారు. బన్రూటిలో చోటు చేసుకున్న ఈ ఘటన రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కడలూరు జిల్లా బన్రూటి సమీపంలోని కొట్లాంబాక్కం గ్రామానికి చెందిన ఆదిమూలం కుమారుడు మారి అలియాస్ మదన్(22). ఇతను మెకానిక్గా ఓ షెడ్డులో పనిచేస్తున్నాడు. తోరపాటి గ్రామానికి చెందిన పాండురంగన్ కుమార్తె స్వాతి అలియాస్ శ్వేతను మదన్ ప్రేమిస్తున్నాడు. రెండు కుటుంబాల మధ్య బంధుత్వం ఉండటంతో తరచూ శ్వేత ఇంటికి సైతం మదన్ వెళ్లి వచ్చేవాడు. అంతే కాదు, నర్సింగ్ చదువుతున్న స్వేతను సాయంత్రం వేళల్లో తన మోటార్ సైకిల్ మీద ఇంటికి తీసుకెళ్లి మరీ దిగబెట్టి వచ్చేవాడు. ఈ ఇద్దరు ప్రేమించుకున్న విషయం కుటుంబీకులకు తొలుత తెలియదు. అయితే, తమ ప్రేమను కుటుంబీకులు అంగీకరిస్తారా..? అన్న ఆందోళన వీరిని వెంటాడుతూ వచ్చింది. ఏడాది కాలంగా ప్రేమించుకుంటూ వచ్చిన ఈ జంట తాము జీవితంలో ఒక్కటయ్యేది అనుమానమే అన్న నిర్ణయానికి వచ్చేసినట్టుంది. ఎట్టకేలకు ధైర్యం చేసి కుటుంబీకుల దృష్టికి తీసుకెళ్లినా, వారు అంగీకరించక పోవడంతో బలన్మరణానికి సిద్ధపడ్డారు. ఈ పరిస్థితుల్లో సోమవారం కళాశాలకు వెళ్లిన శ్వేత తిరిగి ఇంటికి రాలేదు. అయితే, ఆమె చదువుకుంటున్న కళాశాల ఆస్పత్రిలో ట్రైనింగ్ నిమిత్తం చేరి ఉండటంతో అప్పుడప్పడు రాత్రుల్లో ఇంటికి వచ్చేది కాదు. దీంతో తల్లిదండ్రులు ఆస్పత్రి విధులకు వెళ్లి ఉంటుందని భావించారు. పట్టాలపై మృతదేహం..... మంగళవారం ఉదయం శ్వేత, మదన్ల మృత దేహాలు రైల్వే ట్రాక్ వద్ద పడి ఉన్నట్టుగా సమాచారం అందుకున్న రెండు కుటుంబాలు శోక సంద్రంలో మునిగాయి. అస్సలు ఏంజరిగిందోననే ఆందోళనతో కుటుంబీకులు పరుగులు తీశారు. అయితే, ఈ ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు నిర్ధారించారు. అర్థరాత్రి సమీపంలో చెన్నై నుంచి రామేశ్వరం వైపుగా వెళ్లిన ఎక్స్ప్రెస్ రైలు డ్రైవర్ ఇచ్చిన సమాచారం ఆత్మహత్యగా పోలీసులు కేసు నమోదు చేశారు. రైలు కనిచ్చ పాక్కం రైల్వే గేట్ సమీపిస్తున్న సమయంలో అతి వేగంగా దూసుకొస్తున్న రామేశ్వరం ఎక్స్ప్రెస్ ముందుగా ఒకరి చేతులు మరొకరు పట్టుకుని ఓ జంట ఎదురు వచ్చినట్టు , హారన్ కొట్టినా, వేగం తగ్గించే యత్నం చేసినా ఫలితం లేదని తిరుపాతి పులియూర్ రైల్వే పోలీసులకు ఆ డ్రైవర్ సమాచారం అందించి వెళ్లాడు. రైలు అతి వేగంగా వచ్చిన దృష్ట్యా, ఆ ఇద్దరి మృత దేహాలు చిద్రం అయ్యాయి. మృత దేహాల్ని కడలూరు ఆస్పత్రి మార్చురికి పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు తరలించారు. ఈ ఘటన ఆయా కుటుంబాలు, గ్రామాల్లో విషాదాన్ని నింపింది. -
పెళ్ళై పిల్లలున్నా ప్రేమను మరువలేక..
కర్ణాటక, తుమకూరు: ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు, కానీ విధి నాటకంలో ఇద్దరూ వేర్వేరయ్యారు. అయినా ప్రేమను మరచిపోలేక కలిసి తనువు చాలించారు. చెట్టుకు ఉరేసుకొని ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం జిల్లాలోని పావగడ తాలూకాలో చోటు చేసుకుంది. శిరా తాలూకా క్యాదిగుంట గ్రామానికి చెందిన మంజునాథ (35) అదే గ్రామానికి చెందిన అశ్విని (30) ఎంతోకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే కొన్నేళ్లక్రితం ఇరువురికి వేరేవారితో పెళ్లయింది. సంతానం కూడా కలిగారు. మంజునాథ భార్య మరొక వ్యక్తితో సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టింది. దీంతో అతడు తీవ్రంగా కలత చెందాడు. తన ప్రియురాలికి విషయం చెప్పి ఇద్దరు కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ప్రేమికులు ఆదివారం రాత్రి పావగడ తాలూకా నిడగల్ గ్రామ సమీపంలో ఒకే చీరతో చెట్టు కొమ్మకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామస్థులు సమాచారం అందించడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
కలిసి బతకలేమని.. కలిసి ఆత్మహత్య
కర్ణాటక, కెలమంగలం: ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు, కానీ పెద్దలు అంగీకరించలేదు. విడిపోవడం ఇష్టలేక మరణంలోనైనా కలిసుందామని తీర్మానించుకుని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుందో యువ జంట. ఈ సంఘటన కెలమంగలం సమీపంలో చోటు చేసుకొంది. హొసూరు– కెలమంగలం రైలురోడ్డుపై కారుగొండపల్లి వద్ద యువతీ, యువకుడు రైలు క్రిందపడి ఆత్మహత్య చేసుకొన్నట్లు హొసూరు రైల్వే పోలీసులకు సమాచారం అందింది. ఆ మేరకు రైల్వే పోలీసులు ఘటనా స్థలానికెళ్లి మృతదేహాలను స్వాధీనపరుచుకొని శవపరీక్ష కోసం హొసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారించగా హొసూరు సమీపంలోని పేరండపల్లి – బేరికె రోడ్డులోని రామచంద్రం గ్రామానికి చెందిన యల్లేష్, జ్యోతిగా తెలిసింది. అమ్మాయి తల్లిదండ్రులు నిరాకరించారని మునిరాజు కొడుకు యల్లేష్ (25) లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన క్రిష్ణప్ప కూతురు జ్యోతి(21) డిగ్రీ ముగించి ఇంట్లోనే ఉంటుంది. ఇరువురూ ఒకే కులానికి చెందినవారు. గత రెండేళ్లుగా ప్రేమించుకొన్నారు. యల్లేష్ లారీ డ్రైవర్గా పనిచేయడం ఇష్టంలేని జ్యోతి తల్లిదండ్రులు వీరి వివాహానికి అడ్డపడ్డారు. దీంతో ప్రేమజంట భయానక నిర్ణయం తీసుకుంది. ఆదివారం రాత్రి ఇరువురూ ద్విచక్రవాహనంలో కెలమంగలం వైపు వెళ్లారు. రాత్రి కారుగొండపల్లి వద్ద రైల్వే ట్రాక్ ప్రక్కన ద్విచక్రవాహనాన్ని నిలిపి కుర్లా ఎక్స్ప్రెస్ రైలు కిందపడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాలు ముక్కలయ్యాయి. ఈ సంఘటన జిల్లా అంతటా సంచలనం సృష్టించింది. -
పురుగుల మందు తాగినీటి గుంటలో పడి..
కర్ణాటక, యశవంతపుర : ప్రేమ పెళ్లిని పెద్దలు ఒప్పుకోరని భావించిన ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన కోళ్లేగాల గ్రామాంతర పోలీసుస్టేషన్లో జరిగింది. తాలూకా ఉగని గ్రామానికి చెందిన కిరణ్ (23), సంగీతా(17)లు పురుగుల మందు తాగి సమీపంలో నీటి గుంటలో పడి ఆత్మహత్య చేసుకున్నారు. పట్టణంలోని ఎస్వీకే కాలేజీలో పీయూసీ చదువుతున్న సంగీతను ఏడాది నుండి ప్రేమిస్తున్నాడు. ఈ విషయం రెండు వైపుల వారికి తెలుసు. ఇద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. ఇదే విషయంపై కిరణ్ తన తండ్రి నాగరాజు వద్ద కూడా చర్చించారు. అయితే తనకు ఇష్టంలేదని తెల్చి చేప్పేశాడు. సంగీతకు పెళ్లి ఈడు లేకపోవటంతో నాగరాజు పెళ్లికి నిరాకరించారు. సంగీతతో పెళ్లి చేయకంటే తన శవం చూడాల్సి ఉంటుందని కిరణ్ తండ్రిని బెదిరించి ఇంటి నుండి వెళ్లి పోయాడు. ప్రేమికులద్దరూ కొళ్లేగాలకు వెళ్లి క్రిమినాశక మందును భోజనంలో కలుపకుని తిని సమీపంలోని గవివరదరాజస్వామి కొండకు వెళ్లారు. అక్కడ ఇద్దరు మృతి చెందారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
ప్రేమను పెద్దలు అంగీకరించలేదని..
సాక్షి, అడ్డతీగల(తూర్పు గోదావరి) : ప్రేమ వ్యవహారం ఇద్దరు యువతీ యువకుల ప్రాణాలను తీసింది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డాక.. పెద్దలు వారి ప్రేమ వివాహానికి అంగీకరించరనే అనుమానంతో ఇద్దరూ ఒకరి తరువాత ఒకరు పురుగు మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు. అడ్డతీగల మండలం డి.భీమవరంలో చోటు చేసుకున్న ఈ సంఘటనపై స్థానిక పోలీసుల కథనమిది.. డి.భీమవరానికి చెందిన చెక్కాలింగేశ్వరరెడ్డి(20), మాకారపు సంధ్య భార్గవి(19) ఇద్దరూ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ వ్యవహారం తెలిసిన పెద్దలు మందలించి కులాల వేర్వేరు కావడంతో వివాహం కుదరదని చెప్పి ముందు చదువులపై దృష్టి సారించమని చెప్పారంటున్నారు. అయినా ఇద్దరు ప్రేమ కొనసాగించడంతో ఆఖరికి పెద్దలు వివాహం చేయడానికి చూస్తామని చదువులు పూర్తి చేయమని ఇరువురికి హామీ ఇచ్చారు. నమ్మకం కలగని వీరిద్దరూ పెద్దలను బెదిరించి తమ దారికి తెచ్చుకుందామని తలచి ఈనెల 15న మండలంలోని పింజరికొండకు వెళ్లి వారి వెంట తీసుకువెళ్లిన పురుగు మందును తొలుత సంధ్య భార్గవి తాగింది. అపస్మారక స్థితికి చేరిన ఆమెను లింగేశ్వరరెడ్డి అక్కడి స్థానికుల సహాయంతో అడ్డతీగల సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అదే రోజు మెరుగైన వైద్యం కోసం కాకినాడ రిఫర్ చేయగా.. అక్కడ చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం ఆమె మరణించింది. ఈ విషయం తెలిసిన చెక్కా లింగేశ్వరరెడ్డి పింజరికొండ చేరుకుని అక్కడ దాచిపెట్టిన పురుగు మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోవడంతో స్థానిక గిరిజనులు గమనించి అడ్డతీగల సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. లింగేశ్వరరెడ్డి చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయాడు. అడ్డతీగల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమజంట విషాదాంతం
కొండపాక(గజ్వేల్): కలిసి జీవితం పంచుకుదామన్న ఆ ప్రేమజంటకు కులాలు అడ్డుగా మారాయి. దీంతో మనస్తాపానికి గురైన ప్రేమికులు మంజ కనకయ్య(21), రాచకొండ తార (19)లు తాము చదువుకున్న పాఠశాలలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ హృదయ విధారక సంఘటన సిద్దిపేట జిల్లాలోని కొండపాక మండలం లకుడారం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి కుకునూరుపల్లి ఎస్సై పరమేశ్వర్ కథనం ప్రకారం.. లకుడారం గ్రామానికి చెందిన మంజ మల్లయ్య–నర్సవ్వలకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు మంజ కనకయ్య. అదే గ్రామానికి చెందిన రాచకొండ మడేలు–రేణుకలకు ముగ్గురు కుమార్తెలు కాగా రెండో కుమార్తె రాచకొండ తార. కనుకయ్య, తార చిన్నప్పటి నుంచి ఒకే తరగతి చదువుతూ వచ్చారని తెలిపారు. 2016–17 సంవత్సరంలో పది పరీక్షల్లో కనకయ్య ఫెయిల్ అవ్వగా తార ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ఈ క్రమంలో వారి ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు తెలియడంతో తార కుటుంబీకులు పంచాయతీ పెట్టి కనకయ్యకు రూ.30 వేల జరిమానా విధించి మరో మారు కలవకూడదంటూ మందలించి వదిలి వేసినట్లు తెలిపారు. అయినప్పటికీ కనకయ్య, తారల మధ్య ప్రేమాయానం సాగుతూనే వస్తుంది. ఈ క్రమంలో పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకోవడానికి ధైర్యం చాలక మనస్తాపానికి గురైన ప్రేమజంట బుధవారం మధ్యాహ్నం ఇంట్లోంచి వెళ్లిపోయి గ్రామానికి సుమారు 2 కిలో మీటర్లు దూరంలో ఉన్న హైస్కూల్లో కలుసుకున్నారు. అప్పుడు ఇరువురు చనిపోవాలని నిర్ణయం తీసుకొని తమ వెంట తీసుకెళ్లిన పురుగుల మందును తాగి హైస్కూల్లో ఒకే తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఈ విషయం తెలియగానే సంఘటనా స్థలానికి వెళ్లి ఇరు కుటుంబాల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై పరమేశ్వర్ తెలిపారు. ఆస్పత్రి వద్ద రోదిస్తున్న తార తల్లిదండ్రులు లకుడారంలో విషాదఛాయలు రెండు కుటుంబాలు రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి. రెండేళ్లుగా ప్రేమించుకుంటూ పెళ్లి చేసుకోవాలని ఒకరి కొకరు నిశ్చయించుకున్నారని తెలిపారు. ఈ క్రమంలో గత రెండేళ్ల కిందట జరిగిన సంఘటన నేఫథ్యంలో మళ్లీ కుల పెద్దల నుంచి ఎలాంటి అవమానాలకు ఎదురవుతాయోనన్న భయాందోళనతో ప్రేమ జంట కనుకయ్య, తారలు ఇంట్లోంచి వెళ్ళి పోవాలని నిర్ణయించుకొని బుధవారం మధ్యాహ్నం ఇంట్లోంచి వెళ్లారు. కాగా కనకయ్య గత 10రోజుల క్రితం హనుమాన్ దీక్షను తీసుకున్నాడని తెలిపారు. బుధవారం ఇంట్లోంచి వెళ్లేటప్పుడే తన వెంట పురుగుల మందును తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి సమయంలో పురుగుల మందు సేవించి హైస్కూల్లో భవనానికి ఉన్న కొక్కానికి ఉరివేసుకొని మృతి చెంది ఉండవచ్చని తెలిపారు. బుధవారం రాత్రి వరకు రెండు కుటుంబాల వారు వెదికినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం 10 గంటల సమయంలో హైస్కూల్లోంచి దుర్వాసను వస్తుండటంతో స్థానికులు వెళ్లి చూడగా ప్రేమజంట ఆత్మహత్య చేసుకొని మృతి చెందారని తెలిపారు. దీంతో హైస్కూల్ ప్రాంత మంతా రెండు కుటుంబాల రోదనలతో దద్దరిల్లి పోయింది. దీంతో రెండు కుటుంబాలు, కనకయ్య, తారలు గ్రామంలో అందరితో కలుపుగోలుగా ఉంటూ ఒక్కసారిగా మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయని తెలిపారు. మృతుడి కుటుంబాలను సర్పంచ్ కందూరి కనుకవ్వ–ఐలయ్య, రైతు సమన్వయ సమితి రాష్ట్ర సభ్యులు దేవి రవీందర్ పరామర్శించి ఓదార్చారు. -
కైలాసగిరిపై ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం
ఆరిలోవ(విశాఖతూర్పు): నగరంలోని కైలాసగిరిపై ప్రేమజంట ఆత్మహత్యకు యత్నించారు. వీరిలో ప్రియుడు మృతి చెందగా ప్రియురాలు కేజీహెచ్లో చికిత్స పొందుతోంది. శ్రీకాకుళం జిల్లా, వీరఘట్టం మండలం అడారు గ్రామానికి చెందిన చౌడాడ సత్యనారాయణ అలియాస్ లక్ష్మణరావు(26), రౌతు కమల(22) కైలాసగిరిపై బాదం జ్యూస్లో విషం కలిపి తాగేసి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్యాయత్నానికి ముందు ఇద్దరూ సూసైడ్ నోట్లు రాశారు. క్షమించండి శివ(అన్నయ్య)... అమ్మను జాగ్రత్తగా చూసుకో. మీతో కలసి ఉండాలని అనుకొన్నా నాకు ఆ ఆదృష్టం లేదు. మామయ్యలతో కలసి అంతా హ్యాపీగా ఉండండి. నన్ను క్షమించండి. అమ్మ నీ ప్రాణం. ఇదే నా ఆఖరి కోరిక. నేను చనిపోవడానికి ఎవ్వరూ కారణం కాదు. మా ఇద్దరం కలిసి ఒకరిని విడిచి మరొకరం ఉండలేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకొన్నాము. అంటూ కమల సూసైడ్ నోట్ రాసింది.. కమల రాసిన సూసైడ్ నోట్ ,కైలాసగిరిపై మృతిచెందిన సత్యనారాయణ పక్కనే అస్మారక స్థితిలో పడిఉన్న కమల క్షమించిండి అన్నయ్యా... అమ్మా, నాన్నలను జాగ్రతగా చూసుకో. నువ్వు ఉన్నావనే నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకొన్నాను. అక్క, బావలను జాగ్రత్తగా చూసుకో. తనను నేను మరిచిపోలేకపోతున్నాను. మా ఇద్దరం కలసి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మా చావుకు ఎవరూ కారణం కాదు. ఇందులో ఎవరి ప్రమేయమూ లేదు. మా ఇద్దరి వల్ల మన రెండు కుటుంబాలు గొడవలు పడకూడదు. మా ఇద్దరినీ క్షమించండి అంటూ సత్యనారాయణ సూసైడ్ నోట్ రాశాడు. -
ప్రేమజంట బలవన్మరణం
తమిళనాడు, టీ.నగర్: దిట్టకుడి సమీపాన మంగళవారం ప్రేమజంట బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. సినిమా ఫక్కీలో జరిగిన ఈ సంఘటన ఆ ప్రాంత వాసులను కలచివేసింది. కడలూరు జిల్లా దిట్టకుడి సమీపాన గల ఆలత్తూరు గ్రామానికి చెందిన గోవిందరాజులు కుమారుడు శివరంజన్ (18). ఇతను కీళకల్పూండిలో గల ప్రభుత్వ పాఠశాలలో ప్లస్ 2 పూర్తి చేశాడు. కీళకల్పూండికి చెందిన ఆర్ముగం కుమార్తె అభిరామి (16). అదే ప్రాంతంలోని పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసింది. పాఠశాలకు వెళుతుండగా శివరంజన్కు అభిరామికి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వీరి ప్రేమకు తల్లిదండ్రులు వ్యతిరేకత తెలిపారు. ఇదిలాఉండగా శివరంజన్, అభిరామి మంగళవారం తమ ఇళ్ల నుంచి బయలుదేరి తొలుదూరుకు చెందిన వేందన్ అనే వ్యక్తి పంట పొలానికి వెళ్లారు. అక్కడ చాలా సేపు మాట్లాడుకున్నారు. అనంతరం ఇద్దరూ చున్నీని కట్టుకుని అదే ప్రాంతంలోని బావిలో దూకారు. ఇదిలాఉండగా ప్రేమజంట కోసం ఇరు కుటుంబాల తల్లిదండ్రులు గాలిస్తూ వచ్చారు. దీని గురించి సమాచారం అందుకున్న వేందన్ తన పొలంలోని బావి దగ్గరికి వెళ్లి చూడగా ఇరువురి మృతదేహాలు నీటిపై తేలుతూ కనిపించాయి. ఈ మృతదేహాలను అగ్నిమాపక సిబ్బంది వెలికి తీశారు. పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం దిట్టకుడి ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
పారాణి ఆరకముందే.. పట్టాలపై శవమైన జంట
పరిచయం ప్రేమగా మారింది, మధురానుభూతులు పంచుకున్నారు. పెద్దలు కాదన్నా పెళ్లి చేసుకున్నారు. కానీ ఏం జరిగిందో కానీ రైలు పట్టాలపై విగతజీవులుగా తేలారు. ఇది హత్యా, ఆత్మహత్యా? అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. వధువురాసినట్లుగా చెబుతున్న ఒక లేఖ పట్టాల వద్ద దొరికింది. కర్ణాటక, దొడ్డబళ్లాపురం: పారిపోయి వివాహం చేసుకున్న ప్రేమికులు రైలు పట్టాలపై మృతదేహాలైన సంఘటన దొడ్డబళ్లాపురం రైల్వే పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పట్టణ పరిధిలోని కచేరిపాళ్యకు చెందిన వెంకటరాజు కుమారుడు లక్ష్మిపతి అలియాస్ విజయ్(20), శాంతినగర్ 7వ క్రాస్ నివాసి లక్ష్మినారాయణ, మంజుల దంపతుల కుమార్తె లీలా (18) నవదంపతులు. సోమవారం ఉదయం ఇద్దరి మృతదేహాలు పట్టణ శివారులోని వీరాపుర రైల్వే గేట్ వద్ద పట్టాలపై ఛిద్రమై కనిపించాయి. పట్టాల పక్కనే కొత్తగా కొనుగోలు చేసిన ఇంకా రిజిస్ట్రేషన్ నంబర్ కూడా లేని పల్సర్ బైక్ కూడా నిలిపి ఉంది. ఇద్దరూ బైక్పై వచ్చి ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తోంది. రైలు పట్టాల వద్ద నవదంపతుల మృతదేహాలు డెత్నోట్లో ఏముంది? ఘటనా స్థలంలో లీలా వ్రాసిన డెత్ నోట్ లభించింది. అందులో తాము ప్రేమించుకున్నామని, పెద్దలు ఒప్పుకోకపోయి నా, నెల క్రితం వివాహం చేసుకున్నామ ని అందులో ఉంది. అయితే కుటుంబ స భ్యుల వేధింపులు ఎక్కువవడంతో ఆత్మ హత్య చేసుకుంటున్నామని పేర్కొన్నా రు. విజయ్ కార్పెంటర్ పనిచేస్తుండగా, లీలా బెంగళూరు కాలేజీలో డిప్లోమా చదువుతోంది. వారం క్రితం లీలా తల్లితండ్రులు గ్రామీణ పోలీస్స్టేషన్లో లీలా కనబడడం లేదని ఫిర్యాదు చేశారు. దొడ్డ రైల్వే పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఇది హత్య కూడా కావచ్చని పలువురు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. రైలు పట్టాల వద్ద నిలిపిన బైక్ -
ప్రేమకథ విషాదాంతం
ఔను... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు... ఏడాది కాలంగా ప్రేమించు కుంటున్నారు. ఈ సమాజంలో కులం అనే అడ్డుగోడలు తమ ప్రేమను ఆమోదించవని భయపడ్డారు. తమ ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు తెలిస్తే ఏ అనర్థం జరుగుతుందోనన్న ఆందోళనఆ ప్రేమికులకు వెంటాడింది. తమ వెంట తెచ్చుకున్న విషపుగుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే మృత్యువు సమీపించడంతో వారిలో బతకాలనే ఆశ కలిగింది. తాము ఎందుకు మరణించాలి? తాము బతికి తమ ప్రేమను బతికించుకోవాలని నిర్ణయించుకుని స్వయంగా ఆస్పత్రికి వెళ్లి తమను కాపాడాలని వేడుకున్నారు. అప్పటికే వారి పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆ ప్రేమికులు మృత్యువాతపడ్డారు. అనంతపురం, పుట్లూరు: పుట్లూరు మండలం బాలాపురం ఎస్సీ కాలనీకి చెందిన మల్లికార్జున (20) తాడిపత్రిలో ఐటీఐ పూర్తి చేశాడు. విడపనకల్లు మండలం కొట్టాలపల్లికి చెందిన సి.మాధవి(19) తన తల్లి స్వస్థలం పుట్లూరు మండలం కోమటికుంట్లలో తాత రాముడు ఇంటి వద్ద ఉంటూ తాడిపత్రిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదివింది. వీరిద్దరూ ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం కుటుంభ సభ్యులకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. డిగ్రీ పూర్తీ చేసిన మాధవి తన స్వగ్రామానికి వెళ్లింది. శనివారం మధ్యాహ్న సమయంలో ప్రేమికులిద్దరూ ముందస్తు ప్రణాళిక ప్రకారం తాడిపత్రికి చేరుకున్నారు. కులాలు వేరు అయినందున తమ ప్రేమను పెద్దలు అంగీకరించరని చర్చించుకున్నారు. కలిసి జీవించే పరిస్థితి లేనపుడు కలిసి చనిపోదామనే నిర్ణయానికి వచ్చారు. వెంట తెచ్చుకున్న విషపుగుళికలు ఇద్దరూ మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. మనసు మార్చుకుని.. బతకాలని..! ఆత్మహత్యాయత్నం చేసిన ఈ ప్రేమికులు తాము బతికి ప్రేమనూ బతికించుకోవాలని మనసు మార్చుకున్నారు. స్వయంగా తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రికి చేరి తాము ఆత్మహత్యాయత్నం చేశామని, తమను బతికించాలని అక్కడి వైద్య సిబ్బందిని వేడుకున్నారు. వారిని పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సమయంలో సైతం మల్లికార్జున తాను ఉన్న బెడ్ నుంచి లేచి మాధవి ఎలా ఉంది.. అని ఆమె వద్దకు వెళ్లడానికి ప్రయత్నించాడు. చికిత్స పొంతుతూ మల్లికార్జున, మాధవిలు శనివారం అర్ధరాత్రి మృతి చెందారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. -
రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య
అన్నానగర్: విరుదాచలం సమీపంలో బుధవారం ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. విరుదాచలం సమీపం తొట్టికుప్పం గ్రామంలో విరుదాచలం – సేలం రైల్వే పట్టాలపై బుధవారం 35 ఏళ్ల వ్యక్తి, 25 ఏళ్ల మహిళ గాయాలతో మృతిచెందారు. పట్టాల పక్కన బైకు, విషం బాటిళ్లు, చెప్పులు ఉన్నాయి. వీటిని గమనించిన స్థానికులు విరుదాచలం రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సీఐ చిన్నప్పన్, పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. మృతులు అదే ప్రాంతానికి చెందిన సుబ్రమణ్యన్ కుమారుడు రమేష్ (38), పెన్నడం పొన్నేరికి చెందిన తిరుమూర్తి భార్య గాయత్రి (25) అని తెలిసింది. కూలీ అయిన రమేష్కి లక్ష్మీ అనే భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గాయత్రికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉంది. తిరుమూర్తి విదేశాల్లో పనిచేస్తున్నాడు. రమేష్, గాయత్రి విరుదాచలంలోని ఓ మిఠాయి దుకాణంలో కార్మికులుగా పని చేస్తున్నారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. విషయం ఇరు కుటుంబీకులకు తెలిసి తీవ్రంగా మందలించారు. వారం కిందట రమేష్ గాయత్రి అదృశ్యమయ్యారు. అనంతరం బంధువులు వారి కోసం పలు చోట్ల వెతికినా ఆచూకీ తెలియరాలేదు. ఈ క్రమంలో బుధవారం వీరిఇద్దరూ తొట్టి కుప్పం పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. అనంతరం పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విరుదాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
విషం తాగిన ప్రేమజంట
అన్నానగర్: నత్తమ్ సమీపంలో ఆదివారం తమ ప్రేమకు పెద్దలు అంగీకరించలేదనే మనస్థాపంతో ప్రేమికులు విషం సేవించారు. ఇందులో యువతి మృతిచెందగా, ప్రియుడి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. దిండుక్కల్ జిల్లా, నత్తమ్ సమీపంలోని గోపాల్పట్టికి చెందిన చిన్నయ కుమార్తె సంగీత (22) ప్లస్టూ పూర్తిచేసి, సమీపంలోని ప్రైవేట్ మిల్లులో పనిచేస్తోంది. తిరుచ్చి జిల్లా మణప్పారై కలింగపట్టి సమీపంలోని రాజాలి కౌండమ్పట్టికి చెందిన నల్లతంబి కుమారుడు కనకరాజ్ (26). ఇతని తల్లిదండ్రులు మృతిచెందడంతో కరూర్ జిల్లా, సిద్ధపట్టిలోని బంధువుల ఇంట్లో నివసిస్తున్నాడు. ఈ స్థితిలో గోపాల్పట్టి సమీపంలో జరిగిన ఓ వివాహానికి కనకరాజ్ వెళ్లాడు. అక్కడ సంగీతతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. రెండేళ్లుగా ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇద్దరు కులాలు వేరుకావడంతో వారి ప్రేమను బంధువులు అంగీకరించలేదు. దీంతో మనస్థాపం చెందిన ప్రేమికులు ఆదివారం సిద్ధపట్టిలోని ఓ తోటలో విషం తాగి స్పృహతప్పి పడి ఉన్నారు. సమాచారంతో కనకరాజ్ బంధువులు అక్కడికి వచ్చి ఇద్దరినీ మణప్పారైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. మెరుగైన చికిత్స కోసం ఇద్దరినీ తిరుచ్చి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ సంగీత మృతిచెందింది. కనకరాజ్ పరిస్థితి విషమంగా ఉంది. సంగీత తండ్రి చిన్నయ ఫిర్యాదు మేరకు తోగైమలై పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు -
మతం ఆ ప్రేమజంటను చంపేసింది..
కర్లపాలెం (బాపట్ల): గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం ఏట్రవారిపాలెంలో మైనర్ ప్రేమజంట గురువారం తుంగభద్ర డ్రెయిన్లో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఏట్రవారిపాలెంకి చెందిన అక్కల స్వామిరెడ్డి కుమారుడు తిరుపతిరెడ్డి (18), అదే గ్రామానికి చెందిన షేక్ రెహ్మాన్ చిన్న కుమార్తె షేక్ రిజ్వానా (16) ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. రిజ్వానా ఇటీవల పదోతరగతి పరీక్షలు రాసింది. బుధవారం గ్రామం నుంచి వెళ్లిపోయిన ప్రేమికులు గురువారం గ్రామ సమీపంలోని తుంగభద్ర డ్రెయిన్ వద్దకు చేరుకున్నారు. తాము ప్రేమించుకున్నామని, ఒకర్ని విడిచి ఒకరం ఉండలేమని, ఎలుకల మందు తిని ఆత్మహత్య చేసుకుంటున్నామని కుటుంబీకులకు ఫోన్లోతెలిపారు. కుటుంబీకులు వారున్న చోటికి వెళ్లి చూడగా తిరుపతిరెడ్డి బైక్, సెల్ఫోన్, రిజ్వానా చున్నీ, తుంగభద్ర కట్టపై ఉన్నాయి. వెంటనే వారు పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్ఐ గజ ఈతగాళ్లతో డ్రెయిన్లో వెతికించగా మృతదేహాలు లభ్యమయ్యాయి. -
ప్రేమజంట ఆత్మహత్య
టీ.నగర్: తలైవాసల్ సమీపంలో ప్రేమజంట విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు.. సేలం జిల్లా, తలైవాసల్ సమీపం తెడావూరు గ్రామానికి చెందిన శ్రీనివాసన్ (45). భవన నిర్మాణ కార్మికుడు. ఇతనికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య సెల్వరాణికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుటుంబ తగాదాల కారణంగా ఐదేళ్ల క్రితం సెల్వరాణి తన ముగ్గురు పిల్లలతో భర్తను వదిలి విడిగా ఉంటోంది. ఇదిలాఉండగా రెండో భార్య రాణి మూడేళ్ల క్రితం మృతిచెందింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నాడు. కార్మికుడైన శ్రీనివాసన్ అనేక ప్రాంతాల్లో పనులకు వెళ్లేవాడు. గతేడాది చెన్నైకు వచ్చి కేకే.నగర్లో పనిచేస్తూ వచ్చాడు. ఆ సమయంలో అక్కడకు పెరంబలూరు జిల్లా, పూలాంబాడి కరికాలన్ వీధికి చెందిన రాజు అనే వ్యక్తి తన భార్య చిత్ర (41)తో నిర్మాణ పనులకు వచ్చాడు. వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇదిలాఉండగా పనికి వెళ్లిన స్థలంలో శ్రీనివాసన్కు చిత్రతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ స్థితిలో నాలుగు రోజుల క్రితం పనికి వెళ్లిన చిత్ర తిరిగిరాలేదు. ఆమె కోసం భర్త గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. ఇదిలాఉండగా చిత్ర, ప్రియుడు శ్రీనివాసన్తో సోమవారం సేలం జిల్లాకు వచ్చింది. వీరకనూర్ సమీపానగల తెన్కనూరు గ్రామంలో శ్రీనివాసన్ పెదనాన్న గణేశన్ ఇంట్లో వీరు బసచేశారు. మంగళవారం ఉదయం వీరు ఉంటున్న గది తలుపులు చాలాసేపటి వరకు తెరుచుకోలేదు. అనుమానించిన గణేశన్ తలుపులు తెరిచి చూడగా చిత్ర, శ్రీనివాసన్ ఇరువురూ విషం సేవించి విగతజీవులుగా కనిపించారు. అతడు వెంటనే వీరకనూరు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అక్కడికి వచ్చి ఇరువురి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. దీనిపై చిత్ర భర్త రాజుకు పోలీసులు సమాచారం తెలిపారు. కేసు విచారణ జరుపుతున్నారు. -
ఆత్మహత్య చేసుకుంటున్నాం.. లైవ్ వీడియో
కర్ణాటక, కృష్ణరాజపురం : తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని ఓ ప్రేమజంట తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సోషల్ మీడియాలో లైవ్ వీడియో ఇప్పుడు వైరల్ మారింది. వివరాలు...బెంగళూరు నగరంలోని గోరిపాళ్యకు చెందిన రక్షిత,శే షాద్రిలు గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో యువతి తండ్రి గంగాధర్ ఇరువురి వివాహానికి నిరాకరించాడు. ఈ క్రమంలో గత ఏడా ది మార్చి నెలలో రహస్యంగా వివాహం చేసుకున్న రక్షిత,శే షాద్రి రక్షణ కోరుతూ జేజే నగర్ పోలీసుస్టేషన్కు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న రక్షిత తండ్రి గంగాధర్ పోలీసుల ఎదుటే నెలరోజుల్లో ఇద్దరిని చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో రక్షిత, శేషాద్రిలు గత ఏడాది మార్చి నెలలోనే మూడిగెరెకు పారిపోయారు. తమ కుమార్తెను తమ కు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడనే కోపంతో యువతి తండ్రి గంగాధర్ శేషాద్రి తండ్రిని పదేపదే పోలీస్స్టేషన్కు పిలిపించి వేధించసాగాడు. ఈ పరిణామాలతో మనస్థాపం చెందిన రక్షిత, శేషాద్రిలు సోమవారం ఫేస్బుక్ లైవ్లో రక్షిత తండ్రి గంగాధర్ వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నామంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న మూడిగెరె పోలీసులు ఈ ప్రేమికుల కోసం గాలిస్తున్నారు. -
అబ్బాయి మేజర్.. అమ్మాయి మైనర్
అబ్బాయి మేజర్.. అమ్మాయి మైనర్. అయినా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లికి ‘వయసు’ అడ్డొచ్చింది. పెద్దలు కాదన్నారు. కొన్నాళ్లు వేచి ఉంటే సరిపోయేది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన జంట క్షణికావేశంలో నిర్ణయం తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. రెండు కుటుంబాల్లోనూ తీరని విషాదం అలుముకుంది. అనంతపురం, కళ్యాణదుర్గం: పాలవాయి గ్రామంలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన ఒకే సామాజిక వర్గానికి చెందిన లోకేష్ (22), వన్నూరక్క (16) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. చిన్న వయసులోనే ప్రేమ ఏమిటంటూ తల్లిదండ్రులు సున్నితంగా మందలించారు. ఆలోచనలో పరిపక్వత లేని ఇద్దరూ మనస్తాపానికి గురయ్యారు. పెళ్లికి వయస్సు అడ్డు వస్తోందని, మనల్ని ఇక కలవనీయరని, అలా ఉండటం కన్నా చావడమే మేలనుకున్నారు. గ్రామంలో ఆంజనేయ స్వామి గుడికి వెళ్తానని వన్నూరక్క కుటుంబ సభ్యులకు చెప్పి శనివారం సాయంత్రం బయటకు వెళ్లింది. లోకేష్ కూడా ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఇద్దరూ ద్విచక్రవాహనంలో గ్రామ సమీపంలోని బంతి ఓబిలేసు గుడి వద్దకు చేరుకున్నారు. అక్కడ వేప చెట్టుకు చున్నీలతో ఇద్దరూ ఉరేసుకున్నారు. ద్విచక్ర వాహనంపైకి ఎక్కి ఉరి వేసుకుని వేలాడినట్లు కనిపిస్తోంది. సంఘటన స్థలంలో ప్రేమజంట లోకేష్, వన్నూరక్క మృతదేహాలు పారిపోయి.. విగతజీవులుగా మారి! ఆదివారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు లోకేష్, వన్నూరక్క మృతదేహాలను చూసి గ్రామస్తులకు సమాచారం అందించారు. రాత్రి వేళలో ఇంటికి రాకపోవడంతో ఇరువురు కుటుంబ సభ్యులు సెల్ఫోన్లకు ఫోన్ చేసినా పనిచేయలేదు. బంధువుల గ్రామాలలోనూ ఆరా తీశారు. పాలవాయి సమీపంలోనూ అన్వేషించారు. ఎక్కడా ఆచూకీ లభించలేదు. పెళ్లి చేసుకోవడం కోసం పారిపోయి ఉంటారని భావించారు. పెళ్లి చేద్దామనుకునే లోపే.. ఉదయాన్నే ఇరు కుటుంబాల బంధువులు వారి వారి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి చర్చలు జరిపారు. ఒకే కులానికి చెందిన వారని, అందులోనూ బంధుత్వం ఉందని, పిల్లల మనసును ఎందుకు కష్టపెట్టడం పెళ్లి చేసేద్దాం.. ఎట్లయ్యేది అట్ల అవుతుంది. అంతా దేవుడిమీదే భారం వేద్దాం’ అని అనుకున్నారు. ఈలోగా ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సమాచారం అందడంతో ఇరు కుటుంబాల వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
అనంతపురం జిల్లాలో మైనర్ ప్రేమ జంట ఆత్మహత్య
-
ప్రేమజంట బలవన్మరణం
టీ.నగర్: సుశీంద్రం సమీపంలో ప్రేమజంట మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. కన్యాకుమారి జిల్లా సుశీంద్రం సమీపం వళుక్కంపారైకి చెందిన శివకుమార్ శిల్పాల కళాకారుడు. ఇతని భార్య కళ. వీరి కుమార్తె ఆనంది (17), కుమారుడు అజిత్ (16). ఆనంది సుశీంద్రంలోని పాఠశాలలో ప్లస్టూ చదువుతోంది. వీరి బంధువు పెరియస్వామి (45) కూడా మనవిలై ప్రాంతంలో నివశిస్తున్నాడు. ఇతని కుమారుడు అజిత్ (20) తొమ్మిదో తరగతి చదివి భవన నిర్మాణ పనులు చేçస్తున్నాడు. ఇదిలా ఉండగా ఆనంది, అజిత్ల మధ్య పరిచయం ప్రేమగా మారింది. వీరి ప్రేమకు ఆనంది తల్లిదండ్రులు వ్యతిరేకించారు. దీంతో ఆనంది మంగళవారం అజిత్తో సెల్ఫోన్లో మాట్లాడుతూ తల్లిదండ్రులు ప్రేమను వ్యతిరేకిస్తున్నారని, తనను మరిచిపొమ్మని వేడుకుంది. దీంతో అజిత్ ఆమెను విడిచిఉండలేనని, కలిసి బతకలేని తామిద్దరి ఆత్మహత్య చేసుకుందామన్నాడు. అనంతరం విషపు గింజల పొడిని నీటిలో కలుపుకుని తాగి నేరుగా ఆనంది ఇంటికి వెళ్లాడు. తర్వాత విషపు నీటిని ఆనందికి అందజేయడంతో ఆమె కూడా తాగింది. కొద్ది సేపట్లో ఆనంది నోటి నుంచి నురగలు రావడంతో కుటుంబసభ్యులు ఆచారిపల్లం ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆనంది మృతిచెందింది. అజిత్ సెంగట్టి వంతెన వద్ద స్పృహతప్పి పడిపోగా అతన్ని గమనించిన స్థానికులు ఇంటిలో సమాచారం తెలిపారు. దీంతో అజిత్ను తండ్రి బంధువులు మరుంగూరులోగల ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్సల కోసం మయిలాడి ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. దీనిపై సుశీంద్రం పోలీసులు కేసు నమోదుచేసి మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపారు. -
కోవైలో ప్రేమజంట ఆత్మహత్య
సేలం: రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కోవైలో చోటుచేసుకుంది. విచారణలో వారు కేరళకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. కోయంబత్తూరు ఉక్కడం సమీపంలో ఒక ప్రైవేటు కళాశాల ఉంది. ఈ స్థితిలో శుక్రవారం ఉదయం సుమారు 6.30 గంటల సమయంలో పొల్లాచ్చి నుంచి కోవైకు ప్యాసింజర్ రైలు వస్తోంది. ఆ సమయంలో ఒక ప్రేమజంట అకస్మాత్తుగా రైలు కింద పడ్డారు. ఈ ఘటన యువతి, యువకుడు సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న కోవై రైల్వే పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపంచనామా నిమిత్తం కోవై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు అక్కడ గాలించగా, రెండు బ్యాగులు పడి ఉన్నాయి. వాటిలో ఆ ప్రేమ జంట ఫొటోలతో కూడిన ఐడీ కార్డులు, ఒక లేఖ కనిపిచింది. ఆ లేఖలో నిన్ను వీడి ఉండలేకున్నాను, జీవించడం ఇష్టం లేదు, నువ్వు రాలేదు, నేను చనిపోతాను అని రాసి ఉంది. ఐడీ కార్డుల ఆధారంగా ప్రేమజంటలో యువకుడు కేరళ రాష్ట్ర మూనాళం, అట్టూరుకు చెందిన అమల్ పి.కుమార్ (19) అని, అతను అదే ప్రాంతంలో ఉన్న కళాశాలలో బి.కామ్ చదువుతున్నట్టుగాను తెలిసింది. అదే విధంగా ఆ యువతి కూడా అదే ప్రాంతానికి చెందిన నాయర్ కుమార్తె సూర్య (19) అని, కేరళలోనే పాఠశాలలో ప్లస్టూ చదువుతున్నట్టు పోలీసులు గుర్తించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటన కారణంగా ఆ రైలును అక్కడే నిలిపివేశారు. అదే సమయంలో ఆ రైలు వెనుక పాలక్కాడు నుంచి వస్తున్న రైలును పోత్తనూర్లో నిలిపివేశారు. రైళ్లు రెండు గంటలపాటు ఎక్కడివక్కడ ఆగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. -
ప్రేమజంట ఆత్మహత్య
తమిళనాడు, అన్నానగర్: పన్రుట్టి సమీపంలో సోమవారం ప్రేమ జంట విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. కడలూర్ జిల్లా బన్రుట్టి ప్రాంతానికి చెందిన రాజేంద్రన్ (36) కూలీ. ఇతనికి వివాహం జరిగి కుమారుడు, కుమార్తె ఉన్నా రు. అదే గ్రామానికి చెందిన తమిళరసి (35). కూలీ పని చేసే ఈమెకు వివాహం జరిగి కుమా ర్తె ఉంది. పనికి వెళ్లిన సమయంలో రాజేంద్రన్, తమిళరసి మధ్య పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం తెలుసుకున్న ఇరు కుటుంబీకులు వారిని మం దలించారు. దీంతో మూడేళ్ల కిందట రాజేం ద్రన్, తమిళరసి ఇంటి నుంచి బయటకు వెళ్లి కోవై జిల్లా తెన్నూర్ గ్రామంలో ఉంటూ కాపు రం చేస్తున్నారు. కాగా తమిళరసి కుటుంబీకులు ఆమె కోసం గాలించగా రాజేంద్రన్తో తెన్నూర్లో ఉన్నట్టు తెలిసింది. గత 24న తమి ళరసిని, రాజేంద్రన్ నుంచి విడదీసి ఇంటికి తీసుకొచ్చారు. దీంతో మనస్తాపం చెందిన తమిళరసి సోమవారం జీడిమామిడి తోటలో విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న రాజేంద్రన్ సొంత గ్రామానికి వచ్చాడు. అతను జీడిమామిడి తోటకు వెళ్లి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట
-
రెండు రోజుల్లో ఆమె పెళ్లి... ప్రేమ జంట ఆత్మహత్య
వాళ్లిద్దరూ చదువుకున్నవారే. ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆ ఇష్టం ప్రేమగా మారింది. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కలకాలం సంతోషంగా బతకాలనుకున్నారు. కానీ వారికి కులం అడ్డం వచ్చింది. ఒకరు ఎస్సీ కులానికి చెందినవారైతే... ఇంకొకరు బీసీ(తెలుకల) కులానికి చెందిన వారు. ఇద్దరి మనసులు కలసినప్పటికీ... ఇద్దరి గుండెచప్పుడు ఒక్కటైనప్పటికీ... ఒకరిపై ఒకరికి హద్దులు లేని ప్రేమ ఉన్నప్పటికీ... కులం అడ్డుగోడగా నిలిచింది. విషయం తెలిస్తే తమ వివాహానికి తల్లిదండ్రులు అంగీకరించరనీ... వారికి తెలియకుండానే ప్రేమించుకో సాగారు. ఏదో ఒక రోజు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ వారొకటి తలిస్తే దైవమొకటి తలచింది. ఆమెకు వేరే వ్యక్తితో సంబంధం కుదిర్చారు. బుధవారమే ఆ పెళ్లి జరగాల్సి ఉంది. చేసేది లేక ఆమె ప్రేమికుడితో కలసి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుంది. విజయనగరం, పార్వతీపురం/కొమరాడ/బొబ్బిలి: బొబ్బిలి మండలం జగన్నాథపురానికి చెందిన పాలకొండ కృష్ణవేణి(18) ఇంటర్మీడియెట్ చదువుకుంది. ఈమె తల్లిదండ్రులు ప్రసాద్, సునీత కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన చింతల బెలగాం చంద్రశేఖర్ (20) ఇంటర్మీడియట్పూర్తిచేసి రాజా కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇతనికి తండ్రి లేడు. తల్లి కళ మాత్రమే ఉంది. కృష్ణవేణి, చంద్రశేఖర్ ప్రేమించుకున్నారు. ఎప్పటికైనా పెళ్లి చేసుకుందా మనుకున్నారు. కానీ ఇంతలోనే కృష్ణవేణి తల్లిదండ్రులు ఆమెకు వివాహం ఖాయం చేశారు. గరుగుబిల్లి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన కురమాన చిన్నారావు(చంటి) అనే యువకునితో వివాహం నిశ్చయం చేశారు. చిన్నారావు ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నందున తన కుమార్తె భవిష్యత్ బాగుంటుందని భావించారు. జనవరి 23వ తేదీ న వీరి వివాహానికి ముహూర్తం నిర్ణయించారు. బంధువులకు, స్నేహితులకు ఆహ్వాన పత్రికలు ఇచ్చేశారు. కానీ ఆమె మనసు అంగీకరించలేదే మో... చావైనా బతుకైనా ప్రేమించిన వ్యక్తితోనే అనుకున్నదేమో... తల్లిదండ్రులు కుదిర్చిన వివా హం చేసుకోకుండా ప్రేమించిన యువకుడితో కలసి కొమరాడ మండలం శివిని గ్రామ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. రోదిస్తున్న మృతురాలి తల్లి కాబోయే భర్తతో వెళ్లి అదృశ్యం పండుగకోసం కోటిఆశలతో కాబోయే భార్యను చూసేందుకు చిన్నారావు జగన్నాథపురం వచ్చాడు. అత్తవారింట్లో సరదాగా గడిపాడు. ఆదివారం తన స్నేహితురాలి పెళ్లికి తీసుకెళ్లమని కోరితే సంబరంగా ఆమెను ద్విచక్రవాహనంపై తీసుకువెళ్లాడు. పార్వతీపురం వచ్చేసరికి లఘుశంక తీర్చుకుంటానని చెప్పగా బండి ఆపాడు. కానీ అలా వెళ్లిన ఆమె ఎంతకూ రాకపోయేసరికి చుట్టుపక్కల వెతికి చివరికి పార్వతీపురం పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కన్నీరు మున్నీరైన కుటుంబ సభ్యులు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. ఎస్ఐ మహేష్, రైల్వే పోలీసులు సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుల తల్లిదండ్రులు విషయం తెలుసుకొని రైలు పట్టాలు దగ్గరకు చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతురాలి తల్లి సునీత, తండ్రి పీటల మీద కూర్చొవల్సిన తన కుమార్తె పెళ్లికి కొద్ది గంటల ముందే రైలు పట్టాలపై శవమై కన్పించడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుడి సోదరుడు, తల్లి కళ కన్నీటి పర్యంతమయ్యారు. ఇక కృష్ణవేణిని వివాహం చేసుకోవాల్సి న కొత్తూరుకు చెందిన చిన్నారావు కుటుంబం పరిస్థితి అగమ్య గోచరంగా తయారయ్యింది. కార్డులు పంచి బంధువులును ఆహ్వానించి ఒక రోజు తరువాత వివాహం జరగాల్సి ఉండగా ఇంతలో ఈ రకంగా సమస్య వచ్చి పడడంతో వారు ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. -
ప్రేమ వ్యవహారం విషాదాంతం
చెన్నై , తిరువొత్తి యూరు: ఇంటి నుంచి పారిపోయిన ప్రేమజంట ఆత్మహత్యకు యత్నించిన సంఘటనలో ప్రియురాలు అదే స్థలంలో మృతి చెందగా ప్రియుడు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఈరోడ్ జిల్లా గోపిశెట్టిపాళయం ఆది ద్రావిడ కాలనీకి చెందిన కాట్టురాజా భార్య కార్తిక (25). అదే ప్రాంతానికి చెంది న ప్రైవేటు సంస్థలో పని చేస్తున్న నడుపాళయం కు చెందిన సతీష్ (27)తో పరిచయం ఏర్పడి ఇద్ద రి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో గత 3వ తేదీ ఇంటి నుంచి బయటకు వచ్చిన జంట పలు ప్రాంతాలలో తిరిగి తరువాత గత 9వ తేదీ మదురైలో ఉన్న ఒక ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఇదిలాఉండగా కార్తీ క కనబడలేదని ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఆమె కో సం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో కన్యాకుమారికి వచ్చి ఓ లాడ్జిలో గది తీసుకున్న ప్రేమజం ట మంగళవారం రాత్రి విషం తాగి ఆత్మహత్యకు యత్నించారు. వారి గది తలుపు తెరచుకోకపోవడంతో లాడ్జి ఉద్యోగులు అక్కడికి చేరుకుని గది తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా కార్తీక మృతి చెంది ఉండగా సతీష్ ప్రాణాలకు పోరాడుతున్నాడు. పోలీసులు వచ్చి సతీష్ను చికి త్స కోసం ఆచారిపల్లం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సతీష్ గురువారం ఉదయం మృతి చెందారు. -
తమిళ ప్రేమజంట ఆత్మహత్య
వారు ఇద్దరూ నాలుగేళ్లుగా గాఢంగా ప్రేమించుకున్నారు. కులం కూడా ఒక్కటే కావడంతో పెళ్లికి పెద్దలు అంగీకరిస్తారని భావించారు. వరుసకు బావ అయ్యే వ్యక్తి ని పెళ్లి చేసుకోవాలని యువతిపై తల్లిదండ్రులు ఒత్తిడి తెచ్చారు. పెద్దలను ఒప్పిం చేందుకు ప్రేమజంట ఎన్నిసార్లు ప్రయత్నించినా వారి మనసు కరగలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ప్రేమజంట మృత్యువులోనైనా ఒక్కటి కావాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన కుప్పం రైల్వే స్టేషన్లో బుధవారం జరిగింది. చిత్తూరు, కుప్పం రూరల్ : పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. రేణిగుంట రైల్వే ఎస్ఐ అనీల్కుమార్, కుప్పం హెడ్కానిస్టేబుల్ నాగరాజు కథనం మేరకు.. తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా అత్తిమాంజేరి గ్రామానికి చెందిన కె.ఎస్.హేమంత్కుమార్ (22), అదే గ్రామానికి చెం దిన జి.ఎస్. మోనీషా (19) నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవా రు. రెండు నెలల క్రితం ఇద్దరి తల్లిదండ్రులకు ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేయాలని కోరారు. పెళ్లికి మోనీ షా తల్లిదండ్రులు నిరాకరించారు. మంచి ఉద్యోగం లేని హేమంత్కుమార్తో పెళ్లి కుదరదని ఖరాకండిగా చెప్పారు. వరుసకు బావ అయిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారు. ప్రాణప్రదంగా ప్రేమించిన హేమంత్కుమార్ను తప్ప వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోనని మోనీషా తెగేసి చెప్పింది. తల్లిదండ్రులు కూడా అంతే ప్రతిఘటించారు. దీంతో మనస్తాపానికి చెందిన హేమంత్కుమార్, మెనీషా మంగళవారం రాత్రి ఇంటి నుంచి బయలుదేరి రైలులో కుప్పం రైల్వేస్టేషన్ చేసుకున్నారు. రాత్రి 12 గం టలకు ఫ్లాట్ఫాం టికెట్టు తీసుకుని రైల్వేస్టేషన్లోనే ఉన్నారు. బుధవారం తెల్లవారుజామున దళవాయికొత్తపల్లి రైల్వేగేటు సమీపంలోని రైలు పట్టాలపై విగతవులుగా పడి ఉన్నారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. అక్కడి పరిస్థితిని బట్టి ఇద్దరూ పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అభిప్రాయపడ్డారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాలను కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించారు. సాయంత్రం పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు రేణిగుంట రైల్వే ఎస్ఐ అనీల్కుమార్ చెప్పారు. -
కేరళ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
టీ.నగర్: చెన్నై, సెంట్రల్ రైల్వేస్టేషన్లో కేరళ ప్రేమజంట మంగళవారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేసింది. కేరళ రాష్ట్రం, ఎర్నాకుళం జిల్లా కూట్టుమడం ప్రాంతానికి అభిజిత్ (19) ఎర్నాకుళంలోగల కళాశాలలో చదువుతున్నాడు. పాఠశాలలో చదువుతుండగా ఎర్నాకుళం జిల్లా నెల్లికుళికి చెందిన రూష్ణాపూసల్ (19)తో పరిచయం ఏర్పడి మూడేళ్లుగా ప్రేమించుకుంటూ వచ్చారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు వ్యతిరేకత తెలిపినట్లు సమాచారం. దీంతో ఇరువురూ గత వారం ఇంటి నుంచి పరారయ్యారు. చెన్నై చేరుకున్న ఇరువురూ బసచేసేందుకు వీలులేక చెన్నై రైల్వేస్టేషన్లో గడిపారు. తాము తెచ్చుకున్న నగదు ఖాళీ కావడంతో ఆహారం లేకుండా అవస్థలు పడ్డారు. మంగళవారం రాత్రి చెన్నై సబర్బన్ రైల్వేస్టేషన్ 16 నంబర్ ప్లాట్ఫాంపై క్రిమిసంహారక మందు తాగి స్పృహ తప్పారు. అక్కడ రాత్రి గస్తీ తిరుగుతున్న ఆర్పీఎఫ్ పోలీసులు గమనించి ఇద్దరిని రాజీవ్గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ఇరువురూ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. ఈ గటనపై సెంట్రల్ రైల్వే పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
ఈ ప్రేమజంటది పరువు హత్యేనా..?
హొసూరు(తమిళనాడు): ప్రేమించి పెళ్లి చేసుకున్న వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన యువతీ, యువకుడు అనుమానాస్పద స్థితిలో కావేరి నదిలో శవాలై తేలారు. దీన్ని పరువు హత్యగా భావించిన పోలీసులు ఈ మేరకు విచారణ చేపట్టారు. ఈ ఘటన తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా హొసూరులో వెలుగు చూసింది. వివరాలు.. హొసూరు తాలూకా, పలవనపల్లి పంచాయతీలోని చూడుగొండపల్లి గ్రామానికి చెందిన నారాయణప్ప కుమారుడు నందీష్(25) అదే గ్రామానికి చెందిన శ్రీనివాసన్ కుమార్తె స్వాతిలు ప్రేమించుకొన్నారు. నందీష్ హొసూరులోని ప్రైవేట్ హార్డ్వేర్ దుకాణంలో పనిచేస్తూ హొసూరులో నివాసముంటున్నారు. స్వాతి బీకాం చదివింది. నందీష్ వేరే సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో వివాహానికి స్వాతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో ఆ ప్రేమజంట ఈ ఏడాది ఆగస్టు 15న బాగలూరు సమీపంలోని తిమ్మరాయస్వామి ఆలయంలో పెళ్లి చేసుకుంది. తర్వాత హొసూరులోనే కాపురం పెట్టారు. మృతిచెందిన స్వాతి ఈనెల 10వ తేదీ రాత్రి 9 గంటల నుంచి స్వాతి, నందీష్లు కనిపించలేదు. దీంతో నందీష్ తమ్ముడు శంకర్ ఈనెల 14న హొసూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు గాలింపు చేపట్టారు. ఈక్రమంలో కర్ణాటకలోని మండ్య జిల్లా శివసముద్రం వద్ద కావేరి నదిలో మూడు రోజుల క్రితం నందీష్ విగతజీవిగా కనిపించగా బెళకావాడి పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని మార్చురీకి తరలించారు. కాగా నందీష్ మృతదేహం లభ్యమైన చోటనే గురువారం స్వాతి విగతజీవిగా కనిపించింది. దీంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని మార్చురీకి తరలించి కేసును క్రిష్ణగిరి పోలీసులకు బదిలీ చేశారు. ప్రేమజంటది పరువు హత్యగా అనుమానిస్తూ క్రిష్ణగిరి పోలీసులు స్వాతి తండ్రి శ్రీనివాస్, పినతండ్రి అశ్వత్థప్పతోపాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా ప్రేమజంట అనుమానాస్పద మృతితో చూడుగొండపల్లిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పొలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మండ్యలో ఉన్న నందీష్, స్వాతి మృతదేహాలను హొసూరుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
బావా మరదలు ఒకే చెట్టుకు..
తమిళనాడు, కెలమంగలం: ఆ యువకుడు టెన్త్ చదివి పొలంబాట పట్డాడు. ఆ యువతి డిగ్రీ పూర్తి చేసింది. ఇద్దరూ స్వయాన బంధువులు. వారి ఇళ్లు కూడా ఎదురెదురుగా ఉన్నాయి. చిన్నప్పటినుంచి కలిసి పెరిగారు. కాలక్రమంలో వారి మధ్య ప్రేమ చిగురించింది. జీవితాంతం ఒక్కటిగా ఉండిపోవాలని కలలుగన్నారు. అయితే ఏ కారణం చేతనో ఇద్దరూ బలవన్మరణం చెందారు. ఈ ఘటన క్రిష్ణగిరి జిల్లా డెంకణీకోట తాలూకా సావరబెత్తంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన హనుమప్ప కొడుకు హేమంత్(25) 10వ తరగతికే చదువు ముగించుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఎదురింటిలో ఉంటున్న అత్త కుమార్తె చూడమ్మ(21) డిగ్రీ పూర్తి చేసింది. వీరిరువురూ గాఢంగా ప్రేమించుకొన్నారు. అయితే ఈ విషయం వారి తల్లితండ్రులు తెలియదు. చిన్నప్పటినుంచి పెద్దల చాటున పెరిగిన పిల్లలు కావడంతో తమ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పేందుకు జంకారు. ఒకవేళ పెద్దలకు విషయాన్ని చెబితే తమ పెళ్లికి అంగీకరిస్తారో లేదో అనే బెంగతో ఉండేవారు. ఈక్రమంలో ఇద్దరూ చెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో విగతజీవులుగా మారారు. గురువారం ఉదయం పొలం పనులకు వెళ్లే గ్రామస్తులు.. పొలంలో హేమంత్, చూడమ్మలు ఒకే చెట్టుకు ఉరివేసుకున్నట్లు గమనించి హతాశులయ్యారు. విషయం తెలియడంతో పెద్ద సంఖ్యలో ఘటనా స్థలంలో గుమికూడారు. నిన్నటి వరకు తమ కళ్లముందు తిరగాడిన పిల్లలు ఇలా విగతజీవులుగా మారడాన్ని జీర్ణించుకోలేక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తళి ఎస్ఐ శివరాజు కేసు దర్యాప్తు చేపట్టారు. -
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
-
తప్పు చేశాం.. సూసైడ్ నోట్లో ప్రేమజంట!
గుంటూరు, తెనాలిరూరల్: చేసిన పొరపాటు వల్ల కుటుంబ సభ్యులకు మొహం చూపలేమన్న కారణం, తప్పు చేశామన్న పశ్చాత్తాపంతోనే ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. విజయవాడ చిట్టినగర్కు చెందిన ఆటో డ్రైవర్ దారా పృధ్విరాజు, ఏలూరుకు చెందిన కొత్తలంక సాయిదివ్య తెనాలి గాంధీచౌక్ సమీపంలోని ఓ హోటల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. రెవెన్యూ అధికారులు అందుబాటులో లేకపోవడంతో శవపంచనామాను మంగళవారం నిర్వహించలేకపోయారు. హోటల్ గది తలుపును బుధవారం అధికారుల సమక్షంలో పోలీసులు పగులగొట్టించారు. పంచనామా అనంతరం మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలించారు. మృతదేహాల వద్ద మూడు పేజీల సూసైడ్ నోట్ పోలీసులకు లభించింది. ఇందులో ఉన్న వివరాల మేరకు 9వ తేదీన విజయవాడలో రహస్యంగా వివాహం చేసుకుని, వైఎస్సార్ నగర్లో కాపురం పెట్టారు. సాయిదివ్య ఆచూకీ కోసం గాలిస్తున్న కుటుంబ సభ్యులు విజయవాడలో వీరు ఉంటున్న ప్రదేశాన్ని 12వ తేదీన గుర్తించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయి, రాత్రికి తెనాలిలోని హోటల్కు చేరారు. గది అద్దెకు తీసుకుని, తమ వెంటే తెచ్చుకున్న తాడుతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. తమ ఇద్దరి విషయం కుటుంబ సభ్యులకు తెలిసిపోవడంతో తప్పుచేశామన్న భావనతో ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. తల్లిదండ్రులు, భార్యకు మొహం చూపలేనన్న ఉద్దేశంతో పృధ్విరాజు, తల్లిదండ్రులు, మేనమామలకు మొహం చూపలేనన్న కారణంతో సాయిదివ్య ఆత్మహత్యకు పాల్పడినట్టు లేఖలో రాసి ఉంది. ఇద్దరూ తమ తమ తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు క్షమాపణలు కోరుతూ, తమ మరణ సమయాన్ని ఈ నెల 13వ తేదీన తెల్లవారుజామున మూడు గంటలుగా నోట్లో రాసిపెట్టారు. తప్పు చేశామన్న ఆత్మన్యూనతా భావంతో డిప్రెషన్కు లోనై ఆత్మహత్యకు పాల్పడ్డారని భావిస్తున్నట్టు తెనాలి వన్టౌన్ సీఐ ఎం. శ్రీనివాసరావు తెలిపారు. పోస్ట్మార్టం అనంతరం మృతదేహాలు అప్పగించారు. -
ప్రేమజంట ఆత్మహత్య
టీ.నగర్: పురుగుల మందు తాగి ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన చిన్నసేలం సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. విల్లుపురం జిల్లా చిన్నసేలం సమీపంలోగల వరదప్పనూరు గ్రామానికి చెందిన ఏళుమలై కుమార్తె పూజ (16). ఈమె, అదే ప్రాంతానికి చెందిన విఘ్నేష్ (21) ఆరు నెలలుగా ప్రేమించుకుంటున్నట్లు సమాచారం. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలియడంతో వారు వ్యతిరేకించారు. దీంతో విరక్తిచెందిన ప్రేమజంట మంగళవారం ఇంటి నుంచి పరారయ్యారు. తర్వాత ఉళయనల్లూరు వెళ్లే రోడ్డులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న చిన్నసేలం పోలీసులు సంఘటన స్థలం చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బావిలో దూకి ప్రేమజంట ఆత్మహత్య
వేలూరు: బావిలో దూకి ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన వాలాజ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. వేలూరు జిల్లా వాలాజ తాలుకా అమ్మన్ తాంగల్ గ్రామంలో అక్కడున్న వ్యవసాయ బావిలో ఇద్దరి మృతదేహాలు తేలుతుండడంతో దిగ్భ్రాంతి చెందిన గ్రామస్తులు వెంటనే వాలాజ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బావిలో నుంచి ఇద్దరి మృతదేహాలను బయటకు తీసి విచారణ జరిపారు. పోలీసులు బావి సమీపంలోని బైకుపైన ఉన్న బ్యాగులో పరిశీలించగా అందులో ఆధార్ కార్డు, ఓటర్లు గుర్తింపు కార్డు ఉండడాన్ని గుర్తించారు. వాటిని పరిశీలించగా మృతురాలు వేలూరు సమీపంలోని వూసూరు చిన్నసేకనూర్ గ్రామానికి చెందిన మణి కుమార్తె ఎయిలరసి(21), మృతిచెందిన యువకుడు రాణిపేట పులియమరం తోపు వీధికి చెందిన సెల్వరాజ్ కుమారుడు సుకుమారన్(23) అని తెలిసింది. వీరిద్దరూ ప్రేమికులని అనుమానించిన పోలీసులు మృతుల కుటుంబసభ్యులకు సమాచారం అందజేశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు వృతుల కుటుంబసభ్యుల వద్ద విచారణ చేస్తున్నారు. -
ప్రేమ జంట ఆత్మహత్య
ఆ ప్రేమికుల పెళ్లికి కులాలు అడ్డువచ్చాయి. తల్లిదండ్రులను ఎదిరించి గ్రామం నుంచి వెళ్లిపోయారు. అనంతరం కులాంతర వివాహం చేసుకున్నారు. ఎలాంటి బెదిరింపులు వచ్చాయో తెలియదు కానీ.. కళ్యాణదుర్గం పట్టణ సమీపంలోని అయ్యవారి గుట్ట(కొండ)లో ఆ ప్రేమజంట ఆత్మహత్యచేసుకుంది. అనంతపురం , కళ్యాణదుర్గం: శెట్టూరు మండలం అయ్యగార్లపల్లికి చెందిన కమ్మ పాలాక్షప్ప, మల్లక్క దంపతుల కుమార్తె చిట్టెమ్మ (18) అదే గ్రామానికి చెందిన బోయ మల్లప్ప, మాదేవి దంపతుల కుమారుడు భరత్(21)లు కొన్నాళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవడానికి వీరికి కులాలు అడ్డొచ్చాయి. అమ్మాయి కులం వారి నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని భావించారు. ఒకానొక దశలో భరత్ను అమ్మాయి కుటుంబ సభ్యులు ప్రేమ విషయంలో మందలించారు. ఇద్దరూ దూరం కావడానికి మనసులు అంగీకరించలేదు. ఫిబ్రవరి 20న తెల్లవారుజామున చిట్టెమ్మ తన పదో తరగతి, ఇంటర్ మార్కుల జాబితాలు, ఆధార్ కార్డులు, భరత్ తన ఆధార్ కార్డుతో గ్రామం నుంచి వెళ్లిపోయారు. బెంగుళూరుకు వెళ్లి అక్కడి నుంచి యశ్వంతపూర్ నుంచి రైలులో తిరుపతికి వెళ్లారు. స్నేహితుల సమక్షంలో అక్కడ వివాహం చేసుకున్నారు. మిస్సింగ్ కేసు నమోదు చిట్టెమ్మ తండ్రి కమ్మ పాలాక్షప్ప తన కుమార్తె కనిపించడం లేదని, గ్రామానికి చెందిన మల్లప్ప కుమారుడు ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్న భరత్పై అనుమానం ఉందని ఫిబ్రవరి 20వ తేదీన శెట్టూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు ఫిబ్రవరి 21వ తేదీన మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆ రోజు నుంచి జంట ఆచూకీ కోసం స్నేహితులను పోలీసులు పిలిపించి తమదైన శైలిలో కౌన్సిలింగ్ చేస్తూ విచారణ చేపట్టారు. భయపడి.. బలవన్మరణం తమ స్నేహితులను పోలీసులు విచారణ చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న ప్రేమజంట స్వగ్రామానికి వెళితే ఏం జరుగుతుందోనని భయపడి కళ్యాణదుర్గానికి చేరుకున్నారు. పట్టణ సమీపంలోని అయ్యవారు గుట్ట కొండలోకి వెళ్లి గుండ్ల మధ్య గుహలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మేకల కాపరులు సాయంత్రం గమనించి సరోజా కాంపౌండ్ సమీపంలోని ప్రజలకు తెలియజేశారు. సీఐ శివప్రసాద్, ఎస్ఐలు జమాల్ బాషా, నబీరసూల్, ఏఎస్ఐ తులశన్నలు మృతదేహాలను పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
ప్రేమజంట ఆత్మహత్య
అన్నానగర్: తమ ప్రేమను తల్లిదండ్రులు వ్యతిరేకించడంతో ప్రేమజంట మంగళవారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. దిండుక్కల్ జిల్లా కొడైరోడ్డు సమీపం ధర్మపురి ప్రాంతంలో రైలు పట్టాలపై మంగళవారం యువతి, యువకుడి మృతదేహాలు పడిఉన్నాయి. దీనిపై స్థానికులు కొడైరోడ్డు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం దిండుక్కల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో ఇందులో మృతిచెందిన యువకుడు మదురై జిల్లా సోళవందాన్కు చెందిన రాజగురు కుమారుడు సోలైగురుస్వామి (25) అని, యువతి తిరువేడగం సమీపం తచ్చమ్పత్తుకి చెందిన జయకుమార్ కుమార్తె కౌసల్య (17)గా తెలిసింది. సోలై గురుస్వామి ఐటీఐ చదివి ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాడు. కౌసల్య సోళవందాన్లో పాఠశాల్లో ప్లస్–2 చదువుతోంది. వీరిద్దరూ ప్రేమించుకున్నట్టు తెలిసింది. వీరి ప్రేమను తల్లిదండ్రులు వ్యతిరేకించడంతో వీరిద్దరూ కొన్ని రోజుల కిందట ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయారు. అనంతరం తిరిగి ఇంటికి రాలేదు. ఈ స్థితిలో ప్రేమజంట మంగళవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
భువనగిరి అర్బన్ (తెలంగాణ) : ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన తెలంగాణలోని భువనగిరి రైల్వేస్టేషన్లో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం కోపల్లె గ్రామానికి చెందిన యువకుడు ధనుంజయ్, మైనర్ బాలిక కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్ద రూ పశ్చిమగోదావరి జిల్లా నుంచి హైదరాబాద్కు అక్కడి నుంచి భువనగిరికి బస్సులో వచ్చారు. భువనగిరి రైల్వేస్టేషన్కు చేరుకుని రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడాలని భావించారు. ధైర్యం చాలకపోవడంతో.. పురుగుల మందు తాగారు. తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా ముందే బాలిక తన బంధువులకు ఫోన్ ద్వారా తెలియజేసింది. దీంతో బంధువులు వెంటనే బీబీనగర్ మండలంలోని రాఘవాపురంలోని పౌల్ట్రీఫామ్లో పనిచేస్తున్న పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వారికి సమాచారం అందించారు. వారు వెంటనే భువనగిరి రైల్వేస్టేషన్కు చేరుకున్నారు. రైల్వేస్టేషన్లోని ప్లాట్ఫామ్ కింద పడిపోయి ఉన్న వీరిద్దరినీ గుర్తించారు. వెంటనే చికిత్స కోసం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రికి తరలింపు మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. విష యం తెలుసుకున్న రైల్వే పోలీసులు గాం ధీ ఆస్పత్రికి వెళ్లి వివరాలను తెలుసుకున్నారు. ప్రస్తుతం వారు కోలుకుంటున్నట్టు బంధువులు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరావాల్సి ఉంది. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం కాళ్ల: మండలంలోని కోపల్లె గ్రామానికి చెందిన పంపురెడ్డి ధనుంజయ్, అదే గ్రామానికి చెందిన మైనర్ బాలిక వ్యవసాయ పనులు చేస్తుంటారు. ధనుంజయ్ అత్తిలికి చెందినవాడు కాగా తల్లిదండ్రులు మరణించడంతో కోపల్లెలో తాత ఇం టి వద్ద ఉంటూ వ్యవసాయ పనులు చేస్తున్నాడు. ప్రేమికులిద్దరూ భువనగిరిలో ఆ త్మహత్యకు యత్నించడంతో స్థానికంగా కలకలం రేగింది. అయితే దీనిపై తమకు ఎటువంటి సమాచారం లేదని కాళ్ల పోలీసులు చెప్పారు. -
ప్రేమజంట బలవన్మరణం
బావతో వివాహం చేశారని ప్రియుడితో కలసి బాలిక అఘాయిత్యం బొంరాస్పేట: ప్రేమికుల దినోత్సవానికి ముందురోజు విషాదం చోటుచేసుకుంది. తమ ప్రేమను పెద్దలు అంగీకరించడం లేదని, బావతో వివాహం చేశారని మనస్తాపం చెందిన ఓ బాలిక ప్రియుడితో కలసి ఆత్మ హత్యకు పాల్పడింది. వికారాబాద్ జిల్లా బొంరాస్పేట మండలం దుద్యాల శివారులో సోమవారం ఈ ఘటన వెలుగుచూసింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ డివిజన్ నందిగామ మండలం పిట్టల గూడేనికి చెందిన గంగిశెట్టి సత్తయ్య రెండో కుమారుడు మధు(23) స్థానికంగా ఓ కూర గాయల నర్సరీ నిర్వహిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన వన్పలి చెన్నయ్య, నిర్మల దంపతుల ఏకైక కూతురు అఖిల(16) కొంతకాలంగా ప్రేమించుకున్నారు. గతేడాది నవంబర్లో మధు తమ కూతురును కిడ్నాప్ చేశాడని అఖిల కుటుంబీకులు కేసు పెట్టడంతో 40 రోజుల పాటు అతడు జైలుశిక్ష అనుభ వించాడు. అఖిల కుటుంబీకులు అదే గ్రామానికి చెందిన ఆమె మేనబావ గంగిశెట్టి మల్లేశ్కు ఇచ్చి డిసెంబర్లో పెళ్లి చేశారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం మధు, అఖిల బైక్పై బయలుదేరి వికారాబాద్ జిల్లా బొంరాస్పేట మండలం దుద్యాల శివారులోని కృష్ణగిరి ప్రాంతానికి చేరుకున్నారు. రాత్రి 7.30 గంటలకు కుటుంబసభ్యులకు ఫోన్ చేసి ‘మా ప్రేమను కాదంటున్నందుకు ఇద్దరం పారిపోయి వచ్చాం.. ఇక్కడ ఆత్మహత్య చేసుకుం టున్నాం..’అని చెప్పారు. ఇద్దరూ తమతో తీసుకొచ్చిన గుళికల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదే హాలను కొడంగల్ ఆస్పత్రికి తరలించారు. -
ప్రేమను పెద్దలు కాదన్నారని...
ఏలూరు (వన్ టౌన్) :తమ ప్రేమను పెద్దలు నిరాకరించడంతో మనస్థాపానికి గురైన ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేశారు. ఇద్దరు మృతిచెందగా ఒక యువతి పరిస్థితి విషమంగా ఉంది. చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం, కామవరపుకోట మండలాలలో జరిగిన ఈ ఘటనలపై బాధితులు, వారి బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెద్దలు నిరాకరించారని.. కామవరపుకోట మండలం తడికలపూడి గ్రామంలో నివాసం ఉండే వై వెంకటేశు(23) గ్రామంలోనే ఉంటూ తల్లిదండ్రులతో పాటు వ్యవసాయ కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నాడు. అదే గ్రామంలో నివాసం ఉండే మూలం శైలజ ఇంటర్ పూర్తి చేసి గ్రామంలోనే ఉన్న పామాయిల్ ఫ్యాక్టరీలోని వేబ్రిడ్జిలో పనిచేస్తోంది. శైలజ తండ్రి ఊరూరా తిరిగి నవారు అమ్ముకుని కుటుంబాన్ని పోషిస్తుంటాడు. నాలుగేళ్ల క్రితం నుంచి వెంకటేశు, శైలజలు ప్రేమించుకుంటున్నారు. శైలజకు వెంకటేశు వరసకు బావ అవుతాడు. ప్రేమించుకునే క్రమంలో పలుమార్లు వీరి ప్రేమ విషయం పెద్దల దగ్గర ప్రస్తావించారు. అయితే కట్నం కావాలని పెద్దలు కోరడంతో పెళ్లి వ్యవహారం కొన్నాళ్లు మరుగున పడింది. ఈ నేపథ్యంలో గురువారం వెంకటేశు కుటుంబ సభ్యులను నిలదీయడంతో కట్నం లేనిదే పెళ్లి కుదరదని తెగేసి చెప్పేశారు. దీంతో విసిగిపోయిన యువకుడు ప్రియురాలికి ఫోన్ చేసి ఇక మనపెళ్లి జరగదు వీళ్లు జరగనిచ్చేలా లేరు నువులేని జీవితం నాకెందుకు నేను చచ్చిపోతాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. తరువాత కొద్దిసేపటికే మళ్లీ ఫోన్ చేసి నేను వెళ్లిపోతున్నాను. నువ్వైనా సుఖంగా జీవించు. పురుగు మందు తాగేశాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. దీంతో యువతి కూడా వేబ్రిడ్జి కార్యాలయంలో ఉన్న సల్ఫర్ తాగేసింది. వెంకటేశును బంధువులు ఆటోలో, యువతిని 108 వాహనంలో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిని పరీక్షించిన వైద్యులు యువకుడు అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. యువతి పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స నిర్వహిస్తున్నారు. తడికలపూడి ఎస్సై కె.గురవయ్య కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లైన వ్యక్తితో వివాహం ఏమిటని పెద్దలు మందలించారని.. జంగారెడ్డిగూడెం కొత్తపేట ఇందిరాకాలనీలో నివాసం ఉండే నగరపు సింహాద్రి, అప్పాయమ్మలు ఎనిమిది సంవత్సరాల క్రితం ఉపాధి కోసం విజయనగరం నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. అప్పటి నుంచి కూలీపనులు చేసుకుని జీవిస్తున్నారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలలో శిరీష (19) ఆఖరి సంతానం. హైస్కూల్ వరకూ చదువుకుని తరువాత మానేసి ఇంటివద్దనే ఉంటోంది. కాలనీలో నివాసం ఉండే సూరిబాబు అనే తాపీమేస్త్రీతో పరిచయం ఏర్పడి ప్రేమించుకున్నారు. అయితే సూరిబాబు పది నెలల క్రితం వేరే పెళ్లి చేసుకున్నాడు. తనకు అతనితోనే పెళ్లి జరిపించాలని యువతి పట్టుబట్టింది. తల్లిదండ్రులు.. అతనికి పెళ్లైపోయింది నీకు మంచి సంబంధాలు వస్తున్నాయి అతనితో పెళ్లి వద్దూ అని పలుమార్లు చెప్పి చూశారు. ఈ క్రమంలో గురువారం ఉదయం ఏమైందో ఏమో తెలీదు కానీ తల్లిదండ్రులు పనికి వెళ్లాక యువతి తాడుతో ఇంట్లోనే ఉరి వేసుకోగా స్థానికులు చూసి జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని వైద్యులను సంప్రదించగా పరిస్థితి విషమంగా ఉందని ఏలూరు తరలించాలని చెప్పడంతో అక్కడి నుంచి ఏలూరు తీసుకెళ్లారు. అక్కడ యువతిని పరీక్షించిన వైద్యులు అత్యవసర చికిత్సా విభాగంలో ఉంచి వైద్యం చేశారు. ఈమె సాయంత్రం సమయంలో మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. జంగారెడ్డిగూడెం ఎస్సై కె.శ్రీహరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తిరుపతిలో ప్రేమ జంట ఆత్మహత్య
నల్లజర్ల రూరల్, తిరుపతి క్రైం: పెళ్లైన యువకుడు, పెళ్లికాని యువతి మధ్య ప్రేమ వారి ప్రాణాలు బలిగొన్న ఘటన గురువారం తిరుపతిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం వేళ్ల చింతలగూడెంకు చెందిన తురాయి దుర్గాప్రసాద్ (25) అలియాస్ పండుకు పెళ్లయింది. పెళ్లికి ముందు నుంచే నల్లజర్ల మండలం అనంతపల్లికి చెందిన ఏలూరి దేవిశ్రీ (17)తో ప్రేమ వ్యవహారం సాగుతోంది. దుర్గారావుకు ఇష్టం లేకుండా అతని తల్లిదండ్రులు ఆరు నెలల క్రితం గోపాలపురానికి చెందిన శిరీష అనే అమ్మాయితో వివాహం చేశారు. ఇది నచ్చని దుర్గారావు తన ప్రియురాలితో నాలుగు రోజుల క్రితం ఇంటినుంచి పరారయ్యాడు. వారు తిరుపతిలోని గోవిందరాజస్వామి గుడి సమీపంలోనున్న ఓ లాడ్జిలో బుధవారం ఉదయం 4 గంటల సమయంలో గది అద్దెకు తీసుకున్నారు. లాడ్జిలో ఇద్దరు మృతి చెందారని ఫోన్ కాల్ రావడంతో పోలీసులు పరిశీలించగా ఇద్దరు రక్తపు మడుగులో పడిఉన్నారు. వారి సెల్ఫోన ్ల ఆధారంగా బంధువులకు పోలీసులు ఫోన్ చేసి ఆరా తీయగా అతని పేరు దుర్గారావు, ఆమె పేరు దేవిశ్రీ అని తెలిసింది. దేవీశ్రీ కనిపిం చలేదని నల్లజర్ల పోలీస్స్టేషన్లో ఆమె తల్లిదండ్రులు ఈనెల 11న ఫిర్యాదు చేశారు. యువతి రెండు చేతులు కోసుకుని రక్తపు మడుగులో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఉంది. యువకుడు కూడా రెండు చేతులు కోసుకుని బాత్రూమ్లో వున్న షవర్కు ఉరివేసుకుని మృతి చెం దాడు. ఘటనా స్థలంలో పండూ ఐ లవ్యూ.. పండూ ఐలవ్యూ అని రాసి ఉన్న నోట్బుక్ దొరికింది. అనంతపల్లికి చెందిన బ్యాండ్ మాస్టర్ ఏలూరు శ్రీను కుమార్తె దేవిశ్రీ (17) ఈనెల 10వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. శ్రీను బ్యాండులో దుర్గాప్రసాద్ నాలుగేళ్లుగా కీబోర్డు వాయి స్తున్నాడు. శ్రీను కుమార్తె దేవిశ్రీ పాటలు పాడుతూ ఉండేది నల్లజర్ల ఎస్.ఆర్.కె. కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న దేవిశ్రీ మంగళవారం చదువుకోవడానికి తన అమ్మమ్మ గుంటుపల్లి అప్పలమ్మ ఇంటికి వెళ్లింది. బుధవారం తల్లి తండ్రులు ఫోన్ చేస్తే వారు రాలేదని చెప్పారు. దీంతో తండ్రి ఏలూరు శ్రీను పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఆదిలాబాద్ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య
ఆదిలాబాద్: ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని జెన్నారంలో శనివారం చోటుచేసుకుంది. కలిసి జీవించలేక, కలిసి మరణించాలని ఆ ప్రేమజంట నిర్ణయించుకుంది. దీంతో వారిద్దరూ ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు పాల్పడిన వారిద్దరి పరిస్థితి విషమించడంతో లక్సెట్టిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ ప్రేమజంట మృతిచెందినట్టు తెలుస్తోంది. మృతులు వనజ(16), రంజిత్(20)గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ కరీంనగర్ సారంగాపూర్ మండలం మంగల వాసులుగా గుర్తించినట్టు పోలీసులు చెప్పారు. వారి ప్రేమను పెద్దలు ఒప్పుకోకపోవడం చేతనే ఈ అఘాయిత్యానికి పాల్పడివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.