mallesh
-
టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వ్యక్తి మృతి
టెక్కలి: శ్రీకాకుళం జిల్లా కోట»ొమ్మాళి మండలం నిమ్మాడ పంచాయతీ చిన్నవెంకటాపురంలో టీడీపీ మూకలు అన్యాయంగా ఓ ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. ఈ పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు స్వస్థలం కావడం గమనార్హం. చిన్నవెంకటాపురం పోలింగ్ బూత్లో వైఎస్సార్సీపీ తరఫున తోట మాధవరావు ఏజెంట్గా ఉండడంతో టీడీపీ కార్యకర్తలు కక్ష పెంచుకుని అతని తండ్రి మల్లేష్ పై ఇటీవల దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న ఆయన మృత్యువుతో పోరాడుతూ ఆదివారం ప్రాణాలు విడిచారు. అచ్చెన్నాయుడు, ఆయన సోదరుడు హరివరప్రసాద్ డైరెక్షన్లో ఈ నెల 16న గ్రామ దేవత పండగను ఆసరాగా చేసుకుని మల్లేష్పై దాడి చేశారు. గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు పూతి లక్ష్మణరావు, పూతి భానుచందర్, పూతి కర్రెన్న, పూతి రమణ తదితరులు ఈ దాడికి పాల్పడ్డారు. ఇది అచ్చెన్నాయుడు చేసిన హత్యేనని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆదివారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. సుమారు 40 ఏళ్లుగా నిమ్మాడ పంచాయతీలో శాంతియుతంగా ఎన్నికలు జరగలేదని, ఈ సారీ ఎన్నికల్లో రిగ్గింగ్కు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో అచ్చెన్నాయుడుకు ఓటమి భయం పట్టుకుందని పేర్కొన్నారు. నిమ్మాడ పోలింగ్ కేంద్రంలో వైఎస్సార్సీపీ తరఫున బూత్ ఏజెంట్గా వ్యవహరించిన కింజరాపు అప్పన్నను చంపేస్తామని బెదిరించారని దువ్వాడ ఆరోపించారు. మల్లేష్ మృతికి బాధ్యులైన అచ్చెన్నాయుడు, హరివరప్రసాద్తో పాటు టీడీపీ వర్గీయులను అరెస్టు చేయాలని దువ్వాడ డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉంటామని వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ హామీ ఇచ్చారు. -
‘నా భర్త ఆత్మహత్యాయత్నంపై రాజకీయాలొద్దు’
సాక్షి, అనంతపురం: ఎల్లో మీడియా కుట్ర మరోసారి బట్టబయలైంది. జగనన్న ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నాల్లో.. బాబు అనుకూల మీడియా సంస్థలు దిగజారిపోయి ప్రవర్తిస్తున్నాయి. తాజాగా టీచర్ మల్లేష్ ఆత్మహత్యాయత్నం కేసును ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేశాయి. అయితే ఆ ఆరోపణల్ని బాధిత కుటుంబమే స్వయంగా ఖండించింది. వేతనం రాలేదని.. సీపీఎస్ రద్దు చేయాలన్న డిమాండ్ తో టీచర్ మల్లేష్ ఆత్మహత్యాయత్నం చేసినట్లు ప్రచారం జరిగింది. దీన్ని మల్లేష్ భార్య శివలక్ష్మి సాక్షితో మాట్లాడుతూ ఖండించారు. ‘‘ప్రభుత్వంపై మాకు ఎలాంటి అసంతృప్తిలేదు. జగన్ పాలనలోనే నాకు ఉద్యోగం వచ్చింది. మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే. నా భర్త డిప్రెషన్తో బాధపడుతున్నారు. అందుకే ఆత్మహత్యాయత్నం చేశారు. నా భర్త ఆత్మహత్యాయత్నంపై దయచేసి రాజకీయాలు చేయొద్దు’’ అంటూ ప్రతిపక్ష పార్టీలను కోరారామె. మరోవైపు బావ ఆదినారాయణ కూడా సోషల్ మీడియాలో, యెల్లో మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. సీఎం జగన్ (CM Jagan) మీద ఉన్న పిచ్చి అభిమానమే తన పాలిట మరణ శాసనం అయ్యిందంటూ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడంటూ ఈనాడు, యెల్లో మీడియాలు హైలెట్ చేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మల్లేష్ కుటుంబం ఈ ప్రచారాన్ని ఖండించింది. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్నముష్టూరుకు చెందిన మల్లేశ్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. పందేలతో లక్షలు పొగొట్టుకోవడంతో పాటు కుటుంబ పోషణకు, రుణాలను చెల్లించడానికి చిట్టీలు వేయడంతో పాటు బ్యాంక్ల్లో, యాప్ల్లో రుణాలు తీసుకున్నారు. ఈ రుణ భారాలు భరించలేక ఫోన్ స్విచాఫ్ చేసి ఇంటి నుంచి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు, మిత్రులు ఆయన ఆచూకీ కోసం ప్రయత్నించారు. పెన్నఅహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాల్లో విషం తాగి అపస్మారక స్థితిలో ఉండగా గుర్తించి ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి, తర్వాత అనంతపురం తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. -
వివాహేతర సంబంధమే కారణమా..?
మహబూబ్నగర్: జడ్చర్ల మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన మల్లేష్ గురువారం రాత్రి వ్యవసాయ పొలం వద్ద హత్యకు గురయ్యాడు. ఈ కేసును పోలీసులు చేధించినట్లు తెలిసింది. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య చోటు చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. ఓ మహిళతో పాటు ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్య కేసు దాదాపుగా కొలిక్కి వచ్చిందని, త్వరలోనే నిందితులను కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలిస్తామని సీఐ రమేశ్బాబు తెలిపారు. ఇవి చదవండి: కర్ణిసేన చీఫ్ హత్య కేసు : ఇద్దరు షూటర్లు అరెస్ట్ -
కాల్చిన కొడవలితో దాడి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కొడవలితో భార్యపై భర్త హత్యాయత్నం చేసిన ఘ టన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బుధవారం జరిగింది. కాల్చిన కొడవలితో దాడి చేయడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఒగ్గు నిర్మల(35), మల్లేశ్ దంపతుల మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. హమాలీ పనిచేసే మల్లేశ్.. వచ్చిన డబ్బులతో మద్యం తాగి రోజూ భార్యను కొడుతున్నాడు. బుధవారం ఉదయం బయటకు వెళ్లి ఇంటికొచ్చిన మల్లేశ్.. కొడవలిని కాల్చి పెట్టుకున్నాడు. పిల్లలు పాఠశాలకు వెళ్లగా నిర్మల ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇదే అదనుగా భావించిన మల్లేశ్ కాల్చిన కొడవలితో నిర్మల మెడ వెనుక భాగంలో పొడిచాడు. ఆమె కేకలు వేయడంతో ఇరుగుపొరుగు రావడం చూసి మల్లేశ్ పరారయ్యాడు. కుటుంబ సభ్యులు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స చేసి కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. కొడవలిని కాల్చడంతో శరీరం లోపలి భాగాలకు తీవ్ర గాయాలు అయ్యి ఉండొచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. కొడవలిని మెడ నుంచి తొలగించేందుకు ప్ర యత్నం చేస్తున్నారు. పరిస్థితి విషమంగానే ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. మల్లేశ్.. పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. -
ఆ ఐదుగురినీ విడుదల చేయండి
సాక్షి, హైదరాబాద్, సిరిసిల్లటౌన్: దుబాయి జైల్లో మగ్గుతున్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఐదుగురు తెలంగాణ వాసులను విడుదల చేయాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయబారి అబ్దుల్ నసీర్ అల్శాలిని కోరారు. భారత పర్యటనలో భాగంగా అబ్దుల్ నసీర్ సోమవారం హైదరాబాద్ ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దుబాయ్లో శిక్ష అనుభవిస్తున్న వారి వివరాలతో కూడిన వినతిపత్రాన్ని కేటీఆర్ అందజేశారు. నేపాల్కు చెందిన దిల్ప్రసాద్రాయ్ మృతి కేసులో రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన శివరాత్రి మల్లేశ్, రవి, నాంపల్లి వెంకటేశ్, దండుగుల లక్ష్మణ్, హనుమంతులు ప్రస్తుతం దుబాయ్ జైల్లో శిక్షను అనుభవిస్తున్నారని రాయబారి దృష్టికి తీసుకెళ్లారు. యూఏఈ చట్టాల మేరకు రూ.15 లక్షల పరిహారాన్ని బాధితుని కుటుంబం స్వీకరించేందుకు అంగీకరించిందని, ఈ మేరకు 2013లో తానే స్వయంగా నేపాల్ వెళ్లి బాధితుడి కుటుంబాన్ని కలిసినట్లు తెలిపారు. బాధిత కుటుంబం నుంచి అన్నిరకాల పత్రాలను 2013లోనే దుబాయ్ ప్రభుత్వానికి అందించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. అయితే యూఏఈ కోర్టు వీరి క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించిందని, ఇక దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్ క్షమాభిక్ష పెడితేనే బాధితులకు విముక్తి లభిస్తుందని చెప్పారు. ఈ విషయంలో చొరవచూపాలని కోరారు. హైదరాబాద్ భేష్: యూఏఈ రాయబారి ప్రశంసలు కేటీఆర్తో జరిపిన భేటీలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పట్ల యూఏఈ రాయబారి అబ్దుల్ నసీర్ అల్శాలి ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్లో ఉన్న స్టార్టప్ ఈకో సిస్టం, ఐటీ దాని అనుబంధ రంగాల్లో తెలంగాణ బలం గురించి ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలో వివిధ పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడి అవకాశాలు, తెలంగాణ ప్రభుత్వ పాలసీలను మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా యూఏఈ రాయబారికి వివరించారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని స్టార్టప్ ఈకో సిస్టంతో ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాల్లోని వెంచర్ క్యాపిటలిస్టులు, ఇన్నోవేషన్ ఈకో సిస్టం భాగస్వాములు కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చారని, ఇదే రీతిన యూఏఈలోని వెంచర్ క్యాపిటలిస్టులను టీ హబ్కు పరిచయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన యూఏఈ రాయబారి... తమ దేశంలోని ఔత్సాహిక వెంచర్ క్యాపిటలిస్టులను, హైదరాబాద్ ఈకో సిస్టంలోని స్టార్టప్ సంస్థలను అనుసంధానించేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. -
ఆ తల్లిదండ్రులకు ఇది అంతులేని వేదన!
సాక్షి, పెందుర్తి: ఆరు నెలల క్రితం అనారోగ్యంతో కుమార్తె మృతి చెందింది. ఆ బాధలోంచి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఇంకా తేరుకోలేదు.. చేతికందిన కొడుకును కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ కుమారుడు కూడా తనువు చాలించాడు. ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు. ఇలా ఆరు నెలల వ్యవధిలోనే కుమార్తె, కుమారుడు మృతి చెందడంతో వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. ఇంకెందుకు మేం బతకాలంటూ వారి వేదన అక్కడ ఉన్నవారిని కలచివేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్.రాయవరం దార్లపూడి గ్రామానికి చెందిన గొంతుమూర్తి లోవరాజు, లక్ష్మి దంపతుల కుమారుడు మల్లేష్ (22) పోటీ పరీక్షలకు హాజరవుతున్నాడు. ఈ క్రమంలో నగరంలో జరుగుతున్న ఓ పరీక్ష రాసేందుకు సోమవారం ఉదయం దార్లపూడి నుంచి స్నేహితుడు భీముని ధనరాజుతో కలిసి బైక్పై బయలుదేరాడు. పెందుర్తి కూడలి వద్దకు వచ్చే సరికి వీరి బైక్ను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. మల్లేష్ తీవ్రంగా గాయపడగా, ధనరాజు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. చదవండి: (నిరుద్యోగులను ముంచేసిన మహిళా హోంగార్డు) మల్లేష్ను హుటాహుటిన కేజీహెచ్కు తరలించగా...చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. పెందుర్తి సీఐ కె.అశోక్కుమార్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా వివాహిత అయిన మల్లేష్ సోదరి ఆరునెలల క్రితం తీవ్ర అనారోగ్యంతో మృతి చెందింది. కుమార్తె మరణించిన కొద్ది రోజులకే కుమారుడు కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు లోవరాజు, లక్ష్మి గుండెలవిసేలా రోదిస్తున్నారు. చదవండి: (అద్దెకున్న మహిళే హంతకురాలు) -
రథయాత్ర: తీవ్ర విషాదంలో కుటుంబం
సాక్షి, నిర్మల్: జాతరకు వెళ్లిన ఓ వ్యక్తి విగతజీవిగా మారాడు. రథయాత్రలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన నిర్మల్లో చోటుచేసుకుంది. వివరాలు... అక్కాపూర్కు చెందిన మల్లేష్(45) ముజ్గి మల్లన్న జాతరకు వెళ్ళాడు. కాగా అక్కడి రథయాత్రలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో కిందపడిపోయిన మల్లేష్ తీవ్రగాయాలపాలయ్యాడు. దీంతో వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అందించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తీసుకురాగా, చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో అతడి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అక్కాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తీర్థయాత్ర ఇలా అంతిమయాత్రగా మారుతుందని ఊహించలేదంటూ కుటుంబ సభ్యులు విలపించిన తీరు అందరిచేతా కన్నీళ్లుపెట్టిస్తోంది. మరోవైపు.. ఇదే ప్రమాదంలో గాయపడిన కానిస్టేబుల్స్ కోలుకుంటున్నారని, వారికి ప్రాణాపాయం లేదని పోలీసులు వెల్లడించారు. -
భూతవైద్యం పేరిట బాలింతకు చిత్రహింసలు
జైపూర్ : భూతం ఆవహించిందని, చేతబడికి గురైందన్న నెపంతో ఓ బాలింతను మాంత్రికుడు వైద్యం పేరిట హింస పెట్టిన ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారం గ్రామంలో చోటుచేసుకుంది. ఓ వైపు ప్రేమించి పెళ్లాడిన భర్త వేధింపులు.. మరోవైపు చేతబడులకు గురైందన్న నెపంతో బాలింత అని కూడా చూడకుండా చిత్రహింసలు గురి చేయడం సంచలనం రేపింది. మాంత్రికుడి దెబ్బలకు యువతి స్పృహ కోల్పోవడంతో కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దీంతో మూడు నెలల పసికందు ఆ తల్లికి దూరమైంది. జైపూర్ మండలం కుందారం గ్రామానికి చెందిన సెగ్యం మల్లేశ్, కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాక గ్రామానికి చెందిన రజిత గతేడాది ప్రేమ వివాహం చేసుకున్నారు. రజిత గర్భిణి అయినప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆమెకు పలు ప్రాంతాల్లో వైద్యం చేయించారు. ఆ తర్వాత మూడు నెలల క్రితం రజిత ఓ పాపకు జన్మనిచ్చింది. అప్పటినుంచి ఆమె కొంత వింతగా ప్రవర్తిస్తోందని సమాచారం. ఆమె ప్రవర్తనతో విసిగిపోయిన మల్లేశ్ కుటుంబసభ్యులు వేధించడం ప్రారంభించారు. ఈ విషయం రజిత బాబాయ్ జమ్మికుంట మండలం శ్యాంపేట్కు చెందిన రవీందర్కు తెలియడంతో ఆయన దొంగల శ్యామ్ అనే భూత వైద్యుడిని ఆశ్రయించాడు. సదరు భూత వైద్యుడు మల్లేశ్ ఇంటికొచ్చి రజిత చేతబడులకు గురైందని, ఆమెతో పూజ చేయించి నయం చేస్తానని నమ్మబలికాడు. బాలింత అని కూడా చూడకుండా తల వెంట్రుకలు పట్టుకుని ఇష్టారీతిన కొట్టడంతో రజిత సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో కంగుతిన్న కుటుంబసభ్యులు ఆమెను కరీంనగర్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఇప్పుడామె కోమాలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై జైపూర్ ఏసీపీ భూపతి నరేందర్ ఆదేశంతో ఓ పోలీసు బృందం మల్లేశ్ ఇంటికి వెళ్లి విచారణ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
దుబాయ్
‘‘స్వర్ణా... అంతా బాగేనా?’’ మల్లేష్.‘బాగే మల్లేషన్నా.. నేనే నీకు ఫోన్ చేద్దామనుకుంటున్నా.. ఈలోపు నువ్వే..’’ ‘‘షాలినీ కలుస్తుందా స్వర్ణా?’’ ఆమె మాటను పూర్తికానివ్వని మల్లేష్ ఉత్సుకత..‘‘ఫోన్?’’ ‘‘విల్సన్తో మాట్లాడకపోయినవా?’’ మల్లేష్.‘‘ఫోన్ చేశా. చాలా రాష్గా మాట్లాడాడు షాలినీ గురించి’’ అని ఓ క్షణం ఆగి.. ‘‘ఏం కథ పెట్టింది నీ ఫ్రెండ్? అబార్షన్ ఇల్లీగల్ అని తెలియదా? పోగొట్టడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఎరక్కపోయి ఇరుకున్నా. ఇలాంటిదని తెలిస్తే.. వీసానే ఇప్పించకపోదును అంటూ చాలా అసహ్యంగా వాగాడు! షాలినీని కలవడానికి, మాట్లాడ్డానికి చాలా ట్రై చేశా. ప్చ్..! ఇప్పుడైతే ఫోన్కూడా పనిచేయట్లేనట్టుంది. ఎక్కడుందో.. ఏమో’’ బాధగా స్వర్ణ.‘‘షాలిని వాళ్ల అమ్మ నంబర్ ఏమన్నా ఉందా? ఆమెతో మాట్లాడితే విషయం తెలుస్తుంది కదా?’’ అడిగాడు.‘‘ఉన్నట్టుంది.. ఆమెతో మాట్లాడి..నీకు కాల్ చేస్తా..’’ అని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేసింది స్వర్ణ. షర్ట్ పాకెట్లో ఫోన్ పడేసుకుంటూ గతంలోకి జారుకున్నాడు మల్లేష్. షాలిని ప్రెగ్నెంట్ అని తెల్వంగానే ఇండియా వచ్చేసిండు. అంతకుముందే.. మస్తు సార్ల సేuŠ‡ని చుట్టీ అడిగిండు. ఇయ్యలే. కరెక్ట్గా శాలినీ కడుపుతో ఉన్నా అని చెప్పుడు.. చుట్టీ దొరుకుడు ఒక్కసారే అయినయ్. ‘‘మా అమ్మకు బాగాలేదంట షాలినీ..! సోనాపూర్ క్యాంప్లో ఉండే మా ఊరాయన మొన్ననే ఇండియా నుంచి అచ్చిండు. మా అమ్మ మంచలకెంచి అస్సలు లేస్తలేదని చెప్పిండు. నేను బోవాలే. పదిహేను రోజులల్ల అస్తా మల్లా!’’ తెల్లవారి ప్రయాణం అనగా ముందు రోజు రాత్రి ఎప్పటిలెక్కనే గ్యారేజ్లో కల్సుకున్నడు షాలినీని. గుడ్ల నిండా నీళ్లు దీసుకుంది తప్ప ఏం మాట్లాడ్లే ఆ పిల్ల. దగ్గరకు దీసుకుంటూ చెప్పిండు ‘‘ఏం ఫికర్వెట్టుకోకు. తొందరగనే అస్తా..ఒకవేళ రాకపోతే మా అమ్మ ప్రాణం కిందమీదైంది అనుకో. ఫోన్ చేస్తా. ఏజెంట్తో మట్లాడి నువ్వే ఇండియాకు వచ్చేటట్టు చేస్తా. సరేనా..’’అని. అయినా ఆమె ఏం మాట్లాడ్లే. ఒక్కసారి తన కండ్లల్లకు జూసింది. గద్వ వట్టుకుని మళ్లా అన్నడు. ‘‘సరేనా’’ అని. కౌగిలి ఇడిపించుకుని ఎన్కకు తిరిగి చూడకుండా పోయింది. అబద్ధం చెప్తుండని ఆ పిల్లకు అర్థమైందా? ప్రెగ్నెంట్ అని తెల్వంగనే పారిపోతున్నడు అనుకుందా? పారిపోవుడు.. భయపడుడు నివద్దే కదా! ఊర్ల పెండ్లాం ఉందని నిజం చెప్పలే. ఇద్దరు పిల్లల తండ్రి అనీ చెప్పలే. లేని అమ్మకు రోగం అంటగట్టిండు. ఏం జేస్తడు? అప్పటికే తుట్టి యెవుసంతో పుట్టెడు అప్పులు. పెండ్లం మెడల పుస్తె అమ్మి మరీ దుబాయ్వాయే. ఎప్పుడో చిన్నప్పుడు గమ్మత్గా నేర్సుకున్న కార్ డ్రైవింగ్ అక్కరకొచ్చింది. తాను డ్రైవర్గా చేసే సేuŠ‡ ఇంట్లనే షాలిని పని మనిషి. తనను జూసి ఆ పిల్ల తెలుగు మాట్లాడేసరికి ప్రాణం లెషొచ్చిన్నట్టయింది. అట్ల అయిన దోస్తాని దొంగతనంగా రొట్టెలు, కూరలు తెచ్చిచ్చేదాకా వెరిగింది. ప్రేమిస్తున్నా అని ఇంకా దగ్గరైండు. ఇల్లు, పిల్లలు ఎవ్వరు గుర్తురాలే. మూడ్నెల్లకు ఒకసారి ఇంటికి పైసలు పంపిస్తున్నప్పుడు ఇంటోల్లకు ఒక కాల్ చేస్తుండే గంతే. ఆ పిల్ల గర్భవతి అని తెల్సినంకనే ఇల్లు, పెండ్లాం, పిల్లలు గుర్తొచ్చుడు మొదలువెట్టిండ్రు. తప్పిచ్చుకొని ఇండియాకొచ్చేషిండు. టపాటపా వేప చెట్టు ఆకులు రాలుతూండడంతో వాస్తవంలోకి వచ్చాడు మల్లేష్. చుట్టూ చూశాడు. ఎండ మండుతోంది. తను కూర్చున్న చెట్టు తప్ప ఇంకే చెట్టూ ఊగట్లేదు. ఉక్కపోత ఉగ్గబట్టి రవ్వంత గాలికీ చోటివ్వట్లేదు. ఆ పెద్ద వేప చెట్టు మాత్రం వేర్లు పెకలి నేల కూలుతుందా అన్నంతగా ఊగుతోంది.. వింతగా! దడ పట్టుకుంది మల్లేష్కి. లేచి నిలబడ్డాడు.అతని ముందుకు ఒక్కసారిగా సుడి గాలి.. మనిషి ఆకారంలో! గిర్రున తిరుగి మాయమైంది. రెండు మొహాలు.. కనిపించాయి.. మల్లేష్కి.. అంత వేగంలో కూడా ఒక మొహాన్ని గుర్తుపట్టగలిగాడు.. శాలిని! మరి ఇంకో మొహం..? అపరిచితమైందీ కాదు.. సుపరిచితం అంతకన్నా కాదు. ఎవరు ఆమె.. ఎక్కడ చూశాడు? చూశాడా? లేక భ్రమా?మొహం పాలిపోయింది.. ఎండకు గొంతు తడారి పెదవులు పొడిబారాయి!దాహం.. దాహం.. మంచి నీళ్లు.. నోరు ఎండిపోతోంది. చేనును తడుపుతున్న బోర్ పంప్ దగ్గరికి వెళ్లాడు. నీటి ధారకు దోసిలి పట్టాడు. ఠక్కున నీళ్లు ఆగిపోయాయి. బోర్ మాత్రం నడుస్తూనే ఉంది. ‘‘ఎడారి దేశంలో ఉండొచ్చావ్.. దప్పిక అలవాటవలేదా?’’ వినిపించింది వెనకనుంచి.షాక్ అయ్యి వెనక్కి తిరిగి చూశాడు. ఓ స్త్రీ.. ఇందాకటి ఇంకో మొహం.నవ్వుతోంది.. తనను చూసి. నల్ల చీర.. చెవులదాకా వెడల్పు.. మెడ మీద పడేంత పొడవు ఉన్న దట్టమైన తెల్లటి జుట్టు ముడి.. రూపాయి బిళ్లంతా నల్లటి బొట్టుతో ఉంది ఆ స్త్రీ. జలజలమని నీటి ప్రవాహం పంప్ వెంట. ఆ చప్పుడికి అటు వైపు చూశాడు. ‘‘పో..’’ గద్దించింది ఆమె.తన ప్రమేయం లేకుండానే ఎవరో వెనక నుంచి తోసినట్టు.. వచ్చి పంప్ దగ్గర పడ్డాడు. దోసిలి పట్టాడు. మళ్లీ ఆగిపోయింది. బిత్తరపోయి వెనక్కి తిరిగాడు. ఆవిడ లేదు. క్షణం ఆలస్యం చేయకుండా ఇంటికి పరుగులు దీశాడు. పది అడుగులు వేస్తే వచ్చే ఇల్లు.. ఎంత పరిగెత్తినా రావట్లేదు. మధ్యాహ్నం మొదలుపెడితేపొద్దుగుంకింది.. చూస్తుండగానే చీకట్లూ అలుముకున్నాయి. అల్లంత దూరంలోనే కనపడుతోంది ఇల్లు.. అయినా చేరుకోలేకపోతున్నాడు. మొసతో వగరుస్తున్నాడు. ఇంట్లో లైట్వెలుగుతోంది. భార్య చేటలో బియ్యం చెరుగుతోంది. పిల్లలిద్దరూ ఆడుకుంటున్నారు. నీడలుగా కనపడుతున్నారు. చేయి చాస్తే అందుకునేంత చేరువగా ఉన్నారు. ఆయసంతో అడుగులు వేయలేక చేయి చాచాడు.. ఎవరినీ అందుకోలేకపోతున్నాడు. గుండెలో నొప్పి.. ఓ చేత్తో గుండెను పట్టుకొనే ఇంకో చేత్తో తన వాళ్లను అందుకోవాలనే ఆరాటంతో పరిగెడ్తున్నాడు.. అర్ధరాత్రి అయింది.. అయినా ఇల్లు చేరలేదు మల్లేష్. ఆగిపోయాడు.. తన వల్ల కాదు.. మాట్లాడలేనంత ఎండిపోయి ఉంది నోరు.. దాహం.. దాహం.. మాట గొంతులో ఉంది.. బయటకు రావట్లేదు..కళ్లు మూతలు పడ్తున్నాయి..ఎదరుగా ఆమె.. ‘‘చేరుకున్నావా నీ వాళ్లను? వీళ్ల కోసమే కదా.. షాలినీని ఒంటరిగా వదిలి వచ్చేశావ్? పిరికితనంతో బిడ్డను పుట్టకుండానే చంపేశావ్.. వెళ్లు... నీ వాళ్ల దగ్గరకు వెళ్లు.. పో... ఊ.. ’’ గర్జించింది ఆ స్వరం. మళ్లీ అప్రయత్నంగానే పరుగు మొదలుపెట్టాడు మల్లేష్. జేబులో ఉన్న ఆయన ఫోన్ మోగుతోంది.. చాలా సేపటి నుంచి.. ఛాతి దగ్గర ఎడమవైపు కలుక్కు మంటూంటే.. చేత్తో పట్టుకున్నాడు. ఆ స్థానంలోనే ఉన్న జేబులోని ఫోన్ ప్రెస్ అయి స్పీకర్తో సహా ఫోన్ కాల్ ఆన్ అయింది..‘‘మల్లేషన్నా.. షాలినీ మీద బెంగతో వాళ్లమ్మ చనిపోయిందట అన్నా.. ’’ కుప్పకూలిపోయాడు మల్లేష్. - సరస్వతి రమ -
ఈటలపై కారు మాజీ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో మంత్రి ఈటల రాజేందర్పై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆయన కారు మాజీ డ్రైవర్ మేకల మల్లేశ్యాదవ్ ప్రకటించారు. శుక్రవారమిక్కడ ప్రెస్క్లబ్లో మల్లేశ్ మాట్లాడుతూ.. ఈటల వద్ద డ్రైవర్గా పనిచేస్తూ ఆయనతో కలసి ఉద్యమంలో పాల్గొన్నానని చెప్పారు. అసెంబ్లీలో జరిగిన ఘటనలో 45 రోజులు జైలు శిక్ష అనుభవించినట్లు గుర్తుచేశారు. జైలు నుంచి విడుదలయ్యాక తనను సన్మానించి ఆర్థిక సాయం కింద రూ.30లక్షలు దాతలు ఇచ్చారని, వాటిని ఈటల తీసుకున్నట్లు ఆరోపించారు. జైలుకు వెళ్లడంతో ఉద్యోగం పోయిందని, తర్వాత కూలీ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లు తెలిపారు. ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలన్నారు. ఈటలతోపాటు, అందరూ తన కు అన్యాయం చేశారని, తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. -
పరిమిత పొత్తయితే ఇరుపార్టీలకు మంచిది
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలుగుదేశంతో సయోధ్య పార్టీకి లాభం కలుగుతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ స్పష్టం చేశారు. ఈ పొత్తును పరిమిత స్థాయిలో ఉండాలని సూచించారు. శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ డీసీసీ అధ్యక్షులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎన్నికల సన్నద్ధతను సమీక్షించిన రాహుల్.. మహాకూటమి, టీడీపీతో పొత్తు వ్యవహారంపై ఆరాతీశారు. మనం బలంగా ఉన్న సెగ్మెంట్లను వారికిస్తే పార్టీకి నష్టం వాటిల్లుతుందని, కేడర్లో కూడా అసంతృప్తి పెల్లుబికే ఆస్కారముందని మల్లేష్ రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. 2014 ఎన్నికల్లో టీడీపీ ఏడు చోట్ల గెలిచిందని, అందులో ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారారని గుర్తుచేశారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని పార్టీకి కంకణబద్దులైన వారికే టికెట్లను కేటాయించే అంశంపై తెలుగుదేశం అధిష్టానంతో చర్చించాలని కోరారు. టీడీపీకి ముందున్న బలం ఇప్పుడు లేదని, రెండు స్థానాలు కేటాయిస్తే సరిపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
రక్త సంబంధీకుడు!.. 95 సార్లు రక్తదానం
బోడుప్పల్ : ప్రాణాపాయంలో ఉన్న వారికి ఆయనో ప్రాణదాత. అత్యవసర పరిస్థితుల్లో రక్తం కావాల్సివారికి రక్తదాతగా పేరు పొందారు బోడుప్పల్కు చెందిన మరాఠి మల్లేష్. ఆయన 44 ఏళ్ల వయసులో సైతం రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రక్తం అవసరముందని ఎవరైనా ఫోన్ చేస్తే రెక్కలు కట్టుకుని మరీ అక్కడ వాలి రక్తదానం చేయడమే ఆయనకు తెలిసింది. ఇప్పటివరకు 95సార్లు రక్తదానం చేసి పలువురికి ప్రాణదాతగా నిలిచారు. ఇవీ సంఘటనలు.. నల్గొండ జిల్లా అడ్డగూడూరు మండలానికి చెందిన మరాఠి మల్లేష్ బ్లడ్ గ్రూప్ ఏ+పాజిటివ్. బోడుప్పల్లో స్థిరపడ్డారు. ఈ క్రమంలో నల్లగొండ జిల్లా సీతారాంపురానికి చెందిన జెట్ట అశ్విని(10)కి గుండెకు రంధ్రం పడింది. ఆమెకు నగరంలోని గాంధీ ఆస్పత్రిలో ఆపరేషన్ చేసేందుకు డాక్టర్లు నిర్ణయించారు. బాలికకు కావాల్సిన రక్తం గ్రూపు అందుబాటులో లేదు. దీంతో విషయం తెలుసుకున్న మల్లేష్ ఆస్పత్రికి వెళ్లి రక్త దానం చేశారు. దీంతో ఆ బాలిక ప్రాణం పోసుకుంది. అలాగే.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ కుమారుడు రాము(12) రక్త హీనతతో బాధపడుతుండగా.. తల్లిదండ్రులు నాంపల్లిలోని ఓ హాస్పిటల్ చేర్పించారు. సకాలంలో రక్తం దొరకక ఇబ్బందిపడుతున్నారు. దినపత్రికలో ప్రకటనను చూసి హాస్పిటల్కు వెళ్లి రక్త దానం చేసి బాబుకు ప్రాణదానం చేశారు మల్లేష్. మరో సంఘటనలో.. బోడుప్పల్కు చెందిన జోగు యాదమ్మ (50) రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో రక్తం చాలా వరకు పోయింది. ఆమెను చికిత్స నిమిత్తం ఉప్పల్లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చేర్పించారు. బ్లడ్ లేక డాక్టర్లు ఆపరేషన్ చేయడం లేదని స్నేహితుల ద్వారా తెలుసుకున్న మల్లేష్ ఆమెకు రక్తదానం చేశారు. అలాగే.. పఠాన్ చెరువు రాంచంద్రాపురానికి బాలుడు బండ శ్రీకర్ (3), బోడుప్పల్కు చెందిన వేముల సంతోష్ (22)లకు కాకుండా మరెందరికో రక్తదానం చేసి ప్రాణదాతగా మారారు. -
సీఎం క్యాంపు ఆఫీసు వద్ద కలకలం
సికింద్రాబాద్: పంజాగుట్టలోని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద మంగళవారం ఒక రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. గద్వాల జోగులాంబ ప్రాంతానికి చెందిన మల్లేష్ అనే రైతు ఐదు సార్లు బోరు వేసినా నీళ్లు పడకపోవడంతో రెండు లక్షలకు పైగా అప్పుల్లో కూరుకుపోయాడు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న మల్లేష్ ముఖ్యమంత్రిని కలవాలని మంగళవారం ఉదయం సీఎం క్యాంపు కార్యాలయం వద్దకు వచ్చాడు. అక్కడున్న పోలీసులు రైతును అడ్డుకున్నారు. దీంతొ ఆవేదన చెందిన రైతు తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. గమనించిన పోలీసులు వెంటనే రైతును గాంధీ ఆస్పత్రికి తచరలించారు. ప్రస్తుతం మల్లేష్ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. -
కళారంగ కనకం మల్లేష్..
- 22 ఏళ్లుగా కళాప్రదర్శనలు - పతకాలు, ప్రశంసాపత్రాలే ఆస్తులు - అందని గుర్తింపు.. కరువైన ప్రొత్సాహం చిట్యాల(భూపాలపల్లి): పేదరికం వెంటాడుతున్నా.. పరిస్థితులు వెక్కిరిస్తున్నా.. పోత్సహం కరువైనా..పట్టువిడవకుండా గత 22 ఏళ్లుగా కళామాతల్లిని నమ్ముకుని జీవిస్తున్నాడు ఆ వ్యక్తి. గ్రామీణ ప్రాంతాలలో కనుమరుగవుతున్న కళారంగానికి జీవం పోస్తూ..ఎన్నో నాటకాలు ప్రదర్శించి ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకుంటున్నాడు భూపాలపల్లి జల్లా చిట్యాల మండలంలోని నైన్పాక గ్రామానికి చెందిన మోతె మల్లేష్. నిరుపేద బుడిగజంగం కులంలో పుట్టిన మల్లేష్ చిన్నప్పటి నుంచి నాటికల పట్ల మక్కువ పెంచుకుని జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చాడు. ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమంలో కూడా పలు జిల్లాలో ధూంధాం సభలలో పాల్గొని పాటలు, మిమిక్రీ, ఏకపాత్రాభినేయంతో ప్రేక్షకులను ఊర్రూతలూగించాడు. రాజు,రాణిపాత్రలకు కేరాఫ్ మల్లేష్.. నాటకాలలో రాజు, రాణి పాత్రలు నటించడంలో మల్లేష్కు ఎవరూ సాటి రారు. పాత్రలో లీనమై రక్తికట్టిస్తాడు. రామాయణం, సత్యహరిచ్చంద్ర, మార్కండేయ, వాలీసుగ్రీవుల వధ, శ్రీకృష్ణార్జునుల యుద్ధం, పాండవుల ఆరణ్య వాసం, సారంగధర, మాయల ఫకీరు లాంటి నాటకాలు ప్రదర్శించి ప్రజలను ఆకట్టుకుంటున్నాడు. అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో రాణించి ప్రముఖుల చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసా పత్రాలను అందుకున్నాడు. కరువైన ప్రోత్సాహం కళారంగమే ప్రాణంగా భావిస్తున్న మల్లేష్కు ప్రభుత్వం, అధికారుల ప్రోత్సాహం కరువు అవుతోంది. దీంతో కుటుంబపోషణ భారమై ఇటు కళాప్రదర్శనలు నిర్వహిస్తూ సమయం దొరికినప్పుడల్లా గ్రామంలోనే ఆర్ఎంపీ వైద్యుడిగా సేవలందిస్తున్నాడు. కాగా, ప్రభుత్వాస్పత్రులలో మెరుగైన వైద్యం అందడంతో రోగులు తమ వద్దకు రావడం లేదని, దీంతో కుటుంబ పోషణ భారమైందని మల్లేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 22 ఏళ్లుగా కళాకారుడిగా రాణిస్తున్న తనను రాష్ట్ర ప్రభుత్వం ఆదరించి సాంస్కృతిక సారథిలో ఉద్యోగ అవకాశం కల్పించాలని సీఎం కేసీఆర్, స్పీకర్ మధుసూదనాచారిలను వేడుకుంటున్నాడు. -
మంత్రాల నెపంతో దాడి: భార్యాభర్తలు మృతి
సిద్దిపేట: దుబ్బాకలో మంత్రాల నెపంతో దాడి.. ఘటనలో గాయపడిన భార్యాభర్తలు శుక్రవారం మృతి చెందారు. బంధువులు, స్థానికులు స్తంభానికి కట్టేసి కిరోసిన్ పోసి నిప్పు పెట్టడంతో సుదర్శన్, ఆయన భార్య రాజేశ్వరి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. అనంతరం వీరిని గాంధీ అసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. మంత్రాలు చేస్తున్నారనే నెపంతో గురువారం సుదర్శన్ సోదరులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. సుదర్శన్కు సోదరులు మల్లేష్, శ్రీనివాస్లతో గత కొంత కాలంగా ఆస్తితగాదాలు ఉన్నాయని తెలుస్తోంది. వారు స్థానికులను రెచ్చగొట్టి సుదర్శన్పై దాడి చేశారని సమాచారం. నిందితులు మల్లేష్, శ్రీనివాస్లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చదవండి: దంపతుల సజీవ దహనం -
తండ్రి అదృశ్యంపై ఫిర్యాదు
చెన్నేకొత్తపల్లి (రాప్తాడు) : మూర్ఛవ్యాధితో బాధపడుతున్న తన తండ్రి మల్లేష్ ఇంటిలో ఎవరికీ చెప్పకుండా ఎటో వెళ్లిపోయాడని చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లికి చెందిన రాజు మంగళవారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. జనవరి 29 నుంచి కనిపించడం లేదని, ఎన్ని చోట్ల వెతికినా జాడ కానరాలేదని పేర్కొన్నాడు. ఆచూకీ తెలిసిన వారు 96181 50227 నంబరుకు లేదా చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని కోరాడు. -
మూసీ కాలువలో పడి వ్యక్తి గల్లంతు
మూసీ కాలువలో పడి ఓ వ్యక్తి కొట్టుకుపోయిన సంఘటన నగరంలోని అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న మల్లేష్(40) మూత్ర విసర్జన కోసం వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి గల్లంతయ్యాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసుల సాయంతో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
అనుమానంతో భార్యను గొంతునులిమి చంపిన భర్త
భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నదన్న అనుమానంతో ఓ భర్త, భార్యను టవల్తో గొంతు నులిమి హత్య చేశారు. హత్యను మధ్యాహ్నం జరిగిన గొడవ కారణంగా దెబ్బలు తాళలేక మృతి చెందిందంటూ కట్టు కథ అల్లాడు. అనుమానంతో పోలీసులు గట్టిగా విచారించే సరికి అసలు విషయం తెలిపాడు. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా గండెడ్ మండలం జిన్నారం గ్రామానికి చెందిన కె.మల్లేష్(32)కు అదే ప్రాంతానికి చెందిన కె.వెంకటమ్మ(28)కి ఆరు సంవత్సరాల క్రితం వివాహం అయింది. వీరికి శ్రీధర్(5), శ్రీదేవి(3) సంతానం. బ్రతుకుదెరువు కోసం 8 నెలల క్రితం బండ్లగూడ సన్సీటీ ప్రాంతానికి వలస వచ్చారు. స్థానికంగా నిర్మిస్తున్న ఓ అపార్ట్మెంట్లో వెంకటమ్మ వాచ్మెన్గా పని చేస్తూ అందులోనే ఈ కుటుంబం అంతా ఉంటుంది. మల్లేష్ కూలి పని చేస్తున్నాడు. తాగుడుకు బానిసైన మల్లేష్ ప్రతి రోజు తాగి వస్తూ భార్య వెంకటమ్మకు ఇతరులతో అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ గొడవకు దిగుతున్నాడు. ఇదిలా ఉండగా వీరు ఉంటున్న నిర్మాణంలో పని కోసం వచ్చిన ఇద్దరు సెంట్రింగ్ కార్మికులు కరెంటు విషయమై ఆమెతో గొడవపడ్డారు. ఆ సమయంలో వెంకటమ్మ కరెంట్ కుక్కర్లో అన్నం వండుతున్నానని అయిన అనంతరం ప్లగ్ పెడతానని తెలిపింది. ఇదే విషయమై సెంట్రింగ్ కార్మికుడు, వెంకటమ్మకు మధ్య మాటల యుధ్దం జరిగింది. ఇదే సమయంలో సెంట్రింగ్ కార్మికుడు వెంకటమ్మపై చేయి చేసుకున్నాడు. రాత్రి 7 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చిన భర్త మల్లేష్కు వెంకటమ్మ గొడవ విషయం తెలపడంతో మల్లేష్ సెంట్రింగ్ కార్మికులతో గొడవ పడ్డాడు. సెంట్రింగ్ కార్మికులు ఇద్దరు మల్లేష్ను కొడుతుండడంతో అడ్డు వచ్చిన వెంకటమ్మను సైతం కొట్ట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రాత్రి భార్య, భర్తల ఇరువురి మధ్య ఇదే విషయమై గొడవ జరిగింది. అనంతరం పిల్లలకు అన్నం తినిపించి వెంకటమ్మ నిద్రపోయింది. మద్యం మత్తులో ఉన్న మల్లేష్ భార్యపై అనుమానంతో పాటు కోపం ఉండడంతో టవల్తో వెంకటమ్మ మెడకు ఉపిరి బిగించి హత్య చేశాడు. ఉదయం ఏమీ తెలియనట్లు గోలగోల చేశాడు. శనివారం రాత్రి గోడవ జరిగిన విషయం, దాడి విషయం స్థానికులు చూడడంతో నిజమే అని నమ్మి విషయాన్ని రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి భర్తతో పాటు పిల్లలను, స్థానికులను విచారించారు. సెంట్రింగ్ కార్మికులను స్టేషన్కు తీసుకువెళ్ళి విచారించారు. విచారణలో తరచూ గొడవ విషయమై వారు చెప్పడంతో భర్తపై అనుమానంతో స్టేషన్కు పిలిచి విచారించగా అసలు విషయం తెలిపాడు. భార్యకు అక్రమ సంబంధాలు ఉన్నాయని దాని విషయమై రోజూ గొడవ జరిగేదని, ఎన్నిసార్లు చెప్పినా వినేది కాదని, అనుమానంతో హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు భర్తను అదుపులోకి తీసుకున్నారు. -
బాలికపై గ్యాంగ్రేప్.. వీడియో షూట్!
ఆసిఫాబాద్: కామంతో కళ్లు మూసుకుపోయిన ముగ్గురు యువకులు ఓ బాలికను చెరబట్టారు. లైంగికదాడికి పాల్పడి సెల్ఫోన్లో చిత్రీకరించి.. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. ఈ వీడియో రెండ్రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. శనివారం ఆదిలాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలివీ.. కాగజ్నగర్కు చెందిన ఆటోడ్రైవర్ మల్లేశ్ తిర్యాణి మండలం టేకం లొద్దికి చెందిన బాలికతో పరిచయం పెంచుకున్నాడు. మూడు నెలల క్రితం మల్లేశ్ తన మిత్రుడితో కలిసి ఆసిఫాబాద్ వచ్చాడు. అదే సమయంలో ఆసిఫాబాద్లో ఉన్న బాలికకు ఫోన్ చేయడంతో బస్టాండ్ వద్ద కలుసుకున్నారు. అక్కడి నుంచి ఆమెను చిన్నరాజూర రోడ్కు తీసుకవెళ్లారు. వీరిని గమనించిన ఆసిఫాబాద్కు చెందిన మాచెర్ల రాజు, రౌతు రంజిత్, సయ్యద్ మతీన్ అక్కడికి వచ్చారు. ఆ ముగ్గురూ కలసి మల్లేశ్ను, అతడి స్నేహితుడు బాలికను బెదిరించి సెల్ఫోన్లు లాక్కున్నారు. అనంతరం బాలికను పక్కకు తీసుకెళ్లి రాజు(27), రంజిత్(25), మతీన్(23)లు వరుసగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనను వీడియో తీశారు. విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించి వదిలిపెట్టారు. రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఈ వీడియో హల్చల్ కావడంతో బాలిక తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సతీశ్కుమార్ తెలిపారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, సామూహిక అత్యాచారం, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. -
నిలదీసిందని నిప్పు పెట్టారు...
కొడుకును ఎందుకు కొట్టారని అడిగినందుకు.. ఇంటిపై దాడి, మహిళపై పెట్రోల్ పోసి నిప్పు తీవ్రగాయాలతో చికిత్సపొందుతున్న బాధితురాలు ఎనిమిది మంది రిమాండ్.. పరారీలో ఇద్దరు అడ్డగుట్ట: తన కొడుకును ఎందుకు కొట్టావని నిలదీసిన పాపానికి మహిళపై ఓ వ్యక్తి కక్షగట్టాడు. తన కుటుంబసభ్యులతో ఆమె ఇంటిపై దాడి చేశాడు. అందరినీ చితకబాదాడు. అడ్డువెళ్లిన ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు ఆసుపత్రిలో చికిత్సపొందుతోంది. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటన తుకారాంగేట్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. సీఐ లక్ష్మీనారాయణ కథనం ప్రకారం...అడ్డగుట్ట వడ్డెరబస్తీకి చెందిన మల్లేష్ ఆదివారం తన వీధిలో నుంచి కారు తీస్తుండగా అదే ప్రాంతానికి చెందిన వేణు(11) అనే బాలుడు అడ్డంగా వచ్చాడు. ఆగ్రహానికి గురైన మల్లేష్ కారుదిగి ఆ బాలుడ్ని కొట్టాడు. ఇది గమనించిన శ్రీకాంత్ అనే యువకుడు ఎందుకుకొడుతున్నావని ప్రశ్నించడంతో మల్లేష్ అతడిని కూడా కొట్టాడు. దీంతో శ్రీకాంత్ తల్లి చంద్రకళ (40)(గాయపడిన మహిళ) వచ్చి ఎందుకు నా కొడుకును కొడుతున్నావని అడిగింది. దీంతో మల్లేష్-చంద్రకళల మధ్య వాగ్వాదం జరిగింది. బస్తీ నాయకులు వచ్చి ఉదయం మాట్లాడుదామని చెప్పి గొడవను అదుపు చేశారు. ఉదయాన్నే దారుణం... తనతో గొడవపడిన చంద్రకళపై కక్షగట్టిన మల్లేష్ సోమవారం ఉదయాన్నే తన కుటుంబసభ్యులతో కలిసి ఆమె ఇంటిపై దాడి చేశాడు. చంద్రకళ కుటుంబసభ్యులను విచక్షణారహితంగా కొట్టారు. తన పిల్లలను కాపాడుకొనేందుకు అడ్డువెళ్లినచంద్రకళపై మల్లేష్ మేనల్లుడు బంటీ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం హాహాకారాలతో నిండిపోయింది. సమాచారం అందుకున్న తుకారాంగేట్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లారు. గొడవపడుతున్న వారిని చెదరగొట్టారు. కాలినగాయాలతో పడివున్న చంద్రకళను గాంధీ ఆస్పత్రికి తరలించారు. 30 శాతం కాలిన గాయాలతో చంద్రకళ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ గొడవ కారణమైన మల్లేష్(50), శివకుమార్, పొట్టికుమార్, శివ, సాయికిరణ్, బంటి, వెంకటేష్, కేతమ్మ, శంకరమ్మ, సాలమ్మ (మొత్తం 10 మంది)పై పోలీసులు 147, 148, 149 ఐపీసీ, 307 కేసులు నమోదు చేశామని సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు. అయితే శంకరమ్మ, సాలమ్మలు పరారీలో ఉన్నారని, మిగిలిన 8 మంది నిందితులను రిమాండ్కు తరలిస్తున్నామని చెప్పారు. -
మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటిన వ్యక్తి అరెస్ట్
నగరంలోని తుకారంగేటు పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్తీలో సోమవారం ఉదయం చిన్న గొడవ జరగడంతో ఆగ్రహించిన మల్లేష్ అనే వ్యక్తి చంద్రకళ అనే మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు ప్రయత్నించి మంటలను ఆర్పారు. అప్పటికే ఆమె శరీరం చాలావరకూ కాలిపోయింది. వెంటనే ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మల్లేష్ను అదుపులోకి తీసుకున్నారు. చంద్రకళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
రూ.500 కోసం గొడవ..జీవితకాలం శిక్ష
-రూ. 2000 జరిమానా.. -వికారాబాద్ కోర్టులో వెలువడిన తీర్పు పరిగి: రూ. 500 ల కోసం పెట్టుకున్న గొడవ ఓ యువకుడిని జీవితాంతం జైలుకే పరిమితం చేసింది. యువకుడికి శిక్ష తో పాటు రూ.2000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పును వెలవరించింది. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ సెషన్స్ కోర్టులో జిల్లా అడిషనల్ సెషన్ జడ్జ్ కే.రంగారావ్ ఈ శిక్ష ఖరారు చేస్తూ గురువారం తీర్పు వెలువరించారు. ఈ కేసుకు సంబందించిన వివరాలు.. జిల్లాలోని పరిగి మండల పరిధిలోని గోవిందాపూర్కు చెందిన పిచ్చకుంట్ల మల్లేశ్(25) తనకు ఇవ్వాల్సిన రూ.500 అప్పు తీర్చాలంటూ అదే గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల హన్మంతుతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో చెలరేగిన గొడవలో మల్లేశ్ హన్మంతును కత్తితో పొడవగా అతను మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు 2011 ఆగస్టు 10వ తేదీ కేసు నమోదు చేసుకుని, అప్పటి సీఐ మోహన్రెడ్డి, ఎస్ఐ రాజయ్యలు దర్యాప్తు ప్రారంభించారు. చార్జిషీట్ దాఖలు చేశారు. నాలుగు సంవత్సరాలుగా కేసుకు సంబందించి ట్రాయల్స్ జరగగా వాదనలు ముగిసి నేరం రుజువు కావటంతో గురువారం తీర్పును వెలువరించారు. మల్లేశ్ కు యావజ్జీవ శిక్షతో పాటు రూ. 2000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. -
రుణ భారంతో రైతు ఆత్మహత్య
కొల్చారం: మెదక్ జిల్లా కొల్చారం మండలం ఏటిగడ్డ మాందాపూర్లో ఓ రైతు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బర్దిపురం మల్లేశం(45)కు గ్రామంలో మూడెకరాల పొలం ఉంది. గత ఏడాది పొలంలో ఉన్న బోరు ఎండిపోవడంతో పంట సాగుచేయలేదు. అప్పటికే ఇద్దరు కూతుళ్ల పెళ్లి కోసం రూ.4 లక్షల వరకు అప్పు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో అప్పు తీర్చేందుకు తన పొలాన్ని అమ్మేందుకు మల్లేశం సిద్ధపడ్డాడు. అయితే, రుణ దాత ఒకరు తను చెప్పిన వారికి మాత్రమే పొలాన్ని అమ్మాలంటూ తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన మల్లేశం తిరిగిరాలేదు. గురువారం ఉదయం గ్రామానికి చెందిన నారాయణరెడ్డి పొలంలోని గుడిసెలో ఉరి వేసుకొని కనిపించాడు. మల్లేశం భార్య ఫిర్యాదు మేరకు కొల్చారం ఎస్సై రమేష్ నాయక్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కాలువలోకి దూసుకెళ్లిన బైక్ : ఇద్దరి మృతి
రామగుండం: కరీంనగర్ జిల్లాలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. రామగుండం మండలం బసంత్నగర్ ఏయిర్పోర్ట్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రామగుండంకు వెళ్తున్న క్రమంలో బైక్ అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మృతి చెందిన వారు ఎన్టీపీసీకి చెందిన మిట్టా రాజ్కుమార్(20), మల్లేష్(21)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించనున్నారు. -
సంక్రాంతి వేడుకల్లో విషాదం
-
సంక్రాంతి వేడుకల్లో విషాదం
హైదరాబాద్: సంక్రాంతి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. గుడిమల్కాపుర్ అల్లూరి సీతారామరాజు నగర్లో గాలి పటం ఎగురవేస్తూ మల్లేశ్ అనే యువకుడు బిల్డింగ్పై నుంచి జారి పడిపోయాడు. దీంతో అతను అక్కడిక్కడే మృతిచెందాడు. మల్లేశ్ మృతితో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. -
అప్పులబాధతో రైతు ఆత్మహత్య
వ్యవసాయంలో అప్పులపాలై మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన గుడిహత్నూర్ మండలం గురుజ్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మల్లేష్(50) అనే రైతు అప్పుల బాధతో బుధవారం రాత్రి పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు గమనించి మల్లేష్ను ఆదిలాబాద్ రిమ్స్కు తరలించగా..చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. -
మరిది చేతిలో వదిన దారుణ హత్య
నవాబుపేట మండలం చిట్టిగిడ్డ గ్రామంలో పద్మమ్మ(35) అనే మహిళ దారుణ హత్యకు గురైంది. గ్రామానికి చెందిన మల్లేష్ అనే వ్యక్తి తన సొంత వదినను గొడ్డలితో నరికి చంపాడు. హత్య అనంతరం పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కొడుకులను అమ్మకానికి పెట్టిన తండ్రి
తాగుడుకు బానిసైన ఓ తండ్రి.. కన్న కొడుకులనే అమ్మాకానికి పెట్టాడు. పోలీసులు కలగ జేసుకోవడంతో కథ సుఖాంతమైంది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా ఇరుకుల్ల గ్రామానికి చెందిన మల్లేశ్ తాగుడుకు బానిసయ్యాడు. దీంతో అతడి భార్య అతడిని వదిలేసింది. ఈ క్రమంలో తన ఇద్దరు కుమారులను బేరానికి పెట్టాడు. లక్షరూపాయల బేరం కుదుర్చుకున్న అతడు.. 20 వేల రూపాయలను అడ్వాన్స్ గా తీసుకున్నాడు. విషయం తెలిసిన అతడి భార్య పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మల్లేశ్ ను అరెస్టు చేసి.. కేసు నమోదు చేశారు. -
డాక్టర్ మోసం.. ల్యాబ్ టెక్నీషియన్ ఆత్మహత్య
హైదరాబాద్: ఎక్కడైనా ఉద్యోగం ఇచ్చిన యజమానులు.. తమ దగ్గర పనిచేసే ఉద్యోగులను పోషించాలనుకుంటారు. కానీ, హైదరాబాద్ మీర్పేటలో మాత్రం ఓ డాక్టర్ చేసిన మోసం కారణంగా ల్యాబ్ టెక్నీషియన్ తన ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. దీంతో డాక్టర్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. మీర్పేటలోని సాయి శ్రీనివాస ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా మల్లేష్ కొంతకాలంగా పని చేస్తున్నాడు. డాక్టర్ అశోక్ కుమార్ దగ్గర మల్లేష్ తన భూమి పత్రాలతో 2 లక్షలు అప్పు తీసుకున్నాడు. అశోక్ కుమార్ రూ.2 లక్షల అప్పును 20 లక్షలుగా చిత్రీకరించి అతనిని వేధిస్తున్నాడు. దీంతో డాక్టర్ అశోక్ కుమార్ తనను మోసం చేశాడంటూ సూసైడ్ నోట్ రాసిన మల్లేష్.. గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ వ్యవహారంపై పోలీసులకు గతంలోనే ఫిర్యాదు చేసినా వాళ్లు పట్టించుకోలేదని మల్లేష్ బంధువులు ఆరోపిస్తున్నారు. -
చిట్టీల పేరుతో రూ.2.50 కోట్లకు టోకరా
-
చిట్టీల పేరుతో రూ.2.50 కోట్లకు టోకరా
కీసర: చిట్టీలు, అప్పుల పేరుతో జనం నుంచి రూ. 2.50 కోట్ల మేర వసూలు చేసి పరారయ్యాడు ఓ వ్యాపారి. రంగారెడ్డి జిల్లా కీసర మండలం చీర్యాల గ్రామంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాలివీ.. గ్రామానికి చెందిన రాకుల మల్లేశ్ గత పదేళ్లుగా చిట్టీలు నిర్వహిస్తున్నాడు. అందరితోనూ ఎంతో నమ్మకంగా ఉంటూ వస్తున్నాడు. చిట్టీలు, రుణం రూపేణా డబ్బులు మొత్తం కలసి రూ.2.50 కోట్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో వారం రోజులుగా కనిపించకుండా పోయాడు. ఈ నేపథ్యంలో బాధితులంతా ఆరా తీయగా పరారీలో ఉన్నట్టు తెలిసింది. దీనిపై దాదాపు 85 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన సీఐ గురవారెడ్డి మల్లేశ్ భార్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
అన్నను కాపాడి ... తమ్ముడు మృతి
మహబూబ్నగర్ : బావిలో పడిన అన్నయ్యను రక్షించి ఓ తమ్ముడు మృత్యువు ఒడిలోకి చేరుకున్నాడు. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా గట్టు మండలం మల్లాపురంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి... స్థానికంగా నివసిస్తున్న మల్లేష్ (15), గోపాల్ (18) అన్నదమ్ములు, గొర్రెల కాపరులుగా జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ రోజు గ్రామ శివారులో గొర్రెలను మేపుతున్నారు. ఆ క్రమంలో గోపాలుకు తీవ్ర దాహం వేసింది. సమీపంలోని బావిలోకి మెట్ల ద్వారా దిగాడు. నీళ్లు తాగుతుండగా... కాలు జారీ నీళ్లలో పడ్డాడు. బావి లోతుగా ఉండటంతో గోపాలు నీట మునిగాడు. ఆ విషయాన్ని గమనించిన తమ్ముడు మల్లేష్ బావిలోకి దిగి.. అన్నయ్య గోపాల్ను రక్షించి మెట్ల మీదకు చేర్చాడు. కానీ మల్లేష్ మాత్రం నీట మునిగి మరణించాడు. -
నక్సల్ కమాండర్ లొంగుబాటు
కరీంనగర్ : మావోయిస్టు డిప్యూటీ దళ కమాండర్ లింగయ్య అలియాస్ మల్లేశ్ పోలీసులకు లొంగిపోయాడు. ఆరోగ్యప్రభుత్వం గతంలో అతనిపై రూ.లక్ష రివార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా ఎస్పీ జోయల్ డెవీస్ మాట్లాడుతూ లింగయ్యపై సుమారు 15 కేసులు ఉన్నాయని తెలిపారు. లొంగిపోయిన నక్సల్స్కు పునరావాసం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. అతని పేరు మీద ఉన్న రూ. లక్ష రివార్డును త్వరలోనే అతనికే అందజేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. కాగా లింగయ్యపై ఛత్తీస్గఢ్లో ఇద్దరు కానిస్టేబుళ్ల హత్యలతో పాటు తెలంగాణ రీ రీజయన్ పరిధిలోని పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో ముగ్గురు గ్రామస్తులను హత్య చేసిన కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు వెల్లడించారు. 2010 లో మావోయిస్టు గ్రూప్ చేరిన మల్లేష్, 2014 లో మహదేవ్పూర్ మండలం ఏటూరు నాగారం మావోయిస్టు డిప్యూటీ కమాండర్ పదవి చేపట్టాడు. అయితే ఆరోగ్యం సహకరించకపోవడంతోనే లొంగిపోయినట్లు లింగయ్య పేర్కొన్నాడు. -
'మాట తప్పిన కేసీఆర్ తల తీసేసుకోవాలి'
మహబూబ్నగర్ విద్యావిభాగం: తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే డిఎస్సీ వేసి వెంటనే ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించి మాట తప్పిన కేసీఆర్ తలనరుక్కోవాలని డిఎస్సీ సాధనకమిటి అధ్యక్ష, కార్యదర్శులు శివుడు, మల్లేష్లు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన జరిగిన 15 నెలల నుంచి ప్రతి నెలా పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పదవి విరమణ పొందుతున్న తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టులు లేవనడం సిగ్గుచేటని పేర్కొన్నారు. తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశాల్లో విద్యాశాఖలో 24,861 పోస్టులు ఉన్నాయని లెక్కలు తేల్చిన ప్రభుత్వం హేతు బద్దీకరణతో 15వేల పోస్టులను మాయం చేసిందని విమర్శించారు. ఇప్పట్లో డిఎస్సీ లేదని విద్యాశాఖమంత్రి ప్రకటించడం నిరుద్యోగులను నిరాశకు గురి చేయడమేనని అన్నారు. ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ లేనప్పుడు 9,800 ఇన్స్ట్రక్టర్ పోస్టులు ఎందుకని ప్రశ్నించారు. -
తడారితే అలారం మోగుద్ది..
ఓ పల్లెటూరి యువకుడి ప్రయోగం ఇంజనీరింగ్ లాంటి పెద్ద చదువులు చదవకపోయినా ఉపాధికోసం ఎంచుకున్న రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నాడు మోత్కూరు మండల ఆజీంపేట గ్రామానికి చెందిన బొమ్మగాని మల్లేష్. తక్కువ ఖర్చుతో రైతులకు ఉపయోగపడే పలు రకాల సోలార్ పరికరాలను రూపొందిస్తున్నాడు. మొక్కలకు తడారిపోతే అలారం మోగే పరికరాన్ని తయారు చేసి ప్రదర్శించాడు. పరికరం విశిష్టత..పనిచేసే విధానం, తయారీపై కథనమే ఈవారం సండేస్పెషల్. మోత్కూరు మండలం ఆజీంపేట గ్రామానికి చెందిన బొమ్మగాని మల్లేష్ మొక్కకు పదును ఆరిపోవడంతో అలారం లాంటి శద్దం వచ్చే పరికరాన్ని తయారుచేశాడు. గతంలో ఎలక్ట్రానిక్ పరికరాలతో సోలార్తో నడిచే పలు రకాల పరికరాలను తయారు చేసి అవార్డులు అందుకున్నాడు. ఈ పరికరాల రూపకల్పనకు అతని అమ్మే ప్రేరణ. మల్లేష్ తండ్రి వెంకటయ్య, తల్లి లక్ష్మి వ్యవసాయకూలీ. పనిచేస్తేనే ఆ కుటుంబం గడుస్తుంది. ఆర్థిక స్తోమతలేక మల్లేష్ 10వ తరగతి వరకు చదువుకు స్వస్తిచెప్పాడు. స్వామి రామానంద తీర్థ రూరల్ ఇనిస్టిట్యూట్లో సోలార్కోర్సు పూర్తిచేశాడు. తల్లి లక్ష్మీ తరుచూ అనారోగ్యంతో బాధపడుతుంటుంది. ఒకరోజు తల్లి అనారోగ్యంతో బాధపడుతూ లేచి స్విచ్బోర్డు వద్దకు వెల్లిలైటు వేయడానికి, ఆర్పడానికి పడుతున్న బాధను చూడలేకపోయాడు. ఇనిస్టిట్యూట్లో పొందిన శిక్షణతో మల్లేష్ నిత్యం ఏదో ఒక్క కొత్త వస్తువును తయారుచేయాలన్న తపనతో ప్రయోగాలు చేశాడు. అందులో ఒకటి సోలార్తో నడిచే అలారం. పనిచేసే విధానం.. మల్లేష్ రూపొందించిన సర్క్యూట్ను మొక్కల పెంపకం చేపట్టిన ఆవరణలో ఒకచోట ఏర్పాటు చేయాలి. సర్క్యూట్ నుంచి కనెక్షన్ ఇచ్చిన వైర్లు మొక్క వద్ద భూమిలో పెట్టాలి. అక్కడ తేమ లేకుండా ఎండిపోయినప్పుడు ఆటోమేటిక్గా అలారం శబ్దం వస్తూ మొక్కకు కేటాయించిన నంబర్గల బల్బు వెలుగుతుంది. వెంటనే మొక్క వద్ద నీరు పోయగానే భూమిలో పదును ఏర్పడి ఆటోమేటిక్గా ఆ శబ్దం ఆగిపోతూ, బల్బు ఆఫ్ అవుతుంది. ఇలా మొక్కకు నీరు ఎంత అవసరం ఉంటుందో, అవరసరం ఉండి ఎంతో తేమలేకుండా ఆరిపోతుందో విషయాన్ని తెలుసుకోవచ్చు. దీని ద్వారా మొక్క ఎండిపోకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడి పెంపకంలో తగు చర్యలు తీసుకోవచ్చు. పరికరం తయారు చేసింది ఇలా.. 10 వాట్స్గల ఒక సోలార్ ప్యానల్, 12 ఓల్టేజీ గల రెండు బ్యాటరీలు, 5 ట్రాన్సిస్టర్లు, 2 ఐసీలు, 5 రిలేలు, 3 కెపాసిటర్లు, 10 డైమోడ్స్, 12 రిసిస్ట్రర్స్లతో అలారం మోగే సర్క్యూట్ను రూపొందించాడు. ఈ సర్క్యూట్ వద్ద నుంచి తీసిన వైర్లు మొక్క గుంత వద్ద మట్టిలో పెట్టాలి. ఈ మొక్క వద్ద పదును ఆరిపోగానే అలారం మోగి గుర్తుచేస్తుంది. 1 నుంచి 4 మొక్కలకోసం ఏర్పాటు చేసిన సర్క్యూట్కు రూ. 1500 వరకు ఖర్చు అవుతుంది. 500 నుంచి 1000 మొక్కల వరకు ఏర్పాటుచేసే సర్క్యూట్కు రూ. 6వేలు ఖర్చు అవుతుంది. -
ముందు చూపుతో మందు కొంటే..ప్రాణం తీసిన సిసా
జీడిమెట్ల: జేబులోని మద్యం సీసా పగిలి వ్యక్తి మర్మాంగాలకు గాయాలు కావడంతో, చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రమేష్ వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్ట సోమయ్యనగర్కు చెందిన మల్లేశ్(26) మేస్త్రీగా జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం జగద్గిరిగుట్టలోని ఓ మద్యం దుకాణంలో మద్యం సేవించిన మల్లేశ్ మరో సీసా కొనుగోలు చేసి ప్యాంట్ ముందు జేబులో పెట్టుకున్నాడు. నడుచుకుంటూ వెళ్తుండగా వర్షం రావడంతో పరుగుతీశాడు. ఈ క్రమంలో మల్లేశ్ కింద పడడంతో జేబులో ఉన్న సీసా పగిలి మర్మాంగాలకు గుచ్చుకుంది. తీవ్రరక్తస్రావం కావడంతో అతడ్ని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
భార్య ప్రయాణిస్తున్న బస్సు ఢీకొని భర్త మృతి
►రెండు బైక్లు ఢీ: రోడ్డుపై పడిపోయిన వ్యక్తి... ►ఆయన పైనుంచి బస్సు వెళ్లడంతో దుర్మరణం ►తండ్రి మృతి...కూతుళ్లకు తీవ్రగాయాలు ఇబ్రహీంపట్నం : ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్లు ఢీకొన్నాయి. ఓ వ్యక్తి రోడ్డుపై పడిపోయాడు. అతడి పైనుంచి బస్సు వెళ్లడంతో దుర్మరణం చెందాడు. ప్రమాదంలో తండ్రి దుర్మరణం చెందగా, కుమార్తెలిద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన సోమవారం రాత్రి 7:30 గంటల సమయంలో ఇబ్రహీంపట్నం మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కందుకూరు మండలం ఉట్లపల్లి గ్రామానికి చెందిన బుర్ర జగన్(35) సోమవారం రాత్రి తన కుమార్తెలు స్వీటీ(11), క్రేజీ(3)లతో కలిసి బైక్(29 బీజీ 5802)పై యాచారం వస్తున్నాడు. ఆయన భార్య వెనుక నుంచి బస్సులో వస్తోంది. మంచాల మండలం లోయపల్లికి మల్లేష్ ఎదురుగా వస్తున్నాడు. ఈక్రమంలో ఖానాపూర్ స్టేజీ సమీపంలో వీరి రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో బైక్పైనుంచి రోడ్డుపై పడిపోయిన జగన్ పైకి లేచేందుకు యత్నిస్తున్నాడు. అంతలోనే ఇబ్రహీంపట్నం నుంచి యాచారం వైపు వెళ్తుతున్న ఆర్టీసీ బస్సు(ఏపీ29జడ్2589) ఆయన పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన స్వీటీ, క్రేజీ, మల్లేష్లను 108 అంబులెన్స్లో హైదరాబాద్ తరలించారు. కాగా ప్రమాదానికి కారణమైన బస్సులోనే జగన్ భార్య కూడా ప్రయాణిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమించిన పాపానికి..
ప్రియుడి చేతిలో దారుణహత్య ఓ యువతి ఇష్టపడి ఓ యువకుడిని ప్రేమించింది. అతనితోనే బతకాలనుకుంది. ఈ విషయం ఇరువురి తల్లిదండ్రులకు తెలియగా వారు నిరాకరించారు. కొన్నాళ్లకైనా వారిని ఒప్పించి ఇష్టమైన వాడిని పెళ్లాడుదామనుకుంది. యువకుడు మాత్రం ఇప్పుడే పెళ్లి చేసుకుందామని ఒత్తిడి పెంచాడు. పెద్దల సమక్షంలో చేసుకుందామని, దొంగచాటు పెళ్లి వద్దని చెప్పినందుకు ప్రేమించిన యువకుడే అతి కిరాతకంగా హత్యచేసిన ఉదంతమిది. - వీపనగండ్ల మండల పరిధిలోని బెక్కెం గ్రామం నేలబిల్కుకు చెందిన దేవమ్మ, శాంతయ్యల కుమార్తె వి.నాగమణి (19), అదే గ్రామానికి చెందిన బత్తుల మల్లేష్లు రెండేళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఆరునెలల క్రితం వీరి ప్రేమ వ్యవహారం ఇరువురి తల్లిండ్రులకు తెలిసింది. అప్పట్లో ఇద్దరి ఇంట్లో గొడవ జరుగగా ప్రేమికులిద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. మల్లేష్ ఐదునెలలుగా హైదరాబాద్లో ఉంటూ టీటీసీ కోచింగ్ తీసకుంటున్నాడు. వారం రోజుల కిందట స్వగ్రామానికి వచ్చిన యువకుడు నాగమణిని తనతో తీసుకెళ్లేందుకు యత్నించాడు. ఆమె నిరాకరిస్తూ వచ్చింది. అదే క్రమంలో మంగళవారం మధ్యాహ్నం తల్లిదండ్రులు కూలిపనులకు వెళ్లిన సమయం చూసి యువతి ఇంట్లోకి వెళ్లి తనతో రావాలని పట్టుబట్టాడు. పెద్దల నిర్ణయంతోనే పెళ్లి చేసుకుందామని, వారిని ఒప్పించేవరకు సమమయం పడుతుందని, దొంగచాటు వెళ్లడం తనకు ఇష్టం లేదనితెగేసి చెప్పిం ది. దీంతో ఆవేశానికి లోనైన యువకుడు రుబ్బుడు గుండుతో తలపై అతి దారుణంగా మోది హత్య చేశాడు. కేకలు విన్న ఇరుగుపొరుగు వారు వస్తుండగా తప్పించుకొని పారిపోతూ నేనే యువతిని హత్య చేశానని చెప్పాడు. వారు ఇంట్లోకి వెళ్లి చూసేసరికి యువతి రక్తపు మడుగులో పడి ఉంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇలాంటి వ్యక్తినా అమ్మా.. నీవు ఇష్టపడింది.. చివరికి నీ ప్రాణాలే బలితీసుకున్నాడు కదా.. అని రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కలిచివేసింది. యువతికి తల్లిదండ్రులతో పాటు అవ్వ సాయమ్మ, తమ్ముళ్లు కురుముర్తి, శివశంకర్ ఉన్నారు. విషయం తెలుసుకున్న ఏఎస్ఐ వహిద్అలిబేగ్, హెడ్కానిస్టేబుల్ సుధాకర్ హత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి పరారిలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. సీఐ రాఘవరావు సాయంత్రం బాధితులతో వివరాలు తెలుసుకున్నారు. -
సమాచారం లేని ఉపాధి గ్రామసభలు
యాచారం: మల్కీజ్గూడలో ఉపాధి హామీ పథకం గ్రామసభను ఈనెల 25న నిర్వహించడానికి ఈజీఎస్ అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. కానీ ఉదయం 11 గంటల దాటినా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు అధికారులెవరూ రాలేదు. గ్రామసభపై ‘సాక్షి’ గ్రామ సర్పంచ్ మల్లేష్ను సంప్రదిస్తే అసలు తనకు సమాచారమే లేదన్నారు. వెంటనే సర్పంచ్ ఈజీఎస్ మండల ఏపీఓ నాగభూషణానికి ఫోను చేయగా స్పందించలేదు. గడ్డమల్లయ్యగూడ గ్రామంలో 21న గ్రామసభ ప్రారంభమై 22, 23 తేదీల్లో ఏడాదిపా టు కూలీలకు పనులు కల్పించే విషయమై నిర్ణయం తీసుకొని 24న సోమవారం మళ్లీ గ్రామసభ జరిపి పనుల ఎంపికపై తీర్మానం చేయాల్సి ఉంది. కానీ ఆ గ్రామంలో అసలు గ్రామసభనే జరగలేదు. అధికారులు ప్రకటించిన షెడ్యూల్ తేదీ గడువు ముగిసినా సర్పంచ్కు అసలు సమాచారమే లేదు. ఈజీఎస్ అధికారుల నిర్వాకంతో గ్రామాల్లో ఉపాధి పథకం గ్రామసభలు సమాచారం లేని సభలుగా మారాయి. వచ్చే ఏడాది పాటు గ్రామాల్లో కూలీలకు చేతి నిండా పనికల్పించాలంటే గ్రామసభల్లో పనుల ఎంపిక ఎంతో ముఖ్యం. కానీ మండలంలో సక్రమంగా జరగని గ్రామసభలపై మంగళవారం వివిధ గ్రామాల సర్పంచ్లు, ఈజీఎస్ ఉన్నతాధికారులకు, ఏపీడీకి ఫిర్యాదులు చేశారు. సర్పంచ్లకు సమాచారం లేదు.. మండలంలోని 20 గ్రామాల్లో 20 వేలకుపైగా కూలీలు ఉన్నారు. ప్రతి యేటా మంజూరయ్యే కోట్లాది రూపాయల నిధులకు ఉపాధి గ్రామసభల్లో ఎంపిక, తీర్మానం చేసే నిర్ణయాలే కీలకం. కానీ మండల ఏపీఓ నాగభూషణం పర్యవేక్షణాలోపంతో మండలంలో ఏ గ్రామంలో కూడా గ్రామసభలు సక్రమంగా జరగడ లేదు. ఉపాధి గ్రామసభలు పరిశీలించడానికి సాక్షి మంగళవారం ఉదయం 9-30 గంటలకు (షెడ్యూల్ ప్రకటించిన సమయం ప్రకారం) కుర్మిద గ్రామానికి వెళ్లగా గ్రామసభ లేదు. సర్పంచ్ విజయను సంప్రదించగా ఈ రోజు గ్రామసభ ఉందని తనకు సమాచారమే లేదని తెలిపింది. మల్కీజ్గూడ గ్రామానికి ఉదయం 11 గంటలకు వెళ్లగా అక్కడ కూడా గ్రామసభ లేదు. సర్పంచ్ మల్లేష్ను సంప్రదించగా గ్రామసభల విషయం తనకు తెలియదన్నారు. గ్రామసభలు జరుగుతున్నాయా..? అని గడ్డమల్లయ్యగూడ సర్పంచ్ నర్రె మల్లేష్ను సంప్రదించగా తమ గ్రామంలో ఇంతవరకు గ్రామసభలే జరగలేదన్నారు. నల్లవెల్లి సర్పంచ్ శోభను సంప్రదించగా 21నఅధికారులు వచ్చారు.. కొంతమంది రైతుల నుంచి ధరఖాస్తులు తీసుకున్నారు.. 24న మళ్లీ గ్రామసభ జరగాలి కానీ జరగలేదన్నారు. గతంలో జరిగిన పనుల్లో తప్పిదాలవల్ల ప్రజలు నిలదీస్తారేమోనని గ్రామసభల గురించి సమాచారం లేకుండా ముగించే విధంగా ఈజీఎస్ సిబ్బంది వ్యవహరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. -
‘కవితపై ఆరోపణలు చేస్తే సహించం’
మల్లాపూర్: నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవి తపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని తెలంగాణ జాగృతి అడహక్ జిల్లా కో-కన్వీనర్ గనవేని మల్లేశ్ హెచ్చరించారు. మండల కేం ద్రంలోని భరతమాత కూడలి వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో టీడీ పీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను గురువారం దహనం చేశారు. తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన రేవంత్రెడ్డి ఆంధ్రపాలకుల తొత్తుగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. మండల కన్వీనర్ ఏనుగు రవీందర్రెడ్డి, విద్యార్థి విభాగం మండల కన్వీనర్ ఎగ్యారపు రాకేశ్, కో-కన్వీనర్ రాజోజి సాయిరాం, మారుగొండ మహిపాల్, పెంట రమేశ్, నలువల రమేశ్, మహేశ్ పాల్గొన్నారు. -
చారిత్రక ఆనవాళ్లను పరిరక్షించే.. మ్యూజియాలజిస్ట్
ఒక దేశ చరిత్రను తెలుసుకోవాలంటే అక్కడ లభించే ప్రాచీన ఆనవాళ్లను, కళాఖండాలను అధ్యయనం చేయాలి. తవ్వకాల్లో లభించే ఇలాంటి వాటిని ఒకచోట చేర్చి, పరిరక్షించేవారే.. మ్యూజియాలజిస్ట్లు. చరిత్రను సందర్శకుల కళ్లముందుంచే మ్యూజియాలజిస్ట్గా కెరీర్ ప్రారంభించాలనుకునే ఔత్సాహికులకు మనదేశంలో ఎన్నో కోర్సులు, ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఎన్నో అవకాశాలు.. ప్రభుత్వ రంగంలో ప్రదర్శనశాలల్లో, ప్రైవేట్ రంగంలో ఆర్ట్ గ్యాలరీల్లో మ్యూజియాలజిస్ట్లకు ఉద్యోగాలు దక్కుతున్నాయి. క్యూరేటర్, డెరైక్టర్, మ్యూజియం ఎడ్యుకేషనిస్ట్, మ్యూజియం కో-ఆర్డినేటర్, కన్సల్టెంట్ తదితర కొలువులు ఉన్నాయి. ఆసక్తి ఉంటే విద్యాసంస్థల్లో మ్యూజియాలజీ కోర్సులను బోధించే ఫ్యాకల్టీగా కూడా స్థిరపడొచ్చు. కావాల్సిన లక్షణాలు: మ్యూజియాలజిస్ట్లకు చరిత్రపై ఆసక్తి, అవగాహన ఉండాలి. చారిత్రక వస్తువులు శిథిలం కాకుండా శాస్త్రీయమైన పద్ధతిలో వాటిని పరిరక్షించాల్సి ఉంటుంది. ఇందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. ఎప్పటికప్పుడు ప్రాచీన వస్తువుల సేకరణపై దృష్టి పెట్టాలి. వాటి ప్రాధాన్యతను గుర్తించగలగాలి. వృత్తిపరమైన నైపుణ్యాలను పెంచుకుంటూ ఉండాలి. అర్హతలు: భారత్లో మ్యూజియాలజీలో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, పీహెచ్డీ, అడ్వాన్స్డ్ డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులు ఉన్నాయి. ఇంటర్మీడియెట్ అర్హతతో గ్రాడ్యుయేషన్లో చేరొచ్చు. తర్వాత పీజీ, పీహెచ్డీ కూడా పూర్తిచేస్తే ఉన్నత అవకాశాలు దక్కుతాయి. వేతనాలు: మ్యూజియాలజిస్ట్కు ప్రారంభంలో నెలకు రూ.15 వేల వేతనం అందుతుంది. సీనియారిటీని బట్టి వేతనం పెరుగుతుంది. ప్రభుత్వ రంగంలో సీనియర్ క్యూరేటర్ లేదా డెరైక్టర్కు నెలకు రూ.50 వేలకు పైగానే లభిస్తుంది. చరిత్రపై అవగాహన ఉండాలి! ‘‘మ్యూజియాలజీ లేదా మ్యూజియం స్టడీస్ కోర్సులు పూర్తిగా భిన్నమైనవి. చాలా తక్కువ మంది ఈ కోర్సులను అభ్యసిస్తున్నారు. భారతీయ చరిత్ర, సంప్రదాయం, ఇతిహాసాలు, పురాణాలపై అవగాహన ఉన్నవారు ఈ కోర్సులను అభ్యసిస్తే మంచి కెరీర్ సొంతమవుతుంది. కళలపై ఆసక్తి, కళాఖండాలను భద్రపరిచే లక్షణాలున్నవారు ఈ కోర్సులను చదువుతారు. లైబ్రేరియన్లు, చరిత్రకారులు తమ అవకాశాలను పెంచుకోవడానికి వీటిని అభ్యసిస్తున్నారు. ఈ కోర్సుల్లో ప్రధానంగా మ్యూజియాల నిర్వహణ, అడ్మినిస్ట్రేషన్తోపాటు సంబంధిత శాస్త్రీయ అంశాలను విద్యార్థులు నేర్చుకుంటారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏలో ఒక సబ్జెక్ట్గా ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాం. ప్రత్యేకంగా పీజీ డిప్లొమా కోర్సును కూడా నిర్వహిస్తున్నాం. మ్యూజియాలజీ ఆసక్తికరమైన సబ్జెక్టే అయినప్పటికీ ఇందులో కెరీర్ను కొనసాగించాలంటే అమితమైన అంకితభావం తప్పనిసరి. చరిత్ర ఆనవాళ్లను తెలుసుకోవడానికి నిత్యం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మ్యూజియాలజీ నిపుణుల అవసరం తప్పనిసరి అవుతోంది. ఈ కోర్సులు అభ్యసించిన వారికి ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలుంటాయి. అలాగే ప్రైవేటుగా పరిశోధనలు చేసుకోవచ్చు’’ - ప్రొ. ఎస్.మల్లేశ్, ప్రిన్సిపల్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సెన్సైస్, ఉస్మానియా యూనివర్సిటీ -
కీసర ఎంపీపీ ఎన్నిక వాయిదా
కీసర: కీసర మండల మండలాధ్యక్షుడి ఎన్నిక నాటకీయ పరిణామల మధ్య శుక్రవారం వాయిదా పడింది. మండల పరిషత్లో 20 ఎంపీటీసీ సభ్యులకు 15 మంది మెజారిటీ ఉన్నప్పటికీ ఎంపీపీ అభ్యర్థిని ఎకగ్రీవంగా ఎంపిక చేయడంలో పార్టీ అధిష్టానం పూర్తిగా విఫలమైంది. సీల్డ్కవర్ ద్వారా ప్రతిపాదించబడ్డ అభ్యర్థి రామారం సుజాతకు వ్యతిరేకంగా పార్టీ విప్ను ధిక్కరిస్తామని, ఎంపీపీ అభ్యర్థిగా యాద్గార్పల్లి ఎంపీటీసీ మల్లేష్కు మద్దతు ఇస్తామని దమ్మాయిగూడ గ్రామానికి చెందిన ముగ్గురు, అహ్మద్గూడా గ్రామానికి చెందిన ఇద్దరు, కీసర-3 ఎంపీటీసీలు ప్రకటించారు. మరోవైపు ఎంపీపీ పదవిని ఆశించిన మరో ఎంపీటీసీ గోధుమకుంట ఎంపీటీసీ మంచాల పెంటయ్య, చీర్యాల ఎంపీటీసీ సంగీత సైతం కొమ్ము మల్లేష్కు మద్దతు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందనుకుంటుడగా బోగారం ఎంపీటీసీ మారారం సుజాత వెళ్లిపోయారు. తనను ఎంపీపీగా చేస్తామని హామీ ఇచ్చిన అధిష్టానం ఇప్పుడు మాట తప్పిందని నిరసన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని అక్కడున్న వారికి ఫోన్ ద్వారా సమాచారమందించారు. దీంతో కంగారు పడ్డ పార్టీ నేతలు ఎట్టకేలకు రామారం సుజాతను తిరిగి మండల పరిషత్కు తీసుకువచ్చారు. ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికపై పార్టీలో తిరిగి వాదోపవాదాలు జరిగాయి. నియోజకవర్గ ఇన్చార్జి తోట కూర జంగయ్య యాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు కౌకుట్ల చంద్రారెడ్డి తదితరులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఏకాభిప్రాయం సాధించడంలో విఫలమయ్యారు. ఎంపీపీ ఎన్నిక వాయిదా పడేలా కోరం లేకుండా చూసుకున్న టీడీపీ నేతలు అక్కడి నుంచి ఎంపీటీసీలను తిరిగి క్యాంప్నకు తరలించారు. ఎన్నిక నేటికి వాయిదా.. కోరం లేకపోవడంతో ఎంపీపీ ఎన్నికను శనివారం నాటికి వాయిదా వేస్తున్నట్లు మండల ప్రత్యేకాధికి విద్య, ఎంపీడిఓ నిరంజన్ తెలిపారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు పూర్తి కోరం సభ్యులు ఉంటే సమావేశాన్ని నిర్వహిస్తామని, అది కూడా వీలుకాని పక్షంలో ఎన్నికల కమిషన్కు నివేదిక సమర్పించి, వారి ఆదేశాల మేరకు తదుపరి సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీటీసీలు.. కీసర మండలంలో 20 మంది ఎంపీటీసీలు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రత్యేకాధికారి విద్య ఎంపీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. కో ఆప్షన్ సభ్యుడిగా మహ్మద్గౌస్.. మండల పరిషత్ కో ఆప్షన్ మెంబర్గా దమ్మాయిగూడ గ్రామానికి చెందిన ఎండి.గౌస్ ఎన్నికయ్యారు. -
డీసీసీ అధ్యక్ష పదవి విషయంలో తలెత్తిన విభేదాలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కాంగ్రెస్లో గ్రూపు రాజకీయాలు మరోసారి రచ్చకెక్కాయి. డీసీసీ అధ్యక్ష పదవి విషయంలో తలెత్తిన విభేదాలు ఆ పార్టీ ఆఫీసు తాళం పగలగొట్టే వరకూ వెళ్లాయి. ఒకరికి ఒకటే పదవి అనే ఏఐసీసీ నిబంధన మేరకు క్యామ మల్లేశ్ను డీసీసీ పదవికి రాజీనామా చేయాలని టీపీసీసీ సూచించింది. ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు జిల్లా సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆదేశించిన క్రమంలో ఇబ్రహీంపట్నం నుంచి అసెంబ్లీ బరిలో దిగిన మల్లేశ్కు కూడా వైదొలగడం అనివార్యమైంది. క్యామ స్థానంలో రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ పడాల వెంకటస్వామిని నియమిస్తూ టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం బాధ్యతలు స్వీకరించేందుకు గాంధీభవన్ ఆవరణలోని డీసీసీ ఆఫీసుకు వెంకటస్వామి వచ్చారు. కార్యాలయానికి తాళం వేసి ఉండడం.. చార్జి ఇచ్చేందుకు క్యామ నిరాకరించినట్లు తెలుసుకున్న వెంకటస్వామి వర్గీయులు తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. తాత్కాలికం కావడంతోనే... ఇదిలావుండగా, ఈ వ్యవహారం కాంగ్రెస్లో కొత్త వివాదానికి దారితీసింది. జోడు పదవుల నేపథ్యంలో డీసీసీ పదవికి రాజీనామా చేయాలని పీసీసీ సూచించినప్పటికీ, ఆరుగురు డీసీసీ అధ్యక్షులు ఎన్నికల్లో పోటీచేస్తున్నా.. కేవలం రంగారెడ్డి జిల్లాకే ఈ నిబంధనను వర్తింపజేయడంపై పార్టీలోని ఒక వర్గం తీవ్రంగా తప్పుబడుతోంది. సోమవారం సాయంత్రం పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలోనూ దీనిపై వాడివేడి చర్చ జరిగినట్లు తెలిసింది. పడాల వర్గీయులు గాంధీభవన్ ఆవరణలోనే తాళం పగులగొట్టినా ఎందుకు మిన్నకున్నారని మేడ్చల్ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ప్రశ్నించినట్లు సమాచారం. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినవారికి టికెట్లు ఇచ్చారని, వెన్నుపోటు దారులను ప్రోత్సహిస్తున్నవారికి అండగా నిలుస్తున్నారని నిలదీసినట్లు పార్టీవర్గాల ద్వారా తెలిసింది. పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు ప్రయత్నించినవారికి పదవులు కట్టబెట్టడం మంచి పద్దతికాదని కేఎల్లార్ అన్నట్లు సమాచారం. అయితే, దీనిపై స్పందించిన పీసీసీ చీఫ్ పొన్నాల, జిల్లా ఇన్చార్జి నాగయ్య మాట్లాడుతూ డీసీసీ అధ్యక్షుల్లో దానం మినహా మిగతావారిని తప్పుకోమని ఆదేశించామని, అందులోభాగంగానే వెంకటస్వామిని నియమించినట్లు స్పష్టం చేశారు. అయితే, బాధ్యతలు తీసుకోవడంలో వ్యవహరించిన తీరు సరిగాలేదని అన్నట్లు సమాచారం. మే 16వ తేదీ తర్వాత పార్టీలో సంస్థాగత మార్పులు ఉంటాయని, అప్పటివరకు వెంకటస్వామియే జిల్లా సారథిగా ఉంటారని తేల్చిచెప్పినట్లు తెలిసింది. ఇదిలావుండగా, జిల్లా పరిషత్, పురపాలక సంఘాలను కైవసం చేసుకునేందుకు పార్టీ నేతలంతా సమన్వయంతో పనిచేయాలని పొన్నాల సూచించారు. జెడ్పీ చైర్మన్ అభ్యర్థి యాదవరెడ్డి జెడ్పీటీసీలతో సమావేశం ఏర్పాటు చేసుకోవాలని, ఎంపీపీ అభ్యర్థి ఎంపిక బాధ్యత స్థానిక కాంగ్రెస్ ఇన్చార్జులదేనని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కేఎల్లార్, నారాయణరావు, భిక్షపతియాదవ్,పార్టీ అభ్యర్థులు క్యామ మల్లేశ్, బండారి లక్ష్మారెడ్డి, కాలె యాదయ్య, నర్సింహయాదవ్ తదితరులు పాల్గొన్నారు. బాధ్యతను నిర్వర్తిస్తా: పడాల అధిష్టానం అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని డీసీసీ అధ్యక్షుడు పడాల వెంకటస్వామి చెప్పారు. జిల్లాలో పార్టీ పటిష్టానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తానని, సీనియర్లతో సమన్వయం సాధించడం ద్వారా అత్యధిక పురపాలికలు, జిల్లా, మండల పరిషత్లను చేజిక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. -
మహిళా సర్పంచ్పై దాడి
గజపతినగరం, న్యూస్లైన్: గజపతినగరం మేజర్ పంచాయతీ సర్పంచ్ నరవ ఆదిలక్ష్మిపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శుక్రవారం దాడికి పాల్పడ్డారు. ఎంపీటీసీ సెగ్మెంట్కు సంబంధించి ఓట్ల విషయమై చర్చిస్తుండగా మాటామాటా పెరిగి నరవ మల్లేష్, పైడిరాజులు ఆమెపై దాడికి దిగారు. దీంతో నరవ ఆదిలక్ష్మి తన అనుచరులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు తెలిపినా పట్టించుకోలేదంటూ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. సీఐ చంద్రశేఖర్ దీనిపై స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ సర్పంచ్ మాత్రం నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీరికి మద్దతుగా తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి పడాల అరుణ, మక్కువ శ్రీధర్, సీపీఐ నాయకులు ఆల్తి అప్పలనాయుడు, బీజేపీ నాయకులు పీవీవీ గోపాలరాజు తమ అనుచరులతో కలిసి అక్కడకు వచ్చారు. దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో బొబ్బిలి డీఎస్పీ, షేక్ ఇషాక్ అహ్మద్ శనివారం ఉదయం పది గంటలకు నిందితుడిని అదుపులోకి తీసుకువచ్చి విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.దీంతో ఆందోళనకారులు ఆందోళన విరమించారు. -
సోనియాను తిడితే పుట్టగతులుండవ్
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అధినాయకత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ డిమాండ్ చేశారు. మూడు తరాలుగా పార్టీలో కొనసాగుతూ పదవులు అనుభవించిన జేసీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడడం దారుణమన్నారు. అధినేత్రిని దూషిస్తే ఇతర పార్టీలు ఆహ్వానిస్తాయనే ఆలోచనతోనే సోనియాపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. మంగళవారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్లేశ్ మాట్లాడారు. దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన ‘గాంధీ’ కుటుంబంపై ఆరోపణలు చేసే నైతిక హక్కు దివాకర్కు లేదన్నారు. ఒక ప్రాంతంలో పార్టీ నష్టపోతుందని తెలిసినా.. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని అన్నారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడమే లక్ష్యంగా సాహసోపేత నిర్ణయం తీసుకున్న సోనియాను విమర్శిస్తే పుట్టగతులుండవన్నారు. 35 ఏళ్లుగా పార్టీలో ఎన్నో పదవులు అనుభవించి కోట్లాది రూపాయలు కూడబెట్టిన దివాకర్ అహంకారంతో మాట్లాడుతున్నారని అన్నారు. పార్టీని విమర్శిస్తే కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. అర్హులందరూ ఓటర్లుగా నమోదు కండి అర్హులందరూ ఓటర్లుగా నమోదు కావాలని మల్లేశ్ విజ్ఞప్తి చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతోందని, 17వ తేదీ నాటికీ 18 ఏళ్లు నిండిన యువత ఓటుహక్కును పొందాలని కోరారు. విలేకరుల సమావేశ ంలో పార్టీ ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. -
బంగారం కోసమే స్నేహితుడి హత్య
జిన్నారం/పటాన్చెరు టౌన్ న్యూస్లైన్ : ఒంటిపై ఉన్న బంగారు చైన్, ఉంగరం కోసం తోటి స్నేహితుడి తలపై రాయితో మోది పాశవికంగా హత్య చేశాడో మిత్రుడు. మెదక్ జిల్లా జిన్నా రం మండలం బొల్లారం శివారులోని ఔటర్ రింగ్రోడ్డు సర్వీస్ రోడ్డు పక్కన గల దేవతలగుట్ట వద్ద జరిగిన హత్య కేసు మిస్టరీని పటన్చెరు పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. వారి కథనం మే రకు.. పటాన్చెరులోని శాంతినగర్ లో కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్న మల్లేశం.. అమీన్పూర్ వీఆర్ఓగా పనిచేస్తున్నారు. మల్లేష్కు రెండో సంతానమైన అనిల్కుమార్ ఇం టర్లో ఓ సబ్జెక్టు తప్పి ఇంట్లోనే ఉంటున్నాడు. పటాన్చెరు మండలం ఇంద్రే శం గ్రామానికి చెందిన నరేందర్గౌడ్ పటాన్చెరు ఆల్విన్ కాలనీలో నివాసం ఉంటూ జులాయిగా తిరుగుతున్నాడు. ఇదిలా ఉండగా అనిల్, నరేందర్లు ఇ రువురూ స్నేహితులు. ఈ క్రమంలో వీరి ద్దరూ ఈ నెల 6న జిన్నారం మండలం బొల్లారం శివారులోని దేవతలగుట్ట వద్ద మద్యం సేవించారు. అయితే తాను ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నానని, ఎలాగైనా డబ్బును సర్దాలని నరేందర్గౌడ్ మిత్రుడైన అనిల్కుమార్ను కోరా డు. అయితే తన వద్ద డబ్బు లేదని స మాధానం ఇవ్వగా మెడలో ఉన్న గొలుసు, చేతికి ఉన్న ఉంగరాన్ని ఇవ్వాల ని నరేందర్ కోరాడు. ఇందుకు అనిల్కుమార్ నిరాకరించాడు. దీంతో స్నేహితుడి తీరును ఆగ్రహిస్తూ నరేందర్ వాదనకు దిగాడు. అంతలోనే పక్కనే ఉన్న రాయితో అనిల్కుమార్ తలపై మోదా డు నరేందర్గౌడ్. అనంతరం అతడి మె డలో ఉన్న గొలుసు, చేతికున్న ఉంగరా న్ని తీసుకుని అనిల్కుమార్ మృతదేహా న్ని రాళ్ల మధ్యలో పడేసి వెళ్లిపోయాడు. ఇదిలా ఉండగా.. ఈ నెల 7న అని ల్కుమార్ కనిపించటం లేదని అతని సోదరుడు పటాన్చెరు పీఎస్లో ఫిర్యా దు చేశాడు. ఈ విషయమై అనిల్కుమార్ సెల్ఫోన్ నంబర్ల ఆధారంగాా వివరాలను పోలీసులు సేకరించారు. అనుమానంతో నరేందర్గౌడ్ను అదుపులోకి తీసుకుని విచారించగా విషయం వెల్లైడె ంది. అయితే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా.. ఐదు రోజుల క్రితమే అనిల్ను హత్య చేయడంతో మృతదేహం పూర్తిగా కుళ్లిపోయింది. దీంతో హత్య జరిగిన స్థలంలోనే వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. సంఘటనా స్థలాన్ని రామచంద్రాపురం డీఎస్పీ మధుసూధన్రెడ్డి, పటాన్చెరు సీఐ శంకర్రెడ్డి, బొల్లారం ఎస్ఐ ప్రవీణ్రెడ్డి సందర్శించారు. -
కేఎం ప్రతాప్పై అధిష్టానానికి మల్లేశ్ ఫిర్యాదు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా సారథ్యంపై కాంగ్రెస్లో కొత్త కిరికిరి మొదలైంది. కేఎం ప్రతాప్ను డీసీసీ అధ్యక్షుడిగా పేర్కొంటూ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. దాదాపు రెండు దశాబ్ధాలు జిల్లా కాంగ్రెస్ బాధ్యతలు నిర్వర్తించిన ప్రతాప్ను తప్పించి ఆయన స్థానంలో క్యామ మల్లేశ్ను నియమిస్తూ కొన్నాళ్ల క్రితం పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఈ నిర్ణయాన్ని మొదట్నుంచి వ్యతిరేకిస్తున్న ప్రతాప్ ఇప్పటికీ తానే డీసీసీ ప్రెసిడెంట్నని చెప్పుకుంటున్నారు. పార్టీ నియమావళికి అనుగుణంగా నియామకం జరగలేదని, మల్లేశ్ను ఇన్చార్జిగా మాత్రమే నియమించారని ఆయన వాదిస్తున్నారు. అంతేగాకుండా.. జిల్లా కాంగ్రెస్ కమిటీలను ఏఐసీసీ ప్రకటిస్తుంది తప్ప పీసీసీ కాదని పేచీ పెట్టారు. ఈ క్రమంలోనే గాంధీభవన్లోని డీసీసీ కార్యాలయంలోకి తాళాలు పగలగొట్టి చొరబడ్డారని మల్లేశ్పై స్థానిక పోలీస్స్టేషన్లో ప్రతాప్ ఫిర్యాదు కూడా చేశారు. ఈ పరిణామక్రమంలోనే డీసీసీ అధ్యక్షుడిగా మల్లేశ్ పగ్గాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఆ తర్వాత ఆయన అధ్యక్షతన జరిగిన విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు సహా పలువురు సీనియర్లు పాల్గొన్నారు. పార్టీ వ్యవహారాల్లో మల్లేశ్ నాయకత్వానికి ముఖ్యనేతలు సహకరిస్తున్నప్పటికీ, ప్రతాప్ మాత్రం ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన అనుచరులు ఒక పత్రికలో యాడ్ ఇచ్చారు. ఇందులో ప్రతాప్ను డీసీసీ అధ్యక్షుడిగా పేర్కొన్నారు. ఇది తాజా వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. కొత్తగా నియమించిన డీసీసీ అధ్యక్షులందరినీ ఇన్చార్జిలుగానే సంబోధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని, దీంతో తాను తాత్కాలికమేనని కార్యకర్తల్లో గందరగోళం సృష్టించడం సరికాదని మల్లేశ్ స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పత్రికలో ప్రతాప్ పేరిట వచ్చిన ప్రకటనను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. పార్టీ వ్యవహారాల్లో సహకరించకుండా వివాదాస్పద ప్రకటనలు చేస్తున్నారని బొత్సకు ఫిర్యాదు చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.