Medigadda Project
-
లింగమూర్తి హత్యపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్
హైదరాబాద్/భూపాలపల్లి, సాక్షి: మేడిగడ్డ కుంగుబాటు వ్యవహారంపై కేసు వేసిన నాగవెల్లి రాజ లింగమూర్తి(Nagevelli Raja Lingamurthy) దారుణ హత్యకు గురికావడాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా భావిస్తోంది. రాజకీయ ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలోఈ కేసు విచారణను సీబీసీఐడీకి అప్పగించాలని నిర్ణయించింది. మధ్యాహ్నాం మంత్రి కోమటిరెడ్డి ఈ కేసుపై మీడియాతో మాట్లాడతారని సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని లింగమూర్తి కేసు వేశారు. అయితే.. రాజలింగమూర్తి బుధవారం సాయంత్రం దారుణ హత్యకు గురయ్యారు. ముసుగులో వచ్చిన కొందరు ఆయనపై కత్తులు, గొడళ్లతో దాడి చేశారు. స్థానికులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బీఆర్ఎస్ హస్తం ఉందంటూ..తన భర్త హత్య వెనుక బీఆర్ఎస్ హస్తం ఉందని సరళ ఆరోపిస్తున్నారు. తన భర్త హత్యకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ సర్పంచి బుర్ర చంద్రయ్య, వార్డు మాజీ కౌన్సిలర్ కొత్త హరిబాబు కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కుటుంబ సభ్యులతో కలిసి పట్టణంలోని అంబేడ్కర్ కూడలిలో జాతీయ రహదారిపై బుధవారం రాత్రి బైఠాయించారు. ఇక.. మేడిగడ్డ అవినీతి వ్యవహారంపై పోరాటం చేస్తున్నందుకే ఆయన్ని హత్య చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. చట్ట ప్రకారం విచారణ జరపాలని, నేరస్తులు ఎవరైనా వదిలిపెట్టొద్దని, స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పోలీసులను కోరారు. హత్యా రాజకీయాలు ఏమాత్రం మంచివి కావని అంటున్నారాయన. కుటుంబ సభ్యుల అనుమానాలు, రాజకీయ ఆరోపణల నేపథ్యంలో తాజాగా.. లింగమూర్తి(Lingamurthy) కేసును ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించాలనుకుంటోంది.పోలీసుల అదుపులో నిందితులు? రాజా లింగమూర్తి హత్య కేసులో నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. భూ వివాదాల నేపథ్యంలో లింగమూర్తి స్నేహితుడే ఈ హత్యకు ప్లాన్ వేశాడని పోలీసులు ప్రాథమికంగా ఓ అంచనాకి వచ్చారు. సంజీవ్, హరిబాబు, కొమురయ్య, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో జిల్లా ఎస్పీ ఈ కేసు గురించి మీడియాకు వివరించే అవకాశం ఉంది.బీఆర్ఎస్తో అనుబంధం నుంచి..రాజా లింగమూర్తికి గతంలో బీఆర్ఎస్తో మంచి అనుబంధం ఉంది. ఆయన భార్య మాజీ కౌన్సిలర్ నాగవెల్లి సరళ. ఆమె 2019లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భూపాలపల్లి లోని 15వ వార్డు నుంచి బీఆర్ఎస్ తరఫున కౌన్సిలర్గా గెలుపొందారు. అయితే కొద్ది నెలల తర్వాత నాగవెళ్లి సరళను పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ జంట కొన్ని నెలలుగా పట్టణంలోని రెడ్డి కాలనీలో నివాసం ఉంటోంది. మంకీ క్యాపులతో వచ్చి..బుధవారం తన స్వస్థలం జంగేడు శివారు ఫక్కీర్గడ్డలోని తన బంధువుల ఇంటికి వెళ్లి పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్దకు వచ్చాడు. అక్కడ టీ తాగి రెడ్డి ఇంటికి బయల్దేరారు. కాలనీలోని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఎదురుగా రోడ్డును దాటుతున్న క్రమంలో.. ఆటోలో మంకీ క్యాపులతో వచ్చిన కొందరు దాడికి దిగారు. మొఖం, పొట్ట భాగంలో కత్తులతో విచక్షణారహితంగా పొడవడంతో పేగులు బయటపడి ఆయన కుప్పకూలిపోయారు. అయితే.. జిల్లాకేంద్రంలోని ఓ భూ వివాదంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు చెబుతుండగా.. లింగమూర్తి కుటుంబ సభ్యుల వాదన మాత్రం మరోలా ఉంది. లింగమూర్తిపైనా పలు కేసులురాజలింగమూర్తి రెండు దశాబ్దాలుగా వరంగల్కు చెందిన ఓ ప్రముఖ న్యాయవాది ద్వారా భూ సమస్యలను పరిష్కరించేవారు. గతంలో రాజలింగమూర్తిపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఓపెన్కాస్ట్ గనుల తవ్వకాలతో పర్యావరణం దెబ్బతింటోందని సింగరేణిపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్లో ఆయన ఫిర్యాదు చేశారు కూడా. ఈ వివాదాల నేపథ్యంలోనే ఆయన హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
మేడిగడ్డ నిర్ణయం కేసీఆర్దే!
సాక్షి, హైదరాబాద్: తుమ్మిడిహెట్టికి బదులు మేడిగడ్డ బరాజ్ నిర్మించాలన్న ఆలోచన నాటి సీఎం కేసీఆర్దేనని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారుడు వెదిరె శ్రీరామ్ స్పష్టం చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) లేఖ ఇవ్వడం, మహారాష్ట్రతో ముంపుపై వివా దం ఏర్పడడంతోనే మేడిగడ్డకు మార్చామని కేసీఆర్ ప్రభుత్వం చేసిన వాదన పూర్తిగా అబద్ధమని కొట్టిపారేశారు.తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల నీటిలభ్యత ఉందని సీడబ్ల్యూసీ ఎన్నో లేఖలు రాసిందని, సంప్రదింపులతో మహారాష్ట్రతో ముంపు సమస్యను పరిష్కారానికి అవకాశం ఉండేదన్నారు. రాజకీయ, ‘ఇతర’కారణాలతోనే మేడిగడ్డ బరాజ్ నిర్మించారని ఆరోపించారు. కాళేశ్వరం బరాజ్ల నిర్మాణంపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ శుక్రవారం నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్కు వెదిరె శ్రీరామ్ హాజరై సమాధానాలిచ్చారు. వ్యక్తిగత హోదాలోనే సాక్ష్యం... వ్యక్తిగత హోదాలోనే కమిషన్ ముందు సాక్షిగా హాజరైనట్టు వెదిరే శ్రీరామ్ స్పష్టత ఇచ్చారు. కాళేశ్వ రం ప్రాజెక్టుకు అనుమతుల కోరుతూ సీడబ్ల్యూసీకి నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్(సీడీఓ) సీఈ రాసిన లేఖను సాక్ష్యంగా ఆయన గతంలో కమిషన్కు సమరి్పంచగా, ఆ లేఖలో వ్యత్యాసాలున్నట్టు కమిషన్ ఎత్తిచూపింది. ఈ లేఖను తాను సీడబ్ల్యూసీ నుంచే స్వీకరించానని, సీడీఓ సీఈ లేఖను మార్చి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. అధికారికంగా తీసుకోనందున వాటిని సాక్ష్యంగా పరిగణించబోమని కమిషన్ తేల్చి చెప్పింది. అన్నారం, సుందిళ్ల కుంగిపోవచ్చు.. మేడిగడ్డ బరాజ్ తరహాలో అన్నారం, సుందిళ్ల బరాజ్లూ కుంగిపోవచ్చని వెదిరె శ్రీరామ్ అన్నారు. బరాజ్ల వైఫల్యానికి కారణాలేమిటని కమిషన్ ప్రశ్నించగా, సరైన ఇన్వెస్టిగేషన్లు జరపకుండానే డిజైన్ల రూపకల్పన, డిజైన్లు, మాడల్ స్టడీస్కు విరుద్ధంగా నిర్మాణం, నిర్వహణ జరగడమేనన్నారు. ప్లాన్ తయారీకి ముందే పనులు ప్రారంభించారా అని కమిషన్ అడగ్గా, అవునని బదులిచ్చారు. 2016 ఏప్రిల్/మేలో బరాజ్లు నిర్మించాలని నిర్ణయించి 2019లోగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం అత్యాశే అన్నారు.డీపీఆర్ తయారీకి ఏడాది అవసరం కాగా, 4 నెలల్లోనే పూర్తి చేయాలని వ్యాప్కోస్ను కోరారన్నారు. డీపీఆర్కు ఆమోదం లభించకముందే టెండర్లు పిలిచి పనులు అప్పగించారని, నాటికి ఇంకా డిజైన్లు సైతం సిద్ధం కాలేదన్నారు. అన్నారం, సుందిళ్ల బరాజ్ల స్థలాలను మార్చడంతో అప్పటికే నిర్వహించిన ఇన్వెస్టిగేషన్లు వృథా అయ్యాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ ఆమోదించిందా అని కమిషన్ అడగగా, లేదని బదులిచ్చారు. తొందరపాటుతో క్షేత్రస్థాయిలోని ఈఈ నుంచి ఈఎన్సీ వరకు అందరూ తప్పిదాలు చేశారన్నారు. నిర్వహణ విభాగం ఈఎన్సీ జాప్యం చేశారు బరాజ్లలో సీపేజీతో నీరు లీకైనప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) సలహా కోరడంలో నిర్వహణ విభాగం ఈఎన్సీ(నాగేంద్రరావు) జాప్యం చేయడంతో నష్టం తీవ్రత పెరిగిందా అని కమిషన్ ప్రశ్నించగా, అవునని వెదిరె బదులిచ్చారు. బరాజ్ కుంగే వరకు ఎన్డీఎస్ఏకు సమాచారం లేదని, కుంగిన 5 రోజులకు ఎన్డీఎస్ఏ బృందం పరిశీలనకు వచ్చిందన్నారు. ఎన్డీఎస్ఏ 20 రకాల సమాచారం కోరితే సకాలంలో ఆ ఈఎన్సీ ఇవ్వలేదని, దీంతో బరాజ్ల వైఫల్యానికి కారణాలను గుర్తించడం ఎన్డీఎస్ఏకి క్లిష్టంగా మారిందన్నారు. మళ్లీ గడువు పొడిగించలేం ..కోదండరామ్కు కమిషన్ స్పష్టీకరణ మీరు సమరి్పంచిన పత్రాలకు ఆధారాలు ఏమిటని టీజేఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరామ్ను కమిషన్ ప్రశ్నించగా, మరిన్ని ఆధారాలు సమర్పించేందుకు రెండు రోజుల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఓసారి గడువు పొడిగించి మీకు అవకాశం ఇచ్చామని, మళ్లీ పొడిగించడం సాధ్యం కాదని కమిషన్ స్పష్టం చేసింది. అఫిడవిట్పై చేసిన సంతకం మీదేనా? అని కమిషన్ ప్రశ్నించగా, అవునని కోదండరామ్ ధ్రువీకరించారు. గతంలో నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేసిన వికాస్రాజ్ కమిషన్ ముందు హాజరై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తన పాత్ర ఏమిలేదని తెలపడంతో ఆయనకు కమిషన్ ఎలాంటి ప్రశ్నలు వేయలేదు. -
‘మేడిగడ్డ’పై తుది నివేదిక ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల శాశ్వత పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేస్తూ తుది నివేదికను వెంటనే అందించాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ)కి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మరోసారి విజ్ఞప్తి చేయనున్నారు. ఈ నెల 11న ఢిల్లీకి వెళ్లనున్న ఆయన... ఎన్డీఎస్ఏ చైర్మన్ అనీల్ జైన్, ఇతర అధికారులతో భేటీ కానున్నారు. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ గతంలో అందించిన మధ్యంతర నివేదికలో చేసిన సిఫారసుల ఆధారంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బరాజ్లకు తాత్కాలిక మరమ్మతులు నిర్వహించింది.అయితే ప్రభుత్వం వివిధ సాంకేతిక పరీక్షలు నిర్వహించి తమకు నివేదికలు సమర్పించాకే తుది నివేదిక ఇస్తామని ఎన్డీఎస్ఏ గతంలో స్పష్టం చేసింది. శాశ్వత పునరుద్ధరణ పనులు నిర్వహించే వరకు నీళ్లను నిల్వ చేయరాదని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ కోరడంతో ప్రస్తుతానికి మూడు బరాజ్లు ఉపయోగంలోకి లేవు. మరోవైపు వర్షాలతో గోదావరిలో వరద ఉధృతి పెరగడం వల్ల కొన్ని పరీక్షలను మాత్రమే నీటిపారుదల శాఖ పూర్తి చేయగలిగింది. వాటికి సంబంధించిన నివేదికలను అధికారులు ఢిల్లీకి వెళ్లి ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీకి అందజేశారు.సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ మేడిగడ్డ బరాజ్ కు పరీక్షలు నిర్వహించి అందించిన నివేదికను సైతం ఎన్డీఎస్ఏకు ఇటీవల అప్పగించారు. శాశ్వత పునరుద్ధరణ చర్యలపై తుది నివేదికను అందజేయాలని రాష్ట్ర అధికారులు కోరగా, మిగిలిన పరీక్షలను సైతం పూర్తి చేసి నివేదికలు సమరి్పస్తేనే తుది నివేదిక ఇస్తామని ఎన్డీఎస్ఏ అధికారులు తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల విజ్ఞప్తుల కు ఎన్డీఎస్ఏ యంత్రాంగం స్పందించకపోవడంతో స్వయంగా ఢిల్లీ వెళ్లాలని మంత్రి ఉత్తమ్ నిర్ణయించారు. మంగళవారం సచివాలయంలో ఆయన నీటిపారుదల శాఖ ఈఎన్సీలు అనిల్కుమార్, నాగేంద్రరావు, హరిరామ్లతో సమావేశమయ్యారు. మేడిగడ్డకు ప్రత్యామ్నాయాలు.. గోదావరికి ఉపనది అయిన వార్దాపై బరాజ్తోపాటు ప్రాణహితపై తమ్మిడిహట్టికి దిగువన రబ్బర్ డ్యామ్ కట్టాలన్న ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ రెండింటి నీళ్లను గ్రావిటీ ద్వారా సుందిళ్ల బరాజ్కు తరలించి అక్కడి నుంచి ఎల్లంపల్లి బరాజ్లోకి పంపింగ్ చేయాలని యోచిస్తోంది. మేడిగడ్డ బరాజ్కు ప్రత్యామ్నాయంగా ఈ రెండు బరాజ్లు ఉపయోగపడనున్నాయి. మేడిగడ్డకు వెంటనే శాశ్వత మరమ్మతులు సాధ్యం కాకుంటే ప్రత్యామ్నాయాలుగా వాటిని నిర్మించే అంశంపై ఎన్డీఎస్ఏతో సమావేశం అనంతరం ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. మూసీ కాల్వలకు సత్వర అనుమతులు.. నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన బునాదిగాని కాలువ, ధర్మారెడ్డి కాలువ, పిల్లాయిపల్లి కాలువ పనులకు పరిపాలనా అనుమతులు పొందాలని అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, డిండి, దేవాదుల తదితర ఎత్తిపోతల పథకాల పెండింగ్ భూసేకరణను వేగంగా పూర్తి చేయాలన్నారు. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) పరిధిలోని సాంకేతిక సలహా మండలి పరిశీలనలో ఉన్న సీతమ్మసాగర్ ప్రాజెక్టు డీపీఆర్కు వెంటనే ఆమోదం లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమ్మక్కసాగర్ బరాజ్ నిర్మాణం విషయంలో ఛత్తీస్గఢ్తో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకొని ఎన్ఓసీ పొందడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.త్వరగా ఇంజనీర్లకు పదోన్నతులునీటిపారుదల శాఖలో ఇంజనీర్ల పదోన్నతులపై మంత్రి ఉత్తమ్ అధికారులతో చర్చించారు. పదోన్నతులపై హైకోర్టులో కేసు సోమవారం కొలిక్కి వచ్చే అవకాశముందని అధికారులు ఆయనకు వివరించారు. ఆ వెంటనే ఇంజనీర్లకు పదోన్నతులు జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోయాలి
గజ్వేల్: మేడిగడ్డ వద్ద ప్రస్తుతం 40 వేల క్యుసెక్కుల నీరు ప్రవహిస్తోందని, ప్రభుత్వం పంతాలను మానుకొని నీటిని ఎత్తి పోయాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్లో జరిగిన బోనాల పండుగలో పాల్గొని కౌన్సిలర్ గుంటుకు శిరీష తెచ్చిన బోనమెత్తుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. ఈ సమయంలో రిజర్వాయర్ల ద్వారా సాగు, తాగు అవసరాలకు గోదావరి జలాలను అందించాల్సిన అవసరముందని అన్నారు. మేడిగడ్డలో బ్యారేజీ గేట్లు తెరిచి ఉన్నా కూడా నదిలో ఉన్న ప్రవాహానికి అనుగుణంగా దాదాపుగా నాలుగు పంపులను నడిపి నీటిని ఎత్తిపోసే అవకాశముందని చెప్పారు. మేడిగడ్డ నుంచి సుందిల్ల, అన్నారం, మిడ్మానేరు, అనంతగిరి రిజర్వాయర్ల మీదుగా సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లలో వెంటనే నీటిని నింపాలన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికైనా భేషజాలను మానుకోవాలన్నారు.నిరుద్యోగులను రెచ్చగొడతారా?వారి సమస్యలను పట్టించుకోరా? సీఎంకు హరీశ్ రావు బహిరంగ లేఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగులు వారి న్యాయమైన డిమాండ్లు సాధించుకునేందుకు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియజేస్తుంటే, ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం దారుణమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్ రావు విమర్శించారు. పెద్ద మనసుతో వారి సమస్యలకు పరిష్కారం చూపాల్సింది పోయి, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం ముఖ్యమంత్రి స్థాయికి తగదన్నారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చమని గ్రూప్స్, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు నెత్తీనోరు కొట్టుకుంటుంటే ప్రభుత్వం ఎందుకు పరిష్కారం దిశగా ఆలోచన చేయడం లేదని ప్రశ్నించారు. నిరుద్యోగుల పోరాటం వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయంటూ నిందారోపణలు చేయడం ఆక్షేపణీయమని పేర్కొన్నారు. ఇలా సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం వల్ల అభ్యర్థులు, నిరుద్యోగుల సమస్యకు పరిష్కారం లభించదని, నిరాహార దీక్షలు చేస్తున్న వారెవరు కూడా పరీక్షలు రాయడం లేదని అపహాస్యం చేయడం వల్ల వారు శాంతించరని హరీశ్ అభిప్రాయపడ్డారు. కంచెలు, ఆంక్షలు విధించి నిరుద్యోగుల గొంతులను నొక్కాలనుకున్న మీ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ రేవంత్రెడ్డికి రాసిన లేఖలో హరీశ్ స్పష్టం చేశారు. నిరుద్యోగుల జీవితాలను దృష్టిలో ఉంచుకొని సానుకూల దృక్పథంతో చర్చలకు ఆహా్వనించాలని కోరారు. నాడు వైఎస్ చేసినట్టుగా చేయండి.. హరీశ్ ఏడు ప్రధాన డిమాండ్లను ఆ లేఖలో ప్రస్తావించారు. గ్రూప్1లో 1:100 నిష్పత్తితో అభ్యర్థులను అనుమతించాలని, గతంలో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్–1 మెయిన్స్ పరీక్షకి 1:100 నిష్పత్తిలో ఎంపిక చేశారని గుర్తు చేశారు. ఇటీవల ఏపీలో నిర్వహించిన గ్రూప్2 నోటిఫికేషన్ను సవరించి 1:100కు మార్చారని తెలిపారు. గ్రూప్2 ,గ్రూప్ 3 ఉద్యోగాల సంఖ్యను పెంచాలని, 25వేలతో మెగా డీఎస్సీ వేయాలని డిమాండ్ చేశారు. రెండు లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరారు. -
కాళేశ్వరం బ్యారేజీలో అలజడి
-
కాళేశ్వరం పరిశీలించిన శాస్త్రవేత్తలు
-
ప్రమాద సంకేతాల విస్మరణతోనే నష్టమా?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు 2019 వానాకాలం తర్వాత ప్రమాద సంకేతాలు ఇచ్చినా.. నివారణ చర్యలు తీసుకోకపోవడంతోనే నష్టాన్ని పెంచిందా? అని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ నీటి పారుదల శాఖను ప్రశ్నించింది. మూడు బ్యారేజీలను ప్రారంభించిన కొద్దిరోజులకే వాటి దిగువన రక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్లింత్ శ్లాబు, సీసీ బ్లాకులు, టోయ్ వాల్, లాంచింగ్ అప్రాన్ వంటివి ఎందుకు కొట్టుకుపోయాయని నిలదీసింది. ఇటీవల మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించిన అయ్యర్ కమిటీ.. నీటి పారుదలశాఖలోని అన్ని విభాగాలతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించింది. తిరిగి వెళ్లేప్పుడు ఒక ప్రశ్నావళిని అందించి, సీల్డ్ కవర్లో సమాధానాలు అందజేయాలని కోరింది. ప్రమాదం పొంచి ఉంటే ఏం చేశారు? బ్యారేజీలకు ప్రమాదాలు పొంచి ఉన్నట్టు/నష్టాలు జరిగినట్టు గుర్తించిన సమాచారాన్ని వరుస క్రమంలో తెలుపుతూ సమగ్ర నివేదిక సమర్పించాలని అయ్యర్ కమిటీ కోరింది. ‘‘ప్రమాదాలు పొంచి ఉన్నట్టు గుర్తించినప్పుడు తీసుకున్న చర్యలేమిటి? నిర్మాణ సంస్థలకు జారీచేసిన ఆదేశాలేమిటి? తక్షణమే నిర్మాణ సంస్థలు మరమ్మతులు నిర్వహించాయా? వంటి వివరాలు నివేదికలో ఉండాలి. ముందు జాగ్రత్త చర్యలేమైనా తీసుకుని ఉంటే తెలపాలి. తీసుకోకపోతే కారణాలు వెల్లడించాలి. బ్యారేజీలలో ఏదైనా అసాధారణ మార్పును గుర్తించిన సందర్భాల్లో పరికరాల డేటా నమోదు, విశ్లేషణ, అన్వయింపు(డేటా ఇంటర్ప్రిటేషన్), వాటి ఆధారంగా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసే విభాగం ఏదీ? దీనికోసం ఎలాంటి ప్రొటోకాల్స్ను అనుసరిస్తున్నారు?’’ అని ప్రశ్నించింది. జరిగిన తప్పులేమిటి? చేసింది ఎవరు? నీటి పారుదల శాఖలోని వివిధ విభాగాల పనితీరు, సమన్వయా న్ని అర్థం చేసుకోవడానికి శాఖ మౌలిక స్వరూపం వివరాలును అయ్యర్ కమిటీ కోరింది. బ్యారేజీల నిర్మాణంలో జరిగిన లోటుపాట్లకు బాధ్యులను తేల్చడానికి ఈ సమాచారం కీలకమని పే ర్కొంది. శాఖలోని అన్ని విభాగాల ఈఎన్సీల నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి వరకు ఉన్న అధికారుల క్రమాన్ని తెలిపేలా శాఖ ఆర్గనైజేషన్ చార్ట్ను సమరి్పంచాలని కమిటీ కోరింది. ‘‘ఈఎన్సీ (జనరల్), హైడ్రాలజీ అండ్ ఇన్వెస్టిగేషన్, సీడీఓ, ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్, క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్స్పెక్షన్, ఓ అండ్ ఎం, ఇతర విభాగాల బాధ్యతలు, విధులు వివరించండి. బ్యారేజీల నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) చీఫ్ ఇంజనీర్, రామగుండం చీఫ్ ఇంజనీర్, క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్స్పెక్షన్ విభాగం చీఫ్ ఇంజనీర్, ఈఎన్సీ (ఓఅండ్ఎం)లు తమపై అధికారిగా ఎవరికి రిపోర్ట్ చేస్తారు?’’ అని ప్రశ్నించింది. సీడీఓ, క్వాలిటీ సలహాలను పాటించారా? ‘‘సీడీఓ, క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్స్పెక్షన్ విభాగాలు ఇచ్చే సలహాలు/ఆదేశాలకు ప్రాజెక్టుల కన్స్ట్రక్షన్ విభాగం కట్టుబడి ఉంటుందా? బ్యారేజీల గేట్లను ఎత్తే సమయం (ఆపరేషన్ షెడ్యూలింగ్)ను నిర్ణయించడంలో బాధ్యులు ఎవరు? ఈ విషయంలో సీడీఓ/ తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబ్(టీఎస్ఈఆర్ఎల్)ల సలహాను ఏమైనా ఉల్లంఘించారా?’’ అని కమిటీ ప్రశ్నించింది. ప్రాజెక్టు డీపీఆర్ను కేంద్ర జల సంఘాని (సీడబ్ల్యూసీ)కి సమరి్పంచడానికి ముందు దాని రూపకల్పన సీడబ్ల్యూసీ మార్గదర్శకాలకు అనుగుణంగా జరిగేలా పర్యవేక్షణ చేసే విభాగం ఏది? దానికోసం నీటిపారుదల శాఖలో ఎలాంటి ప్రొటోకాల్స్ ఉన్నాయో తెలపాలని కోరింది. బ్యారేజీలు నీటి మళ్లింపు కోసమా? నిల్వ కోసమా? మూడు బ్యారేజీలను నీటి నిల్వ అవసరాలను దృష్టిలో పెట్టుకుని డిజైన్, నిర్మాణం చేశారా? లేక నీటి మళ్లింపు అవసరాలను దృష్టిలో పెట్టుకుని జరిపారా? అని అయ్యర్ కమిటీ ప్రశ్నించింది. బ్యారేజీలను ప్రారంభించిన నాటి నుంచి నిల్వ స్థాయిలను నెలవారీగా తెలియజేసే నివేదికను సమరి్పంచాలని కోరింది. బ్యారేజీలకు తనిఖీలు, మరమ్మతులు, నిర్వహణ పనుల కోసం ఎప్పుడైనా నిల్వలను తగ్గించారా? చేస్తే వివరాలు అందించాలని సూచించింది. బ్యారేజీల నిర్మాణ ప్రారంభం, ముగింపు తేదీలను అందించాలని.. డీపీఆర్ల ప్రకారం బ్యారేజీల విశిష్టతల(సేలియంట్ ఫీచర్స్)ను తెలిపాలని పేర్కొంది. నిర్మాణంలో ఈ విశిష్టతలను పాటించారా? అని ప్రశ్నించింది. బ్యారేజీల నిర్మాణానికి అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సమరి్పంచాలని కోరింది. సీడబ్ల్యూసీ అభ్యంతరాలను పరిష్కరించారా? డీపీఆర్ మదింపు సందర్భంగా సీడబ్ల్యూసీలోని వివిధ డైరెక్టరేట్లు వ్యక్తం చేసిన అభ్యంతరాలు ఏమిటి? సీఎస్ఎంఆర్ఎస్, జీఎస్ఐ, సీజీడబ్ల్యూబీ వంటి ఇతర సంస్థల కామెంట్లు/ అబ్జర్వేషన్లు ఏమిటి? వాటిని తగిన రీతిలో పరిష్కరించారా? అని అయ్యర్ కమిటీ కోరింది. నిర్మాణ దశ డిజైన్లు ఎవరివి? నిర్మాణ దశలో మూడు బ్యారేజీల డిజైన్లు, బ్యారేజీల వివిధ విభాగాల డ్రాయింగ్స్ను రూపొందించింది ఎవరని కమిటీ ప్రశ్నించింది. బ్యారేజీల నిర్మాణానికి ప్రత్యామ్నాయ ప్రాంతాల ఎంపిక కోసం జరిపిన అధ్యయనాలు, ప్రస్తుత ప్రాంతాల ఎంపికను సమర్థించే కారణాలు, బ్యా రేజీల కింద భూగర్భంలో నీటి ప్ర వాహంపై చేసిన అంచనాల వివరాలను ఇవ్వాలని కోరింది. లోపాలు బహిర్గతమైన తర్వాత బ్యారేజీలకు ని ర్వహించిన సబ్సర్ఫేస్ జియోలాజికల్ పరీక్షల నివేదికలు సమరి్పంచాలని సూచించింది. లోపాలు, పునరుద్ధరణ పనులపై మీ అభిప్రాయమేంటి? ‘‘మేడిగడ్డ బ్యారేజీ ర్యాఫ్ట్, పియర్లు కుంగిపోవడానికి కారణాలేమిటి? బ్యారేజీల పునాదుల కింద ఇసుక కొట్టుకుపోయి సీపేజీ జరగడానికి కారణాలేమిటి? వచ్చే వర్షాకాలంలో బ్యారేజీలకు మరింత నష్టం జరగకుండా రక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటో వివరించండి’’ అని నీటి పారుదల శాఖను అయ్యర్ కమిటీ కోరింది. ఈ ప్రశ్నావళి మేరకు తగిన సమాధానాలను సిద్ధం చేస్తున్నట్టు నీటిపారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. -
మేడిగడ్డ పై కీలకమైన నమూనా పరిశీలన కోసం నేడు రాష్ట్రానికి NDSA
-
NDSA కీలక భేటీ
-
నేడు తెలంగాణకు రానున్న NDSA ప్రత్యేక కమిటీ
-
‘కాళేశ్వరం’ బాధ్యులపై చర్యలు షురూ
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ పియర్ల కుంగుబాటుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సమర్పించిన ప్రాథమిక విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు ప్రారంభించామని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎ.సుదర్శన్రెడ్డి హైకోర్టుకు తెలిపారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసిన కమిటీ పూర్తి స్థాయి పరిశీలన చేసి నివేదిక సమర్పించిన తర్వాత మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. పదవీ విరమణ పొందిన సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తితో విచారణ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు. పిల్పై విచారణ: మేడిగడ్డ ఘటనకు కారకులెవరో తేల్చేందుకు గాను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దర్యాప్తునకు ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. కాంగ్రెస్ నేత జి.నిరంజన్ గత నవంబర్లో ఈ పిల్ దాఖలు చేశారు. కాగా ఫైలింగ్ నంబర్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్కుమార్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది టి.నరేందర్రావు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్రెడ్డి, కేంద్రం తరఫున న్యాయవాది ఎల్.ప్రణతిరెడ్డి, సీబీఐ తరఫున స్పెషల్ పీపీ టి.సృజన్కుమార్రెడ్డి హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అవకతవకలు గుర్తించింది మేడిగడ్డ రిజర్వాయర్ కుంగుబాటుపై ప్రభుత్వ దర్యాప్తు ఎంత వరకు వచ్చింది? ఏం చర్యలు తీసుకున్నారు? తదితర వివరాలతో నివేదిక అందజేయాలని గత నెల విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించిన నివేదికను ధర్మాసనానికి ఏజీ అందజేశారు. అనంతరం వాదనలు వినిపించారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కొన్ని అవకతవకలు జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఎన్డీఎస్ఏ అధికారులు గత ఏడాది అక్టోబర్ 24, 25 తేదీల్లో ప్రాజెక్టును సందర్శించి ప్రాథమిక విచారణ జరిపారు. మేడిగడ్డ బ్యారేజీ పియర్ కుంగిపోవడానికి కారణాలను ఎన్డీఎస్ఏ సమర్పించింది. ‘ప్రణాళిక, రూపకల్పన, నాణ్యత, నియంత్రణ, ఆపరేషన్–నిర్వహణకు సంబంధించిన సమస్యలతో పాటు పియర్లు ఏకశిలగా ఉండటంతో కదిలి పగుళ్లు ఏర్పడ్డాయి. ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. కచ్చితమైన కారణాలను గుర్తించడానికి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలి..’అని ప్రాథమికంగా అభిప్రాయపడింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించింది. ఈ విభాగం ప్రాథమిక విచారణ జరిపి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. దీని ఆధారంగా ఈఎన్సీ వెంకటేశ్వర్లును తొలగించాం. ఇతర అధికారులపై కూడా చర్యలు తీసుకుంటాం. అయితే ‘కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్, 1952లోని సెక్షన్ 3(1) ప్రకారం హైకోర్టు/సుప్రీంకోర్టు మాజీ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది’అని వివరించారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను ధర్మాసనం 4 నెలలకు వాయిదా వేసింది. -
సరైన స్టడీస్ లేకుండానే మేడిగడ్డ నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: ‘‘భూగర్భంలో రాతిపొరల నిర్మాణ క్రమాన్ని తెలిపే కీలకమైన ‘జియోలా జికల్’ ప్రొఫైల్ స్టడీ లేకుండానే మేడిగడ్డ బ్యారేజీని నిర్మించారు. అందువల్లే జియోలాజికల్ ప్రొఫైల్తో కూడిన సెక్షనల్ డ్రాయింగ్స్ను ‘నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)కి ఇవ్వలేకపోయాం. అంతేకాదు.. బ్యారేజీ నిర్మాణ సమయంలో థర్డ్ పార్టీ పర్యవేక్షణ, క్వాలిటీ కంట్రోల్ నిర్వహణ జరగలేదు. నిర్మాణం పూర్తయిన తర్వాత ఏటా వర్షాకాలానికి ముందు, తర్వాత బ్యారేజీకి తనిఖీలు నిర్వహించలేదు. అందువల్ల ఈ వివరాలను కూడా ఎన్డీఎస్ ఏకు ఇవ్వలేకపోయాం..’’ అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. ఆయన శనివారం సచివాలయంలో మీడియాతో చిట్చాట్ చేశారు. ఎన్డీఎస్ఏకు కాంగ్రెస్ ప్రభుత్వం సమా చారం ఇవ్వలేదని కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సలహాదారు వెదిరె శ్రీరామ్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. బ్యారేజీ నిర్మాణం పూర్తయిందంటూ కాంట్రాక్టర్కు తప్పుడు మార్గంలో సర్టిఫికెట్లు జారీ చేశారని, వాటి వెనక ఏదో మతలబు ఉందని విజిలెన్స్ నివేదిక ఇచ్చిందని చెప్పారు. బ్యారేజీలోని ప్రతిబ్లాక్ నిర్మాణం పూర్తయినట్టు ధ్రువీకరించే సర్టిఫికెట్లను గత ప్రభుత్వం సిద్ధం చేయలేదని.. అందుకే వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్లను ఎన్డీఎస్ఏకు అందజేయలేదని వివరించారు. ఈ అంశాలన్నింటినీ ఎన్డీఎస్ఏకు రాతపూర్వకంగా కూడా తెలిపామన్నారు. ప్రాజెక్టులో అవకతవకలపై న్యాయ సలహా తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నామని చెప్పారు. అధికారులపైనా క్రిమినల్ కేసులు.. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణాన్ని సబ్ కాంట్రాక్టర్కు అప్పగించినట్టు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదని, దీనిపై లోతైన దర్యాప్తు జరుగుతోందని ఉత్తమ్ తెలిపారు. బాధ్యులైన అధికారులను గుర్తించి, వారి పేర్లతో సహా నివేదిక ఇస్తామని విజిలెన్స్ చెప్పిందని.. ఆ తర్వాత వారిపై క్రిమినల్ కేసులు ఉంటాయని వెల్లడించారు. గత ఏడాది వరదల్లో నీట మునిగి దెబ్బతిన్న కన్నెపల్లి పంపుహౌజ్ పునరుద్ధరణ తమ ప్రభుత్వం వచ్చాక పూర్తయిందని చెప్పారు. ‘‘తుమ్మిడిహట్టి వద్ద 165 టీఎంసీల నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ తేల్చినట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది. కమీషన్ల కోసమే బ్యారేజీ నిర్మాణాన్ని మేడిగడ్డకు మార్చింది. ఇదే విషయాన్ని వెదిరె శ్రీరామ్ కూడా చెప్పారు. ప్రాజెక్టు వ్యయాన్ని ఎంత పెంచితే అంత కమీషన్లు వస్తాయని కుట్రపూరిత ఆలోచనతో గత సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు..’’ అని ఉత్తమ్ పేర్కొన్నారు. మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ నెల రోజుల్లోగా ప్రాథమిక నివేదిక సమర్పించనుందని.. ఆ తర్వాత మరమ్మతులు ప్రారంభిస్తామని చెప్పారు. ఎన్డీఎస్ఏ ప్రక్రియను వేగిరం చేయాలని కోరేందుకు తాను ఆదివారం ఢిల్లీకి వెళ్తున్నానని తెలిపారు. బీఆర్ఎస్ కారు స్క్రాప్కే.. శుక్రవారం మేడిగడ్డ బ్యారేజీ సందర్శన కోసం బీఆర్ఎస్ నేతలతో వెళ్తున్న బస్సు టైర్ పేలిన ఘటనను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘‘బీఆర్ఎస్ కారు టైర్లు బరస్ట్ అయ్యాయి. ఇక తుక్కు కింద పోవాల్సిందే..’’ అని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. మేడిగడ్డ నష్టాన్ని చూశాకైనా బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. కాళేశ్వరంలో కేంద్రం పాపం తక్కువేం కాదు.. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం చేసిన పాపం తక్కువేమీ కాదని ఉత్తమ్ విమర్శించారు. ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ పెట్టుబడి అను మతులు ఇవ్వలేదని వెదిరె శ్రీరామ్ అంటు న్నారని.. మరి ప్రాజెక్టు కోసం రూ.లక్ష కోట్ల రుణాలను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఆర్ఈసీ, పీఎఫ్సీ, బ్యాంకులు ఎలా ఇచ్చా యని నిలదీశారు. దేవాదుల ప్రాజెక్టు డిజైన్లు సరిగ్గా లేవని వెదిరె శ్రీరామ్ అంటున్నారని.. మరి ఆ ప్రాజెక్టుకు కేంద్రం ఏఐబీపీ పథకం కింద రూ.2,500 కోట్లు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. నాగార్జునసాగర్కు మరమ్మతులు చేపడ తామని, ఇందుకు సీఆర్పీఎఫ్ బలగాలను తొల గించాలని కేంద్రాన్ని కోరామని చెప్పారు. -
రాజకీయ భిక్ష పెట్టిన జిల్లాకే అన్యాయం
దేవరకద్ర/జడ్చర్ల/కొందుర్గు: పాలమూరు– రంగారెడ్డి పథకాన్ని ఎండబెట్టారని, మేడిగడ్డను బొందపెట్టారని ఏఐసీసీ నేత వంశీచంద్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన చలో పాలమూరు– రంగారెడ్డి రిజర్వాయర్ల సందర్శన చేపట్టారు. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి భూత్పూర్ మండలం కర్వెన, జడ్చర్ల మండలం ఉద్ధండాపూర్ రిజర్వాయర్లను సందర్శించారు. రంగారెడ్డి జిల్లా జిల్లేడ్ చౌదరిగూడ మండలం లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని కూడా ఈ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా వంశీచంద్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు వాస్తవ రూపం ప్రజలకు తెలియాలని ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. 2015 లో శిలాఫలకం వేసిన పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును కుర్చీ వేసుకుని కూర్చొని మూడేళ్లలో పూర్తి చేస్తానని గొప్పలు చెప్పిన కేసీఆర్.. రెండుసార్లు అధికారంలోకి వచ్చి నా ఒక్క ఎకరాకు నీరివ్వలేదని వంశీచంద్రెడ్డి విమర్శించారు. పాల మూరు జిల్లా ఎడారిగా మారుతున్నా పట్టించుకోలేదని, 2009లో ఎంపీగా గెలిపించి రాజకీయంగా భిక్ష పెట్టిన జిల్లాకే తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ప్రజలను మోసం చేయడానికి ఒక పంపును నామమాత్రంగా ప్రారంభించి పూర్తి చేశామని గొప్పలు చెప్పారని విమర్శించారు. కర్వెన రిజర్వాయర్ ఇప్పటికీ అసంపూర్తి పనులతో అస్తవ్యస్తంగా ఉందన్నారు. ప్రపంచంలోనే ఎనిమిదో వింతగా అభివర్ణించిన కాళేశ్వరంను బొంద పెట్టారన్నారు. కమీషన్ల కక్కుర్తితో మేడిగడ్డ పగుళ్లతో కుంగిపోవడానికి కారణం అయ్యారని ఆరోపించారు. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులకు పిచ్చి పట్టిందని.. ఎర్రగడ్డకు వెళ్లాల్సిన నాయకులు, మేడిగడ్డకు వెళ్లారని ఎద్దేవా చేశారు. బృందంలో ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు జి.మధుసూదన్రెడ్డి, పరి్ణకారెడ్డి, అనిరుధ్రెడ్డి, వాకిటి శ్రీహరి, ఈర్లపల్లి శంకర్, యెన్నం శ్రీనివాస్రెడ్డి తదితరులున్నారు. -
కాళేశ్వరం ప్రాజెక్టు తనిఖీకి కేంద్ర బృందం ఏర్పాటు
సాక్షి, ఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టు తనిఖీకి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. సెంట్రల్ వాటర్ కమిషన్ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేసింది. మేడిగడ్డ ప్రాజెక్టును తనిఖీ చేసి నాలుగు నెలల్లో నివేదిక అందజేయాలంటూ కేంద్ర జలశక్తి ఆదేశాలు జారీ చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను తనిఖీ చేసి, సమస్యలకు పరిష్కార మార్గాలు వెతకాలని కేంద్రం ఆదేశించింది. మరోవైపు, వచ్చే వానాకాలంలో గోదావరికి వచ్చే వరదలతో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు మరింత నష్టం వాటిల్లకుండా పరిరక్షించడంపై రాష్ట్ర నీటిపారుదల శాఖ దృష్టిసారించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ చట్టం కింద ఏర్పాటైన ‘డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్’మంగళవారం రెండు బ్యారేజీలను సందర్శించింది. నీటిపారుదల శాఖ ఈఎన్సీ(అడ్మిన్) అనిల్ కుమార్ నేతృత్వంలో డిజైన్ ఎక్స్పర్ట్ టి.రాజశేఖర్, సీఈ సీడీఓ, స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్డీఎస్ఓ) ఇంజనీర్ల బృందం రెండు బ్యారేజీలను పరిశీలించిన అనంతరం సత్వరంగా తీసుకోవాల్సి న నష్టనివారణ చర్యలపై చర్చించింది. గోదావరిలో మళ్లీ 20 లక్షల క్యూసెక్కులకు పైగా వరద పోటెత్తితే మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందనే అనుమానాలు ఉండటంతో ఈ బృందం అక్కడ పర్యటించింది. నష్టనివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవ కాశం ఉంది. అన్నారం బ్యారేజీకి శాశ్వత మరమ్మతులు నిర్వహించిన తర్వాతే నీళ్లు నింపాలని గతంలోనే ఎన్డీఎస్ఏ సూచించింది. మరమ్మతులు జరిగే వరకు బ్యారేజీలో నీళ్లు నిల్వ చేసే అవకాశం లేదు. -
మేడిగడ్డ వద్ద.. హరీష్రావు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, కాళేశ్వరం: రాజకీయ ప్రయోజనాలకే కాంగ్రెస్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. అన్నారం బ్యారేజీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ను పడగొట్టాలంటే కాళేశ్వరం పడగొడితే సరిపోతుందని.. సీఎం రేవంత్ ఆలోచనలా కనిపిస్తుందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అసలు కేసీఆర్నే లేకుండా చేయాలని రేవంత్ కుట్ర చేస్తున్నాడు. కేసీఆర్ను ఆనవాళ్లు లేకుండా చేస్తామంటున్నారు. గతంలో ప్రగతి భవన్ను బాంబులతో పేలుస్తామంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను హరీష్రావు గుర్తు చేశారు. ‘‘మేడిగడ్డ వెళ్తాం అనగానే కాగ్ రిపోర్ట్.. పాలమూరు విజిట్ అంటూ వెళ్ళారు కాంగ్రెస్ నాయకులు. మేము ఈ పర్యటనకు రాగానే ఉత్తమ్ మీడియా సమావేశం పెట్టి మేడిగడ్డ రిపేర్ చేయిస్తాం అని చెప్పారు. అంటే పాక్షికంగా మనం విజయం సాధించాం. ఇన్ని రోజులు బీఆర్ఎస్పై కుట్రలు చేసింది కాంగ్రెస్. రైతుల పక్షాన పని చేయాలని లేదు. ఎంత సేపు మా మీద ఆరోపణలే ఎక్కువ. అసత్య ప్రచారం చేస్తూ పబ్బం గడుపుతోంది’’ అంటూ హరీష్ ధ్వజమెత్తారు. మెగా ప్రాజెక్ట్ కట్టినప్పుడు చిన్న, చిన్న లోపాలు రావటం సహజం. మొత్తం కాళేశ్వరం కూలిపోయింది అని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. అన్నారంలో ఉన్న ఇబ్బందులు వెంటనే మరమ్మతులు చేయాలి. వీటితో వచ్చే ఎండాకాలంలో నీరు అందించవచ్చు. కాపర్ డ్యాం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అబద్ధాలు బాగా నేర్చుకున్నాడు. తమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేవని కేంద్రం సీడబ్ల్యూసీ చెప్పింది. అక్కడ ప్రాజెక్ట్ కట్టాలని ఇప్పుడు చెప్తున్నాడు. ఉత్తమ్.. రేవంత్ రెడ్డిలాగా అబద్ధాలు మాట్లాడకు’’ అంటూ హరీష్రావు హితవు పలికారు. కాగా, మేడిగడ్డ దగ్గర ఉద్రికత్త నెలకొంది. మేడిగడ్డకు చేరుకున్న బీఆర్ఎస్ నేతలు.. మెయిన్ గేట్ తోసుకుని వెళ్లారు. అసలు నిజాలను ప్రజల ముందు పెడతామని కేటీఆర్ అంటున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రతినిధులు సహా సుమారు 200 మంది ప్రతినిధి బృందంతో బ్యారేజీని సందర్శించారు. తొలిసారి కేటీఆర్ రాక.. 2016 మే 2న కాళేశ్వరం ప్రాజెక్టుకు అప్పటి సీఎం కేసీఆర్ భూమిపూజ చేసి పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి మంత్రి హరీశ్రావు పదుల సార్లు వచ్చి పనులను పరిశీలించారు. కానీ కేటీఆర్ రాలేదు. ప్రస్తుతం బ్యారేజీపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో తొలిసారిగా కేటీఆర్ బ్యారేజీ వద్దకు వచ్చారు. -
నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం
-
బీఆర్ఎస్ ‘చలో మేడిగడ్డ’
సాక్షి, హైదరాబాద్: ‘మేడిగడ్డ బ్యారేజీలో రెండు మూడు పిల్లర్లకు పగుళ్లు వస్తే కాంగ్రెస్ ప్రభు త్వం మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును కూల్చే కుట్ర చేస్తోంది. మేడిగడ్డపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను ఎండగట్టడంతోపాటు కాళేశ్వరం ద్వారా అందుతున్న ఫలాలను ప్రజలకు వివరిస్తాం. దీని కోసం మార్చి 1న ‘చలో మేడిగడ్డ’కార్యక్రమం చేపడుతున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతోపాటు మాజీ మంత్రులు, ఇతర ముఖ్య నేత లు తెలంగాణ భవన్ నుంచి శుక్రవారం ఉదయం 8.30 గంటలకు బయలుదేరి వెళ్తాం’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చెప్పారు. మాజీ మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్గౌడ్, సత్యవతి రాథోడ్ తదితరులతో కలిసి కేటీఆర్ మంగళవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. దశలవారీగా కాళేశ్వరంలోని ప్రతీ రిజర్వాయర్ను సందర్శించడంతోపాటు కాంగ్రెస్ మంత్రులు తమ వెంట వస్తే వారినీ తీసుకెళ్తామని చెప్పారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు కేటీఆర్ మాటల్లోనే... రైతాంగంపై కక్షపూరిత వైఖరి మానుకోండి మరమ్మతులు చేపట్టకుండా వచ్చే వర్షాకాలంలో కాళేశ్వరంలో అంతర్భాగమైన మూడు బ్యారేజీలు వరదలో కొట్టుకుపోయేలా కాంగ్రెస్ కుట్రలు చేస్తోంది. నేరపూరిత మనస్తత్వంతోనే బ్యారేజీలకు మరమ్మతు చేయకుండా రోజూ వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతోంది. గతంలోనూ కాంగ్రెస్ హయాంలో కడెం, గుండ్లవాగు, మూసీ, సింగూరు, పులిచింతల సహా అనే ప్రాజెక్టుల్లో సమస్యలు వచ్చాయి. బ్యారేజీల మరమ్మతుకు ఇంజనీరింగ్ పరిష్కారాలు ఉన్నా యి. రాజకీయ లబ్ధి మానుకుని రైతు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కాఫర్డ్యాంను నిర్మించి మేడిగడ్డలో దెబ్బతిన్న మూడు పిల్లర్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి. వచ్చే వేసవిలో సాగునీరే కాదు.. మంచినీళ్లు కూడా ఇవ్వలేమని అధికారులు చెబుతున్నారు. బీఆర్ఎస్పై దు్రష్పచారం చేసినా రైతుల జీవితాలను దెబ్బతీసి పొలాలను ఎండబెట్టకండి. కాళేశ్వరం అంటే మేడిగడ్డ మాత్రమే కాదు కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మేడిగడ్డ మాత్రమే కాదని మూడు బ్యారేజీలు, అనేక రిజర్వాయర్లు, పంప్హౌస్లు, సొరంగాలు, కాలువల సమాహారం. 40 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే కామధేనువు కాళేశ్వరం వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు అన్ని ప్రాజెక్టులు, రిజర్వాయర్లను సందర్శిస్తాం. తెలంగాణకు ఉన్న భౌగోళిక పరిస్థితుల్లో ఎత్తిపోతల పథకాల ద్వారానే నీరు అందించడం సాధ్యం. కాస్ట్ బెనిఫిట్ అనాలసిస్ అంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్న మేధావులు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. బాసర నుంచి భద్రాచలం దాకా గోదావరి జలాల కోసం 60 ఏళ్ల పాటు పోరాటాలు జరిగినా తెలంగాణకు నీళ్లకు బదులుగా కన్నీళ్లు మిగిల్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. నీళ్ల గోసను గద్దర్, సదాశివుడు వంటి కవులు వివరిస్తే, జలసాధన ఉద్యమాల ద్వారా కేసీఆర్ పల్లెలను జాగృతం చేశారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కాంగ్రెస్ జలయజ్ఞం పేరిట ధనయజ్ఞం చేసి తుమ్మిడిహెట్టి వద్ద తట్టెడు మట్టి కూడా తీయలేదు. గోదావరి జలాలను తెలంగాణ పొలాలకు మళ్లించే సంకల్పంతోనే సీడబ్ల్యూసీ, నిపుణుల సూచనతో మహారాష్ట్రతో సంప్రదించి కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారు. కాగ్ నివేదిక పవిత్ర గ్రంథం కాదు కాగ్ రిపోర్టును నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, సీఎం కిరణ్కుమార్ రెడ్డి సహా అనేక మంది తప్పుపట్టి అదేమీ పవిత్ర గ్రంథం కాదని తేల్చారు. గతంలో జలయజ్ఞం సహా కల్వకుర్తి ప్రాజెక్టులో రూ.900 కోట్ల గురించి కాగ్ ప్రస్తావించింది. కాగ్ నివేదికపై ద్వంద్వ వాదన వినిపిస్తున్న కాంగ్రెస్ సమాధానాలు చెప్పాలి. గతంలో జలయజ్ఞంలో రూ.52 వేల కోట్ల అవినీతి జరిగిందని కాగ్ ఎత్తి చూపింది. అప్పుల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ ప్రస్తుతం కొత్తగా అప్పులు తేవొద్దు. -
దోపిడీకి కాళేశ్వరం బలి
మేడిగడ్డ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కాళేశ్వరం ప్రాజెక్టును రూ.94 వేల కోట్లు ఖర్చుపెట్టి నిర్మిస్తే.. 98వేల ఎకరాల కొత్త ఆయకట్టు మాత్రమే వచ్చిందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. డిజైన్, నిర్మాణ, నిర్వహణ లోపాలతో నిర్మించిన మూడేళ్లలోనే మేడిగడ్డ బ్యారేజీ కొట్టుకుపోయే స్థితికి చేరిందని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్లో దెబ్బతిన్న పియర్లను మంగళవారం సాయంత్రం రేవంత్తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేల బృందం పరిశీలించింది. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, బ్యారేజీ కుంగిన తీరు, ఇతర అంశాలపై ఇన్చార్జి చీఫ్ ఇంజనీర్ సుధాకర్రెడ్డి, విజిలెన్స్ డీజీ రాజీవ్రతన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తర్వాత రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘రూ.94వేల కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్ష ఎకరాలకు కూడా నీరివ్వకపోయినా.. కోటి ఎకరాలకు నీళ్లిచ్చినట్టు కేసీఆర్ గొప్పలు చెప్పుకున్నారు. రూ.36 వేలకోట్లతో 16 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా వైఎస్సార్ ప్రభుత్వం ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును కాదని.. రీడిజైన్ పేరుతో అవినీతి కోసం లక్ష కోట్ల ప్రాజెక్టును నిర్మించారు. 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ పియర్లు కుంగిపోతే.. సరిచేసే ప్రయత్నం చేయకుండా నిర్లక్ష్యం వ్యవహరించారు. పోలీస్ పహారాతో ఎవరినీ ప్రాజెక్టు వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అ అంశంపై మేం అసెంబ్లీలో చర్చ పెడితే.. కేసీఆర్ వేల కోట్ల దోపిడీపై చర్చ జరగకుండా ఉండాలనే నల్లగొండలో సభ పెట్టుకున్నారు. ప్రజల ముందు బండారమంతా బయటపడుతోందనే కాంగ్రెస్ సర్కారుపై ఎదురుదాడికి దిగారు. నల్లగొండ దూరమా?.. అసెంబ్లీ దూరమా? చావు నోట్లో తలకాయ పెట్టానంటూ కేసీఆర్ కోటి ఒకటవసారి అబద్ధం చెప్పారు. ఆ మాట నమ్మి ప్రజలు రెండుసార్లు సీఎంగా అవకాశమిస్తే.. భారీగా దోచుకున్నారు. కేసీఆర్ ప్రజల కోసం ఏనాడూ ఏమీ చేయలేదు. ఓడిపోయి సీఎం కుర్చీ పోయింది కాబట్టే మరోసారి ప్రజలు గుర్తుకొచ్చారు. కేసీఆర్ సత్యహరిశ్చంద్రుడే అయితే శాసనసభకు ఎందుకు రాలేదు? మీరు చేసిన నిర్వాకాన్ని సభలో ఆధారాలతో సహా బయటపెట్టాం. మేడిగడ్డ సందర్శనకు రావాలని మా మంత్రి ఉత్తమ్ మీకు లేఖ రాశారు. తేదీపై అభ్యంతరం ఉంటే.. మీరు చెప్పిన తేదీనే వెళదామని చెప్పాం. కాలు విరిగిందని అసెంబ్లీకి రాని కేసీఆర్.. నల్లగొండ సభకు ఎలా వెళ్లారు? నల్లగొండ దూరమా? అసెంబ్లీ దూరమా? మేడిగడ్డ బ్యారేజీని రూ.1,800 కోట్ల అంచనాతో డిజైన్ చేసి.. తర్వాత రూ.4 వేల కోట్లకు పెంచారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏటా విద్యుత్ బిల్లులే రూ.10,500 కోట్లు వస్తున్నాయి. ప్రాజెక్టు రుణాలు, ఇతర ఖర్చులు కలిపి ఏటా రూ.25వేల కోట్లు అవసరమవుతాయి. నాలుగైదు పిల్లర్లు కుంగితే ఏమిటని చులకన చేస్తారా? మేడిగడ్డ పిల్లర్లు కుంగడం కాదు.. ప్రాజెక్టు మనుగడే ప్రమాదంలో ఉంది. డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలో మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులకు కూడా ముప్పు ఉందని తేల్చింది. విజిలెన్స్ నివేదిక కూడా అదే చెప్పింది. కానీ కేసీఆర్ రూ.94 వేలకోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టులో నాలుగైదు పిల్లర్లు కుంగితే రాద్ధాంతం చేస్తున్నారంటూ చులకనగా మాట్లాడుతున్నారు. కుంగినది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు.. çతెలంగాణ ప్రజల నమ్మకం. ప్రజల సొమ్ము అంటే అంత చులకనా? మీ లక్ష కోట్ల దోపిడీకి కాళేశ్వరం బలైపోయింది. మేడిగడ్డ ఇష్యూను చులకన చేసి మాట్లాడటం కేసీఆర్ దిగజారుడుతనానికి నిదర్శనం. ప్రజల దృష్టి మళ్లించేందుకే నల్లగొండ సభ కుంగిన మేడిగడ్డ బ్యారేజీని ఎవరూ చూడకుండా కేసీఆర్ చాలా ప్రయత్నాలు చేశారు. పోలీసులతో అడ్డుకున్నారు. ఎన్నికల కమిషన్ అనుమతితో రాహుల్గాందీ, నేను, శ్రీధర్బాబు బ్యారేజీని పరిశీలించాం. అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణకు ఆదేశించాం. కాళేశ్వరం నిర్మాణం, నిర్వహణలో భారీగా లోపాలు ఉన్నాయని విజిలెన్స్ తేల్చింది. మేడిగడ్డను సందర్శించి వాస్తవాలు తెలుసుకుందామని స్పీకర్ అనుమతితో వచ్చాం. కానీ కేసీఆర్ తన బండారం బయటపడుతుందని భావించి.. ప్రజల దృష్టిని మళ్లించేందుకు నల్లగొండలో సభ పెట్టారు. అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వండి కృష్ణాబోర్డు (కేఆర్ఎంబీ)కు ప్రాజెక్టుల అప్పగింతపై అడిగితే తాను సలహాలు ఇచ్చేవాడినని కేసీఆర్ అంటున్నారు. అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వొచ్చని మేం ముందునుంచీ చెప్తున్నాం. స్పీకర్ ద్వారా ప్రతిపక్ష నాయకుడిని పిలిపించాలని కూడా కోరాం. అసెంబ్లీ రాకుండా.. పైగా సభలో చేసిన తీర్మానాన్ని తప్పుపడుతున్నారు. తీర్మానంలో లోపాలుంటే హరీశ్రావు ఎలా మద్దతు ఇచ్చారు. అందుకే హరీశ్రావు మాటలకు విలువ లేదని.. కేసీఆర్ సభకు రావాలని మేం కోరాం. నల్లగొండ సభలో దిక్కుమాలిన మాటలు మాట్లాడటం కాదు.. శాసనసభకు రండి. ఏం చేయాలో చెప్పండి. మమ్మల్ని వెంటాడతామంటూ బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నారు. కానీ కాళేశ్వరంపై చర్చకు రావడానికి ఎందుకు భయపడుతున్నారు? ముందే తెలిస్తే.. ప్రతిపక్ష హోదా కూడా వచ్చేది కాదు మళ్లీ అధికారంలోకి వస్తామని కేసీఆర్ మాట్లాడుతున్నారు. మీ గురించి ప్రజలకు ఎన్నికల ముందే తెలిసి ఉంటే ఆ ప్రతిపక్ష హోదా కూడా వచ్చేది కాదు. మీ అబద్ధాలను నమ్మడానికి తెలంగాణ సమాజం ఇంకా సిద్ధంగా ఉందనుకుంటున్నారా? కేసీఆర్ను ఆహా్వనిస్తున్నా.. సభకు రావాలి, బడ్జెట్తోపాటు సాగునీటి రంగంపై చర్చలో పాల్గొనాలి. అన్ని పాపాలకు కారణం కేసీఆరే కాబట్టి ఆయనే వివరణ ఇవ్వాలని కోరుతున్నాం. ఆయన స్వార్థం కోసం కాకుండా ఒక్కసారైనా ప్రజలకు మేలు జరిగేలా ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత నెరవేర్చండి. కాళేశ్వరంలో జరిగిన అవకతవకలపై మీ వైఖరేమిటో సభలో చెప్పండి సానుభూతి కోసం ఎత్తుగడ కుర్చీపోగానే కేసీఆర్కు నీళ్లు, నల్లగొండ ఫ్లోరైడ్ గుర్తొస్తాయి. అందుకే కుర్చీని వెతుక్కుంటూ నల్లగొండ వెళ్లారు. పార్లమెంటు ఎన్నికల్లో సానుభూతితో ఓట్లు పొందాలనేది కేసీఆర్ ఎత్తుగడ. భయపడబోనంటూ ప్రగల్భాలు పలకడం కాదు. వచ్చి సభలో మాట్లాడాలి. అవసరమైతే కాళేశ్వరాన్ని సందర్శిస్తానని కేసీఆర్ అంటున్నారు. ఆయన కేసీఆర్ కాళేశ్వరానికి కాదు..ఇక కాశీకి పోవాల్సిందే. బీజేపీతో చీకటి పొత్తు ఎందుకు? బీజేపీ, బీఆర్ఎస్ ఇంకా ఎన్నాళ్లు చీకట్లో పొత్తు పెట్టుకుంటాయి? మేడిగడ్డ సందర్శనకు బీజేపీ వాళ్లు వస్తారనుకున్నాం. ఎంఐఎం, సీపీఐ వాళ్లు వచ్చారు. కేసీఆర్ అవినీతిపై విచారణ చేపట్టాలన్న బీజేపీ ఇప్పుడు ఎందుకు రాలేదు. కిషన్రెడ్డి బీజేపీ ఎమ్మెల్యేలను రాకుండా అడ్డుకున్నారు. బీజేపీ వైఖరేమిటో, కేసీఆర్ అవినీతికి సహకరిస్తారో, అవినీతిపై విచారణ చేసే మా ప్రభుత్వానికి సహకరిస్తారో ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలి. సీబీఐ విచారణ పేరుతో కేసీఆర్ జుట్టు తమ చేతిలో పెట్టుకొని లబ్ధి పొందాలనుకుంటున్నారు. సీబీఐ కంటే ఉన్నతమైన జ్యుడీషియల్ విచారణ చేయించబోతున్నాం. కేసీఆర్ అవినీతిని బయటపెట్టడానికి ఈ పర్యటన కీలకం. అలాంటి మేడిగడ్డ సందర్శనకు బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదో కిషన్రెడ్డి సమాధానం చెప్పాలి. బాధ్యులపై విచారణ జరుగుతుంది సాంకేతిక నిపుణులతో చర్చించాక మేడిగడ్డ పునరి్నర్మాణంపై మా నిర్ణయం వెల్లడిస్తాం. మేం ఇంజనీర్లం కాదు. 80వేల పుస్తకాలు చదవలేదు. అక్రమాలకు బాధ్యులైన వారిపై విచారణ కొనసాగుతుంది. అవసరమైతే రెవెన్యూ రికవరీ యాక్టుతో సొమ్ము రికవరీ చేస్తాం’’ అని రేవంత్ పేర్కొన్నారు. దేశంలోనే అతిపెద్ద స్కామ్ కాళేశ్వరం – కట్టిన మూడేళ్లలోనే మేడిగడ్డ కొట్టుకుపోయే దుస్థితి: ఉత్తమ్ – తుగ్లక్ కూడా సిగ్గుపడే విధంగా నిర్మించారని వ్యాఖ్య మేడిగడ్డ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: స్వతంత్ర భారత చరిత్రలో కాళేశ్వరం కుంభకోణం అతి పెద్దదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన తర్వాత మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.94 వేలకోట్లు ఖర్చు చేసి.. 97 వేల ఎకరాలకు నీరివ్వడమనేది ఎక్కడా ఉండదన్నారు. కట్టిన మూడేళ్లలోనే బ్యారేజీ కొట్టుకుపోయే స్థితికి చేరుకుందని విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణ ఖర్చులో.. రూ.68 వేలకోట్లు అప్పు తెచ్చినవని, ప్రభుత్వం సమకూర్చిన రూ.33 వేల కోట్లు పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసినవేనని చెప్పారు. వైఎస్సార్ హయాంలో రూ. 38 వేలకోట్లతో 16 లక్షల ఎకరాల ఆయకట్టును ప్రతిపాదిస్తే.. రీడిజైన్ పేరిట ఖర్చును రూ.94వేల కోట్లకు పెంచి 18 లక్షల ఎకరాల ఆయకట్టు ప్రతిపాదించారని పేర్కొన్నారు. తుగ్లక్ కూడా సిగ్గుపడే విధంగా ప్రాజెక్టు నిర్మించారని విమర్శించారు. డ్యామ్కు, బ్యారేజీకి తేడా తెలియకుండా నిర్మించడం వల్లే ప్రస్తుతం మేడిగడ్డకు ఈ పరిస్థితి ఎదురైందని పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్లది ఫెవికాల్ బంధం: పొన్నం కేసీఆర్ సూచనల మేరకే బీజేపీ ఎమ్మెల్యేలు మేడిగడ్డ సందర్శనకు రాలేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఎంఐఎం, సీపీఐ వచ్చినా బీజేపీ రాకపోవడానికి బీఆర్ఎస్తో ఆ పారీ్టకి ఉన్న ఫెవికాల్ బంధమే కారణమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కేంద్రం ఎందుకు విచారణ చేపట్టడం లేదని, ఆరోపణలతోనే కాలం వెల్లదీయడానికి కారణమేంటని నిలదీశారు. రూ.లక్ష కోట్లు గోదావరిలో పోసినట్టే – సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సాక్షి ప్రతినిధి, వరంగల్/కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టును ఇలా చూడటం బాధగా ఉందని, రూ.లక్ష కోట్లు గోదావరిలో పోసినట్టేనని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. మేడిగడ్డ వద్ద మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టు నిర్మాణంలో లోపం ఉందని, దీనికి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఎన్నో కుంభకోణాలు చేసిందని.. ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారంటీలను ఎగ్గొడుతోందంటూ విమర్శలు చేయడం విడ్డూరమని పేర్కొన్నారు. వైఎస్సార్ సర్కారు ప్రతిపాదించినట్టుగా తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఉంటే.. ఇంత ఖర్చు, వృధా అయ్యేది కాదని చెప్పారు. -
కేసీఆర్ చెప్పే మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరు: సీఎం రేవంత్
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: గత ప్రభుత్వంలో మెడిగడ్డకు ఎవ్వరినీ చూడనివ్వలేదు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే విజిలెన్స్ విచారణ చేయించాము. రీ డిజైన్ పేరుతో కేసీఆర్ వేల కోట్ల రూపాయలకు పాల్పడ్డారని సీఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీని సీఎం రేవంత్రెడ్డితో సహా కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం సందర్శించింది. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన పిల్లర్లను సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు పరిశీలించారు. సీఎం రేవంత్రెడ్డి బృందం ప్రాజెక్టు పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై అధికారులు.. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన అనంతరం సీఎం రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ప్రజల ముందు దొషిగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుందనే కేసీఆర్ నల్గొండ సభ పెట్టారు. కేసీఆర్ కోటి ఒకటోసారి సావు నోట్లో తలకాయ పెట్టిన అని మరోసారి శుద్ధపూస లెక్క మాట్లాడుతుండు. కేసీఆర్ సావు నోట్లో తలకాయ పెడితే అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు. స్మిత్మా సభర్వాల్ కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించినట్లు అసెంబ్లీలో బయటపెట్టాము.మెడిగడ్డ పర్యటనకు, అసెంబ్లీకి కేసీఆర్ రాలేదు. కాలు విరిగిన కేసీఆర్ నల్గొండ జిల్లాకు ఎలా వెళ్లారు? అసెంబ్లీ దగ్గర ఉందా? నల్గొండ దగ్గర ఉందా? కేసీఆర్ చెప్పే మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరు. కేసీఆర్ దోపిడీకి మెడిగడ్డ బలైపోయింది. అన్నారం సుందిల్లా సున్నం అయింది. మెడిగడ్డకు వచ్చిన వాళ్ళను కేసీఆర్ అవమాణించారు. ...కృష్ణా బోర్డుకు ప్రాజెక్ట్ లు అప్పగించడం లేదని అసెంబ్లీ లో చేసిన తీర్మానానికి హరీష్ రావు మద్దతు పలికారు. తీర్మానంపై లోపాలు ఉంటే కేసీఆర్ వచ్చి సవరించి ఉండేది. అఖిల పక్షం ఢిల్లీకి తీసుకుపోవాలని కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి డిమాండ్ చెయ్యాలి. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు? కేసీఆర్ భేదిరించి, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం.. భయపడితే భయపడం. మేము కేసీఆర్ లెక్క ఉద్యమం ముసుగులో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యలేదు. కాళేశ్వరం అంశాన్ని తప్పుదోవ పట్టించాడానికి నల్గొండ సభను కేసీఆర్ పెట్టారు. కేసీఆర్ మనస్తత్వం ముందే తెలుస్తే ఈ ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వకపోదురు. అధికారం పోగానే మళ్ళీ కేసీఆర్కు ఫ్లోరైడ్ గుర్తుకు వచ్చిందా? ప్రపంచ అద్భుతం అంటూ న్యూయార్క్ లో కాళేశ్వరం ప్రాజెక్టును చూపించారు. కేసీఆర్ నల్గొండలో మాట్లాడటం కాదు.. అసెంబ్లీకి రావాలి. ఇరిగేషన్పై రేపు శ్వేతపత్రం పెడతాం.. కేసీఆర్ చర్చలో పాల్గొనాలి. అన్ని పాపాలకు కారణం కేసీఆర్ మాత్రమే. మెడిగడ్డ తప్పిద్దాల్లో కేసీఆర్ భాగస్వామ్యం ఉంది. ...కేసీఆర్ భాగస్వామ్యం ఉంది కాబట్టే అంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. మెడిగడ్డ బ్యారేజ్ ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదంలో ఉంది. రేపటి శాసన సభ సమావేశాల్లో పాల్గొని తన అనుభవాన్ని చెప్పాలి. ఎల్ అండ్ టీ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టాలా వద్దా అనేది కేసీఆర్ సభలో చెప్పాలి. వందల మంది మరణించినా కేసీఆర్ రోడదెక్కలేదు. ప్పుడు అధికారం కోసం నల్గొండ జిల్లాకు వెళ్లారు. కుర్చీ దిగి 60 రోజులు కాలేదు.. అప్పుడే ఓట్లు అడుక్కునే పరిస్థితి వచ్చింది. ...భయం అంటే తెలువని కేసీఆర్ సభకు వచ్చి మాట్లాడాలి. నల్గొండ సభకు మహబూబ్ నగర్ నుంచి ప్రజలను తీసుకెళ్లారు. కేసీఆర్ కాలేశ్వరం ప్రాజెక్టు పర్యటన కాదు.. కాశి పర్యటనకు వెళ్ళాలి. వస్తానన్న బీజేపీ ఎమ్మెలను కిషన్ రెడ్డి అడ్డుకున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని మళ్ళీ నిరూపీతం అయింది. బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం త్వరలోనే బయటపడుతుంది. కేసీఆర్ అవినీతిని బయటకు తియ్యడానికి బీజేపీ వైఖరి ఏంటో తెలియజేయాలి’ అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ముందా?
వేములవాడ: కాళేశ్వరంలో అంతర్భాగమైన మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడానికి కారకులైన కేసీఆర్ కుటుంబాన్ని అరెస్టు చేసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా ? అని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సవాల్ విసిరారు. ప్రజాహితయాత్రలో భాగంగా సోమవారం రాత్రి వేములవాడకు చేరుకున్న ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎల్అండ్టీ సంస్థను బెదిరించి సబ్కాంట్రాక్టు తీసుకొని పనులు చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. కాంగ్రెస్ వారు మేడిగడ్డను టైంపాస్గా చూసేందుకో, పిక్నిక్ స్పాట్, వాటర్ఫాల్స్ చూడటానికి వెళ్లినట్టు ఉండొద్దని సూచించారు. రూ.లక్ష కోట్ల ప్రజాధనం వృథా చేసిన కేసీఆర్ కుటుంబం ఆస్తుల జప్తు చేయాలని కోరారు. మేడిగడ్డపై కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. వేములవాడలో సంజయ్ సరదాగా ఆటో నడిపారు. ఆయన పక్కనే బీజేపీ నేత డాక్టర్ వికాస్రావు కూర్చున్నారు. ఒంటరిగానే బరిలోకి దిగుతాం.. పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునే ఖర్మ తమకు లేదని స్పష్టం చేశారు. వేములవాడరూరల్ మండలం చెక్కపల్లి, నూకలమర్రి, నమిలిగుండుపల్లి, వట్టెంల, శాత్రాజుపల్లి గ్రామాల్లో జరిగిన ప్రజాహితయాత్రలో ఆయన మాట్లాడారు. -
ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న ప్రభుత్వం
-
అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్న కాంగ్రెస్ ప్రభుత్వం
-
మేడిగడ్డ ప్రాజెక్ట్పై కాంగ్రెస్ మంత్రులు కీలక వ్యాఖ్యలు!
-
మేడిగడ్డ ఏడో బ్లాక్ పరిధిలో పనులు
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ ఏడో బ్లాక్ 20వ పియర్ భారీ శబ్దంతో కుంగిపోయింది. బ్యారేజ్ దెబ్బతినడంతో సరిహద్దులో తెలంగాణ, మహారాష్ట్రల మధ్య అక్టోబరు 21వ తేదీ నుంచి రాకపోకలను నిలిపేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక తెలంగాణ ఎన్నికల వేళ రాజకీయపరమైన విమర్శలకు తావిచ్చింది. ఒకవైపు బ్యారేజ్ వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. మరోవైపు డ్యామేజ్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. పిలర్లు కుంగిపోయిన ఏడో బ్లాక్ పరిధిలో పనులు కొనసాగుతున్నట్లు సమాచారం. నీటిని మళ్లించినా ఎగువ ప్రాంతం నుంచి ప్రవాహం కొనసాగుతోంది. ప్రాణహిత నుంచి బ్యారేజ్కు నీరు చేరుతోంది. మేడిగడ్డ బ్యారేజ్ పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలు. ఎగువ నుంచి 26,350 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా 61 గేట్లు ఎత్తి 22,590 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు నదిలో కాఫర్ డ్యాం పనులు సాగుతున్నట్లు తెలుస్తోంది. అన్నారం బుంగల కోసం గ్రౌటింగ్ అన్నారం (సరస్వతి) బ్యారేజీ బుంగలు ఏర్పడిన విషషయమూ తెలిసిందే. ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో ఇసుక, రాళ్లతో కూడిన సంచులు వేసినా పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదని సమాచారం. దీంతో రెండు పియర్ల వద్ద సీపేజీ (బుంగలు) ఏర్పడగా వాటి మరమ్మతులకు ఢిల్లీ నుంచి నిపుణుల బృందం రానున్నట్లు సమాచారం. 2020లో ఇలాంటి పరిస్థితి ఎదురుకాగా పాలియూరిథిన్ (పీయు) గ్రౌటింగ్ ద్వారా బుంగలను పూడ్చారు. ఈ సారి కూడా ఇదే పద్ధతిని అవలంబించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: మేడిగడ్డ పంచాయతీ.. బారికేడ్లతో బ్యారేజ్ మూసివేత -
కేసీఆర్ మోసకారి..కోమటిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
-
కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రమాదంపై పరిశీలించడానికి పొన్నం ప్రభాకర్ పిలుపు
-
కష్టంలోనే కాళేశ్వరం విలువ తెలిసేది
సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరం ప్రాజెక్టు విలువ కష్టకాలంలోనే తెలుస్తుంది. ఎగువ గోదావరి నుంచి నీరు రాకున్నా, ప్రాణహిత ద్వారా మేడిగడ్డ రిజర్వాయర్కు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ప్రతిరోజూ ఒక టీఎంసీ నీళ్లను మేడిగడ్డ నుంచి అన్నారం, అక్కడి నుంచి సుందిళ్లకు ఎత్తిపోసేలా మోటార్లను నిర్విరామంగా 24 గంటలూ నడిపించాలి. సుందిళ్ల నుంచి అంతే నీటిని మధ్య మానేరుకు తరలించాలి. అక్కడి నుంచి సగం నీటిని దిగువ మానేరుకు, సగం నీటిని పునరుజ్జీవన వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీకి తరలించాలి. తద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి తుంగతుర్తి మీదుగా సూర్యాపేటలోని చివరి ఆయకట్టు చినసీతారాం తండా దాకా సాగునీరు అందేలా పకడ్బంది చర్యలు చేపట్టాలి’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశించారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై ఆదివారం సచివాలయంలో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎంత కష్టపడ్డారో, అదే స్థాయిలో ప్రాణహిత, గోదావరి ద్వారా వచ్చిన నీటిని వచ్చినట్లు ఎత్తిపోస్తూ రాష్ట్రంలో తాగు, సాగునీటికి సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీటిపారుదల, విద్యుత్, వ్యవసాయ శాఖ అధికారులపై ఉందని నొక్కిచెప్పారు. ‘ఇన్ని రోజులు ఒకెత్తు... ఇప్పుడు ఒకెత్తు. ఇది నీటిపారుదల శాఖకు పరీక్షా సమయం’అని వ్యాఖ్యానించారు. పాలేరు రిజర్వాయర్కు నాగార్జునసాగర్ నుంచి నీరు వచ్చే అవకాశాలు ప్రస్తుతం లేనందున బయ్యన్నవాగు నుంచి నీటిని సందర్భానుసారం పాలేరుకు వదిలేలా చర్యలు చేపట్టాలని సూచించారు. చుక్క చుక్కనూ ఒడిసిపట్టాలి... తాగునీటికి ప్రాధాన్యతనిచ్చి గోదావరి, కృష్ణా నదుల పరిధిలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలను నిరంతరం పర్యవేక్షించాలని సీఎం కేసీఆర్ సూచించారు. నీటిపారుదల, విద్యుత్ శాఖలు ఈ మేరకు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో తాగు, సాగునీటికి లోటు రానీయకుండా చుక్కచుక్కనూ ఒడిసిపట్టి ప్రజలకు నీటిని అందించాలన్నారు. ఎత్తిపోతలకు సరిపోయే విద్యుత్ను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ నీటిపారుదల, విద్యుత్ శాఖ సమన్వయం చేసుకోవాలని సూచించారు. మళ్లీ విత్తనాలు, ఎరువుల పంపిణీకి ప్రణాళిక... ఇప్పటికే కురిసిన వానలకు పత్తి, ఇతర విత్తనాలు వేసిన ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులతో మొలకలెత్తకుండా ఎండిపోయిన నేపథ్యంలో తిరిగి రైతులు విత్తుకొనే పరిస్థితులున్నాయని ఈ నేపథ్యంలో విత్తనాలు, ఎరువులు తిరిగి అందించగలిగే విధంగా అత్యవసర ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని వ్యవసాయశాఖను కేసీఆర్ ఆదేశించారు. సంక్షోభంలో సైతం పంటలు పండించి చూపాలి... ‘ఇది మునుపటి తెలంగాణ కాదు. గతంలో లాగా ఆలోచిస్తే కుదరదు. నీటి సమస్య లేకుండా ప్రాజెక్టులు కట్టుకున్నాం. తాగునీరు, సాగునీటి అవసరాలకు సమృద్ధిగా నీరు అందుతున్నది. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడే మన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి. సంక్షోభ సమయంలోనే మనం పంటలు పండించి చూపించాలి. అప్పుడే మనం సిపాయిలం. అన్ని వ్యవస్థలను సమన్వయం చేసుకుంటూ ఎవరి పని వారు సమర్థంగా నిర్వహిస్తూ మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి. ఈ పరిస్థితిని సవాలుగా తీసుకోవాలి. ఈ ఒక్క సంవత్సరం అనుభవం భవిష్యత్ తెలంగాణ చరిత్రలో ఉపయోగపడుతుంది. ఎక్కడి ఈఎన్సీలు అక్కడే ఉండి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. ప్రజలకు నీరు అందించడమే లక్ష్యంగా నిరంతరం ఏకాగ్రతతో పనిచేయాలి. ఇందుకు అందరం కలిసి ప్రతిజ్ఞ తీసుకోవాలి’అని సీఎం స్పష్టం చేశారు. తాగునీటి సమస్య రాకూడదు.. రాష్ట్రంలో తాగునీటి సమస్య రాకుండా చూసుకోవాలని మిషన్ భగీరథ ఈఎన్సీని సీఎం ఆదేశించారు. ఉదయసముద్రం, కోయిల్ సాగర్ రిజర్వాయర్లలో కొంత నీటి కొరత ఉందని, వాటిలో నీటి నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు. పంపింగ్ నిర్వహణ జెన్కోకు రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల పంపింగ్ నిర్వహణను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు కాకుండా ప్రభుత్వరంగ సంస్థ అయిన జెన్కోకు ఇచ్చేలా విధివిధానాల ఖరారుకు చర్యలు చేపట్టాలని నీటిపారుదల అధికారులను సీఎం ఆదేశించారు. నీటిని పొదుపుగా వాడాలి... ప్రస్తుత కష్టకాలంలో ప్రజలు, రైతాంగం నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. వ్యవసాయ, నీటిపారుదల శాఖల సూచనలు పాటిస్తూ పంటలు పండించుకోవాలని రైతులను కోరారు. -
కాళేశ్వరంలో పడవ ప్రయాణం
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరిలో తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో అధునాతమైన బోటు అందుబాటులోకి రానుంది. ఈ బోట్ను రూ.2 కోట్ల వ్యయంతో సిద్ధం చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో మహదేవపూర్ మండలం మేడిగడ్డలోని లక్ష్మీ బ్యారేజీ నుంచి కాలేశ్వరం వరకు 22 కిలోమీటర్ల దూరం బ్యాక్ వాటర్ నిల్వ ఉంటోంది. దీంతో ఇక్కడ గోదావరి సముద్రాన్ని తలపిస్తోంది. ఆ నీటి ఉధృతిలో అతిపెద్ద బోటు ఏర్పాటు చేస్తే టూరిస్టులను ఆకర్షించవచ్చనే ఉద్దేశంతో పర్యాటక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మూడు నెలల్లో అందుబాటులోకి.. ఫిబ్రవరి మొదటి వారం నుంచి కాళేశ్వరంలోని గోదావరి తీరంవద్దే 300 మంది కూలీలతో బోటును తయారు చేయించనున్నారు. ఇందుకోసం ఏపీ నుంచి కార్మికులను రప్పించే ప్రయత్నాల్లో అధికారులు ఉన్నట్లు సమాచారం. అధునాతన పరిజ్ఞానంతో సిద్ధం చేయించనున్న ఈ బోట్లో ఏసీ, నాన్ ఏసీ గదులు ఉంటాయని తెలిసింది. వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి పర్యాటకులు వచ్చే అవకాశం ఉండడంతో పర్యాటక శాఖ ఆ వైపుగా దృష్టి సారించింది. బోట్ సిదమయ్యాక కాళేశ్వరం నుంచి లక్ష్మీ బ్యారేజ్ వరకు ప్రయాణం చేసేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాదారం. మూడు నెలల్లో బోట్ అందుబాటులోకి వచ్చే అవకాశముందని టూరిజం శాఖ ఉద్యోగులు తెలిపారు. చిన్నచిన్న వేడుకలతో పాటు విందులు చేసుకునేలా 200 మంది ప్రాణం చేసేందుకు వీలుగా బోట్ ఉంటుంది. బోటు కాళేశ్వరంలో తిరగడం ఆరంభిస్తే ఇప్పటికే ప్రాజెక్టును సందర్శించేందుకు వస్తున్న పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. -
ఉప్పొంగుతున్న ప్రాణహిత
సాక్షి, హైదరాబాద్ : గోదావరి ఎగువన రెండ్రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత పరవళ్లు తొక్కుతోంది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు నిండి ఆ నీరంతా వచ్చి చేరుతుండటంతో ప్రాణహిత ఉప్పొంగుతోంది. ఇదే సమయంలో గోదావరి పరీవాహకంలోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో రెండు నదులు కలిసే కాళేశ్వరం వద్ద గోదావరిలో 3.79 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు నమోదవుతున్నాయి. ఈ మొత్తం సీజన్లో ఇవే గరిష్ట ప్రవాహాలు కాగా, మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జల సంఘం ఇప్పటికే తెలంగాణతో పాటు పరీవాహక రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అన్నారం, ఎల్లంపల్లి, మిడ్మానేరు.. అన్నారం బ్యారేజీలోకి స్థానికంగా ఉన్న మానేరు నది నుంచి 24 వేల క్యూసెక్కుల మేర ప్రవాహాలు వస్తున్నాయి. దీనిలో 10.87 టీఎంసీలకు 9.25 టీఎంసీల మేర నీటి నిల్వ ఉండటంతో 8 పంపుల ద్వారా 20వేల క్యూసెక్కులకు పైగా నీటిని సుందిళ్లలోకి పంపింగ్ చేస్తున్నారు. సుందిళ్లకు వస్తున్న నీటిని వచ్చినవి వచ్చినట్లు ఎల్లంపల్లికి పంపింగ్ చేస్తున్నారు. ఎగువ పంపింగ్ చేస్తున్న నీటికి తోడు స్థానిక ప్రవాహాలు కలిసి ఎల్లంపల్లిలోకి ప్రస్తుతం 25,916 క్యూసెక్కుల మేర ప్రవాహాలు వస్తున్నాయి. దీంతో ఎల్లంపల్లిలో నీటి నిల్వ 20.18 టీఎంసీలకు గాను 12 టీఎంసీలకు చేరింది. ఇక్కడి నుంచి నంది, గాయత్రి పంప్హౌస్ల ద్వారా మిడ్మానేరుకు నీటి తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం మిడ్మానేరులోకి 21వేల క్యూసెక్కుల మేర నీటిని ఎత్తిపోస్తుండగా నిల్వ 25.87 టీఎంసీలకు 15.31 టీఎంసీలకు చేరింది. అన్నారం నుంచి మిడ్మానేరు వరకు కాళేశ్వరం ద్వారా గోదావరి ఎత్తిపోతలను మరో వారం పాటు కొనసాగించనున్నారు. రోజుకు రెండు టీఎంసీల చొప్పున కనీసంగా 14 టీఎంసీల నీటిని ఎత్తిపోసినా మిడ్మానేరు, ఎల్లంపల్లి పూర్తిగా నిండనున్నాయి. ఇక శ్రీరాంసాగర్లోకి నీటి ప్రవాహాలు స్థిరంగా నమోదవుతున్నాయి. ప్రాజెక్టులోకి 23,522 క్యూసెక్కుల మేర వరద వస్తుండగా, ప్రాజెక్టులో నిల్వ 90 టీఎంసీలకుగాను 41 టీఎంసీలకు చేరింది. ఇప్పటివరకు ప్రాజెక్టులోకి మొత్తంగా 27 టీఎంసీల మేర కొత్త నీరు వచ్చి చేరింది. ‘కాళేశ్వరం’ జలజల కాళేశ్వరం వద్ద ఏటా జూన్ రెండో వారం నుంచే ప్రవాహాలు మొదలవుతుండగా, ఈ ఏడాది జూలై మొదటి వారం నుంచి ప్రవాహాలు మొదలయ్యాయి. గతేడాది జూలై మొదటి వారం నుంచే 50వేల క్యూసెక్కులకు పైగా నీరు రాగా, ఈ ఏడాది జూలై చివరి వారం నుంచి 50వేల నుంచి 1.10 లక్షల క్యూసెక్కుల వరకు ప్రవాహాలు వచ్చా యి. అయినా అవి మళ్లీ 80వేల క్యూసెక్కులకు తగ్గిపోయాయి. ఇటీవలి వర్షాలతో కాస్త పుంజుకొని, ఈ నెల 11న 83వేల క్యూసెక్కుల మేర నమోదుకాగా, 12న 2లక్షల క్యూసెక్కులకు పెరిగాయి. ఇక 13న గురువారం ఏకంగా 3.79 లక్షల క్యూసెక్కులకు చేరింది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో ఇప్పటికే 16.17 టీఎంసీలకు గాను 9.20 టీఎంసీల మేర నీటి నిల్వ ఉండటంతో అన్ని గేట్లు ఎత్తి 4 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ నదిలోకి వదిలేస్తున్నారు. ఇక మేడిగడ్డ పంప్హౌస్లోని పంపులను సైతం నిలిపివేశారు. -
‘మేడిగడ్డపై అడ్డగోలు మాటలు’
సాక్షి, హైదరాబాద్ : మేడిగడ్డ ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి భౌగోళిక, నీటి అవసరాలపై అవగాహన లేదని మండిపడ్డారు. ఆదివారం అసెంబ్లీ సమావేశాల్లో సీఎం మాట్లాడుతూ ప్రాజెక్టుల నిర్మాణం కోసమే అప్పులు తీసుకువచ్చామని, కాంగ్రెస్ విమర్శలు అర్ధరహితమని అన్నారు. ప్రాజెక్టుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వాలు సైతం అప్పుల బాట పట్టిన విషయం గుర్తెరగాలని హితవు పలికారు. అవసరమైతే తమ ప్రభుత్వం మళ్లీ రుణాలు సేకరిస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్తో పోలిస్తే టీఆర్ఎస్ పాలన వంద రెట్లు మెరుగ్గా ఉందని అన్నారు. నైతికత విషయంలో కాంగ్రెస్ పార్టీ తమకు నీతులు చెప్పాల్సిన అసవరం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజ్యాంగబద్ధంగా టీఆర్ఎస్లో విలీనమయ్యారని, ముగిసిన విలీన ప్రక్రియపై గాలి పిటిషన్లు వేశారని వ్యాఖ్యానించారు. ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ను బలహీనపరచాలని చీలికలను కాంగ్రెస్ ప్రోత్సహించలేదా అని నిలదీశారు. 54 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశాన్ని అధోగతి పాలు చేశారమని మండిపడ్డారు. పథకాల పేర్లు మార్చినా ప్రజల తలరాతలు మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. త్యాగాల పునాదులపైనే టీఆర్ఎస్ పుట్టిందని చెప్పారు. తాము అసెంబ్లీ ఎన్నికలకు వెళితే కాంగ్రెస్, బీజేపీ సీట్లు తగ్గాయని అన్నారు. ఎల్లుండే అధికారంలోకి వచ్చేలా బీజేపీ హడావిడి చేస్తోందని అన్నారు. -
అద్వితీయం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి నీటిని ఎత్తిపోసి మొదటి దశను విజయవంతం చేసిన రాష్ట్ర ప్రభుత్వం రెండో దశ ఎత్తిపోతలకు సిద్ధమైంది. ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు నీటిని తరలించేలా పనులన్నీ పూర్తి చేసింది. నందిమేడారం, రామడుగు పంప్హౌస్లలో ఏడు మోటార్లకుగాను 5 మోటార్లను సిద్ధం చేయడంతోపాటు అత్యంత కీలకమైన ప్యాకేజీ–7 టన్నెల్ పనులను పూర్తి చేసింది. ప్యాకేజీ–8లో భాగంగా ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన రామడుగు పంప్హౌస్లో ఏర్పాటు చేసిన ఆసియాలోకెల్లా పెద్దవైన బాహుబలి మోటార్లకు ఆదివారం లేదా సోమవారం నుంచి ట్రయల్ రన్ జరగనుంది. ఒకట్రెండు రోజుల్లో ట్రయల్ రన్ పూర్తి చేసి ఆ వెంటనే 3–4 రోజుల్లో పూర్తిస్థాయి ఎత్తిపోతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు హాజరై మోటార్లను ఆన్ చేసి ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టనున్నారు. ఆవిష్కృతం కానున్న అద్భుతం...: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మొదటి దశలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ద్వారా ఎల్లంపల్లి బ్యారేజీకి నీటి ఎత్తిపోతల ప్రక్రియ విజయవంతమైంది. ప్రస్తుతం పరీవాహకం నుంచి వస్తున్న ప్రవాహాలతో ఎల్లంపల్లి నుంచి నీరు దిగువకు వెళ్లిపోతోంది. ఈ నేపథ్యంలో ఎల్లంపల్లి నుంచి నీటిని మిడ్మానేరుకు తరలించే పనులపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఆ పనులు పూర్తి చేసింది. ప్రస్తుతం ఎల్లంపల్లి దిగువన ఉన్న నందిమేడారం పంప్హౌస్ పరిధిలో 124.5 మెగావాట్ల విద్యుత్తో నడిచే 7 మోటార్లలో ఐదింటికి ఇప్పటికే వెట్ రన్ నిర్వహించారు. రెండ్రోజుల కిందట ప్యాకేజీ–7లోని టన్నెళ్ల పనులు పూర్తి చేసి పరీక్షలు నిర్వహించారు. ఇవన్నీ సఫలం కావడంతో ప్యాకేజీ–8లోని బాహుబలి మోటార్లను పరిశీలించేలా ఫోర్ బేకి నీటిని వదిలారు. ప్యాకేజీ–8లోని సర్జ్పూల్ని శనివారం 227 మీటర్లకుగాను 214 మీటర్ల లెవల్ వరకు నింపారు. దశలవారీగా సర్జ్పూల్ను నింపుతూ లీకేజీలను పరిశీలిస్తున్నారు. ఈ ప్రక్రియ ఆదివారం పూర్తయితే పూర్తిస్థాయిలో సర్జ్పూల్ను నింపి ఒకటి లేదా రెండు మోటార్లకు వెట్ రన్ నిర్వహిస్తారు. 115 మీటర్ల లోతు నుంచి నీటి ఎత్తిపోత... ప్యాకేజీ–8లోని ప్రపంచంలోనే అతిపెద్ద పంపింగ్ స్టేషన్ను భూగర్భానికి 330 మీటర్ల దిగువన మేఘా ఇంజనీరింగ్ సంస్థ నిర్మించింది. 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ఒక్కొక్కటీ 139 మెగావాట్ల సామర్థ్యంగల 7 మోటార్లలో ఐదింటిని సిద్ధం చేశారు. ఒక్కో మోటారు సుమారు 15 మీటర్ల ఎత్తు, వ్యాసం 22 మీటర్లు, బరువు 2,376 మెట్రిక్ టన్నులు ఉంటుంది. ఈ మోటార్లు 115 మీటర్ల లోతు నుంచి 3,200 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో నీటిని ఎత్తిపోస్తాయి. ట్రాన్స్ఫార్మర్ బేలు, కంట్రోల్ రూంలు రెండు చొప్పున, బ్యాటరీ రూం, మోటార్ రూమ్ ఒక్కొక్కటి నిర్మించగా, ఎల్టీ ప్యానెల్స్, పంప్ ఫ్లోర్, కంప్రెషర్లు కలిపి మొత్తం 4 అంతస్తులతో నిర్మించారు. మొత్తం పనిలో 40 శాతం వాటా కింద మోటార్లు, పంపులు, యంత్ర పరికరాలు, విడిభాగాల రూపంలో బీహెచ్ఈఎల్ సరఫరా చేయగా వాటిని ప్యాకేజీ–8 వద్దకు తీసుకొచ్చాక బిగించే 60 శాతం పనిని మేఘా సంస్థ పూర్తి చేసింది. ఈ మోటార్లకు కరెంట్ సరఫరా చేసేందుకు 400 కేవీ విద్యుత్ సబ్ స్టేసన్ ఇప్పటికే సిద్ధమైంది. మోటార్ల వెట్ రన్ పూర్తయ్యాక వచ్చే వారం నుంచే పూర్తిస్థాయి ఎత్తిపోతలు చేపట్టనున్నారు. మోటార్ల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. ఇక్కడి నుంచి నీటిని మిడ్మానేరుకు ఎత్తపోసే రెండు మోటార్లను స్విచ్ ఆన్ చేయనున్నారు. -
వరద పెరిగె.. పంపింగ్ ఆగె..
సాక్షి, హైదరాబాద్, కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు 3 పంప్హౌస్లలోని మోటార్లను తాత్కాలికంగా నిలిపివేశారు. పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఎల్లంపల్లికి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో మేడిగడ్డ నుంచి రివర్స్ పంపింగ్ ప్రక్రియను ఆపారు. ప్రస్తుతం వస్తున్న ప్రవాహాలతోనే ఎల్లంపల్లి నిండే అవకాశాలుండటం రివర్స్ పంపింగ్ ద్వారా గోదావరి నీటిని మోటార్ల ద్వారా ఎల్లంపల్లికి ఎత్తి పోస్తే కరెంట్చార్జీలు వృథా అయ్యే అవకాశాల నేప థ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రాజెక్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఎల్లంపల్లిలో చేరుతున్న నీటిని కాళేశ్వరంలోని 3 ప్యాకేజీల ద్వారా మిడ్మానేరుకు తరలించే అవకాశాలపై దృష్టి పెట్టాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో ఆ దిశగా ఇంజనీర్లు చర్యలు చేపట్టారు. ప్యాకేజీ–7లోని టన్నెల్ పనులను పూర్తి చేసే కసరత్తు చేపట్టనున్నారు. వరద పెరిగింది.. గత 25 రోజులుగా ప్రాణహిత నదికి 8 వేల క్యూసెక్కుల నుంచి 13 వేల క్యూసెక్కుల మేర మాత్రమే వరద ప్రవాహాలు కొనసాగాయి. వచ్చిన కొద్దిపాటి వరదకే అడ్డుకట్ట వేసి మేడిగడ్డ నుంచి నీటిని పంపింగ్ చేశారు. మంగళవారం వరకు మేడిగడ్డ పంప్హౌస్ నుంచి 1,500 గంటలపాటు మోటార్లను నడిపి 12 టీఎంసీలను ఎత్తిపోశారు. అన్నారం చేరిన నీటిలో 6 టీఎంసీలను నిల్వ చేశారు. సుందిళ్ల నుంచి నీటిని ఎల్లంపల్లికి ఎత్తిపోసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. హెడ్ రెగ్యులేటర్ నుంచి ఫోర్ బేలోకి నీటిని పంపి సుందిళ్ల పంప్హౌస్లో మోటార్ల ద్వారా మంగళవారం నుంచి నీటిని ఎత్తిపోయాలని భావిం చారు. దీనికి అనుగుణంగా సుందిళ్లలో 4 మోటార్లను సిద్ధం చేశారు. గత 2 రోజులుగా కురు స్తున్న వర్షా లతో పరీవాహకం నుంచి కడెం, ఎల్లంపల్లిలోకి ప్రవాహాలు పెరిగాయి. కడెంలోకి మంగళవారం ఉదయం 60 వేల క్యూసెక్కుల ప్రవాహం రావడంతో 6 గేట్లు ఎత్తి 52 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దీంతో ఎల్లంపల్లిలోకి 30 వేల క్యూసెక్కుల మేర ప్రవాహాలు రాగా సాయంత్రానికి అవి 18 వేల క్యూసెక్కులకు తగ్గాయి. ప్రాజెక్టులో నీటి నిల్వ 20 టీఎంసీలకుగాను 7 టీఎంసీలకు చేరింది. ఎగువ కడెంలోకి స్థిరంగా 29,810 క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తుండటం, మరో 4 రోజులు వర్షాలు కురిసే అవకాశాల నేపథ్యంలో ఎల్లంపల్లిలోకి మరో 3–4 రోజులు స్థిరంగా ప్రవాహాలు కొనసాగే అవకా శం ఉంది. ఈ నేపథ్యంలో ఎల్లంపల్లిలో నిల్వలు పెరిగే అవకాశం ఉంది. దీంతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంప్హౌస్ల మోటార్లను నిలిపివేశారు. సుందిళ్లలోని ఒక పంప్హౌస్ను మంగళవారం సాయంత్రం కాసేపు నడిపి ఆపేశారు. ఎల్లంపల్లికి వరద నేపథ్యంలో రివర్స్ పంపింగ్ ద్వారా ఎల్లంపల్లికి నీటిని పంపినా ఫలితం ఉండదు. ఒకవేళ తరలించినా అక్కడి నుంచి మిడ్మానేరుకు నీటి తరలింపు ప్రక్రియ సిద్ధంగా ఉండాలి. ప్రస్తుతం ఎల్లంపల్లి దిగువన ప్యాకేజీ–7 పనులు ఇంకా పూర్తికానందున ఈ ప్రక్రియ మొదలు కాలేదు. దీంతో మోటార్లను నిలిపివేశారు. మోటార్లు ఆపేసిన అనంతరం ప్రాణహిత నదిలోనూ వరద ఉధృతి పెరిగింది. వచ్చే నెల 5 నుంచి ఎల్లంపల్లి ఎత్తిపోతలు ఎల్లంపల్లికి వరద ప్రవాహాలు మొదలవడం, ఒకవేళ ప్రవాహాలు ఆగినా సుందిళ్ల నుంచి నీటిని తరలించే వ్యవస్థ సిద్ధంగా ఉండటంతో ఈ ప్రాజెక్టు నుంచి నీటి తరలింపు చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఎల్లంపల్లి దిగువన ప్యాకేజీ–6లో 7 మోటార్లకు 5 మోటార్లు సిద్ధంగా ఉండగా ఐదో మోటార్ వెట్ రన్ మంగళవారం విజయవంతమైంది. ఇక ప్యాకేజీ–7 టన్నెల్లో సివిల్ పనులన్నీ బుధ, గురువారాల్లో పూర్తి కానున్నాయి. పనులు పూర్తయితే అక్కడ క్లీనింగ్ ప్రక్రియ మొదలవుతుంది. దీనికి 4–5 రోజులు పట్టనుంది. ఈ పనులను మంగళవారం సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్పాండే, ఈఎన్సీ మురళీధర్ పరిళీలించారు. ఎల్లంపల్లి నుంచి వచ్చే నెల 5న ఎత్తిపోతలు ప్రారంభించాలని ఆదేశించారు. ఎల్లంపల్లి నుంచి ఈ మూడు ప్యాకేజీల ద్వారా మిడ్మానేరుకు నీటిని తరలించనున్నారు. వచ్చే నెల 5న ఎల్లంపల్లి నుంచి నీటిని ఎత్తిపోసే కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉందని నీటిపారుదల వర్గాలు తెలిపాయి. కాగా, ఈశాన్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఆగస్టు 4న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు వెల్లడించారు. మేడిగడ్డ బ్యారేజీలో 30 గేట్ల ఎత్తివేత మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత నదికి వరద పోటెత్తింది. ఆ నీరంతా గడ్చిరోలి జిల్లా సిరొంచ మీదుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరిలో కలుస్తోంది. దీంతో మంగళవారం సాయంత్రం వరకు కాళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 8 మీటర్లకు చేరుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి ప్రాణహిత వరద పెరగడంతో మంగళవారం ఉదయం 30 గేట్లు పైకి ఎత్తారు. దీంతో బ్యారేజీ వద్ద 4.10 లక్షల క్యూసెక్కుల అవుట్ ఫ్లో తరలిపోతోంది. వరద ఇన్ఫ్లో పెరిగితే బ్యారేజీలోని మరిన్ని గేట్లను ఎత్తేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. బ్యారేజీలో ఆది, సోమవారాల్లో నీటి నిల్వ 4.5 టీఎంసీలు ఉండగా మంగళవారం అది 7 టీఎంసీలకు పెరిగింది. బ్యారేజీ పూర్తిస్థాయి సామర్థ్యం 16.17 టీఎంసీలు. -
మేడిగడ్డకు గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర సీఎం
-
మేడిగడ్డకు గవర్నర్, మహారాష్ట్ర సీఎం
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకుగాను గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మేడిగడ్డకు చేరుకున్నారు. యోగా డే సందర్భంగా రాజ్భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ అనంతరం బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్తో కలిసి ప్రత్యేక విమానంలో మేడిగడ్డకు బయలుదేరారు. అక్కడ సీఎం కేసీఆర్ వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం జలసంకల్ప యాగంలో పాల్గొన్నారు. కాగా ఇంతకు ముందే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మేడిగడ్డకు చేరుకున్నసంగతి తెలిసిందే. ముగ్గురు సీఎంలు గవర్నర్తో కలిసి యాగంలో పాల్గొన్నారు. మేడిగడ్డ వద్ద శృంగేరి పీఠం అర్చకుల ఆధ్వర్యంలో జలసంకల్ప యాగం కొనసాగుతోంది. ఈ యాగంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణి శోభ పాల్గొన్నారు. అక్కడ జలసంకల్ప యాగం, పూజలు కొనసాగుతున్నాయి. -
మేడిగడ్డకు చేరుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్
-
మేడిగడ్డకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ఉదయం 9.45 గంటలకు మేడిగడ్డకు చేరుకున్నారు. తాడేపల్లి నివాసం నుంచి ఉదయం 8.15 గంటల ప్రాంతంలో ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరిన ఆయన నేరుగా మేడిగడ్డకు విచ్చేశారు. సీఎం జగన్కు తెలంగాణ మంత్రులు సాదర స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. సీఎం వైఎస్ జగన్ వెంట మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్కుమార్ యాదవ్ ఉన్నారు. కాగా ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మేడిగడ్డకు చేరుకొని జలసంకల్ప యాగంలో పాల్గొన్నారు. మరోవైపు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ బేగంపేట విమానాశ్రయం చేరుకున్నారు. ఆయనకు సీఎస్ సునీల్ కుమార్ జోషి, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ నరసింహన్తో కలిసి కాళేశ్వరం బయలుదేరారు. ఉదయం 10 గంటలకల్లా గవర్నర్, ఇద్దరు ముఖ్యమంత్రులు మేడిగడ్డ బ్యారేజీ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ జరిగే హోమంలో కేసీఆర్తోపాటు పాల్గొన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి 11 గంటల మధ్య గవర్నర్, ముగ్గురు ముఖ్యమంత్రులు మేడిగడ్డ బ్యారేజీ వద్ద పైలాన్ను ఆవిష్కరిస్తారు. అక్కడే ఫొటో ఎగ్జిబిషన్ను తిలకిస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే గవర్నర్, ముగ్గురు ముఖ్యమంత్రులు మేడిగడ్డ పంప్హౌస్ ఉన్న కన్నెపల్లికి హెలికాప్టర్లో చేరుకొని అక్కడ అప్పటికే కొనసాగుతున్న పూర్ణాహుతిలో పాల్గొంటారు. సుగంధ మంగళ ద్రవ్యాలను హోమంలో వేస్తారు. అనంతరం 6వ నంబర్ మోటార్ను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం నీటి ప్రవాహాలుండే డెలివరీ సిస్టర్న్ వద్ద గోదావరి జలాలకు పూజలు చేస్తారు. అక్కడి నుంచి కన్నెపల్లి గెస్ట్హౌస్లో మధ్యాహ్న భోజనాలు చేసి అనంతరం అక్కడే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం పంచుకున్న ఇంజనీర్లు, ఏజెన్సీలు, సహకారం అందించిన బ్యాంకర్లకు సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు. -
మూడో టీఎంసీకి ‘పైప్లైన్’ క్లియర్
సాక్షి, హైదరాబాద్ : బహుళార్ధ సాధక ప్రాజెక్టు కాళేశ్వరంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. మేడిగడ్డ నుంచి రోజుకు రెండు టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోసేలా పనులు కొనసాగిస్తున్న ప్రభుత్వం, కొత్తగా మూడో టీఎంసీ నీటిని తీసుకునే ప్రణాళికకు అంగీకారం తెలిపింది. మంగళవారం జరిగిన కేబినెట్ భేటీలో అదనంగా మరో టీఎంసీ తీసుకునే ప్రణాళికను ఆమోదించడమే కాకుండా, దానికయ్యే వ్యయ అంచనాలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. పైప్లైన్ వ్యవస్థ ద్వారానే నీటిని తీసుకునేలా రూపొందించిన ప్రణాళికకు ఓకే చెప్పింది. దీంతో పాటే ఇప్పటికే నిర్మాణంలో ఉన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో అదనపు మోటార్ల ఏర్పాటుకయ్యే అదనపు వ్యయాల అంచనాలను సమ్మతించింది. (చదవండి : కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుదోవ పట్టించొద్దు ) మిడ్మానేరు దిగువన పైప్లైన్ ద్వారానే.. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రోజుకు 2టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా పనులు చేస్తున్నారు. దీనిలో భాగంగా మేడిగడ్డ పంప్హౌస్ వద్ద 11, అన్నారం వద్ద 8, సుందిళ్ల వద్ద 9 మోటార్లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మూడో టీఎంసీ నీటిని తీసుకునేందుకు వీటికి అదనంగా 3 పంప్హౌస్ల్లో కలిపి మరో 15 మోటార్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పడున్న వాటితో కలిపి అదనంగా మేడిగడ్డలో 6, అన్నారంలో 4, సుందిళ్లలో 5 మోటా ర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ అదనపు మోటార్ల ఏర్పాటుతో పాటు, వాటికి అనుగుణంగా పలు నిర్మాణాలు చేయాల్సి ఉండటంతో వ్యయం పెరుగుతోంది. గత అంచనా 3 పంప్హౌస్లకు కలిపి రూ.7,998 కోట్లు ఉండగా, ప్రస్తుతం అది రూ.12,392కోట్లకు చేరుతోంది.ఈ పెరిగిన వ్యయాలకు కేబినెట్ ఓకే చెప్పింది. ఇక మిడ్మానేరు దిగువన మల్లన్నసాగర్ వరకు మొదట టన్నెల్ ద్వారా నీటిని తరలించాలని నిర్ణయించినా, దీని నిర్మాణాలకు చాలారోజులు పడుతున్న నేపథ్యంలో పైప్లైన్ వ్యవస్థ ద్వారా నీటిని తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నీటి తరలింపునకు 3 స్థాయిల్లో లిఫ్టులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనిలో మిడ్మానేరు నుంచి అనంతగిరి రిజర్వాయర్ వరకు పైప్లైన్ వ్యవస్థ నిర్మాణానికి రూ.4,142 కోట్లు, అనంతగిరి నుంచి మల్లన్నసాగర్ వరకు పైప్లైన్ నిర్మాణానికి రూ.10,260 కోట్లు అవుతుందని అంచనా వేశారు. మొత్తంగా ఈ నిర్మాణానికి రూ.14,362 కోట్ల మేర వ్యయం అవుతుండగా, దీనికి ఆమోదం తెలిపిన కేబినెట్ వచ్చే ఏడాది నాటికి ఈ పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది. పాలమూరు రుణాలు.. ఎస్ఎల్బీసీ.. ఎస్సారెస్పీ కాల్వలు.. వీటితో పాటే కేబినెట్ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.10 వేల కోట్లు రుణాలు తీసుకునేందుకు కేబినెట్ అనుమతినిచ్చింది. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారానే ఈ రుణాల సేకరణ జరుగనుంది. ఇక దీంతో పాటే ఎస్సారెస్పీ స్టేజ్–2లో కాల్వల లైనింగ్ పనుల కోసం రూ .653 కోట్ల కేటాయింపునకు సైతం ఓకే చెప్పింది. అలాగే ఏఎంఆర్పీ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనుల సత్వర పూర్తికి రూ.63.50 కోట్ల అడ్వాన్సులు కోరగా దానికి సమ్మతించింది. దీంతో పాటే కొత్తగా గొలుసుకట్టు చెరువుల అనుసంధానానికి వీలుగా తూములు, చెక్డ్యామ్ల నిర్మాణం చేయాలని నిర్ణయించి, పనులు సైతం మొదలు పెట్టగా, ఆ పనులను చేపట్టేందుకు అంగీకారం తెలిపింది. -
కాళేశ్వరంలో మెగా పవర్
హైదరాబాద్ : కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి అవసరమైన భారీ విద్యుత్ సరఫరా వ్యవస్థలో అత్యధిక భాగాన్ని ఎంఈఐఎల్ ఏర్పాటు చేసి తన చరిత్రను తానే తిరగరాసింది. ఇంతవరకు నీటిపారుదల రంగానికి ఎక్కడా ఏర్పాటు కానటువంటి అతిపెద్ద విద్యుత్ సరఫరా వ్యవస్థ రికార్డు సమయంలో పూర్తి చేసింది. ఈ విద్యుత్ సరఫరా వ్యవస్థ ఎంత పెద్దదంటే దేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు సరఫరా అయ్యే విద్యుత్తో సమానమైనది. ఈశాన్య రాష్ట్రాల విద్యుత్సరఫరా మొత్తం 3916 మెగావాట్లు కాగా, కాళేశ్వరం ప్రాజెక్టుకోసం ఎంఈఐఎల్ ఏర్పాటు చేసిన విద్యుత్ వ్యవస్థ సామర్ధ్యం 3057 మెగావాట్లు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తానికి వినియోగించే విద్యుత్ 4627 మెగావాట్లు. అంటే కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి వినియోగించే విద్యుత్లో 66 శాతం విద్యుత్వ్యవస్థను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసిందే. రైతాంగానికి అవసరమయ్యే విధంగా భారీ ఎత్తిపోతల పథకాన్ని, అందుకు అవసరమయ్యే విద్యుత్వ్యవస్థను ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేయటం ప్రపంచంలోనే తొలిసారి అని నిపుణుల అభిప్రాయం. రెండేళ్లలో కాళేశ్వరానికి అవసరమైన విద్యుత్ సరఫరాకు 260 కిలోమీటర్ల మేర విద్యుత్సరఫరా లైన్లను ఎంఈఐఎల్నిర్మించింది. 400 కేవీ, 220 కేవీ సామర్ధ్యం కలిగిన ఆరు సబ్స్టేషన్లను అతితక్కువ సమయంలో ఎంఈఐఎల్నిర్మించింది. ఈ సబ్స్టేషన్ల ద్వారా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ప్యాకేజీ 8, 10, 11 పంపుహౌజ్లలో ఏర్పాటు చేసిన 43 మోటార్లకు విద్యుత్సరఫరా చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 6,12,14 ప్యాకేజీల్లోని సబ్స్టేషన్లు మినహా మిగిలిన అన్ని సబ్స్టేషన్లతో పాటు విద్యుత్ పంపిణీ లైన్లను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. ప్యాకేజ్8 పంపుహౌజ్లో ఏడు భారీ పంపు మోటార్లకు (ఒక్కో పంపు మోటార్సామర్ధ్యం 139 మెగావాట్లు) అవసరమయ్యే విద్యుత్ వ్యవస్థను ఎంఈఐఎల్ రామడుగు దగ్గర ఏర్పాటు చేసింది. ఈ విద్యుత్సబ్స్టేషన్ను కరీంనగర్జిల్లా రామడుగు వద్ద 16 నెలల్లో నే ఎంఈఐఎల్ ఛార్జ్చేసింది. సుందిళ్ల పంపుహౌజ్కు విద్యుత్ను అందించే 400/220/11 కేవీ సబ్స్టేషన్నిర్మాణం 2017 జూలై 30న గత ఏడాది జూలై 18 నాటికి ఎంఈఐఎల్పూర్తి చేసింది. ఈ విద్యుత్ ఉప కేంద్రం సుందిళ్ల పంపుహౌజ్లోని 360 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన తొమ్మిది యూనిట్లకు (పంపు, మోటారు) విద్యుత్ను సరఫరా చేయనుంది. 220 కేవీ సామర్ధ్యం గల అన్నారం విద్యుత్ సబ్స్టేషన్తో పాటు, సుందిళ్ల నుంచి 28 కిలోమీటర్ల టీఎండీసీ ట్రాన్స్మిషన్లైన్పనులను 2017 ఏప్రిల్లో ప్రారంభించి, 17 నెలల్లో పూర్తి చేయడంతో పాటు ఛార్జింగ్ చేసింది ఎంఈఐఎల్. ఇది అన్నారంలోని 320 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన పంపుహౌజ్లోని ఎనిమిది యూనిట్లకు విద్యుత్సరఫరా చేస్తుంది. మేడిగడ్డ పంపుహౌజ్లో 11 యూనిట్లు ఉండగా, వాటికి 440 మెగావాట్ల విద్యుత్అవసరం అవుతుంది. ఈ విద్యుత్ను అందించేందుకు మేడిగడ్డలో 220 కేవీ సబ్స్టేషన్తో పాటు సుందిళ్ల నుంచి 80 కిమీ టీఎండీసీ విద్యుత్పంపిణీ లైన్ను ఏప్రిల్2017లో ప్రారంభించి 2018 సెప్టెంబర్9న విజయవంతంగా ఎంఈఐఎల్ఛార్జింగ్చేసింది. ప్యాకేజీ 10లోని నాలుగు యూనిట్ల పంపుహౌజ్కు అవసరమైన 424 మెగావాట్ల విద్యుత్సరఫరాకు అవసరమైన విద్యుత్కు 420/11 కేవీ ఉపకేంద్రాన్ని తిప్పాపూర్ వద్ద ఎంఈఐఎల్ నిర్మించింది. 8 నవంబర్2017లో ప్రారంభమైన ఈ పనులు 29 ఏప్రిల్2019లో పూర్తి చేసింది. కాళేశ్వరం 11వ ప్యాకేజీ లోని రంగనాయక సాగర్ పంపుహౌజ్లోని 541 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన నాలుగు యూనిట్లకు విద్యుత్ను అందించేందుకు చందులాపూర్ దగ్గర 400/13.8/11 కేవీ సబ్స్టేషన్ను ఎంఈఐఎల్ నిర్మించింది. రెండేళ్లలో ఈ సబ్స్టేషన్ నిర్మాణం పూర్తయింది. -
మేఘా విద్యుత్ రికార్డు
ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్లను విజయవంతంగా పూర్తి చేసిన ఎంఈఐఎల్ తాజాగా తెలంగాణకు ఎంతో ప్రాణాధారమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ అవసరాల కోసం 6 భారీ సబ్ స్టేషన్లను ప్రపంచంలోనే తొలిసారిగా త్వరితగతిన పూర్తిచేసి రికార్డ్ సాధించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్కు మొత్తం 4627 మెగావాట్ల విద్యుత్ అవసరం కాగా అందులో 3057 మెగావాట్ల విద్యుత్ సరఫరా వ్యవస్థను ఎంఈఐఎల్ యుద్ధప్రతిపాదికన పూర్తి చేసి తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకుంది. నీటిపారుదల రంగంలోనే అతిపెద్ద విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయడం ప్రపంచంలోని ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. ప్రైవేటు రంగంలో విద్యుత్ సరఫరా కోసం అతిపెద్దదైన WUPPTCL ఉత్తరప్రదేశ్లో ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. అయితే అది విద్యుత్ అవసరాలకోసం కాగా కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన విద్యుత్ వ్యవస్థ ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ అవసరాల కోసం ఏర్పాటు చేసింది. కేవలం రెండేళ్ల కాలంలోనే 6 భారీ సబ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది ఎంఈఐఎల్. ఇవన్నీ 400 కేవీ, 220 కేవీ సామర్థ్యం కలిగినవి. దాదాపు 260 కిలోమీటర్ల మేర ట్రాన్స్మిషన్ లైన్లను కూడా అతితక్కువ కాలంలోనే ఎంఈఐఎల్ పూర్తి చేసింది. 2017 ఫిబ్రవరిలో రామడుగు సబ్స్టేషన్తో పనులను ప్రారంభించి, ఒక్కో సబ్స్టేషన్ను పూర్తిచేస్తూ చివరగా ఆరో సబ్స్టేషన్ను 2019 మే నెలలో అందుబాటులోకి తీసుకొచ్చింది. అతిపెద్ద విద్యుత్ వ్యవస్థ కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంఈఐఎల్ ఏర్పాటు చేసిన విద్యుత్ సరఫరా వ్యవస్థ ఎంత పెద్దదంటే మన దేశంలోని జమ్ము కాశ్మీర్ (3428 మెగావాట్లు), ఉత్తరాఖండ్ (3356 మెగావాట్లు), హిమాచల్ ప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల విద్యుత్ సరఫరా వ్యవస్థలకు దాదాపుగా సమానం. రికార్డు సమయంలో ఎంఈఐఎల్ ఆరు సబ్ స్టేషన్లు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ప్యాకేజీ 8, 10, 11 పంప్ హౌజ్ లలో ఏర్పాటు చేసిన మొత్తం 43 పంపుమోటార్లకు విద్యుత్ ను అందించేందుకు అవసరమైన ఆరు విద్యుత్ సబ్స్టేషన్లను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్యాకేజీ 6, 12, 14 సబ్ స్టేషన్ లు మినహా మిగతా అన్ని సబ్ స్టేషన్ లను, విద్యుత్ సరఫరా లైన్లను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. అతిపెద్ద భూగర్భ పంపింగ్ స్టేషన్కు విద్యుత్వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ పంపింగ్ స్టేషన్ కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ 8లో భాగంగా ఎంఈఐఎల్ నిర్మించింది. ఈ పంప్ హౌజ్ లో ఒక్కోటి 139 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఏడు భారీ పంప్ మోటార్లకు విద్యుత్ ను అందించేందుకు 400/13.8/11 కేవీ సబ్ స్టేషన్ ను ఎంఈఐఎల్ రామడుగు వద్ద ఏర్పాటు చేసింది. దీని కోసం 18 కిలోమీటర్ల 400 కేవీ క్యూఎండీసీ ట్రాన్స్ మిషన్ లైన్ను కూడా ఏర్పాటు చేసింది. రామడుగు సబ్ స్టేషన్, ట్రాన్స్ మిషన్ లైన్ పనులను 2017 ఫిబ్రవరి 22న ప్రారంభించి, కేవలం ఏడాది కాలంలో పనులను పూర్తిచేసి, 2018 మే 6న చార్జ్ చేసి అందుబాటులోకి తెచ్చింది. తొమ్మిది యూనిట్లతో 360 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సుందిళ్ల పంప్ హౌజ్ కు విద్యుత్ ను అందించే 400/220/11 కేవీ సుందిళ్ల సబ్ స్టేషన్ ను ఎంఈఐఎల్ గడువులోగా పూర్తి చేసింది. ఈ సబ్ స్టేషన్ నుంచే 220 కేవీ అన్నారం, 220 కేవీ మేడిగడ్డ సబ్ స్టేషన్లకు విద్యుత్ అందుతుంది. 320 మెగావాట్ల సామర్థ్యం కలిగిన అన్నారం పంప్ హౌజ్ కు విద్యుత్ ను అందించేందుకు 220 కేవీ అన్నారం సబ్ స్టేషన్, సుందిళ్ల నుంచి 28 కిలోమీటర్ల టీఎండీసీ ట్రాన్స్ మిషన్ లైన్ ను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. ఈ సబ్ స్టేషన్ పనులను 2017 ఏప్రిల్ 1న ప్రారంభించి, 2018 సెప్టెంబర్ 14న చార్జింగ్ ప్రక్రియను పూర్తి చేసింది. 440 మెగావాట్ల సామర్థ్యంతో 11 యూనిట్లను కలిగిన మేడిగడ్డ పంప్ హౌజ్ కు విద్యుత్ అందించేందుకు 220 కేవీ మేడిగడ్డ సబ్ స్టేషన్ తోపాటు సుందిళ్ల నుంచి 80 కిలోమీటర్ల టీఎండీసీ ట్రాన్స్ మిషన్ లైన్ ఏర్పాటు చేశారు. దీని పనులను 2017 ఏప్రిల్ లో ప్రారంభించి, 2018 సెప్టెంబర్ 29న చార్జింగ్ ప్రక్రియను నిర్దేశిత గడువు కన్నా ముందే పూర్తి చేసింది. తిప్పాపూర్ సబ్ స్టేషన్ తో ప్యాకేజీ 10కు విద్యుత్ సిరిసిల్ల జిల్లా తిప్పాపూర్ వద్ద ఏర్పాటు చేసిన ప్యాకేజీ 10 పంప్ హౌజ్ లోని మొత్తం 425 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు యూనిట్లకు విద్యుత్ ను అందించేందుకు 400/11 కేవీ తిప్పాపూర్ సబ్ స్టేషన్ ను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. రామడుగు సబ్ స్టేషన్ నుంచి 46.115 కిలోమీటర్ల లైన్ తోపాటు చందులాపూర్ నుంచి 19.096 కిలోమీటర్ల క్యూఎండీసీ లైన్ ను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. ఈ సబ్ స్టేషన్, లైన్ల పనులను 2017 నవంబర్ 8న ప్రారంభించి, 2019 ఏప్రిల్ 29న అందుబాటులోకి తెచ్చారు. సిద్ధిపేట వద్ద ఏర్పాటు చేస్తున్న ప్యాకేజీ 11 రంగనాయకసాగర్ పంప్ హౌజ్ లోని 541 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు యూనిట్లకు విద్యుత్ ను అందించేందుకు చందులాపూర్ వద్ద 400/13.8/11 కేవీ సబ్ స్టేషన్ ను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. భూపాలపల్లి కేటీపీపీ నుంచి గజ్వేల్ సబ్ స్టేషన్ అక్కడి నుంచి చందులాపూర్ వరకు 54.18 కిలోమీటర్ల ట్రాన్స్ మిషన్ లైన్ ను ఏర్పాటు చేశారు. ఈ పనులను మే 2017లో ప్రారంభించగా, 2019 మే 6న చార్జింగ్ చేశారు. -
150 టీఎంసీలు ఎత్తిపోయాలి
సాక్షి ప్రతినిధి, వరంగల్/సాక్షి, జగిత్యాల: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలంటే దశాబ్దాలు పట్టే దేశంలో రెండు మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పలు బ్యారేజీలు, అత్యంత క్లిష్టమైన ఎత్తిపోతల నిర్మాణాలు, విద్యుత్ సబ్ స్టేషన్లను పూర్తిచేస్తుండడంతో ప్రపంచం తెలంగాణ వైపు చూస్తోందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు వ్యాఖ్యానించారు. వలస పాలనలో నత్తనడకన నడిచిన తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల పనులు.. స్వయంపాలనలో యుద్ధప్రాతిపదికన పూర్తి కావస్తుండడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఈ ఏడాదిలోనే రివర్స్ పంపింగ్ ద్వారా కాళేశ్వరం నీటితో ఎస్సారెస్పీ ప్రాజెక్టును నింపుతామని స్పష్టంచేశారు. అలాగే 150 టీఎంసీల నదీజలాలను ఎత్తిపోసే విధంగా మేడిగడ్డ ప్రాజెక్టులు సిద్ధం చేయాలని.. తద్వారా కాళేశ్వరం నుంచి కోదాడ వరకు గోదావరి జలాలు పంటచేలను తడపాలని ఆకాంక్షించారు. వీలైనంత మేర గోదావరి జలాలను జూన్లోనే వినియోగంలోకి తేవాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరి«ధిలోని పలు పంపుహౌస్లు, బ్యారేజీలను మంగళవారం ఆయన సందర్శించారు. ఉదయం 8.45 గంటలకు జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ వద్ద నిర్మిస్తున్న పంపుహౌస్కు హెలికాప్టర్లో చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న రివర్స్ పంపింగ్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. నాలుగు జిల్లాలకు సాగునీరందించే శ్రీరాంసాగర్ ప్రాజెక్టును నింపే రాంపూర్ పంపుహౌస్ను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని ఆదేశించారు. పంపుహౌస్ ఎనిమిది మోటార్లలో ఐదింటిని జూలై 15లోగా ఏర్పాటు చేయాలని, మిగిలిన మూడు పంపుల పనులు ఆగస్టులోగా పూర్తిచేయాలని స్పష్టంచేశారు. మేడిగడ్డ వద్ద పనుల వివరాలు అడిగి తెలుసుకుంటున్న సీఎం కేసీఆర్ వచ్చే నెలలోనే కాళేశ్వరం నీటిని రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీకి పంపించాలని, ఇందుకు అనుగుణంగా అందరూ పనిచేయాలన్నారు. పనుల పురోగతిపై వారంలో రెండుసార్లు అధికారులతో సమీక్షించాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని ఆదేశించారు. జూలై నాటికి ఐదు పంపుల నిర్మాణాన్ని పూర్తిచేసి రోజుకు 0.6 టీఎంసీ నీటిని వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీకి ఎత్తిపోసేందుకు సిద్ధంగా ఉంచుతామని ప్రాజెక్టు ఈఎన్సీ మురళీధర్రావు సీఎంకు తెలిపారు. జూన్ 15నాటికి మోటార్ల డ్రైరన్ను పూర్తి చేస్తామని జూలై 15 నుంచి నీటిని ఎత్తిపోసే ప్రక్రియ మొదలవుతుందని వివరించారు. దాదాపు అరగంటపాటు అక్కడే ఉన్న సీఎం.. అనంతరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు వెళ్లారు. నదిలోకి దిగి మొక్కు చెల్లింపు... సీఎం కేసీఆర్ తొలుత హెలికాప్టర్లో ఏరియల్ వ్యూ ద్వారా మేడిగడ్డ ప్రాజెక్టు పనులు పరిశీలించారు. తర్వాత ప్రాజెక్టు పక్కన వ్యూ పాయింట్ నుంచి పనుల పురోగతిని చూసి, అధికారులకు పలు సూచనలు చేశారు. అక్కడ నుంచి బ్యారేజీ మీదుగా ప్రయాణిస్తూ.. ఇప్పటికే అమర్చిన 85 గేట్లను అక్కడక్కడా ఆగి పరిశీలించారు. ఆ తర్వాత బ్రిడ్జి దిగి కాఫర్ డ్యాం మీదుగా వెళ్లి పనులు సాగుతున్న తీరును స్వయంగా చూశారు. ఎండను సైతం తట్టుకుని పనిచేస్తున్న వర్కర్లకు అభినందనలు తెలిపారు. పక్కనే పాయలా పారుతున్న గోదావరి నది లోపలికి దిగి నడుచుకుంటూ ముందుకు వెళ్లి నదిలో మొక్కు పైసలు జారవిడిచారు. మరికొద్ది రోజుల్లో ఆ ప్రాంతమంతా జలమయం కానుందని, అక్కడ ఇకపై ఎవరూ నిలబడలేరని, అదో చారిత్రక సందర్భమని సీఎం వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తన వెంట వచ్చిన అధికారులు, పార్టీ నాయకులు, సిబ్బందితో ఫొటోలు దిగారు. సీఎం కేసీఆర్ మండుటెండను కూడా లెక్క చేయకుండా మేడిగడ్డ ప్రాజెక్టు మొత్తం కలియతిరిగి అణువణువూ పరిశీలించారు. వారం పదిరోజుల్లో పూర్తి చేయండి... ప్రాజెక్టు పరిశీలన అనంతరం సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం 85 గేట్ల బిగింపు పూర్తి అయిందని, డ్యాం నుంచి చుక్క నీరు కూడా పోకుండా చూసేందుకు బిగిస్తున్న రబ్బరు సీలింగ్ పనులు సాగుతున్నాయని అధికారులు సీఎంకు తెలిపారు. 26 గేట్లకు రబ్బరు సీలు ఫిక్సింగ్ పూర్తికాగా, మిగిన 59 గేట్లకు బిగించాల్సి ఉందని చెప్పారు. ఈ పనులన్నీ వారం పదిరోజుల్లో పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. గోదావరి నదీ జలాలను వీలైనంత వరకు జూన్లోనే వినియోగంలోకి తేవాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. మేడిగడ్డ పని పూర్తి చేసుకుని తద్వారా ప్రాణహిత నుంచి వచ్చే జలాలను ఈ సీజన్లోనే బ్యారేజీలో నిలువరించాలని సూచించారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ వద్ద పంపుహౌస్ పనులను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్ మేడిగడ్డ నుంచి కన్నెపల్లి పంపుహౌస్ ద్వారా అన్నారం బ్యారేజీలోకి, అక్కడనుంచి సుందిళ్ల బ్యారేజీలోకి రివర్స్ పంపింగ్ చేయడానికి సంబంధించిన పంపుహౌస్ల నిర్మాణాలు త్వరలో పూర్తి చేయాలని పేర్కొన్నారు. కన్నెపల్లి పంపు హౌస్ నుంచి అన్నారం బ్యారేజీకి 3 టీఎంసీల నీటిని తీసుకెళ్లే సామర్థ్యం కలిగిన 13.5 కిలోమీటర్ల అతిపెద్ద కాలువ పని కూడా పూర్తయిందని, ఆ నీటిని ఎల్లంపల్లి వరకు ఎత్తిపోసి, అక్కడ నుంచి నందిమేడారం పంపుల ద్వారా ఎస్సారెస్సీ వరద కాలువకు కాళేశ్వరం జలాలను చేరవేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. అదే వరద కాలువ ద్వారా మిడ్ మానేర్ డ్యాంను నింపితే, అక్కడ నుంచి మల్లన్నసాగర్ వరకు నీటిని తరలించడానికి అవకాశం ఏర్పడుతుందని సీఎం వివరించారు. వాకీటాకీలను సమకూర్చుకోండి... ఐదు పంపు హౌజులు, మూడు బ్యారేజీల పనులను పూర్తిచేసుకుని 150 టీఎంసీల నదీ జలాలను ఎత్తిపోయడానికి సిద్ధంగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. తద్వారా కాళేశ్వం నుంచి కోదాడ వరకు గోదావరి జలాలు పంట చేలను తడపాలని ఆకాంక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్టులు ఒక సమాహారంగా ఉన్నందున ఒక బ్యారేజీ నుంచి ఇంకో బ్యారేజీకి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడానికి తగిన ఫోన్లతో పాటు వైర్లెస్ వాకీటాకీల వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రాజెక్టులు పూర్తయి జలాలు వినియోగంలోకి వచ్చిన తర్వాత నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉన్నందున ప్రాజెక్టుల వద్ద నీటిపారుదల శాఖ శాశ్వత భవనాలను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. దేవుడు కరుణించి అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ప్రాజెక్టులకు దేవతామూర్తుల పేర్లు గానీ తెలంగాణ చరిత్రను సంస్కృతిని ప్రతిబింబించే పేర్లను గానీ పెట్టుకుందామని కేసీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ వెంట మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీలు సంతోష్కుమార్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్, టీఆర్ఎస్ నేతలు శ్రవణ్ కుమార్రెడ్డి, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్రెడ్డి, రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ రాజేశంగౌడ్, కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, ‘మెగా’కృష్ణారెడ్డి, నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్రావు, ఎన్పీడీసీఎల్ సీఎండీ ఏ.గోపాల్రావు తదితరులు ఉన్నారు. -
20న ముహూర్తం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సాగునీటి రంగ ముఖచిత్రాన్ని మార్చే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటి ఎత్తిపోతలకు రంగం సిద్ధమైంది. అన్నీ కుదిరితే ఈ నెల 20 నుంచే గోదావరి వరదను ఒడిసిపట్టేలా నీటి పారుదల శాఖ ముహూర్తం ఖరారు చేసింది. ఇప్పటికే సిద్ధమైన పంపుల ద్వారా తొలి దశలో అర టీఎంసీ నీటిని ఎత్తిపోస్తూ, క్రమంగా వచ్చే నెల ఇరవై నాటికి పూర్తి స్థాయిలో 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా కార్య ప్రణాళిక సిద్ధం చేసింది. వచ్చే నెల చివరి నుంచి ఇప్పటికే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఒక టీఎంసీ నీటిని మిడ్మానేరు కింది అవసరాలకు, మరో టీఎంసీ నీటిని ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథక సాగు అవసరాలకు మళ్లించేలా అన్ని పనులు పూర్తి చేసే పనిలో నిమగ్నమైంది. ఈ పనులను మంగళవారం పరిశీలించనున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నీటి ఎత్తిపోతలపై అధికారులకు మార్గదర్శనం చేయనున్నారు. వరద ఉధృతమయ్యే నాటికి అంతా సిద్ధం... కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మొత్తంగా 13 జిల్లాల్లోని 18.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, మరో 18.82 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం మేడిగడ్డ బ్యారేజీ నుంచి 200 టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు ప్రణాళిక రూపొందించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలు ఇప్పటికే పూర్తవగా, పంప్హౌజ్ల్లో మోటార్ల బిగింపు పాక్షికంగా పూర్తయింది. గోదావరిలో వరద మొదలవగానే నీటిని ఎత్తిపోసేలా నిర్మాణ పనులు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే మేడిగడ్డ పంప్హౌజ్లో 11 మోటార్లకు 6, అన్నారంలో 8లో 5, సుందిళ్లలో 9లో 6 మోటార్ల బిగింపు పూర్తయింది. మిగతా వాటిని వచ్చే నెల 15 నాటికి పూర్తి స్థాయిలో బిగించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బిగింపు పూర్తయిన మోటార్లకు ఈ నెల మొదటి వారంలోనే వెట్రన్ నిర్వహించాల్సి ఉన్నా ముఖ్యమంత్రి ఆదేశాలతో ఈ నెల రెండో వారంలో అన్ని పంపులకు ఒకేమారు వెట్రన్ నిర్వహించి, అవి ఫలప్రదం అయిన వెంటనే నీటిని ఎత్తిపోసేలా కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ నెల 20 నుంచి మేడిగడ్డ లిఫ్ట్ ద్వారా రోజుకి 0.55 టీఎంసీల నీటితో మొదలు పెట్టి, క్రమంగా వచ్చే నెల 11వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో 2 టీఎంసీల నీటిని తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 28 నుంచి అన్నారం, వచ్చే నెల 4 నుంచి సుందిళ్ల మోటార్ల ద్వారా నీటిని ఎల్లంపల్లికి తరలించి దాన్ని పూర్తి స్థాయిలో నింపనున్నారు. ఎల్లంపల్లి దిగువన ప్యాకేజీ–6లో 7 మోటార్లలో 4 పూర్తవగా, ప్యాకేజీ–8లో 7కు గానూ 5 పూర్తయ్యాయి. మిగతా వన్నీ వచ్చే నెలలో పూర్తవనున్నాయి. జులై 20 నాటికి ప్యాకేజీ– 8 ద్వారా మిడ్మానేరుకు ఒక టీఎంసీ, మరో టీఎంసీ నీటిని వరద కాల్వ ద్వారా ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి తరలించేలా ప్రస్తుతం కార్యచరణ సిద్ధం చేస్తున్నారు. పునరుజ్జీవ పథకంలో ఇప్పటికే రెండు పంప్హౌజ్ల్లో రోజుకు 0.65 టీఎంసీ నీటిని ఎత్తిపోసి కనిష్టంగా 55 టీఎంసీలు ఆయకట్టుకు తరలించేలా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నీటితో ఎస్సారెస్పీ కింది 9 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించే అవకాశాలున్నాయి. ఇక మిడ్మానేరు కింద కొత్తగా 30 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరివ్వడంతో పాటు, కొండపోచమ్మ సాగర్ వరకు నీటిని తరలిస్తూనే చెరువులన్నీ నింపనున్నారు. సీఎం పరిశీలన.. ఎస్సారెస్పీ పునర్జీవ పథకంలో భాగంగా జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ వరద కాల్వ వద్ద నిర్మిస్తున్న పంప్హౌస్లో మొదటి మోటర్కు ఇటీవల డ్రైరన్ నిర్వహించగా అది విజయవంతం అయింది. ఇక్కడ 8 పంపులలో 4 సిద్ధమయ్యాయి. ఈ పనులను సీఎం పరిశీలించి మార్గనిర్దేశం చేయనున్నారు. ఈ సందర్భంగా మరోమారు డ్రైరన్ నిర్వహించేందుకు అధికారులు అంతా సిద్ధం చేశారు. నేడు సీఎం షెడ్యూల్ ఇలా... ► ఉ. 6 గంటలు: ప్రగతిభవన్ నుంచి కేసీఆర్ బయలుదేరుతారు. ► ఉ. 7 గంటలు: హెలిక్యాప్టర్లో రాంపూర్ చేరుకొని పంపులను పరిశీలిస్తారు. ► ఉ. 7.45: మేడిగడ్డ బ్యారేజీకి చేరుకొని అక్కడి పనులను పరిశీలించి మార్గనిర్దేశం చేస్తారు. ► ఉ. 11.45 గంటలు: మేడిగడ్డ నుంచి హైదరాబాద్కు బయల్దేరి వస్తారు. -
25న కన్నెపల్లిలో వెట్రన్!
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరాయి. ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి పంపుహౌస్, మేడిగడ్డ బ్యారేజీ పనులను క్షేత్రస్థాయిలో ఆదివారం పరిశీలించిన సీఎం కేసీఆర్ అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచనలు చేశారు. వర్షాలు రాకముందే పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ఖరీఫ్కు నీరందించాలంటే అత్యంత కీలకమైన మేడిగడ్డ(కన్నెపల్లి) పంపుహౌస్లో మోటార్ల బిగింపులో వేగం పెంచి ఈ నెల చివర, జూన్ మొదటి వారంలోగా వెట్రన్ నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. దీంతో ఇంజనీర్లు, కాంట్రాక్టర్ల ప్రతినిధులు పనులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. కన్నెపల్లి పంపుహౌస్లో ఈ నెల 24 లేదా 25న వెట్రన్ నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే బిగించిన 8 మోటార్లలో 5 మోటార్లకు దశల వారీగా వెట్రన్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నీటి తరలింపు కన్నెపల్లి పంపుహౌస్ నిర్మాణానికి దిగువన 400 మీటర్ల దూరంలో గోదావరి, ప్రాణహిత నదులు ప్రవహిస్తున్నాయి. వెట్రన్ చేయడానికి వేసవి కాలం కావడంతో నీటి లభ్యత తక్కువగా ఉంది. గోదావరికి అడ్డంగా తాత్కాలికంగా కాఫర్ డ్యాంను 20 రోజుల క్రితం నిర్మించారు. ఆదివారం సీఎం పర్యటన ముగిశాక కాఫర్ డ్యాం కట్టను తెంపడంతో నీటి ప్రవాహం ఫోర్బేకు చేరింది. సోమవారం వరకు కాఫర్ డ్యాంకు మళ్లీ అప్రోచ్కెనాల్ వద్ద కట్టను మూసీ వేసి వెట్రన్ కోసం నీటిని నిల్వ ఉంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రోజుకు 2 టీఎంసీలు కన్నెపల్లి పంపుహౌస్లో మొత్తం 11 మోటార్లు బిగించాలి. ఇప్పటికే 8 మోటార్లు బిగించగా, మరో 2 మోటార్ల పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ ఖరీఫ్లో కనీసం 5 మోటార్లకు వెట్రన్ పరీక్షలు నిర్వహించి రోజుకు 2 టీఎంసీల చొప్పున నీటిని రివర్స్ పంపింగ్ విధానం ద్వారా ఎగువకు తరలించడానికి ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నారు. ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు ఈఈ, డీఈఈ, జేఈఈలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పనుల ప్రగతిపై ఆరా తీస్తున్నారు. -
మేడిగడ్డ రిజర్వాయర్పై కేసీఆర్ సమీక్ష
-
కాళేశ్వరంలో ‘మోటార్’ రేస్
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని మళ్లించే ప్రక్రియకు గడువు ముంచుకొస్తోంది. గోదావరిలో వరద మొదలయ్యేందుకు మరో నెల రోజులకు మించి సమయం లేకపోవడంతో ఆలోగా పనులన్నీ పూర్తి కావాల్సి ఉంది. మే నెలాఖరుకే అన్ని పంప్హౌస్లలో మోటార్ల బిగింపు ప్రక్రియ పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా పనులు జరుగుతున్నా వేసవి తాపం, మధ్యలో కురిసిన వర్షాలు కొంత అవాంతరం సృష్టించాయి. దీంతో జూన్లో అన్ని మోటార్ల బిగింపు ప్రక్రియ పూర్తి చేసి జూలైలో వరద పుంజుకునే నాటికి గోదావరి నీటిని ఎత్తిపోసేలా ప్రస్తుతం అధికారులు పనులు ముమ్మరం చేశారు. - సాక్షి, హైదరాబాద్ జూన్లో వెట్రన్.. జూలై నుంచి ఎత్తిపోతలు ప్రస్తుతం మేడిగడ్డ మినహా అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనులన్నీ పూర్తయ్యాయి. మేడిగడ్డ బ్యారేజీలో 85 గేట్లకుగాను 35 గేట్లను ఇప్పటికే అమర్చగా మిగతా గేట్లు అమర్చే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మేడిగడ్డ పరిధిలో గోదావరిలో కలిసే చిన్నచిన్న వాగులు, వంకలన్నీ బ్యారేజీ వెనుక భాగంలో కలుస్తున్నాయి. దీంతో వరద అధికంగా ఉంటే బ్యారేజీ వెనుక భాగంలో ముంపు ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాగులు, వంకల నీటిని డైవర్షన్ చానల్ నిర్మించి బ్యారేజీ ముందుకు మళ్లించేలా చూడాలని సీఎం సూచించారు. ఈ పనులు పూర్తి చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇక మేడిగడ్డ పంప్హౌస్లో 11 మోటార్లకుగాను 6 మోటార్లు అమర్చే ప్రక్రియ పూర్తికాగా అన్నారంలో 8కిగాను 5, çసుందిళ్లలో 8కిగాను 6 మోటార్ల అమరిక పూర్తయింది. మిగతా మోటార్లలో వీలైనన్ని ఈ నెలాఖరుకు, మిగతావి జూన్ తొలి లేదా రెండో వారానికి పూర్తి చేసేలా లక్ష్యం నిర్దేశించుకున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితేనే ప్రభుత్వం నిర్దేశించిన విధంగా రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం సాధ్యమవుతుంది. లేనిపక్షంలో కనిష్టంగా రోజుకు ఒక టీఎంసీని వరద ఉండే అన్ని రోజుల్లో ఎత్తిపోయాలని నిర్ణయించారు. ఇప్పటికే సిద్ధమైన మోటార్లకు జూన్లో వెట్రన్ నిర్వహించనుండగా జూలై నుంచి గోదావరి వరద నీటిని ఎత్తిపోయనున్నారు. ఇక ప్యాకేజీ–6లో 7 మోటార్లకుగాను 4 సిద్ధమవగా ఇందులో రెండింటికి ఇప్పటికే వెట్రన్ నిర్వహించగా మరో రెండింటికి బుధవారం వెట్రన్ నిర్వహించారు. ఈ ప్రక్రియ విజయవంతం అయింది. మిగతా మోటార్లను వచ్చే నెల మొదటి వారానికి సిద్ధం చేయాలని లక్ష్యం నిర్దేశించారు. ఇక ప్యాకేజీ–8లోనూ7 మోటార్లకుగాను 6 ఇప్పటికే సిద్ధమవగా వాటికి జూన్లో వెట్రన్ నిర్వహించే అవకాశం ఉంది. పంప్హౌస్ల పనులన్నీ పాత ఏజెన్సీకే... గోదావరి నుంచి అదనంగా మరో టీఎంసీ నీటిని సైతం ఎత్తిపోయాలని భావిస్తున్న ప్రభుత్వం... అందుకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంప్హౌస్లలో అదనపు పంపులు, మోటార్లు బిగించే ప్రక్రియను పాత ఏజెన్సీకే అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ పంప్హౌస్లకు సంబంధించి రూ. 7,962 కోట్ల మేర పనులను మేఘా ఏజెన్సీకి అప్పగించారు. తదనంతరం ఈ పనుల్లో అదనపు మోటార్ల ఏర్పాటుకు సంబంధించిన పనులను జత చేసి వ్యయ అంచనాను రూ. 12,324 కోట్లకు సవరించారు. ప్రస్తుతం ఎస్ఏఎస్ఆర్ ప్రకారం ఈ రేట్లను రూ. 12,392 కోట్లకు సవరించారు. అదనంగా మూడు పంప్హౌస్ల పరిధిలో 15 మోటార్లను ఏర్పాటు చేయనుండగా ఈ పనులకు కొత్తగా టెండర్లు పిలిస్తే మూడు నెలలు పట్టే అవకాశం ఉండటం, మళ్లీ మోటార్లను విదేశాలను తెప్పించేందుకు మరింత జాప్యం కానుండటం వంటి కారణాల నేపథ్యంలో ఈ పనులను పాత ఏజెన్సీకే కట్టబెట్టాలని మంగళవారం జరిగిన నీటిపారుదలశాఖ ఎస్ఎల్బీసీ సమావేశంలో నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
మూడో టీఎంసీ లెక్క కొలిక్కి!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక అంకానికి ప్రాణం పోసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే మేడిగడ్డ నుంచి రోజుకు 2 టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోసేలా చర్యలు చేపడుతున్న ప్రభుత్వం.. కొత్తగా మూడో టీఎంసీ నీటిని తీసుకునేందుకు కార్యాచరణ రూపొందించి అనుమతులిచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో అదనపు మోటార్ల ఏర్పాటుకు అయ్యే వ్యయం, మిడ్మానేరు నుంచి మల్లన్నసాగర్ వరకు అయ్యే వ్యయ అంచనాలు సిద్ధం చేసి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అనుమతి కోసం నీటిపారుదల శాఖ పంపింది. దీనికి సీఎం ఆమోదం తెలిపిన వెంటనే ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేయనుంది. ఆమోదమే తరువాయి.. రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా మేడిగడ్డ పంప్హౌజ్ వద్ద 11, అన్నారం వద్ద 8, సుందిళ్ల వద్ద 9 మోటార్లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మూడో టీఎంసీ నీటిని తీసుకునేందుకు వీటికి అదనంగా మూడు పంప్హౌజ్లలో కలిపి మరో 15 మోటార్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పుడున్న వాటితో కలిపి అదనంగా మేడిగడ్డలో 6, అన్నారంలో 4, సుందిళ్లలో 5 మోటార్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ అదనపు మోటార్ల ఏర్పాటుతో పాటు, వాటి ఏర్పాటుకు అనుగుణంగా పలు నిర్మాణాలు చేయాల్సి ఉండటంతో వ్యయం పెరుగుతోంది. పెరిగిన అంచనా వ్యయం.. గత అంచనా ప్రకారం మూడు పంప్హౌజ్లకు కలిపి రూ.7,998 కోట్లు ఉండగా, ప్రస్తుతం అది రూ.12,392 కోట్లకు చేరనుంది. ఈ పంప్హౌజ్ల ద్వారా ఎల్లంపల్లికి వచ్చే నీటిని మిడ్మానేరు వరకు తరలించే ప్రక్రియ కోసం అప్రోచ్ చానల్, గ్రావిటీ కాల్వ, టన్నెళ్ల నిర్మాణాలకు రూ.10,500 కోట్లు అంచనా వేశారు. మిడ్మానేరు నుంచి ఒక టీఎంసీ నీటిని అనంతగిరి రిజర్వాయర్, అటునుంచి రంగనాయక్సాగర్ తిరిగి అటునుంచి కొమురవెల్లి మల్లన్నసాగర్ వరకు తరలించేలా కొత్త ప్రణాళిక సిద్ధం చేశారు. దీనికోసం అదనంగా 11,500 క్యూసెక్కుల సామర్థ్యంతో గ్రావిటీ కాల్వలు, అప్రోచ్ చానల్, టన్నెళ్లు, 3 పంప్హౌజ్ల నిర్మాణాలు అవసరం ఉంటాయని లెక్కగట్టారు. దీనికై మొత్తంగా రూ.12,594కోట్లు ఖర్చవుతుందని ప్రణాళిక వేశారు. మొత్తం రూ.27,488 కోట్ల మేర అదనపు వ్యయం అవుతుందని అంచనా వేశారు. -
మేడిగడ్డ బ్యారేజ్ పనులు పరిశీలించిన సీఎం కేసీఆర్
-
శరవేగంగా కాళేశ్వరం పనులు
మహదేవపూర్: తెలంగాణ ప్రభుత్వం జిల్లాలో నిర్మాణం చేపట్టి న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి.. ఇంజినీర్లు అంకితభావంతో పనిచేస్తున్నారని కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ పనులను ఆయన మంగళవారం పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ క్యాంపు కార్యాలయంలో ఇంజినీర్లు, అధికారులతో బ్యారేజీ నిర్మాణంపై సమీక్షించారు. కాఫర్డ్యాం వద్ద గోదావరి ప్రవాహన్ని పరిశీలించారు. వానాకాలంలోనూ నిత్యం నాలుగు వేల క్యూబిక్ మీటర్ల కాంక్రిట్ పనులు చేయడం అద్భుతమని పేర్కొన్నారు. బ్యారేజీకి బిగించే 85 గేట్ల గురించి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు, కన్నెపల్లి పంప్హౌస్, అన్నారం గ్రావిటీ కెనాల్ పనులు వేగవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అవసరమైన సౌకర్యాలను కల్పించిందని చెప్పారు. అత్యంత వేగవంతంగా నిర్మాణం జరుగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో దేశ నలుమూలల నుంచి వచ్చిన కార్మికులు పాల్గొంటున్నారని, వారికి అవసరమైన సదుపాయాలతోపాటు వైద్య సేవలు అందుబాటులో ఉంచామని చెప్పారు. కలెక్టర్ వెంట మేడిగడ్డ బ్యారేజీ ఈఈ రమణారెడ్డి, డీఈఈ సురేష్, ఎల్ అండ్ టీ ప్రాజెక్టు మేనేజర్ రామరాజు తదితరులు ఉన్నారు. -
ప్రాణహిత మహోగ్రం!
సాక్షి, హైదరాబాద్/భూపాలపల్లి/కాళేశ్వరం: ఎగువ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నది ఉగ్రరూపం దాలుస్తోంది. పరీవాహకంలోని వాగులు, వంకల నుంచి భారీ నీరు వచ్చి చేరడంతో ప్రవాహ ఉధృతి పెరుగుతోంది. ఇదే సమయంలో గోదావరి పరీవాహకంలోనూ వర్షాలు ఎక్కువగా ఉండటంతో ఈ రెండు నదులు కలిసే కాళేశ్వరం వద్ద ఆదివారం సాయంత్రానికి ఏకంగా 2.56 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు నమోదయ్యాయి. శనివారం 84 వేల క్యూసెక్కుల మేర ప్రవాహాలు ఉండగా ఒక్క రోజులోనే ఏకంగా 1.72 లక్షల మేర పెరిగాయి. ఎస్సారెస్పీలోకి స్థిరంగా ప్రవాహాలు ఎస్సారెస్పీలోకి స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం ప్రాజెక్టులోకి 3,542 క్యూసెక్కుల మేర ప్రవాహం వచ్చింది. దీంతో ప్రాజెక్టు నీటి నిల్వ 90.31 టీఎంసీలకు గానూ 11.80 టీఎంసీలకు చేరింది. ఈ సీజన్లో ఎస్సారెస్పీకి కొత్తగా 5.64 టీఎంసీల మేర నీరు వచ్చింది. అత్యధికంగా కడెం ప్రాజెక్టులోకి 18,718 క్యూసెక్కుల మేర నీరు వస్తోంది. ప్రాజెక్టు వాస్తవ నిల్వ 7.60 టీఎంసీలకు గానూ 7 టీఎంసీలకు నీరు చేరుకుంది. దీంతో ఒక గేటును ఐదు అడుగుల మేర ఎత్తి 6,259 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. మధ్యాహ్నానికి ఇన్ఫ్లో తగ్గడంతో గేటు దించేశారు. ఎల్లంపల్లిలోకి 3,314 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, నిల్వలు 20.18 టీఎంసీలకు 6.30 టీఎంసీలకు చేరుకున్నాయి. ఆల్మట్టికి రోజుకు 5 టీఎంసీలు కర్ణాటకలో భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆల్మట్టి ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి రోజుకు 5 టీఎంసీల చొప్పున 53,383 క్యూసెక్కుల మేర ప్రవాహం కొనసాగింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా, ప్రాజెక్టు మట్టం ఆదివారం సాయంత్రానికి 47.91 టీఎంసీలకు చేరింది. ఈ సీజన్లో మొత్తంగా ప్రాజెక్టులోకి 24 టీఎంసీల నీరు చేరింది. ఇంకో 60 టీఎంసీల నీరు చేరితే అక్కడి నుంచి దిగువ నారాయణపూర్కు, అక్కడి నుంచి జూరాలకు ప్రవాహాలు పెరిగే అవకాశం ఉంది. ఇక తుంగభద్రలోకి స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి. 7,661 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో ప్రాజెక్టు నిల్వలు 100 టీఎంసీలకు గాను ప్రస్తుతం 42.34 టీఎంసీలకు చేరింది. నారాయణపూర్కు ప్రవాహాలు పూర్తిగా నిలిచిపోయాయి. రాష్ట్ర పరిధిలోని జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్లకు ప్రవాహాలు పూర్తిగా తగ్గిపోయాయి. జూరాలలో 9.66 టీఎంసీలకు గానూ 5.77, నాగార్జునసాగర్లో 312 టీఎంసీలకు గానూ 133.37 టీఎంసీలు, శ్రీశైలంలో 215 టీఎంసీలకు గానూ 29 టీఎంసీల నిల్వలున్నాయి. పెరిగిన గోదావరి ఉధృతి మూడు రోజులుగా మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరి ఉధృతి పెరిగింది. మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద ఆదివారం సాయంత్రం 7.01 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తోంది. ఇక్కడ నీటి మట్టం 11 మీటర్లకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ప్రస్తుతం అంతర్రాష్ట వంతెనను తాకుతూ నీరు పరుగుపెడుతొంది. కన్నాయిగూడెం, ఏటూరునాగారం మండలాల్లోని గ్రామాల వెంట జంపన్నవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఐలాపురం, ఎలిశెట్టిపల్లి, కొత్తూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి. భూపాలపల్లి ఏరియాలోని గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఉపరితల గనుల్లో డంపర్లు, డోజర్లు, షావల్స్, బెంజ్ లారీలు వెళ్లే పరిస్థితి లేదు. సుమారు 24 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. పూర్తిగా నిలిచిన ‘మేడిగడ్డ’పనులు ప్రాణహిత ఉధృతి పెరిగిన నేపథ్యంలో మేడిగడ్డ వద్ద జరుగుతున్న బ్యారేజీ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం 100 మీటర్ల ఎత్తుతో జరుగుతుండగా ప్రస్తుతం అక్కడ 93.68 మీటర్ల ఎత్తుతో ప్రవాహం కొనసాగుతోంది. మేడిగడ్డ పంప్ హౌస్ ప్రాంతంలో ఏకంగా 99.20 మీటర్ల ఎత్తుతో ప్రవాహ ఉధృతి ఉంది. అప్రమత్తంగా ఉండండి కాళేశ్వరం ప్రాజెక్టుకు వరదల ప్రమాదం పొంచి ఉందని.. అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రాజెక్టు ఇంజనీర్లకు నీటిపారుదల శాఖ ఈఎన్సీలు మురళీధర్రావు, హరిరామ్ ఆదేశాలిచ్చారు. హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయానికి, సంబంధిత చీఫ్ ఇంజనీర్లకు ప్రతి విషయాన్ని చేరవేయాలని సూచించారు. ఆదివారం ఈ మేరకు వారి సెల్ఫోన్లకు మెసేజ్లు పంపారు. వరదలకు సంబంధించిన రిపోర్డులను గంట గంటకు తెలియజేయాలని ఈఎన్సీలు చెప్పినట్లు ఇంజనీర్లు పేర్కొన్నారు. – కాళేశ్వరం ఇంజనీర్లకు ఈఎన్సీల సమాచారం -
‘కాళేశ్వరం’ గుండె.. మేడిగడ్డ పంప్హౌస్
కాళేశ్వరం(మంథని): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ పంప్హౌస్ గుండెకాయ వంటిదని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు. సోమవారం ఆయన కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ ఎస్.మసూద్ హుస్సేన్తో కలిసి అన్నారం బ్యారేజీ, మేడిగడ్డ పంప్హౌస్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్రావు విలేకరులతో మాట్లాడుతూ అత్యంత ప్రధానమైన కన్నెపల్లి(మేడిగడ్డ) పంప్హౌస్లో స్పైరల్ కేసింగ్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు పంప్హౌస్ల్లో మేడిగడ్డ పంప్హౌస్లో మొదటి స్పైరల్ కేసింగ్ను బిగించినట్లు తెలిపారు. నీటిని గోదావరి నుంచి మోటార్ల ద్వారా పైపులకు మళ్లించే ప్రక్రియను స్పైరల్ కేసింగ్ చేస్తుందన్నారు. ఇలా మొత్తం 11 స్పైరల్ కేసింగ్లు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. వీటిని ఆస్ట్రియా దేశం నుంచి వచ్చిన ఇద్దరు నిపుణుల పర్యవేక్షణలో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పంప్హౌస్ ద్వారా నీటిని గ్రావిటీ కాల్వ ద్వారా తరలించనున్నట్లు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తికాకున్నా ఈ పంప్హౌస్ ద్వారా నీటిని తరలించవచ్చని పేర్కొన్నారు. పనుల్లో మరింత వేగం పెంచాలని సంస్థ ప్రతినిధులను ఆదేశించామన్నారు. అన్నారం బ్యారేజీలో ఇప్పటికే 75శాతం పనులు పూర్తయ్యాయన్నారు. క్రస్టుగేట్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని చెప్పారు. ఇప్పటికే మూడు గేట్ల నిర్మాణం జరిగిందన్నారు. గేట్ల నిర్మాణ పనులు ఆలస్యం కాకుండా త్వరగా పూర్తిచేయాలని సంస్థ ప్రతినిధులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. జూలై చివరికల్లా నీటిని తరలిస్తామని ధీమాతో ఉన్నట్లు తెలిపారు. మజ్జిగ ప్యాకెట్లు అందించాలి.. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి 4.5 నుంచి 46 డిగ్రీల ఎండల్లో పనిచేస్తున్న కార్మికులకు మజ్టిగ ప్యాకెట్లు, గంట విశ్రాంతి ఇవ్వాలని అఫ్కాన్ కంపెనీ ప్రాజెక్ట్ మేనేజర్ శేఖర్దాస్కు సూచించారు. అన్నారం బ్యారేజీల్లో సుమారు 2వేల మంది వరకు పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. వారికి పని జరుగుతున్న దగ్గర భోజన వసతి ఏర్పాటు చేయాలని, విశ్రాంతి తీసుకోవడానికి బ్యారేజీ నిర్మాణం వద్ద షెడ్లు నిర్మించాలని ప్రాజక్ట్ మేనేజర్కు మంత్రి చెప్పారు. ఆస్ట్రియా నిపుణుడితో ముచ్చటించిన మంత్రి పంప్హౌస్లో స్పైరల్ కేసింగ్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. దీన్ని అమర్చడానికి ఆస్ట్రియా దేశం నుంచి ఇద్దరు నిపుణులు వచ్చారు. ఫీటర్ అనే నిపుణుడితో మంత్రి హరీష్రావు కాసేపు ముచ్చటించారు. నీకు ఇక్కడ ఎలా ఉంది.. పని ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఫీటర్ మాట్లాడుతూ నాకు బాగానే ఉందని, పని స్పీడ్గా జరుగుతోందని బదులిచ్చారు. మంత్రి అతడితో పని స్పీడ్గా జరగాలి.. అదే సమయంలో క్వాలిటీతో ఉండాలని చెప్పారు. మంత్రి వెంట కలెక్టర్ అమయ్కుమార్, ఈఎన్సీ మురళీధర్రావు, సీఈ హరిరామ్, ఆర్టీవో వీరబ్రహ్మచారి, మెగా కంపెనీ సీజీఎం వేణుమాధవ్, ప్రాజెక్ట్ మేనేజర్ వినోద్, ఆఫ్కాన్ ప్రాజెక్ట్ మేనేజర్ శేఖర్దాస్, డీఈఈ సూర్యప్రకాశ్, యాదగిరి ఉన్నారు. జిల్లా ఓఎస్డీ సురేందర్, డీఎస్పీ కేఆర్కే ప్రసాదరావు, సీఐ రమేష్, శంకర్రెడ్డి, ఎస్సై నరేష్ బందోబస్తు నిర్వహించారు. -
సీఎం పట్టుదలతో కాళేశ్వరం పరుగు
జయశంకర్ భూపాలపల్లి మహదేవపూర్ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులను భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్రావు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మూడు బ్యారేజీలు, పంపు హౌస్ పనుల పురోగతిని ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రావిటీ కాల్వ పనులను మే 31 వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి హరీష్రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పట్టుదలతో కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. కాళేశ్వరం: సీఎం కేసీఆర్ పట్టుదలతో కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకెళ్తున్నట్లు రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు. మహదేవపూర్ మండలంలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులను శనివారం మంత్రి హరీష్రావు పరిశీలించారు. అనంతరం సీ–5 క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు బ్యారేజీలు, మూడు పంపుహౌస్ల్లో 5.81 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పని జరగాల్సి ఉండగా ఇందని, 4.50 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పని జరిగినట్లు ఆయన తెలిపారు. 58.46 లక్షల కాంక్రిట్ పనికి 30 లక్షల కాంక్రిట్ పని పూర్తయిందని తెలిపారు. మూడు బ్యారేజీలు, మూడు పంపుహౌస్లకు 4.5 కోట్ల సిమెంట్ బస్తాలు అవసరమవుతాయని వివరించారు. రాడ్స్( స్టీలు) 2.65 లక్ష మెట్రిక్ టన్నులు అవసరం ఉండగా.. 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ద్వారా వివిధ దశల్లో పనులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. గ్రావిటీ కాల్వలో 1.80 కోట్ల మట్టి పనులకు 1 కోటి క్యూబిక్ మీటర్లు పూర్తయిందన్నారు. 80 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని చేయాల్సి ఉన్నట్లు తెలిపారు. గ్రావి టీ కాల్వ పనులను మే 31 వరకు పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. గడువులోగా పనులు చేయడానికి అదనంగా ఇంజనీర్లను డిప్యూటేషన్పై నియమిస్తున్నట్లు చెప్పారు. గ్రావిటీ కెనాల్లో రోజుకు 1.70 లక్షల క్యూబిక్ మీటర్ల రికార్డు లెక్కన మట్టి తవ్వకాలు చేస్తున్నట్లు తెలిపారు. మేడిగడ్డలో 15.50 లక్షల క్యూబిక్ మీటర్లు చేయాల్సి ఉండగా.. రోజులు 5 వేల క్యూబిక్ మీటర్లు కాంక్రిట్ పని చేస్తున్నట్లు వివరించారు. రోజుకు 7 వేలకు పెంచాలని సూచించినట్లు తెలిపారు. అన్నారం బ్యారేజీలో 11 లక్షల క్యూబిక్ మీటర్లకు 7.50 లక్షలు పూర్తయిందన్నారు. సుందిళ్ల బ్యారేజీలో 10 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రిట్కు 6.50 లక్షల పూర్తయిందని తెలిపారు. డిజైన్లు, డ్రాయింగ్ అన్ని అప్రూవల్స్ వచ్చాయని, గ్రావిటీ కెనాల్లో 29 స్ట్రక్చర్స్ ఉన్నాయన్నారు. పంపుహౌస్లకు మెటీరియల్ షిప్పింగ్ ద్వారా స్పైరల్ డాప్ట్ ట్యూబు, పంపులు, మోటార్లు ఏప్రిల్ వారంలోగా వస్తున్నాయన్నారు. ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, జర్మనీ దేశాల ద్వారా వస్తున్న ట్లు వివరించారు. మూడు పంపుహౌస్ల వద్ద 400, 220, 220 కేవీ సబ్స్టేషన్ల నిర్మాణం ఏప్రి ల్ వరకు పూర్తవుతుందని తెలిపారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ అమయ్కుమార్, కాళేశ్వరం బ్యారేజీ సీఈ నల్ల వెంకటేశ్వర్లు, ఆర్డీఓ వీరబ్రహ్మచారి, ఎస్ఈ సుధాకర్రెడ్డి, ఈఈలు మల్లికార్జున్ ప్రసాద్, రమణారెడ్డి, డీఈ ఈలు ప్రకాష్, యాదగిరి, సూర్యప్రకాష్, ఆప్కాన్ డైరెక్టర్ మల్లికార్జున్రావు పాల్గొన్నారు. డీఎస్పీ ప్రసాదరావు, సీఐ రమేష్ బందోబస్తు నిర్వహించారు. మేడిగడ్డ, పోచంపల్లి బ్యారేజీ పనుల పరిశీలిన.. మహదేవపూర్: తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దుల్లోని సీపీఐ మావోయిస్టు ఇలాఖాలో శనివారం మంత్రి హరీష్రావు సుడిగాలి పర్యటన చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, పోచంపల్లి వద్ద బ్యారేజీలను, కన్నెపల్లి–అన్నారం పంపుహౌస్లు, కన్నెపల్లి–అన్నారం గ్రావిటీ కె నాల్ పనులను పరిశీలించారు. ఉదయం 11 గంటలకు అన్నారం చేరకున్న మంత్రి రాత్రి 7 గంటలకు మేడిగడ్డ బ్యారేజీకి చేరుకున్నారు. పనుల పురోగతిపై చర్చించారు. -
మేడిగడ్డ ద్వారానే గోదావరి జలాలు
నాగారం(తుంగతుర్తి) : మేడిగడ్డ ప్రాజెక్టు ద్వారానే ఈ ప్రాంత ప్రజలకు గోదావరి జలాలు సాధ్యమని, అందులో భాగంగానే మహారాష్ట్ర సీఎంతో ఒప్పందం చేసుకున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని డి.కొత్తపల్లి గ్రామ స్టేజీ వద్ద ఎస్సారెస్పీ కాల్వ సీసీ లైనింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణిగా మార్చడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. ఎస్సారెస్పీ 71డీబీఎం కాల్వకు ఎనిమిది నుంచి పద్నాలుగున్నర కిలోమీటర్ వరకు రూ.10 కోట్లతో సీసీ లైనింగ్ నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. డిసెంబర్ నాటికి మేడిగడ్డ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి ఎస్సారెస్పీ ద్వారా తుంగతుర్తి, సూర్యాపేట ప్రాంతాల్లోని బీడు భూములను సస్యశ్యామలంగా చేస్తామన్నారు. తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గ ప్రాంత ప్రజలకు 2018 నాటికి రెండు పంటలకు నీరందిస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసే ప్రతి ప్రాజెక్టును కాంగ్రెస్, టీడీపీ నాయకులు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నారని చెప్పారు. 40 సంవత్సరాల క్రితం పాలకులు హెలికాఫ్టర్ ద్వారా సర్వే చేసి కాలువలు పూర్తి చేస్తామని హామీలు ఇచ్చారని, ఏళ్లు గడిచినా కాల్వలు పూర్తయ్యింది లేదని పేర్కొన్నారు. సమైక్య పాలనలో ఓట్ల కోసమే కాల్వలను అసంపూర్తిగా నిర్మించారని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎస్సారెస్పీ కాల్వలకు 28 తూములు ఏర్పాటు చేసి చెరువులు నింపుతామని, రూ.287 కోట్లతో ఎస్సారెస్పీ ఫేజ్–2 కాల్వ మరమ్మతులు పూర్తి చేయనున్నట్టు వివరించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ మాట్లాడుతూ 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని కేవలం మూడేళ్లలో పూర్తిచేశామని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని సీఎం కేసీఆర్ అమలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేలు, ఎంపీపీ దావుల మనీషా, తిరుమలగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ పాశం విజయయాదవరెడ్డి, ఎస్సారెస్పీ రెండో దశ ఎస్ఈ ఎ.వెంకటేశ్వర్లు, ఈఈ సుధీర్, డీఈఈలు ప్రవీణ్, రవికుమార్, సునీల్ప్రసాద్, ఏఈఈలు హరిక్రిష్ణ, బాలరాజు, కామేశ్వరి, అశోక్, జెడ్పీటీసీ పేరాల పూలమ్మ, పీఏసీఎస్ చైర్మన్ అశోక్రెడ్డి, పాశం యాదవరెడ్డి, దావుల వీరప్రసాద్, మార్కెట్ వైస్చైర్మన్ గుజ్జ యుగేందర్రావు, తహసీల్దార్ పులి సైదులు, మండల అధ్యక్షుడు గుండగాని అంబయ్య, కుంట్ల సురేందర్రెడ్డి, గుడిపాటి సైదులు, ఉప్పలయ్య, కె.శోభన్బాబు, పానుగంటి నర్సిం హారెడ్డి, సర్పంచ్లు బి.సైదులు, లక్ష్మీనర్సు, గుండగాని సోమేష్, ఎంపీటీసీ వంగూరి రజిత, శ్రీను పాల్గొన్నారు. -
మేడిగడ్డతోనే రాష్ట్రం మాగాణ : హరీశ్రావు
► తమ్మిడిహెట్టితో పోలిస్తే అక్కడే నీటి లభ్యత ఎక్కువ ► తమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని ► కేంద్ర జల సంఘమే చెప్పింది ► 152 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర అంగీకరించలేదు ► రాష్ట్ర ఏర్పాటుకు ముందు, తర్వాత ఇదే విషయాన్ని చెప్పింది.. ► అందుకే ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ మార్చి మేడిగడ్డ చేపట్టాం ► మీడియాకు నివేదికల ద్వారా మంత్రి వివరణ సాక్షి, హైదరాబాద్ : గోదావరి నదిలో 954 టీఎంసీల నీటిని పరీవాహక ఆయకట్టుకు మళ్లించి తెలంగాణ సాగు, తాగు అవసరాలు తీర్చే సంకల్పంతోనే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీ డిజైన్ చేశామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు వెల్లడించారు. సాగు, తాగు అవసరాలకు ఎక్కువ రోజులు నీటిని అందుబాటులో ఉంచడం, గ్రావిటీ ద్వారా వీలైనంత ఎక్కువ ఆయకట్టుకు నీరందించడం, ముంపు తక్కువగా ఉండేలా చూడటం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ మేడిగడ్డ ద్వారా నీటిని మళ్లింపు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పరిధిలో 160 టీఎంసీల నీటిని మళ్లించేందుకు తమ్మిడిహెట్టి అనువుగా లేదన్నారు. అలాగే ఈ బ్యారేజీ ఎత్తుతో జరిగే ముంపునకు మహారాష్ట్ర అంగీకరించలేదని, అందువల్లే కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టామని వివరించారు. ప్రాణహిత రీ డిజైన్పై ప్రతిపక్షాలు, పలు సంఘాలు విమర్శలు చేస్తుండటం, వాటిపై పత్రికల్లో కథనాలు వస్తున్న నేపథ్యంలో మంత్రి హరీశ్రావు మీడియా ప్రతినిధులకు శనివారమిక్కడ వివరణ ఇచ్చారు. నీటి లభ్యత, వ్యయం పెరుగుదల, ముంపు, మహారాష్ట్ర అభ్యంతరాలు, కొత్త ఆయకట్టు తదితర అంశాలపై రెండు గంటల పాటు సమగ్రంగా వివరించారు. వివిధ సందర్భాల్లో మహారాష్ట్ర, ఉమ్మడి ఏపీల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన చర్చలు, రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం తదితరాలపై పలు నివేదికలు మీడియాకు అందించారు. ఒక్కో అంశంపై మంత్రి ఏమన్నారో ఆయన మాటల్లోనే.. 148 మీటర్ల ఎత్తులో 40 టీఎంసీలే తమ్మిడిహెట్టిని 152 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు మహారాష్ట్ర మొదట్నుంచీ వ్యతిరేకిస్తోంది. ఈ ఎత్తులో 3,786 ఎకరాల ముంపు ఉందని, అందుకు అంగీకరించలేమంటూ 2013 జనవరి 21న తెలంగాణకు మహారాష్ట్ర స్పష్టం చేసింది. అనంత రం 2014 జూలై 23న మంత్రుల స్థాయిలో, 2015 ఫిబ్రవరి 17న సీఎంల స్థాయిలో చర్చలు జరిగాయి. గోదావరిలో 160 టీఎంసీలు తీసుకునేందుకు అభ్యంతరం లేదని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫఢ్నవీస్ చెప్పారు. ముంపును మాత్రం అంగీకరించమని స్పష్టంగా చెప్పారు. కేంద్ర జల సంఘం కూడా 2015 మార్చి 4న తమ్మిడిహెట్టి వద్ద తగినంత నీటి లభ్యత లేదని తెలుపుతూ రాష్ట్రానికి లేఖ రాసింది. 152 మీటర్ల ఎత్తులో 75 శాతం డిపెండబులిటీలో 165 టీఎంసీల లభ్యత ఉందని, ఇందులో పైరాష్ట్రాలు 63 టీఎంసీలకు ప్రాజెక్టు నిర్మాణం చేసుకున్నందున మిగిలేది 102 టీఎంసీలే అని చెప్పింది. ఇందులో హైదరాబాద్, గ్రామీణప్రాంతాల తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు కేటాయించిన 56 టీఎంసీ పక్కనబెడితే మిగిలేది 46 టీఎంసీలే. ఈ నీటితో 16.40 లక్షల ఎకరాలకు నీళ్లు అందించడం సాధ్యమా? ఇక 148 మీటర్ల ఎత్తులో కేవలం 40 టీఎంసీలే లభ్యతగా ఉంటుంది. వాటితో నిర్ణీత అవసరాలు ఎలా తీర్చుకోగలం? 16 ఉత్తరాలు రాసినా పట్టించుకోలేదు తమ్మిడిహెట్టి పూర్తిగా వన్యప్రాణుల అభయారణ్యం ప్రాంతంలో ఉంది. దీన్ని పట్టించుకోకుండా అప్పటి ప్రభుత్వం పనులు ఆరంభించింది. ఈ నిర్మాణం పూర్తిగా ఏకపక్షంగా.. మీకు మీరే ఊహించుకొని నిర్మాణ పనులు చేపడుతున్నారని, ఈ పనులు ఫలప్రదం కావంటూ అప్పటి మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ 2013 అక్టోబర్ 15న రాష్ట్రానికి లేఖ రాశారు. అంతకుముందు, తర్వాత కూడా మహారాష్ట్ర ప్రభుత్వం, అధికారులు 16 లేఖలు రాసింది. కేంద్రానికి ఫిర్యాదులు చేసింది. 2007లో ప్రాజెక్టు ప్రారంభించిన నుంచి 2012 వరకు మహారాష్ట్రంతో ఒక్క సమావేశం నిర్వహించలేదు. 2012లో మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్న అప్పటి కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వం తొలి బోర్డు సమావేశం నిర్వహించింది. ఆ తర్వాత 2013 జనవరి, 2014 మార్చిలో అధికారులు స్థాయిలో చర్చలు జరిగాయి. వారు 152 మీటర్ల ఎత్తుకు అంగీకరించలేదు. అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండేళ్లలో మంత్రిగా ఆరుసార్లు, అధికారులతో ఆరు సమావేశాలు నిర్వహించాం. 152 మీటర్లకు ఒప్పుకోమని, ప్రత్యామ్నాయాలు చేపట్టాలని మరాష్ట్ర సీఎం కోరారు. 148 మీటర్ల ఎత్తులో నీటి లభ్యత లేకపోవడం, అదే మేడిగడ్డ వద్ద లభ్యత ఎక్కువగా ఉండటం, అవసరమైతే భవిష్యత్తులో ఇంద్రావతి నీటిని వాడుకునే వీలుండటంతో మేడిగడ్డను ఫైనల్ చేశాం. దీనిద్వారా 18 లక్షల ఎక రాల కొత్త ఆయకట్టుతోపాటు మరో 18 లక్షల ఎకరాలను స్థిరీకరించాలని నిర్ణయించాం. ఏపీలో నిర్మించలేదా? ప్రాణహిత ప్రాజెక్టుకు కింద నిర్ణయించిన ఆయకట్టుకు నీరివ్వాలంటే 16 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లు సరిపోవని 2008 జూలై 22న కేంద్ర జల సంఘం లేఖ రాసింది. ఇంకా కొన్ని రిజర్వాయర్లు కట్టాలని సూచించింది. అందువల్లే మేం రిజర్వాయర్ల సామర్థ్యాన్ని 144 టీఎంసీలకు పెంచాం. దీంతో రెండో పంటకు నీరిచ్చే అవకాశం ఉంటుంది. కృత్రిమ ప్రవాహాలపై ఇంతపెద్ద రిజర్వాయర్లు కట్టరాదని అంటున్నారు. కానీ ఏపీలో కండలేరు 68 టీఎంసీ, వెలిగొండ 41 టీఎంసీ, వెలిగోడు 17 టీఎంసీలతో నిర్మించినప్పుడు మల్లన్నసాగర్ 50 టీఎంసీలతో నిర్మిస్తే తప్పేంటి? నల్లగొండలో 2.20 లక్షల ఎకరాలు, మెదక్లో 5.50 లక్షలు, నిజాంసాగర్ కింద 2.3 లక్షలు, ఎస్సారెస్పీ పరిధిలోని ఆయకట్టుకు కూడా మల్లన్నసాగర్ ద్వారానే నీరందించాలి. నిజానికి 25 టీఎంసీల సామర్థ్యమున్న మిడ్మానేరు కింద 23 గ్రామాలు, ఎల్లంపల్లి కింద 21 గ్రామాలు ముంపునకు గురికాగా 50 టీఎంసీల మల్లన్నసాగర్ కింద ముంపు గ్రామాలు 8 మాత్రమే! 2012 వరకు ఖర్చు రూ.150 కోట్లే 2008లో ప్రాణహిత ప్రాజెక్టు ఆరంభించిన కాంగ్రెస్.. నాలుగేళ్లలో పూర్తి చేస్తామని చెప్పింది. కానీ 2012 నాటికి పూర్తి చేసిన పనుల విలువ కేవలం రూ.150 కోట్లు! మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట మాత్రం రూ.1,481 కోట్లు ఇచ్చేసింది. 2014 వరకు ఖర్చు చేసిన మొత్తం రూ.7,072 కోట్లు ఉన్నా.. అందులో పనుల కోసం చేసిన ఖర్చు రూ.3,680 కోట్లు. భూసేకరణకు రూ.108 కోట్లు, సర్వేలకు రూ.917 కోట్లు, మిగతావి అడ్వాన్సులపై ఖర్చు చేశారు. వ్యయం ఎందుకు పెరిగిందంటే.. రిజర్వాయర్ల సామర్థ్యం 16 టీఎంసీల నుంచి 144 టీఎంసీలకు పెంచాం. ఆయకట్టును పెంచాం. పంపింగ్ కెపాసిటీ 1.8 టీఎంసీల నుంచి 2 టీఎంసీలకు పెరిగింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను 32 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో చేపట్టాం. 53,500 ఎకరాల భూసేకరణకు ఎకరాకు రూ.2 లక్షల చొప్పున గతంలో రూ.1,071 కోట్లు అంచనా వేస్తే.. ప్రస్తుతం ఎకరాకు రూ.7 లక్షలు పెంచడంతో వ్యయం రూ.6 వేల కోట్లు పెరిగింది. ఆర్అండ్ఆర్ వ్యయం రూ.300 కోట్ల నుంచి రూ.1,770 కోట్లు పెరిగింది. విద్యుత్ ఖర్చు రూ.వెయ్యి కోట్ల నుంచి రూ.3 వేల కోట్లకు, వ్యాట్ 2.5 శాతం నుంచి 3.5 శాతానికి పెరిగింది. ఇన్ని కారణాల వల్లే ప్రాజెక్టు వ్యయం పెరిగింది. విద్యుత్కు ఢోకా లేదు కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా కావాల్సిన విద్యుత్ను ఎక్కడ్నుంచి తెస్తారని ప్రశ్నిస్తున్నారు. నిజానికి తెలంగాణలో విద్యుత్కు ఢోకా లేదు. జెన్కో ద్వారా 5,800 మెగావాట్లు లభ్యతగా ఉండగా, ఎన్టీపీసీ ద్వారా 4 వేల మెగావాట్లు, ఛత్తీస్గఢ్ ఒప్పందం ద్వారా వెయ్యి మెగావాట్లు, సోలార్ పవర్ ద్వారా మరో 2,500 మెగావాట్లు అందుబాటులోకి వస్తుంది. వీటికితోడు హంగుల్-పలాసా, వార్దా-డిచ్పల్లి, వరోరా-వరంగల్ కారిడార్ల ద్వారా మరింత విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. వర్షాకాలంలో కరెంట్ వినియోగం తక్కువ కాబట్టి రాష్ట్రానికి తక్కువ ధరకే విద్యుత్ దొరుకుతుంది. మొత్తంగా చూస్తే ప్రాజెక్టు వ్యయం ఒక ఎకరాపై రూ.2.35 లక్షలుంటే.. ప్రాజెక్టు పూర్తయ్యాక దాని నిర్వహణ వ్యయం రూ.8 వేల వరకు ఉంటుంది. ఈ ప్రాజెక్టును ఐదేళ్లలో పూర్తి చేస్తాం. జాతీయ హోదా కోసం కొట్లాడతాం కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇప్పటికే పలుమార్లు కేంద్రాన్ని సంప్రదించాం. ముఖ్యమంత్రి స్వయంగా ప్రధానికి విన్నవించారు. మున్ముందూ కొట్లాడతాం. అసెంబ్లీలో మహారాష్ట్ర ఒప్పందంపై జరగాల్సిన చర్చ విషయంలో బీఏసీ భేటీలో నిర్ణయిస్తాం. -
చారిత్రాత్మక తప్పిదం: శివకుమార్
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం, మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మహా ఒప్పందంగా అభివర్ణించడం సిగ్గు చేటు అని తెలంగాణ వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి శివకుమార్ ధ్వజమెత్తారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ ...మహా ఒప్పందం కాదని, మహా మోసం అని అభవర్ణించారు. తెలంగాణ ప్రజల పరువును, ఆత్మగౌరవాన్ని మహారాష్ట్రలో తాకట్టు పెట్టి, కమీషన్ల కోసమే కేసీఆర్ ఎత్తు తగ్గించారని శివకుమార్ విమర్శించారు. తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించే బ్యారేజీ ఎత్తు 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించడం, మేడిగడ్డ వద్ద నిర్మించే బ్యారేజీ ఎత్తు 102 మీటర్ల నుంచి 100 మీటర్లకు తగ్గించడం చారిత్రాత్మక ఒప్పందం కాదని, చారిత్రాత్మక తప్పిదమని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. ఈ ఒప్పందంపై తెలంగాణ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని శివకుమార్ అన్నారు. -
'తెలంగాణలో నీటి కరువు తొలగిపోతుంది'
ముంబయి: రాష్ట్రాలు సామరస్య ధోరణిలో వ్యవహరిస్తే చాలా సమస్యలు పరిష్కారమవుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మూడు ప్రాజెక్టుల నిర్మాణంపై తెలంగాణ, మహారాష్ట్ర మధ్య ఒప్పందం కుదరడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఒప్పందానికి సహకరించినవారికి పేరు పేరునా కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఒప్పందం వల్ల తెలంగాణలో నీటి కరవు తొలగిపోయే అవకాశం ఏర్పడుతుందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా అంతకు ముందు గోదావరి నదిపై మూడు ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య కీలక ఒప్పందం జరిగింది. ముంబైలోని... సహ్యాద్రి గెస్ట్హౌజ్లో గోదావరి అంతర్రాష్ట్ర బోర్డు సమావేశమైంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, దేవేంద్ర ఫడ్నవిస్లతో పాటు మంత్రులు, అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. మేడిగడ్డ, తుమ్మిడిహెట్టి, చనఖా-కొరటా ఆనకట్టల ఎత్తుపై.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో అధికారులు సంతకాలు చేశారు. ఇక ఒప్పందానికి సహకరించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ను కేసీఆర్ సన్మానించారు. శాలువా కప్పి, మెమెంటో ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం ఇచ్చి పుచ్చుకొనే ధోరణిలో ముందుకు వెళ్తే కేంద్రం జోక్యాన్ని నివారించవచ్చని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నదీ జలాల కేటాయింపులు, వినియోగంపై నిత్యం వివాదాలే ఉండేవని, తమ వాదనను నాటి ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఫడ్నవిస్ చెప్పారు. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ చొరవతో ఆ సమస్యలకు పరిష్కారం దొరికిందన్నారు. -
ప్రాజెక్టులపై 'మహా' ఒప్పందం
-
ప్రాజెక్టులపై 'మహా' ఒప్పందం
ముంబయి: తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య 'మహా' ఒప్పందం జరిగింది. గోదావరి నదిపై మూడు బ్యారేజీల నిర్మాణానికి తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్, దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం చారిత్రక ఒప్పందం చేసుకున్నారు. ముంబైలోని సహ్యాద్రి గెస్ట్హౌస్లో జరిగిన కార్యక్రమంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. తుమ్మిడిహెట్టి, మేడిగడ్డ, చనాక-కొరాట బ్యారేజీలపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ మూడు ఒప్పందాలపై కేసీఆర్, ఫడ్నవీస్ సంతకాలు చేశారు. తాజా ఒప్పందాలతో గోదావరిలో హక్కుగా ఉన్న 950 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునే అవకాశం లభించింది. మంత్రులు హరీశ్ రావు, జోగు రామన్న, పోచారం శ్రీనివాసరెడ్డి, ఈటల రాజేందర్, జగదీశ్ రెడ్డితో పాటు మహారాష్ట్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. మొదటి ఒప్పందం: 16 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో గోదావరిపై 100 మీటర్ల ఎత్తుతో మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణానికి అంగీకారం. ఆయకట్టు : కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద కరీంనగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్,వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో కొత్తగా 18.19 లక్షల ఎకరాలు, 18 లక్షల ఎకరాల స్థిరీకరణ. రెండో ఒప్పందం: 1.85 టీఎంసీ నీటినిల్వ సామర్థ్యంతో ప్రాణమితపై తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణం ఆయకట్టు: ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్-కాగజ్ నగర్, ఆసిఫాబాద్, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో 2 లక్షల ఎకరాలు. మూడో ఒప్పందం: 0.85 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో పెన్గంగపై 213 మీటర్ల ఎత్తులో చనాఖ-కొరాట బ్యారేజీ నిర్మాణం. ఆయకట్టు: ఆదిలాబాద్ జిల్లా తాంసి, జైనథ్, బేలా మండలాల్లో 50 వేల ఎకరాలు.