mobile number
-
బ్యాంకుకు వెళ్లకుండానే.. మొబైల్ నెంబర్ అప్డేట్: ఇలా చేస్తే సింపుల్
టెక్నాలజీ విపరీతంగా పెరిగిన తరుణంలో దాదాపు ఏ పని చేయాలన్నా.. ఇంట్లో కూర్చునే చేసేస్తున్నారు. బ్యాంకింగ్ సేవలైతే మరీ సులభమైపోయాయి. కానీ ఇంకా చాలామందికి తెలియని విషయాలు లేకపోలేదు. కాబట్టి ఈ కథనంలో 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (SBI) రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ (Mobile Number) ఎలా మార్చుకోవాలి? ఎక్కడ మార్చుకోవాలి? అనే విషయాలను క్షుణ్ణంగా తెలుసుకుందాం.ఇంటర్నెట్ బ్యాంకింగ్ (Internet Banking) ద్వారా రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ అప్డేట్➤ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉన్న యూజర్లు లేదా కస్టమర్లు తమ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలంటే.. ముందు ఎస్బీఐ అధికారిక నెట్ బేకింగ్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.➤కుడివైపు కనిపించే కంటిన్యూ టూ లాగిన్ మీద క్లిక్ చేసి.. తరువాత యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.➤అక్కడ కనిపించే చేంజ్ మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేయండి.➤క్లిక్ చేసిన తరువాత మీరు మార్చాలనుకున్న మొబైల్ నెంబర్ లేదా కొత్త మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.ఏటీఎం (ATM) ద్వారా రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ అప్డేట్ఏటీఎం కేవలం మీ ఖాతాలోని నగదు విత్డ్రా చేసుకోవడానికి, డిపాజిట్ చేసుకోవడానికి మాత్రమే కాకుండా.. అవసరమైనప్పుడు రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ కూడా మార్చుకోవడానికి సహాయపడుతుంది.➢ముందుగా మీ సమీపంలోని ఏటీఎం సెంటర్కు వెళ్ళండి.➢మీ దగ్గరున్న డెబిట్ కార్డ్ని ఏటీఎం మెషీన్లోకి చొప్పించి.. పిన్ నెంబర్ ఎంటర్ చేయండి.➢పిన్ నెంబర్ ఎంటర్ చేసిన తరువాత స్క్రీన్ మీద కనిపించే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ సెలక్ట్ చేసుకోండి.➢తరువాత మొబైల్ నెంబర్ చేంజ్ ఆప్షన్ ఎంచుకోవాలి.➢ఆప్షన్ ఎంచుకున్న తరువాత మీ పాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. తరువాత కొత్త నెంబర్ ఎంటర్ చేయాలి. ఇలా చేసినప్పుడు మీకు ఓటీపీ నెంబర్లు వస్తాయి. వీటిని ఎంటర్ చేయడం ద్వారా మొబైల్ నెంబర్ అప్డేట్ అవుతుంది.ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం ద్వారా మాత్రమే కాకుండా మీరు బ్యాంకును సంప్రదించి కూడా మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు. అయితే దీనికి కావలసిన డాక్యుమెంట్స్ బ్యాంకులో అందించాల్సి ఉంటుంది. కాబట్టి బ్యాంకులు వెళ్లలేని వారు పైన చెప్పిన రెండు పద్దతుల ద్వారా మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: పేదోళ్లను లక్షాధికారి చేసే స్కీమ్: ఇదిగో డీటెయిల్స్మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఎందుకుసాధారణంగా మనం డబ్బు విత్డ్రా చేసినా లేదా డిపాజిట్ చేసినా, ఖాతాలో ఎంత ఉండనే విషయం తెలుసుకోవాలంటే తప్పకుండా బ్యాంకుకు వెళ్లాల్సి ఉండేది. కానీ మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల.. మీ లావాదేవీలకు సంబంధించిన విషయాలు మీకు మెసేజ్ రూపంలో వస్తాయి. కాబట్టి ప్రత్యేకించి మీరు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. అంతే కాకుండా రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ద్వారా బ్యాంక్ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి కూడా బ్యాలెన్స్ వివరాలను తెలుసుకోవచ్చు. -
మీ డాడీ దగ్గర రూ.2,000 అప్పుగా తీసుకున్నాను..
బంజారాహిల్స్: మీ డాడీ దగ్గర రూ.2,000 అప్పుగా తీసుకున్నాను..వాటిని ఇద్దామంటే ఆయన మొబైల్ నెంబర్ పోగొట్టుకున్నాను..నీ నెంబర్ను అప్పుడెప్పుడో ఫీడ్ చేసుకున్నాను..మీ పేరు, మీ నాన్న పేరు ఇదే కదా? అంటూ ఓ వ్యక్తి తియ్యటి మాటలతో సైబర్ వల విసిరి గృహిణికి అప్పు చెల్లించే ముసుగులో మోసం చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కొత్త రకంగా చక్కటి ప్లాన్తో సైబర్ మోసగాడు ఆమెను నమ్మించి మాటల్లో దింపి తికమకపెట్టి రూ.35 వేలు తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు. వివరాల్లోకి వెళితే..బంజారాహిల్స్ రోడ్డునెంబర్–1లో నివసించే స్వాగతారాయ్ అనే గృహిణికి సైబర్ మోసగాడు ఫోన్ చేసి మీ డాడి అశోక్కుమార్ శర్మకు తాను రూ.2000 బాకీ ఉన్నానని, వాటిని జీపే చేస్తానని ఆమెకు చెప్పాడు. తన పేరు, తండ్రి పేరు కరెక్ట్గానే చెబుతున్నాడు కదా అని ఆమె నమ్మి జీపే చేయమంది. వెంటనే ఆయన రూ.10,000 ఒకసారి, రూ.20,000 ఒకసారి మీ అకౌంట్కు పంపించాను, నీకు మెసేజ్ వచి్చంది చూసుకో అని చెప్పాడు. ఆ మేరకు ఫోన్కు మెసేజ్ కూడా వచ్చింది. కొద్దిసేపట్లోనే రూ.12,000 మరోసారి పంపించాడు. ఆమెకు ఆ మెసేజ్ కూడా వచ్చింది. రెండు నిమిషాల తర్వాత ఫోన్ చేసి పొరపాటున రూ.40,000 పంపాను..రెండు వేలు కట్ చేసుకుని రూ.38 వేలు తనకు తిరిగి జీపే చేయాలని ఆమెను తికమకపెట్టాడు. బాలింతరాలు అయిన ఆమె ఓ వైపు చిన్నారి ఏడుస్తుండడం, ఇంకోవైపు తన చికాకు..ఈ గొడవలోనే రూ.38 వేలు బదిలీ చేసింది.మరుక్షణంలోనే ఆమె బ్యాంక్ ఖాతా నుంచి రూ.38 వేలు వెళ్లడం, తన ఖాతా జీరో అని చూపించడంతో వెంటనే ఈ విషయాన్ని భర్తకు తెలిపింది. భర్త వెంటనే గంట వ్యవధిలోనే (గోల్డెన్ అవర్) బంజారాహిల్స్ పోలీస్స్టేషన్కు వచ్చాడు. వెంటనే పోలీసులు ఇది సైబర్ మోసమని గుర్తించి ఆమెకు వచి్చనవి నకిలీ మెసేజ్లు అని తెలుసుకుని సైబర్ మోసగాడి ఖాతాను ఫ్రీజ్ చేశారు. గంట వ్యవధిలోనే పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయడంతో సైబర్ మోసగాడి నుంచి డబ్బులు రికవరీ అయ్యే ఛాన్స్ను ఆమె పొందింది. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే గంట సేపట్లోనే గోల్డెన్ అవర్లో పోలీసులకు ఫిర్యాదు చేస్తే డబ్బులు రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటుందని బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ తెలిపారు. -
బీఎస్ఎన్ఎల్కు మారుతున్నారా?.. నచ్చిన నెంబర్ ఎంచుకోండిలా
జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ నెట్వర్క్స్ అన్నీ కూడా రీఛార్జ్ ప్లాన్స్ భారీగా పెంచిన తరువాత.. అందరి చూపు బీఎస్ఎన్ఎల్ వైపు పడింది. దీంతో ఇప్పటికే చాలామంది తమ నెట్వర్క్ను బీఎస్ఎన్ఎల్కు మార్చేస్తున్నారు. బీఎస్ఎన్ఎల్ ప్రస్తుతం తక్కువ ధరలోనే అద్భుతమైన ప్లాన్స్ అందిస్తోంది.ఎక్కువమంది బీఎస్ఎన్ఎల్కు మారుతున్న తరుణంలో సంస్థ కూడా తన నెట్వర్క్ను విస్తరించడానికి తగిన సన్నాహాలు చేస్తోంది. తమ నెట్వర్క్కు మారాలనుకునే వారికోసం బీఎస్ఎన్ఎల్ నచ్చిన నెంబర్ ఎందుకుని వెసులుబాటు కూడా కల్పించింది. ఆన్లైన్లో యూజర్ ఇప్పుడు ఫేవరేట్ నెంబర్ సెలక్ట్ చేసుకోవచ్చు.ఆన్లైన్లో నెంబర్ ఎంచుకోవడం ఎలా?గూగుల్ లేదా ఇతర సెర్చ్ ఇంజిన్లో BSNL Choose Your Mobile Number అని సెర్చ్ చేయాలి.ఇలా సెర్చ్ చేసిన వెంటనే BSNL CYMN అనేది కనిపిస్తుంది. దీనిపైనా క్లిక్ చేయగా మరో పేజీ ఓపెన్ అవుతుంది.ఇక్కడ ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్ అని నాలు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో మీ జోన్ సెలక్ట్ చేసుకుని రాష్ట్రాన్ని ఎంచుకోవాలి.ఇలా ఎందుకున్న తరువాత ఛాయిస్ నెంబర్, ఫ్యాన్సీ నెంబర్ అని రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. కావాల్సిన ఆప్షన్ ఎందుకున్న తరువాత నెంబర్ సెలక్ట్ చేసుకోవచ్చు.నచ్చిన నెంబర్ ఎంచుకున్న తరువాత రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది.ప్రక్రియ పూర్తయ్యాక సమీపంలోని బీఎస్ఎన్ఎల్ ఆఫీసుకు వెళ్లి సీఎం తెచ్చుకోవచ్చు. ఫ్యాన్సీ నెంబర్ కోసం కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. -
Lok Sabha Election 2024: పోలింగ్ బూత్ గుర్తింపు...మొబైల్ నంబర్తో
పోలింగ్ బూత్ ఎక్కడో తెలియడం లేదా? మన ఓటు ఏ పోలింగ్ బూత్లో ఉందో మొబైల్ నంబర్ సాయంతో చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 13న లోక్సభకు పోలింగ్ జరగనుండటం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా అదే రోజు ఎన్నికలు జరగనున్నాయి. ఓటు ఎక్కడుందో తెలుసుకోవడానికి ఓటర్ ఐడీ కార్డు సాయంతో సులువుగా తెలుసుకోవచ్చు. ఓటరు ఐడీలో ఇంగిŠల్ష్ అక్షరాలు, 10 అంకెలతో కూడిన ఎపిక్ ఐడీ పోలింగ్ బూత్ను గుర్తించడానికి కీలకమవుతుంది. ఏ కారణంతోనైనా కార్డు అందుబాటులో లేని వారు ఆన్లైన్లోనే ఎపిక్ నంబర్ గురించి తెలుసుకోవచ్చు. ఇలా చేస్తే సరి ఎపిక్ నంబర్ కోసం ఈసీ పోర్టల్ (voters. eci.gov.in)ను సందర్శించాలి. అందులో కుడివైపు కనిపించే సర్వీసెస్ విభాగంలో ‘ఈ–ఎపిక్ డౌన్లోడ్’ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. తర్వాత వచ్చే పేజీలో సైనప్ను ఎంపిక చేసుకోవాలి. మొబైల్ నంబర్, ఈ మెయిల్ అడ్రస్ ఇచ్చి క్యాప్చా ఎంటర్ చేసి, కంటిన్యూ చేయాలి. తర్వాత పేరు నమోదు చేసి, పాస్వర్డ్ ఎంపిక చేసుకోవాలి. మొబైల్కు వచ్చే ఓటీపీని ఎంపిక చేస్తే అకౌంట్ క్రియేట్ అవుతుంది. అప్పటికే ఖాతా ఉన్న వారు సైనప్ చేయనవసరం లేదు. మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్తో ఖాతాలోకి లాగిన్ అవడం ద్వారా ఈ–ఎపిక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా ఎపిక్ నంబర్ తెలిసిపోతుంది. తర్వాత సైట్ హోం పేజీలో కుడివైపున ఉన్న ‘సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్’ ఎంపిక చేసుకోవాలి. వచ్చే ప్రత్యేక పేజీలో ఎపిక్ నంబర్ నమోదు చేయాలి. రాష్ట్రం ఎంపిక చేసుకుని క్యాప్చా కోడ్ నమోదు చేసి సెర్చ్ బటన్ ఓకే చేయాలి. మీ పోలింగ్ బూత్తో పాటు పోలింగ్ స్టేషన్ ఆఫీసర్ తదితర వివరాలు కూడా లభిస్తాయి. ఇదే పోర్టల్ నుంచి ఫిర్యాదులు సైతం దాఖలు చేయవచ్చు. ఎపిక్ నంబర్ ఉన్న వారు నేరుగా సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్ ఆప్షన్కు వెళ్లవచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ ఫ్యాన్సీ మొబైల్ నెంబర్ సిమ్ వేలంలో..ఏకంగా అన్ని కోట్లా..!
ప్రత్యేక సీరిస్తో కూడిన నెంబర్లతో కూడిన ఫోన్ నెంబర్లకు, నంబర్ ప్లేట్లకు మంచి డిమాండ్ ఉంటుంది. ఆ నెంబర్ సీరీస్తో కూడిన ఫోన్లు, కార్లు సొంతం చేసుకునేందుకు జనాలు ఎగబడుతుంటారు. ఎంత డభైనా ఖర్చుపెడతారు. అలానే ఓ ప్రత్యేక సిరీస్తో కూడిన మొబైల్ సిమ్ని వేలం వేయగా ఎన్ని కోట్లు పలికిందో వింటే కంగుతింటారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే..ఆ ఫ్యాన్సీ నెంబర్ సిరీస్కి తగ్గట్టుగా ధరకు అమ్ముడుపోతే ఇది కలా నిజమా అనిపిస్తుంది. అలాంటి సన్నివేశమే ఇక్కడ చోటుచేసుకుంది. ఇది ఎక్కడ జరిగిందంటే..?దుబాయ్ ఛారిటీ వేలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ది మోస్ట్ నోబుల్ నంబర్స్ ఏడు సిరీస్తో ఉన్న ఉన్న సిమ్ 058-7777777 వేలంలో ఏకంగా ఏడు కోట్లకు అమ్ముడుపోయింది. ఆ సిమ్ నెంబర్ సంఖ్యలోనే ధర కూడా అనూహ్యంగా పలకడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇలాంటి వేలాన్ని యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు అయిన షేక్ మొహమ్మద్ రషీద్ అల్ ముక్తూమ్ ప్రారంభించారు. దీన్ని దాదాపు రూ. 100 కోట్ల మదర్స్ ఎండోమెంట్ ప్రచారానికి మద్దుతుగా ఇలా పది నెంబర్ల ఫ్యాన్సీ కార్ల నెంబర్ ప్లేట్లు, 21 ప్రత్యేకమైన మొబైల్ నెంబర్లను వేలం వేస్తున్నారు. అయితే ఇంతవరకు వేలంలో చాలా నెంబర్లు కోట్లలో అమ్ముడుపోయినా.. ఈ 7 నెంబర్ సిరీస్తో ఉన్న సిమ్పై మాత్రం తీవ్ర ఉత్కంఠ పోటీ తలెత్తింది. ప్రారంభంలోనే రూ. 22 లక్షల నుంచి మొదలై ఏకంగా చివరి రూ. 7 కోట్లకు అమ్ముడు పోడం విశేషం. అలాగే ఈ 5 సీరిస్(054-5555555) సిమ్పై కూడా తీవ్ర పోటీ ఏర్పడింది. ఈ సీరిస్ కూడా వేలంలో ఏకంగా రూ. 23 కోట్ల వరకు పలకడం విశేషం. మొత్తం ఈ ఫ్యాన్సీ నెంబర్లతో కూడిన మొబైల్ నెంబర్లు వేలంలో దాదాపు రూ. 86 కోట్లు దాకా వసూలు చేశాయి. అలాగే ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్లు కూడా ఈ వేలంలో రూ 65 కోట్లు దాక పలికాయి. గతేడాది కూడా ఇలా ఫ్యాన్సీ సిరీస్తో కూడిన నెంబర్ ప్లేట్లు ఏకంగా రూ. 124 కోట్లు పలికి దుబాయ్ పేరు వార్తల్లో నిలిచింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం సంపద బాగా ఉన్నవాళ్లే ఇలాంటి పనులకు పూనుకుంటారు. ఇదొక పిచ్చి, డబ్బు దుర్వినియోగం అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. In Dubai, a sim card with a unique phone number was sold for AED 3.2 Million ($871,412) in auction pic.twitter.com/lYQoW2OxZj — Historic Vids (@historyinmemes) April 2, 2024 (చదవండి: ఇసుక లేకుండానే ఇల్లు కట్టేయొచ్చట! ఎలాగో తెలుసా..!) -
మొబల్ నంబర్ పోర్టింగ్కు కొత్త రూల్
-
60 వేలమందికి మొబైల్ నెంబర్ ఇచ్చిన సీఈఓ - ఎందుకంటే?
సాధారణంగా ఒక కంపెనీ సీఈఓను కలవాలన్నా.. లేదా మాట్లాడాలన్నా పర్మిషన్ / అపాయింట్మెంట్ వంటి ప్రాసెస్ ఉంటాయి. కానీ ప్రముఖ స్పోర్ట్స్వేర్ కంపెనీ అడిడాస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 'బిజార్న్ గుల్డెన్' (Bjorn Gulden) ఇటీవల కంపెనీలో పనిచేసే 60000 మంది ఉద్యోగులకు తన మొబైల్ నెంబర్ ఇచ్చి ఆశ్చర్యపరిచారు. 2023 జనవరిలో అడిడాస్ కంపెనీ సీఈఓగా గుల్డెన్ బాధ్యతలు స్వీకరించిన సమయంలో సంస్థ కొన్ని ఆర్థిక నష్టాల్లో ఉండేది. అంతే కాకుండా అడిడాస్.. అమెరికన్ రాపర్ కాన్యే వెస్ట్తో సంబంధాలను తెంచుకుంది. అలాంటి ఒడిదుడుకులను దాటుకుంటూ కంపెనీ లాభాల్లో పయనించేలా చేసిన ఈయన పనిలో పారదర్శకతను పెంచడానికి తన మొబైల్ నెంబర్ ఇచ్చినట్లు వెల్లడించారు. గుల్డెన్ తన మొబైల్ నెంబర్ ఇచినప్పటి నుంచి 200 కాల్స్ వచ్చాయని.. వ్యాపారంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ఆ కాల్స్ ద్వారా వెల్లడించినట్లు తెలిపారు. 1990 తరువాత గుల్డెన్ అడిడాస్ వదిలి ప్యూమా కంపెనీలో చేరాడు. ఆ తరువాత 2023 జనవరిలో అడిడాస్కు తిరిగి వచ్చాడు. గుల్డెన్ తిరిగి కంపెనీయికి రావడంతో సంస్థ షేర్లు దాదాపు రెండింతలు పెరిగినట్లు తెలుస్తుంది. అంతే కాకుండా కంపెనీ ప్రత్యర్థి నైక్ కంటే మెరుగైన పనితీరు కనబరిచింది. ఇదీ చదవండి: టెక్ దిగ్గజాల్లో అలజడి.. నాలుగు కంపెనీలలో 50000 మంది స్వతహాగా ఫుట్బాల్ ఆటగాడైన గుల్డెన్.. కంపెనీలో అనేక మార్పులు చేశారు. సంస్థ ఉత్పత్తులను క్రికెట్ రంగానికి మరింత దగ్గర చేశారు. 2023లో భారత క్రికెట్ జట్టుతో బ్రాండ్ స్పాన్సర్షిప్ ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత, సంస్థ మూడు నెలల్లో భారతదేశంలో 6,00,00 జెర్సీలను విక్రయించింది. రాబోయే రోజుల్లో అడిడాస్ మరింత వృద్ధి సాదిస్తుందని పలువురు ఆశిస్తున్నారు. -
ఆరు గ్యారంటీలకు ఈ నంబర్తో లింక్
హైదరాబాద్: ప్రభుత్వం తలపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలకు అర్హత సాధించేందుకు ‘ఆధార్’ తప్పనిసరిగా కావడంతో కొత్తగా నమోదు, అప్డేషన్ కోసం ఉరుకులు పరుగులు ప్రారంభమయ్యాయి. ఆధార్ అనుసంధానం గుర్తింపులో ఎటువంటి ఇబ్బందులూ రాకుండా, సులభంగా ప్రక్రియ పూర్తి అయ్యేందుకు అప్డేషన్ చేయాల్సిందే. దీంతో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఆధార్ కేంద్రాల ఎదుట భారీ సంఖ్య జనం బారులు తీరుతున్నారు. వివాహం కావడం, ఇంటి పేరు, కేరాఫ్, చిరునామా, ఉద్యోగ, ఉపాధి రీత్యా, నివాసం, మొబైల్ నంబర్ మారడంతో అప్డేషన్ ఆవశ్యకత ఎదురైంది. తాజాగా ఆరు గ్యారంటీల నేపథ్యంలో ఆధార్ నవీకరించుకునేందుకు పోటెత్తుతున్నారు. అన్నింటికీ ఇదే ఆధారం.. అన్నింటికీ ‘ఆధార్’ ఆధారమవుతోంది. పూరి గుడిసెల్లో నివసించే నిరుపేదల నుంచి విలాసవంతమైన భవంతుల్లో జీవించే సంపన్నుల వరకు తప్పనిసరిగా మారింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ తప్పకుండా కావాల్సింది ఆధార్ కార్డు. ఎందుకంటే.. ప్రతి పౌరుడికి భారత ప్రభుత్వం కేటాయించే విశిష్ట గుర్తింపు సంఖ్య ఉంటుంది. అది బహుళ ప్రయోజనకారిగా మారి ప్రతిదానికీ ఆధారంతో పాటు అనుసంధానమవుతోంది. ప్రభుత్వ పనులైనా.. ప్రైవేటు పనులు ముందుకు సాగాలంటే ఆధార్ నంబర్ ఉండాల్సిందే.. ప్రతి కుటుంబానికి నిత్యవసరమైన వంట గ్యాస్, మొబైల్ సిమ్ కనెక్షన్ నుంచి పిల్లల స్కూల్లో అడ్మిషన్, స్థిర, చర ఆస్తుల రిజి్రస్టేషన్లు. ప్రభుత్వ పథకాలైన రేషన్ కార్డు, సామాజిక పింఛ¯న్, స్కాలర్ షిప్తో పాటు బ్యాంకింగ్, బీమా తదితర అన్నింటికీ ఆధార్ తప్పనిసరి. పన్నులు తదితర పనులకూ ఆధార్ అవసరమే.. అంచనా జనాభా కంటే.. విశ్వనగరంగా విస్తరిస్తున్న హైదరాబాద్లో అంచనా జనాభా కంటే ఆధార్ నమోదు సంఖ్య దాటింది. ఇతర రాష్ట్రాలు నుంచి బతుకుదెరువు కోసం వలస వచ్చి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్న వారితో ఆధార్ నమోదు సంఖ్య ఎగబాకుతోంది. మహా నగరంలో ఏటా జనాభా వృద్ధి రేటు 8 నుంచి 12 శాతానికిపైగా పెరుగుతోంది. 2023 చివరి నాటికి అంచనా జనాభా ప్రకారం 1.50 కోట్లకు చేరగా.. దానికి మించి ఆధార్ నంబర్లు సంఖ్య జారీ అయినట్లు యూఐడీఏఐ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మహానగరానికి వలస వస్తున్నవారిలో సుమారు 34 శాతం ఇక్కడే స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో జనాభాకు అనుగుణంగా ఆధార్ నమోదు సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. గతేడాది కాలంగా ఆధార్ నమోదు సంఖ్య బాగా ఎగబాకింది. ఆధార్ విశిష్ట గుర్తింపు సంఖ్య పొందిన వారిలో మహిళలు పురుషులతో సమానంగా ఉన్నట్లు యూఐడీఏఐ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. -
ఇక ప్రత్యేక గుర్తింపుతోనే మొబైల్ నంబర్!
సాక్షి, అమరావతి: సైబర్ వేధింపులు, ఆన్లైన్ మోసాలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపడుతోంది. ప్రతి మొబైల్ ఫోన్ వినియోగదారునికి ‘యూనిక్ ఐడీ(ప్రత్యేక గుర్తింపు) నంబర్’ కేటాయించాలని నిర్ణయించింది. ఓ వ్యక్తికి ఎన్ని మొబైల్ ఫోన్లు ఉన్నా, ఎన్ని సిమ్ కార్డులు ఉన్నా సరే.. ఐడీ నంబర్ మాత్రం ఒకటే ఉండేలా కార్యాచరణను రూపొందించింది. ఈ ఏడాది చివరినాటికే ఈ ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించింది. జనాభా కంటే సిమ్కార్డులే అధికం..! మొబైల్ టెక్నాలజీ ప్రజలకు ఎంత సౌలభ్యంగా ఉందో.. సైబర్ నేరస్తులకు అంత ఉపయోగకరంగా మారిందన్నది వాస్తవం. దేశంలో అత్యధిక ప్రాంతాల్లో జనాభా కంటే మొబైల్ ఫోన్లు/సిమ్ కార్డులే అధికంగా ఉండటం గమనార్హం. 2022 డిసెంబర్ నాటికి దేశంలో 114 కోట్ల మొబైల్ కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో బీఎస్ఎన్ఎల్ కనెక్షన్లు 10.7 కోట్లుండగా.. ప్రైవేటు టెలికాం కంపెనీల కనెక్షన్లు 102 కోట్లకుపైనే ఉన్నాయి. దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న టెలికాం నిబంధనల మేరకు జమ్మూ–కశీ్మర్, ఈశాన్య రాష్ట్రాల్లో మినహా మిగిలిన చోట్ల ఒక వ్యక్తి పేరిట గరిష్టంగా 9 సిమ్ కార్డులు ఉండవచ్చు. జమ్మూ–కశీ్మర్, ఈశాన్య రాష్ట్రాల్లో గరిష్టంగా 6 సిమ్ కార్డులు ఉండవచ్చు. కానీ ప్రైవేటు టెలికాం కంపెనీల ఫ్రాంచైజీలు కొన్ని సిమ్ కార్డుల విక్రయంలో నిబంధనలను పాటించడం లేదు. దీంతో సైబర్ నేరస్తులు వేర్వేరు పేర్లతో ఫోన్ కనెక్షన్లు, సిమ్ కార్డులు తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. 2022లో భారత్లో జరిగిన సైబర్ మోసాలు, వేధింపుల్లో 65 శాతం దొంగ సిమ్కార్డులతో చేసినవేనని నేషనల్ సైబర్ సెల్ నివేదిక వెల్లడించింది. వేర్వేరు పేర్లతో సిమ్ కార్డులు తీసుకొని ఆన్లైన్ మోసాలకు పాల్పడటంతో పాటు సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ పెట్టి మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారని ఆ నివేదిక పేర్కొంది. 2022లో దేశంలో నమోదైన మొత్తం నేరాల్లో.. సోషల్ మీడియాకు సంబంధించినవే 12 శాతం ఉండటం గమనార్హం. 14 అంకెలతో యూనిక్ ఐడీ నంబర్.. సోషల్ మీడియా వేధింపులు, ఆన్లైన్ మోసాల కట్టడికి దేశంలో మొబైల్ ఫోన్ల కనెక్షన్ల వ్యవస్థను గాడిలో పెట్టాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. టెలికాం శాఖతో కలసి కార్యాచరణను రూపొందించింది. మొబైల్ వినియోగదారులు అందరికీ యూ నిక్ ఐడీ నంబర్ కేటాయించాలని నిర్ణయించింది. ఇది 14 అంకెలతో ఉండనుంది. ఓ వ్యక్తి పేరిట ఎన్ని ఫోన్ కనెక్షన్లు ఉన్నా సరే యూనిక్ ఐడీ నంబర్ మా త్రం ఒక్కటే ఉంటుంది. దేశంలో ఎక్కడ సిమ్ కార్డు కొనుగోలు చేసినా.. ఏ ప్రాంతంలో ఫోన్ను ఉపయోగిస్తున్నా సరే యూనిక్ ఐడీ నంబర్ మాత్రం అదే ఉంటుంది. వినియోగదారుల ఫోన్కు మెసేజ్ పంపించి.. ఓటీపీ ద్వారా నిర్ధారించి.. యూనిక్ ఐడీ నంబర్ కేటాయించాలని కేంద్ర టెలికాం శాఖ భావిస్తోంది. త్వరలో మార్గదర్శకాలు జారీ చేయనుంది. ‘అస్త్ర’ అప్డేట్.. సిమ్కార్డు మోసాలను అరికట్టేందుకు ఉద్దేశించిన కేంద్ర టెలికాం శాఖకు చెందిన ‘అస్త్ర’ సాఫ్ట్వేర్ను ఆధునీకరించనున్నారు. మొబైల్ కనెక్షన్ల కోసం సమర్పించిన గుర్తింపు కార్డులు, ఫొటోలు సక్రమంగా ఉన్నాయో, లేదో గుర్తించడంతోపాటు సంబంధిత దరఖాస్తుదారులకు అప్పటికే యూనిక్ ఐడీ నంబరు కేటాయించారా, లేదా అనే విషయాలను కూడా ఈ సాఫ్ట్వేర్ ద్వారా పరిశీలించనున్నారు. తద్వారా నకిలీ సిమ్కార్డులు, వేర్వేరు పేర్లతో ఉన్న సెల్ఫోన్ కనెక్షన్లకు చెక్ పెడతాఱు. ఈ విధానం ద్వారా ఎక్కడైనా సైబర్ కేసు నమోదవ్వగానే.. నిందితులను సులభంగా గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ సిమ్ కార్డు ఎవరి పేరుతో ఉంది.. యూనిక్ ఐడీ నంబర్తో సరిపోలుతోందా, లేదా అనే విషయాలను నిర్ధారించవచ్చని పేర్కొన్నారు. -
మొబైల్ నంబర్.. మీకు నచ్చినట్టు..
ఈరోజుల్లో ప్రతిఒక్కరికీ మొబైల్ ఫోన్ ఉంటుంది. ఫోన్ లేనివారు ఉండటం చాలా అరుదు. ఇప్పుడన్నీ డ్యుయల్ సిమ్ ఫోన్ కావడంతో చాలా మందికి రెండు ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయి. ఇంకొంత మందికి అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఏదైనా టెలికామ్ సంస్థ నుంచి కొత్తగా సిమ్ తీసుకుంటున్నప్పుడు చాలామంది తమకు నచ్చిన కస్టమైజ్డ్ మొబైల్ నంబర్లను ఇష్టపడతారు. కొంతమందికి ప్రత్యేకమైన ఇష్టమైన నంబర్లు ఉంటే, మరికొందరు కొన్ని నంబర్లను అదృష్టంగా భావిస్తారు. ఇలా మంచి నంబర్ల కలయిక కోసం శోధిస్తారు. అయితే తమకు కావలసిన నంబర్ కాంబినేషన్లను ఎంచుకునే అవకాశం ఉందని చాలా మందికి తెలియదు. వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్, రిలయన్స్తో సహా భారతీయ టెలికాం మార్కెట్లోని కొన్ని కంపెనీలు ఆసక్తిగల సబ్స్క్రైబర్లకు వారికి నచ్చిన మొబైల్ నంబర్ల నిర్దిష్ట అంకెలను అందిస్తున్నాయి. వీటిలో రిలయన్స్ జియో తక్కువ ధరకే ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ కస్టమర్లకు కావాల్సిన నిర్దిష్టమైన మొబైల్ నంబర్లను అందిస్తోంది. ఈ ఛాయిస్ నంబర్ స్కీమ్ ద్వారా కస్టమర్లు పూర్తి నంబర్ను ఎంచుకోలేనప్పటికీ తమ కొత్త జియో నంబర్లోని చివరి 4 నుంచి 6 అంకెలను ఎంచుకోవచ్చు. -
ది కేరళ స్టోరీ నటికి బిగ్ షాక్.. ఆ వివరాలు లీక్ చేసిన నెటిజన్!
ఆదా శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులు సృష్టించింది. తాజాగా ఇటీవల రూ.200 కోట్ల క్లబ్లో చేరింది. సుదీప్తోసేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఊహించని వసూళ్లు రాబడుతూ అద్భుతాలు సృష్టిస్తోంది. ఈ మూవీ విడుదలకు ముందు కొన్ని వివాదాలు చుట్టిముట్టినా అవేవీ సినిమాపై పెద్దగా ప్రభావితం చూపలేకపోయాయి. విపుల్ షా నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా మే 5న విడుదలైంది. (ఇది చదవండి: 'ది కేరళ స్టోరీ' ప్రభంజనం.. ఆలియా భట్ సినిమా రికార్డ్ బ్రేక్!) తాజాగా ఆదా శర్మకు మరో షాక్ తగిలింది. సోషల్ మీడియా ద్వారా ఓ వ్యక్తి ఆమె వ్యక్తిగత వివరాలను లీక్ చేశారు. అదా శర్మ ఫోన్ నంబర్ను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఈ సంఘటన తర్వాత అదా శర్మకు వేధింపులు ఎక్కువయ్యాయని తెలుస్తోంది. అయితే ఆదా శర్మ వివరాలు షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ యూజర్ అకౌంట్ను వెంటనే డీ యాక్టివేట్ చేశారు. అంతే కాకుండా ఆమె కొత్త కాంటాక్ట్ నంబర్ను లీక్ చేస్తానని బెదిరించినట్లు సమాచారం. (ఇది చదవండి: ఉపాసనకు ప్రెగ్నెన్సీ.. రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్!) కాగా.. ఆదా శర్మ, దర్శకుడు సుదీప్తో సేన్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ది కేరళ స్టోరీ బృందం కరీంనగర్లో జరిగే హిందూ ఏక్తా యాత్రలో పాల్గొనాల్సి ఉండగా.. రోడ్డు ప్రమాదం జరగడంతో విరమించుకున్నారు. ఈ విషయాన్ని ఆదా శర్మ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. -
ఏ మొబైల్ నెంబర్ ఆధార్ కి లింక్ అయ్యిందో.. ఇప్పుడు మీ మొబైల్ లోనే ఇలా చూసుకోవచ్చు
-
ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ మర్చిపోయారా? డోంట్ వర్రీ.. ఇలా తెలుసుకోండి!
న్యూఢిల్లీ: ఆధార్కు లింక్ అయిన ఈమెయిల్, మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ధ్రువీకరించే సదుపాయాన్ని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ (యూఐడీఏఐ) ప్రకటించింది. ఆధార్ వెబ్సైట్, మొబైల్ యాప్ నుంచే వీటి ధ్రువీకరణకు అవకాశం కల్పించినట్టు పేర్కొంది. కొంత మంది యూజర్లకు తమ మొబైల్ నంబర్లలో ఏది ఆధార్తో సీడ్ అయిందనే విషయమై అవగాహన ఉండడం లేదని యూఐడీఏఐ గుర్తించింది. దీంతో ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘ఆధార్ ఓటీపీ వేరొక మొబైల్ నంబర్కు వెళుతుందని కొందరు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ప్రకటించిన సదుపాయంతో ఆధార్కు ఏ మొబైల్ నంబర్ సీడ్ అయిందో తెలుసుకోవచ్చు. ఆధార్ అధికారిక వెబ్సైట్ లేదా ఎంఆధార్ యాప్లో ‘వెరిఫై ఈమెయిల్/మొబైల్ నంబర్’ను క్లిక్ చేయడం ద్వారా ఈ సదుపాయం పొందొచ్చు’’అని యూఐడీఏఐ పేర్కొంది. ఏదైనా మొబైల్ నంబర్ సీడ్ అవ్వకపోతే అదే విషయాన్ని సూచిస్తుందని, దాంతో మొబైల్ నంబర్ అప్డేషన్కు చర్యలు తీసుకోవచ్చని తెలిపింది. అప్పటికే మొబైల్ నంబర్ ధ్రువీకరించి ఉంటే, అదే విషయం తెలియజేస్తుందని వెల్లడించింది. ఆధార్ తీసుకునే సమయంలో ఏ నంబర్ ఇచ్చామో గుర్తు లేనివారు, సంబంధిత మొబైల్ నంబర్ చివరి మూడు నంబర్లను నమోదు చేయడం ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొంది. ఒకవేళ ఈ మెయిల్/ మొబైల్ నంబర్ లింక్ చేసుకోవాలంటే సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించొచ్చని సూచించింది. ఆధార్ ధ్రువీకరణ చేపట్టేందుకు 22 సంస్థలకు అనుమతి కాగా క్లయింట్ల ధ్రువీకరణను ఆధార్ ఆధారితంగా నిర్ధారించుకునేందుకు 22 ఆర్థిక సేవల సంస్థలకు అనుమతి లభించింది. ఈ 22 కంపెనీలు ఇప్పటికే మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద రిపోర్టింగ్ ఎంటెటీలుగా (కేంద్ర ప్రభుత్వ విభాగాలకు సమాచారం అందించేవి)గా ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ తన నోటిఫికేషన్లో పేర్కొంది. (ఇదీ చదవండి: ఒక్క హాయ్ మెసేజ్.. రూ. 10 లక్షలు లోన్ - ట్రై చేసుకోండి!) ఇవి తమ క్లయింట్ల గుర్తింపు ధ్రువీకరణను ఆధార్ సాయంతో చేపట్టేందుకు అనుమతించినట్టు ప్రకటించింది. ఇలా అనుమతులు పొందిన వాటిల్లో గోద్రేజ్ ఫైనాన్స్, అమెజాన్ పే (ఇండియా), ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్, టాటా మోటార్స్ ఫైనాన్స్ సొల్యూషన్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, మహీంద్రా రూరల్ హౌసింగ్ ఫైనాన్స్ ఉన్నాయి. బ్యాంకులు తమ కస్టమర్ల గుర్తింపును ఆధార్ సాయంతో ధ్రువీకరించేందుకు ఇప్పటికే అనుమతి ఉంది. -
ఆధార్ ఓటీపీ మీ మొబైల్ నంబర్కే వస్తోందా?
ఆధార్ కార్డులకు సంబంధించి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. కార్డుదారులు ఇప్పుడు తమ ఆధార్తో సీడ్ చేసిన మొబైల్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలను ధ్రువీకరించవచ్చు. దీంతో తమ ఆధార్ OTP వేరే మొబైల్ నంబర్కు వెళ్తుందన్న ఆందోళన ఇక అక్కర్లేదు! ఇదీ చదవండి: iPhone 14 Offers: ఐఫోన్14పై ఆఫర్లే ఆఫర్లు.. ఫ్లిప్కార్ట్, అమెజాన్తో పాటు మరో సంస్థలోనూ భారీ డిస్కౌంట్లు! కార్డుదారులు తమ ఆధార్కు సీడ్ చేసిన మొబైల్ నంబర్ల గురించి కొన్ని సందర్భాల్లో తెలియక ఇబ్బందులు పడుతుంటారు. దీనివల్ల OTP వేరే మొబైల్ నంబర్కు వెళుతోందేమోనని ఆందోళన చెందుతుంటారు. ఈ ఇబ్బందులను గుర్తించిన యూఐడీఏఐ కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. దీంతో ఆధార్ కార్డ్ హోల్డర్లు సీడెడ్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలను సులభంగా చెక్ చేసుకోవచ్చని ఐటీ మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ఆధారంగా ఐఎఎన్ఎస్ ఈ మేరకు నివేదించింది. ఇలా వెరిఫై చేయండి కార్డుదారులు యూఐడీఏఐ అధికారిక వెబ్సైట్ (https://myaadhaar.uidai.gov.in/) లేదా mAadhaar యాప్ ద్వారా ఈ కొత్త ఫీచర్ను ఉపయోగించవచ్చు. వెబ్సైట్ లేదా యాప్ లోకి వెళ్లిన తర్వాత 'వెరిఫై ఈమెయిల్/మొబైల్ నంబర్' ట్యాబ్ను క్లిక్ చేసి తమ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్లను ధ్రువీకరించవచ్చు. ఒకవేళ మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీలో మార్పులు ఉంటే దగ్గరలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించవచ్చు. ఇదీ చదవండి: FASTag Record: ఒక్క రోజులో రూ.1.16 కోట్లు.. ఫాస్ట్ట్యాగ్ వసూళ్ల రికార్డు -
వినూత్న నిర్ణయం.. పోలీసులకు శాశ్వత ఫోన్ నంబర్లు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పోలీసుశాఖ మరో వినూత్న నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చింది. డిపార్ట్మెంటులో ప్రతి పోలీసు అధికారికి శాశ్వత సెల్ఫోన్ నెంబర్ను కేటాయించింది. ఇందుకోసం దాదాపు 55 వేల మంది సిమ్కార్డులను కొనుగోలు చేసింది. కరీంనగర్, రామగుండం, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలతోపాటు అన్ని కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాలు, ఇతర వింగ్స్ ప్రధాన కార్యాలయాలకు సిమ్కార్డులు చేరుకున్నాయి. ఇప్పటికే సగానికిపైగా పోలీసు అధికారులు సిమ్కార్డులను పొందగా మిగిలిన సిబ్బందికి ఈ వారాంతంలోగా అందజేయనున్నారు. పోలీసుల విధి నిర్వహణలో ఎక్కడా కమ్యూనికేషన్లో ఇబ్బంది రావద్దన్న ఉద్దేశంతోనే పోలీసులందరికీ శాశ్వత సెల్ఫోన్ నంబర్లు ఇవ్వాలని డీజీపీ అంజనీకుమార్ ఇటీవల నిర్ణయించారు. ఏంటి లాభాలు? కానిస్టేబుల్ మొదలు డీజీపీ స్థాయి అధికారి దాకా అందరికీ ఇస్తున్న శాశ్వత నంబర్లను వారి హెచ్ఆర్ఎంఎస్, బ్యాంకు ఖాతా, పీఎఫ్లకు అనుసంధానిస్తున్నారు. ఫలితంగా ఇకపై వ్యక్తిగత నంబర్ను వాటికి అనుంసంధానించే బాధ తప్పుతుంది. విధుల్లో చేరిన తొలిరోజు నుంచి రిటైరయ్యే రోజు వరకు ఫోన్ నంబర్ ఉద్యోగితోనే ఉంటుంది. అదే సమయంలో ఉన్నతాధికారులు ఫలానా అధికారి ఎక్కడ పనిచేస్తున్నాడో తెలుసుకొనేందుకు అతని ఎంప్లాయ్ ఐడీ ద్వారా సులువుగా గుర్తించవచ్చు. క్షణాల్లో అతని నంబర్ ఉన్నతాధికారి సెల్ఫోన్పై ప్రత్యక్షమవుతుంది. అంటే ఏ అధికారి ఎక్కడ ఉన్నా.. వెంటనే అతనితో ఉన్నతాధికారులు సంప్రదించి ఆదేశాలు ఇచ్చే వీలుంటుంది. అదే సమయంలో వారు స్టేషన్ లేదా వింగ్, టీములు మారినప్పుడు సంబంధిత ఫోన్ నంబర్ ఎలాగూ ఉంటుంది. ఉదాహరణకు ఒక ఎస్సైకి డిపార్ట్మెంటు ఇచ్చే శాశ్వత నంబర్తోపాటు అతను పనిచేసే స్టేషన్లో ఎస్సైకి ఇచ్చే మరో నంబర్ను వినియోగించాల్సి ఉంటుంది. మారిన నెట్వర్క్.. పోలీసులను వేగవంతమైన నెట్వర్క్తో అనుసంధానించేందుకు పోలీసు శాఖ బీఎస్ఎన్ఎల్ నుంచి ఎయిర్టెల్కు మారింది. అది కూడా అత్యాధునిక 5జీ నెట్వర్క్తో. ఈ సిమ్ ఎంప్లాయి ఐడీతో వస్తుంది. ప్రతి అధికారికి రోజుకు 2 జీబీ, 100 ఉచిత ఎస్ఎంఎస్లు చేసుకునే సదుపాయం ఉంటుంది. తాము వాడే చాలా యాప్స్ డేటాను అధికంగా తీసుకుంటున్నాయని... 5జీకి మారాక యాప్స్ మరింత సమర్థంగా పనిచేస్తున్నాయని ఉమ్మడి కరీంనగర్ జిల్లా పోలీసు అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో మావోయిస్టుల కదలికలను పసిగట్టే పోలీసులకు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, భారీ ప్రమాదాలు జరిగినప్పుడు ఏ అధికారిని ఆదేశించాలన్నా ఈ విధానం వల్ల క్షణాల్లో సంప్రదించడం సాధ్యం కానుందని చెబుతున్నారు. -
SBI: మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి.. బ్యాంకుకి వెళ్లకుండా!
ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్ ఉన్నవారందరూ లావాదేవీలను గురించి తెలుసుకోవడానికి నేరుగా బ్యాంకుకి వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించుకోవడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సేవింగ్స్ ఖాతాతో మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకోవాలి. అన్ని లావాదేవీలను ట్రాక్ చేయడానికి రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్లను వారి సేవింగ్స్ బ్యాంక్ ఖాతాకు లింక్ చేసుకోవాలి, ఇలా చేసుకున్నప్పుడు తమ అకౌంట్ ద్వారా జరిగే అన్ని ట్రాన్సక్షన్స్ గురించి వెంటనే సమాచారం తెలుసుకోవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుండి మొబైల్ నెంబర్ అప్డేట్: మొదట www.onlinesbi.com ఓపెన్ చేయండి. మీ మొబైల్ నెంబర్ మార్చుకోవడానికి, పేజీ ఎడమ పానెల్లో ఉన్న 'మై అకౌంట్' విభాగంలోని ''ప్రొఫైల్ - పర్సనల్ డీటైల్స్ - చేంజ్ మొబైల్ నెంబర్'' ఎంపిక చేసుకోండి. అకౌంట్ నెంబర్ను సెలక్ట్ చేసుకున్న తరువాత, మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి, క్రింది స్క్రీన్పై సబ్మిట్పై క్లిక్ చేయండి. మీకు రిజిస్టర్డ్ నంబర్ చివరి రెండు అంకెలను కనిపిస్తాయి. మ్యాపింగ్ స్టేటస్ తెలియజేయడానికి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉపయోగపడుతుంది. ఏటీఎమ్ నుండి మొబైల్ నెంబర్ అప్డేట్: మీ సమీపంలో ఉన్న SBI ATM వద్దకు వెళ్లి, అందుబాటులో ఉన్న ఎంపికల నుండి రిజిస్టర్ ఎంపికను సెలక్ట్ చేసుకోండి. మీ ఏటీఎమ్ పిన్ని టైప్ చేసుకోండి. తరువాత స్క్రీన్పై కనిపించే మెను ఆప్షన్స్ నుండి మొబైల్ నెంబర్ ఎంటర్ ఎంచుకోండి. స్క్రీన్పై ఉన్న మెను ఎంపికల నుండి, చేంజ్ మొబైల్ నెంబర్ ఆప్షన్ ఎంచుకోండి. గతంలో ఉపయోగిస్తున్న మీ మునుపటి మొబైల్ నెంబర్ను తప్పనిసరిగా ఎంటర్ చేసి ధృవీకరించాలి. తరువాత మీ కొత్త మొబైల్ నెంబర్ను నమోదు చేసి ధృవీకరించమని చెబుతుంది. కొత్త నెంబర్, పాత మొబైల్ నెంబర్ రెండింటికి వేరువేరుగా OTPలు వస్తాయి. ఓటీపీ ఎంటర్ చేసిన తరువాత మీ మొబైల్ నెంబర్ అప్డేట్ అవుతుంది. -
ఉద్యోగులకు చెల్లింపుల్లో రెండంచెల భద్రత
సాక్షి, అమరావతి: రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగులకు ఆన్లైన్ చెల్లింపుల్లో రెండంచెల భద్రతా వ్యవస్థను అమల్లోకి తీసుకువస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎఫ్ఎంఎస్/హెర్బ్ అప్లికేషన్స్ ద్వారా చేసే లావాదేవీలకు రెండంచెల భద్రతను తప్పనిసరి చేసింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ సేవలు పూర్తి సురక్షితంగా అందించేలా సీఎఫ్ఎంఎస్ ఐడీ ఉన్న ప్రతి ఉద్యోగి, పెన్షనర్లు, వ్యక్తులు తమ సీఎఫ్ఎంఎస్ ఐడీని ఆధార్, మొబైల్ నంబర్తో అనుసంధానం చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. సీఎఫ్ఎంఎస్ /హెర్బ్ అప్లికేషన్స్లో సురక్షితంగా లాగిన్ అవడానికి ఆధార్తో అనుసంధానం అయిన మొబైల్ ఫోన్కు వచ్చే వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) నమోదును తప్పనిసరి చేసింది. దీనికి అనుగుణంగా ప్రతి ఉద్యోగి ఈకేవైసీ, ఆధార్, మొబైల్ నంబర్ల పరిశీలనను జనవరి 20 నాటికి పూర్తి చేయాలని సంబంధిత శాఖల డీటీఏలు, పీఏవో, ఏపీసీఎఫ్ఎస్ఎస్ సీఈవో చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. -
పేటీఎం యూజర్లకు బంపర్ ఆఫర్: ఈ విషయం తెలుసా మీకు?
సాక్షి,ముంబై: దేశీయ ఆన్లైన్ చెల్లింపుల సంస్థ పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. పేటీఎం వినియోగదారులు యూపీఐ ద్వారా ఏ మొబైల్ నంబరుకైనా డిజిటల్ చెల్లింపు చేయవచ్చు. అంతేకాదు రిసీవర్ పేటీఎంలో రిజిస్టర్ కాక పోయినా కూడా వారి యూపీఐ ఐడీద్వారా ఏదైనా మొబైల్ నంబర్కు డబ్బు పంపవచ్చు లేదా స్వీకరించ వచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకోసం రిజిస్టర్డ్ UPI IDతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సార్వత్రిక డేటాబేస్ను యాక్సెస్కు, యూపీఎల్ చెల్లింపులకు అనుమతి పొందినట్టు తెలిపింది. (వన్ప్లస్ ప్రీమియం స్మార్ట్ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇదే లక్కీ చాన్స్!) పేటీఎం యూపీఐ ద్వారా నగదు ఎలా పంపాలి ♦ Paytm యాప్లోని ‘UPI మనీ ట్రాన్స్ఫర్’ విభాగంలో, ‘ టూ UPI యాప్స్’ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ♦ ఇక్కడ మొబైల్ నంబర్ను నమోదు చే గ్రహీత మొబైల్ నంబర్ను నమోదు చేయాలి. ♦ నగదును నమోదు చేసి, తక్షణ నగదు బదిలీ కోసం ‘పే నౌ ’ బటన్ క్లిక్ చేయాలి. యూపీఐ నెట్ వర్క్ ఇదొక కీలక పరిణామామని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ప్రతినిధి తెలిపింది. ఇది తమ వినియోగదారులుమ రింత మంది వినియోగదారులు ఏదైనా UPI యాప్ ద్వారా డబ్బు పంపడానికి, స్వీకరించడానికి వీలు కల్పిస్తుందని, అంతరాయం లేని, సురక్షితమైన చెల్లింపులకవసరమైన బలమైన మౌలిక సదుపాయాలను వినియోగదారులకు అందిస్తున్నట్టు తెలిపారు. (ఎయిర్టెల్ యూజర్లకు భారీ షాక్! ఇక కనీస రీచార్జ్ ప్లాన్ ఎంతంటే?) కాగా ఎన్పీసీఐ తాజా నివేదిక ప్రకారం, పేటీఎం లబ్ధిదారు బ్యాంకుగా PPBL 1,614 మిలియన్ లావాదేవీలను నమోదు చేసింది, రెమిటర్ బ్యాంక్గా, అక్టోబర్ 2022లో 362 మిలియన్లకు పైగా లావాదేవీలను నమోదు చేసింది.అలాగే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ UPI లావాదేవీల పరిమాణంలో అతిపెద్ద లబ్ధిదారుల బ్యాంక్గా టాప్లో ఉంది. అక్టోబర్ 2022లో 1,614 మిలియన్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు కంపెనీ పేర్కొంది. -
ఆధార్ కార్డ్లో ఆ అప్డేట్ చాలా ముఖ్యం, చేయకపోతే చిక్కులు తప్పవండోయ్!
ఆధార్ కార్డ్.. ఇటీవల ప్రజలకు ఇది గుర్తింపు కార్డ్లా మాత్రమే కాకుండా జీవితంలో ఓ భాగమైందనే చెప్పాలి. ఎందుకంటే బ్యాంకు అకౌంట్ తెరవడం, పర్సనల్, ఇంటి రుణాల కోసం, సంక్షేమ పథకాల కోసం, ఉద్యోగం కోసం.. ఇలా చెప్తూ పోతే పెద్ద జాబితానే ఉంది. ఆర్థిక లావాదేవీలలో ముఖ్యమైన బ్యాంక్, పాన్ కార్డ్లకు ఆధార్ కార్డ్ని అనుసంధానించిన తర్వాత దీని ప్రాముఖ్యత మరింత పెరిగింది. అందుకే ఈ కార్డులో ఏ తప్పులు లేకుండా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా కార్డుదారులు ఆఫర్లు, సర్వీస్లను, లేదా మొబైల్ పోయిన తరచూ ఫోన్ నెంబర్లను మారుస్తుంటారు. ఆ తర్వాత ఏదో పనిలో పని కొత్త నెంబర్ను ఆధార్లో అప్డేట్ చేయడం మరిచిపోతుంటారు. ఆపై భవిష్యత్తులో డిజిటల్ బ్యాంక్ అకౌంట్స్, డీమ్యాట్ అకౌంట్స్ వంటితో పాటు ఆర్థిక లావాదేవీలకు సంబందించిన వాటిలో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే ఇబ్బందులు రాకుండా ఆధార్లో ఫోన్ నంబర్ ఈ విధంగా ఈజీగా అప్డేట్ చేసేయండి. 1: ముందుగా, మీరు అధికారిక UIDAI వెబ్సైట్ లేదా మీ సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రాన్ని వెళ్లాల్సి ఉంటుంది. 2: ఆపై ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్లో అధికారిక ఎగ్జిక్యూటివ్ని కలిసి అతని వద్ద నుంచి ఆధార్ ఎన్రోల్మెంట్ ఫారంని తీసుకోవాలి. 3: ఎగ్జిక్యూటివ్కు ఆధార్ ఎన్రోల్మెంట్ ఫారంను నింపి, సమర్పించాలి. 4: ఎగ్జిక్యూటివ్ బయోమెట్రిక్ సమాచారం ద్వారా మీ వివరాలను ధృవీకరిస్తారు. 5: మీ కొత్త ఫోన్ నంబర్ వివరాలు, లేదా మీరు కోరిన విధంగా మార్పులు చేస్తాడు. 6: ఈ మార్పులను ఆధార్ అధికారిక సైట్లలో అప్డేట్ చేశాక, ఈ సేవకు రుసుము చెల్లించాలి. 7: మీరు సంబంధిత అధికారి నుంచి అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ పొందుతారు. ఆ స్లిప్లో ఒక అప్డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN) ఉంటుంది. దీని ద్వారా మీ ఆధార్ కార్డు రిక్వెస్ట్ స్టేటస్ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవచ్చు. చివరగా మీ ఫోన్ నంబర్ అప్డేట్ లేదా మీ వివరాలు అప్డేట్ అయిన తర్వాత, మీరు అధికారిక UIDAI వెబ్సైట్ నుంచి ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆపై రుసుము చెల్లించి ఆధార్ కార్డ్ PVC ప్రింట్ను కూడా ఆర్డర్ చేయవచ్చు. చదవండి: దీపావళి కళ్లు చెదిరే అఫర్లు.. కారు కొంటే రూ.లక్ష తగ్గింపు! -
స్మార్ట్ఫోన్ అమ్మకాల్లో కొత్త రూల్స్ వచ్చాయ్.. ఇది తప్పనిసరి!
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ల అమ్మకానికి ముందే ఐఎంఈఐ నంబర్ నమోదు తప్పనిసరి చేస్తూ టెలికం శాఖ ఆదేశాలు వెలువరించింది. 2023 జనవరి 1 నుంచి కొత్త నిబంధన అమలులోకి రానుంది. దేశీయంగా తయారైన లేదా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న మొబైల్స్కూ ఈ నిబంధన వర్తిస్తుంది. అమ్మకానికి ముందే టెలికం శాఖకు చెందిన ఇండియన్ కౌంటర్ఫీటెడ్ డివైస్ రెస్ట్రిక్షన్ పోర్టల్ నుంచి ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ (ఐఎంఈఐ) నంబర్ ధ్రువీకరణ పొందాల్సిందే. ప్రతి మొబైల్కూ 15 అంకెల ఐఎంఈఐ సంఖ్య ఉంటుంది. మొబైల్ పరికరాల గుర్తింపు సంఖ్యను తారుమారు చేయడాన్ని నిరోధించేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. టెలికం నెట్వర్క్లో ఒకే ఐఎంఈఐతో నకిలీ పరికరాలు ఉండటం వల్ల పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను ట్రాక్ చేయడం సాధ్యం కావడం లేదు. కోల్పోయిన లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయడానికి, ట్రేస్ చేయడానికి సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ప్రాజెక్ట్ను ప్రభుత్వం ప్రారంభించింది. అలాంటి హ్యాండ్సెట్ల విస్తరణను అరికట్టడానికి నకిలీ పరికరాల నియంత్రణకై ఇండియన్ కౌంటర్ఫీటెడ్ డివైస్ రెస్ట్రిక్షన్ వ్యవస్థను జోడించింది. దొంగిలించబడిన, పోగొట్టుకున్న మొబైల్స్ను నిరోధించే సౌకర్యం మాత్రమే ప్రస్తుతం పోర్టల్లో అందుబాటులో ఉంది. చదవండి: బ్లాక్ బస్టర్ హిట్: రికార్డు సేల్స్, నిమిషానికి వేలల్లో, ఒకే రోజున 87 లక్షలు! -
ఈ-కేవైసీ నమోదులో కొత్త సమస్యలు.. ఆధార్కు లింకు కాని ఫోన్ నంబర్లు
నర్వ (నారాయణ్పేట్ జిల్లా): రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ.6 వేలను మూడు విడతల్లో అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో నమోదైన రైతులు తప్పనిసరిగా ఈ నెలాఖరులోగా ఈకేవైసీని చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో బోగస్ పేర్లను లబ్ధిదారులుగా నమోదు చేసుకుని గత సీజన్లలో నిధులను కాజేసిన వైనాన్ని కేంద్రం గుర్తించగా.. ఈ సీజన్లో అర్హులను గుర్తించేందుకు ఈకేవైసీని తప్పనిసరి చేసింది. కాగా గడువు ఈ నెల 31 వరకే ముగుస్తున్నా జిల్లాలో ఈకేవైసీ నామమాత్రంగా సాగుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో కేవలం 10 శాతం మాత్రమే నమోదైంది. ఈకేవైసీని పూర్తి చేసిన రైతులకు మాత్రమే ప్రస్తుతం రూ.2 వేల చొప్పున చెల్లింపులు చేయాలని లేదా నమోదు పూర్తికాకుంటే ఈ సీజన్ నుంచి నిధులను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి జాన్సుధాకర్ తెలిపారు. చదవండి👉 ‘ఇలాంటి ఫథకం దేశంలో ఎక్కడా లేదు’ అనుసంధానం ఇలా.. రైతులు ముందుగా పీఎం కిసాన్ పథకం వివరాలిచ్చిన తమ బ్యాంకు ఖాతాకు ఆధార్కార్డును అనుసంధానించుకోవాలి. తదుపరి ఆధార్ కార్డుకు ఫోన్ నంబర్ను అనుసంధానించాలి. అనంతరం పీఎం కిసాన్ పోర్టల్లో ఆధార్ ఆధారితంగా ఈకేవైసీ చేస్తున్నప్పుడు ఫోన్ నంబర్కు వచ్చే ఓటీపీ సంఖ్యను తిరిగి నమోదు చేస్తేనే ఈకేవైసీ పూర్తవుతుంది. సెల్ఫోన్లో పీఎం కిసాన్ యాప్ ద్వారా లేదా కంప్యూటర్లో పోర్టల్ ద్వారా రైతులే ఈకేవైసీని చేసుకోవచ్చు. లేదా కామన్ సర్వీస్ సెంటర్లలో సైతం ఈకేవైసీని పూర్తి చేయించాలి. ఆధార్ ద్వారా ఈ కేవైసీని పూర్తి చేసిన అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలకు నిధులు విడుదల చేస్తారు. బోగస్ రైతులు జాబితా నుంచి తొలగించబడతారు. 2018లో పథకం ప్రారంభించిన దగ్గర నుంచి 10 విడతలుగా నిధులను విడుదల చేయగా ప్రస్తుతం ఏప్రిల్లోనే 11వ విడతకు సంబంధించి ఈ దఫా నిధులు ఇవ్వాల్సి ఉండగా ఈకేవైసీతో ఈ నెలాఖరులోగా లేదా జూన్ మొదటి వారంలో నిధులు విడుదల చేసే అవకాశం ఉంది. అవగాహన కల్పించరూ.. ఆధార్ అనుసంధానం, ఈకేవైసీ చేసుకోవడం గురించి చాలా మంది రైతులకు తెలియదు. ఇవి చేసుకోలేకనే ఎంతో మంది రైతులు ఇప్పటికీ ఎన్నో ప్రభుత్వ పథకాలకు నోచుకోలేకపోతున్నారు. తాజాగా ఈకేవైసీ తప్పనిసరి చేసింది. కానీ, క్షేతస్థ్రాయిలో ఈ విషయమే చాలా మంది రైతులకు తెలియదు. తెలిసిన వారు వెళ్లినా మీ సేవా కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు, ఆధార్కు ఫోన్ నంబర్ లింకు లేకపోవడం వంటి కారణాలతో మళ్లీ మళ్లీ తిరగాల్సి వస్తుంది. ప్రస్తుతం వ్యవసాయాధికారులు ధాన్యం నాణ్యత ధ్రువీకరణ పనుల్లో నిమగ్నమై ఉండగా ఈకేవైసీని పూర్తిచేయించేందుకు రైతులకు అవగాహన కల్పించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈకేవైసీని పూర్తి చేయని రైతులకు నిధులు నిలిచిపోనున్నందున రైతులందరూ ఈకేవైసీని పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చదవండి👉🏻 గడువు 31 వరకే.. ఈ–కేవైసీ తప్పనిసరి.. ఇలా నమోదు చేసుకోండి నమోదు చేసుకోండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కోసం రైతులు ఈ నెల 31లోగా నమోదు చేసుకోవాలి. ఇప్పటి వరకు జిల్లాలోని అన్ని మండలాల్లో ఈకేవైసీ నమోదు చాలా తక్కువగా ఉంది. ఆయా మండలాల ఏఈఓలు నమోదును వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టాలని ఒత్తిడి తీసుకొస్తున్నాం. రైతులకు గ్రామాల్లో గడువులోగా ఈకేవైసీ నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలి. పీఎం కిసాన్ లబ్ధి రైతులే కాకుండా మిగిలిన రైతులు కూడా ఈకేవైసీ చేసుకుంటే మంచిది. – జాన్సుధాకర్, జిల్లా వ్యవసాయాధికారి ఇప్పటి వరకు రాలే.. ఇప్పటి వరకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు రాలేదు. అనేకసార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకపోయింది. ఇప్పుడు ఈకేవైసీ చేసుకోవాలని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఈ నెల 31 వరకు గడువు ఉన్నందు వల్ల వెంటనే చేసుకుంటాను. – గోవిందరెడ్డి, రైతు, పెద్దకడ్మూర్ గ్రామం -
మీ 'ఆధార్' మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండిలా!
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడీఏఐ) తన పోర్టల్ లో అనేక కొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడు యూజర్ల కోసం తీసుకొస్తుంది. యుఐడీఏఐ తీసుకొచ్చిన అలాంటి ఒక సౌకర్యం వల్ల మీ పాత ఆధార్ మొబైల్ నెంబర్ స్థానంలో సులభంగా కొత్త నెంబర్ జత చేసుకునే అవకాశం ఉంది. మీ ఆధార్ కార్డుకు మరో కొత్త మొబైల్ నెంబరు జత చేయాలని అనుకుంటే ముందుగా మీరు ఈ దశలను ఫాలో అవ్వాల్సి ఉంటుంది. 'ఆధార్' మొబైల్ నెంబర్ అప్డేట్ విధానం మీ మొబైల్ నెంబరు అప్డేట్ చేయడం కొరకు యుఐడీఏఐ వెబ్ పోర్టల్(ask.uidai.gov.in)ను సందర్శించండి. ఆ తర్వాత, మీరు అప్డేట్ చేయాలనుకుంటున్న ఫోన్ నెంబరు, క్యాప్చాను సంబంధిత బాక్సుల్లో టైప్ చేయండి. 'సెండ్ ఓటీపీ' ఆప్షన్ మీద క్లిక్ చేసి, మీ ఫోన్ నంబర్ కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి 'సబ్మిట్ ఓటీపీ & ప్రొసీడ్' ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అనంతరం ఓపెన్ అయిన డ్రాప్డౌన్ బాక్స్లో ‘అప్డేట్ ఆధార్’పై క్లిక్ చేసి ముందుకెళ్లండి. ఆపై ఆధార్ నంబర్, పూర్తి పేరు నమోదు చేసి మీరు అప్డేట్ చేయాలనుకుంటున్న ‘మొబైల్ నంబర్’ కింద ఎంచుకొని ప్రోసిడ్ అవ్వండి. మొబైల్ నెంబరు సబ్మిట్ చేసిన తర్వాత మొబైల్ నంబర్, క్యాప్చా మళ్లీ నమోదు చేసి కొత్తగా వచ్చిన ఓటీపీని సరిచూసుకోని సేవ్&ప్రోసిండ్ క్లిక్ చేయండి. దీని తర్వాత, రూ.25 ఫీజు చెల్లించడానికి అవసరమైన అదనపు సమాచారాన్ని నమోదు చేసి మీ దగ్గరల్లో ఉన్న ఆధార్ కేంద్రానికి వెళ్లడానికి మీరు ఆన్ లైన్ లో అపాయింట్ మెంట్ బుక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ ఆధార్ సేవ కేంద్రానికి వెళ్లి వివరాలు తెలియజేస్తే సరిపోతుంది. -
కోల్పోయిన ఆధార్ నెంబర్ తిరిగి పొందడం ఎలా..?
వివిద ప్రభుత్వ పథకాలు, ఇతర సేవలు పొందాలంటే కచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు కలిగి ఉండాల్సిందే. కాబట్టి భారత పౌరులు ఆధార్ కార్డును ముఖ్యమైన గుర్తింపు పత్రంగా పరిగిణిస్తారు. 12 అంకెల గల ఈ ఆధార్ కార్డును యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడీఎఐ) జారీచేస్తుంది. అలాంటి ఆధార్ కార్డు నెంబర్ మర్చిపోతే/ ఎక్కడైన పోయిన ఏమి జరుగుతుంది అనేది ఒకసారి ఊహించుకోండి. దాని గురించి ఆలోచిస్తేనే భయం వేస్తుంది. ఎవరైనా ఆధార్ కార్డు నెంబర్ మర్చిపోయిన, కార్డు ఎక్కడైనా పోయిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు లేదా హెల్ప్ లైన్ నెంబరు ద్వారా ఆన్ లైన్ లో తమ ఎన్ రోల్ మెంట్ నెంబరు లేదా యుఐడీని తిరిగి పొందవచ్చు. అది ఎలా అనేది ఈ క్రింది విదంగా తెలుసుకోండి. https://uidai.gov.in అధికారిక వెబ్ సైట్ కు సందర్శించండి. హోమ్ పేజీలో 'మై ఆధార్' అనే ఆప్షన్ కింద 'ఆధార్ సర్వీసెస్' అనే ఆప్షన్ ఎంచుకోండి. ఇప్పుడు 'Retrieve Lost or Forgotten EID/UID' అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ పేరు, ఈమెయిల్ ఐడీ, రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు వంటి వివరాలను నమోదు చేయాలి. అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత, వెరిఫికేషన్ కొరకు క్యాప్చా ఎంటర్ చేయండి. సెండ్ ఓటీపీ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుకు ఓటీపీ వస్తుంది. మీ మొబైల్లో వచ్చిన ఆరు అంకెల ఓటీపీని నమోదు చేయండి. ఇప్పుడు మీకు యుఐడీ/ ఈఐడీ నెంబరు ఎస్ఎమ్ఎస్ ద్వారా మీ మొబైల్ కు వస్తుంది. ఈ నెంబర్ తో మీరు ఈ-ఆధార్ కాపీని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ప్రజలు కోల్పోయిన ఆధార్ యుఐడీ/ఈఐడీ నంబర్ ను తెలుసుకోవడానికి ప్రజలు తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు నుంచి హెల్ప్ లైన్ నెంబరు '1947'కు డయల్ చేయాల్సి ఉంటుంది. చదవండి: ఈ పోటీలో గెలిస్తే రూ. 2 లక్షలు మీ సొంతం -
నాపై అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారు: హీరో సిద్ధార్థ్
హీరో సిద్ధార్థ్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర బీజేపీ ఐటీ సెల్ తన పర్సనల్ మొబైల్ నంబర్ లీక్ చేసిందని ఆరోపించారు. అందువల్ల తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తామని.. తమపై అత్యాచారం చేస్తామని బెదిరింపు సందేశాలు వస్తున్నాయని తెలిపారు. ఈ మేరకు సిద్ధార్థ్ ట్వీట్ చేశారు. ‘‘తమిళనాడు బీజేపీ ఐటీ సెల్ నా మొబైల్ నంబర్ లీక్ చేసింది. గడిచిన 24 గంటల్లో నాకు దాదాపు 500 అసభ్య సందేశాలు వచ్చాయి. నన్ను, నా కుటుంబ సభ్యులను చంపేస్తామని.. మాపై అత్యాచారం చేస్తామని బెదిరిస్తూ మెసేజ్లు చేస్తున్నారు. ఈ నంబర్లంన్నింటిని రికార్డ్ చేశాను. వీటిలో చాలా వరకు బీజేపీతో లింక్ ఉన్నవి.. ఆ పార్టీ గుర్తు డీపీగా పెట్టుకున్నవే ఉన్నాయి. వీట్నింటిని పోలీసులుకు అందించాను. నేను మౌనంగా ఉంటానని మాత్రం అనుకోవద్దు’’ అని తెలిపారు. My phone number was leaked by members of TN BJP and @BJPtnITcell Over 500 calls of abuse, rape and death threats to me & family for over 24 hrs. All numbers recorded (with BJP links and DPs) and handing over to Police. I will not shut up. Keep trying.@narendramodi @AmitShah — Siddharth (@Actor_Siddharth) April 29, 2021 దీంతో పాటు సిద్ధార్థ్ తనను బెదిరిస్తూ వచ్చిన మెసేజ్లను స్క్రీన్ షాట్ తీశారు. వాటిని తన ట్విట్టర్లో అప్లోడ్ చేశారు. ‘‘తమిళనాడు బీజేపీ నాయకులు నిన్న నా పర్సనల్ నంబర్ని లీక్ చేశారు. చాలా గ్రూపుల్లో నా నంబర్ చక్కర్లు కొట్టింది. వీరంతా నన్ను ట్రోల్ చేశారు. నేను కోవిడ్తో పోరాడాలా.. ఇలాంటి వారితో పోరాడాలా’’ అని వాపోయారు సిద్ధార్థ్. My phone number was leaked by members of TN BJP and @BJPtnITcell Over 500 calls of abuse, rape and death threats to me & family for over 24 hrs. All numbers recorded (with BJP links and DPs) and handing over to Police. I will not shut up. Keep trying.@narendramodi @AmitShah — Siddharth (@Actor_Siddharth) April 29, 2021 ఇక సిద్ధార్థ ట్వీట్పై నటి శ్రేయా ధన్వంతరీ స్పందించారు. ఇది చాలా దారుణం అంటూ ట్వీట్ చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటంలో సిద్ధార్థ్ ముందు ఉంటారు. కొద్ది రోజుల క్రితం తన సోసల్ మీడియాలో కోవిడ్ను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని విమర్శిస్తూ సిద్ధార్థ్ ట్వీట్ చేశారు. చదవండి: పెట్రో సెగ : కేంద్ర ఆర్థికమంత్రిపై హీరో సెటైర్ -
వైరల్: ‘ఆక్సిజన్ కావాలంటే ఈ నాయకులకు కాల్ చేయండి’
కోల్కతా: దేశవ్యాప్తంగా జనాలు కరోనాతో విలవిల్లాడుతుంటే.. ధైర్యం చెప్పాల్సిన రాజకీయ నాయకులు బాధ్యతరహితంగా ప్రవర్తిస్తున్న విధం చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉండగా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. అవును మరి ఎన్నికల సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో పార్టీలు భారీ ఎత్తున జనాలను పోగు చేసి ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించారు. ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోలేదు. ఆ ఫలితం ఇప్పుడు జనాలు అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో రాజకీయ నాయకులకు బుద్ది చెప్పడం కోసం పశ్చిమబెంగాల్ నెటినులు చేసిన ఓ వినూత్న ఆలోచన తాజాగా నెట్టింట్లో తెగ వైరలవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో జోరుగా ప్రచారం చేసిన నేతలు ప్రస్తుతం ఇళ్లకే పరిమితయ్యారు. ఎన్నికల వేళ ఎలాంటి నిబంధనలు పాటించకుండా ర్యాలీలు, సమావేశాలు నిర్వహించి వైరస్ వ్యాప్తికి కారణమయిన రాజకీయ నాయకులు ప్రసుత్తం వైరస్ విజృంభిస్తున్న వేళ ఎవరూ కనిపించడం లేదు. దాంతో నెటిజనులు సదరు నాయకుల పేర్లు, వారి వ్యక్తిగత ఫోన్ నంబర్లున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీరిలో టీఎంసీ, బీజేపీ రెండు పార్టీల నేతలున్నారు. ఫోన్ నంబర్లున్న ఫోటోతో పాటు ‘‘కరోనా అంటే భయం ఎందుకు. మన దగ్గర రాజకీయ నాయకులున్నారు. జనాలకు కష్టం వచ్చిందంటే చాలు.. వారు ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా ప్రజల కోసం పాటు పడతారు. మీకు ఆక్సిజన్, రక్తం, మాస్క్, శానిటైజర్, అంబులెన్స్ వంటి సేవలు కావాల్సి వస్తే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఫోటోలోని నాయకుల నంబర్కు కాల్ చేయండి’’ అనే మెసేజ్ చేశారు. ఈ ఫోటోల 14 మంది బీజేపీ, టీఎంసీ నాయకుల పేర్లు, వారి వ్యక్తిగత మొబైల్ నంబర్లు ఉన్నాయి. వీరిలో సువేందు అధికారి, బాబుల్ సుప్రియో, రాజ్ చక్రవర్తి వంటి ప్రముఖులు పేర్లు కూడా ఉండటం గమనార్హం. ఇక బెంగాల్లో ఆదివారం ఒక్కరోజన 15,889 కేసులు వెలుగు చూశాయి. చాలా ఆస్పత్రుల్లో బెడ్లు, మందులు, ఆక్సిజన్ కొరత నెలకొంది. దాంతో పలు ఆస్పత్రులు కొత్త వారిని ఎవరిని చేర్చుకోవడం లేదు. ఇక వైరస్ వ్యాప్తికి అసెంబ్లీ ఎన్నికలే కారణమని జనాలు బలంగా విశ్వసిస్తున్నారు. అన్ని పార్టీలు ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించాయి. జనాలు పెద్ద ఎత్తున గుమిగూడారు. వీరిలో చాలా మంది మాస్క్ కూడా ధరించలేదని.. అందువల్లే వైరస్ వ్యాప్తి ఉధృతం అయ్యిందని సామాన్యులుఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: సెకండ్ వేవ్ దేశాన్ని కుదిపేస్తోంది -
మీ పేరుతో ఎవరైనా సిమ్ తీసుకున్నారో తెలుసుకోండిలా?
మనకు తెలియకుండానే మన పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లున్నాయో మీకు తెలుసా?. ఇలా మనకు తెలియకుండానే కొందరి పేరు మీద సైబర్ నెరగాళ్లు సిమ్ లు తీసుకుంటు న్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ సిమ్ ద్వారా అనైతిక, అసాంఘిక కార్యక్రమాలకు ఈ మొబైల్ నెంబర్ వాడుతున్నట్లు చాలా కేసులలో బయటపడింది. ఇలా మీకు తెలియకుండా ఇతరులు సిమ్ తీసుకోవడంతో మీరు మీకు సంబంధం లేని కేసులలో చిక్కుకునే ప్రమాదం చాలా ఎక్కువ. ఇలా మన పేరు మీద లేదా మన వివరాలతో ఎవరైనా మొబైల్ నెంబర్ తీసుకుంటే వాటిని బ్లాక్ చేసే సదుపాయం ఇప్పడు మీకు కల్పిస్తున్నారు. దీని కోసం మీరు విజయవాడ టెలికాం విభాగం(డీవోటీ) రూపొందించిన వెబ్సైట్(https://tafcop.dgtelecom.gov.in)ను సందర్శించాలి. వెబ్సైట్ ఓపెన్ చేశాక అందులో మీరు ప్రస్తుతం వాడుతున్న మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే మన పేరు మీద ఉన్న ఫోన్ నంబర్ల వివరాలన్నీ వస్తాయి. వాటిలో మనకు అవసరం లేనివి, మనకు తెలియకుండా మన పేరుమీద ఉన్న వాటిని సెలక్ట్ చేసి రిపోర్ట్ చేస్తే టెలికం శాఖ తగు చర్యలు తీసుకుంటుంది. ఒకరి పేరు మీద అత్యధికంగా 9 నంబర్లు మాత్రమే ఉండేందుకు వీలుంది అని విజయవాడ టెలికం శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ రాబర్ట్ రవి పేర్కొన్నారు. కొందరి పేర్ల మీద అంతకంటే ఎక్కువ నంబర్లు ఉన్నాయని తమ దృష్టికి వచ్చిందని. అందుకే, ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఈ పోర్టల్ను ప్రారంభించామన్నారు. దీనివల్ల అనధికారికంగా వినియోగిస్తున్న నంబర్లకు చెక్ పెట్టే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ముందుగా తెలుగు రాష్ట్రాల టెలికం సర్కిళ్లలో ఈ సదుపాయాన్ని ప్రారంభించామని. త్వరలో దేశ వ్యాప్తంగా అందుబాటులోనికి వస్తుందన్నారు. ఎవరికైనా అనుమానం వెంటనే ఇలా చెక్ చేసుకోవాలని తెలిపారు. చదవండి: సింగిల్ చార్జ్ తో 100 కి.మీ ప్రయాణించే సైకిల్ -
మహిళ నంబర్ను షేర్చాట్లో పెట్టి కాల్గర్ల్గా..
సాక్షి, హైదరాబాద్: తీసుకున్న డబ్బులు చెల్లించాలని అడిగినందుకు ఓ మహిళ ఫోన్ నంబర్ను షేర్ చాట్లో పెట్టి కాల్ గర్ల్గా చిత్రీకరించిన వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మగ్గుల మండలం, కలకండ గ్రామానికి చెందిన నాగిల్లా యశ్వంత్ (19) తన బంధువుల వద్ద రూ.2వేల అప్పు తీసుకున్నాడు. డబ్బులు సకాలంలో తిరిగి ఇవ్వకపోవడంతో వారు యశ్వంత్ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వారు అతడిని మందలించడంతో బాధితురాలిపై భర్తపై పగ పెంచుకున్నాడు. వారి పరుపు తీయాలని ఉద్దేశంతో యశ్వంత్ షేర్చాట్లో బాధితురాలి ఫోన్ నంబర్ను పెట్టాడు. దీంతో బాధితురాలికి నిత్యం ఫోన్లు రావడంతో రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరించి సోమవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. చదవండి: బాలికపై లైంగిక దాడి.. కోర్టు షాకింగ్ తీర్పు! బంజారాహిల్స్: అర్ధరాత్రి 12 గంటలకు యువతి ఇంట్లోకి వెళ్లి.. -
‘నాన్న నంబర్తో అభ్యంతరకర స్టేటస్లు.. ఇబ్బందిగా ఉంది’
సాక్షి, సిటీబ్యూరో: ‘మా నాన్న బేసిక్ మోడల్ ఫోన్ వాడుతున్నారు. ఆయన వినియోగిస్తున్న నంబర్తో గుర్తుతెలియని వ్యక్తులు వాట్సాప్ యాక్టివేట్ చేసుకున్నారు. అందులో అభ్యంతరకర స్టేటస్లు పెడుతున్నారు. ఇది మా నాన్నతో పాటు మొత్తం కుటుంబానికే ఇబ్బందికరంగా మారింది’ కాచిగూడకు చెందిన ఓ వ్యక్తి శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఇచి్చన ఫిర్యాదు ఇది. ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు వాట్సాప్ను తమకు నచి్చనట్లు వాడేస్తుండటంతో ఈ తరహా ఫిర్యాదులు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. వారికి అదే కలిసి వస్తోంది... వాట్సాప్ మాత్రమే కాదు.. ఈ తరహా యాప్స్ వినియోగించడంలో ఉన్న ఓ చిన్న లోపం సైబర్ నేరగాళ్లకు కలిసి వస్తోంది. వాట్సాప్ను స్మార్ట్ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్నాక కేవలం యాక్టివేట్ చేసుకోవడానికి మాత్రమే ఫోన్ నంబర్ అవసరం. ఆ సందర్భంలో వచ్చే వన్ టైమ్ పాస్వర్డ్ లేదా వెరిఫికేషన్ కోడ్/కాల్ను అందుకోవడానికి ఫోన్ నంబర్ కచ్చితం. ఆ తర్వాత నంబర్, సిగ్నల్తో సంబంధం లేకుండా వైఫైలో వాట్సాప్ను వినియోగించుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అనేకసార్లు ఫోన్ సిగ్నల్ లేకపోయినా వాట్సాప్ వినియోగదారులు వైఫై ద్వారా వాయిస్, వీడియో కాల్స్ చేసుకోగలుగుతారు. ఫోన్ నంబర్తో అవసరం లేని ఈ విధానమే సైబర్ మోసగాళ్లకు కలిసి వస్తోంది. ఆయా యాప్స్లో సెర్చ్ చేస్తూ... వేధింపులు, బెదిరింపుల సహా ఇతర సైబర్ నేరాలకు పాల్పడే నేరగాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పేర్లతో లేదా సంబంధీకుల పేర్లతో తీసుకున్న ఫోన్ నంబర్లు వినియోగించరు. అలా చేస్తే పోలీసుల దర్యాప్తులో చిక్కుతామనే ఉద్దేశంతో వాటికి దూరంగా ఉంటారు. తమ స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ను యాక్టివేట్ చేసుకుని, వైఫై వినియోగిస్తే మాత్రం వీళ్ల పని తేలికవుతుంది. ఈ యాప్ను యాక్టివేట్ చేసుకోవడానికి వాళ్లుకు ఓ ఫోన్ నంబర్ కావాలి. దీనికోసం సైబర్ నేరగాళ్లు కొన్ని సీరీస్ల్లో నంబర్లను ఎంపిక చేసుకుంటున్నారు. వాటి యజమానులు అప్పటికే వాట్సాప్ వాడుతుంటే మళ్లీ వీళ్లు యాక్టివేట్ చేసుకోవడం సాధ్యం కాదు. ఆయా నంబర్లతో వాట్సాప్ యాక్టివేషన్లో ఉందా.. లేదా? అనేది తెలుసుకోవడానికి సైబర్ నేరగాళ్లు కొన్ని యాప్స్ వాడుతున్నారు. ఐకాన్ సçహా ఇతర వాటిలో ఫోన్ నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే వాట్సాప్ యాక్టివేట్ అయి ఉందా అనేది తెలుసుకోవడం సాధ్యం. మాయ మాటలతో ఓటీపీ తీసుకుంటూ... సాధారణంగా తమ సిమ్కార్డును బేసిక్ ఫోన్లలో వాడుతున్న వినియోగదారులు వాట్సాప్ను యా క్టివేట్ చేసుకోరు. అలాంటి వారినే సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసుకుంటున్నారు. తమ స్మార్ట్ఫోన్లో వాట్సాప్ను ఇన్స్టల్ చేసిన తర్వాత వెరిఫికేషన్ కోడ్ కోసం ఆ ఫోన్ నంబర్ ఇస్తున్నారు. ఇలా ఆ వినియోగదారుడికి ఈ కోడ్ చేరుతుంది. వారిని సంప్రదిస్తున్న సైబర్ నేరగాళ్లు ఓ లావాదేవీలో పొరపాటున మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేశామని, దీంతో ఓటీపీ మీకు వచ్చిందని చెప్పి దాన్ని తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో బ్యాంకులతో పాటు ఇతర కాల్ సెంటర్ల పేర్లు వాడుతున్నారు. ఇలా ఓటీపీ ని చేజిక్కించుకుని తమ ఫోన్లలో ఎదుటి వారి నెంబర్తో వాట్సాప్ యాక్టివేట్ చేసుకుంటున్నా రు. ఆ వెంటనే వాట్సాప్ సెక్యూరిటీ సెట్టింగ్స్ను మార్చేస్తూ టూ స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకుంటున్నా రు. దీని వల్ల ఎప్పుడైనా సదరు సిమ్కార్డు విని యోగదారులు తన ఫోన్లో వాట్సాప్ యాక్టివేట్ చేసుకోవాలని భావించినా... అది సాధ్యం కాదు. వైఫైలో వాడుతూ వ్యవహారాలు... ఇలా వేరే వారి ఫోన్ నంబర్తో తమ స్మార్ట్ఫోన్లో వాట్సాప్ను యాక్టివేట్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు దీన్ని వైఫైలో వాడుతున్నారు. ఫలితంగా ఆ ఫోన్ నంబర్తో పని లేకుండా వాళ్ల పనులు జరిగిపోతున్నాయి. ఇలాంటి వాట్సాప్లను వాడుతూ సైబర్ నేరగాళ్లు వేధింపులు, బెదిరింపులతో పాటు ఇతర సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో అమాయకులు పోలీసుల విచారణ ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ తరహా కేసుల్లో ఫిర్యాదులు వచ్చినా.. బాధ్యుల్ని పట్టుకోవడం అత్యంత కష్టసాధ్యమని అధికారులు చెప్తున్నారు. అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే వాట్సాప్ సంస్థకు లేఖలు రాసి, డీయాక్టివేషన్ చేయించే ఆస్కారం ఉంటోందని స్పష్టం చేస్తున్నారు. వాట్సాప్ యాక్టివేట్ చేసుకోని నంబర్లతో పాటు కొన్నిసార్లు అప్పటికే వాట్సాప్ వాడుతున్న వాళ్లకీ సైబర్ నేరగాళ్ల ఇలా బురిడీ కొట్టిస్తున్నారని చెప్తున్నారు. ఎవరైనా కాల్ చేసి ఓటీపీలు వంటివి అడిగితే పలుమార్లు సరిచూసుకున్నాకే చెప్పాలని, లేదంటే ఇలాంటి సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నారు. -
‘తపాలా’లో ఆధార్, మొబైల్ నంబర్ అనుసంధానం
సాక్షి, హైదరాబాద్: రేషన్ సరుకులు పొందేందుకు ఆధార్తో మొబైల్ ఫోన్ అనుసంధానం (ఓటీపీ కోసం) తప్పనిసరి కావటంతో తపాలాకార్యాలయాలను వినియోగించుకోవాలని ఆ శాఖ ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. పోస్టల్ హైదరాబాద్ రీజియన్ (28 మఫిసియల్ జిల్లాలు) పరిధిలో అందుబాటులో ఉన్న 124 ఆధార్ కేంద్రాల్లో ఈ అనుసంధాన ప్రక్రియ చేయించుకోవచ్చని పేర్కొంది. వీటితోపాటు 15 మొబైల్ కేంద్రాలు కూడా ఈ సేవల్ని అందిస్తున్నాయని తెలిపింది. రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ విధానాన్ని తొలగించి, ఆధార్తో అనుసంధానమైన మొబైల్కు వచ్చే ఓటీపీ చెప్పటం ద్వారా గాని లేదా ఐరిష్ ద్వారా కానీ సరుకులు ఇచ్చే విధానాన్ని అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఓటీపీ కోసం ఆధార్తో మొబైల్ అనుసంధానం తప్పనిసరైంది. ఆధార్లో నిక్షిప్తమై ఉన్న ఐరిస్లో మార్పులు సంభవించే అవకాశం ఉన్నందున, ఐరిస్ను కూడా అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. ఈ రెండు సేవలను తపాలాశాఖ ఆధ్వర్యంలోని ఆధార్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. -
ల్యాండ్లైన్ వాడుతున్నారా? కొత్త నిబంధన
సాక్షి,న్యూఢిల్లీ: దేశీయంగా ల్యాండ్లైన్ వినియోగదారులకు టెలి కమ్యూనికేషన్స్ విభాగం(డాట్) కొత్త నిబంధనను అమలు చేయనుంది. ఇకనుంచి దేశంలో ల్యాండ్లైన్ నుంచి మొబైల్ ఫోన్కు కాల్ చేసినప్పుడల్లా ప్రతీసారి తప్పనిసరిగా సున్నా (0) ను చేర్చాలని తాజాగా తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ కొత్త నిబంధన అమలులోకి రానుందని స్పష్టం చేసింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ అఫ్ ఇండియా (ట్రాయ్) కొత్త ప్రతిపాదనకనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు డాట్ వెల్లడించింది. ఈ మేరకు టెలికాం సంస్థలు తగిన ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని సూచించింది. జనవరి 1వ తేదీనుంచి ల్యాండ్లైన్ వినియోగదారులు ఏదైనా మొబైల్ నంబర్కు కాల్ చేయడానికి ముందు సున్నా జోడించాల్సి ఉంటుందని టెలికమ్యూనికేషన్ విభాగం తాజా సర్క్యులర్లో తెలిపింది. కొత్త నిబంధనలను అమలు చేయడానికి అవసరమైన యంత్రాంగాలను ఏర్పాటు చేయాలని డాట్ అన్ని టెలికం కంపెనీలను కోరింది. అలాగే కొత్త మార్పుల గురించి ల్యాండ్లైన్ వినియోగదారులకు త్వరలో తెలియ జేయనున్నట్లు కూడా తెలిపింది. అలాగే ల్యాండ్లైన్ నుంచి సున్నాను చేర్చకుండా డయల్ చేసిన యూజర్లకు క్రమం తప్పకుండా ప్రతీసారి ఈ హెచ్చరికను వినిపించాలని డాట్ పేర్కొంది. వినియోగదారులకు సున్నా డయిలింగ్ సౌకర్యాన్ని కల్పించాలని టెలికాం సంస్థలను తన సర్క్యులర్లో ఆదేశించింది. కొత్త నేషనల్ నంబరింగ్ ప్లాన్ (ఎన్ఎన్పి) ను త్వరగా జారీ చేయాలని కూడా సిఫారసు చేసింది. మరోవైపు 11 అంకెల మొబైల్ నంబరింగ్ ప్లాన్ను తిరస్కరించిన సంస్థ 10 అంకెల నంబరుకే ఆమోదం తెలిపింది. -
బాస్ మీద కోపం.. డేటింగ్ సైట్లలో ఫోన్ నంబర్
బెంగళూరు: బాస్ మీద కోపంతో ఓ వ్యక్తి అతడి ఫోన్ నంబర్ని డేటింగ్ సైట్లలో అప్లోడ్ చేశాడు. అంతేకాక యాజమాని పేరు మీద సెక్స్ టాయ్స్ బుక్ చేసి.. అతడి ఇంటికి పంపించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడంతో.. ఉద్యోగి చర్యలు వెలుగులోకి వచ్చాయి. వివరాలు.. బెంగళూరుకు చెందిన హరిప్రసాద్ జోషి అనే వ్యక్తి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబ అవసరాల నిమిత్తం పీఎఫ్ మనీ డ్రా చేసుకోవాలనుకున్నాడు. దీని గురించి బాస్ అవినాష్ ప్రభుకు తెలిపాడు జోషి. అయితే వైరస్ కారణంగా వ్యాపారం నిలిచిపోయిందని చెప్పాడు యజమాని. అంతేకాక మునుపటి బిజినెస్ హెడ్ కూడా అవసరమైన పత్రాలను సమర్పించలేదని, అందువల్ల చెల్లింపు విడుదలలో ఆలస్యం జరిగిందని ఆయన పేర్కొన్నారు. మహమ్మారి ముగిసిన తర్వాత పీఎఫ్ డబ్బులు చేల్లిస్తానని ప్రభు, జోషికి హామీ ఇచ్చాడు. (4 నెలల్లో రూ. 30 వేల కోట్లు విత్డ్రా) కానీ డబ్బులు అత్యవసరం ఉండటంతో జోషి ఎదురుచూడటానికి ఇష్టపడలేదు. దాంతో దీని గురించి బాస్కు రోజు కాల్ చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. దాంతో ప్రభు అస్సలు డబ్బు చెల్లించనని.. ఏం చేసుకుంటావో చేసుకోమని జోషిని బెదిరించాడు. బాస్ ప్రవర్తనతో విసిగిపోయిన జోషి.. అతడి భార్య, పిల్లలకు అసభ్యకరమైన మెయిల్స్ పంపాడు. ప్రభు ఫోన్ నంబర్ని డేటింగ్ సైట్లలో అప్లోడ్ చేశాడు. అంతేకాక వారి పేరు మీద సెక్స్ టాయ్స్ బుక్ చేశాడు. ఈ చర్యలతో విసిగిపోయిన ప్రభు దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొబైల్ నంబర్ ఆధారంగా ట్రాక్ చేసి జోషిని అరెస్ట్ చేశారు. అతడి మీద ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
జనగణనలో మొబైల్ నంబర్!
న్యూఢిల్లీ: జనగణన సమయంలో కుటుంబ పెద్ద మొబైల్ నెంబర్ వివరాలను కూడా సమాచారం కోసం వచ్చిన ఉద్యోగులకు(ఎన్యూమరేటర్లు) ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం 31 ప్రశ్నలకు సంబంధించి సమాచారాన్ని సేకరించాల్సిందిగా జనగణన అధికారులను ఆదేశించామని రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే, మొబైల్ నెంబర్ను జనగణనకు సంబంధించిన సమాచారం ఇవ్వడానికి మాత్రమే వినియోగిస్తామని, మరే ఇతర అవసరాలకు వాడబోమని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. ఇతర ప్రశ్నలతో పాటు కుటుంబపెద్ద ఫోన్ నెంబర్, ఇంట్లో ఉన్న టాయిలెట్లు, టీవీ, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్స్, సొంత వాహనాలు, కంప్యూటర్, ల్యాప్టాప్, తాగు నీటి వసతి.. తదితర సమాచారాన్ని ఎన్యూమరేటర్లు సేకరిస్తారు. ఏప్రిల్ 1–సెప్టెంబర్ 30 మధ్యలో కుటుంబ సమాచార సేకరణ ప్రక్రియ కొనసాగుతుంది. కుటుంబ పెద్ద ఎస్సీ లేదా ఎస్టీ లేదా ఇతర ఏ సామాజిక వర్గానికి చెందుతారనే వివరాలూ సేకరిస్తారు. ఇల్లు సొంతమా?, ఇంట్లోని గదులెన్ని? ముఖ్యమైన ఆహారం ఏమిటి?, వంటకు వాడే ఇంధనం ఏమిటి? తదితర ప్రశ్నలు కూడా ఉంటాయి. ఈ సారి పేపర్పై కాకుండా ఈ వివరాలన్నింటినీ మొబైల్ యాప్లో నిక్షిప్తం చేస్తారు. జనగణనతో పాటు జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)ను కూడా రూపొందించాలని కేంద్రం నిర్ణయించింది. -
ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ బ్లాక్ అవుతుంది..!!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్లకు అలర్ట్. అంతకముందు ఇంటర్నెట్ బ్యాంకింగ్తో మొబైల్ నెంబర్ను రిజిస్ట్రర్ చేసుకోని కస్టమర్లందరూ 2018 డిసెంబర్ 1 కల్లా ఆ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఎస్బీఐ తెలిపింది. ఒకవేళ తుది గడువు లోపల రిజిస్ట్రర్ చేసుకోకపోతే, నెట్ బ్యాంకింగ్ బ్లాక్ అవుతుందని ఎస్బీఐ తెలిపింది. వారు ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యాలను యాక్సస్ చేసుకోలేరని పేర్కొంది. దగ్గర్లోని బ్రాంచు ద్వారా ఈ పక్రియను వెంటనే చేపట్టుకోవాలని సూచించింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) 2017 జూలై 6న దీనిపై సర్క్యూలర్ జారీ చేయడంతో, ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంక్లు ఎస్ఎంఎస్ అలర్ట్ల కోసం తప్పనిసరిగా తమ కస్టమర్ల మొబైల్ నెంబర్ రిజిస్ట్రర్ ప్రక్రియ చేపట్టాలని ఆర్బీఐ ఆదేశించింది. ఒకవేళ ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్తో మొబైల్ నెంబర్ను రిజిస్ట్రర్ చేసుకోకపోతే, వెంటనే యూజర్లు దాన్ని చేపట్టాలని పేర్కొంది. అంతేకాక, బ్యాంక్ వద్ద ఇప్పటికే రిజిస్ట్రర్ చేసుకున్న యూజర్లు కూడా మొబైల్ నెంబర్ను చెక్ చేసుకోవాలని తెలిపింది. ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్తో మొబైల్ నెంబర్ రిజిస్ట్రర్ అయిందో లేదో చెక్ చేసుకునే ప్రక్రియ.... onlinesbi.com అనే ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ వెబ్సైట్ను సందర్శించాలి. లాగిన్, పాస్వర్డ్ వివరాలను నమోదు చేయాలి ఆ తర్వాత ‘మై అకౌంట్ అండ్ ప్రొఫైల్’ ట్యాబ్ను క్లిక్ చేయాలి ‘ప్రొఫైల్’ ట్యాబ్పై క్లిక్ చేయాలి పర్సనల్ డిటైల్స్/మొబైల్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి ఆ తర్వాత ప్రొఫైల్ పాస్వర్డ్ నమోదు చేయాలి(ప్రొఫైల్ పాస్వర్డ్, యూజర్ పాస్వర్డ్ వేరువేరుగా ఉండాలి) ఒక్కసారి ప్రొఫైల్ పాస్వర్డ్ను విజయవంతంగా నమోదు చేసిన తర్వాత, రిజిస్ట్రర్ మొబైల్ నెంబర్, ఈమెయిల్(ముందే రిజిస్ట్రర్ అయి ఉంటే) డిస్ప్లే అవుతుంది. -
ఉమర్ ఖలీద్పై దాడి : ఆ నెంబర్ ఆధారంగా..
సాక్షి, న్యూఢిల్లీ : జేఎన్యూ విద్యార్థి ఉమర్ ఖలీద్పై దాడికి పాల్పడిన వ్యక్తిని గుర్తించడంలో విఫలమైన ఢిల్లీ పోలీసులు తాజాగా కీలక ఆధారాలు రాబట్టారు. గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మెవాని, జేఎన్యూ విద్యార్థి షెహ్లా రషీద్లకు బెదిరింపు మెసేజ్లు పంపేందుకు వాడిన మొబైల్ నెంబర్ కొన్ని క్లూలను ఇస్తుందని భావిస్తున్నారు. ఈ నెంబర్ విదేశాల్లో నమోదైందా అనే కోణంలో విచారిస్తున్నామని ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ వర్గాలు తెలిపాయి. ఈ నెంబర్ ఏ దేశానికి చెందినదో వెల్లడైతే యూజర్ వివరాలను తెలుసుకోవచ్చని చెబుతున్నాయి. గ్యాంగ్ స్టర్ రవిపూజారిగా చెబుతున్న వ్యక్తి నుంచి జూన్, ఆగస్ట్ల్లో మెవాని, రషీద్లకు బెదిరింపు మెసేజ్లు వెళ్లాయి. ఖలీద్కు హాని తలపెడతానని కూడా మెసేజ్ పంపిన వ్యక్తి మెవానిని హెచ్చరించినట్టు సమాచారం. కాగా, తనకు భద్రత కల్పించే విషయంతో పాటు దాడి కేసుకు సంబంధించి గురువారం తనను ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ అధికారులు పిలిచారని, భద్రత కల్పించాలని కోరుతూ తాను మరో దరఖాస్తు సమర్పిస్తానని ఉమర్ ఖలీద్ పేర్కొన్నారు. -
సహకరించని..‘దోస్త్’
సాక్షి, బోథ్: డిగ్రీ కోర్సుల కోసం దరఖాస్తు చేసుకునే వి ద్యార్థులకు ఆధార్కు మొబైల్ నంబర్ అనుసంధా నం నిబంధన తిప్పలు పెడుతోంది. ఈ లింక్ ఉంటేనే దోస్త్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకు నే అవకాశం ఉంది. అయితే చాలా మంది వి ద్యార్థులకు తమ మొబైల్ నంబర్లు ఆధార్తో అనుసంధా నం లేకపోవడంతో దరఖాస్తు చేయలేకపోతున్నా రు. అనుసంధానం చేయాలంటే కనీసం వారం, పది రోజుల సమయం పట్టే అవకాశం ఉండడం.. మరో వైపు దరఖాస్తు గడువు సమీపిస్తుండడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. అనుసంధానం ఉంటేనే దరఖాస్తు.. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి రెండేళ్లుగా ‘దోస్త్’ వెబ్సైట్ ద్వారా డిగ్రీలో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తోంది. గతంలో ఆధార్తో మొబైల్నంబర్ అనుసంధానం లేకపోయినా దరఖాస్తులను స్వీకరించారు. అయితే ఈ ఏడాది ఖచ్చితంగా అనుసంధానం ఉంటేనే దరఖాస్తు చేసుకోవాలని వెబ్సైట్లో నిబంధన పెట్టడంతో చాలా మంది విద్యార్థులు దరఖాస్తు చేయలేకపోతున్నారు. అనుసంధానం నిబంధనను ఎత్తివేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఇలా... డిగ్రీలో ప్రవేశాలకు గతంలో ‘మీసేవ’లో బయోమెట్రిక్ విధానం ద్వారా దోస్త్ వెబ్సైట్లో విద్యార్థులు నమోదు చేసుకుని తాము ఎంచుకున్న కళాశాలలకు, గ్రూపుల వారీగా వెబ్ ఆప్షన్లు ఇచ్చేవారు. ఈ విధానంలో ఆధార్ నంబర్కు మొబైల్నంబర్ అనుసంధానం అవసరం ఉండేది కాదు. విద్యార్థుల మొబైల్ నంబర్ను నమోదు చేసుకుంటే ఆ నంబర్కు యూసర్ ఐడీ, పాస్వర్డ్ వచ్చేది. ఈ విధానంతో రెండేళ్లుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థులు డిగ్రీలో ప్రవేశాలు పొందారు. కాగా, గతంలో మీసేవ నిర్వాహకులు అధిక డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు వెలువెత్తాయి. లింక్తోనే తిప్పలు... 2018–19లో డిగ్రీ ప్రవేశాలకు ఈ నెల 8న ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తేదీ నుంచి 26వ తేదీ వరకు విద్యార్థులు దోస్త్ వెబ్సైట్ ద్వారా డిగ్రీలో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. గతంలో జరిగిన పొరపాట్ల నేపథ్యంలో ఈ సారి విద్యార్థుల ఆధార్తో వారి మొబైల్ నంబర్ అనుసంధానం చేయాలని నిబంధన విధించింది. దీంతో పాటు మీ సేవకు వెళ్లకుండా విద్యార్థులు నేరుగా దోస్త్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. లింక్ చేయాలంటే వారం సమయం.. ఉన్నత విద్యామండలి నిబంధన మేరకు విద్యార్థులు తమ ఆధార్ నంబర్కు మొబైల్ నంబర్ను లింక్ చేయాలంటే దాదాపు వారం నుంచి పది రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. తమ ప్రాంతంలో ఉండే ఆధార్ సెంటర్కు వెళ్లి మొబైల్ నంబర్ను ఆధార్తో లింక్ చేసుకోవాలి. దీనికి దాదాపు విద్యార్థులు రూ. 30 నుంచి రూ. 50 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ అనుసంధానం ఎక్కడ చేస్తారో కూడా చాలా మంది విద్యార్థులకు అవగాహన లేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని గిరిజన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. లింక్ నిబంధనను వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2017–18లో ఇంటర్ పాసైన విద్యార్థులు.. జిల్లా పాసైన విద్యార్థులు ఆదిలాబాద్ 5,350 మంచిర్యాల 3,884 నిర్మల్ 3,941 కుమురంభీం 3013 మొత్తం 16,188 -
ఆధార్–మొబైల్ అనుసంధానమెందుకు?
న్యూఢిల్లీ: ఆధార్తో మొబైల్ నంబర్ని తప్పనిసరిగా అనుసంధానించుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీంకోర్టు పలు సందేహాలు లేవనెత్తింది. మొబైల్ వినియోగదారుల గుర్తింపును తప్పనిసరిగా ధ్రువీకరించాలని గతంలో తామిచ్చిన ఉత్తర్వులను ఆయుధంగా వాడుకుని, ఆధార్ అనుసంధానతను తెరపైకి తెచ్చారంది. ఆధార్ చట్టబద్ధతపై కొనసాగుతున్న విచారణలో భాగంగా బుధవారం సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం పైవిధంగా స్పందించింది. ఆధార్–మొబైల్ తప్పనిసరి అనుసంధానంపై తామేమీ ఆదేశించలేదని స్పష్టం చేసింది. -
పెన్షన్దారులకు ఆ రెండు తప్పనిసరి
న్యూఢిల్లీ : నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్) సబ్స్క్రైబర్లకు మొబైల్ నెంబర్, బ్యాంకు అకౌంట్ను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ పీఎఫ్ఆర్డీఏ తప్పనిసరి చేస్తున్నట్టు ఆర్థిక మంత్రిత్వశాఖ పేర్కొంది. మనీ లాండరింగ్ నివారణ చట్ట మార్గదర్శకాల ప్రకారం, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ప్రస్తుతమున్న సబ్స్క్రైబర్లకు, కొత్త సబ్స్క్రైబర్లకు ఫారిన్ అకౌంట్ ట్యాక్స్ కంప్లియెన్స్ యాక్ట్, సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యురిటైజేషన్ అసెట్ రికన్స్ట్రక్షన్ అండ్ సెక్యురిటీ ఇంటరెస్ట్లను తప్పనిసరి చేసింది. నేషనల్ పెన్షన్ స్కీమ్ను సులభతరం చేసేందుకు, మెరుగుపరుచేందుకు ఎప్పడికప్పుడు పెన్షన్ అథారిటీ పలు కార్యక్రమాలను చేపడుతోంది. ఈ క్రమంలోనే సబ్స్క్రైబర్ల ప్రయోజనార్థం, ఆపరేషన్ను సులభతరం చేసేందుకు బ్యాంకు అకౌంట్ వివరాలను, మొబైల్ నెంబర్ను తప్పనిసరి చేసిన్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. సబ్స్క్రైబర్లు తప్పనిసరి నమోదు చేయాల్సిన వాటిలో వివరాలను కచ్చితంగా వెల్లడించాల్సి ఉందని, వాటిని బ్లాంక్గా వదిలేయకూడదని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఒకవేళ బ్లాంక్గా వదిలేస్తే దరఖాస్తు తిరస్కరించబడుతుందని పేర్కొంది. -
ఆధార్ లింక్ చేసినా నంబర్ మార్చుకోవచ్చు
పశ్చిమగోదావరి , నిడమర్రు:ఆధార్ కార్డును ఎప్పటికప్పుడు నవీకరించుకోవడం ఉపయోగకరం. కార్డులు చిన్న చిన్న తప్పులుంటే సరిచేసుకునే విషయంలో అశ్రద్ధ చేయవద్దు. అత్యవసరమైనప్పుడు ఆదరాబాదరగా మార్చుకునేందుకు ఇటీవల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటిలో ఆధార్ తీసుకునే సమయంలో లింక్ చేసిన మొబైల్ నంబర్ ఒకటి.. దీంతో ఆధార్లో పేరు మార్చుకోవాలన్నా, తప్పులు సరిచేసుకోవాలన్నా మీ మొబైల్కే నాలుగు అంకెల ఓటీపీ కోడ్ వస్తుంది. ఆ ఓటీపీ సమర్పించాకే మీ పేరు మారుతుంది. అయితే మీ ఇంటి వద్ద కూర్చొని ఆన్లైన్లో ఆధార్ వెబ్సైట్లో మొబైల్ నంబరు మార్చటం తెలుసుకుందాం.. మార్చేందుకు రెండు పద్ధతులు ♦ ఆన్లైన్లో.. మీరు ఇంతకు ముందే మీ మొబైల్ నంబర్ ఆధార్ కార్డుతో అనుసంధానం చేసి ఉంటే నాలుగు అంకెల ఓటీపీ పనిచేస్తుంది. ♦ ఆఫ్లైన్లో.. ఒకవేళ మీరు మొదటిసారి మీ మొబైల్ నంబర్ను నమోదు చేసుకుంటే లేదా మునుపటి నమోదు చేసిన మొబైల్ నంబర్ వాడుకలో లేని సందర్భంలో ఇది వర్తిస్తుంది. మార్చుకునేందుకు ఆధార్ కేంద్రం వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. ♦ ఆధార్ స్వీయ నవీకరణ–సేవ పోర్టల్ ♦ https://ssup.uidai.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్లి అక్కడ మీ ఆధార్ నంబర్ను నమోదు చేసి, అలానే కింద బాక్స్లో పేర్కొ న్న ధ్రువీకరణ నంబర్ను నమోదు చేయాలి. ♦ ఓటీపీ బాక్స్ కింద కనిపిస్తుంది. అక్కడ మీ మొబైల్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. ♦ కొత్తగా మీ వివరాలు నమోదు చేసుకోవడానికి కొత్త పేజీలోకి తీసుకెళుతుంది. ♦ అక్కడ మీ పేరు, లింగం, చిరునామా, మొబైల్ నంబర్, పుట్టిన తేదీ, ఈ–మెయిల్ ఐడీలను నమోదు చేయవచ్చు. ♦ వివరాలు మొత్తం నమోదు చేసిన తర్వాత కొత్త మొబైల్ నంబరును నమోదు చేసి అప్డేట్ బటన్ మీద క్లిక్ చేయాలి. ♦ ఇది మీ కొత్త సంఖ్యను ప్రదర్శించే కొత్త పేజీకి తీసుకెళుతుంది. దీంతో మీరు ఆధార్కు అనుసంధానం చేసిన మొబైల్ సంఖ్యను మార్చుకున్నట్టే. ఆధార్ కేంద్రం ద్వారా మీ దగ్గరలోని ఆధార్ కేంద్రానికి వెళ్లి ఆధార్ అప్డేట్/కరెక్షన్ ఫారంను పూరించి సమర్పించండి. మీ మొబైల్ నంబర్ని అప్డేట్ చేయడానికి పది రోజుల సమయం పడుతుంది. ఆధార్కు లింక్ చేసిన మొబైల్ నంబర్ మిస్ అయినా ఆధార్ కేంద్రం వద్దకు వెళ్లాల్సిందే. -
ఆమె అందగత్తే కానీ.. ఫ్యాన్స్ చేసిన పనే..
గురుగ్రామ్ : ’హలో’ సినిమాతో హీరోయిన్గా కళ్యాణి ప్రియదర్శన్ తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నారు. పడిచచ్చిపోయే పిచ్చి ఫ్యాన్స్ను కూడా సంపాదించుకున్నారు. అవును. ఆ ఫ్యాన్ ఫాలోయింగే వికాస్ ప్రజాపతి అనే వ్యక్తి పాలిట శరాఘాతంగా మారింది. ’హలో’ చిత్రంలోని ఓ సన్నివేశంలో స్నేహితుడితో విడిపోతున్న చిన్నారి కళ్యాణి ప్రియదర్శన్ వంద రూపాయల నోట్పై ఫోన్ నంబర్ను రాసి కారులోంచి కిందకు వదిలేస్తుంది. ఆ నంబర్ను హీరో అఖిల్ సినిమా చివర్లో తీసుకుంటే.. సినిమా చూసిన వాళ్లలో కొందరు యువకులు మాత్రం అప్పటికప్పుడే నోట్ చేసుకున్నారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మీకే అర్థమై ఉంటుంది. కళ్యాణితో మాట్లాడాలంటూ ఆ నంబర్కు ఫోన్ కాల్స్ వరుస కట్టాయి. వాస్తవానికి ఆ నంబర్ గురుగ్రామ్లో నివసిస్తున్న వికాస్ ప్రజాపతిది. ఆయన వృత్తి రీత్యా కంప్యూటర్ ఆపరేటర్. సినిమా విడుదలైన మరుసటి రోజు నుంచి కళ్యాణితో మాట్లాడాలంటూ వేల సంఖ్యలో కాల్స్ రావడంతో ఏం జరుగుతుందో వికాస్కు అర్థం కాలేదు. అసలు కళ్యాణి ప్రియదర్శన్ ఎవరో తెలుసుకోవడానికి గూగుల్ చేయగా ఆమె ఓ హీరోయిన్ అని తెలిసి షాక్ తిన్నారు. కాల్ చేసిన ప్రతి ఒక్కరికీ అది కళ్యాణి నంబర్ కాదని చెప్పలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వికాస్ వెల్లడించారు. గత ఐదేళ్లుగా తాను ఈ నంబర్ను వాడుతున్నట్లు తెలిపారు. ’హలో’ నిర్మాతలపై కేసు వేస్తున్నట్లు చెప్పారు. మరికొద్ది రోజుల్లోనైనా ఫోన్ కాల్స్ రావడం ఆగుతుందని తాను భావిస్తున్నట్లు వెల్లడించారు. వికాస్ తరఫు కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్న న్యాయవాది మాట్లాడుతూ.. తన క్లయింట్ పర్సనల్ లైఫ్ను కళ్యాణి ఫ్యాన్స్ నాశనం చేశారని అన్నారు. వరుస ఫోన్ కాల్స్ రావడం వల్ల ఆఫీసులో పని చేయలేక వికాస్ తన బాస్లతో తిట్లు తినాల్సి వచ్చిందని తెలిపారు. భార్య, బిడ్డలతో మాట్లాడటానికి కూడా గ్యాప్ లేకుండా ఫోన్స్ వచ్చేవని వెల్లడించారు. ప్రజాపతి నోటిసులపై స్పందించిన ’హలో’ నిర్మాతలు ఆ నెంబర్ను వినియోగించేందుకు టెలికాం కంపెనీ నుంచి పర్మిషన్ తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే, తాము అలాంటి అనుమతి ఇవ్వలేదని సదరు టెలికాం కంపెనీ పేర్కొనడం గమనార్హం. -
పెళ్లికూతురు కావలెను అంటున్న హీరో
సాక్షి, చెన్నై: వధువు కావాలంటూ నటుడు ఆర్య తన సెల్ఫోన్ నంబరు సహా ప్రకటించిన వీడియో ప్రకటన ఒకటి మంగళవారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అందులో ఆయన స్నేహితులు కొందరు పెళ్లెప్పుడు చేసుకుంటావు? ప్రేమించిన అమ్మాయిని చేసుకోవచ్చుగా..అంటూ ప్రశ్నిస్తారు. అందుకు ఆర్య.. ‘నాకు ఆ విధంగా ఉంటే చెప్పకుండా దాస్తానా? అమ్మాయి ఎవరూ దొరకడం లేదు.. ఏప్రిల్లో ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి' అంటూ సమాధానం ఇస్తాడు. ఇది ఇలావుండగా వాట్సాప్లో మంగళవారం ఆర్య ఒక వీడియో విడుదల చేశాడు. అందులో ఆయన ఇటీవల విడుదలైన ఆ వీడియో గురించి మాట్లాడారు. ఆవీడియో తనకు తెలియకుండా జిమ్లో స్నేహితులు తీశారని, అందులో మాట్లాడిన విషయం నిజమేనన్నాడు. ప్రస్తుతం తాను అమ్మాయి కోసం తీవ్రంగా అన్వేషిస్తున్నట్లు తెలిపాడు. బంధువులు, స్నేహితులు, వెబ్సైట్ ద్వారా వధువు కోసం అన్వేషిస్తారని పేర్కొన్నాడు. తాను ప్రస్తుతం మొబైల్ నంబర్ ఇస్తానని, తాను మంచి భర్త కాగలనని ఏఅమ్మాయైనా భావిస్తే, తనను 7330173301 నంబర్ ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు. దీన్ని వేళాకోళంగా తాను చెప్పడం లేదని, తనకు ఎటువంటి నిబంధనలు, అంచనాలు లేవన్నారు. ఇది తన జీవితానికి సంబంధించిన విషయమని, అందుచేత మీ ఫోన్ కాల్స్ కోసం వేచిచూస్తానని ఆ వీడియోలో తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా వ్యాపిస్తోంది. -
గడువు తేదీ చెప్పాల్సిందే
న్యూఢిల్లీ: బ్యాంకులు, టెలికాం సంస్థలు తమ వినియోగదా రులతో సంప్రదింపుల సమయంలో బ్యాంకు ఖాతాలు, మొబైల్ ఫోన్ నంబర్లను ఆధార్తో అనుసంధానించుకునే ఆఖరి తేదీ గురించి తెలియజేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బ్యాంకు ఖాతాలను ఆధార్తో అనుసంధానించుకోవ డానికి ఆఖరితేదీ డిసెంబర్ 31. మొబైల్ నంబర్లను ఆధార్తో అనుసంధానించుకోవడానికి చివరి తేదీ 2018 ఫిబ్రవరి 6. ఆధార్ చట్టం రాజ్యాంగబద్ధత.. బ్యాంకు ఖాతాలు, మొబైల్ నంబర్లను ఆధార్ సంఖ్యతో అనుసంధానించుకోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆధార్కు సంబంధించిన అన్ని పిటిషన్లపై ఈ నెలాఖరులో రాజ్యాంగ ధర్మాసనం తుది విచారణ చేపడుతుందని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని బెంచ్ ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఆఖరి తేదీ లేకుండా సందేశాలు పంపొ ద్దని కేంద్ర ప్రభుత్వం బ్యాంకులు, టెలికాం సంస్థలను ఆదేశిం చాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. దీనికి స్పందించిన ధర్మాసనం బ్యాంకులు, టెలికాం సంస్థలు పంపే ఎస్ఎంఎస్ల్లో బ్యాంకు ఖాతాలు, మొబైల్ నంబర్లకు ఆధార్ లింకింగ్కు చివరి తేదీలను స్పష్టం చేయాలని పేర్కొంది. బ్యాంకు ఖాతాలకు డిసెంబర్ 31, మొబైల్ నంబర్లకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 6వ తేదీ అని వాటిలో తెలియజేయాలంది. రాజ్యాంగ ధర్మాసనం ఎదుట విచారణకు రానున్న ప్రధాన పిటిషన్తో పాటు నాలుగు వేర్వేరు పిటిషన్లను సైతం కలిపి రాజ్యాంగ ధర్మాసనం విచారించనున్నట్టు వెల్లడించిన బెంచ్.. దీనిపై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. -
జిల్లాలో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్స్
లబ్బీపేట(విజయవాడతూర్పు) : నగదు రహిత సేవలను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకు వచ్చే లక్ష్యంగా జిల్లాలో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్స్ అందుబాటులోకి వచ్చాయి. తమ మొబైల్ నంబర్నే అకౌంట్ నంబరుగా వినియోగిస్తూ నగదు డిపాజిట్, విత్డ్రాల్తోపాటు, అన్ని జాతీయ బ్యాంకులు, ఫోన్ బిల్స్, కరెంటు, ఇతర పన్నులను చెల్లించే అవకాశం ఉన్నట్లు నగరంలోని ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ప్రతినిధి మద్ది శరత్ చెప్పారు. గవర్నర్పేట రాజగోపాలచారి వీధిలోని తన షోరూమ్లో గురువారం ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ వినియోగంపై మీడియాకు వివరించారు. ఈ నెట్వర్క్కు చెందిన మొబైల్ నంబరు ఉన్నా, తమ స్మార్ట్ఫోన్లోకి ఎయిర్టెల్ మనీ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే, పేమెంట్ బ్యాంక్ అకౌంట్ను పొందవచ్చన్నారు. ఆ కౌంట్లో రూ. వంద నుంచి ఎంత మొత్తాన్ని అయినా డిపాజిట్ చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్లోని నగదును తమ ఇతర బ్యాంక్ ఖాతాలోకి, ఇతరుల ఖాతాలోకి సులువుగా ట్రాన్స్ఫర్ చేయవచ్చన్నారు. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ సేవింగ్ అకౌంట్లోని మొత్తంపై దేశంలోనే అత్యధికంగా 7.50 శాతం వడ్డీ చెల్లించనున్నట్లు తెలిపారు. ప్రతి అకౌంట్ దారునికి రూ.లక్ష పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూ్యరెన్స్ సౌకర్యం కల్పించనున్నట్లు శరత్ తెలిపారు. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఖాతాదారుల్లో 70 శాతం గ్రామీణులు ఉండేలా చూడడమే లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల వాసులకు నగదు రహిత సేవలు అందుబాటులోకి తీసుకు రావడమే లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. -
బాలికపై పది రోజుల పాటు అత్యాచారం
బంజారాహిల్స్ (హైదరాబాద్): బాలికను అపహరించి రోజుల తరబడి అత్యాచారం చేసిన నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నెం. 11లోని ఉదయ్నగర్లో నివసించే బట్టు రాము(21) తన ఇంటి పక్కన నివసిస్తున్న ఆరో తరగతి విద్యార్థిని(11)ని గత కొంత కాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. వారం క్రితం బాలికను అపహరించి నిజామాబాద్ జిల్లా బాన్సువాడకు తీసుకెళ్లి అక్కడ తనకు బాగా తెలిసిన వారి ఇంట్లో ఉంచాడు. పది రోజుల పాటు ఆమెపై అత్యాచారం చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించి... సెల్ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశారు. -
దారుణ మాఫీ
రైతులకు సవాలక్ష ఆంక్షలు 30 అంశాలతో ప్రొఫార్మా ఆధార్, రేషన్కార్డు, మొబైల్ నెంబర్ తప్పనిసరి ఇవ్వనిపక్షంలో మాఫీ లేనట్లే వివరాల సేకరణ విధి విధానాలపైనేడు కలెక్టర్ సమీక్ష రుణమాఫీకి విధిస్తున్న ఆంక్షలతో రైతులకు తల తిరిగిపోతోంది. సాధ్యమైనంతగా బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వం సవాలక్ష అడ్డంకులను సృష్టిస్తోంది. సాగుబాటలో పల్లేరు ముళ్లు పరుస్తోంది. 30 అంశాలతో సృష్టించిన ప్రొఫార్మాతో అన్నదాతకు అడుగు ముందుకు సాగని పరిస్థితి ఎదురవుతోంది. దా‘రుణమాఫీ’ నాటకాన్ని గమనిస్తున్న కర్షకుల్లో ఆక్రోశం కట్టలు తెంచుకుంటోంది. విశాఖ రూరల్ : రుణమాఫీపై ప్రభుత్వం సవాలక్ష ఆంక్షలు విధిస్తోంది. లబ్ధిదారుల సంఖ్యను వీలైనంత కుదించే ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం 30 అంశాలతో ఒక ప్రొఫార్మా తయారు రైతుల వివరాలను సేకరించాలని బ్యాంకర్లను ఆదేశించింది. ప్రధానంగా ఆధార్, రేషన్కార్డులతో పాటు మొబై ల్ నెంబర్ కూడ తప్పకుండా ఇవ్వాలన్న నిబంధన పెట్టింది. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా రుణం మాఫీ జరిగే అవకాశం లేకుండా చేసింది. దీంతో రైతాంగంలో ఆందోళన మొదలైంది. ఈ వివరాల సేకరణ విధానంపైనే కాకుండా జిల్లాలో ఎంత మంది లబ్ధిదారులు, ఎంతమొత్తం మాఫీ చేయాల్సి ఉందో అధికారులు 14 రోజుల్లో నివేదిక తయారు చేయనున్నారు. దీనిపై కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ బ్యాంకు కంట్రోలింగ్ అధికారులు, వ్యవసాయాధికారులతో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. 14 రోజుల్లో జాబితా : జిల్లాలో గత రబీ, ఖరీఫ్ సీజన్లలో అన్ని రకాల పంట రుణాలు కలిపి రూ.1040 కోట్ల మేర రైతులు బ్యాంకర్లకు బకాయి పడ్డారు. చంద్రబాబు రుణాలు రద్దు చేస్తామని ప్రకటించడంతో రైతులు రుణాలు చెల్లించలేదు. తాజాగా రైతులతో పాటు అన్ని పక్షాల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి 174 జీవోను జారీ చేసింది. రైతు కుటుంబానికి గరిష్టంగా రూ.1.5 లక్షల వంతున పంట రుణం మాఫీ చేస్తామని ప్రకటించింది. లబ్ధిదారుల ఏరివేత కోసం 30 అంశాలతో ఒక ప్రొఫార్మాను రూపొందించింది. గత ఏడాది రుణాలు పొందిన రైతుల నుంచి ఆ వివరాలన్నింటినీ సేకరించి 14 రోజుల్లో జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించింది. ఈ బాధ్యతలను కలెక్టర్కు అప్పగించింది. ఇదిలా ఉంటే జిల్లాలో ఇప్పటికీ ఆధార్కార్డులు, రేషన్కార్డులు లేని వారు అనేకమంది ఉన్నారు. అటువంటి వారికి రుణాలు రద్దయ్యే అవకాశం లేదు. ఏజెన్సీలో ైరె తులకు ఫోన్ నెంబర్లు ఉండవు. అటువంటి వారి పరిస్థితి ఏమిటన్న విషయంపై స్పష్టత లేదు. దీంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. నేటి నుంచి కసరత్తు : జిల్లాలో రుణమాఫీ లబ్ధిదారుల జాబితా రూపకల్పనకు మంగళవారం నుంచి కసరత్తు ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు జిల్లాలో ఎంత మంది రైతులు ఎంత మొత్తంలో పంట రుణాలు పొందారో స్పష్టమైన వివరాలు అధికారుల వద్ద లేదు. తాజాగా ఒక కుటుంబానికి రూ.1.5 లక్షలు మాత్రమే రుణాలు రద్దు చేస్తామని ప్రభుత్వం నిర్ణయించడంతో.. ఆ దిశగా లబ్ధిదారుల వడపోత జరగనుంది. ఒక కుటుంబంలో ఎంత మంది బ్యాంకు రుణాలు పొందారో రేషన్కార్డు, ఓటరు కార్డుల ద్వారా అధికారులు వివరాలను సేకరించనున్నారు. ఈ వివరాలు ఇవ్వని వారికి రుణమాఫీ వర్తించే అవకాశం లేదు. రెండు వారాల్లో ఈ జాబితాను తయారు చేయాల్సి ఉండడంతో వివర ల సేకరణ ఏ విధంగా చేపట్టాలన్న విషయంపై కలెక్టర్ బ్యాంకు కంట్రోలింగ్ అధికారులు, వ్యవసాయాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. రుణాలు పొందిన వారు ప్రొఫార్మాలో ఉన్న వివరాలను బ్యాంకులకు ఇవ్వాలని ప్రకటిస్తే ఒక్కసారిగా రైతులందరూ బ్యాంకులకు క్యూలు కట్టే అవకాశమున్నందున వారం రోజుల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ విధంగా ఈ ప్రక్రియను చేపట్టాలన్న విషయంపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ప్రక్రియ పూర్తియితే జిల్లాలో ఎంత మంది లబ్ధిదారులు, ఎంత మొత్తంలో రుణాలు రద్దవుతాయన్న విషయం స్పష్టమవుతుందని కలెక్టర్ తెలిపారు. -
ఇక పూర్తి స్థాయి నంబర్ పోర్టబిలిటీ
* పంచాయతీల్లో బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ సవరణ ప్రతిపాదనకు ఓకే * నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల్లో టెలికం సేవల విస్తృతిపై దృష్టి * టెలికం కమిషన్ నిర్ణయాలు న్యూఢిల్లీ: దేశంలో ఏ ప్రాంతానికి వె ళ్లినా, ఆపరేటరును మార్చినా మొబైల్ నంబరును మార్చుకోవాల్సిన పని లేకుండా పూర్తి స్థాయి మొబైల్ నంబరు పోర్టబిలిటీకి (ఎంఎన్పీ) టెలికం కమిషన్ సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఎంఎన్పీ విధానం ప్రకారం ఆపరేటరు మారినా ఒకే నంబరును కొనసాగించుకునే వెసులుబాటు ఒక సర్కిల్కి మాత్రమే పరిమితమైంది. టెలికం కమిషన్ నిర్ణయంతో.. సర్కిల్ మారినా కూడా దేశవ్యాప్తంగా ఈ వెసులుబాటు లభిస్తుంది. పూర్తి స్థాయి ఎంఎన్పీ అమలు విషయంలో బ్యాంకు గ్యారంటీలు తదితర అంశాల గురించి ట్రాయ్ నుంచి మరింత అదనపు సమాచారాన్ని టెలికం కమిషన్ కోరనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. శుక్రవారం సమావేశమైన అంతర -మంత్రిత్వ శాఖల టెలికం కమిషన్.. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పలు ప్రతిపాదనలను ఆమోదించింది. 2.5 లక్షల గ్రామ పంచాయతీల్లో జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ (ఎన్వోఎఫ్ఎన్) ప్రాజెక్టు గడువును 2017 మార్చి దాకా పొడిగిస్తూ సవరించిన ప్రతిపాదనకు ఓకే చెప్పింది. దాదాపు రూ. 20,000 కోట్ల ఈ ప్రాజెక్టు 2015 సెప్టెంబర్ నాటికి పూర్తి కావాల్సి ఉంది. ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్, పవర్గ్రిడ్, రెయిల్టెల్తో ఏర్పాటు చేసిన భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ ఇందులో సింహభాగం పనులు చేపడుతోంది. నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లో మొబైల్ టవర్లు.. తొమ్మిది నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లో టెలిఫోన్ సేవలు విస్తరించేందుకు మొబైల్ టవర్లను ఏర్పాటు చేయాలన్న యోచనకు టెలికం కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో టెలికం నెట్వర్క్ను పటిష్టం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ. 2,900 కోట్ల వ్యయం కాగలదని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ అంచనా వేసింది. ఈ ప్రతిపాదనలను క్యాబినెట్ తుది ఆమోదానికి పంపనున్నారు. ఎన్వోఎఫ్ఎన్ ఇన్ఫ్రాను వినియోగించుకునే గవర్నమెంట్ యూజర్ నెట్వర్క్ (గన్) అనే వైఫై ప్రాజెక్టుకు కూడా టెలికం కమిషన్ ఆమోదముద్ర వేసింది. దీనికి రూ. 25,000 కోట్ల మేర నిధులు అవసరమవుతాయని అంచనా. అటు ప్రభుత్వోద్యోగులకు శిక్షణ కల్పించేందుకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఫైనాన్స్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు కూడా ఆమోదం లభించింది. దీనిపై క్యాబినెట్ తుదినిర్ణయం తీసుకోనుంది.