mines
-
గనులే ఆ ఊరికి శాపం.. మైలారం మాయమయ్యే ముప్పు!
సాక్షి, నాగర్కర్నూల్: చుట్టూ నల్లమల (Nallamala) అటవీప్రాంతం.. కొండలు, గుట్టల నడుమ పచ్చని పొలాలతో అలరారుతున్న ఆ ఊరికి గనులు శాపంగా పరిణమించాయి. గ్రామానికి ఆనుకునే ఉన్న గుట్టపై క్వార్ట్జ్ కోసం సాగుతున్న మైనింగ్ (Mining) తవ్వకాలు ఏకంగా ఆ ఊరినే ఉనికి లేకుండా చేస్తాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. బ్లాస్టింగ్లతో ఇళ్లు, గ్రామానికి ముప్పు ఉందని, మైనింగ్ అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులంతా పోరాటానికి దిగుతున్నారు. నాగర్కర్నూల్ జిల్లా బల్మూరు మండలం మైలారం(mailaram) గ్రామానికి ఆనుకుని ఉన్న గుట్టపై జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాలపై ఊరంతా పోరాడుతోంది. మైనింగ్ అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏకంగా గత పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించారు కూడా. ఇటీవల గ్రామస్తులు రిలే నిరాహార దీక్షకు దిగగా, అనుమతి లేదంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామంలో మైనింగ్ అనుమతులు రద్దు చేసేవరకు పోరాటం చేస్తామని గ్రామస్తులు కంకణం కట్టుకున్నారు.200 మీటర్ల దూరంలో ఉన్న ఇళ్లకు ముప్పు మైలారం గ్రామానికి ఆనుకుని ఉన్న గుట్టపై క్వార్ట్జ్, ఫెల్స్పార్ ఖనిజ తవ్వకాలకు మైనింగ్ శాఖ 2017లో అనుమతులు జారీ చేసింది. గుట్టపై సర్వే నంబరు 120/1లో 24.28 హెక్టార్ల మేర తవ్వకాలు జరిపేందుకు అవకాశం కల్పించింది. అయితే మైనింగ్ జరిగే ప్రాంతానికి 200 మీటర్ల సమీపంలోనే ఇళ్లు ఉండటంతో స్థానికుల్లో ఆందోళన రేగుతోంది. గ్రామంలో సుమారు 540 కుటుంబాలు, 1,850 మంది వరకు జనాభా ఉంది. వీరిలో కొన్ని కుటుంబాలు ఏళ్లుగా గుట్టకు ఆనుకునే ఇళ్లను నిర్మించుకుని జీవిస్తున్నారు. గుట్టపై పురాతన నరసింహస్వామి, శివాలయాలు సైతం ఉన్నాయి. మైనింగ్ కోసం జరుపుతున్న పేలుళ్లతో సమీపంలోని ఇళ్లలో ఉంటున్నవారు భయభ్రాంతులకు లోనవుతున్నారు. మైనింగ్ అనుమతులను తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సర్వే నంబరు 120/1లో 24.28 హెక్టార్ల మేర తవ్వకాలు జరిపేందుకు అవకాశం కల్పించింది. అయితే మైనింగ్ జరిగే ప్రాంతానికి 200 మీటర్ల సమీపంలోనే ఇళ్లు ఉండటంతో స్థానికుల్లో ఆందోళన రేగుతోంది. గ్రామంలో సుమారు 540 కుటుంబాలు, 1,850 మంది వరకు జనాభా ఉంది. వీరిలో కొన్ని కుటుంబాలు ఏళ్లుగా గుట్టకు ఆనుకునే ఇళ్లను నిర్మించుకుని జీవిస్తున్నారు. గుట్టపై పురాతన నరసింహస్వామి, శివాలయాలు సైతం ఉన్నాయి. మైనింగ్ కోసం జరుపుతున్న పేలుళ్లతో సమీపంలోని ఇళ్లలో ఉంటున్నవారు భయభ్రాంతులకు లోనవుతున్నారు. మైనింగ్ అనుమతులను తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఫోర్జరీ సంతకాలతో గ్రామసభ తీర్మానం గ్రామ పంచాయతీ పరిధిలో మైనింగ్ తవ్వకాల కోసం గ్రామసభ తీర్మానం కీలకం కాగా, ఈ విషయం గ్రామస్తులకే తెలియకపోవడం గమనార్హం. సమాచార హక్కు చట్టం ద్వారా గ్రామసభ తీర్మానం కాపీ వెలుగులోకి వచ్చింది. తీర్మానంలో గ్రామస్తులకు తెలియకుండానే పాలకవర్గం, కొందరు గ్రామస్తుల పేరుతో సంతకాలను ఫోర్జరీ చేసినట్టు గ్రామస్తులు గుర్తించారు. దీనిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో మైనింగ్ కోసం అనుమతులు ఉన్నాయని, గ్రామస్తుల ఫిర్యాదు నేపథ్యంలో మరోసారి సమీక్షిస్తామని జిల్లా మైనింగ్ అధికారి రవీందర్ తెలిపారు. చదవండి: చరిత్రకు సాజీవ సాక్ష్యం రాజకోటమా ఊరే లేకుండా పోతుంది.. మా ఇళ్ల పక్కనే బ్లాస్టింగ్ చేస్తుంటే మేం ఎక్కడికి పోవాలి? మైనింగ్తో మా ఊరే లేకుండా పోతుంది. అధికారులు, ప్రజాప్రతినిధులు మైనింగ్ నిర్వాహకులకే అండగా ఉంటున్నారు. మా బాధ ఎవరికీ పట్టడం లేదు. మైనింగ్ ఆపకపోతే మేమంతా నిరాహార దీక్ష చేసైనా ఊరిని కాపాడుకుంటాం. – గాయత్రి, మైలారం -
నేను చెప్పిందే ఫైనల్
సాక్షి తిరుపతి టాస్క్ఫోర్స్: ‘మైకా క్వార్ట్జ్ ఎంత తవ్వితే అంత మొత్తం నాకే అమ్మాలి. అదీ నేను చెప్పిన ధరకే. లేదంటే మైనింగ్ జరగదు. నా మాట ప్రకారం నడుచుకోవాల్సిందే. నేను చెప్పిందే ఫైనల్’.. తిరుపతి–నెల్లూరు సరిహద్దు ప్రాంతంలో విలువైన మైకా క్వార్ట్జ్ గనుల యజమానులకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ఆదేశాలివి. ప్రభుత్వంలోని ఒక ముఖ్య నేత అండదండలతో సైదాపురం, గూడూరు పరిధిలో లభ్యమయ్యే విలువైన తెల్లబంగారం మొత్తాన్ని ఆయన గుప్పిట్లోకి తీసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు లీజుదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ఆయనపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. శనివారం తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం చిల్లకూరులోని ఓ కన్వెన్షన్లో రహస్యంగా సమావేశమై కార్యాచరణను రూపొందించుకున్నారు. ఆయన ఒక్కరికే విక్రయిస్తే నష్టపోతామని, అలా కాకుండా ఎక్కువ రేటు ఇచ్చిన వారికి విక్రయిస్తే ప్రయోజనం ఉంటుందని వారు ఓ నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయమై ప్రభుత్వ పెద్దలు, అధికారులు, స్థానిక ఎమ్మెల్యేలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో తీర్మానించినట్లు తెలిసింది.సైదాపురం, గూడూరు, పొదలకూరు పరిధిలో ఏడు భూగర్భ గనులు, మరో 140 మైకా క్వార్ట్జ్ , క్వార్ట్జ్ గనులున్నాయి. మైకా క్వార్ట్ ్జకి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. చైనా, జపాన్, రష్యా దేశాల్లో రూ.లక్షలు పెట్టి కొంటున్నారు. విలుౖవెన మైకా క్వార్ట్జ్ పై అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ, మరి కొందరు ఎమ్మెల్యేలు కన్నేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే గనుల్లో తవ్వకాలు నిలిపేశారు. ఆ తరువాత వారికి అనుకూలంగా ఉన్న వారికే తవ్వకాలకు అనుమతులిచ్చారు. ఇలా ఇప్పటివరకు 24 గనులకు అనుమతులు ఇచ్చినట్లు తెలిసింది.మైనింగ్ డాన్కు అమ్మడం ఇష్టంలేక తవ్వకాలు నిలిపివేతఇక్కడ తవ్విన మైకా క్వార్ట్జ్ మొత్తం తనకే విక్రయించాలని, తాను చెప్పిన రేటుకే ఇవ్వాలంటూ మైనింగ్ డాన్ లీజుదారులకు హుకుం జారీ చేశారు. తనను కాదని వేరొకరికి విక్రయించడానికి వీల్లేదని ఆదేశించారు. దీంతో కంగుతిన్న లీజుదారులు తవ్వకాలు నిలిపివేశారు. అనుమతులిచ్చిన గనుల్లో ప్రస్తుతం నాలుగింట్లోనే తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ దందా భరించలేని లీజుదారులు 32 మంది చిల్లకూరులోని ఓ కన్వెన్షన్లో శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రహస్యంగా సమావేశమయ్యారు.సమావేశంలో విషయాలు బయటకు పొక్కకుండా ఉండేందుకు అందరి నుంచి మొబైల్ ఫోన్లు కూడా తీసేసుకున్నారు. మైకా క్వార్ట్జ్ మంచి డిమాండ్ ఉన్నందున, బయట అమ్మితేనే లాభమని, డాన్కి అమ్మితే నష్టమేనని వారు అభిప్రాయపడ్డట్లు సమాచారం. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు కొంత మైనింగ్ డాన్కి విక్రయించినా.. మరి కొంత ఇతరులకు విక్రయిస్తే కొంతైనా ప్రయోజనం ఉంటుందని భావించినట్లు తెలిసింది. ఈయనతోపాటు సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, సత్యవేడు నియోజకవర్గాలను శాసిస్తున్న మరో బడా పారిశ్రామికవేత్తకు కూడా విక్రయిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేసినట్లు సమాచారం.ఒకటి, రెండు రోజుల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఓ పారిశ్రామికవేత్త, ప్రభుత్వ పెద్దలతో చర్చించాలని నిర్ణయించుకున్నారు. అదేవిధంగా జిల్లా మైనింగ్ అధికారిని కూడా మరోసారి కలిసి తమ ఆవేదనను చెప్పుకోవాలని నిర్ణయానికి వచ్చారు. ఈ రహస్య సమావేశం విషయం తెలుసుకున్న మైనింగ్ డాన్ లీజుదా రులతో మాట్లాడినట్లు తెలిసింది. ఎవరెవరు తన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు? ఎంతమంది అనుకూలంగా మాట్లాడారు అనే విషయాలపై ఆరా తీసినట్లు సమాచారం. ఈ సమావేశం వివరాలను ప్రభుత్వ పెద్దలు కూడా నిఘా వర్గాల ద్వారా తెప్పించుకున్నట్లు తెలిసింది. -
వేమిరెడ్డికే క్వార్ట్జ్ గనులు!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సైదాపురం క్వార్ట్జ్ గనులపై ఎమ్మెల్యేలు, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి మధ్య నెలకొన్న ఆధిపత్య పోరులో ఎంపీదే పైచేయిగా మారినట్లు సమాచారం. గనులను చేజిక్కించుకునేందుకు జిల్లాకు చెందిన ఇతర ఎమ్మెల్యేలు చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. ఎంపీ వేమిరెడ్డికి ప్రభుత్వ ‘ముఖ్య’ నేత గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జనవరి నుంచి ఇక అధికారికంగానే గనుల దోపిడీ జరగనుంది. నాణ్యమైన గనులు ఉన్న వెంకటగిరి, సర్వేపల్లి, ఉదయగిరి నియోజకవర్గాల్లో దొరికే క్వార్ట్జ్ మెటల్ను ఆయనకే అప్పగించాలని ప్రభుత్వ పెద్దల నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు నజరానాగా ప్రతి నెలా ‘ముఖ్య’ నేతకు ముడుపులు చెల్లించేలా ఒప్పందం జరిగినట్లు సమాచారం. ఇప్పటికే సైదాపురం పరిసర ప్రాంతాల నుంచి గత నెల రోజులుగా నిత్యం వందల లారీల్లో ఖనిజాన్ని అనధికారికంగా పెద్ద ఎత్తున తరలిస్తున్నారు.తమకు ముడిసరుకు మొత్తం అప్పగించాలని లేదంటే కేసులు బనాయించి లీజులు రద్దు చేయిస్తామని అన్ని అనుమతులున్న ఇతర గనుల యజమానులను బెదిరిస్తున్నారు. అన్ని అనుమతులు ఉన్నప్పటికీ గత ఆర్నెళ్లుగా గనుల యజమానులు తవ్వకాలు చేపట్టకుండా అడ్డుకుంటున్నారు. లీగల్ మైన్లను దుర్మార్గంగా నిలిపివేయడంపై గనుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమ అనుకూల అధికారులను నియమించుకోవడంతోపాటు సైదాపురంలో ఎంపీ వేమిరెడ్డి కార్యాలయం ఏర్పాటుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. సైదాపురం కేంద్రంగా ఇకపై అక్కడి నుంచే తన వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుగా వేమిరెడ్డి అన్ని వసతులు ఏర్పాటు చేసుకుంటున్నారు. గనుల తవ్వకాలపై ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా సైదాపురం పరిసరాల్లో క్వార్ట్జ్ శుద్ధి పరిశ్రమ ఏర్పాటు పేరుతో జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. ఉపాధి దొరుకుతుందంటూ కంపెనీ ముసుగులో ప్రజలను మభ్యపుచ్చి కొన్నాళ్ల పాటు హడావుడి చేసి అనంతరం అందరి నుంచి గనులను లాక్కునే ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది.గనుల యజమానులకు బెదిరింపులు.. జిల్లాలో మైనింగ్ దందాను చేజిక్కించుకున్న వేమిరెడ్డి అనుచరులు అధికారికంగా అన్ని అనుమతులున్న గనులు యజమానులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. అధికారిక గనుల్లో ఉన్న ముడిసరుకును సైతం తమకే ఇవ్వాలని, తాము చెప్పిన ధరకే అప్పగించాలని బెదిరింపులకు దిగారు. ఇప్పటికే తవ్విన ఖనిజంతోపాటు ఇకపై వెలికితీసేది కూడా తాము చెప్పిన నామ మాత్రపు ధరకే ఇవ్వాలని ఆదేశించారు. ఈ క్రమంలో గనుల యజమానులను హైదరాబాద్లోని తన కార్యాలయానికి పిలిపించుకుని ఎంపీ తీవ్ర స్థాయిలో హెచ్చరించినట్లు సమాచారం. ముడిసరుకు ఇవ్వకుంటే గనుల నుంచి మీ లారీలు వెళ్లలేవని, పలు రకాల కేసులు నమోదు చేయించి లీజులు రద్దు చేయిస్తామంటూ తమను బెదిరించినట్లు ఓ గని యజమాని వాపోయాడు. తమ మైన్లకు అన్ని అనుమతులు ఉన్నాయని, గత 50 ఏళ్లుగా ‘డెడ్ రెంట్’ సైతం చెల్లిస్తున్నామని పేర్కొన్నాడు.రూప్ కుమార్ ద్వారా..ఎంపీ వేమిరెడ్డి తన అనుచరుడైన రూప్కుమార్ను ముందుపెట్టి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. సైదాపురం సమీపంలోని శ్రీనివాస పద్మావతి, చాగణం సమీపంలో ఉన్న సిద్ధి వినాయక, తుమ్మలతలుపూరులో ఉన్న జయలక్ష్మి కనకదుర్గా, కలిచేడు సమీపంలో ఉన్న రాఘవేంద్ర గనులు ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఆర్నెళ్లుగా అందరి మైన్లు నిలిపివేసి కేవలం ఎంపీ అనుచరుడికి చెందిన నాలుగు గనులకే అనుమతులు ఇవ్వడం వెనుక మతలబు ఏమిటనేది తెలిసిపోతోంది.అనుకూల అధికారి రాకనెల్లూరు జిల్లా మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్గా తిరుపతి జిల్లా డీడీ బాలాజీ నాయక్కు అదనపు బాధ్యతలు అప్పగించేలా ఎంపీ చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. గతంలో ఇక్కడ పనిచేసిన చంద్రశేఖర్ను కలెక్టర్ ద్వారా 20 రోజుల క్రితం ప్రభుత్వానికి సరెండర్ చేశారు. అయితే దీన్ని న్యాయస్థానం తప్పుబట్టడంతో మళ్లీ పోస్టింగ్ ఇచ్చినట్లే ఇచ్చి విజయవాడకు బదిలీ చేశారు. అనంతరం ఆ పోస్టులో తమ అనుకూల అధికారిని నియమించేలా బుధవారం ఉత్తర్వులు జారీ చేయించారు.విదేశాల్లో భారీ గిరాకీ..కూటమి ప్రభుత్వం రాగానే సైదాపురం క్వారŠట్జ్ గనులపై ‘ముఖ్య’ నేత కన్ను పడటంతో వెంటనే అనుమతులు నిలిపివేశారు. అన్ని అనుమతులతో వందేళ్ల లీజుపై తీసుకున్న గనులను సైతం మూసి వేయించారు. ఇక్కడ లభ్యమయ్యే మైకా క్వార్ట్టŠజ్, తెల్లరాయి క్వార్ట్టŠజ్పై నివేదిక తెప్పించుకున్నారు. వందేళ్లకు సరిపడా గనుల్లో నిల్వలున్నట్లు గుర్తించడంతో వాటిని తవ్వి సొమ్ము చేసుకునేందుకు పథకం వేశారు. సైదాపురం మండలంలో లభించే ఖనిజాన్ని చైనా, జపాన్, రష్యాకు ఎగుమతి చేస్తుంటారు. ఎనిమిది నెలలుగా మైకా, క్వార్ట్ ్జకి విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. నాణ్యతను బట్టి ముడి ఖనిజం టన్ను రూ.25 వేల నుంచి రూ.రెండు లక్షల వరకు పలుకుతోంది. చైనాలోని సెమీకండక్టర్ పరిశ్రమల్లో మైకా క్వార్ట్ ్జని ఎక్కువగా వినియోగిస్తున్నారు. -
సముద్ర గర్భ మైనింగ్ వేలం ప్రారంభం
న్యూఢిల్లీ: సముద్ర గర్భ ప్రాంతాల్లో ఖనిజ నిక్షేపాల వేలం మొదటి రౌండ్ను ప్రభుత్వం ప్రారంభించింది. వీటిలో 13 మైన్స్ను విక్రయానికి ఉంచడం జరిగింది. ఈ మైన్స్లో మూడు సున్నపు మట్టి, మూడు నిర్మాణ ఇసుక, ఏడు పాలీమెటాలిక్ నాడ్యూల్స్– క్రస్ట్లు ఉన్నాయి. సముద్రగర్భ ఖనిజ వనరుల అన్వేషణ విషయంలో భారత్ పురోగతిని ఈ కేటాయింపులు సూచిస్తాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నారు. ఈ ఖనిజాలు మౌలిక సదుపాయాల అభివృద్ధి, హైటెక్ తయారీ, గ్రీన్ ఎనర్జీ పరివర్తనకు కీలకం కావడం గమనార్హం. వేలానికి సిద్ధమైన ఆఫ్షోర్ ప్రాంతాలలో ప్రాదేశిక జలాలు, కాంటినెంటల్ షెల్ఫ్, ప్రత్యేక ఆర్థిక మండలి, దేశంలోని ఇతర సముద్ర మండలాలు ఉన్నాయి. ఖనిజ సంపద పటిష్టతను సూచిస్తోంది: మంత్రి కిషన్ రెడ్డి వేలం ప్రారంభ కార్యక్రమంలో బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ఆఫ్షోర్ బ్లాకుల అన్వేషణ వల్ల దేశంలోని ఖనిజ సంపద మరింత పటిష్టం అవుతుందని తెలిపారు. భారతదేశంలో కీలకమైన ఖనిజాల కోసం డిమాండ్ పెరుగుతోందని వివరించారు. లిథియం డిమాండ్ ఎనిమిది రెట్లు పెరుగుతుందని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు. భారత్ త్వరలో క్రిటికల్ మినరల్స్ మిషన్ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. భాగస్వాములకోసం అన్వేషణ: వీఎల్ కాతా రావు ఖనిజ అన్వేషణ, అభివృద్ధి విభాగంలో భాగస్వాముల కోసం ప్రభుత్వం ప్రయతి్నస్తున్నట్లు గనుల శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు ఈ సందర్భంగా తెలిపారు. ఖనిజాలపై పరిశోధన– అభివృద్ధిపై కూడా దృష్టి సారించినట్లు తెలిపారు. సముద్ర గర్భ మైనింగ్ వేలం పక్రియ ప్రారంభం నేపథ్యంలో దేశ, విదేశాల్లో రెండు మూడు రోడ్షోలు చేయడానికి తాము సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. గనుల అదనపు కార్యదర్శి సంజయ్ లోహియా మాట్లాడుతూ, ఆఫ్షోర్ మినరల్ బ్లాక్లను విజయవంతంగా వేలం వేయడానికి అవసరమైన అన్ని నిబంధనలను పూర్తి చేసినట్లు చెప్పారు. ఆఫ్షోర్ ప్రాంతాలలో మైనింగ్ను చేపట్టే చర్యలు తీసుకోవడమే మనకు సవాలు అని ఆయన పేర్కొంటూ, అయితే ఆయా చర్యల్లో విజయవంతం అవుతామన్న భరోసాను వ్యక్తం చేశారు. కోబాల్ట్, నికెల్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, పాలీమెటాలిక్ నాడ్యూల్స్ వంటి అధిక డిమాండ్ నేపథ్యంలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి అలాగే సప్లై చైన్ను స్థిరీకరించడానికి భారత్ విభిన్న ఖనిజ వనరులను అభివృద్ధి చేయాలని గనుల మంత్రిత్వ శాఖ తెలిపింది.గ్లోబల్ లీడర్గా ఎదగడమే లక్ష్యం ఆఫ్షోర్ ఏరియాస్ మినరల్ (డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్, 2002ను పార్లమెంటు గత ఏడాది ఆగస్టులో సవరించింది. ఆఫ్షోర్ ప్రాంతాలలో ఖనిజ బ్లాకుల కేటాయింపు విధానంగా వేలాన్ని తప్పనిసరి చేసింది. వనరుల అన్వేషణ–వెలికితీత కోసం ఉత్పత్తి లీజులు, మిశ్రమ లైసెన్స్ల మంజూరును క్రమబదీ్ధకరణ వంటి చర్యలను తీసుకోడానికి ప్రభుత్వాన్ని ఈ సవరణ అనుమతిస్తుంది. భారత్ సముద్రగర్భంలో ఖనిజాల అన్వేషణలో అడుగుపెట్టినప్పుడు, దాని పారిశ్రామిక–గ్రీన్ ఎనర్జీ రంగాలను పెంపొందించడమే కాకుండా కీలకమైన ఖనిజాలలో గ్లోబల్ లీడర్గా తన స్థానాన్ని పొందడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది. -
మరోసారి తెరపైకి ‘గోల్కొండ వజ్రం’
సాక్షి, హైదరాబాద్: ‘అసలు సిసలైన వజ్రం కావాలంటే గోల్కొండ గనుల్లోనే దొరకాలి’ఇది ఒకప్పుడు ప్రపంచం మాట. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో విస్తరించిన గోల్కొండ గనుల్లో లభించే వజ్రాలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. వజ్రం అనగానే గుర్తుకొచ్చే ‘కోహినూర్’ఇక్కడ దొరికిందే. ఇప్పుడు మరోసారి గోల్కొండ వజ్రాల అంశం తెరపైకి వచ్చింది. బ్రిటిష్ రాజకుటుంబం నగల కలెక్షన్లలో భాగంగా ఉన్న 18వ శతాబ్దం నాటి అరుదైన నెక్లెస్ నవంబర్లో వేలానికి వస్తోంది.వేలం నిర్వహణలో ఖ్యాతిగాంచిన సోథెబైస్ జెనీవాలో దీనిని వేలం వేస్తోంది. మూడు వరుసలతో ఉన్న ఈ నెక్లెస్లో దాదాపు 500 వజ్రాలున్నాయి. అవి ప్రఖ్యాత గోల్కొండ గనుల నుంచి సేకరించినవే అయ్యి ఉంటాయంటూ తాజాగా వేలం నిర్వహణ సంస్థ సోథేబైస్ ప్రకటించింది. ఈ నెక్లెస్కు వేలంలో 2.8 మిలియన్ డాలర్ల గరిష్ట ధర పలుకుతుందని వేలం సంస్థ అంచనా వేస్తోంది. గోల్కొండ వజ్రాల స్వచ్ఛత ఆధారంగా వాటికి వేలం పాటల్లో అధికంగా ధరలు పలుకుతాయి. దీంతో ఇప్పు డు మరోసారి గోల్కొండ వజ్రాలు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా గోల్కొండ వజ్రాలు ప్రజలను విపరీతంగా అకట్టుకుంటున్నాయి.కోహినూర్తో..గోల్కొండ వజ్రాలకు అంతగా ఖ్యాతి రావటానికి కోహినూర్ వజ్రం ప్రధాన భూమిక పోషించింది. ప్రపంచం మొత్తానికి రెండున్నర రోజుల పాటు భోజన ఏర్పాట్లు చేసినందుకు ఎంత ఖర్చవుతుందో కోహినూర్ వజ్రం విలువ అంత ఉంటుందని మొఘల్ చక్రవర్తులు వ్యాఖ్యానించారట. గత పదేళ్లలో కొల్లాపూర్, నారాయణపేటలో జీఎస్ఐకి ముడి వజ్రాలుండే కింబర్లైట్ డైక్స్ లభించాయి. ఈ ప్రాంతాల్లో వజ్రాలుంటాయనటానికి ఇది ఓ ఆధారం. మూసీ పరీవాహకంలో కూడా వజ్రాలు భూగర్భంలో ఉన్నాయని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. బ్రిటిష్ పాలన కాలంలో గుంతకల్ సమీపంలోని వజ్రకరూరులో భారీ వజ్రాల గని తవ్వారు. ఇప్పటికీ అక్కడ 90 మీటర్ల లోతుతో భారీ గుంత నీటితో నిండి ఉంటుంది. » కుతుబ్షాహీల కాలంలో వజ్రాల వ్యాపారం ముమ్మరంగా సాగింది. విస్తారంగా గనులు తవ్వి వజ్రాలు వెలికితీశారు. దాదాపు లక్ష మంది కార్మికులు ఈ గనుల్లో పనిచేసేవారట. » ఈ గనులు స్థానిక సుబేదారుల అధ్వర్యంలో రోజువారీగా లీజుకు తీసుకొని హైదరాబాద్లోని వ్యాపారులు వజ్రాలు వెలికి తీసేవారు. ఒక క్యారెట్ కంటే ఎక్కువ బరువు తూగే వజ్రం లభిస్తే రాజుకు చెందుతుంది అన్న విధానం అమలులో ఉండేది. అలా కుతుబ్షాహీలు చాలా విలువైన, పెద్ద సైజు వజ్రాలు సొంతం చేసుకున్నారు. » గోల్కొండ వజ్రాల్లో నైట్రోజన్, బోరాన్ ఉండదు. ఈ కారణంగా వజ్రం అధిక కాంతివంతంగా ఉంటుంది. » కోహినూర్ తర్వాత అతిపెద్ద వజ్రం నిజాం జాకబ్ వజ్రమే. ఇది 420 క్యారెట్ బరువు ఉండేది. » గోల్కొండ గనుల నుంచి 12 మిలియన్ క్యారెట్ల వజ్రాలు తవ్వారని బ్రిటిష్ కాలంలో నిపుణులు అంచనా వేశారు. ఇప్పటికీ గోల్కొండ గనుల ప్రాంతంలో చిన్నసైజు వజ్రాలు లభిస్తూనే ఉన్నాయి. » గోల్కొండ డైమండ్స్ అన్నీ ఇప్పుడు యూరోపియన్ రాజకుటుంబాల సేకరణలో భాగంగా ఉన్నాయి. వాటిలో కొన్ని ఇరాన్ ట్రెజరీలో ఉన్నాయి. ఒకటి రెండు నైజాం కలెక్షన్లలో ఉన్నాయిటైప్ టూ ఏ కేటగిరీ..» అసలైన వజ్రం స్వచ్ఛతకు మారుపేరుగా ఉంటుందని, ‘గోల్కొండ వజ్రాలు కన్నీళ్లంత స్వచ్ఛమైనవి’అని నిపుణులు చెబుతారు. వజ్రాల వ్యాపారంలో టైప్ టూ ఏ కేటగిరీని అత్యంత అరుదైన, స్వచ్ఛమైనదిగా భావిస్తారు. అందుకే గోల్కొండ వజ్రాలను ఆ కేటగిరీకి చెందినవిగా పేర్కొంటారు. కాకతీయుల కాలంలో గోల్కొండ వజ్రాలను వెలికితీయటం ప్రారంభించారు. ప్రస్తుతం కర్ణాటకలోకి రాయచూరు నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లా నందిగామ వరకు ఉన్న ప్రాంతాన్ని గోల్కొండ గనులుగా పరిగణిస్తారు. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వజ్రాలు లభించేవి. ఈ వజ్రాలు అధికంగా ఉన్న ప్రాంతాలను తన పరిధిలో ఉంచుకునేందుకు నిజాం తహతహలాడేవాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని భూభాగాన్ని అప్పట్లో నిజాం ఆంగ్లేయుల పరం చేశాడు. ఆ సమయంలో ప్రస్తుతం ఆంధ్రాప్రాంతంలో ఉన్న పరిటాల ప్రాంతాన్ని నిజాం తన పరిధిలోకి వచ్చేలా చేసుకున్నాడు. అక్కడ వజ్రాలు అధికంగా లభిస్తుండటమే దీనికి కారణం. ప్రస్తుతం తెలంగాణలో భాగంగా ఉన్న మునగాలను నిజాం సర్కారు బ్రిటిష్ పరిధిలోకి మార్చింది. రాష్ట్రాల పునరి్వభజన సమయంలో భౌగోళికంగా ఈ తీరు సరిగ్గా లేకపోవటంతో పరిటాలను ఆంధ్రప్రదేశ్కు, మునగాలను తెలంగాణకు కేటాయించారు. ఇప్పటి వరకు వేలంలో అత్యధిక ధరకు అమ్ముడైన మూడు ప్రధాన వజ్రాలు 2008: విట్టెల్స్బాచ్ డైమండ్ - 23.7 మిలియన్ డాలర్లు 1995: ఓర్లోవ్ డైమండ్ - 20.7 మిలియన్ డాలర్లకు 1995: జాకబ్ డైమండ్ - 13.4 మిలియన్ డాలర్లుప్రధాన గోల్కొండ వజ్రాల నమూనాలుప్రజలు సందర్శించేందుకు వీలుగా కొన్ని ప్రధాన గోల్కొండ వజ్రాలకు నమూనాలు రూపొందించారు. » లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియంలో కోహినూర్ నకలు వజ్రం ఉంది » మాస్కోలోని క్రెమ్లిన్ ఆర్మరీలో ఓర్లోవ్ డైమండ్ నమూనా ఉంది » టెహరాన్స్ నేషనల్ మ్యూజియంలో దరియా–ఇ–నూర్ వజ్రం నమూనా ఏర్పాటు చేశారు. -
సింగరేణి తంగలాన్..!
‘కేజీఎఫ్’, ‘తంగలాన్ ’ సినిమాలతో కర్నాటకలోని కోలార్ గోల్డ్ఫీల్డ్లో బంగారం అన్వేషణ ఎలా జరిగిందో చూపించారు. సమాజంలో అట్టడుగు వర్గాలకు చెందిన కార్మికులు కొలార్ గనుల్లో ఎలా దగాపడ్డారు, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారనే అంశాలను మ్యాజిక్ రియలిజం ధోరణిలో ‘తంగలాన్’ సినిమా చూపించింది. బంగారు గనులపై గుత్తాధిపత్యం కలిగిన నియంతలకే రాకీ అనే యువకుడు ఎలా భాయ్గా మారాడనే అంశాన్ని వాస్తవ ఆధారిత కల్పితాలుగా ‘కేజీఎఫ్’ సినిమాలో చూపించారు. తెలుగు రాష్ట్రాల్లో బంగారు గనులు లేకపోయినా, నల్ల బంగారంగా పిలుచుకునే సింగరేణి గనులు ఉన్నాయి. బొగ్గు తవ్వకాల కోసం గనుల యజమానులు కార్మికులను ఎలా రప్పించారో, కార్మికుల ప్రాణాలతో ఎలా చెలగాటం ఆడారో, వారి ఆగడాలను కార్మికులు ఐక్యంగా పోరాడి ఎలా సాధించుకున్నారో ఓసారి చూద్దాం...మనదేశంలో బొగ్గు తవ్వకాలను బ్రిటిషర్లు ప్రారంభించారు. తొలి బొగ్గు గని 1774లో పశ్చిమ బెంగాల్లోని రాణీగంజ్లో మొదలైంది. మన దగ్గర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో 1889లో సింగరేణి గ్రామం దగ్గర బొగ్గు గని మొదలైంది. స్వాతంత్య్రం వచ్చే సమయానికి ఇల్లెందు, బెల్లంపల్లి (1928), కొత్తగూడెం (1938)లలో బొగ్గు గనులు మొదలయ్యాయి. 1914, 1942లలో జరిగిన మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల కారణంగా బ్రిటిష్ ప్రభుత్వానికి బొగ్గు అవసరం బాగా పెరిగింది. దీంతో గనుల్లో పని చేసే కూలీలను తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా కాంట్రాక్టర్లను నియమించింది. కాంట్రాక్టర్ల తరఫున ఏజెంట్లు పల్లెల్లో తిరుగుతూ, ప్రజలను సమీకరించి కొత్తగూడెం, ఇల్లెందు, బెల్లంపల్లి గ్రామాలకు తీసువచ్చేవారు. అయినా, కూలీలు సరిపోకపోవడంతో అప్పటికే బొగ్గు గనుల రంగంలో అనుభవం ఉన్న బెంగాల్, బిహార్, ఉత్తర్ప్రదేశ్ కార్మికులను ఇక్కడికి రప్పించేవారు. ఈ క్రమంలో కాంట్రాక్టర్ల పేరుమీదుగానే బొగ్గు గనుల ప్రాంతంలో సన్యాసి బస్తీ, గాజుల రాజంబస్తీ, గంగా బిషన్ బస్తీ, కూలీ లైన్, బర్మా క్యాంప్, మథుర బస్తీ, నాగయ్య గడ్డ, పంజాబ్ గడ్డ, కొత్తూరు రాజం బస్తీ, బాబు క్యాంపు, రడగంబాల బస్తీ తదితర పేర్లతో కాలనీలు ఏర్పాటయ్యాయి.చావుతో చెలగాటం..గాలి, వెలుతురు, నీరు వంటి కనీస సౌకర్యాలు కరువైన గనుల్లో పని చేయడమంటే చావుతో చెలగాటం ఆడటమే! 1928 మార్చి 12న ఇల్లెందులోని స్ట్రట్పిట్ మైన్ లో మీథేన్ లాంటి విషవాయువులు వెలువడటంతో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకేసారి 43 మంది కార్మికులు చనిపోయారు. ఆ తర్వాత బెల్లంపల్లి, కొత్తగూడెంలోని బర్లిపిట్ గనిలో ఈ తరహా ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో కార్మికులు గనుల్లో మాడిమసైపోయారు.రక్తాలు కారుతుండగా..బొగ్గు వెలికి తీయడానికి కార్మికులు దొరక్కపోవడంతో మహిళలు, పిల్లల చేత కూడా పని చేయించేవారు. చెప్పులు లేకుండా బొగ్గు పెళ్లల మీదుగా నడుస్తూ, బావుల్లోకి దిగాల్సి వచ్చేది. గనిలోకి వెళుతుంటే పైకప్పు నుంచి నీరు కురిసేది. నీటితో పాటు వచ్చే బొగ్గు రజను చర్మానికి ఒరుసుకుపోయి గాయాలయ్యేవి. గాయాల బాధను భరిస్తూనే, పనిముట్లతో బొగ్గు బండలను కొట్టి చిన్న ముక్కలుగా చేసి తట్టల్లో నింపుకుని నెత్తిపై మోస్తూ పనిచేయాల్సి వచ్చేది. గనిలో విషవాయులు ఎప్పుడు వెలువడుతాయో, గని పైకప్పు ఎప్పుడు కూలుతుందో తెలియని దారుణ పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ కార్మికులు పనిచేసేవారు. ఇక కటిక చీకటితో ఉండే గనిలో దారి తప్పి అదృశ్యమైన వారి సంఖ్యకు అంతేలేదు.కాంట్రాక్టర్ల దోపిడీ..కార్మికులకు అరకొర జీతాలు చెల్లిస్తూ, వారితో కాంట్రాక్టర్లు బండెడు చాకిరీ చేయించే వారు. కనీస రక్షణ ఏర్పాట్లు లేకుండా, పిల్లాపాపలు, మహిళలతో సహా బొగ్గు గనుల్లో రేయింబగళ్లు పనిచేయించేవారు. గనుల్లో ప్రమాదాలు, మరణాలు నిత్యకృత్యం. ఇక్కడ పని చేయలేక పారిపోయేందుకు ప్రయత్నించే వారిని కాంట్రాక్టర్ల గుండాలు వెతికి పట్టుకుని, చిత్రహింసలు పెట్టేవారు. ఇక మహిళలపై జరిగే అకృత్యాలకు అంతేలేదు.కాంట్రాక్టర్లకే నిజాం మద్దతు..బొగ్గు తవ్వకాల బాధ్యతలు చూస్తు్తన్న బ్రిటిషర్లకు, కార్మికులను అందిస్తున్న కాంట్రాక్టర్లకు రక్షణగా నిజాం పోలీసు వ్యవస్థ పనిచేస్తూ, కార్మికులను పీడించే కాంట్రాక్టర్లకు వెన్నుదన్నుగా నిలిచేది. కార్మికులు ఎటూ పారిపోకుండా రైల్వే స్టేషన్లలోను, ఊరి పొలిమేర్లలోను నిఘా పెట్టేది. తమకు జరిగే అన్యాయాలపై ఎవరైనా నోరు విప్పినా, పట్టించుకునే నాథులు ఉండేవారు కాదు. కాంట్రాక్టర్ల చేతిలో చిక్కి వెట్టిచాకిరి చేసే కార్మికులను ఆదుకునే వారూ ఉండేవారు కాదు.సాయుధ పోరాటం..రెండో ప్రపంచ యుద్ధం మొదలయ్యాక నిజాం రాజ్యంలో సాయుధ రైతాంగ పోరాటానికి అడుగులు పడ్డాయి. అదే సమయంలో సింగరేణిలో కార్మిక సంఘాలు పురుడు పోసుకున్నాయి. అలా నిజాం రైల్వే యూనియన్ (హైదరాబాద్), అజాంజాహీ మిల్ వర్కర్స్ (వరంగల్) యూనియన్ల తర్వాత 1938లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ పేరుతో మూడో యూనియన్ ఏర్పడి, గనుల్లో కార్మికులతో వెట్టి చాకిరి చేయిస్తు్తన్న నిజాం సర్కారుకు వ్యతిరేకంగా పోరాటం మొదలెట్టింది.ప్రశ్నించిన శేషగిరి..నెల్లూరు జిల్లా పాపిరెడ్డిపాలెంలో 1918 సెప్టెంబరు 24న జన్మించిన దేవనూరి శేషగిరిరావు అక్కడే విద్యాభాస్యం పూర్తి చేసుకుని ఉపాధి కోసం సింగరేణిలో అకౌంటంట్గా చేరి, కొత్తగూడేనికి మకాం మార్చారు. ఇక్కడి కార్మికుల కష్టాలు, కాంట్రాక్టర్ల దోపిడీని దగ్గరగా చూశారు. అన్యాయానికి ఎదురెళ్లాలని నిర్ణయించుకున్నారు. పొద్దంతా హెడాఫీసులో పని చేస్తూ, సాయంత్రం వేళ కార్మికవాడలకు వెళ్లి, వారితో కలసిపోయి, వారిలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించి, హక్కుల కోసం పోరాడేలా తయారు చేశారు. 1947లో రహస్య జీవితం గడుపుతున్న శేషగిరిని నిజాం పోలీసులు అరెస్ట్ చేసి, చంచల్గూడ జైలుకు తరలించారు. ఒక కేసు విచారణ కోసం అక్కడి నుంచి ఇల్లెందుకు తీసుకువస్తుండగా, మార్గమధ్యంలో డోర్నకల్లో ఆగారు. అక్కడ పోలీసుల నుంచి తప్పించుకున్న శేషగిరి విజయవాడ చేరుకున్నారు. అక్కడ గెరిల్లా యుద్ధతంత్రాలు నేర్చుకుని, వాటిని సింగరేణి ప్రాంతంలో అమల్లోకి తెచ్చారు. చివరకు 1948 ఫిబ్రవరి 15న భద్రాచలం సమీపంలో నెల్లిపాక దగ్గర జరిగిన ఎన్ కౌంటర్లో శేషగిరితో పాటు పాపయ్య, రంగయ్య అనే విప్లవకారులు ప్రాణాలు కోల్పోయారు.యూనియన్ కొమరయ్య..కొమరయ్య 1928లో ఇల్లెందులో జన్మించారు. కొత్తగూడెంలోని మెయిన్ వర్క్షాప్లో 1940లో టర్నర్గా చేరారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో 1947లో అరెస్టయి, సుమారు ఏడాది పాటు జైలు జీవితం గడిపారు. తర్వాత 1948లో జైలు నుంచి విడుదలయ్యాక 1949 వరకు అజ్ఞాత జీవితం గడిపారు. ఇండియాలో నిజాం స్టేట్ విలీమైన తర్వాత చివరి శ్వాస వరకు కార్మికుల హక్కుల కోసం పోరాటం చేశారు. దీంతో ఆయన పేరే యూనియన్ కొమరయ్యగా కార్మికుల గుండెల్లో నిలిచిపోయింది. దేవనూరి శేషగిరిరావు, మనుబోతుల కొమరయ్యల తరహాలోనే సర్వదేవభట్ల రామనాథం, డాక్టర్ రాజ్బహదూర్, పర్సా సత్యనారాయణ, పులిపాక రాజయ్య, మఖ్దూం మొíహియుద్దీన్, వంగా రాజేశ్వరరావు, కారపెల్లి రాఘవరావు వంటి నాయకులు కార్మికుల హక్కుల కోసం పోరాటాలు చేశారు.హక్కుల సాధన..కార్మికులు ఐక్యంగా సాగించిన పోరాటాల ఫలితంగా గనుల్లో కాంట్రాక్టు వ్యవస్థ రద్దయ్యింది. రోజుకు పన్నెండు గంటల పని స్థానంలో ఎనిమిది గంటల పని విధానం అమల్లోకి వచ్చింది. బాలలతో పనులు చేయించడం ఆపించారు. మహిళలకు గనుల్లో కాకుండా ఉపరితలంలోనే పనులు ఇచ్చేలా మార్పులు తెచ్చారు. గనుల్లోకి కిరోసిన్ దీపాలు తీసుకుని వెళ్లడం వల్ల జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు సేఫ్టీ ల్యాంప్స్ను ఇచ్చేలా ఒత్తిడి తెచ్చారు. కాళ్లకు బూట్లు, తలకు హెల్మెట్లు అందుబాటులోకి తెచ్చారు. వేతనాలు పెరిగాయి. పని ప్రదేశాల్లో ప్రమాదవశాత్తు మరణం/అంగవైకల్యం సంభవిస్తే నష్టపరిహారం ఇచ్చేలా యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి, సాధించుకున్నారు. స్వాతంత్య్రం వచ్చాక ప్రధాన రాజకీయ పార్టీలకు అనుబంధంగా అనేక సంఘాలు కార్మికుల సంక్షేమం కోసం పని చేశాయి.ప్రస్తుతం ఇలా..ఆరేడు దశాబ్దాలుగా కార్మికులు తమ హక్కుల కోసం చేసిన పోరాటాల ఫలితంగా సింగరేణి కార్మికుల జీవితాల్లో వెలుగులు వచ్చాయి. ప్రస్తుతం 39 వేలకు పైగా కార్మికులు ఉన్నారు. వీరి సగటు వేతం రూ. 70 వేలు ఉండగా, వీరిలో ప్రారంభ జీతం రూ.60 వేలు మొదలుకొని గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు అందుకునేవారు ఉన్నారు. సంస్థ లాభాల్లో కార్మికులకు వాటా ఇస్తున్నారు. చివరిసారిగా రూ. 2,220 కోట్లను కార్మికులకు అందించారు. సంస్థ పరిధిలో 40 వేల క్వార్టర్లు, 12 ఆస్పత్రులు, 20 వరకు విద్యాసంస్థలు ఉన్నాయి. సర్వీసులో సింగరేణి కార్మికుడు అకస్మాత్తుగా చనిపోతే కోటి రూపాయల ప్రమాద బీమా ఉంది. సంస్థలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు బీమా మొత్తం రూ. 30 లక్షలుగా ఉంది. – తాండ్ర కృష్ణగోవింద్, సాక్షిప్రతినిధి, కొత్తగూడెంఇవి చదవండి: అర్లీ రిటైర్మెంట్.. ఫరెవర్ ఎంజాయ్మెంట్! -
బొట్స్వానా గనిలో 2,492 క్యారెట్ల వజ్రం
గబొరోన్(బొట్స్వానా): ఆఫ్రికా దేశం బొట్స్వానా గనిలో అతిపెద్దదిగా భావిస్తున్న వజ్రం లభ్యమైంది. తమ గనుల్లో ఇంతటి భారీ వజ్రం దొరకడం ఇదే మొదటిసారని బొట్స్వానా ప్రభుత్వం తెలిపింది. దీని బరువు 2,492 కేరట్లని వివరించింది. కెనడాకు చెందిన లుకారా డైమండ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిచే కరోవె గనిలో ఈ అరుదైన ముడి వజ్రం లభించింది. ఎక్స్రే సాంకేతికతను ఉపయోగించి అధిక నాణ్యతతో, చెక్కు చెదరకుండా ఉన్న ఈ వజ్రాన్ని కనుగొన్నట్లు లుకారా తెలిపింది. ఇంత పెద్ద వజ్రం లభించడం వందేళ్లలో ఇదే మొదటిసారని పేర్కొంది. గతంలో 1905లో దక్షిణాఫ్రికాలోని ఓ గనిలో కల్లినాన్ డైమండ్ బయటపడింది.3,106 కేరట్లున్న ఆ భారీ వజ్రాన్ని 9 భాగాలు చేశారు. వాటిలో కొన్ని భాగాలను బ్రిటిష్ రాజవంశీకుల ఆభరణాల్లో వాడారు. అంతకుపూర్వం, 1800లో బ్రెజిల్లో అతిపెద్ద బ్లాక్ డైమండ్ దొరికింది. అయితే, ఇది భూ ఉపరితలంలోనే లభించింది. ఇది ఉల్కలో భాగం కావొచ్చని నమ్ముతున్నారు. బొట్స్వానా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వజ్రాల ఉత్పత్తిదారు. మొత్తం 20 శాతం వరకు వాటా బొట్స్వానా గనులదే. ఇటీవలి సంవత్సరాల్లో ఇక్కడి గనుల్లో భారీ వజ్రాలు లభించాయి. 2019లో కరోవె గనిలోనే 1,758 కేరట్ల సెవెలో వజ్రాన్ని తవ్వి తీశారు. దీనిని ఫ్రాన్సుకు చెందిన ప్రఖ్యాత ఫ్యాషన్ సంస్థ లూయిస్ విట్టన్ కొనుగోలు చేసింది. అయితే, ధరను వెల్లడించలేదు. కరోవె గనిలోనే 1,111 కేరట్ల లెసెడి లా రొనా అనే డైమండ్ లభ్యమైంది. దీనిని, బ్రిటిష్ ఆభరణాల సంస్థ 2017లో 5.30 కోట్ల డాలర్ల(సుమారు రూ.440 కోట్లు)కు దక్కించుకుంది. -
Supreme Court: ‘రాయల్టీ’ రాష్ట్రాలదే
న్యూఢిల్లీ: ఖనిజాలపై రాయల్టీ విధించే అధికారం రాష్ట్రాలకు మాత్రమే ఉందని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. ఖనిజాలపై చెల్లించే రాయల్టీ పన్ను కాదని న్యాయస్థానం తేలి్చచెప్పింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం 8:1 మెజారిటీతో కీలక తీర్పు వెలువరించింది. కేంద్ర ప్రభుత్వానికి ఇది ఎదురుదెబ్బే. గనుల, ఖనిజాల అభివృద్ధిపై కేంద్రం నియంత్రణకు వీలు కలి్పస్తున్న రాజ్యాంగంలోని జాబితా–1లో పేర్కొన్న ఎంట్రీ 54 ప్రకారం.. ఖనిజ హక్కులపై పన్నులు విధించే అధికారం పార్లమెంటుకు లేదని తేల్చిచెప్పింది. అయితే ఖనిజ హక్కులపై రాయల్టీ విధించే రాష్ట్రాల అధికారాన్ని ఏ స్థాయికైనా పరిమితం చేసే అధికారం పార్లమెంటుకు ఉందని స్పష్టం చేసింది. గనులు, ఖనిజాలు అధికంగా ఉన్న జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు ఈ తీర్పుతో లబ్ధి చేకూరనుంది. తమ ప్రాంతంలో ఉన్న గనులు, ఖనిజాలపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా వసూలు చేసిన రూ.వేల కోట్ల పన్నులను తిరిగి తమకు ఇప్పించాలని ఆయా రాష్ట్రాలు విజ్ఞప్తి చేశాయి. తీర్పును అమల్లోకి తీసుకురావాలని కోరాయి. రాష్ట్రాల విజ్ఞప్తిని కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ వ్యతిరేకించారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఈ అంశంపై లిఖితపూర్వకంగా స్పందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. పన్నులను రాష్ట్రాలకు తిరిగి ఇచ్చే విషయంలో ఈ నెల 31న తమ నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించింది. 1989 నాటి తీర్పును తోసిపుచ్చిన ధర్మాసనం గనులు, ఖనిజాలపై రాయల్టీ విధించే హక్కు రాష్ట్రాలకే ఉందంటూ తమ తీర్పును జస్టిస్ డి.వై.చంద్రచూడ్ స్వయంగా చదివి వినిపించారు. ధర్మాసనంలోని 8 మంది సభ్యులు రాష్ట్రాల హక్కును సమర్థిస్తూ తీర్పు ఇచ్చారు. జస్టిస్ నాగరత్న ఒక్కరే వ్యతిరేకిస్తూ భిన్నమైన తీర్పు వెలువరించారు. రాజ్యాంగంలో జాబితా–2లోని ఎంట్రీ 50 కింద గనులు, ఖనిజాలపై పన్నులు విధించే అధికారం పార్లమెంట్కు లేదని జస్టిస్ చంద్రచూడ్ తమ తీర్పులో చెప్పారు. రాయల్టీ అంటే పన్ను అని తేల్చేస్తూ 1989లో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచి్చన తీర్పు సరైంది కాదని పేర్కొన్నారు. ఆæ తీర్పును తోసిపుచ్చారు.రాష్ట్రాల అధికారాన్ని పార్లమెంటు పరిమితం చేయవచ్చు ఖనిజాలపై రాయల్టీ వసూలు చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉన్నప్పటికీ.. దేశంలో ఖనిజాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాల అధికారాన్ని పరిమితం చేసే హక్కు మాత్రం పార్లమెంటుకు ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. ‘ఖనిజాభివృద్ధి ఆటంకం కలగకుండా ఉండటానికి రాష్ట్రాల రాయల్టీ అధికారాన్ని పార్లమెంటు పరిమితం చేయగలదు. ఆ మేరకు పార్లమెంటు ఏదైనా చట్టాన్ని చేస్తే రాష్ట్రాలు దానికి కట్టుబడి ఉండాలి’ అని స్పష్టం చేసింది. -
సింగరేణి పూర్వ వైభవం కోసం కిషన్ రెడ్డి గారు కృషి చేయాలి
-
సింగరేణి వేలం.. కార్మికులకు కిషన్ రెడ్డి భరోసా
-
సింగరేణికి ఉరి తాడు
-
మంగంపేట బెరైటీస్ గనుల టెండర్లపై రామోజీ తప్పుడు కథనం
-
బొగ్గు గనుల మూసివేత పరిణామాలేమిటి? కూలీలు ఏం చెయ్యాలి?
చాలామంది కూలీలు ఉపాధి కోసం బొగ్గు గనుల్లో పనులు చేస్తుంటారు. తమ ఆరోగ్యాన్ని, పరిశుభ్రతను పక్కనపెట్టి ఈ పనుల్లో పాల్గొంటారు. గ్లోబల్ ఎనర్జీ మానిటర్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం బొగ్గు గనుల మూసివేత కారణంగా 9,90,200 మంది ఉపాధి కోల్పోనున్నారు. ప్రపంచంలోని పలు బొగ్గు గనులు 2035కు ముందుగానే మూసివేయనున్నారు. బొగ్గు గనుల మూసివేత ప్రభావం ముఖ్యంగా భారత్, చైనాలపై అధికంగా ఉండనుంది. దీని గరిష్ట ప్రభావం చైనాలోని షాంగ్సీలో కనిపించనుంది. 2050 నాటికి బొగ్గు తవ్వకాలకు సంబంధించి దాదాపు 2,41,900 ఉద్యోగాలు మాయం కానున్నాయి. మన దేశంలో మొత్తం 3,37,000 మంది కార్మికులు బొగ్గు తవ్వకాల పనుల్లో పాల్గొంటున్నారు. కార్మికుల తొలగింపుల విషయానికొస్తే కోల్ ఇండియా కంపెనీ పేరు ముందంజలో వస్తుంది. ఇది రాబోయే ఐదేళ్లలో 73,800 మంది కార్మికులను తొలగించనుందని సమాచారం. శిలాజ ఇంధనాల కాలుష్య స్థాయిలను తగ్గించడం ద్వారా వాతావరణ మార్పులను ఆపడానికి ప్రపంచంలోని అన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ దిశగా ముందడుగు వేస్తూ బొగ్గు వినియోగాన్ని భారీగా తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2070 నాటికి నికర సున్నా ఉద్గారాల లక్ష్యాన్ని సాధిస్తామని భారతదేశం గతంలో హామీ ఇచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కోల్ ఇండియా పునరుత్పాదక ఇంధనంపై దృష్టి సారించే లక్ష్యంతో పని చేస్తోంది. ఇదిలావుండగా 2022 నాటికి భారతదేశంలో పునరుత్పాదక ఇంధన రంగంలో సుమారు 9.88 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని తెలుస్తోంది. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు నిరంతరం పెరుగుతున్నాయి. ఇందులో కేవలం 4.66 లక్షల మంది జలవిద్యుత్లో ఉపాధి పొందుతుండగా, సోలార్ పివిలో 2.82 లక్షల మందికి ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. బొగ్గు గనుల్లో పని చేసే కూలీలు ఉపాధి కోల్పోక ముందుగానే వారికి ఇతర ఉపాధి పనులను నేర్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. తద్వారా వారు జీవనోపాధి పొందగలుగుతారు. ఈ విషయంలో ప్రభుత్వాలు కూడా క్రియాశీలకంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: పెన్షన్ సొమ్ము కోసం భర్తకు నిప్పు! -
కొత్త గనులు రాకపోతే కష్టమే
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి మనుగుడపై నీలినీడలు కమ్ముకున్నాయి. కొత్త బొగ్గు గనుల ప్రస్తావన లేకపోవడంతో మరో ఇరవై ఏళ్ల తర్వాత పరిస్థితి ఏమిటని సింగరేణి కార్మికులు ఆందోళన చెందుతున్నారు. విలియమ్ కింగ్ అనే శాస్త్రవేత్త 1870 సంవత్సరంలో బొగ్గు నిక్షేపాలు కనుగొన్నారు. ఆనాటి లెక్కల ప్రకారం సుమారు 11వేల మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. ఇందులో ఏ సమస్య ఎదురుకాకుండా తీసే బొగ్గు 3వేల మిలియన్ టన్నులు మాత్రమేనని తేల్చారు. ఇప్పటివరకు సింగరేణి సుమారు 1,600 మిలియన్ టన్నులు వెలికి తీయగలిగింది. ప్రస్తుతానికి సింగరేణి సంస్థ జియాలజికల్ విభాగ లెక్కల ప్రకారం మరో 1,400 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలే ఉన్నాయి. ఈ బొగ్గు తీసేందుకు ఇంకో ఇరవై ఏళ్ల సమయం పడుతుంది. ఎప్పటికప్పుడు కొత్త గనులు ప్రారంభిస్తూ వెళితే ఈ కాలపరిమితి పెరుగుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను వేలం వేస్తున్నా, రకరకాల కారణాలతో ఈ వేలంలో సింగరేణి యాజమాన్యం పాల్గొనడం లేదు. దీంతో ఇరవై ఏళ్ల తర్వాత సింగరేణి పరిస్థితి ఏమిటనేది తెలియడం లేదు. వేలంలో పాల్గొంటే మరో 300 మిలియన్ టన్నులు కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణ విధానంలో భాగంగా ఎవరైనా సరే వేలంలో పాల్గొంటేనే బొగ్గు గనులు దక్కుతాయి. అయితే సింగరేణి యాజమాన్యం రూ.25 లక్షలు వెచ్చించి టెండర్ ఫారాలు ఖరీదు చేసినా వేలంలో పాల్గొనలేదు. దీంతో కోయగూడెం ఓసీ–3, శ్రావణపల్లి ఓసీతో పాటు సత్తుపల్లి ఓసీలు దూరమయ్యాయి. ఒకవేళ ఇవి దక్కించుకుంటే సుమారు 300 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు సింగరేణికి అందుబాటులోకి ఉండేవి. ఈ మూడు గనుల్లో బొగ్గు నిల్వల గుర్తింపు, ఇతర పనులకు సింగరేణి యాజమాన్యం రూ.60 కోట్లు ఖర్చు చేసినా, వేలంలో మాత్రం పాల్గొనలేదు. భూగర్భగనులతో నష్టం వస్తుందని.. భూగర్భ గనుల ఏర్పాటుతో బొగ్గు ఉత్పత్తికి ఎక్కువ ఖర్చువుతుందని చెబుతున్న యాజమాన్యం ఓసీల ఏర్పాటుకు మొగ్గుచూపుతోంది. ఓసీల ద్వారా అత్యధిక ఉత్పత్తి సాధ్యమవుతుందని, భూగర్భగనుల్లో అలా సాధ్యం కాకపోవడంతో అటువైపు దృష్టి సారించడం లేదని చెబుతున్నారు. కొత్తగూడెం ఏరియాలో 8, 9, 10, 11వ గనుల్లో మిగిలిన సుమారు 60 మిలియన్ టన్నుల బొగ్గును జీకే ఓసీ ద్వారా 1994 నుంచి 30 ఏళ్ల కాలంలో వెలికి తీయడం పూర్తిచేశారు. ఓసీల ద్వారా ఇంత వేగంగా బొగ్గు తీయడం సాధ్యమవుతున్నా, ఓసీల ద్వారా పర్యావరణం దెబ్బతింటుందని తెలిసి కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. పదేళ్లలో ఒక్క గనీ లేదు.. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అయినా, కొత్తగా ఒక్క గనిని కూడా ప్రారంభించలేదు. గతంలో బొగ్గు తీసిన భూగర్భ గనులను ఓపెన్ కాస్ట్(ఓసీ)లుగా మార్చా రే తప్ప కొత్త ఓసీలు, భూగర్భ గనులు ప్రారంభించిన దాఖలాలు లేవు. రూ.60 కోట్లు వెచ్చించి సర్వే లు, డ్రిల్లింగ్లు వేయించడంతో అధికారులు, కార్మికులు శ్రమదోపిడీకి గురయ్యారే తప్ప ఫలితం రాలే దు. తెలంగాణ వస్తే ఓసీలు ఉండవు..భూగర్భగనులే ఉంటాయని తొలినాళ్లలో చెప్పినా, 2018లో వర్చువల్గా ప్రారంభించిన రాంపురం గనిలోనూ ఇప్పటివరకు బొగ్గు ఉత్పత్తి మొదలుకాలేదు. -
ఆ గనిలో మహిళలకే పని.. కారణమిదే!
సాధారణంగా గనుల్లో పనిచేసేందుకు పురుషులనే నియమిస్తుంటారు. గనుల్లోని పనులు ఎంతో కష్టమైనందున వాటిని పురుషులతోనే చేయిస్తుంటారు. అయితే ఆఫ్రికాలోని ఒక దేశంలో దీనికి విరుద్ధమైన పనితీరు కలిగిన ఒక గని ఉంది. దీనిలో మహిళలు మాత్రమే పని చేస్తుంటారు. దీని వెనుకగల కారణం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. అంతే కాదు ఈ గనిలో పని చేసే మహిళలకు భారీ వేతనం కూడా లభిస్తుంది . ఐక్యరాజ్యసమితితో సహా ప్రపంచంలోని పలు దేశాలు ఆ గనిలో జరిగే పనితీరును ప్రశంసిస్తుంటాయి. ఉత్తర జింబాబ్వేలోని డుంగుజా నది వద్ద మైనింగ్ జరుగుతుంటుంది. ‘జింబాకువా’ లాంటి అనేక కంపెనీలు ఇక్కడ రత్నాల కోసం వెదుకులాట సాగిస్తుంటాయి. ఇక్కడ పనిచేసేందుకు మహిళలను మాత్రమే తీసుకుంటారు. డ్రిల్లింగ్ అయినా, సుత్తితో కొట్టే పని అయినా, పెద్ద పెద్ద రాళ్లను రవాణా చేయడమైనా.. ప్రతీపనిని మహిళలే చేస్తుంటారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ గనిలో పేలుళ్లు లాంటి పనులు చేయరు. జాతి రాళ్లు, రత్నాలు భూమి లోపలి పొరలలో కనిపిస్తాయి. ఉలి, సుత్తి సహాయంతోనే ఇక్కడ తవ్వకాల పనులు చేపడతారు. ఈ విధమైన పనితీరుతో పర్యావరణానికి హాని కలగదు. ఈ ప్రక్రియలో రసాయనాలు ఉపయోగించరు. నీటిని కూడా తక్కువగానే ఉపయోగిస్తారు. ఇక్కడ పనిచేసే మహిళలకు ప్రతినెలా 180 (ఒక యూరో రూ.91) యూరోలు అందుతుంటాయని ఐక్యరాజ్య సమితి చెబుతోంది. ఇక్కడ పనిచేసే మహిళలు తమ తీరిక సమయంలో కూరగాయలు పండిస్తూ, వాటిని విక్రయిస్తుంటారు. ఇక్కడి గనుల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మైనింగ్ కంపెనీలు మహిళా సాధికారతను కాంక్షిస్తూ, వారికే ఉపాధి కల్పిస్తున్నట్లు చెబుతున్నాయి. ఇక్కడి మహిళలు తమ పిల్లల చేత ఉన్నత చదువులు చదివిస్తున్నారు. నిరుద్యోగ భర్తలకు అండగా నిలుస్తున్నారు. మగవారి కంటే తామేమీ తక్కువ కాదని నిరూపిస్తున్నారు ఇక్కడి మహిళలు. ఇది కూడా చదవండి: కోతకొచ్చిన పంటల్లో నక్కిన పులులు.. వణుకుతున్న కూలీలు! -
‘జగనన్న భూహక్కు –భూరక్ష’కు సర్వే రాళ్లు సిద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 305 గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ యూనిట్లకే జగనన్న భూహక్కు–భూరక్ష పథకం కోసం వినియోగించే సర్వే రాళ్ల ఆర్డర్లిస్తున్నామని రాష్ట్ర గనులు, ఇంధన, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. మూడో దశలో అక్టోబర్ 15 నాటికి 25.42 లక్షల సర్వే రాళ్లు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో గ్రానైట్ ఫ్యాక్టరీ నిర్వాహకులతో సర్వే రాళ్ల సరఫరాపై శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గ్రానైట్ ఫ్యాక్టరీలకు అండగా నిలిచేందుకు సీఎం జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారని, సంక్షోభంలో కూరుకుపోయిన గ్రానైట్ ఫ్యాక్టరీలకు చేయూతనిస్తూ స్లాబ్ సిస్టమ్ తెచ్చారని, విద్యుత్ రాయితీలు కల్పించారని తెలిపారు. సర్వే రాళ్ల తయారీ ఆర్డర్లను గ్రానైట్ ఫ్యాక్టరీలకే ఇవ్వడం వల్ల ఆయా కర్మాగారాల్లో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, వీటిపై ఆధారపడ్డ వారికి ఉపాధి లభిస్తోందన్నారు. ఇప్పటి వరకు 44.03 లక్షల సర్వే రాళ్లు సరఫరా చేశామని, ఇందుకు రూ.1,153.2 కోట్లను సరఫరాదారులకు, రాళ్ల రవాణా కోసం రూ.63.8 కోట్లు చెల్లించామన్నారు. రీసర్వే కోసం గతంలో గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ యూనిట్ల నిర్వాహకులతో జరిగిన సమావేశంలో రోజుకు లక్ష సర్వే రాళ్లు కావాలని కోరామన్నారు. యూనిట్లకు రా మెటీరియల్ను కూడా గనుల శాఖ అధికారులు సమకూర్చారని, మొదట రూ.270 ఉన్న రేటును రూ.300కి పెంచామన్నారు. ఇంత చేస్తున్నా ఫ్యాక్టరీలకు బదులు బయటి నుంచి ట్రేడర్లు సర్వే రాళ్లు సరఫరా చేస్తున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనివల్ల ఫ్యాక్టరీలకు నష్టం జరుగుతోందని, దీనిని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని స్పష్టం చేశారు. -
ఆది నుంచీ వివాదమే.. బైలడిల్లా.. కుట్రల ఖిల్లా!
ఆదివాసీ జనాభా మెజార్టీ గా ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లాలోని గనులు ఆది నుంచీ వివాదాలకు కేంద్రంగానే నిలుస్తున్నాయి.పారిశ్రామికీకరణ మొదలయ్యాక బ్రిటిషర్ల హయాం నుంచి నేటి వరకు అక్కడి ఖనిజ సంపదపై పట్టు కోసం పట్టువిడవకుండా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి.ఈ క్రమంలోనే నిన్నమొన్నటి వరకు పచ్చని అడవిని తుపాకీ మోతలు ఎరుపెక్కించేవి. తాజాగా ఇక్కడ మైనింగ్ చేసుకునేఅవకాశాన్ని అదానీ కంపెనీకి కేంద్రం కట్టబెట్టడంతో బైలడిల్లా గనులు మరోసారి వార్తల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో బైలడిల్లా గనుల గత చరిత్రపై ప్రత్యేక కథనం.. సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం : ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాలో బైలడిల్లా ప్రాంతం ఉంది. దట్టమైన అడవిలో ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల మధ్య సుమారు 35 కిలోమీటర్ల పొడవు, 9 కిలోమీటర్ల వెడల్పుతో విస్తరించిన కొండల ప్రాంతాన్ని బైలడిల్లాగా పిలుస్తున్నారు. ఇక్కడున్న ధాతువులో అత్యధికంగా 60 నుంచి 68 శాతం వరకు ఇనుము లభిస్తోందని పరిశోధనల్లో తేలింది. ఈ గుట్టల్లోనే విలువైన టిన్, నియోలియం, టాంటాలమ్ వంటి ఖనిజాలూ ఉన్నాయి. దేశానికి స్వాతంత్రం వచ్చాక జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) ఆధ్వర్యంలో ఇక్కడ ఇనుప ఖనిజం వెలికి తీస్తున్నారు. బస్తర్ రాజ్యాన్ని కలుపుకోవాలనుకున్న బ్రిటిషర్లు వరంగల్ కేంద్రంగా మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన కాకతీయులు తర్వాత పరిస్థితులు అనుకూలించక బస్తర్ ప్రాంతానికి వెళ్లిపోయారు. అలా మొదటగా అన్నమదేవ్ బస్తర్లో సామ్రాజ్యాన్ని నిర్మించాడు. బ్రిటిషర్లు భారతదేశం మీద పట్టు సాధించే సమయానికి అన్నమదేవ్ వారసుల్లో 19వ రాజైన రుద్రప్రతాప్దేవ్ దాని పాలకుడిగా ఉన్నాడు. ఆయనకు మగ సంతానం కలగలేదు. 1921 నవంబర్లో రుద్రప్రతాప్ మరణించే సమయానికి ఆయన కుమార్తె ప్రపుల్లకుమారి దేవికి 11 ఏళ్లు. రాజ్య సంక్రమణ సిద్ధాంతం పేరుతో బ్రిటిషర్లు బస్తర్ రాజ్యాన్ని తమలో కలిపేసుకోవాలని చూసినా భౌగోళిక అననుకూలత కారణంగా వెనుకడుగు వేశారు. మరోవైపు ఒడిశా ప్రాంతానికి చెందిన భంజ్ రాజవంశానికి చెందిన ప్రపుల్ల చంద్ర భంజ్దేవ్తో ప్రపుల్లకుమారి వివాహం జరిగింది. ఇల్లరికం వచ్చిన ప్రపుల్ల చంద్ర రాజయ్యాడు. అనారోగ్య కారణాలతో రాజును తప్పించి.. వారసత్వ సంక్షోభ సమయంలో బస్తర్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన బ్రిటిషర్లకు ఇక్కడి బైలడిల్లా గనుల గురించి తెలిసింది. ప్రపంచ యుద్ధాల కారణంగా ఏర్పడిన నష్టాలను భర్తీ చేసుకునేందుకు బైలడిల్లా గనులపై బ్రిటిష్ ప్రభుత్వం కన్నేసింది. తమ చేతికి మట్టి అంటకుండా తక్కువ ఖర్చుతో పని సాధించేందుకు సైన్య సహకార పద్ధతిలో భాగంగా ఆరో నిజాం ద్వారా బస్తర్ రాజ్యంతో సంప్రదింపులు ప్రారంభించింది. బైలడిల్లా గనులు విషయంలో నిజాం రాజుతో ఒప్పందం చేసుకోవాలంటూ ప్రపుల్ల చంద్ర భంజ్దేవ్పై ఒత్తిడి తీసుకొచ్చినా ఆయన అంగీకరించలేదు. ఆ తర్వాత అనారోగ్య కారణాలు చూపుతూ ప్రపుల్ల చంద్రను బ్రిటిష్ ప్రభుత్వం కోల్కతాకు పంపించడంతో బస్తర్ పాలనా పగ్గాలు ప్రపుల్లకుమారి చేతిలోకి వచ్చాయి. తదనంతర కాలంలో ప్రఫుల్ చంద్ర కన్నుమూశారు. అంతు చిక్కని రాణి మరణం బైలడిల్లా గనుల విషయంలో బస్తర్ పాలకులను మచ్చిక చేసుకునేందుకు 1933లో ప్రపుల్లకుమారి దేవికి రాణి బిరుదును బ్రిటిష్ ప్రభుత్వం ప్రదానం చేసింది. అయినా బైలడిల్లా గనులను నిజాంకు ఇచ్చేందుకు ఆమె సుముఖత చూపలేదు. దీంతో రెండు రాజ్యాల మధ్య యుద్ధం జరిగే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే 1936లో ప్రపుల్లకుమారి అనారోగ్య కారణాలతో చికిత్స కోసం లండన్ వెళ్లారు. అక్కడ అపెండిసైటిస్ ఆపరేషన్ వికటించడంతో ఆమె మరణించారు. అయితే ఈమె మరణం వెనుక బ్రిటిషర్ల కుట్ర ఉందనేది బస్తర్ అంతఃపుర వాసుల నమ్మకం ప్రభుత్వ దళాల దాడిలో ప్రపుల్లకుమారి మరణానంతరం ఆమె కొడుకు ప్రవీర్చంద్ర భంజ్దేవ్ బస్తర్కు రాజయ్యాడు. తర్వాత కొద్ది కాలానికే బ్రిటిషర్లు దేశాన్ని విడిచి వెళ్లారు. ఆ సమయంలో దేశంలో 9వ అతిపెద్ద ప్రిన్సిలీ స్టేట్గా బస్తర్ ఉండేది. స్వాతం్రత్యానంతరం పారిశ్రామికీకరణలో వేగం పెంచేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకోగా.. బిలాస్పూర్, భిలాయ్ల్లో ఉక్కు కర్మాగారాలు ఏర్పాటయ్యాయి. వీటిలో కొన్నింటికి యూరప్ దేశాలతో పాటు జపాన్ సైతం ఆర్థిక సాయం అందించింది. ఆ నెపంతో బైలడిల్లా నుంచి ఇనుప ఖనిజాన్ని తరలించే వ్యూహాన్ని చాపకింద నీరులా పరాయి దేశాలు అమలు చేశాయి. ఈ క్రమంలోనే విశాఖపట్నం – కిరండోల్ రైలు మార్గానికి జపాన్ భారీగా నిధులు సమకూర్చింది. అయితే బైలడిల్లా గనుల నుంచి ఖనిజాన్ని వెలికితీసే ప్రయత్నంతో అప్పటి భారత ప్రభుత్వానికి బస్తర్ రాజు ప్రవీర్చంద్ర భంజ్దేవ్కి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆందోళనలు, నిరసనలు అక్కడ నిత్యకృత్యంగా మారాయి. చివరకు 1966లో జరిగిన ఓ ఘర్షణలో ప్యాలెస్లోకి భద్రతా దళాలు చొరబడ్డాయి. వారు జరిపిన కాల్పుల్లో ప్రవీర్భంజ్దేవ్, ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో మరణించారు. ఆ తర్వాత బస్తర్ ప్రధాన పట్టణమైన జగదల్పూర్లో ఎన్ఎండీసీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి బైలడిల్లాలోని ఖనిజాన్ని తవ్వి తీయాలని కేంద్రం నిర్ణయించుకుంది. ఇప్పటివరకు అదే కొనసాగుతూ వస్తోంది. గ్రీన్హంట్..సల్వా జుడుం 90వ దశకంలో సరళీకృత ఆర్థిక విధానాలు సత్ఫలితాలు ఇవ్వడం మొదలైన తర్వాత మరోసారి బైలడిల్లా గనులు తెరపైకి వచ్చాయి. అప్పటికి ఈ ప్రాంతం మావోయిస్టుల పట్టులోకి వెళ్లింది. దండకారణ్యం లేదా అబూజ్మడ్గా పిలిచే ఈ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత కోసం ఆపరేషన్ గ్రీన్హంట్ ఈ శతాబ్దం మొదట్లో ప్రారంభమైంది. అడవిని భద్రతా దళాలు జల్లెడ పడుతుండగానే మధ్యలో సల్వా జుడుం ప్రారంభమయ్యింది. మొత్తం మీద రెండు దశాబ్దాల పాటు దండకారణ్యంలో రక్తం ఏరులై ప్రారింది. ప్రజలు, భద్రతా దళాలు పిట్టల్లా రాలిపోయారు. ఇప్పుడు సగటున ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒకటి చొప్పున బస్తర్లో భద్రతా దళాల క్యాంపులు వెలిశాయి. తాజాగా ఇక్కడ అదానీ కంపెనీ మైనింగ్ చేపట్టేందుకు కేంద్రం అవకాశం ఇవ్వడంతో బైలడిల్లాకు సంబంధించి మరో అధ్యాయంమొదలవుతున్నట్టయ్యింది. -
బొగ్గు గనుల వేలంతో రాష్ట్రానికే ఆదాయం
సాక్షి, హైదరాబాద్: వేలం ద్వారా గనుల కేటాయింపులు జరిపితే తెలంగాణ రాష్ట్రానికే తగిన ఆదాయం దక్కుతుందని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ట్వీట్ చేశారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం వేలానికి విముఖత చూపి, ఒక్క బ్లాక్ కూడా కేటాయించకుండా ఉండటం వల్ల రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలుగుతోందని తెలిపారు. సింగరేణిలో 51% వాటా తెలంగాణ ప్రభుత్వం వద్ద ఉందని స్పష్టంచేశారు. సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని, అది రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చేయగలదని చెప్పారు. అలాగే సింగరేణికి నైని, పెనగడ్డప్ప, న్యూ పాత్రపర అనే 3 బొగ్గు గనులు కేటాయించినట్లు గమనించాలని సూచించారు. అయితే అవినీతిలో కూరుకుపోయిన తెలంగాణ ప్రభుత్వం 7 ఏళ్ల నుంచి ఈ బ్లాకులను వినియోగించలేకపోయిందని, వేలం మార్గాన్ని నిరాకరించడం వల్ల రాష్ట్రానికి రాయల్టీ, ఆదాయం విషయంలో గండి పడుతోందని జోషి వెల్లడించారు. -
తాడిచర్ల గనికి ‘భద్రత’ పురస్కారం
సాక్షి, హైదరాబాద్: గనుల భద్రత విషయంలో ఉత్తమ విధానాలను అవలంభిస్తున్నందుకు తెలంగాణ జెన్కోకు చెందిన తాడిచర్ల–1 బొగ్గు గనికి డైరెక్టరేట్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ విభాగం పురస్కారాన్ని అందజేసింది. వార్షిక భద్రత వారోత్సవాల సందర్భంగా ఈ పురస్కారాన్ని తాడిచర్లలో అందుకున్నట్లు జెన్కో బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. -
జీడీపీలో ఖ‘నిజ’ లక్ష్యం 2.5 శాతం
సాక్షి, హైదరాబాద్: దేశ జీడీపీలో బొగ్గు, పెట్రోలియం మినహా ఇతర ఖనిజాల వాటాను 2030 నాటికి 2.5 శాతానికి చేర్చడమే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. హైదరాబాద్లో 9, 10 తేదీల్లో రెండు రోజులపాటు జరిగే రాష్ట్రాల గనుల శాఖ మంత్రుల జాతీయ సదస్సును శుక్రవారం ప్రహ్లాద్జోషి ప్రారంభించారు. ఖనిజ రంగాన్ని ఆత్మనిర్భర్గా మార్చేందుకు ఈ సదస్సు దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ‘ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారత ఆర్థికరంగంలో భూగర్భ వనరుల రంగం పాత్ర చాలా తక్కువ. పెట్రోలియం, బొగ్గును కూడా కలుపుకుంటే దేశ జీడీపీలో మైనింగ్ రంగం వాటా సుమారు రెండు శాతంగా ఉంది. పెట్రోలియం, బొగ్గును మినహాయిస్తే ఒక శాతానికి అటూ ఇటూగా ఉంది’అని జోషి వెల్లడించారు. వేలం ఆదాయం రాష్ట్రాలకే ఇస్తున్నాం ‘బొగ్గు గనుల వేలం కోసం కేంద్రం ఎన్నో ప్రయాసలకోర్చినా, వచ్చిన ఆదాయం మాత్రం రాష్ట్రాలకే ఇస్తున్నాం. ఈ విధానం ద్వారా రాష్ట్రాల్లో ఉద్యోగాల కల్పనతోపాటు ఆర్థిక రంగానికి ఊతం లభిస్తోంది. నామినేషన్ పద్ధతికి స్వస్తి పలుకుతూ 2015లో తెచ్చిన సంస్కరణల ద్వారా పారదర్శకతకు పెద్దపీట వేశాం. ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఇప్పటికే వంద శాతం ఖనిజాన్వేషణ పూర్తయినా భారత్లో మాత్రం పది శాతంగానే ఉంది. ఖనిజాన్వేషనలో నిబంధనలు సరళీకృతం చేసి, అనుమతుల జారీలో లంచగొండితనాన్ని రూపుమాపాం’అని జోషి ప్రకటించారు. ‘లీజు పునరుద్ధరణ, బిడ్డింగ్ నిబంధనల సడలింపుతోపాటు సకాలంలో మైనింగ్ ప్రారంభించే సంస్థలకు ప్రోత్సాహకాలు ఇస్తుండటంతో ఒడిషాసహా పలు రాష్ట్రాలు మైనింగ్ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకున్నాయి. నేషనల్ మినరల్ ఎక్స్ప్లొరేషన్ ట్రస్టు (ఎన్మెట్)కు రూ.4,050 కోట్లు సమకూరగా, ఖనిజాన్వేషణ కోసం రాష్ట్రాలకు ఇందులో నుంచి నిధులు ఇస్తున్నాం’అని కేంద్రమంత్రి ప్రకటించారు. 2047 నాటికి మైనింగ్ రంగానికి సంబంధించి అమృత్ కాల్ లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు. గనుల మంత్రిత్వ శాఖ పథకాలు, కార్యక్రమాలను వివరించే ‘ది మైనింగ్ ఎరీనా’డిజిటల్ వేదికను మంత్రి ప్రారంభించారు. ఏపీ సహా 11 రాష్ట్రాల మంత్రులు హాజరు గనులశాఖ మంత్రుల సదస్సుకు ఏపీ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా 11 రాష్ట్రాల మంత్రులు హాజరయ్యారు. 19 రాష్ట్రాల అధికారులు, కేంద్రం బొగ్గు, గనులు, స్టీల్ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కర్ణాటక, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ వంటి ఏడు రాష్ట్రాలు తమ రాష్ట్రాలలో ఖనిజ లభ్యత సంభావ్యత, మైనింగ్ రంగంలోని సవాళ్లను వివరించారు. -
గనులు, అటవీశాఖ మంత్రిగా పెద్దిరెడ్డి బాధ్యతలు స్వీకరణ
-
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
సాక్షి, అమరావతి: గనులు, విద్యుత్, అటవీశాఖ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం బాధ్యతలు చేపట్టారు. అంతకమందు సచివాలయంలోని తన ఛాంబర్లో మంత్రి పెద్దిరెడ్డి దంపతులు, ఎంపీ మిథున్రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అటవీ, గనులు, విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. ఆదాయం మరింత పెంచేందుకు కృషి చేస్తా బాధ్యతల స్వీకరణ అనంతరం మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 'పార్టీలో ఎలాంటి అసంతృప్తి లేదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మాట్లాడాను. సీఎం జగన్ని పిన్నెల్లి కలుస్తారు. అన్నా రాంబాబు, సామినేని ఉదయభానులకు కూడా సర్ది చెప్పాను. సీఎం జగన్ అందరికీ గుర్తింపు, గౌరవం ఇస్తారు. నాకు ఇచ్చిన మూడు శాఖల్లో మంచి పేరు తెచ్చేందుకు కృషి చేస్తా. రైతులకు ఉచిత విద్యుత్ని సమర్థవంతంగా అమలు చేస్తాము. పరిశ్రమలకు పవర్ హాలిడే లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటాం. గనుల శాఖలో చేపట్టిన సంస్కరణల వలన ఆదాయం పెరిగింది. ఆ ఆదాయం మరింత పెంచేందుకు కృషి చేస్తాను' అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చదవండి: (మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చెల్లుబోయిన వేణు) రాజకీయ నేపథ్యం: 1974 ఎస్వీయూ విద్యార్థి సంఘం అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1985లో కాంగ్రెస్ పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 1989లో పీలేరు నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994లో ఓటమిపాలైన ఆయన పీలేరు నుంచి 1999, 2004 సంవత్సరాల్లో, పుంగనూరు నుంచి 2009లో విజయం సాధించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా 2014, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1995-2004 మధ్య తొమ్మిదేళ్లు చిత్తూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. 2009 నుంచి 2010 వరకు వైఎస్సార్, రోశయ్య మంత్రివర్గాల్లో అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. 2012 నవంబర్లో రాజీనామా చేశారు. ఆ తర్వాతి ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పుంగనూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రివర్గంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. తిరిగి రెండోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. -
Anantapur: అనంత గర్భం.. అరుదైన ఖనిజం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అరుదైన ఖనిజాలకు నిలయమైన ‘అనంత’లో మరో విలువైన ఖనిజం ఉనికి లభింంది. ప్రపంచంలోనే అత్యంత అరుదుగా లభించే లిథియం ఖనిజ నిక్షేపాలు జిల్లాలో భారీగా ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) సర్వేలో గుర్తించారు. ఇదే విషయాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ధ్రువీకరించారు. లిథియం ప్రాజెక్టుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కోటగిరి శ్రీధర్, చింతా అనురాధ, డాక్టర్ ఎస్.సంజీవ్ కుమార్ ఈ నెల రెండో తేదీన పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇందుకు మంత్రి ప్రహ్లాద్ జోషి రాతపూర్వక సమాధానమిస్తూ అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో ఈ నిక్షేపాలున్నట్లు గుర్తించామని వెల్లడించారు. తాడిమర్రి మండల పరిధిలో.. జీఎస్ఐ శాస్త్రవేత్తలు కొన్ని నెలల క్రితం జిల్లాలోని తాడిమర్రి మండలం తురకవారిపల్లె, దాడితోట ప్రాంతాలతో పాటు సమీపంలోని వైఎస్సార్ జిల్లా పార్నపల్లె, లోపటనూతల ప్రాంతాల్లో ఫీల్డ్ సర్వే చేశారు. ఈ ప్రాంతాల్లోని మట్టి, శిలలు, ప్రవాహ అవక్షేపాలను సేకరించి పరీక్షించారు. 18 పీపీఎం నుంచి 322 పీపీఎం (పార్ట్ పర్ మిలియన్) మోతాదులో లిథియం నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించారు. అరుదైన ఖనిజం.. ఫుల్ డిమాండ్ లిథియం ఖనిజం చాలా అరుదుగా లభిస్తుంది. ఇప్పటివరకూ చిలీ, ఆస్ట్రేలియా, పోర్చుగల్ వంటి దేశాల్లో మాత్రమే ఎక్కువగా లభిస్తోంది. ఈ ఖనిజాన్ని రీచార్జ్బుల్ బ్యాటరీలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, డిజిటల్ కెమెరాలు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఎక్కువగా వాడుతున్నారు. అంతేకాకుండా గుండెకు అమర్చే పేస్మేకర్ల తయారీలోనూ వినియోగిస్తున్నారు. ఈ ఖనిజాన్ని 1817లో స్వీడన్కు చెందిన రసాయన శాస్త్రవేత్త జాన్ అగస్ట్ ఆర్ఫ్వెడ్సన్ కనుగొన్నారు. ఇది మార్కెట్ను శాసించింది మాత్రం 1990 తర్వాతనే. దీన్ని ప్రపంచ దేశాలన్నిటికీ పై కొన్ని దేశాలు మాత్రమే సరఫరా చేస్తున్నాయి. ఇలాంటి అరుదైన ఖనిజం ఉనికి అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో లభించడం గొప్ప విషయమని నిపుణులు అంటున్నారు. విలువైన ఖనిజాలకు కేరాఫ్ అనంతపురం జిల్లా విలువైన ఖనిజాలకు కేరాఫ్గా ఉంది. బంగారు, వజ్రాలు, బైరటీస్, ఇనుము తదితర ఖనిజ నిక్షేపాలు జిల్లాలో ఉన్నాయి. ఇప్పుడు లిథియం నిక్షేపాలు కూడా వెలుగు చూడడం విశేషం. అంతర్జాతీయంగా డిమాండ్ లిథియం ఖనిజానికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీన్ని బ్యాటరీల తయారీలో, కెమికల్స్లో ఎక్కువగా వినియోగిస్తారు. సముద్రగర్భాల్లో ఎక్కువగా దొరికే అవకాశముంది. అలాంటిది మన దగ్గర ఉండడం గొప్ప విషయమే. దీన్ని అవసరానికి తగ్గట్టుగానే వినియోగించుకోవాల్సి ఉంటుంది. –సుబ్రహ్మణ్యేశ్వరరావు, గనుల శాఖడిప్యూటీ డైరెక్టర్, అనంతపురం -
ఆరు నెలల కష్టాన్ని మరిపించిన ‘వజ్రం’
భోపాల్ : మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాలో ఓ గనిలో 50 లక్షల రూపాయల విలువైన 10.69 క్యారెట్ వజ్రం లభ్యమైంది. రాణీపూర్ ప్రాంతంలోని మైన్ను లీజ్కు తీసుకుని నడిపిస్తున్న ఆనందిలాల్ కుష్వాహ (35) ఈ డైమండ్ను గుర్తించారు. అత్యంత విలువైన ఈ వజ్రాన్ని స్ధానిక డైమండ్ కార్యాలయంలో సమర్పించారని పన్నా డైమండ్ అధికారి ఆర్కే పాండే వెల్లడించారు. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ సడలింపుల తర్వాత ఇంతటి భారీ వజ్రం గుర్తించడం ఇదే తొలిసారని మైన్ నిర్వాహకుడు కుష్వాహ పేర్కొన్నారు. ఈ వజ్రాన్ని వేలం వేసి ప్రభుత్వ రాయల్టీ, పన్నులు మినహాయించిన అనంతరం డిపాజిటర్కు అందచేస్తామని అధికారులు తెలిపారు. వజ్రం విలువను ఇంకా లెక్కకట్టనప్పటికీ దాని నాణ్యతను బట్టి 50 లక్షల రూపాయల వరకూ పలుకుతుందని స్ధానిక నిపుణులు తెలిపారు. కుష్వాహ ఇటీవల 70 సెంట్ డైమండ్ను కూడా ఈ కార్యాలయంలో డిపాజిట్ చేశారు. తాను, తన తల్లితండ్రులు గత ఆరు నెలల నుంచి గనుల్లో కష్టించి పనిచేస్తున్నామని, ఈ వజ్రం దొరకడం పట్ల ఆనందంగా ఉందని కుష్వాహ చెప్పుకొచ్చారు. బుందేల్ఖండ్ ప్రాంతంలోని పన్నా జిల్లా వజ్రాల నిక్షేపాలకు పేరొందింది. చదవండి : మహిళా కూలీకి వజ్రం లభ్యం -
సత్వరమే కొత్త గనులు ప్రారంభించాలి
సాక్షి, హైదరాబాద్: బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యాలను సాధించాలంటే ఈ ఏడాదికి ప్రతిపాదించిన కొత్త ఓసీ గనులను సత్వరమే ప్రారంభించాలని సింగరేణి బొగ్గు గనుల సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశించారు. సింగరేణి భవన్లో మంగళవారం డెరైక్టర్లు, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలతో వెనకబడిన బొగ్గు ఉత్పత్తి, రవాణాలను సెప్టెంబర్ నెల లక్ష్యాలతోపాటు సాధించాలన్నారు. ఓబీ తొలగింపుపై మరింత శ్రద్ధ చూపాలని, లక్ష్యాల మేర ఓబీ తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సింగరేణి సంస్థ ఆగస్ట్ నెల వరకూ గడచిన 5 నెలల్లో నిర్దేశించుకున్న లక్ష్యాలను దాటి బొగ్గు ఉత్పత్తి, రవాణా సాధించింది. ఆగస్టు ముగిసేనాటికి బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 254లక్షల టన్నులు కాగా, 262 లక్షల టన్నుల బొగ్గును (103 శాతం) ఉత్పత్తి చేసింది. 262 లక్షల టన్నుల బొగ్గు రవాణా లక్ష్యాన్ని 261.5 లక్షల టన్నుల రవాణా చేయడం ద్వారా నూరు శాతం ఫలితాన్ని సాధించింది. 2018–19తో పోలిస్తే బొగ్గు ఉత్పత్తిలో 12.4 శాతం వృద్ధిని సాధించింది. 2018 ఆగస్టు చివరికి 233లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగా, ఈ ఏడాది ఆగస్టు చివరికి 262లక్షల టన్నులు ఉత్పత్తి చేసింది. -
తవ్వుకున్నోడికి తవ్వుకున్నంతా..
సాక్షి, ప్రకాశం : మైన్స్ అధికారులు కళ్లు మూసుకున్నారు. ఏపీఎండీసీ అధికారులు అక్రమార్కులకు సహకారం అందిస్తున్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లపాటు చేయూతనిచ్చింది. పరిస్థితులు ఇంత చక్కగా కలిసి వస్తే గ్రానైట్ యజమానులు ఊరుకుంటారా..? అందుకే తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత. కలిసొచ్చిన కాలాన్ని ఒక్క రోజు కూడా వృథా చేయకుండా అడ్డగోలుగా తవ్వుకున్నారు. హద్దులు దాటిన అక్రమ తవ్వకాలు ఇప్పుడు విజిలెన్స్ అధికారుల దాడులలో బహిర్గతమవుతున్నాయి. గడచిన నెల రోజులుగా రామతీర్థం, చీమకుర్తి పరిధిలో ఉన్న గ్రానైట్ క్వారీలలో తనిఖీలు చేస్తున విజిలెన్స్ అధికారులకు కళ్లు బైర్లు కమ్మే నిజాలు బయట పడుతున్నాయి. క్వారీ యజమానుల నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఎక్కడా రాజీ పడకుండా పార్టీలకతీతంగా గత నెల 16వ తేదీ నుంచి విజిలెన్స్ ఏఎస్పీ ఆధ్వర్యంలో ఇతర జిల్లాల నుంచి వచ్చిన అధికారులతో సమన్వయం చేసుకుంటూ దాడులు నిర్వహిస్తున్నారు. మైన్స్ అధికారులు క్వారీల యజమానులకు ఇచ్చిన అనుమతులకు మించి తవ్వుకోవడం వలన రాళ్ల నిల్వల్లో భారీ తేడాలు బయట పడుతున్నాయి. తవ్వి తీసిన రాళ్లకు, ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించిన రాళ్లకు మధ్య భారీగా వ్యత్యాసం ఉన్నట్టు తెలుస్తోంది. ఉదాహరణకు ఒక క్వారీ యజమాని నెలకు 3 వేల క్యూబిక్ మీటర్లు రాయిని తీశారు. దానిలో ప్రభుత్వానికి కేవలం వెయ్యి క్యూబిక్ మీటర్లుకు మాత్రమే రాయల్టీ చెల్లించారు. మిగిలిన 2 వేల క్యూబిక్ మీటర్లు రాయిని అడ్డదారిలో రాయల్టీ లేకుండా చెలామణి చేసుకున్నారు. కానీ, విజిలెన్స్ అధికారుల దాడులలో అలా రాయల్టీ చెల్లించని ఆ రెండు వేల క్యూబిక్ మీటర్లు రాయికి ప్రభుత్వం నిర్ణయించిన రాయల్టీ ధరతో పాటు ఆ రాయికి మార్కెట్ విలువ ఎంతయితే ఉందో ఆ మొత్తాన్ని కూడా ఫైన్గా వేసే పరిస్థితి ఉంది. అలా అడ్డదారిలో మొత్తం క్వారీలలో తవ్వి తీసుకున్న రాయి మొత్తాన్ని లెక్కలు కడితే దాదాపు రూ.2 వేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. పొంతన లేని గణాంకాలు.. రామతీర్థం క్వారీలలో జరుగుతున్న విజిలెన్స్ అధికారుల తనిఖీలలో పొంతనలేని గణాంకాలు బయటపడుతున్నాయి. క్వారీలో తవ్వి తీసిన రాళ్ల పరిమాణానికి, రికార్డులలో నమోదు చేసి ఉన్న రాళ్లకు పొంతన కుదరటం లేదనే వాస్తవాలు బయటపడుతున్నాయి. క్వారీలో రాయిని తీసిన గుంతలో 10–15 శాతం మాత్రమే రికవరీ వస్తుందని, మిగిలిందంతా వేస్ట్, డస్ట్గాను డంపింగ్లలో పోస్తామని యజమానులు చెబుతున్నారు. కానీ వేస్ట్, డస్ట్ రూపంలో పోగా రికవరీ వచ్చేటువంటి 15 శాతం రాళ్ల లెక్కలు కూడా సక్రమంగా లేవనేది తనిఖీ చేసే అధికారుల వాదన. రికవరీ వచ్చేటువంటి రాళ్లలో దాదాపు సగానికి పైగా రాళ్లకు ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండా అడ్డదారులలో స్థానిక ఫ్యాక్టరీలకు, అలవెన్స్ల పేరుతో రాయల్టీకి పంగనామాలు పెడుతున్నట్లు అధికారుల తనిఖీలలో బట్టబయలైంది. స్టాకులో తేడాలు ఎక్కువుగా ఉండటంతో ఇటీవల రెండు మూడు క్వారీలలో పెద్ద పెద్ద గ్రానైట్ బ్లాకులను డంపింగ్లలో పెట్టి పైన మట్టిపోసి కప్పెట్టినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే కొన్ని క్వారీలలో మైనింగ్ ప్లాన్ ప్రకారం తవ్వకుండా ఎక్కడ రాయి వస్తే అక్కడ తవ్వుకున్నట్లు, కొన్ని చోట్ల సరిహద్దులను కూడా దాటి ఇతర క్వారీలు లేనిచోట వారికి నచ్చినట్లు తవ్వుకున్నట్లు తనిఖీలలో బయటకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉంటే క్వారీలలో పనిచేసే సిబ్బందికి భద్రత, వైద్యం, సంక్షేమ వంటి అంశాలను పూర్తిగా గాలికొదిలేసినట్లు దాడులలో తేటతెల్లమైంది. కార్మికుల సంక్షేమానికి సంబంధించిన వివరాలను లేబర్ డిపార్టుమెంట్ అధికారులు సేకరించాల్సి ఉంటుంది. దాదాపు నెల రోజులుగా జరుగుతున్న విజిలెన్స్ అధికారుల దాడులు ఈనెలాఖరకు పూర్తయ్యే అవకాశం ఉంది. తనిఖీలన్నీ పూర్తయ్యాక నివేదకను ప్రభుత్వానికి అందజేస్తామని అధికారులు తెలిపారు. -
కమీషన్ల కోసమే!
-
డ్రోన్ సర్వే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : మైనింగ్ శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోనుంది. ఖనిజ వనరుల సర్వేకు డ్రోన్ కెమెరాలను వినియోగించనుంది. ఇప్పటికే కేటాయించిన మైనింగ్ ప్రాంతాలను ఈ డ్రోన్ సర్వేలో బంధించాలని భావిస్తోంది. ఖనిజ నిక్షేపాలు, నిల్వల సమగ్ర వివరాలను రాబట్టేందుకు ఇది ఉపయోగపడుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. మట్టి, కంకర, ఇతరత్రా మినరల్స్ తవ్వకాలకు సంబంధించి వివిధ సంస్థలు, వ్యక్తులకు లీజు ప్రాతిపదికన మైనింగ్ శాఖ కట్టబెడుతోంది. అయితే, ఈ లీజుల వ్యవహారంలో అవకతవకలు జరుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. కేవలం లీజుల కేటాయింపేగాకుండా మైనింగ్ విషయంలోనూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు తేలింది. ముఖ్యంగా లీజుకు కేటాయించిన విస్తీర్ణమేగాకుండా పక్కన ఉన్న భూములను కూడా తవ్వకాలకు వినియోగిస్తున్నట్లు విచారణలో స్పష్టమైంది. దీంతో ప్రభుత్వ రాయల్టీకి గండిపడడమేగాకుండా దొడ్డిదారిన సహజవనరులు తరలిపోతున్నట్లు బహిర్గతమైంది. 146 చోట్ల సర్వే.. జిల్లాలో ఖనిజాల తవ్వకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. 24 మండలాల్లో ఈ నిషేధం వర్తిస్తుండగా 146 చోట్ల మాత్రం క్వారీలకు అనుమతులు మంజూరు చేసింది. లీజు ప్రాతిపదికన కంకర, మట్టి, పలుగురాళ్ల, క్వార్ట్జ్, కలర్ గ్రానైట్ సంబంధించి క్వారీలను కేటాయించింది. వీటి కేటాయింపు ద్వారా గతేడాది రూ.61.04 కోట్ల ఆదాయం రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకోగా.. రూ.90.65(148%)వసూలు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం రూ.91 కోట్లను లక్ష్యంగా నిర్దేశించగా ఇందులో ఏప్రిల్లో రూ.4.58 కోట్లు, మేలో రూ.2.73 కోట్లను సమకూర్చుకుంది. ఖజానాకు ప్రధాన ఆదాయార్జన శాఖల్లో ఒక్కటైన మైనింగ్లో జరుగుతున్న అక్రమాలకు ముకుతాడు వేయడం వల్ల మరింత రాబడి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో మైనింగ్ లీజులపై కన్నేసింది. ఈ క్వారీల్లో ఏ రకమైన ఖనిజాలున్నాయి? నిల్వల సామర్థ్యమెంత? ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి? తదితర వివరాలను డ్రోన్ సర్వేతో తేల్చాలని సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే డీజీపీఎస్ సర్వే పూర్తిచేసినందున డ్రోన్ కెమెరాలతో చిత్రీకరణ పూర్తిచేసి సమగ్ర సమాచారాన్ని అందుబాటులో ఉంచుకోవాలని, తద్వారా అవకతవకలకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తోంది. ఇదిలావుండగా, జిల్లాలోని 24 మండలాల్లో ఖనిజాల తవ్వకాలపై ఆంక్షలు ఉండడంతో మట్టి, కంకర ధరలు నింగినంటాయి. కేవలం బండరావిరాలలో మాత్రమే మైనింగ్కు అనుమతులు ఇవ్వడంతో సుదూర మండలాల నుంచి వీటిని రవాణా చేస్తున్నారు. దీంతో ఖర్చు తడిసిమోపడువుతుందని ఇళ్ల నిర్మాణదారులు లబోదిబోమంటున్నారు. -
‘మైనింగ్’ నిధులకు కొత్త నిబంధనలు!
సాక్షి, హైదరాబాద్: గనులు, గనుల కార్యకలాపాలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితమవుతున్న ప్రాంతాల్లో 30:70 నిష్పత్తిలో డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ నిధులను ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఫౌండేషన్ ట్రస్ట్ రూల్స్–2015ను సవరిస్తూ తెలంగాణ స్టేట్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ రూల్స్–2018ను ప్రకటించింది. గనులు, ఖనిజ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మైనింగ్ ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ప్రక్రియను సరళీకరించడం, ప్రధాని ఖనిజ్ క్షేత్ర కళ్యాణ్ యోజన కింద నిర్దేశించిన సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేసేందుకు సవరణలు జరిపినట్లు తెలిపారు. కలెక్టర్ నేతృత్వంలో కమిటీ ప్రతి జిల్లాలో కలెక్టర్ చైర్మన్గా డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ కమిటీ వేయాలి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలు శాఖల జిల్లాధికారులను సభ్యులుగా నియమించాలి. రాష్ట్రంలోని గనుల ప్రభావిత ప్రాంతాల్లో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కోసం డీఎంఎఫ్ కింద రూ.1,537 కోట్లు ప్రభుత్వం వద్ద మురుగుతున్నాయి. గనులకు 10 కి.మీ. పరిధిలో ఉంటే ప్రభావిత ప్రాంతమే గనులు, వాటి కార్యకలాపాలున్న గ్రామాలు, పట్టణాలతోపాటు గనులు, గనుల క్లస్టర్కు 10 కి.మీ. పరిధిలో ఉంటే మైనింగ్ ప్రభావిత ప్రాం తాలుగా పరిగణిస్తారు. పొరుగు జిల్లాల్లోని ప్రాంతాలున్నా వాటినీ మైనింగ్ ప్రభావిత ప్రాంతాలుగానే గుర్తిస్తారు. మైనింగ్ ప్రభావిత కుటుంబాలను స్థానిక ప్రజాప్రతినిధులతో సంప్రదింపుల ద్వారా గుర్తించాలి. నిధులను సమంగా పంచాలి: బొగ్గు గనులున్న 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటికే వసూలైన డీఎంఎఫ్ నిధులను ఆ నియోజకవర్గాల మధ్య సమంగా పంచాలి. వాటి పరిధిలోని ప్రభావిత, పరోక్ష ప్రభావిత ప్రాంతాల్లో 30:70 నిష్పత్తిలో ఖర్చు చేయాలి. ఇకపై ఈ 13 నియోజకవర్గాల్లోని గనుల నుంచి వసూలు చేసే నిధులను అవి ఉన్న ఆరు జిల్లాల డీఎంఎఫ్ కమిటీల ఖాతాల్లో జమా చేయాలి. బొగ్గేతర మైనింగ్ కార్యకలాపాలున్న జిల్లాల్లో వసూలు చేసే నిధులను 30:70 శాతం నిష్పత్తిలో ఆయా జిల్లాలోని ప్రభావిత, పరోక్ష ప్రభావిత ప్రాంతాల్లో ఖర్చు చేయాలి. ట్రస్ట్ ఫండ్ నుంచి పరిపాలన ఖర్చులు 4 శాతానికి మించొద్దు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు ట్రస్ట్ ఫండ్ను వినియోగించరాదు. ఇప్పటికే చేపట్టిన పనులు, పథకాలకు నిధుల కొరత ఉంటే వీటిని వినియోగించవచ్చు. -
‘హెచ్చుమీరుతున్న కోడెల కుటుంబ అవినీతి’
సాక్షి, విజయవాడ: స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు కుటుంబ అవినీతిపై విచారణ జరపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ఎన్ఎస్పీ గనులు, పశుగ్రాసం కొనుగోళ్లలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, దానిపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. కోడెల శివప్రసాద్ ట్యాగ్( కేఎస్టీ) పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 72 ప్యాకేజీల కింద పనులను విభజించి టెండర్లు నిర్వహించారని, తమకు అనుకూలమైన వారికే టెండర్ ఫారంలు ఇచ్చారని మండిపడ్డారు. కోడెల కుమారుడి నేతృత్వంలో అందరూ కలిసి రింగ్గా మారారని, 25 నుంచి 30 శాతం అధికంగా కోట్ చేశారన్నారు. 5 శాతం అధికం వేస్తే రివ్యూ కమిటీకి పంపుతారు.. కానీ అంతకన్నా అధికంగా వేసినా రివ్యూ కమిటీకి పంపలేదని తెలిపారు. టెండర్లు ఓపెన్ చేయకుండానే పనులు ఎలా ప్రారంభిస్తారని ఆయన ప్రశ్నించారు. నీటి పారుదల శాఖలో ఇది నిదర్శనమని, కాంట్రాక్టర్లు, అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. వంద కోట్ల పనుల్లో భారీగా అవినీతి జరుగుతోందన్నారు. మరో వైపు పశుగ్రాసం కొనుగోళ్లలోనూ అక్రమాలు జరిగాయన్నారు. 3500 ఎకరాల్లో గడ్డిని పెంచాలని, వాటిని కొనుగోలు చేయాలని నిర్ఱయించారన్నారు. పుశుసంవర్థక శాఖ ద్వారా టీడీపీ అనుయాయులు పేర్లతో గడ్డి కొనుగోళ్లు జరుపుతున్నారన్నారు. ఒక్కో ఎకరానికి ఇరవై వేల చొప్పున ఏడు కోట్ల రూపాయలు స్వాహా చేశారని తెలిపారు. అసలు ఏ రైతు తన పొలంలో గడ్డి పెంచారో చెప్పాలన్నారు. మొక్కజొన్న గడ్డలు, గడ్డి కలిపి సైలేజ్ను తయారు చేస్తున్నారని, కేంద్రం దీనికి 50 శాతం సబ్సిడీ ఇస్తోందని తెలిపారు. కోడెల కుమార్తె విజయలక్ష్మి సైలేజ్ యంత్రాలను పెట్టి ఈ సబ్సిడీని కాజేస్తున్నారని వెల్లడించారు. పశువులు తినలేని సైలేజ్ను వీరు తయారు చేసి, బలవంతంగా రైతులకు అంటగడుతున్నారని మండిపడ్డారు. కోడెల కుటుంబం చేస్తున్న అవినీతి హెచ్చుమీరిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడుకు ఓ శాఖను, కుమార్తె ఓ శాఖను పంచుకుని అవినీతి పాల్పడుతున్నారని తెలిపారు. స్పీకర్గా ఉన్న కోడెల పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారన్నారు. తన కుమార్తె, కుమారుడి అవినీతికి కోడెల బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. -
బయటపడ్డ సొరంగ మార్గం
వైఎస్సార్ జిల్లా,మంగంపేట(ఓబులవారిపల్లె): వైఎస్సార్ జిల్లా మంగంపేట బెరైటీస్ గనుల్లో గురువారం తెల్లవారుజామున సొరంగమార్గం బయటపడింది. గనుల్లో సుమారు 26 బెంచ్లు ఉన్నాయి. 19వ బెంచ్లో తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో కార్మికులు ఖనిజాన్ని వెలికితీసే పనులు చేస్తున్నారు. ఈ సమయంలో రెండున్నర అంగుళాల వెడల్పు పదిమీటర్లమేర గొయ్యి ఏర్పడింది. వీరంతా గొయ్యివద్దకు చేరుకుని లైట్లువేసి పరిశీలించగా మనిషి వెళ్లడానికి అనువుగా లోపల సుమారు పదిమీటర్ల దూరం రహస్యమార్గం కనిపించింది. ఇంకా లోనికి వెళ్లడానికి ఊపిరి ఆడకపోవడంతో కార్మికులు బయటకు వచ్చేశారు. విషయం తెలుసుకున్న మీడియా అక్కడికి చేరుకోగా ఏమీలేదని, సొరంగమార్గాన్ని మూసివేయడం జరిగిందని జనరల్మేనేజర్ కేథార్నా«థ్రెడ్డి ఎవరినీ అనుమతించలేదు. ఏ ప్రమాదం జరుగకుండా ఉండేందుకు సొరంగాన్ని మూసివేసినట్లు జీఎం తెలిపారు. మండలంలోని వైకోట ప్రాంతాన్ని మట్లిరాజులు పాలించారు. యుద్ధ సమయాల్లో శత్రువులనుంచి తమ సంపదను, కుటుంబాన్ని రక్షించుకోవడానికి అనేక సొరంగమార్గాలు ఏర్పాటు చేసుకున్నట్లు ఇక్కడి చరిత్ర చెబుతోంది. ఇందుకు నిదర్శనంగా మండలకేంద్రం సమీపంలోని నళ్లరాళ్లగుట్ట వద్ద రహస్య మార్గం ఉంది. బండరాళ్లను వేయడంతో ఇది పూడిపోయింది. ఈ మార్గం చిత్తూరుజిల్లా చంద్రగిరి కోట వరకు ఉందని, అప్పట్లో రాజులు ఈ రహస్యమార్గం గుండా ప్రయాణించేవారని ఇప్పటికీ ప్రచారంలో ఉంది. విషయం బయటపెట్టకుండా పురావస్తుశాఖకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఏపీఎండీసీ అధికారులు రహస్యమార్గాన్ని మూసివేయడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
గనులేమీ అక్షయ పాత్రలు కావు!
సాక్షి, హైదరాబాద్: గనులేమీ అక్షయ పాత్రలు కావని.. దుర్వినియోగం చేస్తే వైపరీత్యాలు, ఆపదలు తప్పవని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. గనుల తవ్వకాల కోసం ధ్వంసం చేసిన అడవులను తప్పనిసరిగా పునరుద్ధరించాలని, లేదంటే కఠినంగా శిక్షించే చట్టాలు తీసుకురావాలన్నారు. మైనింగ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఫిక్కీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్లో ప్రారంభమైన 4 రోజుల అంతర్జాతీయ మైనింగ్ సదస్సు, ప్రదర్శన ప్రారంభోత్సవ కార్యక్రమంలో నరసింహన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గనులు, ఖనిజాలు సంపద సృష్టించి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని.. ఎంత సంపద ఉన్నా ఆరోగ్యాన్ని కొనలేమన్న విష యం గుర్తెరగాలని మైనింగ్ వ్యాపారస్తులకు సూచించారు. గని కార్మికులు యంత్రాలు కాదని.. వారి రక్షణ, ఆరోగ్యం ప్రధాన అంశంగా ఉండాలన్నారు. గనుల ప్రభావిత ప్రాంత ప్రజల సంక్షేమం కోసం కేంద్రం తీసుకొచ్చిన డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్(డీఎంఎఫ్) ప్రాజెక్టు ను పారదర్శకంగా అమలు చేస్తే లక్ష్యాలు నెరవేరుతాయని చెప్పారు. గనుల కారణంగా నిర్వాసితులైన ప్రజలకు తప్పనిసరిగా పునరావాసం కల్పించాలని చెప్పారు. కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 3 సున్నపు రాయి బ్లాక్లు వేలానికి రానున్నాయని, వేలంలో సమస్యలొస్తే అర్ధరాత్రి ఒంటి కాలిమీద నిలబడి సహాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. డీఎంఎఫ్ కింద ఇప్పటికే మైనింగ్ జరిగే జిల్లాలకు రూ.1,300 కోట్లు విడుదలయ్యాయని, తెలంగాణకూ రూ.1,300 కోట్లు వచ్చాయని తెలిపారు. ఖమ్మంలో స్టీల్ ప్లాంట్ ఖాయం: కేటీఆర్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీ మేరకు ఖమ్మం జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ఖాయమని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధిపై అనుమానాలు లేవని మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. ప్రాజెక్టుతో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభించనుందని చెప్పారు. సూర్యాపేట జిల్లాలో సున్నపు రాయి గనుల అన్వేషణ 3 నెలల్లో పూర్తవుతుందని, త్వరలో వేలానికి వెళ్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఫోన్ చేస్తే ఇంటికి ఇసుక సరఫరా చేసేలా సాండ్ ట్యాక్సీల విధానాన్ని ప్రవేశపెట్టామని వివరించారు. 2016–17లో గనుల ద్వారా రాష్ట్రానికి రూ.3,170 కోట్ల ఆదాయం వచ్చిందని.. ఈ ఏడాది రూ.3,500 కోట్లకు పెరగనుందని చెప్పారు. గనుల తవ్వకాల నియంత్రణకు జియో ట్యాగింగ్, జియో మ్యాపింగ్, డ్రోన్లను సైతం వినియోగంలోకి తీసుకొచ్చామని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి మైనింగ్ రంగం చోదకశక్తిగా పరిగణిస్తామని, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకునే మైనింగ్ నిర్వహించాలని సూచించారు. -
ఆ రాష్ర్టాలకు రూ 1.5 లక్షల కోట్ల రాబడి
సాక్షి,న్యూఢిల్లీః గనుల నుంచి రాష్ర్టాలు ఘనమైన రాబడి ఆర్జించనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఖనిజ సంపద అపారంగా ఉన్న రాష్ర్టాలకు గనుల వేలం ద్వారా రూ 1.5 లక్షల కోట్లు సమకూరుతాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ ఆయా రాష్ర్ట ప్రభుత్వాల ఖజానాకు 21 గనుల వేలం ద్వారా రూ 73,000 కోట్లు సమకూరాయని పేర్కొన్నాయి. మరో 54 గనుల వేలం ద్వారా రూ 2 లక్షల కోట్ల రాబడి అంచనా వేస్తున్నామని, ఇందులో రూ 1.5 లక్షల కోట్లు రాష్ర్టాల ఖాతాకు వెళతాయని గనుల కార్యదర్శి అరుణ్ కుమార్ వెల్లడించారు.ఈసారి సున్నపురాయి, ముడిఇనుము, బంగారు గనులు వేలంలో పెద్దసంఖ్యలో పాల్గొంటాయని చెప్పారు. ఐబీఎం, జీఎస్ఐ, సహా ఎంఎస్టీసీ, ఎంఈసీఎల్ వంటి పలు పీఎస్యూల సహకారంతో ఇప్పటికే వేలం ప్రక్రియను గనుల శాఖ ప్రారంభించిందని ఆయన తెలిపారు. -
సిటీ అంతటా బాంబులు పెట్టి వెళ్లిన ఐసిస్
బీరుట్: ఉగ్రవాద ఇస్లామిక్ స్టేట్ తోకముడిచింది. సిరియా ప్రముఖ వారసత్వ నగరం పామిరాను రాత్రికి రాత్రే ఖాళీ చేసింది. ఇప్పటికే రష్యా బలగాలతో ఉమ్మడిగా సిరియా సేనలు పామిరా ప్రాంతం సమీపానికి చేరుకోవడంతో అక్కడ తలదాచుకున్న ఉగ్రవాదులు, ఆయా నివాసాలను స్వాధీనం చేసుకొని ఉన్నవారంతా అర్థరాత్రి తరలివెళ్లిపోయారని సిరియా హక్కుల సంస్థ ఒకటి తెలిపింది. అయితే, వెళుతూ వెళుతూ ఆ నగరం చుట్టుపక్కల మొత్తం కూడా భారీ విస్ఫోటనాలకు తావిచ్చే మందుపాతరలాంటి పేలుడు పధార్థాలు (మైన్స్) అమర్చి వెళ్లిపోయింది. అంతేకాదు.. కొంతమంది ఆత్మాహుతి దళ సభ్యులను కూడా విడిచిపెట్టి వెళ్లిపోయినట్లు ఆ సంస్థ పేర్కొంది. దీంతో పామిరా నగరంలోకి నేరుగా ప్రవేశించకుండానే చాలా జాగ్రత్తగా లోపలికి భద్రతా బలగాలు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు బాంబు దాడులతో ప్రాచీన నగరమైన పామిరాలోని పలు వారసత్వ సంపదను కోల్పోయింది. తాజాగా, మరోసారి మైనింగ్స్ను ఉగ్రవాదులు పెట్టి వెళ్లడంతో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందుకు వెళ్లాలని సైన్యం భావిస్తోంది. -
హెలికాప్టర్ సందడి
చాగలమర్రి: అత్యంత కింద నుంచి హెలికాప్టర్ ప్రయాణిస్తూ చక్కర్లు కొట్టడంతో ప్రజలు చూసి సంతోషించారు. మంగళవారం మండలంలోని చిన్నవంగలి అటవీ ప్రాంతం నుంచి చాగలమర్రి, మల్లెవేముల, రాజోలి, గొట్లురు, పెద్దముడియం, జమ్మలమడుగు ప్రాంతాల్లో హెలికాప్టర్ కింద భాగాన పొడవాటి సర్వే పరికరంతో చక్కర్లు కొడుతూ కనిపించడంతో భూగర్భంలోని బాక్సైట్, యురేనియం నిక్షేపాల కోసం సర్వే నిర్వహిస్తుండవచ్చని మండల అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. -
ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే చర్యలు
- డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జూవాలజీశాఖ బళ్లారి రీజియన్ డీఎంఎస్ డోన్ టౌన్ : గనులు, ఫ్యాక్టరీల యజమానులు కార్మికుల విషయంలో ప్రభుత్వ నిబంధనలు పాటించాలని లేకపోతే కఠిన చర్యలు తప్పవని డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జీయాలజీశాఖ బళ్లారి రీజియన్ డీఎంఎస్ మనీష్ మూర్కూటే అన్నారు. గనుల భద్రతా వారోత్సవాల సందర్భంగా డోన్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. పనులు చేసేటప్పుడు కార్మికులకు ప్రమాదాలు జరిగితే కొందరు యజమానులు తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇది ఎంత మాత్రం సమంజసం కాదన్నారు. అనంతరం భద్రతా చర్యలను చేపట్టిన గనుల యజమానులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ బళ్లారి రీజియన్ డీఎంఎస్ఎస్లు తిరుపతి, నాగేశ్వరరావు, కర్నూలు జిల్లా డీడీ రాజబాబు, వీటీసీ అధికారి చంద్రశేఖర్, జిందాల్ అధికారి సునీల్ కుమార్ సింగ్, పారిశ్రామిక వేత్తలు ఐపీ శ్రీరాములు, సుజాత శర్మ, ఎన్ఎం మధు, తెనాలి రమేష్, ల క్ష్మీనారాయణ యాదవ్, రామ్మోహన్రెడ్డి, రాజశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బొగ్గు భాగ్యాలు
చింతలపూడి : భూగర్భంలోని బొగ్గు నిల్వల అన్వేషణను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తరించి ఉన్న నల్ల బంగారం వెలికితీతకు ఇటీవల మైనింగ్ ఎక్స్ప్లొరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఈసీఎల్), నేషనల్ మైనింగ్ ఎక్స్ప్లొరేషన్ ట్రస్ట్ (ఎన్ఎంఈటీ)లతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది చివరినాటికి అన్వేషణ పూర్తి చేసి, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే బొగ్గును వెలికితీయాలనిప్రభుత్వం నిరీక్షిస్తోంది. ఏపీఎంఐడీసీ ఆధ్వర్యంలో తవ్వకాలు జరగనున్నాయి. మరిన్ని ప్రదేశాల్లో పాయింట్లు పెట్టి అన్వేషణ సాగించాలని భావించిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) సూచనల మేరకు జిల్లాలోని చింతలపూడి మండలం శెట్టివారిగూడెం, కృష్ణా జిల్లాలోని సోమవరం ప్రాంతాల్లో మరోమారు డ్రిల్లింగ్ ప్రారంభించారు. గత గురువారం నుంచి సౌత్ వెస్ట్ పినాకిల్ సంస్థ శెట్టివారిగూడెం ప్రాంతంలో డ్రిల్లింగ్ చేపట్టింది. ప్రస్తుతం 120 పాయింట్లను గుర్తించి అధునాతన రిగ్గులతో డ్రిల్లింగ్ చేస్తోంది. ఈ 120 పాయింట్లలో 65 వేల మీటర్ల లోతున తవ్వి బొగ్గు అన్వేషణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది నుంచి జీఎస్ఐ ఇంజినీర్లు చేపట్టిన తొలిదశ బొగ్గు అన్వేషణ పనులు మూడు నెలల క్రితమే పూర్తయ్యాయి. సుమారు 700 మీటర్లకుపైగా లోతులో డ్రిల్లింగ్ చేసి నివేదికను ప్రభుత్వానికి పంపారు. జీఎస్ఐ ఆరునెలల పాటు చేపట్టిన అన్వేషణలో ఈ ప్రాంతంలో 200 మీటర్ల లోతు నుంచి నాణ్యమైన బొగ్గు నిల్వలు ఉన్నట్టు తేల్చారు. సింగరేణి ప్రాంతంలో లభించే బొగ్గు కన్నా ఇక్కడ నాణ్యమైన నిల్వలు ఉన్నాయని తేల్చారు. 2వేల మిలియ¯ŒS టన్నుల బొగ్గు నిల్వలు మన రాష్ట్రంలోని కృష్ణా జిల్లా చాట్రాయి మండలం సోమవరం గ్రామం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి వరకు సుమారు 2 వేల మిలియన్ టన్నుల నల్ల బంగారం నిల్వలు ఉన్నట్లు తాజా సర్వేల ద్వారా వెల్లడైంది. అవికూడా భూమి ఉపరితలానికి 200 మీటర్ల నుంచి 500 మీటర్ల లోతులోనే ఉన్నాయని నివేదికలో గుర్తించారు. చింతలపూడి ప్రధాన కేంద్రంగా 30కిలోమీటర్ల వ్యాసార్థంలో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. 2013లోనే నిర్ధారణ లక్నోకు చెందిన బీర్బల్ సహానీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలియో బోటనీ అనే సంస్థ 2013లో కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చేపట్టిన అధ్యయనంలో కృష్ణా జిల్లా సోమవరం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి, టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం మండలాల మీదుగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వరకు నాణ్యమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు కనుగొంది. ఇతర రాష్ట్రాల్లో లభ్యమయ్యే బొగ్గుతో పోల్చితే ఇక్కడ అత్యంత నాణ్యమైన బొగ్గు ఉన్నట్లు ఆ సంస్థ పేర్కొంది. అవీ భూమి ఉపరితలానికి 500 మీటర్ల లోపులోనే ఉన్నాయని నివేదికలో పొందుపరిచింది. 6 నెలలపాటు అన్వేషణ అధునాతన యంత్రాలతో 6నెలల పాటు బొగ్గు అన్వేషణ కొనసాగుతుంది. అన్వేషణ పూర్తయ్యాక ప్రభుత్వానికి తుది నివేదిక అందిస్తాం. ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుంచి రిగ్గులు వచ్చాయి. మొత్తం 120 రిగ్గులు రప్పిస్తున్నాం. – దాశరథి సుదర్శనం, సూపర్వైజర్, సౌత్ వెస్ట్ పినాకిల్ సంస్థ -
బొగ్గు భాగ్యాలు
చింతలపూడి : భూగర్భంలోని బొగ్గు నిల్వల అన్వేషణను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తరించి ఉన్న నల్ల బంగారం వెలికితీతకు ఇటీవల మైనింగ్ ఎక్స్ప్లొరేష¯ŒS కార్పొరేష¯ŒS లిమిటెడ్ (ఎంఈసీఎల్), నేషనల్ మైనింగ్ ఎక్స్ప్లొరేష¯ŒS ట్రస్ట్ (ఎ¯ŒSఎంఈటీ)లతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది చివరినాటికి అన్వేషణ పూర్తి చేసి, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే బొగ్గును వెలికితీయాలనిప్రభుత్వం నిరీక్షిస్తోంది. ఏపీఎంఐడీసీ ఆధ్వర్యంలో తవ్వకాలు జరగనున్నాయి. మరిన్ని ప్రదేశాల్లో పాయింట్లు పెట్టి అన్వేషణ సాగించాలని భావించిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) సూచనల మేరకు జిల్లాలోని చింతలపూడి మండలం శెట్టివారిగూడెం, కృష్ణా జిల్లాలోని సోమవరం ప్రాంతాల్లో మరోమారు డ్రిల్లింగ్ ప్రారంభించారు. గత గురువారం నుంచి సౌత్ వెస్ట్ పినాకిల్ సంస్థ శెట్టివారిగూడెం ప్రాంతంలో డ్రిల్లింగ్ చేపట్టింది. ప్రస్తుతం 120 పాయింట్లను గుర్తించి అధునాతన రిగ్గులతో డ్రిల్లింగ్ చేస్తోంది. ఈ 120 పాయింట్లలో 65 వేల మీటర్ల లోతున తవ్వి బొగ్గు అన్వేషణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది నుంచి జీఎస్ఐ ఇంజినీర్లు చేపట్టిన తొలిదశ బొగ్గు అన్వేషణ పనులు మూడు నెలల క్రితమే పూర్తయ్యాయి. సుమారు 700 మీటర్లకుపైగా లోతులో డ్రిల్లింగ్ చేసి నివేదికను ప్రభుత్వానికి పంపారు. జీఎస్ఐ ఆరునెలల పాటు చేపట్టిన అన్వేషణలో ఈ ప్రాంతంలో 200 మీటర్ల లోతు నుంచి నాణ్యమైన బొగ్గు నిల్వలు ఉన్నట్టు తేల్చారు. సింగరేణి ప్రాంతంలో లభించే బొగ్గు కన్నా ఇక్కడ నాణ్యమైన నిల్వలు ఉన్నాయని తేల్చారు. 2వేల మిలియ¯ŒS టన్నుల బొగ్గు నిల్వలు మన రాష్ట్రంలోని కృష్ణా జిల్లా చాట్రాయి మండలం సోమవరం గ్రామం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి వరకు సుమారు 2 వేల మిలియ¯ŒS టన్నుల నల్ల బంగారం నిల్వలు ఉన్నట్లు తాజా సర్వేల ద్వారా వెల్లడైంది. అవికూడా భూమి ఉపరితలానికి 200 మీటర్ల నుంచి 500 మీటర్ల లోతులోనే ఉన్నాయని నివేదికలో గుర్తించారు. చింతలపూడి ప్రధాన కేంద్రంగా 30కిలోమీటర్ల వ్యాసార్థంలో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. 2013లోనే నిర్ధారణ లక్నోకు చెందిన బీర్బల్ సహానీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలియో బోటనీ అనే సంస్థ 2013లో కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చేపట్టిన అధ్యయనంలో కృష్ణా జిల్లా సోమవరం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి, టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం మండలాల మీదుగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వరకు నాణ్యమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు కనుగొంది. ఇతర రాష్ట్రాల్లో లభ్యమయ్యే బొగ్గుతో పోల్చితే ఇక్కడ అత్యంత నాణ్యమైన బొగ్గు ఉన్నట్లు ఆ సంస్థ పేర్కొంది. అవీ భూమి ఉపరితలానికి 500 మీటర్ల లోపులోనే ఉన్నాయని నివేదికలో పొందుపరిచింది. 6 నెలలపాటు అన్వేషణ అధునాతన యంత్రాలతో 6నెలల పాటు బొగ్గు అన్వేషణ కొనసాగుతుంది. అన్వేషణ పూర్తయ్యాక ప్రభుత్వానికి తుది నివేదిక అందిస్తాం. ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుంచి రిగ్గులు వచ్చాయి. మొత్తం 120 రిగ్గులు రప్పిస్తున్నాం. – దాశరథి సుదర్శనం, సూపర్వైజర్, సౌత్ వెస్ట్ పినాకిల్ సంస్థ -
ఎమ్మెల్యేకు విందు పేరుతో వసూళ్లు!
- ఇవ్వని ట్రాక్టర్ యజమానికి రాయల్టీలు ఇవ్వకుండా సతాయింపు - అధికార పార్టీ మద్దతు దారుల అక్రమ దారి కొలిమిగుండ్ల: ‘నాపరాతిపై పెంచిన రాయల్టీ ధరను ప్రభుత్వంతో పోరాడి ఎమ్మెల్యే బీసీ జనార్ధనరెడ్డి తగ్గించారు..అందుకు ప్రతిగా పెద్ద ఎత్తున డిన్నర్(విందు) ఏర్పాటు చేస్తున్నాం. యజమానులందరూ రూ.2వేల చొప్పున ఇవ్వాల్సిందే’ అని అధికార పార్టీ మద్దతు దారులు మంగళవారం నుంచి వసూళ్ల పర్వం మొదలు పెట్టినట్లు సమాచారం. 2015 నవంబర్లో రాయల్టీ బిల్లుపై 4నుంచి 8శాతం ధర ప్రభుత్వం పెంచింది. ఇటీవల ఆ ధరను ప్రభుత్వం 5శాతానికి తగ్గిస్తూ జీఓ జారీ చేసింది. ఈనేపథ్యంలో నాయకులు డిన్నర్ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించారు. కొలిమిగుండ్ల, అవుకు మండలాల నుంచి రోజు బందార్లపల్లె క్రాస్ రోడ్డులోని రాయల్టీ చెక్పోస్ట్ మీదుగా 650కు పైగా ట్రాక్టర్లు నాపరాళ్లను ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తుంటాయి. ట్రాక్టర్తో పాటు మైనింగ్ లీజు దారులు, రాయల్టీ బిల్లులు విక్రయించే వారు ఒక్కొక్కరు రూ.2వేలు ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వసూలు చేసే బాధ్యత రాయల్టీ బిల్లులు విక్రయించే వారికి అప్పగించినట్లు సమాచారం. డబ్బులు ఇవ్వకపోతే ట్రాక్టర్లకు రాయల్టీలు ఇవ్వరాదని గట్టిగా హెచ్చరించినట్లు తెలిసింది. ఓ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుడుకి చెందిన ట్రాక్టర్కు డబ్బు ఇవ్వాలని పేర్కొనడంతో ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మరి కొందరు యజమానులు మాత్రం సమస్య ఎందుకని అడిగిన మొత్తం ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. అధికార పార్టీ నాయకులు డిన్నర్ ఇచ్చుకోవాలంటే ఇలా పది మందితో బలవంతంగా వసూలు చేయకుండా సొంతంగా ఖర్చు పెట్టుకోవాలని పలువురు యజమానులు హితువు పలికారు. -
గనిలో ‘మా ఊరు ప్రేమ కథ ’
బనగానపల్లె రూరల్: గోవిందిన్నె సమీపంలోని పలుకూరు క్రాస్ రోడ్డులోని ఓ నాపరాతి గనిలో మా ఊరి ప్రేమ కథ చిత్రం షూటింగ్ సన్నీవేశాలను చిత్రీకరించారు. హీరో మంజునాథ్, హీరోయిన్ తనీష్ తివారి, విలన్ రుద్రప్రకాష్తో పాటు మరి కొందరి ఆర్టిస్టులతో ఫైట్స్ను చిత్రీకరించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, హీరో మంజునాథ్ మాట్లాడుతూ ఈ చిత్రం వచ్చే వేసవిలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కాగా మొదట గనిలో చిత్రానికి షూటింగ్కు అనుమతి లేదని నందివర్గం పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మంజునాథ్ పోలీసు అధికారులతో చర్చించిన తరువాత ఆరగంట ఆలస్యంగా ప్రారంభమైంది. -
మాతల ఇసుక ర్యాంపుపై మైన్స్ అధికారుల దాడి
కొత్తూరు: మండలంలోని మాతల గ్రామం వద్ద వంశధార నదిలో అక్రమంగా నిర్వహిస్తున్న ఇసుక ర్యాంపుపై మైన్స్ అసిస్టెంట్ జియాలజిస్టు హనుమంతు రావు దాడి చేశారు.ఆరు ఇసుక లారీలను నివగాం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పట్టుకున్నారు. అయితే వాటిపై ఎలాంటి కేసులు రాయకుండా అన్లోడ్ చేయించి విడిచిపెట్టడం గమనార్హం. తవ్వకాలు చేస్తున్న ప్రాంతంను తహసీల్దార్ రామకృష్ణ పరిశీలించారు. అనుమతులు ఇచ్చిన చోట తవ్వకాలు చేయకుండా నదిలో ఇసుక తవ్వకాలు చేసినట్లు గుర్తించామన్నారు. మైన్స్ ఏడీ ఆదేశాల మేరకు అన్లోడ్ చేసి లారీలను పంపించినట్లు ఏజీ తెలిపారు. దాడిలో తహశీల్దార్తో పాటు ఆర్ఐలు భీమారావు, వీఆర్వో సంగమేశ్వరరావు, సర్వేయర్ శ్రీరాములు పాల్గొన్నారు. స్వామి భక్తి చూపించిన అధికారులు... వంశధార నది నుంచి అక్రమంగా తరలిస్తున్న లారీలను పట్టుకుని కేసులు నమోదుచేయక పోవడం విచారకరమని, టీడీపీ నేతలకు అధికారులకు స్వామి భక్తి చూపించారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ఆరోపించారు. పట్టుకున్న లారీలపై అధికారులు ఎందుకు కేసులు నమోదు చేయాలేదన్నారు. టీడీపీ నేతలకు అధికారులు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. -
భూగర్భ గనుల్లో నష్టాన్ని తగ్గించాలి
జీఎం ఉమామహేశ్వరరావు కొత్తగూడెం: భూగర్భ గనుల్లో వస్తున్న నష్టాన్ని తగ్గించేందుకు యంత్రాల పనిగంటలు మరింత పెంచుకోవాలని జీఎం పి.ఉమామహేశ్వరరావు సూచించారు. శుక్రవారం మెయిన్ వర్క్షాప్లో జరిగిన మల్టీ డిపార్ట్మెంట్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓపెన్కాస్టులలో షావెల్స్ సామర్థ్య వినియోగం సగటు 74 శాతం మాత్రమే ఉందని, దీనిని 100శాతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సివిల్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్, సెక్యూరిటీ డిపార్ట్మెంట్లలో నిర్వహించిన మల్టీ డిపార్ట్మెంట్ సమావేశాల్లో కమిటీ మెంబర్లు జీఎం (ఓసీపీ) ఎన్.నాగేశ్వరరావు, జీఎం (పర్సనల్) ఎ.ఆనందరావు, జీఎం (ఈఅండ్ఎం) నిర్మల్ కుమార్, జీఎం (ట్రాన్స్పోర్ట్) ఎస్.శంకర్, ఏజీఎం (ఎఫ్అండ్ఏ) నర్సింహమూర్తి, సీఎంఓఏఐ ప్రతినిధి పి.రాజీవ్ కుమార్, టీబీజీకేఎస్ నాయకులు ఎ.రవీందర్, ఐఎన్టీయూసీ నాయకులు వలస కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కాపుగల్లు క్వారీలో పేలుళ్లు
– ముగ్గురికి తీవ్రగాయాలు కోదాడ: అనుభవం లేని కార్మికులతో రాళ్లను పేల్చేందుకు జిలెటిన్ స్టిక్స్ను అమర్చగా అవి ప్రమాదవశాత్తు పేలి ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు శివారులో చోటు చేసుకుంది. పేలుళ్ల సంఘటనను పక్కదారి పట్టించేందుకు క్వారీ యజమానులు దానిని ట్రాక్టర్ ప్రమాదంగా చిత్రీకరించారు. ఇదే ప్రాథమిక సమాచారాన్ని పత్రికలకు ఇచ్చి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మండల పరిధిలోని కాపుగల్లు శివారులో విజయలక్ష్మిస్టోన్ క్రషర్ ఉంది. దీనికి రాళ్లను సరఫరా చేసేందుకు పక్కనే ఉన్న బండను లీజుకు తీసుకున్నారు. దానిని పేల్చడానికి నకిరేకల్ మండలం గోరెంకలపల్లికి చెందిన ముగ్గురు కార్మికులు ఆదివారం రాత్రి 5 బాంబులను(జిలెటిన్స్టిక్స్) అమర్చారు. అందులో మూడు పేలాయి. మరో రెండు పేలలేదు. సోమవారం ఉదయం అందులో పేలుడు పనులను చూస్తున్న సంపంగి బాబు, ఎ.రామకష్ణ, బాలరాజులు పేలని జిలెటిన్ స్టిక్స్ను బయటకు తీస్తుండగా అవి ఒక్కసారిగా పేలాయి. దీంతో వీరు ముగ్గురికి తీవ్రగాయలయ్యాయి. క్వారీ నిర్వాహకులు, తోటి కార్మికులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం కోదాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి మరో ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని అక్కడి నుంచి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితులు దూర ప్రాంతానికి చెందిన వారు కావడంతో, వారి తరఫున మాట్లావారు ఎవ్వరూ లేక పోవడంతో క్వారీ నిర్వాహకులు పేలుళ్ల సంఘటనను కప్పిపుచ్చారు. ట్రాక్టర్ బోల్తాపడడం వల్ల గాయాలయ్యాయని చెప్పారు. తోటి కార్మికులకు కూడా అలాగే చెప్పాలని చెప్పినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న బాధితుల బంధువులు సోమవారం రాత్రి పొద్దుపోయిన తరువాత కోదాడ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయ్ప్రకాశ్ తెలిపారు. చిన్నప్రమాదమే.. ప్రమాదవశాత్తు క్వారీలో చిన్న సంఘటన జరిగిందని క్వారీ నిర్వాహకులు పేర్కొన్నారు. కార్మికులకు చిన్న గాయాలు మాత్రమే అయ్యాయని, కాని వారి క్షేమం కోసం మెరుగైన చికిత్సకు హై దాబాద్ తీసుకెళ్లామని, గాయపడిన కార్మికులను ఆదుకుంటామని చెప్పారు. -
బాలలను పనిలో పెట్టుకోవద్దు
మైన్స్ డిప్యూటీ డైరెక్టర్ ముఖేష్కుమార్ సిన్హా విజయనగరం పూల్బాగ్: బాలలను పనుల్లో పెడితే క్రిమినల్ చట్టాల ప్రకారం శిక్షార్హులు అవుతారని, కాబట్టి గనుల్లో వారిని చేర్చుకోవద్దని మైన్స్ డిప్యూటీ డైరెక్టర్ ముఖేష్ కుమార్S సిన్హా (హైదరాబాద్) అన్నారు. పట్టణంలోని ఎస్విఎన్ లేక్ప్యాలెస్లో జిల్లాలోని మైన్స్ ఓనర్స్తో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవలి కాలంలో జార్ఖండ్లో మైన్స్ ప్రమాదంలో ఏడుగురు మైనర్లు చనిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం దీన్ని సీరియస్గా పరిగణనిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఎస్కె.సర్వాగీ కంపెనీ సీఈఓ అశోక్ కుండా, ఆర్బీఎస్సెస్డీ మేనేజర్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
4,5 తేదీల్లో దండ కారణ్యం బంద్
సాక్షి, హైదరాబాద్: దండకారణ్య నిర్వాసితుల సమస్య, ఆదివాసుల అస్తిత్వం, ఆత్మగౌరవం కాపాడటమే లక్ష్యంగా మే 4, 5 తేదీల్లో దండకారణ్యంలో బంద్ పాటించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ మీడియాకు ఒక ప్రకటన లేఖ పంపారు. ఛత్తీస్ఘడ్, మహారాష్ట్రల్లో ప్రజలను నిర్వాసితులు చేసే గనులు, ప్రాజెక్టులు, భారీ పరిశ్రమలు, పైప్లైన్లకు వ్యతిరేకంగా విస్తృత కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. బంద్తో పాటు మే నెలంతా ప్రతిఘటనా కార్యక్రమాలు నిర్వహిస్తామని వికల్ప్ ప్రకటించారు. -
భగ్గుమంటున్న ఓసీలు
కొత్తగూడెం(ఖమ్మం) : సాధారణంగా మే నెలలో ఉండాల్సిన ఎండలు మార్చిలోనే పెరగడంతో ముఖ్యంగా సింగరేణి ఓపెన్కాస్టు గనులు భగ్గుమంటున్నాయి. విపరీతమైన వేడి, వడగాల్పులకు తట్టుకోలేక కార్మికులు విలవిల్లాడుతున్నారు. ఓసీపీల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థారుుకంటే అధికంగా నమోదవుతున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితులు ఎలా ఉంటాయోనని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. కొత్తగూడెం ఏరియా పరిధిలోని గౌతంఖని ఓపెన్కాస్టు, సత్తుపల్లిలోని జేవీఆర్ ఓసీలలో 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒకవైపు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నా యూజమాన్యం ఎప్పటి మాదిరిగానే ఏప్రిల్ ఒకటి నుంచి వేసవి ఉపశమన చర్యలు చేపట్టడానికి వేచి చూస్తోందని కార్మిక నాయకులు మండిపడుతున్నారు. అత్యధిక వేడి కారణంగా కార్మికులు విధులు నిర్వహిం చేందుకు భయపడుతున్నారని, మార్చి 31 వరకు నిర్దేశి త ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో విధులకు హాజరవుతున్నారని పేర్కొంటున్నారు. రక్షణ చర్యలు చేపట్టాలి ఎండల నుంచి రక్షించుకునేందుకు రక్షణ చర్యలు చేపట్టాలని ఓపెన్కాస్టు గనుల కార్మికులు యూజమాన్యా న్ని కోరుతున్నారు. గనుల్లో కనీసం చల్లని తాగునీటి సదుపాయం లేదని దాహార్తితో గొంతెండిపోతోందని అంటున్నారు. నీడలో సేదదీరడానికి షెడ్లు కూడా ఏర్పా టు చేయలేదని, ఏసీతో కూడిన షెడ్లు ఏర్పాటు చేయాల ని డిమాండ్ చేస్తున్నారు. మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు నిరంతరం అందజేయూలని, ఎండలు మరింత పెరిగే అవకాశమున్నందున మధ్యాహ్నం సమయంలో కొంత సమయం బ్రేక్ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విషయమై కార్మిక సంఘాలు సైతం యాజ మాన్యంతో చర్చించాల ని విజ్ఞప్తి చేస్తున్నారు. -
బాక్సైట్ అంటే ఏంటమ్మా?
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేను అడిగిన గనుల శాఖ మంత్రి పీతల సుజాత హైదరాబాద్: బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా విశాఖ మన్యంలో ప్రజా ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. గిరిజన ఎమ్మెల్యేలంతా బాక్సైట్ తవ్వకానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. స్థానిక గిరిజనులు దీనిపై ఏళ్ల తరబడి ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. కానీ, రాష్ట్ర గనుల శాఖ మంత్రి పీతల సుజాతకు బాక్సైట్ అంటే ఏమిటో తెలియక పోవడం విచిత్రం. బాక్సైట్ అంటే ఏమిటో ఓ ఎమ్మెల్యేను అడిగి మంత్రి తెలుసుకోవడం తాజాగా అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. వైఎస్సార్సీపీ పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఈ విషయాన్ని స్వయంగా మీడియాతో చెప్పారు. బాక్సైట్ అంటే ఏంటమ్మా అని మంత్రి పీతల సుజాత తనను అడిగారని తెలిపారు. సొంత శాఖకు సంబంధించిన విషయం గురించి తెలియని మంత్రులు ఉన్నారంటే ఏమనాలో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమం రగులుతూంటే సంబంధిత మంత్రికి దీనిపై కనీస అవగాహన లేకపోవడం పట్ల అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
‘బయ్యారం’ ఖనిజాన్వేషణ ప్రైవేటుకు
సాక్షి, హైదరాబాద్: ఉత్తర తెలంగాణ జిల్లాల పరిధిలో ముడి ఇనుప ఖనిజం అన్వేషణ బాధ్యతను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల పరిధిలోని ఖనిజ నిల్వలను గతంలోనే రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ)కు అప్పగించా రు. ఈ నేపథ్యంలో ఖనిజాన్వేషణకు ప్రైవేటు ఏజెన్సీలను పారదర్శకంగా ఎంపిక చేయాల్సిన బాధ్యతను టీఎస్ఎండీసీకి అప్పగిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) ద్వారా ఖమ్మం జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఈ మేరకు సెయిల్ ప్రతినిధులు ఖమ్మంలో పర్యటించి ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు కనీసం 200 మిలియన్ టన్నుల ముడి సరుకు అవసరమని తేల్చారు. రాష్ట్రంలో 302 మిలియన్ టన్నుల ముడి ఇనుము నిల్వలు ఉన్నాయంటూ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక శాస్త్రీయంగా లేనందున 200 మిలియన్ టన్నుల ముడి ఇనుముపై పూర్తి నివేదిక ఇవ్వాలని సెయిల్ సూచించింది. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో జీఎస్ఐతో సమన్వయం చేసుకుంటూ ముడి ఇనుము లభ్యతపై నివేదిక సిద్ధం చేసే బాధ్యతను ప్రభుత్వం గత ఫిబ్రవరిలో టీఎస్ఎండీసీకి అప్పగించింది. కొలిక్కిరాని ఖనిజాన్వేషణ ఖమ్మం, వరంగల్ జిల్లాల సరిహద్దులోని బయ్యారంలో 100 చదరపు కి.మీ. పరిధిలో జీఎస్ఐ, గనులు, భూగర్భ వనరుల శాఖ సంయుక్త సర్వే నిర్వహించింది. లభ్యత ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న 60 చ.కి.మీ. పరిధిలో 14 చోట్ల డ్రిల్లింగ్ చేసి ఖనిజం లభ్యతపై అంచనాకు రావాలి. డ్రిల్లింగ్ ప్రక్రియ ఆలస్యమవుతుండటంతో మూడుచోట్ల ఖనిజాన్వేషణ బాధ్యతను సింగరేణికి అప్పగించారు. మరోవైపు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల పరిధిలో మరో 12 చోట్ల డ్రిల్లింగ్ చేయాలని జీఎస్ఐ తాజాగా ప్రతిపాదించింది. ఇప్పటికే బయ్యారంలో జీఎస్ఐ, సింగరేణి డ్రిల్లింగ్ను సకాలంలో పూర్తి చేయలేనందున కొత్తగా ప్రతిపాదించిన 12 పాయింట్లను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఇనుము లభ్యతపై స్పష్టత వస్తుందని టీఎస్ఎండీసీ వర్గాలు చెబుతున్నాయి. -
అసమానతలతో అనర్థం తథ్యం!
శత కోటి డాలర్ల కుబేరుల సిరులన్నీ చట్టబద్ధమైన లాభాలతో పోగుచేసినవి మాత్రమే కావు. అంతకన్నా ఎక్కువగా ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా సమకూరే ప్రభుత్వ రాబడిలోని భారీ మొత్తాలను సబ్సిడీలుగా పొందడం ద్వారా, గనులు, భూములు, చమురు, అటవీ సంపదల వంటి దేశ సంపదను, ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టి ఆర్జించినవి కూడా. మన దేశంలో ఇది మరింత విచ్చలవిడిగా సాగుతోంది. భారత బిలియనీర్ల సంపదతో దేశంలోని పేదరికాన్ని ఒకసారి కాదు, రెండుసార్లు నిర్మూలించవచ్చు. అది విశాఖ తీరంలోని రామకృష్ణ బీచ్. ఉదయం ఎనిమిది గంటలు. నులివెచ్చని ఉషోదయాన్ని ఆస్వాదించేందుకు అప్పుడప్పుడే పర్యాటకులు బీచ్లోకి వస్తున్నారు. కొందరు యువకులు, మరికొందరు నడివయస్కులు, కొందరు అటూ ఇటూగా ఉన్నవారు అక్కడున్నారు. ఓ వ్యక్తి మాత్రం భిన్నం గా కనిపించాడు. చెప్పులు చేతి సంచిలో వేసుకొని అలల్లో ఆదుర్దాగా దేనికోసమో వెతుకుతూ, వెతుకుతూ... అంతలోనే నిరాశగా వెనక్కి వస్తున్నాడు. సముద్రపుటలలపై నుంచి నా దృష్టి అతనివైపు మళ్లింది. వెళ్లి పలకరించాను, దేని కోసం వెతుకుతున్నావని అడిగాను. డబ్బుల కోసమని సమాధానం ఇచ్చాడు. నాకు మొదట అర్థం కాలేదు. ఎక్కడెక్కడో అలల్లో పడి కొట్టుకుపోయిన డబ్బులు ఏదో తీరానికి చేరతాయి. వాటి కోసమే ఈ వెతుకులాట. అదృష్టం బావుంటే వెండి మట్టెలు, బంగారం కూడా దొరుకు తాయని చెబుతున్నప్పుడు అతని కళ్ళల్లో మెరుపు చూశాను. రోజుకి ఎన్ని నాణేలు దొరుకుతాయని ప్రశ్నిస్తే... పది నుంచి పదిహేను రూపాయలు దొర కొచ్చు లేదా అసలేమీ దొరకకపోనూవచ్చు అన్నాడు. అతని పేరు నొల్లి రాములు. మత్స్యకారుడైన రాములు హార్బర్లో పనిచేసేవాడు. ఇటీవలే మానేశాడు. ఇద్దరు కొడుకులూ భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తూ ప్రమా దవశాత్తూ మరణించారు. ఆ తండ్రి కడుపు కూటికి సముద్రపుటలలు మోసు కొచ్చే చిల్లర కాసులే ఆధారం. ఎక్కడో ఎవరో పోగొట్టుకున్న లేదా గంగమ్మకు విసిరేసిన చిల్లర నాణేలను వెతుకులాడుతున్న రాములుని చూస్తే దిగులని పించింది. రాములులాంటి కోట్లాది మంది భారతీయులు సముద్రమంత సంపదను సృష్టిస్తే, అందులో చిల్లర పైసలు కూడా వారికి దక్కని దుస్థితిని చూసి, ఇదేం అసమాన ప్రపంచమనిపించింది. ఎటువంటి శ్రమ చేయకుండా వేల కోట్ల రూపాయల ఆస్తులను, అపార ధనరాశులను సొంతం చేసు కొని, విమానాలను, వందల కోట్ల రూపాయల బహుళ అంతస్తుల భవనా లను భార్యలకు ప్రేమ కానుకలుగా సమర్పించుకోగల భర్తలున్న సౌభాగ్య భారతావనిలోనే ఎంతటి వైరుధ్యం? బరువెక్కిన మనసుతో అక్కడి నుంచి కదిలాను. కొందరి చేతుల్లోనే సకల సంపదలు మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అసమానతలు, వ్యత్యాసాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. పదేళ్ళ క్రితం కంటే ఇప్పుడు అంతరాలు మరింతగా పెరిగాయి. గత జనవరిలో దావోస్లో జరిగిన ‘ప్రపంచ ఆర్థిక వేదిక’ సమావేశాల్లో ఈ విషయాలు చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా ‘ఆక్స్ఫామ్’ అనే సంస్థ ఒక పరిశోధనాత్మకమైన నివేదికను విడుదల చేసింది. 2009లో ప్రపంచంలో కోటి మంది కోటీశ్వరులు (శత కోటి అమెరికన్ డాలర్ల ఆస్తిపరులు) ఉంటే, 2013 వరకు ఆ సంఖ్య 1.37 కోట్లకు పెరిగినట్టు ఆ నివేదికలో పేర్కొన్నారు. ఇక శత కోటి డాలర్ల కుబేరులు (బిలియనీర్లు) రెట్టింపై, వారి సంఖ్య 1,645కు పెరిగిందని కూడా తెలిపారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సగం ప్రపంచ జనాభా దగ్గర ఉన్న మొత్తం సంపదకు ఇంచుమించు సరిపడా సంపద 85 మంది వ్యక్తుల వద్దే ఉన్నదని ఆ నివేదిక తెలిపింది. ప్రపంచ జనాభా సుమారు 700 కోట్లు. అంటే, కేవలం 85 మంది కుబేరుల సంపద 350 కోట్ల మంది సంపదకు సమానం. ఇది వింటే ఆశ్చర్యం కలగక మానదు. ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన బిల్గేట్స్ సంపద గురించి ప్రస్తావిస్తూ, ప్రతిరోజూ పది లక్షల డాలర్లను (ఆరు కోట్ల నలభై లక్షల రూపాయలు) ఖర్చు చేసినా, 218 సంవత్సరాల వరకు అవి సరిపోతాయని ఆక్స్ఫామ్ వెల్లడించింది. ఇలా కొందరి వద్దే సంపదంతా కేంద్రీకృతం కావడం కేవలం ధనిక దేశాలకే పరిమితం కాదని, భారత్ వంటి వృద్ధి చెందుతున్న వర్ధమాన దేశా ల్లో కూడా సంపద ఇలాగే కొందరి దగ్గర పోగు పడుతోందని గణాంకాలు చెబుతున్నాయి. 1990లో దేశంలో పదిమంది బిలియనీర్లు ఉంటే, 2014 వరకు వాళ్ళు 65 మందికి పెరిగారు. 2014 ‘ఫోర్బ్స్’ నివేదిక ప్రకారం. భారత దేశంలో ఉన్న మొదటి వంద మంది ధనికుల దగ్గర రూ. 22,49,600 కోట్ల సంపద పోగుబడి ఉన్నట్టుఆక్స్ఫామ్ నివేదిక బయటపెట్టింది. ఇది మన దేశ బడ్జెట్ కన్నా అధికం. 2013-14 కేంద్ర బడ్జెట్ మొత్తం రూ. 16 లక్షల కోట్లు మాత్రమే. అంటే ఏడాది పాటు భారత ఆర్థిక వ్యవస్థకి సరిపడే డబ్బు కన్నా ఎక్కువ సంపద కేవలం వంద మంది దగ్గరే పోగుపడివుంది. నిలువు దోపిడీతో సిరుల కులుకు ప్రపంచ కుబేరుల సిరులన్నీ వారు తన వ్యాపారాలు, పరిశ్రమల న్యాయమైన, చట్టబద్ధమైన లాభాల నుంచి మాత్రమే పోగు చేసినవి కాదు. అంతకన్నా ఎక్కువగా ప్రభుత్వాలు ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల ద్వారా లభించే ప్రభుత్వ రాబడితో రూపొందించే బడ్జెట్లో పెద్ద మొత్తాలను కొల్లగొట్టడం ద్వారా పోగుచేసినవి కూడా. ప్రభుత్వ సబ్సిడీలు, అక్రమంగా సంపాదించే గనులు, భూములు, చమురు, అటవీ సంపదల ద్వారా అతి తక్కువ కాలంలోనే దేశ సంపదను, ప్రభుత్వ ధనాన్ని వీరు కొల్లగొడు తున్నారు. మన దేశంలో ఇది మరింత విచ్చలవిడిగా సాగుతోంది. ప్రభుత్వ కాంట్రాక్టులు, లెసైన్సులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, మౌలిక సదు పాయాల (రైల్వేలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, రహదారులు) నిర్మాణం, గనులు, టెలి కమ్యూనికేషన్స్, పెట్రోకెమికల్స్ లాంటి రంగాల్లోని ప్రైవేటీకరణ ద్వారా జాతి సంపదను స్వాహా చేస్తున్నారు. భారత బిలియనీర్ల సంపదతో దేశంలోని పేదరికాన్ని ఒకసారి కాదు రెండుసార్లు నిర్మూలిం చవచ్చని ఆర్థిక వేత్తల అంచనా. వేలకోట్ల రూపాయల సహజ వనరులను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెబుతున్న ప్రభుత్వాలు కనీసం ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బునైనా వారి సంక్షేమం కోసం ఖర్చు చేయడంలేదు. విద్యావైద్య రంగాల పట్ల కేంద్రంతోపాటూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చూపుతున్న తీవ్ర నిర్లక్ష్యమే అందుకు తిరుగులేని సాక్ష్యం. మన దేశంలోని ధనికుల, నిరుపేదల రోజువారీ ఖర్చులో కూడా చాలా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. అవి వారి జీవనశైలి, ఆరోగ్యాలపైన తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. నగరాలలోని ధనికులు పెడుతున్న ఖర్చులో 12వ వంతు కూడా పేదలు ఖర్చు చేయడం లేదు. గ్రామాల్లో ఇది 9వ వంతు కంటే తక్కువ. 2012లో జరిగిన నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతంలోని పేద వాడు నెలకు రూ. 512 ఖర్చు పెడితే, ధనవంతుడు రూ. 2,084 వినియోగిస్తున్నాడు. అదే నగరాల్లో పేదవాడు రూ. 700 నెలకు ఖర్చు చేస్తే, ధనవంతుడు రూ. 10,282 ఖర్చు చేస్తున్నాడు. ఇవి సరాసరి లెక్కలు మాత్రమే. అంతరాల పెంపునకు ఏలికల అండదండలు ధనికుల ధన దాహానికి, రాజకీయ నాయకుల, ప్రభుత్వాధినేతల లాలూచీ తోడవుతుండటంతో ఈ వ్యత్యాసాలు మరింతగా పెరుగుతున్నాయి. ఆర్థిక, బీమా, మందుల తయారీ, ఆరోగ్యరక్షణ రంగాల కంపెనీలు ప్రభుత్వాధి నేతలను లోబర్చుకొని తమ దోపిడీకి మార్గం సుగమం చేసుకుంటున్నట్టు ఇటీవలి ఒక పరిశోధనలో వెల్లడైంది. అమెరికాలోని ఫైనాన్స్ కంపెనీలు తమ నిలువుదోపిడీ సాగించుకోవడానికి గత ఏడాది 40 కోట్ల డాలర్లు లంచాలుగా ఖర్చు చేశాయి. యూరప్లో 15 కోట్ల డాలర్లను లంచాల రూపంలో పంచిపెట్టాయి. అదేవిధంగా ఫార్మాస్యూటికల్ కంపెనీలు అమెరికాలో 48.7 కోట్ల డాలర్లు, యూరప్లో 5 కోట్ల డాలర్లు ఏటా ఖర్చు చేస్తున్నాయి. ఇవి మచ్చుకి కొన్ని ఉదాహరణలు మాత్రమే. భారత దేశంలో కూడా రాజకీయ పార్టీల ఎన్నికల ఖర్చులను కార్పొరేట్ రంగమే భరిస్తోందన్నది కఠోర వాస్తవం. నాయకులకు ఆస్తులను సమకూర్చి, కంపెనీలలో వాటాలు ఇచ్చి రాజకీయ అధికార వ్యవస్థను లోబరచుకొని కార్పొరేట్లు తమ వ్యాపారాలను, లాభాలను పెంపొందించుకుంటున్నాయి. ఇలా ప్రభుత్వాల ప్రోత్సాహంతోనే ఆర్థిక వ్యత్యాసాలు పెరుగుతున్నాయి. ప్రజలు నిత్య దారిద్య్రంతో కునారిల్లుతున్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ సముద్రపు అలల్లో చిల్లర డబ్బులు ఏరుకుంటున్న రాములే రోజురోజుకీ పెరుగుతున్న ఆర్థిక అంతరాలు, అసమానతలు భవిష్యత్ సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు భావిస్తున్నారు. ప్రపం చ ఆర్థిక వేదిక జనవరిలో దావోస్లో జరిగిన సమావేశంలో కొన్ని హెచ్చరి కలు చేసింది. ఆ సమావేశంలో పాల్గొన్న కొందరు నిపుణులు మరింత తీవ్రంగా తమ నిరసనను తెలియజేశారు. ఈ వ్యత్యాసాల వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కోల్పోతున్నామనే నిరాశలో యువతరం కొట్టుమిట్టాడు తున్నదని వారు అభిప్రాయపడ్డారు. తమకిక భవిత లేదని యువత భావిస్తే, ఆ అసంతృప్తి క్రమంగా సమాజ విచ్ఛిన్నానికి దారితీయగలదని ప్రపంచ ప్రముఖ ఆర్థికవేత్త జెన్నీఫర్ బ్లాంకే ఆందోళన వ్యక్తం చేశారు. మరొక ఆర్థిక వేత్త డేవిడ్ కోలే తీవ్ర స్వరంతో ఇలా హెచ్చరించారు: ‘‘నేను పెట్టుబడిదారీ విధానానికి గట్టి మద్దతుదారుడిని, అయితే ఈ ఆర్థిక అంతరాలు, అసమా నతలు కొనసాగితే పెట్టుబడిదారీ విధానం తగు మూల్యం చెల్లించుకోక తప్పదు.’’ (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ నం: 9705566213) -
బైరటీస్ గనులపై టిడిపి నేతల కన్ను!