Mahabharat
-
'కల్కి' సీక్వెల్లో ప్రభాస్ పాత్ర చనిపోతుంది.. సీరియల్ కృష్ణుడు జోస్యం
ఎక్కడ చూసినా ఇప్పుడు 'కల్కి' మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. గత కొన్నాళ్ల నుంచి డల్గా ఉన్న బాక్సాఫీస్కి ఈ సినిమా మంచి ఊపు తీసుకొచ్చింది. ఇప్పటికే రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రాన్ని చాలామంది మెచ్చుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు తెలుగు హీరోలు ఇప్పటికే సినిమాని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. తాజాగా మహాభారత్ సీరియల్ లో కృష్ణుడిగా చేసిన నితీశ్ భరద్వాజ్ వ్యాఖ్యలు మాత్రం చర్చనీయాంశమయ్యాయి.(ఇదీ చదవండి: భోజనం చేస్తూ అస్సలు ఈ సినిమా చూడొద్దు.. డేర్ చేసి చూస్తే మాత్రం?)ఇంతకీ ఏమన్నారంటే?'మ్యాడ్ మ్యాక్స్ సినిమాలని దర్శకుడు నాగ్ అశ్విన్ సూర్తిగా తీసుకుని 'కల్కి 2898' తీసినప్పటికీ పురాణాలని లింక్ చేస్తూ స్క్రీన్ ప్లే నడిపించారు. సెట్టింగులతో ఇది పురాణాలకు సంబంధించిన కథనే అన్నట్లు తెలివిగా తెరకెక్కించారు. ఫిక్షన్, పురాణాలని కలిపి కొత్తగా ప్రెజెంట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. నా అంచనా ప్రకారం సీక్వెల్లో ప్రభాస్ పాత్ర చనిపోతుంది. ఎందుకంటే కర్ణుడికి అశ్వధ్ధామ, కృష్ణుడు కలిసి విముక్తి కలిగించినట్లు పార్ట్ 2లో చూపిస్తారేమో! అయితే కృష్ణుడి ముఖాన్ని దాచిపెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ నేను సిద్ధంగా ఉన్నాను' అని నితీశ్ భరద్వాజ్ చెప్పుకొచ్చారు.ఎంత నిజం?నితీశ్ భరద్వాజ్ చెప్పినట్లు పార్ట్ 2లో ప్రభాస్ పాత్ర చనిపోకపోవచ్చు. ఎందుకంటే తొలి భాగం చివర్లో అంతలా హైప్ ఇచ్చి ప్రభాస్ని కర్ణుడిగా చూపించారు. ఒకవేళ ఇదే పాత్ర గనక రెండో భాగంలో మరణిస్తే అభిమానులు దీన్ని తీసుకోలేకపోవచ్చు. అంటే నితీశ్ భరద్వాజ్ చెప్పినట్లేం ఏం జరగకపోవచ్చు. మరి ఇలాంటి కామెంట్స్ అన్నింటికీ ఎండ్ కార్డ్ పడాలంటే మాత్రం 'కల్కి 2' వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. దర్శకుడు తాజాగా మీడియా మీట్లో చెప్పిన దానిబట్టి చూస్తే.. మరో రెండు మూడేళ్ల తర్వాత పార్ట్-2 రిలీజ్ కావొచ్చేమో!(ఇదీ చదవండి: OTT: ఐదుగురు భార్యలతో 'నాగేంద్రన్స్ హనీమూన్స్' ట్రైలర్) -
అంతరార్థం..
ఎవరైనా ఏదైనా ఒక పని చేస్తే దాన్ని చూసిన మనం అతడు అలా చేయటం మంచిదనో లేదా చెడ్డదనో వెంటనే తీర్పుచెబుతూ ఉంటాం. అలా చేయటం తగదని శ్రీ రామకృష్ణ పరమహంస రామాయణ, మహాభారతాల నుంచి కొన్ని ఉదాహరణలు చూపారు. రామరావణ యుద్ధంలో రావణ కుంభకర్ణాది యుద్ధ వీరులంతా చనిపోయారు. రావణుని తల్లి కైకశి ప్రాణభయంతో పారిపోసాగింది.లక్ష్మణుడు అలా పారిపోతున్న ఆ వృద్ధ స్త్రీని గమనించి శ్రీరామ చంద్రునితో, ‘అన్నయ్యా! ఏమిటీ వింత? అనేక మంది పుత్రులను, బంధువులను కోల్పోయి పుత్ర శోకాన్ని అనుభవిస్తూ ఇప్పుడు స్వీయ ప్రాణ రక్షణార్థం ఈ వృద్ధురాలు ఇలా ఎందుకు పారిపోతోంది?’ అని అడిగాడు. అందుకు రాముడు ‘ఆమెనే అడిగి కారణం కనుక్కొందాం’ అన్నాడు. ‘శ్రీరాముడు అభయమిచ్చాడని తెలిపి ఆమెను గౌరవంగా నా కడకు తోడ్కొని రండి అని కొందరిని ఆమె కడకు పంపాడు. వారు అలాగే చేశారు.‘నీవు ప్రాణ భీతితో అలా పారిపోతున్నావా? నిజం చెప్పు’ అన్నాడు శ్రీరామ చంద్రుడు ఆమెతో. అప్పుడామె, ‘ఓ రామా! నేను జీవించి ఉన్నందునే నీ ఈ లీలలను తిలకించ గల్గుతున్నాను. ఈ భూమ్మీద నీవు ఇంకా జరుపబోయే లీలలను కూడా చూడగోరి ఇంకా కొంత కాలం జీవించాలని అభిలషిస్తున్నాను’ అని చెప్పింది. దీంతో సత్యమేమిటో అందరికీ తెలిసి వచ్చింది.మహాభారత ఉదాహరణ చూద్దాం. భీష్ముడు అంపశయ్యపై ఉన్నాడు. శ్రీకృష్ణుడు, పంచ పాండవులు ఆయన చుట్టూ నిలబడి ఉన్నారు. మహావీరుడైన భీష్మాచార్యుల వారి కళ్ళ నుండి అశ్రువులు స్రవించటం వారు గమనించారు. అర్జునుడు శ్రీకృష్ణునితో, ‘సఖా! ఎంత విచిత్రంగా ఉంది. కురు పితామహులైన భీష్ములు మరణ సమయంలో మాయలో పడి దుఃఖిస్తున్నా రేమిటి?’ అన్నాడు. కృష్ణుడే భీష్ముడిని దాన్నిగూర్చి అడిగాడు.అప్పుడు భీష్ముడు, ‘ఓ కృష్ణా! మరణ భయంతో నేను దుఃఖించటం లేదని నీకు బాగా తెలుసు, స్వయంగా భగవంతుడే పాండవులకు సారథిగా ఉన్నప్పటికీ వారి కష్టాలకు అంతులేకుండా ఉందే! ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు భగవంతుడి లీలలను కించిత్తూ తెలుసుకోలేకుండా ఉన్నానే అని తలచుకొని దుఃఖిస్తున్నాను’ అన్నాడు (శ్రీ రామకృష్ణ కథామృతం–01). కాబట్టి దేన్ని చూసినా, విన్నా త్వరపడి విమర్శించ కూడదు. నిజం నిలకడ మీద తేలుతుంది. – రాచమడుగు శ్రీనివాసులు -
మహాభారతం గురించే డిస్కషన్.. ఇదంతా 'కల్కి' వల్లే
మొన్నటివరకు టాలీవుడ్లో మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని ఫ్యాన్స్ మాటలతో కొట్టేసుకునేవాళ్లు. ఇప్పుడు ట్రెండ్ మారింది. మహాభారతం హాట్ టాపిక్ అయిపోయింది. అర్జునుడు గొప్ప? కర్ణుడు గొప్ప? లాంటి చర్చలు మొదలయ్యాయి. ఇవన్నీ కాదన్నట్లు ఇన్ స్టాలో రీల్స్ దగ్గర నుంచి టీ కొట్టు దగ్గర ముచ్చట్ల వరకు మహాభారతమే వినిపిస్తుంది. దీనంతటికీ వన్ అండ్ ఓన్లీ రీజన్ నాగ్ అశ్విన్.(ఇదీ చదవండి: పేరు మార్చుకున్న ప్రభాస్.. 'కల్కి'లో ఇది గమనించారా?)అప్పట్లో మహాభారతం ఆధారంగా సీరియల్స్, సినిమాలు వచ్చాయి. కానీ గత కొన్నేళ్ల నుంచి తీసుకుంటే ఏ డైరెక్టర్ కూడా దీన్ని సినిమాగా, కనీసం సీన్స్ వరకైనా తీసే సాహసం చేయలేదు. రాజమౌళి కూడా తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారతం' అని చెప్పాడు. కాకపోతే జక్కన్న ఇది తీసేసరికి ఇంకో 10-15 ఏళ్లయినా పట్టొచ్చు. ఇంతలోనే నాగ్ అశ్విన్ అనే కుర్ర డైరెక్టర్ రయ్ అని దూసుకొచ్చాడు.మరీ పూర్తిగా కాకపోయినా సరే 'కల్కి'లో మహాభారతంలోని కురుక్షేత్రానికి సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్తో అబ్బురపరిచాడు. అశ్వద్థామ పాత్రని 'కల్కి'తో లింక్ చేసిన విధానం సగటు ప్రేక్షకుడికి తెగ నచ్చేసింది. దీంతో అసలు అశ్వద్థామ ఎవరు? అతడికి కర్ణుడితో సంబంధం ఏంటనే సీరియస్గా తెగ సెర్చ్ చేసేస్తున్నారు. 'కల్కి' అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.(ఇదీ చదవండి: 'కల్కి' మూవీలో కృష్ణుడిగా చేసిన నటుడెవరో తెలుసా?)ఇక 'కల్కి' చివర్లో ప్రభాస్ కర్ణుడిగా కనిపించడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఊరుకోవట్లేదు. కర్ణుడి చరిత్ర అంతా తవ్వితీస్తున్నారు. ఎప్పుడో 60 ఏళ్ల క్రితం వచ్చిన చందమామ కథలు పుస్తకాల దగ్గర నుంచి గీత ట్రస్ట్ మహాభారతం వరకు ఎవరికీ తోచిన పుస్తకాలని వాళ్లు తిరగేస్తున్నారు. ఇది కాదన్నట్లు మహాభారతం క్యారెక్టర్స్ గురించి పలువురు యాక్టర్స్ మాట్లాడిన వీడియోలని ట్విట్టర్లో వైరల్ చేస్తున్నారు.ఏదేమైనా ఓ తెలుగు సినిమా వల్ల 'మహాభారతం' అనే అద్భుతం గురించి తిరిగి మాట్లాడుకోవడం చాలా బాగుంది. ఇప్పటి జనరేషన్కి మహాభారతంపై మనసు పడేలా చేసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్కి ధన్యవాదాలు. కాకపోతే అర్జున vs కర్ణ.. ఇద్దరిలో ఎవరు గొప్ప అనే టాపిక్ గురించి యూత్ తగువులాడుకోవడం మాత్రం వింతగా ఉంది.(ఇదీ చదవండి: ‘కల్కి 2898 ఏడీ’ మూవీ రివ్యూ)Thank you man @nagashwin7 🥺❤️Chinnaptinunchi karnudi story amtey chala istam...finally see the Elevations on screen about karna☀️ Even the Divine knows real Hero of MAHABHARAT🙌🔥 #Karna #Kalki2898ADonJune27 #Mahabharath #Kalki2898ADReview pic.twitter.com/PhmsJae837— DRUG❤️🔥 (@Akhilgo16778185) June 28, 2024 -
నా మాజీ సతీమణి వేధిస్తుంది.. ఫిర్యాదు చేసిన ప్రముఖ నటుడు
బుల్లితెరపై మహాభారతంలో కృష్ణుడిగా నటించిన నితీష్ భరద్వాజ్ తన భార్యపై మానసిక వేధింపుల కేసు పెట్టారు. ఆయన భార్య స్మిత మధ్యప్రదేశ్ క్యాడర్లో జిల్లా కలెక్టర్గా ఉన్నారు. చాలా రోజుల నుంచి స్మిత తనను మానసికంగా వేధింపులకు గురి చేస్తుందంటూ భోపాల్ కమీషనర్ ఆఫ్ పోలీస్కి ఆయన ఫిర్యాదు చేశారు. స్మిత ఆయనకు రెండో భార్య. 1991లో మోనిషా పాటిల్తో నితీష్ భరద్వాజ్కు మొదటి వివాహం జరిగింది. 2005లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఐఏఎస్ అధికారిణి అయిన స్మితను ప్రేమించి నితీష్ రెండో పెళ్లి చేసుకున్నారు. కానీ వారిద్దరి మధ్య కూడా విభేదాలు రావడంతో 2019లో విడాకుల కోసం ధరఖాస్తు చేసుకుంటే 2022లో ముంబై ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసింది. తాజాగా తన రెండో భార్య స్మితపై వేధింపుల కేసు పెట్టడంతో సంచలనంగా మారింది. భోపాల్ పోలీస్ కమిషనర్ హరినారాయణచారి మిశ్రా ఈ ఫిర్యాదును స్వీకరించారు. ఈ ఫిర్యాదును స్వీకరించి విచారణకు ఆదేశించారు. ఏడీసీపీ షాలినీ దీక్షిత్ ఆధ్వర్యంలో విచారణ జరుపుతున్నట్లు కమిషనర్ హరినారాయణచారి మిశ్రా తెలిపారు. ఈ కేసులో నిజానిజాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, నితీష్, ఐఏఎస్ అధికారిణి స్మిత ఒకరినొకరు ప్రేమించుకుని 2009లో మధ్యప్రదేశ్లో పెళ్లి చేసుకున్నారు. 12 సంవత్సరాల వివాహం తరువాత విబేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలు స్మిత వద్దే ఉంటున్నారు. వారిని కలుద్దామనుకుంటే ఆ అవకాశం స్మిత కల్పించడం లేదని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నాడు. వీరికి 11 ఏళ్ల వయస్సు గల కవల కుమార్తెలు ఉన్నారు. తనను స్మిత మానసిక వేధనకు గురిచేస్తుందని ఆయన ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రముఖ టీవీ షో 'మహాభారతం'లో నటుడు నితీష్ భరద్వాజ్ శ్రీకృష్ణుడి పాత్ర పోషించి మెప్పించారు. గతంలో ఆయన పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఉన్నారు. -
రాజమౌళికి షాక్.. డిజాస్టర్ దర్శకుడి చేతిలో 'మహాభారతం' సినిమా
'మహాభారతం' సినిమా తీయాలనేది నా కల. ఇది స్టార్ డైరెక్టర్ రాజమౌళి చాలాఏళ్ల క్రితమే చెప్పిన మాట. ఇప్పటి జనరేషన్ దర్శకుల్లో పీరియాడికల్ చిత్రాలంటే రాజమౌళికి మాత్రమే సాధ్యం అనేంతలా బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే జక్కన షాక్ ఇస్తూ ఓ డైరెక్టర్ 'మహాభారతం' సినిమాని ప్రకటించాడు. ఇప్పుడదే మూవీ లవర్స్ని కంగారు పెడుతోంది. (ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'తో పోలిక.. రూ.3 కోట్ల కలెక్షన్ కూడా రాలేదు!) హిందీలో ఏవేవో సినిమాలు తీసిన డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి.. కనీసం గుర్తింపు సంపాదించలేకపోయాడు. 'ది తాష్కెంట్ ఫైల్స్'తో కాస్త ఫేమ్ వచ్చింది. ఇక 'ద కశ్మీర్ ఫైల్స్' సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అనుకోకుండా వచ్చిన ఈ ఫేమ్ని క్యాష్ చేసుకోవాలని 'ద వ్యాక్సిన్ వార్' మూవ తీశారు. సెప్టెంబరు 28న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. కనీసం వసూళ్లు తెచ్చుకోలేక ఘోరమైన డిజాస్టర్ అయింది. ఇప్పుడు 'మహాభారతం' సినిమాని మూడు భాగాలుగా తీస్తున్నట్లు వివేక్ అగ్నిహోత్రి ప్రకటించాడు. 'పర్వ' అనే టైటిల్ ఫిక్స్ చేయడంతో పాటు కృష్ణుడు, అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మరి 'ద కశ్మీర్ ఫైల్స్' తప్ప చెప్పుకోదగ్గ రేంజులో ఒక్కటంటే ఒక్క సినిమా తీయలేకపోయిన వివేక్ అగ్నిహోత్రి.. 'మహాభారతం' చిత్రాన్ని ఏం చేస్తాడోనని ఆడియెన్స్ కంగారుపడుతున్నారు. (ఇదీ చదవండి: 'భగవంత్ కేసరి'కి షాకిచ్చిన తారక్,మెగా ఫ్యాన్స్.. భారీగా నష్టాలు) BIG ANNOUNCEMENT: Is Mahabharat HISTORY or MYTHOLOGY? We, at @i_ambuddha are grateful to the almighty to be presenting Padma Bhushan Dr. SL Bhyrappa’s ‘modern classic’: PARVA - AN EPIC TALE OF DHARMA. There is a reason why PARVA is called ‘Masterpiece of masterpieces’. 1/2 pic.twitter.com/BiRyClhT5c — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) October 21, 2023 -
మహాభారతంలోని ఖాండవవనం దహనం గురించి మీకు తెలుసా?
ఒకసారి వేసవిలో చల్లగా ఉంటుందని కృష్ణార్జునులు సపరివారంగా అరణ్యప్రాంతానికి వెళ్లారు. కొన్నాళ్లు అక్కడే గడిపేందుకు వీలుగా విడిది ఏర్పాటు చేసుకున్నారు. ఒకరోజు కృష్ణార్జునులు వనవిహారం చేస్తుండగా, ఒక బ్రాహ్మణుడు వారి వద్దకు వచ్చాడు. వారు అతడికి అర్ఘ్యపాద్యాలు సమర్పించి, సత్కరించారు. కుశల ప్రశ్నలయ్యాక ఏం కావాలని ప్రశ్నించారు.‘అయ్యా! నాకు బాగా ఆకలిగా ఉంది. భోజనం పెట్టించగలరా?’ అని అడిగాడు.‘విప్రోత్తమా! మీకు ఏమేమి ఇష్టమో చెప్పండి. వండించి పెడతాం’ అన్నారు కృష్ణార్జునులు. అప్పుడా బ్రాహ్మణుడు తన నిజరూపంలో అగ్నిదేవుడిగా వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. ‘నేను అగ్నిదేవుడిని. ఔషధమూలికలు పుష్కలంగా ఉన్న ఖాండవవనాన్ని నేను దహించాలి. అప్పుడు గాని నా అజీర్తిబాధకు ఉపశమనం కలగదు. అయితే, నేను ఖండవవనాన్ని దహించకుండా దేవేంద్రుడు ఆటంకం కలిగిస్తున్నాడు. మీరిద్దరూ తోడుంటే, ఖాండవాన్ని దహించివేస్తాను’ అన్నాడు.‘స్వామీ! అమితశక్తిమంతులు మీరు. మీకు అజీర్తిబాధ కలగడమా? ఆశ్చర్యంగా ఉందే!’ అన్నాడు అర్జునుడు.‘చాలాకాలం కిందట శ్వేతకి అనే రాజర్షి వందేళ్ల సత్రయాగం చేయ సంకల్పించాడు. అన్నేళ్లు ఏకధాటిగా రుత్విక్కుగా ఉండేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దాంతో అతడు ఈశ్వరుని కోసం తపస్సు చేసి, ఆయనను మెప్పించాడు. శ్వేతకి తన సంకల్పం చెప్పడంతో ఈశ్వరుడు దుర్వాస మహర్షిని అతడికి యాజ్ఞికుడిగా నియమించాడు. దుర్వాసుడి ఆధ్వర్యంలో శ్వేతకి నిరాఘాటంగా వందేళ్లు సత్రయాగం చేశాడు. యజ్ఞగుండంలో విడిచిన నేతిధారలను నేను అన్నేళ్లూ ఆరగించాను. అందువల్ల నాకు అజీర్తి పట్టుకుంది. నివారణ కోసం బ్రహ్మ వద్దకు వెళితే, ఖాండవవనంలో పుష్కలంగా ఔషధ మూలికలు ఉన్నాయి. వాటిని ఆరగిస్తే, అజీర్తి నయమవుతుందని సెలవిచ్చాడు. ఖాండవ దహనానికి నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా, ఇంద్రుడు అడ్డుకుంటూ వస్తున్నాడు’ అని అగ్నిదేవుడు గోడు వెళ్లబోసుకున్నాడు. ‘దేవా! నీకు మేము సహాయం చేయగలం గాని, ఇప్పుడు మా వద్ద ఆయుధాలేవీ లేవు’ అన్నాడు అర్జునుడు. ‘మీకా చింత వద్దు’ అంటూ అగ్నిదేవుడు వెంటనే వరుణ దేవుడిని పిలిచాడు. వరుణుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు.‘వరుణదేవా! నీకు బ్రహ్మదేవుడు ఇచ్చిన ధనుర్బాణాలను, రథాన్ని అర్జునుడికి ఇవ్వు. చక్రాన్ని, గదను కృష్ణుడికి ఇవ్వు’ అన్నాడు.వరుణుడు సరేనంటూ, కృష్ణార్జునులకు ఆయుధాలను, రథాన్ని ఇచ్చాడు. కృష్ణార్జునులను తనకు తోడుగా తీసుకువెళ్లి, అగ్నిదేవుడు ఖాండవవనాన్ని దహించడం మొదలుబెట్టాడు. కృష్ణార్జునులు ఇరువైపులా అగ్నిదేవుడికి రక్షణగా నిలిచారు. అడ్డు వచ్చిన వనరక్షకులను సంహరించారు. అడవిలోని పశుపక్ష్యాదులన్నీ అగ్నిజ్వాలలకు ఆహుతి కాసాగాయి.ఇంద్రుడికి ఈ సంగతి తెలిసి, ఖాండవవనం మీద కుంభవృష్టి కురవాలంటూ మేఘాల దండును పంపాడు. ఖాండవంపై మేఘాలు కమ్ముకోగానే, అర్జునుడు తన బాణాలతో ఖాండవ వనమంతా కప్పేస్తూ పైకప్పును నిర్మించాడు.మేఘాలు కుంభవృష్టి కురిసినా, ఖాండవంపై చినుకైనాకురవలేదు. అగ్నిదేవుడికి ఎలాంటి ఆటంకం ఏర్పడలేదు.అగ్నికీలల నుంచి రక్షించుకోవడానికి తక్షకుడి కొడుకైన అశ్వసేనుడు తల్లి తోకను పట్టుకుని ఆకాశంలోకి ఎగిరాడు. అర్జునుడు అశ్వసేనుడిని బాణాలతో కొట్టాడు. అది చూసి ఇంద్రుడు అర్జునుడితో తలపడ్డాడు. అర్జునుడిపై మోహినీ మాయ ప్రయోగించి, అశ్వసేనుడిని, అతడి తల్లిని కాపాడాడు. నిమిషంలోనే తేరుకున్న అర్జునుడు వెంటనే ఇంద్రుడిపై తిరగబడ్డాడు. చాలాసేపు యుద్ధం సాగింది. తనను తాను కాపాడుకోవడానికి ఇంద్రుడు యుద్ధం కొనసాగిస్తూ ఉండగా, ‘దేవేంద్రా! వీరిద్దరూ నరనారాయణులు. వీరిని జయించడం నీకు అసాధ్యం.తక్షకుడు తప్పించుకుని కురుక్షేత్రానికి పారిపోయాడు’ అని అశరీరవాణి పలికింది. చేసేదేమీ లేక ఇంద్రుడు తిరిగి స్వర్గానికి బయలుదేరాడు. ఖాండవదహనం సాగుతుండగా, సముచి అనే రాక్షసుడి కొడుకైన మయుడు అర్జునుడిని శరణుజొచ్చి ప్రాణాలను దక్కించుకున్నాడు. మయుడితో పాటు అతడి తల్లి, మందపాలుడు, అతడి కొడుకులైన నలుగురు శారఙ్గకులు కూడా ప్రాణాలు దక్కించుకున్నారు.అగ్నిదేవుడు పదిహేను రోజుల పాటు ఖాండవవనాన్ని సమూలంగా దహించి, తన ఆకలి తీర్చుకున్నాడు. అగ్నిదేవుడి అజీర్తిబాధ నయమైంది. తనకు సహకరించిన కృష్ణార్జునులకు కృతజ్ఞతలు తెలిపి తన దారిన వెళ్లిపోయాడు. -
G20 Summit - జీ20 అతిధులకు బుక్లెట్లు
న్యూఢిల్లీ: 'భారత్' అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న జీ 20 సదస్సుకు ఆయా దేశాలకు చెందిన నేతలు హాజరుకానున్నారు. వారికి ఇవ్వడానికి భారతీయత ఉట్టిపడే విధంగా రెండు పుస్తకాలను ముద్రించింది కేంద్ర ప్రభుత్వం. క్రీస్తుపూర్వం 6000 ఏళ్లనాటి భారత చరిత్ర మొత్తం ప్రతిబింబించేలా వీటిని ముద్రించింది. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో న్యూఢిల్లీ వేదికగా జరగబోయే జీ 20 సమావేశాలకు భాగస్వామ్య 20 దేశాలతో పాటు అతిధులుగా మరో తొమ్మిది దేశాలు కూడా హాజరు కానున్నాయి. ఈ నేపథ్యంలో అతిరథ మహారధులందరికి చేతికి అందివ్వడానికి రెండు బుక్లెట్లను ముద్రించింది కేంద్రం. వీటిలో ఒకటి 'భారత్-ప్రజాస్వామ్యానికి మాతృక' కాగా రెండవది 'భారతదేశంలో ఎన్నికలు'. ఈ రెండు పుస్తకాల్లోని 40 పేజీల్లో రామాయాణం, మహాభారతంలోని ఇతిహాస ఘట్టాలు, ఛత్రపతి శివాజీ, అక్బర్ వంటి చక్రవర్తుల వీరగాధలతో పాటు సార్వత్రిక ఎన్నికల ద్వారా భారతదేశంలో అధికార మార్పిడి గురించిన పూర్తి సమాచారాన్ని పొందుపరిచారు. ప్రజాస్వామ్య తత్వమన్నది భారతదేశ ప్రజల్లో సహస్రాబ్దాలుగా భాగమని చెప్పడము ఈ రెండు బుక్లెట్ల ముఖ్య ఉద్దేశ్యమని తెలుపుతూ ఈ ప్రతుల సాఫ్ట్ కాపీలను జీ20 అధికారిక వెబ్సైట్లో కూడా ఉంచింది. మొదటి 26 పేజీల డాక్యుమెంటు భారత దేశాన్ని ప్రజాస్వామ్యానికి మాతృకగా వర్ణిస్తుంది. దీని ముఖచిత్రంగా 5000 ఏళ్ల నాటి నాట్యం చేస్తున్న మహిళామూర్తి కాంస్య ప్రతిమను ముద్రించారు. సామాన్యులు ఎన్నుకునే ప్రజాప్రతినిధుల సభనుద్దేశించి చతుర్వేదాల్లో ఆది వేదమైన ఋగ్వేదంలోని శ్లోకాన్ని కూడా ముద్రించారు. రామాయణ, మహాభారతాల్లోని ప్రజాస్వామిక అంశాలను ప్రస్తావించారు. రామాయణం నుంచి దశరధ మాహారాజు ప్రజాప్రతినిధులు, మంత్రులను సంప్రదించి వారు ఆమోదించిన తర్వాతే శ్రీరామచంద్రుడిని చక్రవర్తిగా పట్టాభిషేకం ఘట్టాన్ని ప్రచురించారు. అదేవిధంగా మహాభారతం నుంచి ధర్మరాజుకు భీష్మణాచార్యలు చెప్పినా సుపరిపాలనా నియామాల గురించి.. ప్రజా శ్రేయస్సు, సంతోషాలను కాపాడటమే రాజు ధర్మమని చెప్పిన అంశాలను కూడా పుస్తకంలో ప్రస్తావించారు. బౌద్ధమతం దాని సిద్ధాంతాలు ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా ప్రభావితం చేశాయో, అశోకుడు, చంద్రగుప్త మౌర్యుడు, శ్రీకృష్ణదేవరాయలు, ఛత్రపతి శివాజీ వంటి చక్రవర్తులకు చాణక్యుడి అర్థశాస్త్రం ఏ విధంగా ప్రజాస్వామ్య నిఘంటువుగా నిలిచి నడిపియించిందో అందులో పొందుపరిచారు. ఇది కూడా చదవండి: రాహుల్ లోక్సభ సభ్యత్వం పునరుద్ధరణ.. సుప్రీంకోర్టులో పిల్ -
స్వర్గం నుంచి దిగివచ్చిన దేవతా వృక్షం.. రాత్రయితే అంతులేని అందాల విందు!
స్వర్గం ఎంత అందంగా ఉంటుందో మనం అనేక కథల రూపంలో వినేవుంటాం. స్వర్గం నుంచి దిగివచ్చే అప్సరసలు కంటిమీద కునుకులేకుండా చేస్తుంటారని కొందరు అంటుంటారు. అయితే మీరు ఎప్పుడైనా స్వర్గం నుంచి దిగివచ్చిన వృక్షం గురించి విన్నారా? అవును.. ఇప్పుడు మనం స్వర్గపు వృక్షం అంటే పారిజాత వృక్షం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ దివ్య వృక్షం ఉత్తరప్రదేశ్లోని ఒక గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. ఈ వృక్షానికి ప్రతిరాత్రి రంగురంగుల పూలు వికసిస్తాయి. అవి ఉదయానికి రాలిపోతాయి. ఈ దివ్య వృక్షాన్ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి తరలివస్తుంటారు. పౌరాణిక గాథల ప్రకారం సాగరాన్ని మథించినప్పుడు అమృతంతో పాటు పారిజాత వృక్షం కూడా వెలికి వచ్చిందని చెబుతారు. శ్రీకృష్ణుడు ఈ పారిజాతాన్ని తన తన భార్య సత్యభామ కోరిక మేరకు స్వర్గం నుండి భూమికి తీసుకువచ్చాడని చెబుతారు. అర్జునుడు మహాభారత కాలంలో ద్వారకా నగరంలోని ఈ వృక్షాన్ని కింతూర్ గ్రామానికి తీసుకువచ్చాడని స్థానికులు చెబుతుంటారు. ఈ పారిజాత వృక్షం ఉత్తరప్రదేశ్లోని బారాబంకి జిల్లాలో గల కింతూర్ గ్రామంలో ఉంది. ఈ పారిజాత వృక్షానికి స్థిరమైన పేరు లేదు. దీనిని హర్సింగర్, షెఫాలీ, ప్రజక్త అనేక ఇతర పేర్లతో పిలుస్తారు. పారిజాతంనకు బెంగాల్ రాష్ట్ర పుష్పం హోదా కూడా ఉంది. ఈ భారీ పారిజాత వృక్షం ఈ గ్రామంలో మాత్రమే కనిపిస్తుంది. ప్రతి రాత్రి ఈ చెట్టుకు చాలా అందమైన పూలు వికసిస్తాయి. ఉదయం కాగానే ఈ పూలన్నీ నేలరాలిపోతాయి. యూపీలోని బారాబంకి జిల్లాకు 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న కింతూర్ గ్రామం మహాభారత కాలంలో నిర్మితమయ్యిందని చెబుతారు. పాండవుల తల్లి అయిన కుంతి పేరు మీదుగా ఈ గ్రామం ఏర్పడిందంటారు. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు వారు ఈ గ్రామంలోనే ఉన్నారట. కుంతీమాత ప్రతిరోజూ శివునికి పూలు సమర్పించవలసి వచ్చినప్పుడు, అర్జునుడు పారిజాత వృక్షాన్ని స్వర్గం నుంచి ఇక్కడకు తీసుకువచ్చారని చెబుతారు. గ్రామంలో కుంతీమాత నెలకొల్పిన కుంతేశ్వరాలయం కూడా ఉంది. ఇతర పూలతో పోలిస్తే పారిజాతం పూలు ప్రత్యేక సమయంలో మాత్రమే వికసిస్తాయి. దీని వెనుక ఇంద్రుని శాప వృత్తాంతం దాగి ఉంది. ప్రపంచం మొత్తంలో పూలు ఉదయం పూస్తుండగా, పారిజాతం పూలు రాత్రి పూట వికసించి, చూపరులకు అందాలను అందిస్తాయి. సత్యభామ ఈ పూలతో తన కురులకు అలంకరించుకునేదని, రుక్మణి ఈ పూలను పూజకు ఉపయోగించేదని చెబుతుంటారు.ఈ తరహా పారిజాత వృక్షం భారతదేశంలోని కింతూర్ గ్రామంలో మాత్రమే కనిపించడం విశేషం. ఇది కూడా చదవండి: తండ్రి బకాయి కోసం.. కుమార్తెతో 52 ఏళ్ల వ్యక్తి పెళ్లి.. తుపాకీ చూపించి.. -
అది రావణుని మూత్రంతో నిండిన చెరువు.. ఎక్కడుందంటే..
మనదేశంలో రామాయణ, మహాభారత కథలతో ముడిపడిన ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. అవి ఎంతో ఆదరణ పొందుతున్నాయి కూడా. వీటిలో విచిత్రమైన ప్రాంతాలు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటే రావణుని మూత్రంతో ఏర్పడిన చెరువు. వింత కథనం ఈ కథ ఎంతో వింతగా అనిపిస్తుంది. అయితే మనదేశంలోని కొన్ని ప్రాంతాలతో ముడిపడిన కథలు స్థానికుల, పురాణాల నమ్మకాలపై ఆధారపడి ఉంటాయి. రావణుని మూత్రంతో నిండిన చెరువు కూడా ఈ కోవలోకే వస్తుంది. జార్ఖండ్లోని బైద్యనాథ్లో అత్యంత ప్రాచీన శివాలయం ఉంది. ఈ ఆలయంలోని శివలింగాన్ని రావణుడు ఇక్కడికి తీసుకువచ్చాడని చెబుతారు. కనీసం నీటిని తాకరు ఈ ఆలయానికి సమీపంలో రెండు చెరువులు ఉన్నాయి. వాటిలో ఒక చెరువు రావణుని మూత్రంతో ఏర్పడిందని చెబుతారు. ఈ కారణంగానే ఇక్కడికి వచ్చేవారు కనీసం ఈ నీటిని తాకరు. అలాగే ఈ నీటిని ఏ పనులకు కూడా వినియోగించరు. రావణుని మొండితనాన్ని గ్రహించి.. ఆలయ స్థల పురాణం ప్రకారం ఒకసారి రావణుడు మహాశివునికి ప్రతిరూపమైన శివలింగాన్ని లంకకు బలవంతంగా తీసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. రావణుని మొండితనాన్ని గ్రహించిన మహాశివుడు ఆ శివలింగాన్ని దారిలో ఎక్కడ కింద పెట్టినా, అది మరిక కదలదని చెబుతాడు. ఈ షరతు విన్న రావణుడు దానికి సరేనంటాడు. అయితే ఈ సంగతి తెలుసుకున్న విష్ణుమూర్తి ఇది జరగకుండా చూడాలని తిరిగి శివుడిని కోరుతాడు. లఘుశంక తీర్చుకునేందుకు.. శివలింగం తీసుకువెళుతున్న రావణుడు దారిలో లఘుశంక కోసం ఆగాల్సి వస్తుంది. ఈ సమయంలో మహావిష్ణువు బాలుని రూపంలో రావణునికి ఎదురవుతాడు. రావణుడు కాసేపు ఈ శివలింగాన్ని పట్టుకోవాలని ఆ పిల్లవాడిని కోరతాడు. రావణుడు లఘుశంక తీర్చుకుని తిరిగి వచ్చేసరికి ఆ బాలుడు కనిపించడు. అయితే ఆ శివలింగం అక్కడ నేలపై ఉంటుంది. రావణుడు ఆ శివలింగాన్ని పైకి లేపేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదట. బైద్యనాథ్లో కొలువై.. ఆ శివలింగమే బైద్యనాథ్లో కొలువై పూజలు అందుకుంటోందని చెబుతారు. రావణుడు మూత్రం పోసిన ప్రాంతం చెరువుగా మారిందని, అందుకే దానిని రావణుని మూత్రం చెరువుగా అభివర్ణిస్తారు. అలాగే దీనిలోని నీటిని ఎవరూ వినియోగించరు. కాగా ఇది నమ్మకాలపైన ఆధారపడిన అంశమని, దీనిలో వాస్తవం లేదనేవారు కూడా ఉన్నారు. ఇది కూడా చదవండి: ఆ వందేళ్ల అనకొండకు సెలవులిచ్చి, ఎందుకు పంపిస్తున్నారంటే.. -
ప్రభాస్ కథతో బన్నీ కొత్త సినిమా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నాడు. అది కూడా నాలుగోసారి. అధికారికంగా లాంచ్ జరిగిపోయింది. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన ఈ కాంబో.. ఈసారి ఎలాంటి సినిమా చేయబోతున్నారు? ఎప్పుడు మొదలవుతుంది? థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడు? లాంటి ప్రశ్నలు.. అభిమానుల బుర్రలు తొలిచేస్తున్నాయి. ఇప్పుడు వాటికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మహాభారతం ఆధారంగా 'పుష్ప' సినిమాతో బన్నీ.. అనుహ్యంగా పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ప్రస్తుతం 'పుష్ప 2' చేస్తున్నాడు. తర్వాత ఎవరితో కలిసి పనిచేయబోతున్నాడా అనే ప్రశ్నకు తెరదించాడు. తనకు అచ్చొచ్చిన త్రివిక్రమ్ తోనే వరసగా నాలుగోసారి కలిసి వర్క్ చేయబోతున్నాడు. గత మూడు సినిమాలని కమర్షియల్ గా తీసి వీళ్లు హిట్స్ కొట్టారు. ఈసారి మాత్రం మహాభారతాన్ని స్పూర్తిగా తీసుకుని, ఓ సోషియో ఫాంటసీ కథని గురూజీ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: నటిపై దాడి.. ఆ విషయమై గొడవ జరగడంతో!) ప్రభాస్ కథతో అయితే 'బాహుబలి' తర్వాత ప్రభాస్ చాలా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ సమయంలో చాలామంది దర్శకులు అతడికి స్టోరీలు వినిపించారు. అలా త్రివిక్రమ్ కూడా ఓ కథని ప్రభాస్ కి చెప్పారట. కానీ అది సమయం కుదరక, ఎందుకో వర్కౌట్ కాలేదు. ఇప్పుడు దాన్నే కొన్ని మార్పులు చేసి, బన్నీకి వినిపించగా అతడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. అల్లు అర్జున్ ప్రయోగం గతంలో 'బద్రీనాథ్' సినిమాతో అల్లు అర్జున్.. ఫాంటసీ స్టోరీ ప్రయోగం చేశాడు. కానీ ఇప్పుడు డైరెక్టర్ త్రివిక్రమ్ కావడం, అతడికి పురాణాలు, ఇతిహాసాలపై మంచి పట్టుండటం అంచనాలు పెంచుతోంది. ప్రస్తుతం బన్నీ చేస్తున్న 'పుష్ప 2' పూర్తయ్యేసరికి మరో 7-8 నెలలు పట్టొచ్చు. అంతలో త్రివిక్రమ్ 'గుంటూరు కారం' పూర్తి చేస్తారు. అంటే 2024 వేసవిలో అలా ఈ ప్రాజెక్టుని మొదలుపెట్టి, 2025 లేదా 2026లో రిలీజ్ చేయొచ్చని భావిస్తున్నారు. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) (ఇదీ చదవండి: బేబమ్మ రెచ్చిపోవడానికి ఇదా అసలు కారణం?) -
మహాభారత్ నటుడు కన్నుమూత
మహాభారత్ సీరియల్లో శకుని మామగా నటించిన సీనియర్ నటుడు గుఫి పైంటాల్ (80) కన్నుమూశారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గుఫి ఇవాళ ఉదయం 9 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని గుఫీ మేనల్లుడు హిటెన్ వెల్లడించారు. (ఇది చదవండి: కెరీర్ ఎందుకు నాశనం చేసుకుంటావ్? అని నా భార్య ప్రశ్నించింది: మనోజ్) ఆయన మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయనకు ఓ కొడుకు, కోడలితో పాటు ఓ మనవడు కూడా ఉన్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు అంధేరి సబర్బన్లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. (ఇది చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో నటుడు మృతి) కాగా.. గుఫీ టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ నటించారు. మహాభారత్ సీరియల్తో పాటు బహదూర్ షా జఫర్, కానూన్, ఓం నమః శివాయ, సీఐడీ, కోయి హై ద్వారకాధీష్ భగవాన్ శ్రీ కృష్ణ, రాధాకృష్ణ, జే కనియా లాల్ షోలలో కనిపించాడు. అతను 1975 చిత్రం రఫూ చక్కర్తో బాలీవుడ్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత దిల్లాగి, దేశ్ పరదేశ్, సుహాగ్ చిత్రాలలో కనిపించాడు. -
తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన 'మహాభారత్' నటుడు
మహాభారత్ సీరియల్లో శకుని మామగా నటించిన సీనియర్ నటుడు గుఫి పైంటాల్ (80) అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం గుఫి పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని ఆయన బంధువు హిటెన్ మీడియాకు వెల్లడించాడు. 'గుఫికి రక్తపోటు అలాగే హృదయ సంబంధిత సమస్యలున్నాయి. చాలాకాలంగా ఆయనకు ఆరోగ్యం బాగుండటం లేదు. ఇటీవల ఆయన పరిస్థితి మరింత విషమించింది. అందుకే ఆయన్ను వారం రోజుల క్రితం ఆస్పత్రికి తీసుకొచ్చాం. మొదట ఆయన పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం గుఫి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన్ను అబ్జర్వేషన్లో ఉంచారు' అని పేర్కొన్నాడు. కాగా నటుడు గుఫి పైంటాల్.. మహాభారత్ సీరియల్ మాత్రమే కాకుండా సీఐడీ, హెల్లో ఇన్స్పెక్టర్ వంటి టీవీ షోలు కూడా చేశాడు. సిల్వర్ స్క్రీన్కే పరిమితం కాకుండా శర్మాజీ నామ్కీన్, సుహాగ్, దిల్లగీ చిత్రాలతో వెండితెరపైనా మెరిశాడు. చదవండి: రోజుకు రెండు కోట్లు అని పబ్లిక్గా చెప్పడం అవసరమా? రైలు ప్రమాదం.. కమెడియన్ రాహుల్ రామకృష్ణ అసందర్భోచిత ట్వీట్.. నెటిజన్స్ ఫైర్ -
ఓటీటీ చరిత్రలో అతిపెద్ద ప్రాజెక్ట్గా ‘మహాభారత్’
మహాభారతం నిజంగా ఒక మహాగ్రంథం. అది చదవడం మొదలు ఎన్నటికీ పూర్తికానంతగా రచన జరిగింది. లెక్కలేనన్ని పాత్రలు, పాత్రధారులు మనకు కనిపిస్తారు. ప్రతి ఒక్క పాత్రకు దానికంటూ ఒక విశిష్టత ఉంటుంది. వేదవ్యాస మహర్షి రచించిన ఈ గ్రంధాన్ని తెరకెక్కించాలని ఎన్నో నిర్మాణ సంస్థలు, దర్శకులు సన్నాహాలు చేశారు. దర్శక ధీరుడు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా ఇదే. అయితే ఇది సినిమా కంటే ముందు వెబ్ సిరీస్ రూపంలో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. డిస్నీ+ హాట్స్టార్ ఇండియన్ ఓటీటీ స్పేస్లో అతిపెద్ద ప్రాజెక్ట్గా ‘మహాభారత్’ రాబోతుంది. అల్లు ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మాణంలో భాగస్వామ్యం కానుంది. ‘గ్రేటెస్ట్ ఇతిహాసం- మునుపెన్నడూ చూడని స్థాయిలో తిరిగి చెప్పబడుతుంది. ఒక అద్భుతమైన దృశ్యం కోసం చూస్తూ ఉండండి. త్వరలోనే డిస్నీ+ హాట్స్టార్లో 'మహాభారత్' రాబోతుంది’ అని అడిస్నీ+ హాట్స్టార్ సంస్థ ట్వీట్ చేసింది. అల్లు ఫ్యామిలీ ఇటీవలే అల్లు ఎంటర్టైన్మెంట్స్ను ప్రారంభించింది. ఇప్పటికే వారు మెగా బడ్జెట్ ప్రాజెక్ట్లో భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఈ సిరీస్కు సహ నిర్మాతలుగా కనిపిస్తున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. The greatest epic ever written- retold at a scale never seen before! Stay tuned for an ethereal spectacle- #Mahabharat, is coming soon only on @DisneyPlusHS #HotstarSpecials #Mahabharat #MahabharatOnHotstar @alluents & @MythoStudios pic.twitter.com/5yhs7HvuCC — Disney Star (@starindia) September 10, 2022 -
భర్త చనిపోయిన రెండు రోజులకే ఈ నటి ఏం చేసిందో తెలుసా?
బాలీవుడ్ సీనియర్ నటుడు రసిక్ దేవ్ కిడ్నీ ఫెయిల్యూర్తో కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత నాలుగేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న గత శనివారం(జులై30)న తుదిశ్వస విడిచారు. అయితే భర్త చనిపోయిన రెండు రోజులకే నటి కేత్కి దేవ్ షూటింగ్లో పాల్గొంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కేత్కి దేవ్.. భర్త చనిపోయినప్పటికీ ఎటువంటి బ్రేక్ తీసుకోలేదని పేర్కొంది. ముందుగానే డేట్స్ ఇచ్చేసిన కారణంగా తన వల్ల ఎవరూ ఇబ్బంది కూడదనే ఈ విధంగా చేసినట్లు తెలిపింది. 1983లో రసిద్ దేవ్- కేత్కి ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. వీరికి కూతురు, ఓ కుమారుడు ఉన్నాడు. ‘బాలికా వధు’,క్యోంకీ సాస్ బీ కబీ బహు తీ’ సహా పలు హిందీ, గుజరాతీ సినిమాలతో కేత్కి దేవ్ గుర్తింపును సంపాదించుకుంది. -
కిడ్నీ ఫెయిల్.. 'మహాభారత్' సీరియల్ నటుడు మృతి
బాలీవుడ్ సీనియర్ నటుడు రసిక్ దేవ్(65) కిడ్నీ ఫెయిల్యూర్తో మరణించారు. గత నాలుగేళ్లుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన డయాలసిస్ చేయించుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సుమారు 15 రోజులపాటు చికిత్స తీసుకున్న ఆయనను గురువారం డిశ్చార్జ్ చేశారు. ఆ మరునాడే కిడ్నీ ఫెయిల్ అవడంతో ప్రాణాలు విడిచారు. ఈరోజు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. రసిక్ దేవ్కు భార్య కేత్కి, కూతురు రిద్ధి దేవ్, ఓ కుమారుడు ఉన్నారు. కాగా రసిక్ దేవ్ పుత్ర వధు అనే గుజరాతీ సినిమాతో ఫిలిం ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించారు. తన భార్య కేత్కితో కలిసి నాచ్ బలియే డ్యాన్స్ షోలోనూ పాల్గొన్నారు. ఇకపోతే రసిక్ బుల్లితెర ప్రేక్షకులకూ సుపరిచితమే! మహాభారత్ సీరియల్లో ఆయన నంద పాత్రలో ఒదిగిపోయారు. Sad to know about the demise of a dear friend Rasik Dave who was a versatile actor on stage , tv and films due to kidney failure. Heartfelt condolences to his wife Ketaki Dave and his entire family . Will always be remembered . ॐ शान्ति ! 🙏 pic.twitter.com/tORLPIUKA4 — Ashoke Pandit (@ashokepandit) July 29, 2022 చదవండి: ఇదే నాకు తొలిసారి.. ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాడు: రష్మిక నోట్లో సిగరెట్, చెవికి పోగు.. అల్లు అర్జున్ న్యూ లుక్ వైరల్ -
అలా జరిగి ఉండకపోతే..
ఆ రోజు ఆ సంఘటన జరిగి ఉండకపోతే... అసలు కథ మరోలా ఉండేదిరా అంటూ ఉంటాం. నిజ జీవితంలోనైనా, సాహిత్యంలోనైనా ఓ చిన్న ఘటనే అనుకోని మలుపైపోతుంది. అనూహ్య పరిణామాలకు దారి తీస్తుంది. యథార్థ జీవితంలోని ఘటనలను మనం çసృష్టించలేం. అదే సాహిత్యంలో అయితే... ఇటువంటి మలుపులను రచయితలు చాలా తెలివిగా çసృష్టిస్తారు. ఇక అక్కడి నుండి కథను ఎక్కడెక్కడికో తీసుకుపోతారు. ఆ ట్విస్టే అద్భుత రచనలకు ప్రత్యేక ఆకర్షణ అయిపోతుంది. అదే రచయితలోని చమత్కారాన్ని చాటి చెబుతుంది. మహాభారతాన్నే తీసుకోండి. పాండురాజు కుమారులు ప్రశాంతంగా తమ రాజ్యాన్ని తాము ఏలుకుంటూ సుఖంగా జీవిస్తోన్న తరుణంలో రచయిత వ్యాసుడి మెదడులో ఓ మెరుపులాంటి మలుపు తట్టింది. తాను సృష్టించిన పాత్రలతో ఓ కొత్త ఆట ఆడుకోవాలనిపించింది. అంతే ధర్మ రాజును జూదానికి ప్రేరేపించాడు. అది మామూలు ద్యూతం అయితే అనుకున్న ట్విస్ట్ రాదు కాబట్టి అధర్మ, మాయా ద్యూతాన్ని సృష్టించాడు. అందుకోసం శకునికి ఓ పెద్ద నేపథ్యం సృష్టించి, పాచికలు శకుని ఎలా చెబితే అలా ఆడేలా ప్లాన్ చేశాడు. ఆ రోజున శకుని మాయోపాయంతో కౌరవులు ధర్మరాజుని జూదానికి పిలవగానే జూదం అంటే మితిమీరిన ప్రేమ కలిగిన ధర్మరాజు మరో ఆలోచనే లేకుండా సై అన్నాడు. జూదం ఆడి శకుని మాయలో పడి రాజ్యాన్నీ, ధర్మపత్నినీ కూడా జూదంలో పోగొట్టుకున్నాడు. ఆ రోజు జూదం ఆడి ఉండకపోతే... పాండవులు అరణ్య వాసానికి వెళ్లాల్సి వచ్చేది కాదు... కౌరవులపై పాండవులకు కక్ష పుట్టేది కాదు... ఇద్దరి మధ్య కురుక్షేత్ర యుద్ధం జరగాల్సిన అవసరమూ ఉండేది కాదు! కేవలం జూదం కారణంగా లక్షలాది సైనికుల ప్రాణాలు తీసే యుద్ధం అనివార్యమైంది. ఆ తర్వాత పాండవులు, కౌరవుల్లో ఎవరూ మిగలకుండా అందరూ చనిపోవలసి వచ్చింది. ఇంత పెద్ద కథ రాసుకోవడం కోసం... వ్యాసుడు çసృష్టించిన అద్భుతమైన ట్విస్టే– మాయా ద్యూతం. ఇదే లేకపోతే అసలు మహాభారతంలో మసాలాయే లేదు. ‘తింటే గారెలు తినాలి... వింటే భారతం వినాలి’ అని మనవాళ్ళు అని ఉండేవారు కారు. ఇటువంటి ట్విస్టే రామాయణంలో రచయిత వాల్మీకీ ప్రయోగించారు. అయితే వాల్మీకి రెండు మలుపులు పెట్టారు. కైకేయికి దశరథుడు ఏం కావాలంటే అది ఇస్తానని వరం ఇవ్వకుండా ఉంటే... రాముడు అరణ్యవాసానికి వెళ్లాల్సి వచ్చేది కాదు. సరే... అరణ్యానికి వెళ్లాడే అనుకుందాం. అక్కడైనా పధ్నాలుగేళ్ల పాటు అడవిలో సీతారామ లక్ష్మణులు ప్రశాంతంగా గడిపేసి, తిరిగి అయోధ్య వచ్చేయ వచ్చు. అందుకే వాల్మీకి అడవిలో పెద్ద ట్విస్ట్ పెట్టాడు. బంగారు లేడి కోసం రాముడు వెళ్లగానే, రాముడు ప్రమాదంలో ఉన్నాడనుకుని సీతమ్మ చెప్పిన వెంటనే లక్ష్మణుడూ వెళ్లాడు. వెళ్లే ముందు ఓ గీత గీసి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గీత దాటద్దని షరతు విధించాడు. సీతమ్మ దానికి కట్టుబడి ఉంటే బాగుండేది. కానీ.. రావణుడు మారు వేషంలో వచ్చి సీతమ్మను గీత దాటేలా ప్రేరేపించడంతో లక్ష్మణుడి మాట పెడచెవిన పెట్టిన సీతమ్మ గీత దాటింది. అంతే... రావణుడు ఆమెను లంకకు ఎత్తుకుపోయాడు. సీతను రక్షించుకోవడం కోసమే రాముడు వానర సైన్యం సాయంతో సముద్రాన్ని దాటి, లంకలో రావణుడితో యుద్ధానికి దిగాల్సి వచ్చింది. సీతే కనక గీత దాటి ఉండకపోతే – ఇంత కథ ఉండేది కాదు. వాల్మీకి సృష్టించిన ఈ ట్విస్టుతో రామాయణం నిత్య పారాయణమైంది. వ్యాసుడు, వాల్మీకే కాదు... యుగాల తరబడి గొప్ప గొప్ప రచయితలంతా కూడా తమ ఉద్గ్రంథాల్లో ఏదో ఓ చిన్న ట్విస్ట్ తో మొత్తం కథను నడుపుతారు. కథలోని ఆ కీలకమైన మలుపులే ఆ రచయితనూ, రచననూ కలకాలం గుర్తుండేలా చేస్తాయి. శకుంతలా దుష్యంతుల కథ అయిన ‘అభిజ్ఞాన శాకుంతలం’లో మొత్తం మెలోడ్రామాకి ఉంగరమే పెద్ద ట్విస్ట్. దుష్యంతుడికి మతి మరుపు శాపం అనేది కథకు కొక్కెం. అందుకే ఆ కథ, ఆ నాటకం ఏ రూపంలో వచ్చినా అంత పెద్ద హిట్ అయ్యింది. ఇక యథార్థ జీవితంలోనూ ఇటువంటి మలుపులు లేకపోలేదు. ప్రపంచ చరిత్రలో జర్మనీ నియంత హిట్లర్ సోవియట్ రష్యా పైకి యుద్ధానికి కాలు దువ్వి ఉండకపోతే... జర్మనీ కథ మరోలా ఉండేది. సోవియట్ రష్యాకు సవాల్ విసరడం వల్లనే జర్మనీపై ప్రతీకారం తీర్చుకోవడానికి స్టాలిన్ యుద్ధానికి వెళ్లాడు. సోవియట్ ఆర్మీ చుట్టుముట్టడంతో తప్పించుకునే మార్గం లేక చివరకు హిట్లర్ ఆత్మహత్య చేసుకొని చనిపోవాల్సి వచ్చింది. సోవియట్ జోలికి వెళ్లకుండా ఉండి ఉంటే జర్మనీని మరికొన్నేళ్ల పాటు హిట్లర్ ప్రశాంతంగా ఏలుకుని ఉండేవాడేమో? ఈ స్క్రిప్ట్ను ఎవరూ రాయలేదు. దానంతట అది ఆవిర్భవించడంతో చరిత్రకారులు దాన్ని రాసుకున్నారు. బ్రిటిష్ వాడిని మొదట్లోనే అడ్డుకొని, ‘ఎవర్రా నువ్వు? మా దేశంలోకి ఎందుకొచ్చావ్?’ అని కాలర్ పట్టుకొని ఉంటే, భారతదేశం తెల్లవాడి పాలనలో బానిస బతుకు బతకాల్సి వచ్చేది కాదు. స్వాతంత్య్ర సంగ్రామం అవసరమయ్యేదీ కాదు. ఇది కూడా చరిత్ర సృష్టించిన ట్విస్ట్. ఇందులోని అసలు గొప్పతనం ఏమిటంటే... రచయితలు çసృష్టించే మలుపులు చాలా సహజంగా ఉంటాయి. అవి నిజమే కాబోలు అనిపించేలా ఉంటాయి. అలా రాయడంలోనే వారి నైపుణ్యం కనపడుతుంది. మహారచయితలంతా కథాంశంలోని కీలకమైన మలుపులను ఆసరాగా చేసుకొన్నవారే! తమ రచనలను చిరస్మరణీయ గ్రంథాలుగా మలుచుకున్నవారే! కథల్లోని మలుపులతో ప్రపంచ సాహిత్యాన్నే మలుపు తిప్పిన రచయితలకు వందనాలు. -
స్వర్గం వద్దన్న ముద్గలుడు
ముద్గలుడు సకల సద్గుణ సంపన్నుడు. కురుక్షేత్రంలో భార్య, కుమారుడితో కలసి ఉండేవాడు. ఏడాదిలోని మూడువందల అరవై రోజులూ ఏదో ఒక వ్రతదీక్షలోనే ఉండేవాడు. జపతపాలు చేసుకుంటూ, భిక్షాటనతో కుటుంబ పోషణ చేసుకునేవాడు. అతిథులను ప్రాణప్రదంగా ఆదరించేవాడు. కొన్నాళ్లకు ముద్గలుడు పక్షోపవాస దీక్ష చేపట్టాడు. ఉభయ పక్షాల్లోనూ పాడ్యమి నుంచి పద్నాలుగు రోజులు యాచన ద్వారా సంపాదించిన గింజలతో దైవపూజ, పితృపూజ చేసేవాడు. ఆ పద్నాలుగు రోజులూ ఉపవాసం ఉండేవాడు. ఉపవాస దీక్ష ముగించే ముందు శుక్లపక్షంలో పౌర్ణమినాడు, కృష్ణపక్షంలో అమావాస్యనాడు అతిథులకు భోజనం పెట్టేవాడు. మిగిలినది భార్యా కొడుకులతో కలసి తాను ప్రసాదంగా స్వీకరించేవాడు. ముద్గలుడు ఇలా కాలం గడుపుతుండగా, ఒక పర్వదినం రోజున దుర్వాసుడు అతిథిగా వచ్చాడు. దుర్వాసుడు స్నానాదికాలు చేసి ఎన్నాళ్లో అయినట్లుగా అతి అసహ్యకరంగా ఉన్నాడు. జుట్టు విరబోసుకుని, మురికి కౌపీనంతో పిచ్చివాడిలా ఉన్నాడు. నకనకలాడే ఆకలితో సోలిపోతూ ఉన్నాడు. అతణ్ణి చూసి ముద్గలుడు ఏమాత్రం అసహ్యపడలేదు. సాదరంగా ఎదురేగి స్వాగతం పలికాడు. అర్ఘ్యపాద్యాలు ఇచ్చాడు. స్నానానికి ఏర్పాట్లు చేశాడు. భక్తిశ్రద్ధలతో భోజనం పెట్టాడు. దుర్వాసుడు తిన్నంత తిని, మిగిలినది ఒళ్లంతా పూసుకుని, మాటా పలుకూ లేకుండా తన దారిన తాను వెళ్లిపోయాడు. ముద్గలుడి ఇంటికి ఇలా ఆరుసార్లు వచ్చాడు దుర్వాసుడు. వచ్చిన ప్రతిసారీ ఇదే తంతు. చక్కగా విస్తరివేసి భోజనం పెడితే, తిన్నంత తినడం, మిగిలినదంతా ఒంటికి పూసుకుని వెళ్లిపోవడమే! దుర్వాసుడి చేష్టలకు ముద్గలుడు ఏమాత్రం కోప్పడలేదు. పరుషంగా మాట్లాడటం కాదు కదా, కనీసం మందలించనైనా లేదు. దుర్వాసుడు వచ్చిన ప్రతిసారీ ముద్గలుడు అతణ్ణి అత్యంత భక్తిశ్రద్ధలతో ఏ లోపమూ లేకుండా సేవించుకున్నాడు. ముద్గలుడి సహనానికి, భక్తిశ్రద్ధలకు ముగ్ధుడైపోయాడు దుర్వాసుడు. ‘ముద్గలా! నీ తపస్సుకు, సహనానికి, శాంతానికి, ధర్మనిష్ఠకు నేను ముగ్ధుణ్ణయ్యాను. ఇంతటి తపశ్శక్తి ఏ లోకంలోనూ నేను చూడలేదు. నీవంటి తాపసులు ముల్లోకాల్లో ఎక్కడా ఉండరు. దేవతలు కూడా నీ తపశ్శక్తిని పొగుడుతున్నారు. నీకోసం దివ్యవిమానం ఇప్పుడే వస్తుంది. స్వశరీరంతో స్వర్గానికి వెళ్లి సుఖించు’ అని చెప్పి వెళ్లిపోయాడు. దుర్వాసుడు చెప్పినట్లుగానే ముద్గలుడి ముందు దివ్యవిమానం వచ్చి నిలిచింది. అందులోంచి ఒక దేవదూత దిగివచ్చి, ముద్గలుడికి వినమ్రంగా ప్రణమిల్లాడు. ‘మహర్షీ! అనన్యమైన నీ తపశ్శక్తి ఫలితంగా స్వశరీరంతో స్వర్గ ప్రవేశం చేసే అర్హత నీకు లభించింది. దయచెయ్యి. నాతో కలసి విమానాన్ని అధిరోహించు. నిన్ను స్వర్గానికి తీసుకుపోతాను’ అన్నాడు. ‘మహాత్మా! స్వర్గం అంటే ఏమిటి? అదెక్కడ ఉంటుంది? అక్కడి మంచిచెడ్డలేమిటి? నాకు తెలుసుకోవాలని ఉంది. కుతూహలం కొద్ది అడుగుతున్నానే గాని, నిన్ను పరీక్షించడానికి కాదు. కాబట్టి ఏమీ అనుకోకుండా నా సందేహ నివృత్తి చేయవలసినదిగా ప్రార్థిస్తున్నాను’ అన్నాడు ముద్గలుడు. ‘ఈ మర్త్యలోకానికి పైన చాలా దూరాన ఊర్ధ్వదిశలో ఉంది స్వర్గలోకం. సర్వకాల సర్వావస్థలలోనూ సర్వాలంకార భూషితమై, దివ్యకాంతులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. గొప్ప తపస్సంపన్నులు, యజ్ఞాలు చేసేవాళ్లు, సత్యనిష్ఠతో జీవితం గడిపినవాళ్లు, ధర్మాత్ములు, దానశీలురు, రణశూరులు, ఇంద్రియాలను జయించిన ఉత్తములు మాత్రమే స్వర్గార్హత సాధించగలరు. అలాంటి వాళ్లు అక్కడ హాయిగా సర్వసుఖ వైభోగాలతో ఆనందంగా గడుపుతారు. స్వర్గంలో అందమైన అప్సరసలు, సిద్ధులు, సాధ్యులు, దేవర్షులు, మరుత్తులు, వసువులు ఎవరెవరి నెలవుల్లో వారు నివసిస్తూ ఉంటారు. స్వర్గంలో జరా వ్యాధి మరణాలేవీ ఉండవు. ఆకలి దప్పులుండవు. వేడీ చలీ ఉండవు. ఎటు చూసినా మనోహరంగా ఉంటుంది. ఇంద్రియాలన్నీ నిరంతరం ఆనందాన్ని ఆస్వాదిస్తూనే ఉంటాయి’ చెప్పాడు దేవదూత. ‘అయినా, స్వర్గం మంచిచెడులు అడిగావు కదూ! ఇప్పటివరకు స్వర్గంలోని మంచివిషయాలన్నీ ఏకరువు పెట్టాను. ఇక స్వర్గానికీ పరిమితులు ఉన్నాయి. అవి కూడా చెబుతాను విను. భూలోకంలో చేసిన పుణ్యఫలాన్నే మనుషులు స్వర్గంలో అనుభవిస్తారు. అక్కడ మళ్లీ పుణ్యం చేయడానికి అవకాశం ఉండదు. భూమ్మీద చేసిన పుణ్యం చెల్లిపోగానే, స్వర్గం నుంచి తరిమేస్తారు. మళ్లీ భూమ్మీద జన్మించవలసిందే! అలవాటైన సుఖాలను వదులుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించుకో! పుణ్యం నశించిన మనిషి ఆ దుఃఖంతోనే మళ్లీ భూమ్మీద పుడతాడు. బ్రహ్మలోకం తప్ప మిగిలిన పుణ్యలోకాలన్నింటిలోనూ ఇదే తంతు. పుణ్యలోకాల నుంచి తిరిగి భూమ్మీదకు తరిమివేయడబడ్డ మనిషి సుఖవంతుడిగానే పుడతాడనుకో! ఎందుకంటే భూలోకం కర్మభూమి, మిగిలిన పుణ్యలోకాలన్నీ ఫలభూములు. ఇదీ సంగతి. మంచివాడివని ఏదో నీ మీద ఆదరంతో ఇవన్నీ నీతో చెప్పాను. ఇప్పటికే ఆలస్యమవుతోంది. ఇక దయచెయ్యి. స్వర్గానికి బయల్దేరుదాం’ అన్నాడు దేవదూత. అంతా విని కాసేపు ఆలోచించాడు ముద్గలుడు. ‘అలాగైతే, ఆ స్వర్గం నాకొద్దు. ఏదో రమ్మని ఆదరంగా పిలిచావు. అదే పదివేలు అనుకుంటాను. ఆ స్వర్గసౌఖ్యాలేవో దేవతలకే ఉండనీ. జపతపాలు చేసుకునే నాకెందుకవన్నీ? వెళ్లు. నీ విమానం తీసుకుని వచ్చినదారినే బయలుదేరు. ఎక్కడికి వెళితే మనిషి మళ్లీ తిరిగి భూమ్మీదకు రాకుండా ఉంటాడో అలాంటి ఉత్తమలోకం కావాలి నాకు. అంతేగాని, పుణ్యఫలాన్ని కొలతవేసి, అంతమేరకు మాత్రమే దక్కే తాత్కాలిక స్వర్గమెందుకు నాకు? శాశ్వతమైన ఉత్తమలోకమే కావాలి నాకు. అలాంటిదానికోసమే ఎంత కష్టమైనా ప్రయత్నిస్తాను’ అన్నాడు ముద్గలుడు. దేవదూత ఎంత బతిమాలినా పట్టించుకోకుండా, అతణ్ణి సాగనంపాడు. దేవదూతను సాగనంపిన తర్వాత ముద్గలుడు యాచకవృత్తిని కూడా వదిలేశాడు. పరమశాంత మార్గం అవలంబించాడు. నిందాస్తుతులకు చలించడం మానేశాడు. మట్టినీ బంగారాన్నీ ఒకేలా చూసేటంతగా ద్వంద్వాతీత స్థితికి చేరుకున్నాడు. పూర్తిగా తపస్సులోనే మునిగిపోయాడు. నిర్వికల్ప జ్ఞనాయోగంతో తుదకు మోక్షం పొందాడు. - సాంఖ్యాయన -
పెన్సిళ్ల పై మహాభారతాన్ని లిఖించింది!
కారంచేడు: సూక్ష్మకళపై మక్కువతో సీస లేఖినిలపై (పెన్సిళ్లపై) మహాభారతాన్ని లిఖించింది ప్రకాశం జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన అన్నం మహిత. మహాభారతంలోని 18 పర్వాలను.. 700 శ్లోకాలను సంస్కృత భాషలో అవలీలగా లిఖించగలిగింది. ఇందుకు ఆమె 810 పెన్సిళ్లను ఉపయోగించింది. వాటిపై 67,230 అక్షరాలను, 7,238 పదాలను లిఖించింది. ఇందుకోసం పెన్సిళ్లను ముందుగా బద్దగా చీల్చి అందులోని లిడ్ 2 మిల్లీమీటర్ల మందం ఉండేలా చూసుకుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో తన పేరు నమోదు చేసుకోవడం లక్ష్యమని మహిత చెబుతోంది. బియ్యపు గింజలపై సూక్ష్మ కళాకృతులు మహిత మొదట్లో బియ్యపు గింజలపై సూక్ష్మ కళాకృతులను చెక్కడం ప్రారంభించింది. గింజలపై జాతీయ జెండా, తాళం, బాణం, వినాయకుడు, కొంగ, మినప్పప్పుపైన కూడా వినాయకుడు వంటి ఆకృతులను చక్కగా చెక్కి శభాష్ అనిపించుకుంది. ఆ తరువాత పెన్సిల్పై మహాభారతాన్ని చెక్కాలనే ఆలోచనకు పదునుపెట్టింది. సూక్ష్మ కళలను ప్రోత్సహించాలి కళలలో సూక్ష్మకళ ఒకటి. అధికారులు, ప్రభుత్వం, ప్రజలు ఇలాంటి సూక్ష్మకళను ప్రోత్సహించాలి. నాలాంటి వారెందరో ఉన్నా.. ప్రతిభను కనబర్చుకునే వీలు లేక ఇలాంటి కళలు మరుగున పడుతున్నాయి. ఆర్థికం, శిక్షణ పరంగా ఈ కళలను ప్రోత్సహించాలి. – అన్నం మహిత (చదవండి: సరికొత్త శకం) -
Praveen Kumar Sobti: స్వర్ణ, రజత, కాంస్య పతకాలు గెలిచిన అథ్లెట్..భీముడిగా గుర్తింపు
Praveen Kumar Sobti:- న్యూఢిల్లీ: భారత క్రీడల్లో విజేయుడు... ‘మహాభారత్’లో భీముడు ప్రవీణ్ కుమార్ సోబ్టీ కన్నుమూశారు. 74 ఏళ్ల ప్రవీణ్ సోమవారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. పంజాబ్కు చెందిన ప్రవీణ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో డిస్కస్ త్రో, హ్యామర్ త్రో ఈవెంట్లలో పతకాలు నెగ్గిన ఈ అలనాటి దిగ్గజం ఓ క్రీడాకారుడిగా కంటే విలక్షణ నటుడిగా సుపరిచితం. ఇప్పుడు ఒక్క కాంస్య పతకంతోనే రాత్రికి రాత్రే స్టార్ అవుతుండగా... ఆ కాలంలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలతో విజయవంతమైన అథ్లెట్గా ఎదిగారు. అయినప్పటికీ క్రీడల్లో రాని గుర్తింపు, పేరు ప్రతిష్టలు ఒక్క ‘మహాభారత్’ సీరియల్తోనే వచ్చాయి. ఇవీ ఆయన ఘనతలు ►అమృత్సర్లో 1947 డిసెంబర్ 6న పుట్టిన ప్రవీణ్ 1960 నుంచి 1974 వరకు పలు మెగా ఈవెంట్లలో పతకాలతో మెరిశారు. ►1966 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో డిస్కస్ త్రోలో చాంపియన్గా నిలిచిన ప్రవీణ్ హ్యామర్ త్రోలో కాంస్యం నెగ్గారు. ►అదే ఏడాది కింగ్స్టన్లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో హ్యామర్ త్రోలో రజతం గెలుపొందారు. ►1970 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో డిస్కస్ త్రో ఈవెంట్లో టైటిల్ నిలబెట్టుకున్న ప్రవీణ్ 1974 టెహ్రాన్ ఆసియా క్రీడల్లో రజతం గెలిచారు. ►1968 మెక్సికో, 1972 మ్యూనిక్ ఒలింపిక్స్ క్రీడల్లోనూ ప్రవీణ్ భారత్కు ప్రాతినిధ్యం వహించారు. భారతంలో భీముడు దూరదర్శన్లో 90వ దశకంలో ప్రసారమైన సుప్రసిద్ధ పౌరాణిక ధారావాహిక ‘మహాభారత్’లో పంచ పాండవుల్లో భీముడిగా ప్రవీణ్ దేశ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. తదనంతరం పలు హిందీ, తమిళ్, తెలుగు చిత్రాల్లో నటించారు. 2013లో రాజకీయాల్లోనూ ప్రవేశించి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఢిల్లీలోని వాజిర్పూర్ అసెంబ్లీ నియోజక వర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత బీజేపీలో చేరారు. చదవండి: IND VS WI 2nd ODI: విరాట్ కోహ్లి ఖాతాలో మరో రికార్డు.. సచిన్, ధోని సరసన..! -
విషాదం: 'మహాభారత్' భీముడు కన్నుమూత
Mahabharat Bheem Actor Praveen Kumar Sobti Passes Away: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రఖ్యాత మహాభారత్ సీరియల్లో భీముడి పాత్ర పోషించిన నటుడు ప్రవీణ్ కుమార్ సోబ్తీ (75) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె నికునికా అధికారికంగా ధృవీకరించారు. గతరాత్రి 9.30నిమిషాలకు హార్ట్ ఎటాక్ కారణంగా ఇంట్లోనే ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఆమె పేర్కొంది. కాగా మభాభారత్ సిరీయల్లో భీముడి పాత్రతో ప్రవీణ్కుమార్ దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. రెండు దశాబ్దాల పాటు యాభైకి పైగా సిరియల్స్తో పాటు పలు సినిమాల్లో నటించి మెప్పించారు. ప్రవీణ్ కుమార్ మృతి పట్ల పలువురు బీటౌన్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. -
విడాకులు తీసుకున్న మరో నటుడు.. మరణమే బాగుంటుందని
Nitish Bharadwaj As Krishna Announces Divorce With His Wife Smita: చిత్ర పరిశ్రమలో వివాహ బంధాలతో ఇలా ఒక్కటవుతుంటే.. అలా విడిపోతున్నారు. ఎంత వేగంగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారో.. అంతే వేగంగా విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. గత కొంతకాలం నుంచి సెలబ్రిటీల సినిమాలు కాకుండా వారి వ్యక్తిగత విషయాలతోనే హెడ్లైన్స్లో నిలుస్తున్నారు. కొందరు నేరాలు, మోసాలతో వార్తల్లోకి ఎక్కితే.. వారి భాగస్వామితో తెగదెంపులు చేసుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు మరికొందరు. టాలీవుడ్ మోస్ట్ క్యూట్ కపుల్ నాగ చైతన్య, సమంత విడిపోయారనే విషయాన్ని ఇప్పుడిప్పుడే జీర్ణించుకుంటున్న తరుణంలో కోలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ ధనుష్, ఐశ్వర్యలు విడాకులు తీసుకుంటున్నట్లు పెద్ద బాంబు పేల్చారు. దీంతో అభిమానగనం, ప్రేక్షకలోకం నివ్వెరపోయి అందుకు కారణాలు ఏంటా అని ఆలోచిస్తున్నాయి. (చదవండి: ధనుష్-ఐశ్వర్య విడాకులపై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్లు..) ఇదిలా ఉంటే తాజాగా మరో సెలబ్రిటీ విడాకులు తీసుకున్నట్లు ప్రకటించాడు. అతనే ప్రముఖ టీవీ సీరియల్ నటుడు నితీష్ భరద్వాజ్. అతను భరద్వాజ్ కంటే 'మహాభారతం' సీరియల్లో శ్రీకృష్ణుడిగానే మోస్ట్ పాపులర్. నితీష్ భరద్వాజ్ తన భార్య, ఐఏఎస్ అధికారిణి స్మితా గేట్తో ఉన్న 10 సంవత్సరాల వైవాహిక జీవితానికి స్వస్తి పలికి విడిపోయినట్లు తెలిపాడు. అయితే నితీష్ భరద్వాజ్, స్మితా గేట్ 2019 సెప్టెంబర్లో విడిపోయారు. వారికి ఇద్దరు కవల కుమార్తెలు. భరద్వాజ్ తన డివోర్స్ గురించి 'నేను 2019 సెప్టెంబర్లో ముంబైలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దాఖలు చేశాను. మేము విడిపోడానికి కారణాలు నాకు చెప్పాలని లేదు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తోంది. నేను చెప్పేది ఏంటంటే.. కొన్నిసార్లు మరణం కంటే విడాకులే చాలా బాధగా ఉంటాయి.' అని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. కాగా 2009లో స్మితా గేట్ను రెండో వివాహం చేసుకున్నాడు నితీష్ భరద్వాజ్. (చదవండి: ధనుష్-ఐశ్వర్య డివోర్స్.. ఫ్యాన్స్ షాకింగ్ రియాక్షన్స్) బీఆర్ చోప్రా తెరకెక్కించిన టీవీ సిరీస్ 'మహాభారతం'లోని శ్రీకృష్ణుడి పాత్రలో భరద్వాజ్ ప్రేక్షకులను ఎంతో అలరించాడు. ఈ పాత్రతో అతనికి ఎనలేని పేరు వచ్చింది. ఈ టీవీ సిరీస్ 1988వో నాలుగు సీజన్స్తో వచ్చి ప్రేక్షకుల మన్ననలు పొందింది. అలాగే బీఆర్ చోప్రా రూపొందించిన అనేక సీరియల్స్లో నటించాడు. అందులో 'విష్ణువు' పాత్రతో మరింత ప్రసిద్ధి చెందాడు నితీష్ భరద్వాజ్. అలాగే నితీష్ తొలిసారిగా డైరెక్ట్ చేసిన పిత్రురూన్ చిత్రానికి ఎంతో పేరు వచ్చింది. నితీష్ సినిమాల్లోకి రాకముందు వెటర్నరీ సర్జన్గా పనిచేశాడు. (చదవండి: విడాకుల ప్రకటనకు ముందు రజనీకి ధనుష్ ఫోన్ కాల్.. కారణం ఇదేనా?) -
కౌత్సుడి గురుదక్షిణ..
నాయనా! నాకు తెలిసిన విద్యలన్నీ నీకు నేర్పించాను. క్షుణ్ణంగా నేర్చుకున్నావు. ఇక ఇంటికివెళ్లి, తగిన కన్యను పెళ్లాడి గృహస్థాశ్రమాన్ని స్వీకరించు. శ్రీరామచంద్రుడి తాత అయిన రఘు మహారాజు పరిపాలిస్తున్న రోజులవి. రఘు మహారాజు పాలనలో విద్యలకు గొప్ప ఆదరణ ఉండేది. విరివిగా గురుకులాలు ఉండేవి. ప్రతి గురుకులంలోనూ వందలాదిగా శిష్యులుండేవారు. గురువుల శుశ్రూషలో గడుపుతూ, విద్యలు నేర్చుకునేవారు. పరతంతు మహాముని నడిపే గురుకులంలో కౌత్సుడనే పేదబాలకుడు కూడా విద్యాభ్యాసం చేసేవాడు. గురువును అత్యంత భక్తిశ్రద్ధలతో సేవించుకుంటూ, వేదవేదాంగాలను, సకల శాస్త్రాలనూ క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. కౌత్సుడి విద్యాభ్యాసం పూర్తయిన సందర్భంగా గురువు పరతంతుడు అతణ్ణి చేరబిలిచి, ‘నాయనా! నాకు తెలిసిన విద్యలన్నీ నీకు నేర్పించాను. క్షుణ్ణంగా నేర్చుకున్నావు. ఇక ఇంటికివెళ్లి, తగిన కన్యను పెళ్లాడి గృహస్థాశ్రమాన్ని స్వీకరించు. ఎప్పటికీ స్వాధ్యాయాన్ని శ్రద్ధగా కొనసాగించు. గృహస్థాశ్రమంలో కోపతాపాలకు తావివ్వకు. త్యాగంతో కూడిన భోగమే గొప్పదని గ్రహించు. ధర్మాన్ని ఆచరించు’ అని చెప్పాడు. ‘గురువర్యా! విద్యాభ్యాస సమయంలో చేసిన దోషాలను మీరు క్షమించాలి. మీకు గురుదక్షిణ చెల్లించడం శిష్యునిగా నా కర్తవ్యం. గురుదక్షిణగా ఏం కావాలో ఆదేశించండి’ అన్నాడు కౌత్సుడు. ‘నిరుపేదవు నువ్వేమిచ్చుకుంటావు నాయనా! ఆశ్రమంలో సేవలు చేసుకుంటూ, నా శుశ్రూషలో గడిపావు కదా! అది చాలు. నీ సేవలను చాలాసార్లు మెచ్చుకున్నాను కూడా. నువ్వు నాకేమీ ఇవ్వనక్కర్లేదు. సంతోషంగా వెళ్లిరా’ అన్నాడు గురువు పరతంతుడు. ‘గురువర్యా! దయచేసి మీరు అలా అనవద్దు. గురుదక్షిణ కోరుకోండి. తప్పక చెల్లించి మీ రుణం తీర్చుకుంటాను’ అన్నాడు కౌత్సుడు. తనకు ఏమీ ఇవ్వనవసరం లేదని పరతంతు మహాముని పదేపదే చెప్పినా, కౌత్సుడు వినిపించుకోలేదు. గురుదక్షిణ కోరుకోవాల్సిందేనంటూ పట్టుబట్టాడు. శిష్యుడి మొండితనానికి విసిగిన గురువు ఇలా అన్నాడు: ‘నాయనా! నీకు పద్నాలుగేళ్లు పద్నాలుగు విద్యలను నేర్పించాను. ఒక మనిషి ఏనుగుపై నిలబడి, ఒక గులకరాయిని విసిరితే, ఆ రాయి ఎంత ఎత్తుకు ఎగురుతుందో అంత ఎత్తు గల పద్నాలుగు ధనరాశులు ఇవ్వు’ అన్నాడు. ‘సరే’నని గురువుకు నమస్కరించి, బయలుదేరాడు కౌత్సుడు. గురువుకు గురుదక్షిణ చెల్లించాలనే సంకల్పమే తప్ప, ఎలా చెల్లించాలో అతడికి అంతుచిక్కలేదు. రాజు తండ్రివంటి వాడంటారు. రాజును కోరుకుంటే తప్పక తనకు కావలసిన ధనరాశులు దొరుకుతాయని ఆలోచించి, రాజ దర్శనానికి బయలుదేరాడు. రఘు మహారాజు వద్దకు వచ్చాడు కౌత్సుడు. అంతకుముందు రోజే రఘు మహారాజు ఒక మహాయజ్ఞం చేసి, తన వద్దనున్న ధనరాశులన్నింటినీ దానం చేశాడు. కౌత్సుడు వచ్చేసరికి రఘు మహారాజు మట్టి కుండలు ఎదుట పెట్టుకుని, సంధ్యావందనం చేస్తున్నాడు. కౌత్సుడిని గమనించిన రఘు మహారాజు ‘నాయనా! నువ్వెవరివి? ఏ పనిమీద వచ్చావు?’ అని అడిగాడు. మహారాజు పరిస్థితిని గమనించిన కౌత్సుడు ‘అది కష్టంలే మహారాజా!’ అని నిష్క్రమించడానికి వెనుదిరిగాడు. రఘు మహారాజు అతణ్ణి వెనక్కు పిలిచాడు. ‘నా వద్దకు వచ్చి, వట్టి చేతులతో వెనుదిరగడమా? ఏం కావాలో సంశయించకుండా అడుగు. తప్పక ఇస్తాను’ అన్నాడు. కౌత్సుడు తన గురువుకు చెల్లించాల్సిన గురుదక్షిణ కోసం వచ్చానంటూ, జరిగిన వృత్తాంతమంతా చెప్పాడు. ‘రేపు ఉదయమే కనిపించు. నీవు కోరిన ధనరాశులు ఇచ్చుకుంటాను’ అని కౌత్సుణ్ణి సాగనంపాడు రఘు మహారాజు. యజ్ఞంలో చేసిన దానాల వల్ల ఖజానా ఖాళీ అయిన స్థితిలో ఏం చేయాలో పాలుపోలేదు మహారాజుకు. మంత్రులతో సంప్రదించాడు. వారి సలహాపై రాజగురువైన వశిష్ఠుని వద్దకు వెళ్లాడు. ‘తక్షణమే అంత ధనం కావాలంటే, దేవేంద్రుడిపై దండెత్తడమే మార్గం’ అని సూచించాడు. రఘు మహారాజు దేవేంద్రుడిపై దండ్రయాత్రకు బయలుదేరాడు. ఆయన సైన్యం చేసే భేరీనాదాలకు దేవేంద్రుడి చెవులు మార్మోగాయి. దేవదూతల ద్వారా రఘు మహారాజు దండయాత్రకు వస్తున్నట్లు తెలుసుకున్నాడు. ‘ధర్మాత్ముడైన రఘు మహారాజు ఏమి కోరి దండయాత్రకు వస్తున్నాడో కనుక్కోండి. ఆయనను కోరినది ఇచ్చి, సంధికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పండి’ అని దేవదూతలను పంపాడు. ధనరాశులు కోరి దండయాత్రకు వచ్చినట్లు తెలుసుకున్న దేవేంద్రుడు, తక్షణమే రఘు మహారాజు కోశాగారాలన్నింటినీ ధనరాశులతో నింపివేయాలని దేవదూతలను ఆదేశించాడు. కోశాగారాలు అపార ధనరాశులతో నిండిపోయి ఉండటం గమనించిన రాజభటులు హుటాహుటిన రఘు మహారాజు వద్దకు చేరుకుని, సంగతి చెప్పారు. యుద్ధం చేయకుండానే పని నెరవేరడంతో రఘు మహారాజు సైన్యంతో వెనుదిరిగాడు. మర్నాడు ఉదయమే వచ్చిన కౌత్సుడికి తన కోశాగారాల్లోని ధనరాశులను చూపించి, ‘నీకు కావలసిన ధనరాశులు తీసుకువెళ్లు’ అన్నాడు. కౌత్సుడు వాటిని చూసి, ‘నా గురువు పద్నాలుగు ధనరాశులే కోరుకున్నాడు. ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి. మిగిలినవి నాకొద్దు’ అంటూ తన గురువు కోరినన్ని మాత్రమే ధనరాశులను తీసుకుని బయలుదేరాడు. మిగిలిన ధనరాశులను రఘు మహారాజు తిరిగి దేవేంద్రుడికి పంపేశాడు. ∙సాంఖ్యాయన -
ఐకానిక్ మహాభారత్ సాంగ్ను ఆలపించిన ముస్లిం: నెటిజన్లు ఫిదా!
సాక్షి, హైదరాబాద్: అలనాటి పాపులర్ టెలివిజన్ సీరియల్ ‘మహాభారత్’ టైటిట్ సాంగ్ను ఆసాంతం అద్భుతంగా ఆలపించి ఒక ముస్లిం ప్రశంసలందుకుంటున్నారు. ఆయన స్వరానికి, స్పష్టమైన ఉచ్చారణకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ ఐకానిక్ ట్రాక్ను హృద్యంగా ఆలపించిన ఈ వీడియోను మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎస్వై ఖురైషి షేర్ చేశారు. బీటింగ్ ది స్టీరియోటైప్స్ అంటూ ఆయన షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హిందూ ఇతిహాసాల ఆధారంగా రూపొందించిన రామాయణ, మహాభారత సీరియల్స్ టెలివిజన్ చరిత్రలో గొప్ప సంచలనం రేపాయి. ఆదివారం ఉదయం ప్రసారమయ్యే వీటి కోసం జనం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేశారు. తాజా వీడియోతో ఈ ఐకానిక్ టైటిల్ సాంగ్ వినపడగానే అందరూ టెలివిజన్ సెట్ల ముందుకు చేరిపోయే వైనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. నిమిషం, 9 సెకన్ల నిడివి గల ఈ వీడియో నెటిజనులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దిస్ ఈజ్ ఇండియా అంటూ కమెంట్ చేస్తున్నారు. లక్షా12 వేలకు పైగా వ్యూస్, రీట్వీట్లు, లైక్స్తో ఈ వీడియో సందడి చేస్తోంది. -
మీటూ కేసు : రామాయణం ప్రస్తావన
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్ వేసిన పరువు నష్టం దావా కేసు నుంచి జర్నలిస్టు ప్రియారమణికి విముక్తి లభించింది. 2018లో మీటూ ఉద్యమం నేపథ్యంలో ఎంజే అక్బర్ తనని లైంగికంగా వేధించారంటూ ప్రియారమణి చేసిన ఆరోపణలపై అక్బర్ కోర్టుకెక్కారు. ఆమెపై పరువు నష్టం దావా వేశారు. అయితే ప్రియారమణికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవంటూ ఎంజే అక్బర్ వేసిన దావాను ఢిల్లీ కోర్టు బుధవారం కొట్టేసింది. లైంగిక వేధింపులు ఎదుర్కొనే మహిళలకి దశాబ్దాల తర్వాత కూడా ఎక్కడైనా ఎప్పుడైనా ఏ వేదికలోనైనా తనకు జరిగింది వెల్లడించే హక్కు ఉందని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ పాంజే స్పష్టం చేశారు. తీర్పుని వెలువరించే సమయంలో న్యాయమూర్తి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సంఘంలో హోదా ఉన్న వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడలేదని చెప్పలేమని అన్నారు. ‘‘లైంగిక వేధింపులపై తమ గళం విప్పిన మహిళల్ని శిక్షించలేము. ఒక వ్యక్తి పరువు తీశారని ఫిర్యాదులు వచ్చినా మహిళల్ని శిక్షించడానికి వీల్లేదు. మహిళల మర్యాదని పణంగా పెట్టి సంఘంలో మరో వ్యక్తి పరువుని కాపాడలేము’’ అని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. ‘‘లైంగిక వేధింపులతో మహిళల ఆత్మగౌరవం, మర్యాదకి భంగం వాటిల్లుతుంది. తనపై జరిగిన నేరంతో ఆమె తీవ్రమైన మానసిక సమస్యలనెదుర్కొంటుంది. నాలుగు గోడల మధ్య జరిగిన ఘటనలపై ఒక్కోసారి ఆమె పెదవి విప్పలేకపోవచ్చు. ఒక్కో సారి ఆమెకి అన్యాయం జరిగిందని కూడా బాధితురాలికి తెలిసి ఉండకపోవచ్చు. అందుకే లైంగిక వేధింపులకు గురైన మహిళలు దశాబ్డాల తర్వాత కూడా బయట ప్రపంచానికి వెల్లడించవచ్చు’’ అని మెజిస్ట్రేట్ స్పష్టం చేశారు.‘‘లైంగిక వేధింపులతో బాధితురాలు ఎన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటుందో సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తి కూడా మిగిలిన వారిలాగే మన సమాజంలో కలిసిపోతారు. అతనికీ కుటుంబం, బంధువులు, స్నేహితులు ఉంటారు. సమాజంలో గౌరవప్రదమైన స్థానంలోనే ఉంటారు. ఈ విషయాన్ని అందరూ గ్రహించుకోవాలి’’ అని మేజిస్ట్రేట్ రవీంద్రకుమార్ వ్యాఖ్యానించారు. మహిళల్ని గౌరవించాలంటూ రామాయణ, మహాభారతం వంటి పవిత్ర గ్రంథాలు రాసిన నేలపై వారి పట్ల జరుగుతున్న అకృత్యాలు సిగ్గు చేటు అని వ్యాఖ్యానించారు. మహిళలు ఇక మాట్లాడాలి ఢిల్లీ కోర్టు వెలువరించిన తీర్పు పట్ల ప్రియారమణి హర్షం వ్యక్తం చేశారు. తన గెలుపు మరెందరో మహిళల్ని పెదవి విప్పేలా ప్రోత్సహిస్తుందని ప్రియారమణి వ్యాఖ్యనించారు. ‘‘నేను చేస్తున్న పోరాటం నా ఒక్కదాని కోసం కాదు. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళలందరి తరఫున పోరాడుతున్నాను. కేవలం మాట్లాడానని నన్ను ఈ కేసులోకి లాగారు. ఒక బాధితురాలినైన నన్ను ముద్దాయిగా బోనులో నిలబెట్టారు. సమాజంలో పలుకుబడి ఉందని, శక్తిమంతులమని బావించే మగవాళ్లు బాధిత మహిళల్ని కోర్టుకీడ్చడానికి ఇకపై ముందు వెనుక ఆలోచిస్తారు’’ అని ప్రియారమణి అన్నారు. ఈ కేసులో తాను విజయం సాధించేలా శ్రమించిన తన లాయర్లకి ప్రియారమణి ధన్యవాదాలు తెలిపారు. -
అమావాస్య రోజు రాత్రి ఏం జరిగింది?
1. బిలం నుండి బయటకు వచ్చిన పాండవులు ఏం చేశారు? 2. పాండవుల పరిస్థితి ఎలా ఉంది? 3. భీముడు ఏ విధంగా సాగాడు? 4. కుంతి సహా మిగిలిన నలుగురు పాండవులు ఏ స్థితిలో ఉన్నారు? 5. భీముడు నీటి కోసం ఏం చేశాడు? 6. భీముడు కొలను చూసి ఏం చేశాడు? 7. అమావాస్య రోజు రాత్రి ఏం జరిగింది? 8. భీముడి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? జవాబులు 1. పాండవులు గంగ దాటి, మహారణ్యంలోకి ప్రవేశించారు. అది చీమలు దూరని చిట్టడవి.ఆ రోజు కృష్ణ చతుర్దశి. దట్టంగా చీకటి ఆవరించి ఉంది. కంటికి అవతల ఏమున్నదీ కనిపించటంలేదు. 2. పాండవులు అలసిపోయి ఉన్నారు. అప్పుడు భీముడు... తల్లిని, సోదరులను ఎత్తుకొని మహారణ్యంలో నడిచాడు. 3. భీముడికి చీకటి కాని, ముళ్లు కాని కనపడలేదు. వేగంగా నడిచాడు. అతడి నడకకు చెట్లు కదిలాయి. భూమి అదిరింది. భీముడు చల్లని మర్రి చెట్టు కిందకు వచ్చాడు. తల్లిని, సోదరులను ఆ చెట్టు కింద దించి, పడుకోబెట్టాడు. 4. అందరూ ఒడలు మరచి నిద్రించారు. భీముడు అప్రమత్తుడై వారిని రక్షిస్తున్నాడు. 5. భీముడు నీటి పట్టును తెలుసుకోవటం కోసం, మర్రి చెట్టు ఎక్కి, కొనకొమ్మలకు చేరి చూశాడు. దగ్గరలో ఒక సరస్సు కనిపించింది. తామరల వాసన వచ్చింది. హంసలు, తుమ్మెదలు ధ్వనులు చేశాయి. 6. భీముడు కొలను చేరి, స్నానం చేసి తామర దొన్నెలలో నీరు తెచ్చి, సోదరులకు ఇచ్చాడు. అప్పటికి సాయంకాలం అయింది. సూర్యుడు అస్తమించాడు. పక్షులు, జంతువులు, సర్పసమూహాలు బయటపడ్డాయి. 7. ఆ రాత్రి కుంతి, నలుగురు కొడుకులు నిద్రించారు. భీముడు కాపలా ఉన్నాడు. 8. దుష్టుల అండన నగరంలో ఉండటం కంటె, ఒంటరిగా అరణ్యాలలో ఉండటం మేలు. యోగ్యులు అడవిలోని చెట్ల వంటివారు. ఒకరిని ఒకరు ఆశ్రయించుకుని ఉంటారు. వృక్షాలు ఫలాలనిస్తాయి. యోగ్యుడు ఇతరులకు ఉపకారం చేస్తాడు. వృక్షాలు గట్టి వేర్లు కలిగి ఉంటాయి. యోగ్యుడు గొప్ప బుద్ధి కలిగి ఉంటాడు... అని భీముడు ఆలోచన చేశాడు. –నిర్వహణ: వైజయంతి పురాణపండ -
కృష్ణ చతుర్దశి నాటి రాత్రి ఏం జరిగింది?
58. పురోచనుడు తన భార్యను ఎవరి దగ్గర నియోగించాడు? 59. ఆమె చేయవలసిన పని ఏమిటి? 60. కృష్ణ చతుర్దశి నాటి రాత్రి ఏం జరిగింది? 61. ఉత్సవం ముగిశాక ఏం జరిగింది? 62. పురోచనుడు ఎక్కడ నిద్రించాడు? 63. అర్ధరాత్రి సమయంలో ఏం జరిగింది? 64. పాండవులు సొరంగము తవ్వే వానికి ఏం చెప్పారు? 65. పాండవులు ఏం చేశారు? జవాబులు 58. కుంతి దగ్గర; 59. నిత్యం కుంతి రహస్యాలను పురోచనుడికి తెలియపరచాలి. ఆమె అలాగే చేసేది; 60. ఆ రోజు రాత్రి లక్క ఇంటిలో పాండవులు గొప్ప ఉత్సవం చేశారు. నిషాద స్త్రీ, ఆమె ఐదుగురు కొడుకులు కల్లు తాగారు. తెలివి తప్పి పడిపోయారు. లక్క ఇంటి పక్కనే నిద్రించారు; 61. ఉత్సవం ముగిసింది. అర్ధరాత్రి అయ్యింది. అందరూ నిద్రించారు; 62. ఆయుధాగారంలో నిద్రించాడు; 63. ధర్మరాజు సమయం చూశాడు. భీముడికి అనుమతి ఇచ్చాడు. భీముడు నిప్పు అందుకుని, ఆయుధాగారపు ద్వారానికి నిప్పు అంటించాడు. భగ్గున మండింది. పురోచనుడు ఆ మంటల్లో మరణించాడు; 64. వారి కుశలం తెలిపారు. విదురునికి తెలియపరచమన్నారు; 65. బిలంలోకి ప్రవేశించారు. –నిర్వహణ: వైజయంతి పురాణపండ -
భారత్ విజయగాథ అపూర్వం
వాషింగ్టన్ : ప్రభుత్వాలు తరచూ మారిపోయినా.. రాజకీయ పార్టీల్లో కుట్రలు ఎన్ని ఉన్నా.. సాయుధ వేర్పాటు ఉద్యమాలు ఎన్ని నడిచినా, అన్ని రకాల స్కామ్లు, అవినీతి ఉన్నప్పటికీ ఆధునిక భారత దేశం సాధించిన ఘనతలు పలు విధాలుగా ఓ విజయగాథ అని అగ్రరాజ్యం అమెరికా 44వ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన పుస్తకం ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’లో రాసుకున్నారు. 1990 తొలినాళ్లలో ఆర్థిక సరళీకరణలు చేపట్టడంతో భారత్లోని అసాధారణ భారతీయ వ్యాపార నైపుణ్యాలు ప్రపంచానికి పరిచయం అయ్యాయని, ఫలితంగా దేశ అర్థ వ్యవస్థ పరుగులు పెట్టిందని, టెక్నాలజీ రంగం వృద్ధి చెందిందని ఒబామా ఆ పుస్తకంలో వివరించారు. 2008లో ఒబామా చేపట్టిన అధ్యక్ష ఎన్నికల ప్రచారం మొదలుకొని అధ్యక్షుడిగా తన అనుభవాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. అల్ కాయిదా అధ్యక్షుడు బిన్ లాడెన్ను హతమార్చడంతో పాటు తొలి దఫా అధ్యక్ష పదవీ కాలం ముగిసేంత వరకూ జరిగిన పలు ఘట్టాలను ఆయన ఎ ప్రామిస్డ్ ల్యాండ్లో విపులీకరించారు. ఈ నెల 15న విడుదలైన ఈ పుస్తకంలో 2010లో ఒబామా భారత్ పర్యటన వివరాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందులోని కొన్ని ముఖ్యాంశాలు.. మన్మోహన్పై ప్రశంసలు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్పై ఒబామా ప్రశంసల వర్షం కురిపించారు. సిక్కు మైనార్టీ వర్గానికి చెందిన మన్మోహన్ దేశ అత్యున్నత పదవిని అందుకోవడం దేశ పురోగతికి ఓ తార్కాణమని, నిజాయితీపరుడిగా గుర్తింపు పొందడం వంటివి మన్మోహన్ సాధించిన విజయాలని ఒబామా వర్ణించారు. ఢిల్లీలో మన్మోహన్ సింగ్ను తాను కలిసినప్పుడు ఆయనలోని అసాధారణ విజ్ఞానాన్ని, హుందా వ్యవహారశైలిని గుర్తించానని చెప్పారు. వినడం సోనియాకు ఇష్టం.. 2010లో తొలిసారి ఢిల్లీ వెళ్లినప్పుడు కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, రాహుల్గాంధీలతో విందు సమావేశంలో పాల్గొన్నట్లు ఒబామా వివరించారు. సోనియా మాట్లాడటం కంటే ఎదుటి వ్యక్తి చెప్పింది వినేందుకే ఎక్కువ ఇష్టపడేవారని తెలిపారు. రాహుల్ గాంధీ తెలివైనవాడిగా, పట్టుదల ఉన్నవాడిగానే కనిపించాడు. అయితే రాహుల్లో ధైర్యం లేని అపరిపక్వతను తాను గమనించానని, పాఠాలన్నీ చదివి టీచర్ వద్ద మంచి మార్కులు కొట్టేయాలని చూసే విద్యార్థిలా అనిపించాడని ఒబామా వ్యాఖ్యానించారు. -
ధర్మరాజు మాటలకు భీముడు ఏమన్నాడు?
40. పాండవులు వారణావతంలో ఉన్నప్పుడు ఏం జరిగింది? 41. ఇల్లు చూసిన పాండవులు ఏ విధంగా ఉన్నారు? 42. ధర్మరాజు ఎలాంటివాడు? 43. ఇంటి గురించి ధర్మరాజు భీమునితో ఏమన్నాడు? 44. ధర్మరాజు మాటలకు భీముడు ఏమన్నాడు? 45. భీముని మాటలకు ధర్మరాజు ఏమన్నాడు? 46. పురోచనుడు గ్రహిస్తే ఏం జరుగుతుందని ధర్మరాజు అన్నాడు? 47. ఎవరెవరు ఎటువంటి వారికి అపాయం కలిగిస్తారని ధర్మరాజు అన్నాడు? 48. దుర్యోధనుడి గురించి ధర్మరాజు ఏమన్నాడు? 49. పాండవులు ఏ విధంగా జీవనం సాగించారు? జవాబులు 40. కొంతకాలం పాండవులు రాజగృహంలో ఉన్నారు. అప్పుడు పురోచనుడు లక్క ఇల్లు పూర్తి చేసి, ఆ విషయం పాండవులకు విన్నవించాడు. 41. పాండవులు అక్క ఇల్లు చూసి సంతోషించారు. పురోచనుడు శిల్పాచార్యుడు. అతడిని పూజించారు. పుణ్యాహవాచనం చేసి, లక్క ఇంట్లోకి ప్రవేశించారు. 42. మాయోపాయాలు తెలుసుకోగల సమర్థుడు. అతడు లక్క ఇంటి రహస్యం కనిపెట్టాడు. విషాగ్నుల వలన భయమని విదురుడు చెప్పిన మాటలు తలచుకున్నాడు. 43. పురోచనుడు లక్క ఇల్లు కాల్చగలడని చెప్పాడు. 44. తక్షణమే ఇంటి నుంచి బయటపడటం మేలని భీముడు అన్నాడు. 45. మనం పురోచనుని గుట్టు తెలుసుకున్నట్లు అతడు గ్రహించకూడదు. 46. పురోచనుడు గ్రహిస్తే, ఈ ఇంటిని మరింత తొందరగా దహిస్తారు. మనం మరొక చోటికి వెళితే దుర్యోధనుడు మనకు తప్పక అపాయం కలిగిస్తాడు.. అన్నాడు. 47. ప్రభుత్వ బలం ఉన్నవాడు ప్రభుత్వ బలం లేనివానికి, భుజబలం ఉన్నవాడు భుజబలం లేనివానికి, ధనవంతుడు ధనం లేనివానికి, రసజ్ఞుడు రసజ్ఞత లేనివానికి సునాయాసంగా అపాయం కలిగించగలరు... అని వివరించాడు. 48. దుర్యోధనుడు దుర్మార్గుడు. అతడికి ప్రభుత్వం బలం ఉంది. కాబట్టి మనం పారిపోకూడదు. అప్రమత్తులమై ఇక్కడే ఉండాలి. ఈ విషయం తెలియనట్లు ప్రవర్తించాలి. లక్క ఇల్లు కాలేంతవరకు ఇక్కడే ఉండాలి.. అన్నాడు. 49. పాండవులు పగటిపూట అడవులకు వెళ్లి వేటాడారు. రాత్రుళ్లు ఆయుధాలు ధరించారు. అప్రమత్తంగా ఉంటూ కొంతకాలం గడిపారు. – నిర్వహణ: డా. వైజయంతి పురాణపండ -
ప్రజలను ఉద్దేశించి ధర్మరాజు ఏమన్నాడు?
31. పాండవులు వారణావతానికి బయలుదేరుతూ ఏం చేశారు? 32. పాండవులు వారణావతానికి బయలుదేరుతుండగా హస్తిన ప్రజలు ఏమనుకున్నారు? 33. ప్రజలను ఉద్దేశించి ధర్మరాజు ఏమన్నాడు? 34. పాండవులను వారణావతానికి ఏవిధంగా సాగనంపారు? జవాబులు 31. ధృతరాష్ట్రునికి, భీష్మద్రోణాదులకు వందనం చేసి, వారి అనుమతి పొందారు; 32.శంతనుడు, చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు, పాండురాజు... వీరంతా వరుసగా పరిపాలించారు. ఆ క్రమంలో ధర్మరాజు రాజు కావాలి. ధృతరాష్ట్రుడు ధర్మం తప్పాడు. పాండవులను వారణావతానికి పంపుతున్నారు. ఇది అధర్మం. మనం కూడా ధర్మరాజుతో వారణావతానికి వెళదాం... అంటూ పాండవుల వెంట బయలుదేరారు; 33. ప్రజలారా! ధృతరాష్ట్రుడు మాకు తండ్రి. ఆయన చెప్పినట్లు చేయటం మా విధి. మీరు వెనక్కు వెళ్లిపోండి.. అని వారి వద్ద సెలవు తీసుకున్నారు; 34. ధర్మరాజాదులను కన్నీటితో సాగనంపారు. – నిర్వహణ: డా. వైజయంతి పురాణపండ -
లాక్డౌన్ : దుర్భర జీవితం అనుభవిస్తున్న నటుడు
లుధియానా : కరోనా నేపథ్యంలో దేశంలో విధించిన లాక్డౌన్ కొందరి జీవితాల్ని చిన్నాంబిన్నం చేస్తుంది. తాజాగా ప్రముఖ పంజాబీ సినీ, టీవీ నటుడు సతీష్ కౌల్ తినడానికి సరైన తిండి లేక, ఉండడానికి చోటు లేక దుర్భర జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. సతీష్ కౌల్ పీటీఐ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ.. ' ప్రస్తుతం లుధియానాలో నా భార్య సత్యాదేవితో కలిసి ఒక చిన్న ఇంట్లో అద్దెకు ఉంటున్నా. అంతకుముందు ఒక ఓల్డేజ్ హోంలో ఉన్నాం. అయితే లాక్డౌన్ మా జీవితాలను తలకిందులు చేసింది. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది కానీ తినడానికి తిండి లుక , కొనుక్కోవడానికి మందులు,నిత్యావసరాల సరుకులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. నటుడిగా ఒక వెలుగు వెలిగినప్పుడు అందరూ నా చుట్టూ ఉన్నారు.. పరిస్థితి కఠినంగా ఉన్నప్పుడు మాత్రం ఒక్కరు ముందుకు రాలేదు. నాకు సహాయం చేయాలని ఇండస్ట్రీలోని పలువురిని అడిగా.. ఎవరు స్పందించలేదు. అయితే 2015లో జరిగిన వెన్నుముక ప్రమాదం నన్ను ఆర్థికంగా చాలా కుంగదీసింది. దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు ఆసుపత్రి బెడ్పైనే ఉండాల్సి వచ్చంది. ఆ సమయంలోనే చికిత్స పేరుతో నా ఆస్తులు మొత్తం కరిగిపోయాయి. ఈ సమయంలోనే నా భార్యతో కలిసి ఓల్డేజ్ హోమ్లో కాలం వెళ్లదీశా' అంటూ తన గోడును వెళ్లబోసుకున్నాడు. 1988లో బీఆర్ చోప్రా తెరకెక్కించిన మహాభారతం సీరియల్లో ఇంద్రుడి పాత్రను పోషించిన సతీష్ కౌల్ పంజాబీ, హిందీ కలిపి దాదాపు 300 సినిమాల్లో నటించాడు. ప్యార్తో హోనా హై తా, ఆంటీ నం 1, జంజీర్, యారానా, రామ్లఖన్ వంటి హిట్ సినిమాల్లో నటించాడు. విక్రమ్ ఔర్ బేతాల్ అనే టీవి సీరియల్లో నటించిన సతీష్ కౌల్ను 2011లో పంజాబీ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో లైఫ్ టైం ఎచీవ్మెంట్ అవార్డుతో సత్కరించారు. నాకు ఎవరితోనూ సంబంధం లేదు: అలియా నా భర్త ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో కదా?? -
డీడీ నంబర్ వన్
కేబుల్ రాకముందు దూరదర్శన్ (డీడీ) ఛానలే అందరికీ వినోదం, విజ్ఞానం అందించింది. కేబుల్ టీవీ, స్మార్ట్ ఫోన్స్ వినియోగం ఎక్కువ కావడంతో దూరదర్శన్ కి ఇంతకు ముందు ఇచ్చిన ప్రాధాన్యత ఇవ్వడంలేదనే చెప్పాలి. అయితే ఈ ‘లాక్ డౌన్’ సమయంలో ‘డీడీ నేషనల్’ తన పూర్వ వైభవాన్ని చూస్తోంది. టీ. ఆర్. పీ రేటింగ్స్ లో అగ్రగామిగా నిలుస్తోంది. కారణం దూరదర్శన్ లో ఒకప్పుడు బాగా పాపులర్ అయిన సీరియల్స్, షోలను పునః ప్రసారం చేయడమే. బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) విడుదల చేసిన డేటా ఆధారంగా దేశంలో దూరదర్శన్ నంబర్ వన్ స్థానంలో ఉంది. లాక్ డౌన్ కి ముందు వారాల్లో టాప్ 10లో లేకపోయినా ప్రస్తుతం నంబర్ వన్ స్థానంలో కొనసాగడం విశేషం. మార్చి చివరి వారం (మార్చి 21–27) రేటింగ్ సంఖ్యతో పోలిస్తే ఆ మరుసటి వారం (మార్చి 28– ఏప్రిల్ 3) దూరదర్శన్ వీక్షకుల సంఖ్య సుమారు 580 రెట్లు పెరిగినట్టు తెలిసింది. ‘‘రామాయణం, మహాభారతం, శక్తిమాన్, సర్కస్, బ్యోమకేష్ బక్షి వంటి పాపులర్ సీరియళ్లు, ప్రోగ్రాములు తిరిగి ప్రసారం కావడం దేశం మొత్తాన్ని శ్రద్ధగా టీవీలకు అతుక్కుపోయేలా చేసింది డీడీ. ముఖ్యంగా రామాయణం , మహాభారతం ప్రసారం అవుతున్న సమయాల్లో వీక్షకుల సంఖ్య భారీ స్థాయిలో పెరిగింది. అలాగే క్వారంటైన్ సమయాల్లో టీవీ వీక్షించే సమయం కూడా 43 శాతం వరకు పెరిగింది’’ అని బార్క్ సంస్థ తెలిపింది. -
ఈ సారి క్రిష్గా కాదు కృష్ణుడిగా?
అన్నీ కుదిరితే బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కృష్ణావతారం ఎత్తనున్నారు. ఇప్పటివరకు క్రిష్గా అభిమానులను అలరించిన హృతిక్ ఈసారి కృష్ణుడిగా అందరి మనసులను దొంగలించే అవకాశం ఉంది. మధు మంతెన నిర్మాణ భాగస్వామ్యంలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా తెరకెక్కనున్న చిత్రం ‘మహాభారతం’.. అయితే భారీ కాస్టింగ్తో తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారు మధు మంతెన. దీనిలో భాగంగా ద్రౌపది పాత్రను దీపికా పడుకోన్ పోషించనున్నారు. అయితే మహాభారతంలో అతిముఖ్యమైన కృష్ణుడి పాత్ర కోసం పలువురు బాలీవుడ్ ఆగ్రహీరోలతో నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు. దీనిలో భాగంగా హృతిక్ రోషన్తో ఫిల్మ్ మేకర్ మధు మంతెన చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కృష్ణుడి లాంటి చాలెంజింగ్ పాత్రలో నటించేందకు హృతిక్ అంగీకరించినట్లు బాలీవుడ్ టౌన్లో అనేక వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే గతంలో కృష్ణుడి పాత్రను అక్షయ్ కుమార్ లేక అమీర్ ఖాన్లు పోషించే అవకాశం ఉందని అనేక వార్తలు వచ్చాయి. అయితే తాజాగా హృతిక్ పేరు తెరపైకి రావడంతో కృష్ణుడు ఎవరనే దానిపై సస్పెన్స్ ఇంకా వీడలేదు. (చదవండి: ఆయనతో లిప్లాక్ అంటే ఓకే!) ఇక ద్రౌపది పాత్ర దీపిక పోషించనుండటంపై ఫిల్మ్మేకర్ మధు ఆనందం వ్యక్తం చేశారు. ‘బాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’ చిత్రాలు చూశాక రాణి పాత్ర అంటే దీపికనే చేయాలనే భావన కలిగిందన్నారు. అంతేకాకుండా ఈ రెండు సినిమాల్లో దీపిక రాణి పాత్రలో జీవించేశారని, అప్పటికాలంలో రాణులంటే ఇలాగే ఉండేవారేమో అనిపించేంతగా ఆ పాత్రలను పోషించారని ప్రశంసల వర్షం కురిపించారు. ద్రౌపది పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా రూపొందడం విలక్షణమని చెప్పారు. దీపికా చిత్ర బృందంలో చేరడంతోనే ఈ మూవీని భారీస్ధాయిలో రూపొందుతోందని.. ఆమె భారత్లో అతిపెద్ద నటి మాత్రమే కాకుండా సినిమాకు హద్దులు చెరిపివేసే సామర్థ్యం దీపికాకు ఉందని అన్నారు. తెలుగు, హిందీ సహా భిన్న భాషల్లో తెరకెక్కనున్న ఈ మూవీ పలు భాగాలుగా రూపొందనుంది. తొలి భాగం వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రానికి దీపిక సహ నిర్మాత వ్యవహరించనున్న విషయం తెలిసిందే. -
మహాభారతం : ద్రౌపది పాత్రలో దీపిక
న్యూఢిల్లీ : మధు మంతెన నిర్మాణ భాగస్వామ్యంలో భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న మహాభారతంలో ద్రౌపది పాత్రలో బాలీవుడ్ నటి దీపికా పడుకోన్ నటించనున్నారు. ఈ పాత్రను తాను అంగీకరించడంతో పాటు ఈ ప్రతిష్టాత్మక మూవీకి సహ నిర్మాతగా వ్యవహరించనున్నట్టు దీపిక వెల్లడించారు. బాజీరావు మస్తానీ, పద్మావత్ వంటి పీరియాడిక్ ఫిల్మ్స్లో అలరించిన దీపిక తనకు మహాభారతంలో ద్రౌపది పాత్ర లభించడం జీవితకాల అవకాశమని అభివర్ణించారు. ద్రౌపది దృక్కోణంలో మహాభారతాన్ని ఈ సినిమా ఆవిష్కరించడం ఆకట్టుకునే అంశమని ఆమె చెప్పుకొచ్చారు. మహాభారతం కథలుకథలుగా మనం తరతరాలుగా చెప్పుకున్నా అవన్నీ పురుషుడి ఆధారంగా అల్లుకున్న కథలు కాగా తొలిసారిగా మహిళ కోణంలో ఈ కావ్యాన్ని ఆవిష్కరిస్తున్నామని చెప్పారు. ద్రౌపది పాత్రలో నటించడం తాను గౌరవంగా భావిస్తున్నానని, థ్రిల్కు గురవుతున్నానని అన్నారు. ప్రతిష్టాత్మక చారిత్రక దృశ్య కావ్యాన్ని తెరకెక్కిస్తున్న ఫిల్మ్ మేకర్ మధు మంతెన స్పందిస్తూ ద్రౌపది పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా రూపొందడం విలక్షణమని చెప్పారు. దీపికా చిత్ర బృందంలో చేరడంతోనే ఈ మూవీని భారీస్ధాయిలో రూపొందుతోందని..ఆమె భారత్లో అతిపెద్ద నటి మాత్రమే కాకుండా సినిమాకు హద్దులు చెరిపివేసే సామర్థ్యం దీపికాకు ఉందని అన్నారు. తెలుగు, హిందీ సహా భిన్న భాషల్లో తెరకెక్కనున్న ఈ మూవీ పలు భాగాలుగా రూపొందనుంది. తొలి భాగం వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఆ భారీ బడ్జెట్ చిత్రం ఆగిపోయింది!
మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ ప్రధాన పాత్రలో దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో మహా భారతగాథను తెరకెక్కిస్తున్నట్టుగా చాలా కాలం క్రితమే ప్రకటించారు. ప్రముఖ రచయిత ఎమ్టీ వాసుదేవన్ నాయర్ రచించిన రంధమూలం నవల ఆధారం సినిమాను రూపొందించాలని ప్లాన్ చేశారు. యూఏఈకి చెందిన వ్యాపార వేత్త బీఆర్ శెట్టి, శ్రీకుమార్ దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రాజెక్ట్ను తెరకెక్కించేందుకు నిర్ణయించారు. సినిమాను తెరకెక్కించేందుకు వీలుగా నవలను మార్చి స్క్రీన్ప్లేను కూడా వాసుదేవన్ నాయరే సమకూర్చారు. అయితే సినిమా ప్రకటించి మూడేళ్లు గడుస్తున్న ఇంత వరకు సినిమా ప్రారంభించకపోవటంపై రచయిత అసహనం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ కేవలం మూడేళ్లకే చేయించుకున్నారని.. అయినా తాను మరో ఏడాది పాటు ఎక్కువగా ఎదురుచూసినా షూటింగ్ పనులు ఇంకా ప్రారంభించలేదంటూ చాలా రోజుల కిందటే నాయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాజాగా నిర్మాత బీఆర్ శెట్టి అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ మహా భారతం ప్రాజెక్ట్ ఆగిపోయినట్టుగా ప్రకటించారు. రచయితం దర్శకుల మధ్య వచ్చిన అభిప్రాయభేదాల కారణంగా ప్రస్తుతానికి ప్రాజెక్ట్ ఆగిపోయినట్టుగా ప్రకటించారు. -
కురుక్షేత్ర సంగ్రామం
రణరంగంలోకి దూకి శత్రువులపై విల్లు ఎక్కుపెట్టి వీరోచితంగా పోరాడుతున్నారు విక్రమ్. మలయాళ దర్శకుడు ఆర్ఎస్. విమల్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ‘మహావీర్కర్ణ’ అనే మల్టీలింగ్వల్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహాభారతం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా కర్ణుడి దృష్టికోణంలో సాగేలా కథను రెడీ చేశారట విమల్. ఇటీవల ఈ సినిమా షూటింగ్ హైదాబారాద్లో ప్రారంభమైంది. కురుక్షేత్ర యుద్ధం నేపథ్యంలోని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. ఈ షెడ్యూల్ను 18 రోజుల పాటు ప్లాన్ చేశారట. త్వరలోనే ఈ సినిమా మోషన్ పోస్టర్ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు చిత్రబృందం. అదే టైమ్లో సినిమాలో భాగమైన ఇతర నటీనటుల వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారట. -
ద్రౌపదిగా దీపికా పదుకొనె..!
ముంబై : బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్ మహా భారతాన్ని తెరకెక్కించేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయంటూ బీ టౌన్లో వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త హల్చల్ చేస్తోంది. ఒక జాతీయ మీడియా కథనం ప్రకారం.. 1000 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ పౌరాణిక చిత్రంలో పాత్రలన్నింటికీ ప్రముఖులనే ఎంపిక చేయాలని ఆమిర్ భావిస్తున్నారట. మహాభారతంలో అతి ముఖ్యమైన ద్రౌపది పాత్రకు దీపికా పదుకొనెను తీసుకోవాలని టీమ్ భావిస్తున్నట్లు సమాచారం. ‘పద్మావత్’ సినిమాతో మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్న దీపికా.. ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే ఆమె కెరీర్లో మరో కలికితురాయి చేరినట్లే. దీపికా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి దాదాపు పదేళ్లయినప్పటికీ ఇంత వరకు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్తో స్క్రీన్ షేర్ చేసుకోలేదు. ఈ సినిమాతోనైనా వారిద్దరి కాంబినేషన్ సాధ్యమవుతుందో చూడాలి మరి. -
‘పాస్వర్డ్’ కోసమే కురుక్షేత్ర యుద్ధం
సాక్షి, న్యూఢిల్లీ : తెలుగునాట అత్యంత ప్రజాదరణ పొందిన ‘మాయాబజార్’ సినిమాలోని ‘ప్రియదర్శిని’ సన్నివేశం మనందరికి గుర్తుండే ఉంటుంది. అందులో శ్రీకష్ణుడు పెట్టెలాంటి ఓ ప్రియదర్శినిని తీసుకొచ్చి శశిరేఖకు కానుకగా ఇస్తాడు. ఆ పెట్టె తెరచి మూతను చూస్తే దానికో అద్దం ఉంటుంది. దానిముందు నిలబడి ఆ అద్దంలోకి ఎవరు చూస్తే వారికి తమకు ప్రియమైన వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తారు. అందుకే దాన్ని ప్రియదర్శిని అన్నారు. లేకపోతే మాయాదర్పనం అనేవారు. ఆ ప్రియదర్శిని అద్దంలాంటి స్క్రీన్ను చూస్తే శశిరేఖ పాత్రధారి సావిత్రికి, తాను ప్రేమించిన అభిమన్యుడు, అంటే నాగేశ్వరరావు కనిపిస్తారు. బాలరాముడి భార్య రేవతి పాత్రధారి ఛాయాదేవీ ఆ ప్రియదర్శినిలోకి చూస్తే నగలు కనిపిస్తాయి. మరొకరు చూస్తే జరగబోయే కీడు కనిపిస్తుంది. వారు ఇంకా అలాగే చూస్తున్నట్లయితే త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేవ్ మంగళవారం అగర్తలో ప్రాచీన మహాభారతానికి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ముడిపెడుతూ చేసిన ప్రసంగం కనిపించేది. పాండవులు, కౌరవుల మధ్య జరిగిన యుద్ధం విశేషాలను ఎప్పటికప్పుడు కళ్లు కనిపించని ధృతరాష్ట్రుడికి ఆయన సలహాదారు సంజయ ఈ ప్రియదర్శిని లాంటి వీడియోలోకి చూస్తూ చెప్పారని బిప్లబ్ కుమార్ తెలిపారు. ‘అంటే, ఈ సాంకేతిక పరిజ్ఞానం అప్పటికే ఉంది. ఇంటర్నెట్ ఉంది. శాటిలైట్ ఉంది’ అని ఆయన వివరించారు. 950 సంవత్సరాల క్రీస్తు పూర్వం నుంచి 3,102 సంవత్సరాల క్రీస్తుపూర్వం మధ్యకాలంలో సంభవించిన ట్లు భావిస్తున్న మహాభారత కాలంలోనే ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న ఇంటర్నెట్, వైఫై టెక్నాలజీ ఉందన్నమాట. మహాభారతానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ముడిపెట్టడం కొత్త విషయమేమీ కాదు. ఎప్పటి నుంచో జరుగుతున్నదే. విమానాన్ని రైట్స్ సోదరులు కనిపెట్టడానికి వేల సంవత్సరాల క్రితమే మహాభారత కాలంలో పుష్పక విమానం ఉందని, ఆ విమానాన్ని కాపీ కొట్టే రైట్ సోదరులు ఆధునిక విమానాన్ని కనిపెట్టారని పిడి వాదులు వాదించారు. పుష్పక విమానం ఊహకుగానీ, నిజమైన విమానం ఊహకుగానీ మూలం ఒక్కటే పక్షులని ఎవరైనా ఊహించగలరు. ఇంక రైట్ సోదరులు కనిపెట్టిన విమానం లోహ రెక్కలు పక్షి రెక్కలకు కాస్త భిన్నంగా ఉంటాయి. మహాభారతంలో పేర్కొన్న పుష్పక విమానం రెక్కలు, పక్షి రెక్కలు కత్తిరించి అతికించినట్లు ఉంటాయి. పుష్పక విమానానికి దివ్య శక్తులు మినహా ఇంజన్ ఉన్నట్లు ఏ పుస్తకంలోనూ లేదు. అలాంటప్పుడు పుష్పక విమానానికి మన లోహ విమానానికి పోలిక ఎక్కడ? మన సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీయే 2014లో ఓ ఎన్నికల సభలో మాట్లాడుతూ ప్రాచీన భారత దేశంలోనే ప్లాస్టిక్ సర్జరీ టెక్నాలజీ ఉందని, అందుకు ఉదాహరణే గణేశుడని చెప్పారు. అప్పుడు ఆయన మాటలకు సోషల్ మీడియా ఎలా స్పందించిందోగానీ, ఇప్పుడు బిప్లబ్ కుమార్ వ్యాఖ్యలకు సోషల్ మీడియా, ముఖ్యంగా ట్విట్టర్లో ట్వీట్లు టపాసుల్లా పేలుతున్నాయి. ‘సింహాసనం ఎక్కిన బాబర్ విద్యుత్ చార్జీలు చెల్లించడానికి నిరాకరించడంతో దేశంలో ఇంటర్నెట్ను కట్ చేశారు... పాండవులు తమ వైఫై పాస్వర్డ్ను కౌరవులతో షేర్ చేసుకొని ఉంటే కురుక్షేత్ర యుద్ధమే జరిగేది కాదు.... వాస్తవానికి కౌరవులు తమ వైఫై పాస్వర్డ్ను పాండవులతో షేరు చేసుకోక పోవడం వల్లనే మహాభారత యుద్ధం వచ్చింది. మొదట పాండవులు జియో కనెక్షన్ అడిగారు. అందుకు కౌరవులు తిరస్కరించారు. ఆ తర్వాత బీఎస్ఎన్ఎల్ 3జీ కనెక్షన్ గురించి అడిగారు. దానికి కౌరవులు తిరస్కరించారు.... మహాభారత్ సమయంలో ఫేస్బుక్ కూడా ఉంది. మన మార్క్ జుకర్బర్గ్ పూర్వికుడైన మార్కాండేయ చక్రవర్తి ‘ముఖ్ పుస్తక్’ను నడిపారు. అదే కాలక్రమంలో ఫేస్బుక్గా మారింది.... ద్రోణాచార్యుడు, ఏకలవ్యుడిని తన శిశ్యుడిగా చేసుకునేందుకు ఆయన ఆధార్ కార్డు అడిగాడు. ఇంటర్నెట్ స్లోగా ఉండడంతో అది ఆయన బొటన వేలు ముద్రను రిసీవ్ చేసుకోలేదు. దాంతో ఏకలవ్యుడు తన బొటన వేలును గురువుకు కోసిచ్చి తీరక ఉన్నప్పుడు చూసుకోమని చెప్పి వచ్చాడు.... రామాయణం సమయంలో కూడా ఇంటర్నెట్ ఉండి ఉంటే ఎంత బాగుండును! సంజీవిని కోసం హన్మంతుడికి పర్వతాన్ని పెకిలించుకొని తెచ్చే పని తప్పేది. ఎంచక్కా, గూగుల్ మ్యాప్లో సంజీవిని గుర్తించి తెచ్చేవాడు..... ఇలా ఎవరికి వారు తమదైన శైలిలో నవ్యులు పూయించారు. రాజకీయ నేతల్లో కూడా బిప్లబ్ కుమార్ లాంటి హాస్యప్రియులు ఉండబట్టి దేశంలో ఇంకా హాస్యం బతికి ఉన్నట్లుంది. -
మహాభారత్ సహ నిర్మాతగా దేశ సంపన్నుడు
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న ‘మహాభారత్’ సినిమా సిరీస్కు సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. రూ. 1000 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ సినిమాకు దేశంలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సహ నిర్మాతగా వ్యవహరించబోతున్నట్టు తెలుస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా ఈ విషయం తెలిసినట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ఈరోస్, ఏక్తా కపూర్కు చెందిన బాలాజీ టెలీ ఫిలింస్ లలో ముఖేష్ పెట్టుబడులు పెట్టారు. అయితే కొత్త సంస్థను స్థాపించడం ద్వారా ‘మహాభారత్’'కు ముఖేష్ పెట్టుబడులు పెడతారా? లేక ఇప్పటికే ఆయనకు ఉన్న మీడియా సంబంధిత సంస్థలు జియో, వయాకామ్ 18 ల ద్వారా పెట్టుబడులు పెడతారా? అనే విషయంలో స్పష్టత లేదు. నాలుగు నుంచి ఐదు భాగాలుగా ఈ సినిమా నిర్మితమవుతుందని తెలుస్తోంది. ఎక్కువ మంది దర్శకులు ఈ సినిమాకు పని చేసే అవకాశం ఉందని సమాచారం. ప్రపంచంలోని సమారు అన్ని భాషల్లోనూ విడుదల చేస్తారని సమాచారం అందుతోంది. ప్రపంచ ప్రేక్షకుల కోసం అంతర్జాతీయ రచయితలను ఇక్కడకు రప్పిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం అమీర్ ఖాన్ ఎక్కువగా కృషి చేస్తున్నారు. -
‘మహాభారతం కన్నా బాహుబలి బెటర్’
ముంబై: ఇటీవల కాలంలో బాలీవుడ్ లో సెన్సార్ వివాదాలు ఎక్కువవుతున్నాయి. తాజాగా ఓ స్టార్ హీరో సినిమాకు కూడా సెన్సార్ బోర్డ్ నుంచి సమస్యలు ఎదురయ్యాయి. సైఫ్ అలీ ఖాన్ హీరోగా తెరకెక్కిన కళాకాండీ సినిమాకు సెన్సార్ బోర్డ్ సభ్యులు ఏకంగా 72 కట్స్ సూచించారు. దీంతో రివ్యూ కమిటీని ఆశ్రయించిన సైఫ్ సింగిల్ కట్ తో సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ సాధించాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సైఫ్ అలీఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సెన్సార్ సభ్యుల తీరును తప్పుపట్టిన ఈ స్టార్ హీరో సెన్సార్ బోర్డ్లో రాజకీయ ప్రమేయం ఎక్కువైందని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో మహాభారతం లాంటి సినిమాను తీయటం కన్నా బాహుబలి లాంటి కల్పిత కథలతో సినిమాలు తీయటం బెటర్ అన్నారు. ‘ప్రేక్షకుల కూడా చాలా సన్నితంగా ప్రవర్తిస్తున్నారు. ప్రతీ విషయాన్ని మతానికి నమ్మకాలకు ముడిపెట్టి చూస్తున్నారు, ప్రేక్షకులతో పాటు సెన్సార్ బోర్డ్ సభ్యులకు నిజానికి, కల్పనకు తేడా తెలియటం లేదు’ అని విమర్శించారు. అక్షత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన కళాకాండి సినిమాలో అక్షయ్ ఒబెరాయ్, కునాల్ రాయ్ కపూర్, దీపక్ దోబ్రియాల్, విజయ్ రాజ్, శోభితా దూళిపాల కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రైట్ రైట్... మహాభారతం
కౌరవులు, పాండవులు, ధర్మరాజు ధర్మాలు, దుర్యోధనుడి దురాగతాలు, శకుని కుట్రలు, కృష్ణుడి మాయలు, కర్ణుడి దానగుణం, అర్జునుడి పరాక్రమం, కురుక్షేత్ర రణరంగం... ‘మహాభారతం’ గురించి చెబుతున్నామన్న విషయం గ్రహించే ఉంటారు. సోనమ్ కపూర్కి ‘మహాభారతం’ అంటే ఇష్టం. అందుకే మహాభారతాన్ని సిల్వర్ స్క్రీన్పై చూపించాలనుకున్నారు. ‘మహాభారతం’ ఇతిహాసం ఆధారంగా సింగపూర్ బేస్డ్ రైటర్ కృష్ణ ఉదయశంకర్ ఓ నవల రాశారు. ఇందులో ‘గోవిందా, కౌరవ, కురుక్షేత్ర’ అనే త్రీ పార్ట్స్ ఉన్నాయి. ఇందులోని ఫస్ట్ పార్ట్ ‘గోవిందా’ రైట్స్ను సోనమ్ కపూర్ కొన్నారు. ‘‘నేను ఏ క్యారెక్టర్ చేయబోతున్నానన్నది ప్రజెంట్ సస్పెన్స్. మహాభారతం గొప్ప పురాణ చరిత్ర’’ అని పేర్కొన్నారు సోనమ్. ఈ సంగతి ఇలా ఉంచితే.. సోనమ్ ఇది వరకే అనూజా చౌహాన్ రాసిన ‘బాటిల్ ఫర్ బిట్టోర’, ‘జోయా ఫ్యాక్టర్’ బుక్స్ ఆధారంగా సినిమాలు చేయాలనుకున్నారు. మరి..‘మహాభారతం’ పట్టాలెక్కేదెప్పుడు? ఈ బుక్స్ బేస్డ్ మూవీస్ ప్రారంభమయ్యేది ఎప్పుడు? -
రాజమౌళికి షాక్ : ఆమిర్ మహాభారతం
బాహుబలి లాంటి భారీ చిత్రం తరువాత రాజమౌళి.. బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారన్న ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అదే సమయంలో ఎప్పటికైనా మహాభారతాన్ని తెరకెక్కించటమే తన జీవితాశమని రాజమౌళి తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ఈసినిమాను తెరకెక్కించే ఆలోచన ఉన్నట్టుగా ప్రకటించాడు రాజమౌళి. అయితే రాజమౌళి సినిమా పనులు మొదలు కాకముందే మరిన్ని మహాభారతాలు మొదలవుతున్నాయి. ఇప్పటికే మలయాళ నటుడు మోహన్ లాల్ కీలక పాత్రలో రంథమూలం నవల ఆధారంగా 1000 కోట్ల బడ్జెట్ తో మహాభారతాన్ని తెరకెక్కించనున్నట్టుగా ప్రకటించారు, ఈ సినిమాలో మోహన్ లాల్ భీముడి పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కూడా మహాభారతాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న థగ్ ఆఫ్ హిందుస్తాన్ పనులు పూర్తయిన వెంటనే మహాభారతంలో తొలి భాగాన్ని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. అధ్వైత్ దర్శకత్వంలో తొలి భాగం తెరకెక్కించాలని భావిస్తున్నారట. ఈ ప్రాజెక్ట్ లో ఆమిర్ కృష్ణుడు లేదా కర్ణుడి పాత్రలో నటించే అవకాశం ఉంది. -
మహాభారతం నిజంగా జరిగిందా?
మహాభారతం.. భారతీయ ఇతిహాసాల్లో అత్యంత విలువైనది. ఇది కల్పన అని కొందరు.. కాదు వాస్తవం అని మరికొందరు.. దశాబ్దాలనుంచి వాదోపవాదాలు నడుస్తూనే ఉన్నాయి. మీరట్ : ఉత్తర ప్రదేశ్లోని మీరట్ ప్రాంతం దగ్గర పాండవులు నివసించి లక్షాగృహం ఉందని కొన్నేళ్లుగా వాదనలు ఉన్నాయి. దీనిపై నిజానిజాలు నిగ్గు తేల్చాలని పురాతత్వ శాస్త్రవేత్తలు, స్థానిక చరిత్రకారుల అభ్యర్థనల మేరకు.. ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (భారత పురావస్తు శాఖ పరిశోధనా సంస్థ) తవ్వకాలకు అనుమతులు మంజూరు చేసింది. లక్షాగృహం ఉందని భావిస్తున్న ప్రాంతం.. ఉత్తర ప్రదేశ్లోని భాగ్పట్ జిల్లాలోని బర్నవా ప్రాంతంలో ఉంది. బర్నవా ప్రాంతంపై మాజీ పురాతత్వ శాఖ ఉన్నతాధికారి కేకే శర్మ మాట్లాడుతూ.. ఇక్కడ లక్షాగృహం ఉందనేందుకు ఆధారాలున్నాయని చెప్పారు. మహాభారాతాన్ని మలుపు తిప్పడంలో లక్షాగృహానిది కీలక పాత్ర అని ఆయన చెప్పారు. బర్నావా ప్రాంతాన్నే మహాభారతంలో వరుణవిరాట్ అని పిలుస్తారని చెప్పారు. బర్నవా ప్రాంతంలో తవ్వకాలు జరపాలని ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి ఆదేశాలు అందాయని.. అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాలజీ, పురావస్తు తవ్వకాల శాఖ సంయుక్తంగా పరిశోధనలు చేస్తాయని అధికారులు చెబుతున్నారు. డిసెంబర్ నెల మొదటి వారంలో తవ్వకాలను మొదలు పెడతామని ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (తవ్వకాల విభాగం) డైరెక్టర్ జితేందర్ నాథ్ తెలిపారు. దీనిపై ఇప్పుడే ఎటువంటి ప్రకటన చేయడం సముచితం కాదని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాలజీ డైరెక్టర్ డాక్టర్ ఎస్కే ముంజాల్ తెలిపారు. చండయాన్ ప్రాంతంలో తవ్వకాలు చేస్తున్న సమయంలో ఎరుపురాయితో కూడిన పూసలు, రాగి కిరీటం బయటపడిందని ఆయన చెప్పారు. ఈ కిరిటాన్ని స్థానిక పురావస్తు శాఖ అధికారి అమిత్ రాయ్ కనుగొన్నట్లు ఆయన చెప్పారు. ఈ ప్రాంతంలో బురదతో కూడిన పెద్ద నీటి మడుగు, దాని కింద భారీ సొరంగం ఉన్నాయని అమిత్ రాయ్ చెప్పినట్లు ఆయన తెలిపారు. ఈ సొరంగం ద్వారానే పాండవులు లక్షాగృహం నుంచి తప్పించుకున్నట్లు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. పూర్తి పరిశోధనల అనంతరం మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఎస్కే ముంజాల్ తెలిపారు. -
అర్జునావతారంలో నితీష్.. మోదీపై యుద్ధం
వారణాసి: బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ మహాభారతంలో అర్జునుడిలా దర్శనమిచ్చారు. అది కూడా ప్రధాని నరేంద్రమోదీ నియోజవర్గంలో.. సరిగ్గా వారణాసికి 30 కిలో మీటర్ల దూరంలో.. శ్రీకృష్ణుడిగా శరద్ యాదవ్ రథాన్ని నడుపుతుండగా అర్జునుడిగా తన విల్లమ్ములో నుంచి భాణాన్ని తీస్తున్న పోజులో నితీశ్ కుమార్ కనిపించారు. ఈ మేరకు ఫ్లెక్లీలను ప్రధాని నియోజక వర్గంలో పెట్టడం ఆసక్తికరంగా మారింది. ఈ ఫ్లెక్లీలకు ట్యాగ్ లైన్ గా.. 'ప్రధాని నరేంద్రమోదీపైన మత శక్తులపైన యుద్ధం' అని పెట్టారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో జేడీయూ భారీ ఎత్తున ప్రచారానికి దిగేందుకు తెరలేపింది. బిహార్ లో దెబ్బకొట్టినట్లుగానే ప్రధాని మోదీని ఉత్తరప్రదేశ్లో లౌకికవాదులను ఏకం చేసి దెబ్బకొట్టాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో తొలిసారి ఉత్తరప్రదేశ్ లోని పింద్రా నుంచి తన ప్రస్తానం ప్రారంభించేందుకు జేడీయూ సిద్ధమైన నేపథ్యంలో ఇక్కడ అందరినీ ఆకర్షించేలా పోస్టర్లు వేశారు.. ఫ్లెక్సీలు పెట్టారు. ఈ రోజు ఇక్కడ జరగబేయే సమావేశంలో నితీశ్ పాల్గొంటారు. -
కౌరవుల పేర్లన్నీ మీకు తెలుసా?
-
కౌరవుల పేర్లన్నీ మీకు తెలుసా?
మహాభారతం గురించి విన్నారు కదా.. టీవీలలో కూడా చాలామంది బీఆర్ చోప్రా తీసిన మహాభారతం సీరియల్ కూడా చూసే ఉంటారు. అందులో పాండవుల పేర్లు ఐదూ మీకు తెలుసు కదూ. మరి కౌరవుల పేర్లు తెలుసా? దుర్యోధనుడు, దుశ్శాసనుడు .. వీళ్లిద్దరి పేర్లు చాలామంది చెబుతారు. మహా అయితే మరికొందరు మాత్రం పాండవ పక్షపాతి అయిన వికర్ణుడి పేరు కూడా చెప్పగలరు. కానీ మొత్తం అందరి మంది పేర్లు చెప్పగలరా? పిల్లలే కాదు.. పెద్దవాళ్లలో కూడా నూటికి 99 మందికి ఆ పేర్లు తెలియకపోవచ్చు. అందుకే.. పిల్లలు, పెద్దవాళ్లు అందరికీ విజ్ఞానం పెంచేందుకు కల్చర్ మెషీన్, షిట్జెంజిగిల్స్ అనే గ్రూపు ఒక అద్భుతమైన వీడియోను రూపొందించింది. కరావోకే స్టైలులో కలిసి పాడేలా ఈ కౌరవుల పాటను వారు రూపొందించారు. ఈ పాటను చూస్తే మొత్తం కౌరవులందరి పేర్లూ ఇట్టే తెలిసిపోతాయి. సరదాగా ఈ పాట చూడండి.. మీరు కూడా కౌరవులందరి పేర్లు నేర్చుకోండి మరి!! -
రూ. 100 కోట్ల 'మహా' సీరియల్!
బాలీవుడ్ సినిమాలకు రూ. 100 కోట్లు ఖర్చు చేయడం సాధారణ విషయం. అలాగే హిందీ సినిమాలు రూ. 100 కోట్లు వసూలు సాధిస్తుండడం కూడా మామూలు విషయంగా మారిపోయింది. బుల్లితెర కూడా భారీతనాన్ని ఆపాదించుకుంటోంది. టీవీ సీరియళ్లకు ఆదరణ పెరుగుతుండడంతో భారీ వ్యయంతో వీటిని నిర్మించేందుకు నిర్మాతలు ముందుకు వస్తున్నారు. భారతదేశ టెలివిజన్ చరిత్రలో అత్యంత భారీ వ్యయంతో రూపొందిన మెగా సీరియల్ నేటి (సెప్టెంబర్ 16) రాత్రి నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది. భారతీయులు ఇతిహాసం మహాభారతం ఇప్పుడు ఆధునికత హంగులతో మరోసారి చిన్నితెరపై ప్రేక్షకులను అలరించనుంది. దూరదర్శన్లో రెండు దశాబ్దాల పాటు ప్రసారమయి, వీక్షకుల మన్నలందుకున్న మహాభారత్ సీరియల్ ఇప్పుడు స్టార్ ప్లస్లో సరికొత్తగా రానుంది. స్టార్ ఇండియా రూ. 100 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించింది. స్వస్తిక్ పతాకంపై సిద్ధార్థ కుమార్ తివారి దీన్ని నిర్మించారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 8.30 గంటల నుంచి అరగంటపాటు ఈ సీరియల్ ప్రసారమవుతుంది. 128 ఎపిసోడ్లు ప్రసారం చేయనున్నారు. మనదేశంలో అత్యంత భారీ వ్యయంతో రూపొందించిన సీరియల్గా 'మహాభారత్' నిలిచింది. దీని నిర్మాణానికి రూ. వంద కోట్లు ఖర్చు చేయగా, మార్కెటింగ్ కోసం మరో రూ. 20 కోట్లు కేటాయించారు. యువతను లక్ష్యంగా చేసుకుని ఈ సీరియల్ నిర్మించామని స్టార్ ఇండియా మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిఖిల్ మదహుక్ వెల్లడించారు. యువ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయాలన్న ఉద్దేశంతో గ్రాఫిక్స్ అధిక వ్యయం చేసినట్టు వివరించారు. నేటి యువత అభిరుచికి అనుగుణంగా పాత్రలను మలిచామని చెప్పారు. ప్రస్తుత సమాజంలో మానవ ప్రవర్తనకు సంబంధించిన వాస్తవాలను దీని ద్వారా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశామని చెప్పారు. భారీ వ్యయంతో తెరకెక్కిన మహాభారత్ సీరియల్ను ప్రమోట్ చేసేందుకు స్టార్ ఇండియా వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా 8 నగరాల్లోని షాపింగ్స్ మాల్స్లో మహాభారత్ సీరియల్ మ్యూజియంలు పెట్టింది. సీరియల్లో వివిధ పాత్రధారులు వినియోగించిన ఆభరణాలు, కాస్ట్యూమ్స్, ఆయుధాలు ఇందులో ప్రదర్శనకు ఉంచారు. అలాగే చిన్న పట్టణాలకు సంచార మ్యూజియంల ద్వారా ఈ సీరియల్ విశేషాలు చేరవేయనున్నారు. మహాభారత్ సీరియల్ పాత్రధారులు దేశవ్యాప్తంగా కాలేజీ క్యాంపస్లకు వెళ్లి విద్యార్థులతో ముచ్చటించనున్నారు. మరోవైపు సీరియల్ మధ్యలో ప్రసారం చేసే వాణిజ్య ప్రకటనలకు 10 సెకండ్లకు రూ. 2 లక్షల ధర నిర్ణయించారు. సీరియల్ ప్రారంభమైన తర్వాత ప్రకటనల రేట్లు మరింత పెరిగే అవకాశముందంటున్నారు. ఢిల్లీకి పూజా శర్మ ద్రౌపదిగా పాత్రతో బుల్లి తెరకు పరిచయమవుతోంది. కృష్ణుడిగా సౌరభ్ జైన్, అర్జునుడుగా షహీర్ షేక్ నటించారు. అత్యంత భారీ వ్యయంతో రూపొందిన ఆధునిక మహాభారత్ మెగా సీరియల్ ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.