opening ceremony
-
అగరం కొత్త కార్యాలయ ప్రారంభోత్సవంలో సూర్య-జ్యోతిక (చిత్రాలు)
-
సందడిగా ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం (ఫొటోలు)
-
చెన్నై షాపింగ్ మాల్ లో మీనాక్షి చౌదరి సందడి
-
పారిస్ మళ్లీ మురిసె...
పారిస్: మొన్న రెగ్యులర్ ఒలింపిక్స్ను ఎంత వైభవంగా ఆరంభించారో... దివ్యాంగుల కోసం నిర్వహించే పారాలింపిక్స్ను కూడా అంతే అట్టహాసంగా అంగరంగ వైభంగా ప్రారంభించారు. దీంతో మరోసారి పారిస్ కలలు, కళాకారులు, నృత్యరీతులు, పాప్ గీతాలతో విశ్వక్రీడల శోభకు వినూత్న ‘షో’కులద్దింది. కనుల్ని కట్టిపడేసే వేడుకలు ఆద్యంతం అలరించాయి. పలు ఆటపాటలు, కళాకారుల విన్యాసాల అనంతరం ఫ్రాన్స్ జెండాలోని మూడు రంగుల్ని ఆరు ఫ్లయిట్లు ఆకాశానికి పూసినట్లుగా చేసిన ఎయిర్ షో వీక్షకుల్ని విశేషంగా కట్టిపడేసింది. ఆ వెంటే మార్చ్పాస్ట్ మొదలైంది. ఒలింపిక్స్ ప్రారంబోత్సవంలో పడవలపై మార్ప్పాస్ట్ సాగితే... పారాలింపిక్స్ మార్చ్పాస్ట్ పారిస్ రహదారిపై కేరింతగా రెగ్యులర్ ఒలింపిక్స్కు ఏమాత్రం తీసిపోని విధంగా జరిగింది. రేపటి నుంచి పోటీలు జరుగుతాయి. 11 రోజుల పాటు జరిగే పారా విశ్వక్రీడల్లో 4000 మందికి పైగా దివ్యాంగ అథ్లెట్లు 22 క్రీడాంశాల్లో పోటీపడతారు. రెగ్యులర్ ఒలింపిక్స్ను ఆదరించినట్లుగానే ఈ క్రీడలను ప్రత్యక్షంగా తిలకించేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపారని నిర్వాహకులు తెలిపారు. 2 మిలియన్ల (20 లక్షలు)కు పైగా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవడమే ఆదరణకు నిదర్శనమని నిర్వాహకులు తెలిపారు. అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ (ఐపీసీ) అధ్యక్షుడు ఆండ్రూ పార్సన్స్ మాట్లాడుతూ మరోమారు పారిస్ను ప్రేక్షకుల సమూహం ముంచెత్తనుందన్నారు. మూడేళ్ల క్రితం టోక్యోలో కోవిడ్ మహమ్మారి కారణంగా పారా అథ్లెట్లంతా ఖాళీ స్టాండ్ల (ప్రేక్షకులు లేక) ముందు తమ ప్రదర్శన కనబరిచారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండబోదని క్రీడాభిమానుల కరతాళధ్వనుల మధ్య పారాలింపియన్లు పోటీలను పూర్తిచేస్తారని నిర్వాహకులు చెప్పారు. గురువారం ముందుగా తైక్వాండోలో పారాలింపియన్లు పతకాల బోణీ కొట్టనున్నారు. దీంతో పాటు పోటీల తొలిరోజు టేబుల్ టెన్నిస్, ట్రాక్ సైక్లింగ్ పోటీలు జరుగుతాయి. -
ముసుగు ధరించి.. చరిత్రను చెబుతూ.. అట్టహాసంగా పారిస్ ఒలింపిక్స్ ప్రారంభం (ఫొటోలు)
-
10,500 మంది... ఒకటే స్వప్నం!.. నేటి నుంచి పారిస్ ఒలింపిక్స్
పతకం... పతాకం... ఒక అథ్లెట్కు వీటితో విడదీయరాని బంధం... పతకం గెలిచిన వేళ జాతీయ పతాకం ఎగురుతుంటే సగర్వంగా నిలబడి ఆ అనుభూతిని పొందగలగడం ఒక్క క్రీడాకారుడికి మాత్రమే సాధ్యం... అదీ ఒలింపిక్స్లాంటి అత్యంత ప్రతిష్టాత్మక వేదికపై అంటే అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు... ఆ భావోద్వేగ క్షణం కోసమే సంవత్సరాల శ్రమ, పోరాటం, పట్టుదల... ప్రణాళికలు, వ్యూహాలు, సన్నాహాలు, శిక్షణ... డైట్, ఫిట్నెస్, మెంటల్ స్ట్రెంత్... అన్నీ అన్నీ కలగలిస్తే ఒలింపిక్స్ పతకం... ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారుల కల ఒలింపిక్స్లో మెడల్ గెలుచుకోవడమే... ఎన్ని చాంపియన్షిప్లు సాధించినా, ఎన్ని ట్రోఫీలు గెలుచుకున్నా, ఒలింపిక్ పతకం మాత్రమే అథ్లెట్ను ఆకాశాన నిలబెడుతుంది. ఆ కంఠాభరణం మెరుపుల ముందు ఎన్ని ఆభరణాలైనా తక్కువే. స్వర్ణం, రజతం, కాంస్యం... పేర్లు వేరు కావచ్చు... కానీ వీటిలో ఏ పతకం సాధించినా ఆయా అథ్లెట్లకు అది బంగారంతో సమానమే. ఒక్క ఒలింపిక్ పతకంతోనే చరిత్రను సృష్టించినవారు కొందరైతే ... మళ్లీ మళ్లీ గెలుస్తూ వాటిని అలవాటుగా మార్చుకున్న దిగ్గజాలు కూడా ఎందరో... ఇప్పుడు మరోసారి ఆ విశ్వ సమరానికి సమయం వచ్చేసింది. పతకం వేటలో సర్వం ఒడ్డేందుకు ఆటగాళ్లు సిద్ధమయ్యారు. వందేళ్ల తర్వాత ‘ఫ్యాషన్ సిటీ’ పారిస్ మరోసారి మెగా ఈవెంట్ కోసం ముస్తాబైంది. ఇన్నేళ్ల ఒలింపిక్స్లలో ఎన్నడూ చూడని పలు విశేషాలతో ఈ సంబరాన్ని జయప్రదం చేసేందుకు నిర్వాహకులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ప్రారం¿ోత్సవ కార్యక్రమం మొదలు విజేతలకు అందించే పతకాల్లో చరిత్రను చేర్చడం వరకు అన్నింటా తమ ప్రత్యేకత కనిపించేలా సిద్ధం చేశారు. 124 ఏళ్ల క్రితం పారిస్ ఒలింపిక్స్లోనే తొలిసారి మహిళలు అడుగు పెట్టగా... ఇప్పుడు అదే గడ్డపై జరుగుతున్న పోటీల్లో తొలిసారి పురుషులు, మహిళలు సమాన సంఖ్యలో బరిలోకి దిగుతుండటం విశేషం. ఇంట్లో శుభకార్యాన్ని పర్యవేక్షించే పెద్ద మనిషి తరహాలో దాదాపు వేయి అడుగుల ఎత్తులో ఠీవిగా నిలబడిన ఈఫిల్ టవర్ సాక్షిగా రెండు వారాల పాటు ఒలింపిక్ వేడుకలు అంబరాన్నంటనున్నాయి. మూడేళ్ల క్రితం చుట్టూ కోవిడ్ ముసురుకున్న సమయంలో సాగిన టోక్యో ఒలింపిక్స్ అభిమానులకు అర్ధ ఆనందాన్ని మాత్రమే అందించాయి. ఇప్పుడు జరిగే పోటీలు గత గేమ్స్కు భిన్నంగా ఫ్యాన్స్కు చేరువగా వచ్చి సంబరంలో భాగం చేయనున్నాయి. హోరాహోరీ సమరాల్లో 206 దేశాల నుంచి 10,500 మంది అథ్లెట్లు 32 క్రీడాంశాల్లో పోటీ పడిన తర్వాత ఎవరు పతకధారిగా శిఖరాన నిలుస్తారో, ఎవరు గుండె పగిలి కన్నీళ్లతో తిరిగొస్తారో చూడాలి! –సాక్షి క్రీడా విభాగంతొలిసారి స్టేడియం బయట...ఒలింపిక్స్ ప్రారంబోత్సవ వేడుకలను ప్రధాన స్టేడియం లోపల పరిమిత ప్రేక్షకుల మధ్య నిర్వహించడం రివాజు. ఇన్నేళ్ల చరిత్రలో ఇది ఎప్పుడూ మారలేదు. కానీ ఈసారి పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు ఈ వేడుకలను స్టేడియం బయటకు తీసుకొస్తున్నారు. నగరం నడి మధ్యలో సెన్ నది పక్కన పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజల సమక్షంలో ఈ వేడుకలు జరగనున్నాయి. సాధ్యమైనంత ఎక్కువ మంది దీనికి హాజరయ్యేలా సాధారణ పౌరులందరినీ అనుమతిస్తున్నారు. పారిస్ నగరవాసులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏ దేశానికి చెందినవారైనా సరే ఈ వేడుకల్లో పాల్గొనవచ్చు. ఎనభై భారీ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒలింపిక్ క్రీడల చరిత్రలోనే వీటిని అతి పెద్ద వేడుకలుగా చెప్పవచ్చు. దాదాపు వంద బోట్లలో వివిధ దేశాల క్రీడాకారులు సెన్ నదిపై బోటులో ప్రయాణిస్తూ పరేడ్లో పాల్గొంటారు. 10,500 మంది అథ్లెట్లు ఇందులో పాల్గొననుండటం విశేషం. ఆరు కిలోమీటర్ల పొడవున సాగే ఈ పరేడ్ పారిస్ నగరం నడిమధ్యలోంచి వెళ్లి చివరకు ట్రొకాడెరో వద్ద ముగుస్తుంది. ఈ ప్రాంతానికి చారిత్రక ప్రాధాన్యత ఉండటంతో పాటు అందమైన గార్డెన్లు, ఫౌంటేన్లకు ప్రసిద్ధి. గతంలో ఎన్నడూ లేని విధంగా అథ్లెట్లందరినీ ప్రారం¿ోత్సవ వేడుకల్లో వేదికపైకి ఆహ్వావనించి పరిచయం చేయబోతున్నారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటల నుంచి వేడుకలు మొదలవుతాయి. ప్రారంబోత్సవంలో ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి, ఎవరెవరు ఏం చేయబోతున్నారు అనే విషయాలను మాత్రం నిర్వాహకులు గోప్యంగానే ఉంచారు. అసలు రోజు మాత్రమే దానిని ‘సర్ప్రైజ్’గా చూపించాలని వారు భావిస్తున్నారు. ఎప్పటిలాగే పరేడ్లో అందరికంటే ముందు గ్రీస్ దేశపు ఆటగాళ్లు రానుండగా... ఆ తర్వాత శరణార్ధి జట్టు గ్రీస్ను అనుసరిస్తుంది. ఆ తర్వాత ఆంగ్ల అక్షర క్రమంలో ఆయా దేశాలు పాల్గొంటాయి. నిర్వాహక దేశం ఫ్రాన్స్ ఈ పరేడ్లో చివరగా వస్తుంది. ఉక్రెయిన్తో యుద్ధం కారణంగా తమ దేశం తరఫున కాకుండా వ్యక్తిగత హోదాలో పోటీల బరిలోకి దిగుతున్న రష్యా, బెలారస్ ఆటగాళ్లు ఎవరూ పరేడ్లో పాల్గొనరు. దాదాపు నాలుగు గంటల పాటు ఈ మొత్తం ఈవెంట్ సాగే అవకాశం ఉంది. » ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి పురుషులు, మహిళలు సమాన సంఖ్యలో బరిలోకి దిగుతున్నారు. ఈ పోటీల్లో 5,250 మంది పురుషులు, 5,250 మంది మహిళలు సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. » ఒలింపిక్స్లో తొలిసారి ఆరి్టస్టిక్ స్విమ్మింగ్ పోటీల్లో పురుషులు కూడా పోటీ పడనున్నారు. » లండన్ (1908, 1948, 2012) తర్వాత మూడుసార్లు ఒలింపిక్స్ నిర్వహిస్తున్న రెండో నగరంగా పారిస్ (1900, 1924, 2024) గుర్తింపు పొందింది. 1924 జూలై 27న పారిస్లో ముగింపు ఉత్సవం జరగా... ఇప్పుడు 100 ఏళ్ల తర్వాత జూలై 26న ప్రారంబోత్సవ కార్యక్రమం జరుగుతోంది. » మొత్తం క్రీడాంశాలు 32... పతకం గెలుచుకునే అవకాశం ఉన్న ఈవెంట్లు 329. » అత్యధికంగా అక్వాటిక్స్లో 49 మెడల్స్ అందుబాటులో ఉండగా... అథ్లెటిక్స్లో 48 మెడల్ ఈవెంట్లు ఉన్నాయి. » పారిస్ నగరం, దాని శివార్లలో కలిపి మొత్తం 35 వేదికల్లో పోటీలు జరుగుతాయి. బీచ్ వాలీబాల్ పోటీలను ఈఫిల్ టవర్ పక్కనే నిర్వహిస్తుండటం విశేషం. » ఒలింపిక్స్ ఈవెంట్లలో ఒకటైన సర్ఫింగ్ ను ‘తహితి’ దీవుల్లో నిర్వహిస్తున్నారు. ఫ్రాన్స్కు దాదాపు 15 వేల కిలో మీటర్ల దూరంలో పసిఫిక్ మహా సముద్రం మధ్యలో ఈ దీవి ఉంది. ఆ్రస్టేలియా, న్యూజిలాండ్లకు ఇది దగ్గరగా ఉంటుంది. అయితే ఇది ఫ్రెంచ్ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న దీవి కావడంతో ఒలింపిక్స్ వేదికల్లో ఒకదానిని దీనిని కూడా ఎంపిక చేయడం విశేషం. » క్రీడా గ్రామంలో మొత్తం 14,250 మంది కోసం గదులు సిద్ధం చేశారు. ప్రతీ రోజూ కనీసం 60 వేల భోజనాలు అందిస్తారు. క్రీడల తర్వాత దీనిని ఒక బస్తీగా మారుస్తున్నారు. నిర్వహణలో సహాయకారిగా ఉండేందుకు 40 వేల మంది వలంటీర్లు ఈ గేమ్స్లో అందుబాటులో ఉన్నారు. -
ఆమె కోసమే కాఫీ: శర్వా
బంజారాహిల్స్: ‘నేను పెళ్లి కాకముందు టీ, కాఫీలు తాగేవాడిని కాదు.. పెళ్లయ్యాక నా భార్యకు కాఫీ అంటే ఇష్టమని తనకోసమే కాఫీని ఎంజాయ్ చేస్తున్నాను’ అని హీరో శర్వానంద్ అన్నారు. జూబ్లీహిల్స్లో తన సోదరుడు ఏర్పాటు చేసిన బీన్జ్ కాఫీ షాప్ను వైద్య ఆరోగ్య శాఖమంత్రి దామోదర రాజనర్సింహ్మ, ఏపీ రెవెన్యూ శాఖమంత్రి అనగాని సత్యప్రసాద్ తో కలిసి ప్రారంభించారు. 2008 సమయంలో తన కాఫీ షాప్లో అప్పట్లో హీరోలు రామ్చరణ్, అఖిల్తో పాటు చాలా మంది కలిసేవాళ్లమని, వారితో ఎన్నో మెమొరీలు ఉన్నాయన్నారు. ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నహీరోలు ఈ వ్యాపారంలోకొస్తే క్వాలిటీ ఫుడ్ ఇస్తారని, తనకు వంట రాదని, కానీ ఏం నచి్చనా వండించుకొని తినేస్తానంటూ చెప్పుకొచ్చారు. విభిన్న రుచులతో పాటు కాంటినెంటల్ రెసిపీలను అందిస్తున్నట్లు నిర్వాహకులు అర్జున్ మైనేని తెలిపారు. పద్మశ్రీ డాక్టర్ మంజుల అనగాని, డి.వంశీకృష్ణం రాజు, ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. -
లండన్లో శ్రీ వేంకటేశ్వర బాలాజీ దేవాలయ ప్రారంభోత్సవ వేడుకలు (ఫోటోలు)
-
IPL 2024 Opening Photos: అట్టహాసంగా ఆరంభం.. సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
-
ఐపీఎల్ 2024 ఓపెనింగ్ సెర్మనీలో పెర్ఫార్మ్ చేయబోయేది వీరే..!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 17వ ఎడిషన్ మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా మార్చి 22న జరుగనుంది. ఈ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఆర్సీబీతో తలపడుతుంది. భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ఈ మెగా ఫైట్ ప్రారంభమవుతుంది. AR Rahman, Sonu Nigam, Akshay Kumar and Tiger Shroff will perform at the IPL opening ceremony. pic.twitter.com/9kR2dpyOOV — Mufaddal Vohra (@mufaddal_vohra) March 20, 2024 సీజన్ తొలి మ్యాచ్ కావడంతో మ్యాచ్కు ముందు ఓపెనింగ్ సెర్మనీ అరేంంజ్ చేశారు నిర్వహకులు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ నటులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్, సింగర్ సోనూ నిగమ్ పెర్ఫార్మ్ చేయనున్నారు. ఈ కార్యక్రమం మ్యాచ్ ప్రారంభానికి గంట ముందు (6:30 గంటలకు) జరుగనుంది. ఈ ఈవెంట్ను స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనుండగా.. జియో సినిమాలో డిజిటల్ స్ట్రీమింగ్ జరుగనుంది. ఇదిలా ఉంటే, సీఎస్కే-ఆర్సీబీ మధ్య హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఐదు సార్లు ఛాంపియన్ అయిన సూపర్ కింగ్స్కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘనమైన రికార్డు ఉంది. ఈ ఇరు జట్లు ఐపీఎల్లో 31 సార్లు ఎదురెదురుపడగా.. సీఎస్కే 20, ఆర్సీబీ 10 సందర్భాల్లో విజయం సాధించాయి. ఓ మ్యాచ్లో ఫలితం తేలలేదు. చెపాక్ విషయానికొస్తే.. ఈ మైదానంలో సీఎస్కే ఆర్సీబీపై సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉంది. ఇక్కడ ఇరు జట్లు 8 మ్యాచ్ల్లో తలపడగా.. సీఎస్కే ఏకంగా ఏడు మ్యాచ్ల్లో జయకేతనం ఎగురవేసింది. కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే ఆర్సీబీ విజయం సాధించింది. -
అయోధ్య రామాలయం రెడీ
దేవతలు నిర్మించిన పవిత్ర నగరం. సాక్షాత్తు రాముడు నడిచిన పవిత్ర నేల. త్రేతాయుగం నాటి రామరాజ్యానికి నిలువెత్తు నిదర్శనం. ఎట్టకేలకు దశాబ్దాల నాటి హిందువుల కల నెరవేరబోతోంది. రామమందిర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. కింది అంతస్తు పనులు దాదాపు పూర్తికావచ్చాయి. ఇందులోనే రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 22న జరిగే ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. వేద మంత్రాల నడుమ కన్నుల పండువగా జరిగే శ్రీరాముడి ప్రాణప్రతిష్టకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి దేశంలోని 8వేల మంది ప్రముఖులను కూడా ఆహ్వానిస్తన్నారు. ఇంతకీ ప్రస్తుతం అయోధ్య రామమందిర నిర్మాణం ఎక్కడి వరకు వచ్చింది ? జనవరి 22న జరిగే కార్యక్రమానికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ? 2024, జనవరి 22.. దేశప్రజలకు ప్రత్యేకమైన రోజుగా మారనుంది. అయోధ్య రామ మందిర్ దర్శనం కోసం ఎదురు చూస్తున్న కోట్లాది మంది హిందువులకు శుభవార్త అందింది. రామాలయ ప్రారంభోత్సవ వేడుక జనవరి 22న అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దశాబ్దాల సమస్య తీరిపోయి అయోధ్యలో దివ్యమైన రామ మందిర నిర్మాణం శరవేగంగా నిర్మాణం జరిగింది. దీంతో ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని యూపీ ప్రభుత్వం భారీ సన్నాహాలు చేస్తోంది. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరాన్ని సందర్శించే భక్తులు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జన్మభూమి కాంప్లెక్స్లో మరో 7 ఆలయాలను దర్శించుకోవచ్చు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గోవాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పోస్టు ద్వారా అందరికీ ఆహ్వానాలు పంపుతున్నారు. దీనికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ వస్తున్నారు. ఆయనతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వీరితో పాటు.. పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపుతున్నారు. ఆ జాబితాలో సినీరంగం నుంచి అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ తో పాటు ఇతర ప్రముఖులు.. అలాగే పారిశ్రామిక రంగం నుంచి రతన్ టాటా, ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ లాంటి ప్రముఖులు, భారత్ క్రికెట్ రూపురేఖలు మార్చిన దిగ్గజ క్రికెటర్లలో సచిన్, విరాట్ కోహ్లి లాంటి ప్రముఖులకు ఆహ్వానాలు అందినట్లు తెలుస్తోంది. అలాగే పూజారులు, దాతలు సహా దేశంలోని పలువురు రాజకీయ నాయకులు సహా దాదాపుగా 8వేల మందికి ఈ ఆహ్వానాలు అందినట్టు తెలుస్తోంది. ఆహ్వానం అందుకున్న వారిలో పలువురు జర్నలిస్టులు, మాజీ ఆర్మీ అధికారులు, రిటైర్డ్ సివిల్ సర్వెంట్లు, పద్మ అవార్డు గ్రహీతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.ఇందులో 50 మంది కరసేవకుల కుటుంబాలకు కూడా ఆహ్వానం పంపించారు. అయితే రామ్ లల్లాను ఐదేళ్ల బాలుడి రూపంలో ఆలయంలో కూర్చోబెడతారు.. ఇందుకోసం కర్ణాటక, రాజస్థాన్ల నుంచి తీసుకొచ్చిన శిలలతో మూడు విగ్రహాలను తయారుచేశారు.. ఈ విగ్రహాలు దాదాపుగా సిద్ధమయ్యాయి. మరోవైపు రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జనవరి 2024లో రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో అఖండ రామాయణం, హనుమాన్ చాలీసా పారాయణాలను నిర్వహించనున్నారు. అయోధ్యలోని రామాలయం కోసం వినియోగించే ధ్వజ స్తంభాల నిర్మాణ పనులను అహ్మదాబాద్లోని అంబికా ఇంజినీరింగ్ వర్క్స్ కంపెనీ తయారు చేసింది. ఏడు ధ్వజ స్తంభాల బరువు సుమారు 5,500 కిలోలు. రామమందిరం చుట్టూ 800 మీటర్ల పొడవున నిర్మిస్తున్న రింగ్ రోడ్డు చివరి దశలో ఉంది. మరోవైపు ప్రకారం ప్రాకారాలలో నుంచే కాకుండా రింగ్రోడ్డు మార్గం నుంచి కూడా ఆలయాన్ని సందర్శించవచ్చు. ఆలయంలోని నేలను పాలరాతితో తీర్చిదిద్దుతున్నారు. 60 శాతం మేరకు ఫ్లోర్లో మార్బుల్ను అమర్చారు. అలాగే ఆలయ నృత్య మండపంతోపాటు రంగ మండపానికి సంబంధించిన శిఖరం సిద్ధమైంది. కాగా అయోధ్య రామమందిరాన్ని 8.64 ఎకరాల్లో యూపీ ప్రభుత్వం నిర్మించింది. ఈ ఆలయంలో గర్భగుడితో పాటు ఐదు మండపాలు ఉంటాయి. గుధ్ మండపం, రంగ మండపం, నిత్య మండపం, ప్రధాన మండపం, కీర్తన మండపం ఉంటాయి. ఇక జనవరి 22న అయోధ్యలోని నూతన రామాలయంలో శ్రీరాముడు కొలువుదీరనున్న సందర్భంగా.. ఆరోజు నుంచి 20 మంది కొత్త అర్చకులు ఆలయంలో రోజువారీ పూజలను నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలో తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రస్తుతం 20 మంది కొత్త అర్చకులకు శిక్షణ ఇస్తోంది. శ్రీరామ జన్మభూమి ఆలయంలో శ్రీరామునికి సేవ చేసే భాగ్యం కలగనుందని వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇక చరిత్ర విషయానికొస్తే.. దశాబ్దాలుగా కొనసాగిన బాబ్రీ మసీదు - రామ మందిరం వివాదం 2019 లో సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుతో ముగిసింది.సుప్రీంకోర్టు తీర్పుతో రామ మందిర నిర్మాణానికి ఉన్న అన్ని అడ్డంకులు తొలిగాయి. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి, ఆలయ నిర్మాణంపై అన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్రం శ్రీరామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ను ఏర్పాటు చేసింది. ఆలయ నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయడంతో నిర్మాణ పనులు 2020 ఆగస్ట్ 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. 1998లో అహ్మదాబాద్లోని సోంపురా కుటుంబం రూపొందించిన డిజైన్ ఆధారంగా రామమందిర నిర్మాణం చేపట్టారు. ఆ తరువాత ఆ డిజైన్ కు 2020లో కొన్ని మార్పులు చేశారు. జనవరి 22న వచ్చే భారీగా తరలివచ్చే భక్తుల కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు వసతి ఏర్పాటు చేసేందుకు అయోధ్యలో టెంట్ సిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఆ భక్తులకు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు కల్పించే విషయంలో ప్రణాళికలు రచిస్తున్నారు. మాజా గుప్తర్ ఘాట్ వద్ద 20 ఎకరాల్లో 25 వేల మందికి వసతి కల్పించేలా నిర్మాణం చేస్తున్నారు. బ్రహ్మకుండ్ వద్ద 30 వేల మందికి.. బాగ్ బిజేసీ వద్ద 25 వేల మందికి వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. కార్సేవక్ పురం, మణిరాం దాస్ కంటోన్మెంట్ వంటి ప్రాంతాల్లో కూడా ఇలాంటి వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా ఆ అయోధ్య రామయ్య సేవా భాగ్యాన్ని నోచుకునేందుకు భక్తి పారవశ్యంతో కోట్లాది మంది భక్తులు వేచి చూస్తున్నారు. ఇదీ చదవండి: అయోధ్య రామాలయానికి యాచకుల విరాళం -
కోకాపేట్ లో సందడి చేసిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైత్యన (ఫొటోలు)
-
శ్రీను వైట్ల, గోపీచంద్ కొత్త సినిమా ప్రారంభోత్సవం
-
మామయ్య కోసం పొలిటికల్ కార్యక్రమానికి వెళ్తున్న అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నల్లగొండ జిల్లాలోని భట్టుగూడెం గ్రామానికి నేడు వెళ్లారు. తన మామ, బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్రెడ్డి స్వగ్రామం వద్ద నిర్మించిన ఫంక్షన్హాల్ను ఆయన ప్రారంభించారు. పెద్దవూర మండలంలోని చింతపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్రెడ్డి భట్టుగూడెం వద్ద 'కంచర్ల కన్వెన్షన్' పేరుతో ఈ ఫంక్షన్హాల్ను నిర్మించారు. (ఇదీ చదవండి: చిరంజీవిని అలా అంటుంటే చాలా బాధగా ఉంది: ప్రముఖ హీరో) ఇప్పటికే ఆయన పెద్దవూర మండలం కేంద్రంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. తాజాగా ఆధునిక వసతులతో కూడిన 1000 మందికి సరిపడే ఫంక్షన్హాల్ను నిర్మించారు. ప్రారంభోత్సవానికి తన అల్లుడైన అల్లు అర్జున్తోపాటు మంత్రి జగదీశ్రెడ్డిని ఆయన ఆహ్వానించారు. అంతేకాకుండా నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుమారు 10 వేల మందికి భోజనాలతో పాటు మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని చంద్రశేఖర్రెడ్డి ఏర్పాటు చేశారు. (ఇదీ చదవండి: అక్షయ్ కుమార్ పారితోషికంపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత) 2014 ఎన్నికల్లోనే చంద్రశేఖర్రెడ్డి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి 24 వేల పైచిలుకు ఓట్లు సాధించారు. ఇప్పుడు తాజాగా వచ్చే ఎన్నికల్లో తన స్వస్థలమైన నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేయాలని ఆయన ఉన్నారు. అందులో భాగంగానే నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా చంద్రశేఖర్రెడ్డి పర్యటిస్తున్నారు. ఇలా తన మామయ్య కోసం పాలిటిక్స్ వేడుకలో అల్లు అర్జున్ పాల్గొంటున్నారు. చంద్రశేఖర్రెడ్డికి పార్టీ నుంచి సీట్ వస్తే బన్నీ తప్పకుండా మామ కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ప్రచారం నడుస్తోంది. -
Cannes Film Festival 2023: అట్టహాసంగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (ఫొటోలు)
-
సుధీర్ పక్కన హీరోయిన్ ఎలా సిగ్గు పడుతుందో చూడండి
-
చాంబర్లోకి తొలుత సీఎం
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 30న జరిగే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయ భవన సముదాయం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మంగళవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమీక్షించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. దీని ప్రకారం సచివాలయం ప్రారంభం కాగానే ముందుగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు తన చాంబర్లో ఆసీనులు కానున్నారు. ఆ తర్వాత మంత్రులు, కార్యదర్శులు సీఎంవో, సచివాలయ సిబ్బంది వారి చాంబర్లలోకి వెళ్లి కూర్చోనున్నారు. సచివాలయ ప్రారంబోత్సవం సందర్భంగా రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి ఉదయం శాస్త్రోక్తంగా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అనంతరం పండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ప్రారంభ కార్యక్రమం జరగనుంది. సంబంధిత సమయాన్ని త్వరలో ప్రకటించనున్నారు. సచివాలయ ప్రారంబోత్సవ కార్యక్రమానికి సచివాలయ సిబ్బంది, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, అన్ని శాఖల అధిపతులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జెడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్, జిల్లా గ్రంథాలయాల చైర్మన్లు, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు మేయర్లు తదితరులు కలిపి దాదాపు 2,500 మంది హాజరవుతారని అంచనా. నాలుగు ద్వారాలు నూతన సచివాలయంలో రక్షణ సహా పలు రకాల పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. సచివాలయం నాలుగు దిక్కుల్లో ప్రధాన ద్వారాలున్నాయి. తూర్పు ద్వారాన్ని (మెయిన్ గేట్) ముఖ్యమంత్రి, సీఎస్, డీజీపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, చైర్మన్లు ఇంకా ముఖ్యమైన ఆహా్వనితులు, దేశ, విదేశీ అతిథులు, ప్రముఖుల కోసం మాత్రమే వినియోగించనున్నారు. వాయవ్య (నార్త్–వెస్ట్) ద్వారాన్ని అవసరం వచ్చినప్పుడే తెరవనున్నారు. ఈశాన్య (నార్త్–ఈస్ట్) ద్వారం గుండా సచివాలయ సిబ్బంది కార్యదర్శులు, అధికారుల రాకపోకలు సాగించనున్నారు. అదే వైపు పార్కింగ్ కూడా ఉండనుంది. ఆగ్నేయ (సౌత్–ఈస్ట్) ద్వారాన్ని కేవలం సందర్శకుల కోసమే తెరవనున్నారు. సచివాలయ సందర్శన సమయం మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఉండనుంది. వికలాంగులు, వృద్ధుల కోసం విద్యుత్తో నడిచే బగ్గీల ఏర్పాటు చేయనున్నారు. ప్రైవేటు వాహనాలకు సచివాలయంలోకి అనుమతి లేదు. సచివాలయ రక్షణకు సంబంధించి డీజీపీ విధివిధానాలు రూపొందించి పకడ్బందీ చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. సమీక్షలో సీఎం తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు... ♦ ఖాళీ జాగలున్న వారికి రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించే గృహలక్ష్మి పథకం అమలుకు సత్వరమే విధివిధానాలను రూపొందించాలి. ♦ పోడు భూముల పట్టాల పంపిణీని త్వరలో ప్రారంభించాలి. ♦ దళితబంధు పథకాన్ని కొనసాగించాలి. ♦ గొర్రెల పంపిణీని సత్వరమే ప్రారంభించాలి. -
ఐపీఎల్ 2023 ప్రారంభ వేడుకల్లో పాన్ ఇండియా బ్యూటీలు
మరో 8 రోజుల్లో (మార్చి 31) క్రికెట్ పండుగ ఐపీఎల్ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఫ్యాన్స్కు మత్తెక్కిచే ఓ వార్త తెలిసింది. ఐపీఎల్ 2023 ఎడిషన్ ప్రారంభ వేడుకల్లో పాన్ ఇండియా బ్యూటీలు రష్మిక మంధన, తమన్నా భాటియా లైవ్ పెర్ఫార్మెన్స్ చేయనున్నారని సమాచారం. కోవిడ్ కారణంగా గత మూడేళ్లుగా ప్రారంభ వేడుకలు జరగని కారణంగా ఈసారి వేడుకలను ఘనంగా నిర్వహించాలని బీసీసీఐ భావిస్తుంది. ఇందులో భాగంగానే సినీ గ్లామర్ను వాడుకోవాలని భారీ ప్రణాళికను రచించింది. రష్మిక, తమన్నా లతో పాటు మరికొంత మంది మేల్, ఫిమేల్ పాన్ ఇండియా ఆర్టిస్ట్లు ఈ వేడుకల్లో పాల్గొంటారని బీసీసీఐకి చెందిన కీలక అధికారి ఒకరు వెల్లడించారు. మూడేళ్ల తర్వాత హోమ్ అండ్ అవే ఫార్మాట్ తిరిగి అమల్లోకి వస్తున్నందున, ప్రేక్షకులను వేడుకతో మైదానాలకు ఆహ్వానించాలని భావిస్తున్నట్లు సదరు అధికారి తెలిపారు. కాగా, ఐపీఎల్ 16వ ఎడిషన్ ప్రారంభ వేడుకలు మార్చి 31న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ ఐకానిక్ స్టేడియంలో జరగనున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్తో ఈ సీజన్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్కు అరంగంట ముందు (సాయంత్రం 7:30 గంటలకు) ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఇదిలా ఉంటే, బీసీసీఐ.. మహిళల ఐపీఎల్ (WPL)కు ముందు కూడా ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించింది. అయితే, సినీ గ్లామర్ లేకపోవడంతో ఆ వేడుక ఫ్లాప్ అయ్యింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ భారీ తారాగణంతో ఐపీఎల్-2023 ప్రారంభ వేడుకను నిర్వహించాలని డిసైడైంది. -
WPL 2023: షురూ అయిన మహిళల ఐపీఎల్.. దుమ్మురేపిన స్టార్స్ (ఫొటోలు)
-
అదే ఆమె గొప్పతనం.. మంత్రి రోజాపై కిరణ్ ప్రశంసల వర్షం
ఏపీ మంత్రి రోజాపై ప్రశంసల వర్షం కురిపించారు లలితా జువెలరీస్ ఎండీ కిరణ్. చిత్తూరు జిల్లాలో నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి రోజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా బ్రాంచ్లు కలిగిన లలితా జువెలరీస్ తాజాగా 46వ షోరూంను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. 'డబ్బులు ఊరికే రావు' అనే డైలాగ్తో ఫేమస్ అయ్యారు కిరణ్. ఈ సందర్భంగా హాజరైన మంత్రి రోజాను కిరణ్ కొనియాడారు. పిలవగానే వచ్చినందుకు రోజాకు ధన్యవాదాలు తెలిపారు. కిరణ్ మాట్లాడుతూ.. 'మా ఆహ్వానం అందగానే వచ్చినందుకు థ్యాంక్స్. ఇటీవలే రోజా ఇంటికి వెళ్లి షోరూం ప్రారంభోత్సవానికి పిలిచాం. ఎంతో ఆప్యాయంగా పలకరించారు. మాకు చాలా బాగా మర్యాదలు చేశారు. చాలా సంతోషంగా ఉంది. అది ఆమె గొప్పతనం. మనం పిలిచిన వ్యక్తి గెస్ట్గా వస్తే ఆనందం మాటల్లో వర్ణించలేం.' అంటూ మంత్రి రోజాపై ప్రశంసల వర్షం కురిపించారు. అనంతరం రోజా కూడా లలితా జువెలరీస్తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
అమెరికా ప్రెసిడెంట్ కూతురు ప్రేమలో పడితే? మూవీ లాంఛింగ్
కిషోర్ తేజ హీరోగా అంకిత మూలేర్ హీరోయిన్గా రూపొందుతున్న చిత్రం హీరో ఆఫ్ ఇండియా. ఆకుల రాఘవ దర్శకత్వంలో తుమ్మల సత్యనారాయణ నిర్మిస్తున్నారు. అమెరికా ప్రెసిడెంట్ కూతురు ఇండియా వచ్చినప్పుడు ఓ తెలుగు యువకుడి ప్రేమలో ఆమె పడితే? అనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం అన్నారు ఆకుల రాఘవ. -
ఫిఫా వరల్డ్కప్లో ఆకట్టుకున్న జపాన్ అభిమానులు
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్లో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మాములుగా మ్యాచ్ చూసేందుకు వచ్చే అభిమానులంతా తమ వెంట తెచ్చుకునే తిను బండారాలు సహా పేపర్లు, బ్యానర్లు, జెండాలు, పోస్టర్లను మ్యాచ్ ముగిశాక అక్కడే వదిలేసి వెళ్తుంటారు. మ్యాచ్ పూర్తయ్యాకా చూస్తే స్టేడియంలో చిన్నపాటి చెత్తకుండీ తయారవుతుంది. మ్యాచ్ తర్వాత చెత్తను క్లీన్ చేయలేక సిబ్బంది నానా అవస్థలు పడుతుంటారు. తాజాగా ఫిఫా ప్రారంభమైన నవంబర్ 20న ప్రారంభోత్సవ వేడుకలు ముగిసిన తర్వాత ఖతర్ - ఈక్వెడార్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఫలితం పక్కనబెడితే ఆటముగిశాక జపాన్ కు చెందిన ఫుట్బాల్ ఫ్యాన్స్ కొంతమంది స్టేడియం చుట్టూ కలియతిరుగుతూ ఇతర దేశాల ఫ్యాన్స్ పడేసిన చెత్తనంతా సంచుల్లోకి ఎత్తుతూ కనిపించారు. ఖతర్ కు చెందిన ఓ యూట్యూబర్ ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో జపనీయులు స్టేడియంలో చెత్త ఉన్న చోటకు వెళ్లి దానిని సంచుల్లో ఎత్తుతూ కనిపించారు. తమ దేశం మ్యాచ్ కాకపోయినా ఆట చూడటానికి వచ్చిన జపనీయులు తమ చుట్టూ పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా కనిపించేసరికి తట్టుకోలేకపోయారు. జపాన్ ప్రజలు పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యమిస్తారు.అక్కడ రోడ్డు మీద వెళ్తూ చాక్లెట్ తింటే ఆ ప్యాక్ ను జేబులోనే పెట్టుకుని రోడ్డు మీద ఉన్న చెత్త డబ్బాల్లో పడేస్తారు. అందుకే జపాన్ లో వీధులు పరిశుభ్రంగా కనిపిస్తాయి. ఇదే సూత్రాన్ని జపాన్ ఫుట్బాల్ ఫ్యాన్స్ ఖతర్ స్టేడియంలో కూడా పాటించారు. Japanese fans at the opening World Cup match cleaned up the stands after Qatar-Ecuador. 🇯🇵 Most respectful fans in the world. 👏 🎥 IG/qatarlivingpic.twitter.com/yZHhe0sQNw — Football Tweet ⚽ (@Football__Tweet) November 21, 2022 చదవండి: మరొక మ్యాచ్ ఓడితే అంతే సంగతి.. అర్జెంటీనా ప్రీక్వార్టర్స్ చాన్స్ ఎంత? -
అంగరంగ వైభవంగా 36వ జాతీయ క్రీడల వేడుకలు
36వ జాతీయ క్రీడా ప్రారంభోత్సవ వేడుకలు గురువారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ టార్చ్ను వెలిగించి క్రీడలను ప్రారంభించారు. అనంతరం జాతీయ క్రీడలనుద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా, రెజ్లర్ రవికుమార్ దహియాలు పాల్గొన్నారు. అక్టోబర్ 10 వరకు జరిగే ఈ క్రీడల్లో 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలతోపాటు భారత త్రివిధ దళాలకు చెందిన సర్వీసెస్ జట్టు నుంచి మొత్తం ఏడువేల మంది క్రీడాకారులు పోటీపడనున్నారు. మొత్తం 36 ఈవెంట్స్లో పతకాల కోసం పోటీలుంటాయి. గుజరాత్లోని అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, వడోదర, రాజ్కోట్, భావ్నగర్ నగరాల్లో మ్యాచ్లను ఏర్పాటు చేశారు. చివరిసారి 2015లో జరిగిన జాతీయ క్రీడలకు కేరళ ఆతిథ్యమిచ్చింది. ఆ క్రీడల్లో తెలంగాణ 8 స్వర్ణాలు, 14 రజతాలు, 11 కాంస్యాలతో కలిపి 33 పతకాలతో 12వ ర్యాంక్లో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ 6 స్వర్ణాలు, 3 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి 16 పతకాలతో 18వ స్థానంలో నిలిచింది. The contingents of all states and UTs arrive at the opening ceremony of the 36th National Games at Narendra Modi stadium in Ahmedabad, Gujarat. pic.twitter.com/watT2xAmG8 — ANI (@ANI) September 29, 2022 -
జనవరికి సిద్ధం కానున్న కొత్త సచివాలయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయ భవనం వచ్చే ఏడాది జనవరి నాటికి సిద్ధం కాబోతోంది. ఈ దసరా నాటికే పూర్తిచేసి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినా.. పనుల్లో ఆలస్యం వల్ల కుదరని పరిస్థితి నెలకొంది. పూర్తిస్థాయిలో సిద్ధం చేసేందుకు మరో మూడు నెలల గడువు కావాలని నిర్మాణ సంస్థ కోరినట్టు తెలిసింది. ఇటీవల సీఎం కేసీఆర్ కొత్త సచివాలయ పనులను తనిఖీ చేసిన సందర్భంగా అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో ఈ అంశంపై చర్చ జరిగింది. దసరా నాటికి సచివాలయాన్ని ప్రారంభించాలని సీఎం పేర్కొనగా.. ఆలోగా భవనం పైభాగంలో పలు పనులు పూర్తయ్యేలా లేవని నిర్మాణ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారని.. దీనిపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. దసరా నాటికే పూర్తికావాలని ఎన్నిసార్లు ఆదేశించినా.. తీరు మారకుంటే ఎలాగని పేర్కొన్నట్టు తెలిసింది. అయితే కేవలం పైభాగంలో కొన్నిపనులే జరగాల్సి ఉన్నందున, దసరా నాటికి కొత్త సచివాలయాన్ని ప్రారంభించుకోవచ్చని, పైభాగంలో పనులతో పెద్దగా ఇబ్బంది ఉండదని నిర్మాణ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నట్టు సమాచారం. మూడు నెలలు సమయమిస్తే అన్ని పనులు పూర్తి చేస్తామని చెప్పినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో దసరా నాటికి భవనాన్ని ప్రారంభిస్తారా, నిర్మాణ సంస్థ కోరిన గడువిచ్చి అన్ని పనులు పూర్తయ్యాకే ప్రారంభిస్తారా అన్నదానిపై సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రధాన గుమ్మటంలో జాప్యంతో! కొత్త సచివాలయాన్ని ఏడంతస్తుల్లో, 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దిగువ భాగంలో ప్రధాన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అంతర్గతంగా తుది పనులు నడుస్తున్నాయి. కొన్ని అంతస్తుల్లో చాంబర్లను కూడా సిద్ధం చేశారు. త్వరలో ఫర్నీచర్ కూడా రాబోతోంది. భవనం వెలుపల ధోల్పూర్ ఆగ్రా ఎర్రరాతిని బేస్మెంట్గా పరిచే పని జరుగుతోంది. మరోవైపు తలుపులు, కిటికీలు, వాటికి అద్దాలు బిగించే పని కూడా మొదలైంది. ఇవన్నీ అనుకున్న సమయానికి పూర్తి కానున్నాయి. కానీ భవనంపైన ప్రధాన ఆకర్షణగా నిర్మిస్తున్న పర్షియన్ శైలి గుమ్మటం పనులు ఇటీవలే మొదలయ్యాయి. దీన్ని హడావుడిగా నిర్మిస్తే భవిష్యత్తులో సమస్యలు వస్తాయని.. జాగ్రత్తగా చేపట్టాల్సి ఉంటుందని నిర్మాణ సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు. వరుస ఆటంకాలతో.. కొత్త సచివాలయం నిర్మాణం ప్రారంభించినప్పుడు 2021 దసరా నాటికే పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ వరుస ఆటంకాలతో జాప్యం జరుగుతూ వచ్చింది. భారీ భవనం అయినందున పునాదులను లోతుగా తవ్వారు. ఈ సమయంలో కఠినమైన రాయి రావడం, కంట్రోల్ బ్లాస్టింగ్ చేసి తొలగించాల్సి రావడంతో సమయం వృధా అయింది. తర్వాత కరోనా లాక్ డౌన్లతో పనులు ఆగిపోయాయి. కూలీలు తిరిగి వచ్చి పనులు గాడినపడేందుకు నెలల సమయం పట్టింది. రాజస్థాన్ ధోల్పూరు గనుల నుంచి ఆగ్రా ఎర్రరాయి, లేత గోధుమ రంగు రాయిని తెప్పించడం కోసం సమయం పట్టింది. వేగంగా పూర్తిచేసేందుకు కూలీల సంఖ్యను రెట్టింపు చేసి.. 2,800 మందిని వినియోగిస్తున్నారు. -
CWG 2022: అంగరంగ వైభవంగా.. కామన్వెల్త్ గేమ్స్ 2022 ప్రారంభోత్సవం (ఫోటోలు)
-
CWG 2022: ‘రవి అస్తమించని’ క్రీడలు
అమెరికా లేకపోతేనేమి, ఆస్ట్రేలియా ఆట కనువిందు చేస్తుంది... చైనా కనిపించకపోయినా ఇంగ్లండ్ స్టార్ల జోరు కట్టి పడేస్తుంది... రష్యా మెరుపులకు అవకాశం లేకున్నా... కెనడా, న్యూజిలాండ్ ఆ లోటును తీరుస్తాయి... ఇక పెద్ద సంఖ్యలో పతకావకాశాలతో సగటు భారత క్రీడాభిమానికి పన్నెండు రోజుల పాటు సరైన వినోదం ఖాయం. ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల సంక్షిప్త రూపమిది. ఒకనాడు బ్రిటీష్ పాలనలో ఉండి, ఆపై స్వతంత్రంగా మారిన దేశాల మధ్య క్రీడా మైదానాల్లో సాగే సమరాలకు వేదిక ఈ ఆటలు... ప్రపంచ సంబరం ఒలింపిక్స్తో పోలిస్తే స్థాయి కాస్త తక్కువే అయినా... ఈ క్రీడలకు తమదైన ప్రత్యేకత ఉంది. వర్ధమాన ఆటగాళ్లను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఇది సరైన చోటు కాగా... వనుతూ, మాల్టా, నౌరూ... ఇలా ప్రతీ చిన్న దేశం పతకంతో సందడి చేస్తుంటే కనిపించే క్రీడా స్ఫూర్తి, వేదికపై ఆ కళే వేరు...72 దేశాలకు చెందిన ఆటగాళ్లతో ఆగస్టు 8 వరకు జరిగే ఈ పండగలో చివరాఖరికి ఎవరెన్ని పతకాలను తమ ఖాతాలో వేసుకుంటారనేది ఆసక్తికరం. ►భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి గం. 11:30 నుంచి ప్రారంభోత్సవం జరగనుంది. సోనీ సిక్స్, సోనీ టెన్–1,2,3,4 చానెల్స్లో, డీడీ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. బర్మింగ్హామ్: 2022 సంవత్సరంలో 22వ కామన్వెల్త్ క్రీడలకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి జరిగే ఈ పోటీల్లో దాదాపు ఐదువేల మంది అథ్లెట్లు పోటీ పడుతున్నారు. తొలి రోజు ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించనుండగా, శుక్రవారం నుంచి పోటీలు మొదలవుతాయి. మొత్తం 20 క్రీడాంశాల్లో ఆటగాళ్లు పతకాల కోసం పోటీ పడతారు. మహిళల క్రికెట్ తొలిసారి టి20 రూపంలో కామన్వెల్త్ క్రీడల్లో అడుగు పెట్టనుండటం విశేషం. సాధారణంగా రెండు ఒలింపిక్స్ మధ్య (రెండేళ్ల తర్వాత, రెండేళ్ల ముందు) వీటిని నిర్వహిస్తారు. అయితే కోవిడ్తో టోక్యో క్రీడలు ఆలస్యం కావడంతో సంవత్సరం లోపే ఈ మెగా ఈవెంట్ ముందుకు వచ్చింది. 1930లో తొలిసారి ‘బ్రిటీష్ ఎంపైర్ గేమ్స్’ పేరుతో నిర్వహించిన ఈ క్రీడలు రెండో ప్రపంచ యుద్ధం సమయంలో మినహా ప్రతీ నాలుగేళ్లకు ఒకసారి జరిగాయి. 1934 (లండన్), 2002 (మాంచెస్టర్) తర్వాత ఇంగ్లండ్ మూడోసారి కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇస్తోంది. వేదిక మారి... నిజానికి ఈసారి పోటీలు దక్షిణాఫ్రికాలోని డర్బన్లో జరగాలి. 2015లో ఆ ఒక్క దేశమే బిడ్ వేయడంతో హక్కులు కేటాయించారు. అయితే ఆర్థికపరమైన సమస్యలతో తమ వల్ల కాదంటూ 2017లో దక్షిణాఫ్రికా చేతులెత్తేయడంతో వేదికను మార్చాల్సి వచ్చింది. ఈ క్రీడల మొత్తం బడ్జెట్ 778 మిలియన్ పౌండ్లు (రూ. 80 వేల కోట్లు). పోటీలపరంగా చూస్తే ఎప్పటిలాగే ఈసారి కూడా ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఇన్నేళ్ల క్రీడల చరిత్రలో మొత్తం 932 స్వర్ణాలు సహా 2,415 పతకాలతో ఆసీస్ అగ్రస్థానంలో ఉండగా... 2,144 పతకాలతో ఇంగ్లండ్ (714 స్వర్ణాలు) రెండో స్థానంలో నిలిచింది. కెనడా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలూ పతకాల పట్టికలో ముందంజలో ఉండగా... జమైకా, కెన్యావంటి దేశాలు అథ్లెటిక్స్లో తమ ప్రభావం చూపించగలిగాయి. ఓవరాల్గా భారత్ కూడా 2002 నుంచి టాప్–5లో నిలబడుతూ వస్తోంది. ప్రాభవం కోల్పోతున్నాయా! 22 సార్లు క్రీడల నిర్వహణ మొత్తంగా 9 దేశాలకే పరిమితమైంది. వచ్చేసారి కూడా ఆస్ట్రేలియాలోనే (విక్టోరియా రాష్ట్రం) జరగనున్నాయి. ఇంత భారీ మొత్తం ఖర్చు చేసే స్థితిలో చాలా కామన్వెల్త్ దేశాలు లేవు. పైగా పోటీల స్థాయి ఒలింపిక్స్తో మాత్రమే కాదు, ఆసియా క్రీడలతో పోల్చి చూసినా చాలా తక్కువగా ఉంటోంది. ఒక్క అథ్లెటిక్స్లో మాత్రం ప్రపంచస్థాయి ప్రమాణాలు కనిపిస్తుండగా, మిగతా క్రీడాంశాల్లో ఇక్కడ నమోదయ్యే అత్యుత్తమ ప్రదర్శనలకు, ఒలింపిక్ ప్రదర్శనలకు మధ్య చాలా అంతరం ఉంటోంది. వేర్వేరు కారణాలతో స్టార్ ఆటగాళ్లు కామన్వెల్త్ క్రీడలకు దూరమవుతుండటంతో ఆసక్తి ఒక్కసారిగా తగ్గిపోతోంది. భారత్ కోణంలో చూస్తే ఇక్కడి ఫలితాలు ఆటగాళ్లను, అభిమానులను ‘భ్రమల్లో’ ఉంచుతున్నాయని, ఈ ఫలితం చూసి క్రీడల్లో బాగున్నామని భావించడం సరైంది కాదని పలువురు మాజీ ఆటగాళ్లు తరచుగా వ్యాఖ్యానించడం వాస్తవ పరిస్థితి చూపిస్తోంది. అన్నింటికి మించి రాజకీయపరమైన కోణంలో ఈ క్రీడలపై అనాసక్తి కనిపిస్తోంది. ఒలింపిక్స్కు ప్రత్యామ్నాయంగా, అమెరికా ఆధిపత్యానికి ఎదురుగా నిలబడేందుకు తీసుకొచ్చి కామన్వెల్త్ క్రీడలు 1960ల వరకు మంచి ఫలితాలు అందించాయి. ఆ తర్వాతే వాటి స్థాయి పడిపోయింది. ఇన్నేళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా ఇంకా బ్రిటీష్ పాలించిన దేశాల మధ్య పోటీ ఏమిటంటూ వచ్చే విమర్శలతో పాటు... కామన్వెల్త్ దేశాల మధ్య ఒక కూటమిగా ఎలాంటి రాజకీయ సారూప్యత లేదు. సభ్య దేశాల మధ్య ఎలాంటి ఒప్పందాలు, కీలక విధాన నిర్ణయాల మీద సహకారం అందించే విధానం, స్పష్టమైన పాత్ర లేకపోగా, అంతటి బలం కూడా వీటికి లేదు. దాంతో ఇవి నామమాత్రంగా మారిపోతున్నాయి. 66లో 16 పోయినట్లే! ఈసారి కామన్వెల్త్ క్రీడల నుంచి షూటింగ్ క్రీడాంశాన్ని తొలగించడం భారత్కు పెద్ద దెబ్బే. 2018లో మన దేశం సాధించిన 66 పతకాల్లో 16 (అత్యధికంగా 7 స్వర్ణాలు సహా) షూటింగ్ ద్వారా వచ్చాయి. భారత్ మూడో స్థానంలో నిలవగా, ఈసారి కిందకు దిగజారే అవకాశాలు ఉన్నాయి. అయితే బ్యాడ్మింటన్, హాకీ, రెజ్లింగ్, బాక్సింగ్, వెయిట్లిఫ్టింగ్, టేబుల్ టెన్నిస్లో మనకు ఖాయంగా మెడల్స్ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. భారత్ నుంచి ఈసారి 16 క్రీడాంశాల్లో కలిపి మొత్తం 215 మంది క్రీడాకారులు పతకాల వేటలో ఉన్నారు. నేడు జరిగే ప్రారంభ వేడుకల్లో భారత బృందానికి బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, హాకీ జట్టు కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ పతాకధారులుగా వ్యవహరిస్తారు. టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాను ‘ప్లాగ్ బేరర్’గా ఎంపిక చేసినా అతను గాయం కారణంగా ఈ మెగా ఈవెంట్కు దూరమయ్యాడు. దాంతో 2018 గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ లో భారత బృందానికి ‘ఫ్లాగ్ బేరర్’గా వ్యవహరించిన సింధుకు మరోసారి అవకాశం వచ్చింది. భారత్ @ బర్మింగ్హామ్ ఈ కామన్వెల్త్ గేమ్స్లో భారత్ నుంచి 16 క్రీడాంశాల్లో 215 మంది పోటీపడుతున్నారు. అథ్లెటిక్స్ (43), హాకీ (36), మహిళలక్రికెట్ (15), వెయిట్లిఫ్టింగ్ (15), సైక్లింగ్ (13), బాక్సింగ్ (12), రెజ్లింగ్ (12), టేబుల్ టెన్నిస్ (12), బ్యాడ్మింటన్ (10), లాన్ బౌల్స్ (10), స్క్వాష్ (9) జిమ్నాస్టిక్స్ (7), స్విమ్మింగ్ (7), జూడో (6), ట్రయాథ్లాన్ (4), పారా పవర్లిఫ్టింగ్ (4). కామన్వెల్త్ గేమ్స్ షెడ్యూల్ ►ప్రారంభ వేడుకలు నేడు రాత్రి గం. 11:30 నుంచి ►అథ్లెటిక్స్: జూలై 30 నుంచి ఆగస్టు 7 ►అక్వాటిక్స్: జూలై 29 నుంచి ఆగస్టు 8 ►బ్యాడ్మింటన్: జూలై 29 నుంచి ఆగస్టు 8 ►3గీ3 బాస్కెట్బాల్: జూలై 29 నుంచి ఆగస్టు 2 ►బీచ్ వాలీబాల్: జూలై 30 నుంచి ఆగస్టు 7 ►బాక్సింగ్: జూలై 29 నుంచి ఆగస్టు 7 ►క్రికెట్: జూలై 29 నుంచి ఆగస్టు 7 ►సైక్లింగ్: జూలై 29 నుంచి ఆగస్టు 7 ►జిమ్నాస్టిక్స్: జూలై 29 నుంచి ఆగస్టు 6 ►హాకీ: జూలై 29 నుంచి ఆగస్టు 8 ►జూడో: ఆగస్టు 1 నుంచి 3 ►లాన్ బౌల్స్: జూలై 29 నుంచి ఆగస్టు 6 ►నెట్బాల్: జూలై 29 నుంచి ఆగస్టు 7 ►పారా పవర్లిఫ్టింగ్: ఆగస్టు 4 ►రగ్బీ సెవెన్స్: జూలై 29 నుంచి 31 ►స్క్వాష్: జూలై 29 నుంచి ఆగస్టు 8 ►టేబుల్ టెన్నిస్: జూలై 29 నుంచి ఆగస్టు 8 ►ట్రయాథ్లాన్: జూలై 29 నుంచి 31 ►వెయిట్లిఫ్టింగ్: జూలై 30 నుంచి ఆగస్టు 3 ►రెజ్లింగ్: ఆగస్టు 5 నుంచి 6 ►ముగింపు వేడుకలు ఆగస్టు 8 మనోళ్లు 11 మంది... కామన్వెల్త్ గేమ్స్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కలిపి మొత్తం 11 మంది భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జ్యోతి యెర్రాజీ, నిఖత్ జరీన్, ఆకుల శ్రీజ, సబ్బినేని మేఘన తొలిసారి కామన్వెల్త్ గేమ్స్లో పోటీపడుతున్నారు. 2018 గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 13 మంది బరిలోకి దిగారు. ►అథ్లెటిక్స్: జ్యోతి యెర్రాజీ (ఆంధ్రప్రదేశ్; మహిళల 100 మీటర్ల హర్డిల్స్) ►బ్యాడ్మింటన్: సింధు, కిడాంబి శ్రీకాంత్, సాత్విక్ సాయిరాజ్ (ఆంధ్రప్రదేశ్), సుమీత్ రెడ్డి, గాయత్రి గోపీచంద్ (తెలంగాణ). ►బాక్సింగ్: నిఖత్ జరీన్ (తెలంగాణ; మహిళల 50 కేజీలు), హుసాముద్దీన్ (తెలంగాణ; పురుషుల 57 కేజీలు). ►మహిళల హాకీ: రజని ఇటిమరపు (ఆంధ్రప్రదేశ్; రెండో గోల్కీపర్) ►టేబుల్ టెన్నిస్: ఆకుల శ్రీజ (తెలంగాణ) ►మహిళల టి20 క్రికెట్: సబ్బినేని మేఘన (ఆంధ్రప్రదేశ్) -
పీవీ సింధుకు అరుదైన గౌరవం
బర్మింగ్ హామ్ వేదికగా కామన్వెల్త్ క్రీడలు రేపటి (జులై 28) నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ మహా క్రీడా సంగ్రామానికి సంబంధించి ప్రారంభ వేడుకలు (ఓపెనింగ్ సెర్మనీ) కూడా రేపే ప్రారంభంకానున్నాయి. ఈ వేడుకలు భారత కాలమానం ప్రకారం రాత్రి 11.30 గంటలకు మొదలవుతాయి. గాయం కారణంగా భారత పతాకధారి నీరజ్ చోప్రా ఈ ఈవెంట్ నుంచి తప్పుకోవడంతో ఓపెనింగ్ సెర్మనీలో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు భారత ఫ్లాగ్ బేరర్గా వ్యవహరించనుంది. ఈ విషయాన్ని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) బుధవారం (జులై 27) వెల్లడించింది. రెండుసార్లు ఒలింపిక్ మెడల్స్ సాధించిన సింధుకు గతంలో పలు సందర్భాల్లో భారత త్రివర్ణ పతాకాన్ని చేతబూని టీమిండియాను లీడ్ చేసిన అనుభవం ఉంది. ఇదిలా ఉంటే, 72 దేశాల నుంచి 5 వేలకుపైగా అథ్లెట్లు ఈ మెగా ఈవెంట్లో పాల్గొంటున్నారు. 12 రోజుల పాటు (జులై 28- ఆగస్ట్ 8) 20 క్రీడా విభాగాల్లో అథ్లెట్లు పోటీ పడనున్నారు. 18వ సారి ఈ ఈవెంట్లో పాల్గొంటున్న భారత్.. మొత్తం 16 విభాగాల్లో 214 మంది అథ్లెట్లతో పోటీపడుతుంది. భారత్ బంగారు పతకాలు సాధించే అవకాశం ఉన్న విభాగాల్లో మహిళల బ్యాడ్మింటన్ కూడా ఒకటి. ఈ ఈవెంట్కు ముందే సింగపూర్ ఓపెన్ టైటిల్ నెగ్గి జోరుమీదున్న సింధు ఈసారి తప్పక గోల్డ్ సాధిస్తుందని అందరూ అంచనా వేస్తున్నారు. సింధు గత కామన్వెల్త్ గేమ్స్ సింగిల్స్లో సిల్వర్ మెడల్, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించింది. చదవండి: పంతం నెగ్గించుకున్న లవ్లీనా.. కామన్వెల్త్ గ్రామంలోకి కోచ్కు అనుమతి -
వైజాగ్లో జొన్నవిత్తుల ‘ఉత్తరాంధ్ర శతకం’ ఆవిష్కరణ!
తెలుగు తల్లికి జరిగిన పదపుష్ప పాదార్చనలతో విశాఖ పులకించింది. జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు రచించిన 'ఉత్తరాంధ్ర శతక' ఆవిష్కరణ కార్యక్రమం వైజాగ్లో ఘనంగా జరిగింది. తానా పూర్వాధ్యక్షులు, తానా విశ్వ సాహితీవేదిక నిర్వాహకులు తోటకూర ప్రసాద్ సారధ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. పది శతకాలు ప్రచురణచేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో సభలు చేయాలని అమెరికాలోని తెలుగు భాషాభిమానులు పూనుకున్నారు. 24వ తేదీ ఉదయం జొన్నవిత్తుల స్వయంగా రాసిన 108 పద్యాల రాతప్రతిని సముద్రునికి సమర్పించారు. అనంతరం సాగరతీరంలో చిన్నారులు అక్షర మాలను రాసి, పూలతో పూజించి, తెలుగు పద్యాలను పాటలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యశాస్త్రి, కలశపూడి శ్రీనివాసరావు, సూరపనేని విజయకుమార్, పైడా కృష్ణప్రసాద్, పరవస్తు ఫణిశయన సూరి, తదితరులు పాల్గొన్నారు. -
IPL 2022: ప్రారంభ వేడుకల్లేవు.. ఈసారి వారే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్
BCCI To Felicitate Tokyo Olympics Medallists: వరుసగా నాలుగో ఏడాది ప్రారంభ వేడుకలు లేకుండానే క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) షురూ కానుంది. అయితే, ఈసారి ఓపెనింగ్ సెర్మనీ స్థానంలో టోక్యో ఒలింపిక్స్ 2020 పతక విజేతలను (భారత) ఘనంగా సత్కరించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ విషయమై ఇదివరకే ఒలింపిక్ విజేతలకు ఆహ్వానాలు పంపింది. జావెలిన్ త్రో స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రాతో పాటు రెజ్లర్లు బజరంగ్ పూనియా (కాంస్యం), రవి దాహియా (రజతం), వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను (రజతం), బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్ (కాంస్యం), షట్లర్ పీవీ సింధు (కాంస్యం), భారత పురుషుల హాకీ జట్టు సభ్యులు (కాంస్యం) ఈ ప్రత్యేక కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. వీరిలో బల్లెం వీరుడు నీరజ్ చోప్రా కు సత్కారంతో పాటు కోటి రూపాయల నజరానా కూడా ఇవ్వనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. No #IPL Opening ceremony for the 4th consecutive year. Last time it was held in 2018Instead BCCI will felicitate few of the Olympians ahead of #CSKvKKRGold Medalist Neeraj Chopra will attend the CEREMONY and will recieve 1 Crore from BCCI pic.twitter.com/B9tFWxkeoq— Abhijeet ♞ (@TheYorkerBall) March 26, 2022 మార్చి 26న ముంబైలోని వాంఖడేలో ప్రారంభమయ్యే ఐపీఎల్ 2022 ఆరంభ మ్యాచ్కు ముందు టోక్యో ఒలింపిక్స్ విజేతల సన్మాన కార్యక్రమం జరుగనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఐపీఎల్ ప్రారంభ వేడుకలు ఎందుకు లేవంటే.. 2008 నుంచి 2018 వరకు పదేళ్లపాటు నిర్విరామంగా జరిగిన ఐపీఎల్ ప్రారంభ వేడుకలకు 2019 సీజన్లో బ్రేక్ పడింది. ఆ ఏడాది భారత సైనికులపై ఉగ్రదాడి (పూల్వామా మారణకాండ) జరిగిన కారణంగా ఐపీఎల్ వేడుకలు రద్దు చేశారు. ఇక 2020, 2021 సీజన్లలో కరోనా కారణంగా ఓపెనింగ్ సెర్మనీ ఊసే లేదు. చదవండి: IPL 2022: చెన్నై, కేకేఆర్ ఆటగాళ్లను ఊరిస్తున్న ఆ అరుదైన రికార్డులేంటో చూద్దాం..! -
అభిమానులకు బీసీసీఐ బ్యాడ్న్యూస్..
క్యాష్రిచ్ లీగ్గా ముద్రపడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్ 2022 సీజన్) మరో నాలుగో రోజుల్లో మొదలుకానుంది. క్రికెట్లో అత్యంత ఎక్కువ ఆదరణ పొందిన ఐపీఎల్ ఆరంభ వేడుకలను లీగ్ ప్రారంభం నుంచి నిర్వహిస్తూ వచ్చింది. 2018 ఐపీఎల్ తర్వాత వరుసగా మూడు సీజన్ల పాటు బీసీసీఐ ఆరంభ వేడుకలు నిర్వహించలేదు. తాజాగా మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 15వ సీజన్కు సంబంధించిన ఆరంభ వేడుకలను నిర్వహించకూడదని బీసీసీఐ భావిస్తోంది. కోవిడ్-19 మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకొనే ఆరంభ వేడుకలను నిర్వహించడం లేదని బీసీసీఐ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవలే దేశంలో కరోనా కేసుల తీవ్రత తగ్గినప్పటికి.. చైనాలో మరోసారి కరోనా విజృంభిస్తున్న వేళ కేంద్రం కోవిడ్ మార్గదర్శకాలను మరోసారి విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో వరుసగా నాలుగో ఏడాది ఆరంభ వేడుకలు లేకుండానే ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. పుల్వామా దాడిలో మరణించిన అమరవీరులకు గుర్తుగా 2019 ఐపీఎల్ సీజన్ ఆరంభ వేడుకలను నిర్వహించలేదు. ఆ కార్యక్రమం నిర్వహించడానికి ఉపయోగించే డబ్బును దాడిలో నేలకొరిగిన అమరవీరుల కుటుంబాలకు విరాళం అందజేశారు. ఆ తర్వాత కోవిడ్ కారణంగా 2020,2021 ఐపీఎల్ సీజన్లలో ఆరంభ వేడుకలను రద్దు చేశారు. ఇక మార్చి 26న సీఎస్కే, కేకేఆర్ మధ్య మ్యాచ్ ద్వారా ఐపీఎల్ 15వ సీజన్కు తెరలేవనుంది. చదవండి: IPL 2022 Female Anchors: ఐపీఎల్లో అందాల యాంకర్ రీ ఎంట్రీ.. టాప్-5లో ఉన్నది వీళ్లే! IPL 2022: మన కెప్టెన్ల సంపాదన ఎంతో తెలుసా? డుప్లెసిస్ వంద కోట్లకు పైగానే.. పాపం కేన్ మామ మాత్రం -
సెలబ్రిటీల ఫేవరెట్ F3సెలూన్ గ్రాండ్ లాంఛ్
Favourite To All Film Personalities F3 Saloon Inauguratedat Hitech City: ఇండస్ట్రీకి చెందిన చాలామంది ఫేవరెట్ అయిన ఎఫ్-3 సెలూన్ కొత్త బ్రాంచి హైటెక్ సిటీలో ఆదివారం ప్రారంభమైంది. 2వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో, అధునాతన పరికరాలతో ఏర్పాటైంది. ఈ క్యార్యక్రమానికి దిల్రాజు, అనిల్ రావిపూడి, గోపిచంద్ మలినేని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక ఈ సెలూన్ అధినేత ఎఫ్-3 సురేష్ మాట్లాడుతూ.. హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో ఫేజ-3 జనాలకుమంచి అనుభవం ఉన్న హెయిర్ స్టైలిస్టులు కావాలి. వాళ్లకు అత్యంత ఆధునిక స్టైళ్లు చేయాలి. మంచి పార్టీలకు వెళ్లాలని, వాటిలో బాగా కనిపించాలని అనుకునే వారికి ఎఫ్3 సెలూన్లు అత్యుత్తమ సేవలు అందిస్తాయి. స్వయంగా నేను ప్యారిస్లో శిక్షణ పొందాను, ఎఫ్3 సెలూన్లో ఉన్న సిబ్బంది అందరూ అత్యుత్తమ నాణ్యత కలిగిన సేవలు అందించడానికి తగిన శిక్షణ పొందినవారే' అని పేర్కొన్నారు. -
టోక్యో ఒలింపిక్స్: జపాన్ ‘ముద్ర’
ప్రతిష్టాత్మక ఒలింపిక్ క్రీడల్లో మొదటి ఘట్టం విజయవంతంగా పూర్తయింది. ప్రారం¿ోత్సవ కార్యక్రమంలో తమ ప్రత్యేకతను ప్రదర్శిస్తూ జపాన్ ప్రపంచ క్రీడాభిమానులను ఆకట్టుకుంది. ప్రధాన స్టేడియంలో ప్రేక్షకులు లేకపోయినా సరే... వేడుకల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఆకర్షణీయంగా నిర్వహించింది. ఒలింపిక్ స్ఫూర్తిని అన్ని విధాలా ప్రదర్శించడంతోపాటు జపాన్ దిగ్గజ క్రీడాకారులకు అన్ని చోట్లా తగిన గౌరవం చూపిస్తూ వారిని ఈ సంబరంలో భాగం చేసింది. వివిధ దేశాల మార్చ్ పాస్ట్లతో కార్యక్రమం కళకళలాడగా... అనూహ్యంగా అవకాశం దక్కించుకున్న యువ టెన్నిస్ క్రీడాకారిణి నయోమి ఒసాకా ఒలింపిక్ జ్యోతిని వెలిగించడంతో టోక్యో–2020 క్రీడలకు అధికారికంగా తెర లేచింది. ఒలింపిక్స్ నిర్వహణను వ్యతిరేకిస్తూ స్టేడియం బయట కొందరు స్థానికులు నిరసన ప్రదర్శించగా, ఏడాది ఆలస్యంగానైనా సరే విశ్వ క్రీడలకు విజిల్ మోగడం విశేషం. టోక్యో: టోక్యోకు ఒలింపిక్స్ను కేటాయిస్తూ 2013లో నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో ఎన్నో ప్రతికూలతలు, సవాళ్లను నిర్వాహకులు అధిగమించాల్సి వచి్చంది. ఈ మధ్య కాలంలో మారిన పరిస్థితులను వివరిస్తూ ప్రదర్శించి వీడియోతో కార్యక్రమం ప్రారంభమైంది. కౌంట్డౌన్ 20 నుంచి మొదలు పెట్టి 0 వరకు రాగానే స్టేడియం మొత్తం ప్రకాశిస్తూ బాణాసంచా వెలుగులు, మెరుపులతో నిండిపోయింది. కరోనా కాలంలో ఆటగాళ్లంతా ఫిట్నెస్ కోసం ఇంట్లోనే శ్రమించారు. దీనినే కాస్త వ్యంగ్యంగా చెబుతున్నట్లుగా జపాన్ బాక్సర్ సుబాజా అరీసా ట్రెడ్మిల్పై పరుగెత్తి చూపించారు. జపాన్ రాజు నరుహిటో, ఐఓసీ చైర్మన్ థామస్ బాచ్ స్టేడియంలోకి అడుగు పెట్టిన తర్వాత ఆరుగురు వ్యక్తులు కలిసి (ఇందులో ఇద్దరు ఒలింపిక్ స్వర్ణపతక విజేతలు) జపాన్ జాతీయ జెండాను తీసుకొస్తుండగా... ఆ దేశ జాతీయ గీతం ‘కిమిగయో’ను స్థానిక గాయకుడు మిసియా పాడారు. చెక్కతో రూపొందించిన ఐదు రింగుల ఒలింపిక్ చిహ్నాన్ని తీసుకొస్తున్న సమయంలో మరిన్ని టపాసులతో స్వాగతం పలికారు. 1964 టోక్యో ఒలింపిక్స్లో పాల్గొన్న జపాన్ క్రీడాకారులు నాటిన మొక్కలతో పెరిగిన చెట్ల నుంచి తెచ్చిన కలపను దీనిని రూపొందించేందుకు వాడటం విశేషం. కోవిడ్ కారణంగా మృతి చెందిన వారికి, 1972 మ్యూనిక్ ఒలింపిక్స్ సందర్భంగా ఉగ్రవాదుల దాడిలో కాల్పులకు గురై మరణించిన ఇజ్రాయెల్ ఆటగాళ్లకు నివాళిగా స్టేడియంలో కొద్దిసేపు మౌనం పాటించారు. నోబెల్ బహుమతి విజేత, బంగ్లాదేశ్కు చెందిన సామాజికవేత్త ప్రొఫెసర్ ముహమ్మద్ యూనుస్కు ఒలింపిక్ నిర్వాహకుల తరఫున ప్రత్యేక అవార్డును ప్రకటించారు. జపాన్ అక్షరమాలతో వివిధ దేశాల మార్చ్పాస్ట్ ప్రారంభమైంది. అందరికంటే ముందుగా గ్రీస్ దేశం రాగా... రెండో స్థానంలో శరణార్ధుల జట్టు నడిచింది. టోక్యో ఒలింపిక్స్లో అతి పిన్న వయసు్కరాలిగా (12 ఏళ్లు) గుర్తింపు పొందిన సిరియా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి, ఆ దేశ ఫ్లాగ్ బేరర్ హెండ్ జాజా మార్చ్పాస్ట్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రియో ఒలింపిక్స్ తరహాలోనే టోంగాకు చెందిన అథ్లెట్ పిటా టౌఫటోఫువా ‘షర్ట్లెస్’గా వచ్చి మరోసారి తన ప్రత్యేకతను ప్రదర్శించాడు. వనువాటు దేశానికి చెందిన రీలియో రీ కూడా ఇలాగే నడిచాడు. అమెరికా బృందం మార్చ్పాస్ట్ సమయంలో అక్కడే ఉన్న ఆ దేశ ప్రథమ మహిళ జిల్ బైడెన్ తమ ఆటగాళ్లను ప్రోత్సహించింది. రెజ్లర్ సుసాకి యుయి, బాస్కెట్బాల్ క్రీడాకారిణి రుయి హచిమురా జపాన్ ఫ్లాగ్ బేరర్లుగా ముందుండి నడిపించారు. అనంతరం జపాన్ క్రీడాకారులు యమగత ర్యోటా (అథ్లెటిక్స్), ఇషికావా కసుమి (టేబుల్ టెన్నిస్) ఒలింపిక్స్లో పాల్గొంటున్న అందరి తరఫున ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో స్టేడియం పైభాగం నుంచి చూపించిన టోక్యో 2020 ఎంబ్లమ్, గ్లోబ్ ప్రధానాకర్షణగా నిలిచాయి. దీని కోసం 1,824 డ్రోన్లు వాడటం విశేషం. జాన్ లెనాన్ ‘ఇమాజిన్’ పాట, ఇచికావా ఎబిజో ‘కాబుకి’, గ్రామీ విజేత హిరోమి పియానో ప్రదర్శన, కాగితంతో చేసిన పావురాలను ఎగరవేయడంతో సాంస్కృతిక కార్య క్రమాలు సుసంపన్నమయ్యాయి. ఒలింపిక్స్ కు సంబంధించిన 50 పిక్టోరియల్స్తో జపాన్ కమెడియన్లు మాస్, హిటోషి చేసిన కార్యక్రమం సరదాగా సాగింది. జపాన్ బ్యాడ్మింటన్ స్టార్ కెంటో మొమొటా తో పాటు మరో ఐదుగురు కలిసి ఒలింపిక్ పతాకాన్ని స్టేడియంలోకి తీసుకొచ్చారు. కరోనా సమయంలో శ్రమించిన ఫ్రంట్లైన్ వర్కర్లకు కూడా ఒలింపిక్ పతాకాన్ని అందుకునే అవకాశం కల్పించారు. చివరగా... ఆరుగురు జపాన్ అగ్రశ్రేణి ఆటగాళ్లు, ఒలింపిక్ విజేతలు కలిసి క్రీడా జ్యోతిని తీసుకొచ్చారు. పై భాగంలో ఉన్న ప్రత్యేక వేదిక వద్దకు వెళ్లి నయోమి ఒసాకా జ్యోతిని వెలిగించింది. 2011లో జపాన్లో వచ్చిన సునామీ, భూకంపం కారణంగా తీవ్రంగా నష్టపోయిన మూడు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు కూడా ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న టోక్యో ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు
-
టోక్యో ఒలింపిక్స్: నేటి నుంచి ప్రపంచ క్రీడా పండగ
బంగారం వెల రోజురోజుకూ మారిపోవచ్చు... కానీ ఆ బంగారు పతకం విలువ అమూల్యం... శాశ్వతంగా వన్నె తగ్గకుండా చరిత్రలో నిలిచిపోతుంది. జీవితంలో ఎంత పసిడి ధరించినా ఆ పతకధారణ కోసం జీవిత కాలం కష్టపడేందుకు అందరూ సిద్ధం... బంగారంతో పోటీ పడి అక్కడ సాధించే వెండి పతకం కూడా ప్రకాశవంతంగా వెలుగులు విరజిమ్ముతుంది... ఆ వేదికపై కంచు మోత కూడా ఎందరికో కనకమంత ఆనందాన్ని పంచుతుంది... గెలుచుకున్న కాంస్యం అంతులేని కీర్తిని మోసుకొస్తుంది. ఆశలు, ఆశయాలూ అన్నీ ఉంటాయి... అపరిమిత ఆనందం, అంతులేని దుఃఖం కూడా కనిపిస్తాయి... విజయం సాధించిన వేళ, అదే గెలుపును త్రుటిలో చేజార్చుకొని గుండె పగిలిన క్షణాన ఆనందబాష్పాలు, కన్నీళ్లూ వేరు చేయలేనంతగా కలగలిసిపోతాయి... కొందరికి ఆ పతకం జీవితాశయం అయితే మరికొందరికి అదే జీవితం... విశ్వ వేదికపై తమ జాతీయ గీతం వినిపిస్తుండగా... జాతీయ జెండా ఎగురుతుండగా ఆటగాళ్ల మనసులో భావనను కొలిచేందుకు ఏ మీటర్లూ సరిపోవు. పక్షం రోజుల వ్యవధిలో అక్కడ ఎన్నో రకాల భావోద్వేగాలు కనిపిస్తాయి... ఎందరినో ఆ క్రీడలు హీరోలుగా మారుస్తాయి... కొందరు దిగ్గజాలూ జీరోలుగా మారి మౌనంగా మైదానం నుంచి నిష్క్రమించే దృశ్యాలు కోకొల్లలు... ఒలింపిక్స్ అంటే ఒక మహా ఉత్సవం... 204 దేశాల ఆటగాళ్లతో జరిగే అతి పెద్ద క్రీడా పండగ. ఏళ్ల కఠోర శ్రమకు ప్రతిఫలాన్ని ఆశించే అథ్లెట్లు తమ సత్తాను ప్రదర్శించేందుకు సరైన వేదిక... విశ్వ సంగ్రామంలో గెలిచి గొప్పగా వెలిగేందుకు వచ్చే అత్యుత్తమ అవకాశం. క్రీడాకారులంతా ఒలింపిక్స్లో ఆడాలని అనుకుంటే కరోనా మహమ్మారి ఒలింపిక్స్తో సంవత్సర కాలంగా ఆడుకుంది. ఎట్టకేలకు ఏడాది ఆలస్యంగానైనా మెగా ఈవెంట్కు తెర లేవనుండటం ఊరట కలిగించే విషయం. ఈ క్రమంలో ఎన్ని అవాంతరాలు, అడ్డంకులు, ఆర్థికపరమైన నష్టాలు, పాజిటివ్ కేసులు... ప్రతీ రోజూ ఆటలు జరగడంపై సందేహాలే... కానీ అన్ని అవరోధాలను అధిగమించి చివరకు క్రీడల స్ఫూర్తి కోవిడ్ను జయించింది. ఈవెంట్స్ మొదలైన తర్వాత కూడా ఆటలకు ఎలాంటి గండాలు, రాకూడదని ప్రపంచమంతా కోరుకుంటోంది. విజేతలు ఎవరైనా అనూహ్య, అసాధారణ పరిస్థితుల మధ్య జరుగుతున్న టోక్యో క్రీడలు ఒలింపిక్స్ చరిత్రలో అన్నింటికంటే భిన్నంగా నిలిచిపోతాయి. టోక్యో: ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారులు, క్రీడాభిమానులు ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది. ప్రతిష్టాత్మక ఒలింపిక్ క్రీడలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. షెడ్యూల్ ప్రకారం గత ఏడాదే జరగాల్సి ఉన్నా... కరోనా కారణంగా సంవత్సరం పాటు వాయిదా పడిన ఆటలకు నేటితో తెర లేవనుంది. రెండు వారాల పాటు జరిగే క్రీడలు ఆగస్టు 8న ముగుస్తాయి. క్యాలెండర్లో తేదీ మారినా... మార్కెటింగ్, ఇతర కారణాల వల్ల టోక్యో–2020గానే ఈ క్రీడలను పరిగణిస్తున్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఏసీ)లో 206 సభ్య దేశాలు ఉండగా... ఉత్తర కొరియా పోటీల నుంచి గతంలోనే తప్పుకుంది. కరోనా భయంతో ఆఫ్రికా దేశం గినియా కూడా ఆటల్లో పాల్గొనడం లేదని గురువారం ప్రకటించింది. దాంతో 204 దేశాలకు చెందిన అథ్లెట్లు బరిలో నిలిచారు. ఐఓసీ ఎంపిక చేసిన శరణార్ధుల జట్టు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. గత డోపింగ్ కేసుల కారణంగా రష్యా దేశంపై నిషేధం కొనసాగుతున్నా.... డోపింగ్తో సంబంధం లేని రష్యా క్రీడాకారులకు టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనేందుకు అవకాశమిచ్చారు. వీరందరూ రష్యా ఒలింపిక్ కమిటీ (ఆర్ఓసీ) పేరిట బరిలోకి దిగుతారు. గేమ్స్ విలేజ్తో పాటు బయట కూడా కరోనా కేసులు బయటపడుతున్నా... ఒలింపిక్స్ను ఎలాగైనా నిర్వహిస్తామని ఐఓసీ స్పష్టం చేసింది. సాధ్యమైనన్ని జాగ్రత్తలు తీసుకొంటూ ఇప్పటికే విధించిన ఆంక్షలు, నిబంధన ప్రకారం క్రీడలను పూర్తి చేయాలని వివిధ దేశాల చెఫ్ డి మిషన్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మొత్తం క్రీడాంశాలు: 33 పాల్గొంటున్న ఆటగాళ్ల సంఖ్య: 11,500 పోటీల వేదికలు : 42 అందుబాటులో ఉన్న స్వర్ణ పతకాలు : 339 25 మందితో భారత బృందం ఆర్భాటాలు, అట్టహాసాలు ఏమీ లేకుండా ఒలింపిక్ క్రీడలు ప్రారంభం కానున్నాయి. కరోనా కారణంగా తక్కువ మందితో ఆరంభ వేడుకలు సాదాసీదాగా నిర్వహించనున్నారు. స్టేడియంలో ప్రేక్షకులు లేకపోయినా వివిధ దేశాల మార్చ్పాస్ట్ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో కూడా అన్ని దేశాలు తక్కువ మందితోనే పాల్గొంటున్నాయి. జపాన్ దేశ అక్షరమాల ప్రకారం వరుసలో 21వ స్థానంలో భారత బృందం నడుస్తుంది. మన దేశం నుంచి మార్చ్పాస్ట్లో 20 మంది ఆటగాళ్లు, 5 మంది అధికారులు నడుస్తారని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) వెల్లడించింది. లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత మేరీకోమ్, భారత హాకీ జట్టు కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ ‘ఫ్లాగ్ బేరర్స్’గా ముందుండి నడిపిస్తారు. ప్రేక్షకుల్లేకుండానే... మైదానంలో అభిమానుల చప్పట్లు, ప్రోత్సాహాలే అథ్లెట్లకు అదనపు ప్రాణవాయువునందిస్తాయి. ప్రేక్షకుల జోష్ మధ్య ఆటలు ఆడితే ఆ మజాయే వేరు. కానీ టోక్యోలో ఆటగాళ్లకు ఆ అదృష్టం లేదు. కరోనా నేపథ్యంలో ఈ క్రీడలకు ప్రేక్షకులను అనుమతించడం లేదు. జూలై 12 నుంచి జపాన్లో అత్యయిక పరిస్థితిని విధించడంతో ప్రజ లకు ఆటలను చూసేందుకు ఎలాంటి అవకాశం లేదు. ఇక అభిమానులంతా తమ హీరోల ఆట చూసేందుకు ఇంట్లో టీవీలు, ఫోన్లకు పరిమితం కావాల్సిందే. ‘రియో’లో భారత్ గత క్రీడల్లో భారత్ రెండు పతకాలు మాత్రమే గెలిచి పతకాల పట్టికలో 67వ స్థానంలో నిలిచింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్లో తెలుగు పీవీ సింధు రజత పతకం గెలుచుకోగా... మహిళల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ (58 కేజీల విభాగం)లో హరియాణాకు చెందిన సాక్షి మలిక్ కాంస్య పతకం సాధించింది. 9 స్వర్ణాలు, 7 రజతాలు, 12 కాంస్యాలు... ఒలింపిక్ క్రీడల చరిత్రలో మన దేశం సాధించిన మొత్తం పతకాల సంఖ్య 28... ఇందులో 8 పసిడి పతకాలు ఒక్క హాకీలోనే రాగా... ఇప్పటి వరకు ఒకే ఒక వ్యక్తిగత స్వర్ణం భారత్ ఖాతాలో ఉంది. నాలుగేళ్లకు ఒకసారి భారీ బలగంతో, ఆకాశాన్ని తాకే అంచనాలతో మన బృందం వెళుతున్నా... చాలా వరకు ఈ క్రీడలు నిరాశనే మిగిల్చాయి. ఇప్పుడు కూడా 127 మంది సభ్యులతో టీమిండియా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 2012లో గరిష్టంగా సాధించిన 6 పతకాల సంఖ్యను అధిగమిస్తుందా... రెండంకెల సంఖ్యను చేరుతుందా అనేది ఆసక్తికరం! ఇక ఒలింపిక్స్ చరిత్రలో అత్యధికంగా అమెరికా మొత్తం 2,847 పతకాలు గెలిచింది. ఇందులో 1,134 స్వర్ణాలు... 914 రజతాలు... 799 కాంస్యాలు ఉన్నాయి. -
Tokyo Olympics: ఏం చూసినా టీవీల్లోనే...
టోక్యో: విశ్వ క్రీడలంటేనే ప్రతిష్టాత్మకం. అలాంటే మేటి ఒలింపిక్స్ క్రీడలను ఔత్సాహిక ప్రేక్షకులు ప్రత్యక్షంగా చూసేందుకు ఎగబడతారు. నెలల ముందే టికెట్లు బుక్ చేసుకుంటారు. కానీ ‘టోక్యో’ ఈవెంట్ను మాత్రం కరోనా వైరస్ దెబ్బకొట్టింది. దీంతో ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ క్రీడల ఆరంభ సంబరాలు, పోటీలు, ముగింపు వేడుకలకు చప్పట్లు కొట్టేవారెవరూ ప్రేక్షకుల గ్యాలరీలో ఉండరు. దీంతో హీట్లు, ఫీట్లు, విజయాలు, ఘనతలు, రికార్డులు టోక్యో గడ్డపై ఇలా ఏం జరుగుతున్నా... టీవీల్లోనే చూడాలి. ప్రత్యక్ష ప్రేక్షకులుండరు. అంతా టీవీ ప్రేక్షకులే! ఇప్పటికే విదేశీ ప్రేక్షకులెవరినీ అనుమతించ వద్దని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్ణయం తీసుకుంది. స్వదేశీ ప్రేక్షకులను అనుమతించాలని అనుకున్నప్పటికీ అది కూడా సాధ్యంకానీ పరిస్థితి ఉందిపుడు! 68 వేల సీట్ల సామర్థ్యమున్న నేషనల్ స్టేడియంలో ఈనెల 23న ఒలింపిక్స్ ఆరంభోత్సవాలు జరుగుతాయి. దీనికి మాత్రం కేవలం వీఐపీలను అనుమతిస్తారు. వేదికల వద్ద ప్రేక్షకుల సందడే ఉండదని స్థానిక మీ డియా పేర్కొంది. చిన్నా చితక స్టేడియాల్లో జరిగే పోటీలకు పరిమిత సంఖ్యలో ప్రేక్షకుల్ని అనుమతించే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. -
ఘనంగా ఆరంభోత్సవం...
-
ఐపీఎల్-12 ప్రారంభం
-
ఈసారి ఐపీఎల్ వేడుకల్లేవ్!
ముంబై : భారత క్యాష్ రిచ్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ప్రారంభోత్సవ వేడుకులను బీసీసీఐ రద్దు చేసింది. ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ కార్యక్రమానికయ్యే ఖర్చును పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు అందజేస్తామని బీసీసీఐ పాలకుల కమిటీ ఛైర్మన్ వినోద్ రాయ్ ప్రకటించారు. మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే 14 రోజుల మ్యాచ్ల షెడ్యూల్ని బీసీసీఐ మూడు రోజుల క్రితం విడుదల చేసింది. అయితే ఈ ఏడాది ప్రారంభోత్సవానికి బదులుగా ఆ డబ్బుని పుల్వామా దాడిలో అసువులు బాసిన అమర జవాన్ల కుటుంబాలకి అందజేయాలని బీసీసీఐ పాలకుల కమిటీ నిర్ణయించింది. వాస్తవానికి అమర జవాన్ల కుటుంబాలకి రూ. 5 కోట్లు తగ్గకుండా బీసీసీఐ తరఫున ఆర్థిక సాయం అందించేందుకు అనుమతించాలని వినోద్ రాయ్కి బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా లేఖ రాశాడు. దీనిపై ఈరోజు జరిగిన సర్వసభ్య సమావేశంలో చర్చించిన బోర్డు సభ్యులు.. అంతకంటే ఎక్కువ మొత్తాన్నే ఇచ్చేందుకు అంగీకరించారు. -
‘ముందస్తు’ శంకుస్థాపనలు
హైదరాబాద్ : ముందస్తు ఎన్నికలు... నేడు అసెంబ్లీ రద్దు ఊహాగానాల నేపథ్యంలో జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు బుధవారం హడావుడిగా పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి ఒక్కరోజే గడువు ఉందని సీఎం కేసీఆర్ అనధికారికంగా పార్టీ నేతలకు తెలియజేయడంతో జిల్లాల్లో ఈ హంగామా కనిపించింది. అధికారులు, ఇతర టీఆర్ఎస్ నేతలు ఉరుకులు పరుగుల పెట్టారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు ప్రతిపక్ష నేతలూ తమ నియోజకవర్గ పరిధిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో ఒక్కరోజే వందల కోట్ల పనులకు శంకుస్థాపనలు జరిగాయి. మరిన్ని వందల కోట్ల పనులు ప్రారంభం అయ్యాయి. పలుచోట్ల వివిధ పథకాల చెక్కుల పంపిణీ జరిగింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మంత్రులు కేటీఆర్, సూర్యాపేటలో మంత్రి జగదీశ్రెడ్డి, నిజామాబాద్ జిల్లాలో మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి, జడ్చర్లలో మంత్రి లక్ష్మారెడ్డి, నిర్మల్లో మంత్రి ఇంద్రకరణ్రెడ్డితో పాటు ఇతర మంత్రులు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనల్లో పాల్గొన్నారు. మెదక్లో డిప్యూటీ స్పీకర్ సుడిగాలి పర్యటన చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఆలేరులో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత... పలువురు ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల పరిధిలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో హడావుడి చేశారు. పార్లమెంట్ సభ్యులు కూడా పలుచోట్ల ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
ఆసియా క్రీడల ప్రారంభోత్సవం
-
ఆసియా క్రీడల ప్రారంభ సంరంభం
జకార్త: ఇండోనేసియా వేదికగా 2018 ఆసియా క్రీడల సంరంభం మొదలైంది. నాలుగుసంవత్సరాలకొకసారి నిర్వహించుకునే పదహారు రోజుల సంగ్రామానికి తొలి వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. 18వ ఆసియా క్రీడలు ఇండోనేసియా రాజధాని జకర్తాలో అంగరంగ వైభవంగా మొదలైంది. ఇండియా నుంచి ఇండోనేసియా చేరుకున్న టార్చ్తో క్రీడాజ్యోతిని వెలిగించి బాడ్మింటన్ లెజండరీ ప్లేయర్ సుశి సుశాంత్ వేడుకులకు గ్రాండ్ ఓపెనింగ్ ఇచ్చారు. క్రీడాకారులు, కళాకారులతో గెలోరా బుంగ్ కర్నో స్టేడియం కన్నుల పండువగా నిలిచింది. స్థానిక సంప్రదాయ కళారూపాలతోపాటు, లైట్ షో ఆహూతులను విపరీతంగా అలరించాయి. జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా భారతీయ క్రీడా, అధికార బృందానికి పరేడ్లో నాయకత్వం వహించాడు. 45 దేశాల నుంచి 10 వేలకు మందిపైగా అథ్లెట్లు ఈ క్రీడల బరిలో ఉన్నారు. భారత్ నుంచి 572 మంది అథ్లెట్లు 36 క్రీడాంశాల్లో పోటీ పడుతున్నారు. పోటీలు ఆదివారం నుంచి ప్రారంభంకానున్నాయి. Susi Susanti lights the cauldron, and with this the torch completes its journey! The torch that has been brought from India and across Indonesia, has finally been placed in the cauldron! What a spectacular welcome! #OpeningCeremonyAsianGames2018 #OpeningAG2018 #AsianGames2018 pic.twitter.com/aPcXNEd7fj — Asian Games 2018 (@asiangames2018) August 18, 2018 Thank you for watching the #OpeningCeremonyAsianGames2018! Did you enjoy the show? See you at the games! #OpeningAG2018 #AsianGames2018 pic.twitter.com/lzlaZ0OVv6 — Asian Games 2018 (@asiangames2018) August 18, 2018 -
భిన్ భిన్... అటుంగ్... కాకా
2018 ఆసియా క్రీడల మోటోగా ‘ఎనర్జీ ఆఫ్ ఆసియా’ను నిర్ధారించారు. దీంతో పాటు మస్కట్లుగా భిన్ భిన్, అటుంగ్, కాకాలను ప్రకటించారు. భిన్ భిన్ను బర్డ్ ఆఫ్ ప్యారడైజ్గా అభివర్ణిస్తారు. ఈశాన్య ఇండోనేసియాలో కనిపించే ఈ పక్షి వ్యూహానికి, ఎత్తుగడలకు ప్రతీక. అతుంగ్... వేగంగా పరుగెత్తే బవియన్ దుప్పి. ఇండోనేసియా మధ్య ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయివి. ‘ఎప్పటికీ వదలొద్దు (నెవర్ గివ్ అప్)’ అనే ఉద్దేశంలో దీనిని ఎంపిక చేశారు. చివరిదైన కాకా... ఖడ్గమృగం. అసలు పేరు ఇకా. అంతరిస్తోన్న ఈ జంతువు విశిష్టత తెలిపేందుకు, శక్తికి చిహ్నంగానూ పేర్కొంటూ మస్కట్గా ప్రకటించారు. -
ఏషియాఢంకా
భారీ సంఖ్యలో క్రీడాకారులు... దిగ్గజాలనదగ్గ దేశాలు... పెద్దఎత్తున బృందాలు... అందుకు తగ్గట్లు రికార్డులు... బరిలో హేమాహేమీలు... రసవత్తర సమరాలు... పతకాల వేటలో... పతాకస్థాయి పోరాటాలు... ... నేటి నుంచే ఏషియాడ్ సంరంభం ... పదహారు రోజుల పాటు సంగ్రామం సాక్షి క్రీడా విభాగం ఆసియా అతిపెద్ద క్రీడా సమరానికి నేడే శంఖారావం. ఇండోనేసియా వేదికగా... జకార్తా–పాలెంబాంగ్ నగరాల్లో శనివారం నుంచే 18వ ఏషియాడ్ ఆరంభం. 11 వేల మంది అథ్లెట్లు... 45 దేశాల ప్రాతినిధ్యంతో సెప్టెంబర్ 2 వరకు క్రీడలు. పతకాల వేటలో మేటైన చైనా... దీటైన జపాన్... దమ్మున్న దక్షిణ కొరియా... వీటిని తట్టుకుంటూ భారత్! మరి... ఈసారైనా మన భాగ్యరేఖ మెరుగవుతుందా? కామన్వెల్త్ జోరును ఇక్కడా కొనసాగిస్తుందా? పట్టికలో ప్రస్థానం పైకెళ్తుందా? బలాలేమిటి...? బలహీనతలేమిటి? అంశాల వారీగా ఓసారి సమీక్షిస్తే...! నవ యువత... అనుభవజ్ఞులు ఏషియాడ్ భారత బృందంలో పదహారేళ్ల పాఠశాల బాలిక నుంచి ఒలింపిక్ పతకాలు గెలిచిన ఉద్ధండులున్నారు. నాలుగు నెలల క్రితం కామన్వెల్త్ క్రీడల్లో దాదాపు ఇదే బృందం అద్భుత ప్రదర్శనతో అనూహ్యంగా మూడో స్థానం సాధించి సగర్వంగా దేశానికి తిరిగొచ్చింది. అయితే, ఆ పోటీల్లో చైనా, జపాన్, దక్షిణ కొరియాకు ప్రాతినిధ్యం లేదు. ఏషియాడ్లో మాత్రం ఈ దేశాల నుంచి ప్రతి అంశంలో పోటీ తప్పదు. వీటితోపాటు బృందం ఎంపిక, పరిమితిపై వివాదాలతో ముందే కొంత చర్చ రేగింది. ఈ నేపథ్యంలో ఏకాగ్రత చెదరకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. గతమే స్ఫూర్తి... కొన్నేళ్లుగా మెరుగుపడుతున్న భారత క్రీడా వ్యవస్థకు నిదర్శనంగా 2014 ఏషియాడ్లో మన క్రీడాకారులు విశేషంగా రాణించారు. 11 స్వర్ణాలు సహా మొత్తం 57 పతకాలు నెగ్గి ఈ క్రీడల చరిత్రలో తమ రెండో అత్యుత్తమ ప్రదర్శనను పునరావృతం చేశారు. సుశీల్ కుమార్, నీరజ్ చోప్రా, మనూ భాకర్లకు తోడు బ్యాడ్మింటన్లో తెలుగు తేజం పీవీ సింధు ఫామ్ను బట్టి చూస్తే ప్రస్తుతం ఈ సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే మరో చరిత్ర సృష్టించినట్లవుతుంది. సింధు, శ్రీకాంత్లపై దృష్టి ప్రపంచ చాంపియన్షిప్లో ఫైనల్ చేరిన పీవీ సింధు అద్భుత ఫామ్లో ఉంది. ఆఖరి పోరాటాల్లో ఓడుతున్నా... ఏ దశలోనైనా పుంజుకోగల సత్తా సింధు సొంతం. చైనా, థాయ్లాండ్, జపాన్ షట్లర్ల నుంచి తీవ్ర పోటీ ఉన్నా... వాటిని అధిగమించడం ఈ తెలుగమ్మాయికి కష్టమేం కాదు. పూర్వ ఫామ్ను అందుకుంటే పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్ నుంచి కూడా పతకం ఆశించవచ్చు. హెచ్ఎస్ ప్రణయ్పైనా ఆశలున్నాయి. హిమాదాస్ మెరిసేనా... అసోంకు చెందిన హిమాదాస్పై ఈ ఏషియాడ్లో అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా అండర్–20 ప్రపంచ చాంపియన్షిప్ 400 మీటర్ల పరుగు పందెంలో హిమాస్వర్ణం నెగ్గడమే దీనికి కారణం. జకార్తాలోనూ ఈమెను ఫేవరెట్గా భావిస్తున్నారు. పతకం సాధిస్తుందని ఆశిస్తున్నారు. వీరేం చేస్తారో... రెజ్లింగ్లో ఒలింపిక్ పతక విజేతలైన సుశీల్ కుమార్, సాక్షి మలిక్లు ఏమేరకు రాణిస్తారో చూడాల్సి ఉంది. తమ గురించి కొత్తగా చాటేందుకు ఏమీ లేకున్నా... కొంతకాలంగా వీరు ఫామ్లో లేరు. సుశీల్ ఇటీవల టిబిలిసి గ్రాండ్ప్రిలో బౌట్ ఓడిపోయాడు. నాలుగేళ్లలో అతడికిదే తొలి పరాజయం కావడం గమనార్హం. టర్కీలో జరిగిన యాసర్ డొగు టోర్నీలో సాక్షి పతకం అందుకోలేకపోయింది. వీరి ప్రతిష్ఠకు ఈ ఏషియాడ్ ఓ సవాలే. స్వర్ణం తప్ప మరేది గెలిచినా వారి స్థాయికి తక్కువే అన్నట్లవుతుంది. ఒలింపిక్స్ టికెట్ కొట్టేస్తారా..? పురుషుల హాకీ జట్టు పూర్వ వైభవం దిశగా అడుగులేస్తోంది. చాంపియన్స్ ట్రోఫీలో రన్నరప్గా నిలిచింది. గత ఏషియాడ్లో స్వర్ణంతో మెరిసింది. ఈసారి దానిని నిలబెట్టుకుంటే 2020 ఒలింపిక్స్కు నేరుగా అర్హత పొందుతుంది. పరిస్థితి చూస్తే మళ్లీ స్వర్ణం నెగ్గేలా కనిపిస్తున్నా... పాకిస్తాన్, దక్షిణ కొరియాలను ఎలా ఎదుర్కొంటుందనేదీ కీలకమే. రాణి రాంపాల్ ఆధ్వర్యంలోని మహిళల హాకీ జట్టు సంచలనాలు సృష్టించ గలదు. గత క్రీడల్లో గెలిచిన కాంస్యాన్ని మించి రాణించేందుకు ప్రయత్నించాల్సి ఉంది. ‘కిక్’ ఇస్తారా? బాక్సింగ్లో భారత్కు ఎక్కువ అవకాశాలే కనిపిస్తున్నాయి. అందుకు కారణం... వికాస్ కృషన్, శివ థాపాలతో పాటు వర్థమాన తార గౌరవ్ సోలంకి. మహిళల విభాగంలో ప్రపంచ చాంపియన్షిప్ రజతం విజేత సర్జుబాలా దేవి భారత్ ఖాతాలో పతకం చేర్చగలదు. కామన్వెల్త్ క్రీడల్లో టేబుల్ టెన్నిస్ స్టార్ మనికా స్వర్ణం ఒడిసిపట్టింది. ఇప్పుడు కనీసం ఒక పతకమైనా తెస్తుందని భావిస్తున్నారు. కొంతకాలంగా సంచలన ప్రదర్శనలతో అదరగొట్టి వార్తల్లో నిలిచిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ గాయం కారణంగా ఇబ్బంది పడింది. దాన్నుంచి కోలుకున్న ఆమె బరిలో దిగనుండటం ఆశలు రేపుతోంది. ► బ్రిడ్జ్ క్రీడలో బరిలో దిగనున్న 81 ఏళ్ల లీహంగ్ ఫాంగ్... ఆసియా క్రీడల చరిత్రలోనే అతిపెద్ద వయస్కుడు. 11 ఏళ్ల ఇయాన్ నుర్మెన్ అమ్రి (స్కేట్బోర్డర్) అతి చిన్నవయస్కుడు. వీరిద్దరూ మలేసియాకు చెందినవారే కావడం విశేషం. ప్రారంభ వేడుకలు సోనీ టెన్–2, సోనీ ఈఎస్పీఎన్లలో ప్రత్యక్ష ప్రసారం మనోళ్లు 17 మంది... ► ఆర్చరీ– జ్యోతి సురేఖ (ఆంధ్రప్రదేశ్). ► బ్యాడ్మింటన్– కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు, చుక్కా సాయి ఉత్తేజిత రావు, సాత్విక్ సాయిరాజ్ (ఆంధ్రప్రదేశ్), సైనా నెహ్వాల్, సిక్కి రెడ్డి, సుమీత్ రెడ్డి, సాయిప్రణీత్, పుల్లెల గాయత్రి (తెలంగాణ) ► బాక్సింగ్– హుసాముద్దీన్ (తెలంగాణ) ► జిమ్నాస్టిక్స్– అరుణా రెడ్డి (తెలంగాణ) ► మహిళల హాకీ– రజని (ఆంధ్రప్రదేశ్) ► పురుషుల కబడ్డీ– మల్లేశ్ (తెలంగాణ) ► సెపక్తక్రా– తరంగిణి (తెలంగాణ) ► షూటింగ్–రష్మీ రాథోడ్ (తెలంగాణ) ► టెన్నిస్–యడ్లపల్లి ప్రాంజల (తెలంగాణ) -
రష్యా గర్జన
సొంతగడ్డపై రష్యా జూలు విదిల్చింది. గోల్స్ వర్షం కురిపించి ఘనంగా బోణీ కొట్టింది. ఆకలిగొన్న పులిలా విరుచుకుపడి సౌదీ అరేబియాకు పాంచ్ పటాకాతో పంచ్ ఇచ్చింది. ఫిఫా ప్రపంచ కప్నకు ఆతిథ్య జట్టుగా తనవంతు అదిరే ఆరంభం అందించింది. మాస్కో: ఆ టోర్నీ, ఈ టోర్నీ అని లేకుండా గెలుపు కోసం నెలల తరబడి సాగుతున్న రష్యా నిరీక్షణ... ప్రపంచకప్ తొలి మ్యాచ్తోనే తీరింది. ఇక్కడి లుజ్నికి స్టేడియంలో గురువారం సౌదీ అరేబియాతో జరిగిన పోరులో అద్భుత రీతిలో ఆడిన ఆతిథ్య జట్టు 5–0 తేడాతో జయభేరి మోగించింది. బంతిని ఎక్కువ సమయం ఆధీనంలో ఉంచుకున్నప్పటికీ సౌదీ జట్టు ఒక్క గోల్ కూడా చేయలేక పోయింది. రష్యా ఆటగాళ్లలో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ చెరిషెవ్ రెండు, గాజిన్ స్కీ, అలెగ్జాండర్ గొలొవిన్, డియుబా తలా ఒక గోల్తో ప్రత్యర్థిని కోలుకోనీయకుండా చేశారు. చెరిషెవ్, డియుబాలు సబ్స్టిట్యూట్లుగా వచ్చి గోల్స్ కొట్టడం విశేషం. అదే ‘తల’మానికం ఆతిథ్య దేశాన్ని ఒత్తిడిలో నెడుతూ మ్యాచ్ను సౌదీనే దూకుడుగా ప్రారంభించింది. క్రమంగా రెండు జట్లూ ఎదురుదాడి వ్యూహానికి దిగాయి. ఓ దశలో గొలొవిన్, ఫెర్నాండెజ్ దూసుకొచ్చినా సౌదీ డిఫెండర్లు చక్కగా అడ్డుకున్నారు. ప్రత్యర్థిపై అదే పనిగా ఒత్తిడి పెంచిన రష్యాకు 12వ నిమిషంలో ఫలితం దక్కింది. గొలొవిన్ అందించిన క్రాస్ను గాజిన్స్కీ తలతో ముచ్చటైన రీతిలో గోల్ పోస్ట్లోకి పంపాడు. దీంతో సౌదీ ఆత్మరక్షణలో పడిపోయింది. కీలక ఆటగాడైన అలెన్ డగోవ్ కండరాల గాయంతో వైదొలగడం కూడా రష్యాకు కలిసొచ్చింది. అతడి స్థానంలో వచ్చిన చెరిషెవ్ 43వ నిమిషంలో గోల్ కొట్టాడు. తొలి అర్ధ భాగం ముగిసేసరికి జట్టు 2–0తో నిలిచింది. రెండో భాగంలో మరింత జోరుగా వరుసగా గోల్స్ సమర్పించుకుని మానసికంగా వెనుకడుగు వేసిన సౌదీ... రెండో భాగంలో ఎంత ప్రయత్నించినా ప్రత్యర్థిని అందుకోలేకపోయింది. కనీసం గోల్పోస్ట్ సమీపానికి కూడా వెళ్లలేకపోయింది. అటు రష్యా సైతం పట్టు విడవ కుండా మరింత జోరుగా ఆడింది. సబ్స్టిట్యూట్గా వచ్చిన డియుబా 71వ నిమిషంలో గోల్తో ఆధిక్యాన్ని పెంచాడు. 91వ నిమిషంలో చెరిషేవ్ మరో గోల్ చేశాడు. 94వ నిమిషంలో గొలోవిన్ ఫ్రీ కిక్ను గోల్పోస్ట్లోకి పంపడం, ఫైనల్ విజిల్ మోగడం వెంటవెంటనే జరిగిపోయాయి. డిఫెన్స్ లోపాలతో సౌదీ భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. వారి గోల్ పోస్ట్పైకి 13 సార్లు ప్రత్యర్థి ఆటగాళ్లు దాడి చేయడమే దీనికి నిదర్శనం. రిఫరీలు ఇరు జట్లలో చెరో ఆటగాడు ఎల్లో కార్డ్ చూపారు. చెరిషెవ్ -
జనులెల్ల...కనులారా!
మేఘావృతమైన చలచల్లని సాయంత్రం... ఆ దేశం ఈ దేశం అని కాకుండా వసుధైక కుటుంబంలా పోగైన అభిమాన గణం... మైదానమే బంతి ఆకృతిగా మారిన నేపథ్యం... మధ్యలో అదరహో అనేలా ప్రధాన వేదిక... మంత్రముగ్ధులను చేసిన కళాకారుల వైవిధ్య ప్రదర్శనలు... మిన్నంటే కరతాళ ధ్వనుల మధ్య మస్కట్ జబివాకాతో అడుగిడిన బ్రెజిల్ దిగ్గజం రొనాల్డో... ఆ వెనుకే బ్రిటీష్ పాప్ స్టార్ రాబి విలియమ్స్... పక్షి ఆకార ఏర్పాటులో వేంచేసిన రష్యన్ గాయని ఐదా గార్ఫులినా! మాస్కోలోని లుజ్నికి స్టేడియంలో గురువారం ఫిఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ ప్రారంభ కార్యక్రమాలు అట్టహాసంగా సాగాయి. మ్యాచ్ అధికారిక బంతిని మోడల్ విక్టోరియా లొపిరెవా జనంతో కిక్కిరిసిన స్టేడియంలోకి తీసుకురాగా, స్పెయిన్ మాజీ గోల్కీపర్ ఐకర్కాసిల్లాస్ ప్రపంచ కప్ ట్రోఫీని ఆవిష్కరించాడు. రాక్ డీజే శబ్దాల హోరులో ‘మిమ్మల్ని ఆనందింపజేయనివ్వండి (లెట్ మి ఎంటర్టైన్ యు)’ అంటూ రాబి విలియమ్స్ పాడిన పాట ఉర్రూతలూగించింది. మధ్యలో గార్ఫులినా అతడితో గళం కలిపింది. 800 మంది కళాకారులు పాల్గొన్న ఈ వేడుక, గతానికి భిన్నంగా అరగంట పాటే సాగింది. అనంతరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రసంగిస్తూ, ఫుట్బాల్ ప్రపంచకప్ మొదలైనట్లు ప్రకటించారు. ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ఫాన్టినో ప్రసంగం ముగిశాక... మహా సంగ్రామానికి తెరలేచింది. రాబి విలియమ్స్, ఐదా గార్ఫులినా జబివాకాతో రొనాల్డో -
అట్టహాసంగా ఫిఫా ప్రారంభ వేడుకలు
మాస్కో: సాకర్ సమరానికి తెర లేచింది. ఫుట్బాల్ ప్రేమికులు అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్న 21వ ప్రపంచకప్ టోర్నమెంట్ గురువారం రాత్రి ఆరంభమైంది. దాదాపు 88 ఏళ్ల చరిత్ర కలిగిన పుట్బాల్ ప్రపంచ కప్ మహా సంగ్రామం అంగరంగ వైభవంగా రష్యాలో ప్రారంభమైంది. స్థానిక లుజ్నికి మైదానంలో నిర్వహించిన ఆరంభోత్సవం కనుల విందు చేసింది. రష్యా దేశ చరిత్ర, సాంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టి పడేలా ఏర్పాటు చేసిన సెట్టింగులు, కళాకారుల పాటలు, నృత్య ప్రదర్శనలు, బాణసంచా అదరహో అనిపించాయి. దేశవిదేశాల నుంచి వచ్చిన క్రీడాకారులు, అతిరథ మహారథులు, అభిమానులతో స్టేడియం హోరెత్తిపోయింది. బ్రిటిష్ పాప్ స్టార్ రాబీ విలియమ్సన్, రష్యన్ గాయని ఐదా గార్ఫులినా బృందం మ్యూజికల్ షో అభిమానులను అలరించింది. దాదాపు 500 మంది నృత్యకారులు, జిమ్నాస్ట్లు, ట్రాంపోలినిస్ట్ల ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. దీనికి సమాంతరంగా మాస్కో నగరంలోని ప్రఖ్యాత రెడ్ స్క్వేర్లో నిర్వహించిన సంగీత విభావరి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రారంభోపన్యాసం చేశారు. ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినో ఫీఫా ప్రపంచ కప్ పోటీలు ప్రారంభమైనట్లు అధికారికంగా ప్రకటించారు. ఆరంభ మ్యాచ్లో రష్యా, సౌదీ అరేబియా జట్లు తలపడుతున్నాయి. -
ప్రారంభోత్సవంలో రాబీ విలియమ్స్ గానం
లండన్: ఫిఫా ప్రపంచ కప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బ్రిటిష్ పాప్ స్టార్ రాబీ విలియమ్సన్ తన గానంతో అలరించనున్నాడు. ఈ నెల 14న మాస్కోలోని లుజ్నికి మైదానంలో రష్యా–సౌదీ అరేబియా మధ్య తొలి మ్యాచ్తో విశ్వ సమరానికి తెరలేవనుంది. దీనికి కొద్దిగా ముందు రాబీ... రష్యన్ గాయని ఐదా గార్ఫులినాతో కలిసి పాడనున్నాడు. 44 ఏళ్ల రాబీ ‘ఏంజెల్స్’ ఆల్బమ్తో ప్రఖ్యాతిగాంచాడు. రెండేళ్ల క్రితం అతడి పాట ‘పార్టీ లైక్ ఏ రష్యన్’ వివాదాస్పదమైంది. ఇది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను ఉద్దేశించినట్లు ఉందని అభ్యంతరాలు వచ్చాయి. వీటిని అప్పట్లోనే రాబీ ఖండించాడు. అయితే, తాజా అవకాశాన్ని అతడు తన చిన్ననాటి కలగా, మర్చిపోలేని జ్ఞాపకంగా అభివర్ణించాడు. మరోవైపు బ్రెజిల్ మాజీ దిగ్గజం రొనాల్డోపై చిత్రీకరించిన ‘ఓ ఫినామినో’ వీడియోనూ ప్రపంచ కప్ ప్రారంభం సందర్భంగా ప్రదర్శించనున్నారు. -
కలర్ఫుల్గా ఐపీఎల్-11 వేడుకలు
-
ఐపీఎల్: 10 నిమిషాలకు తమన్నా అంత తీసుకుందా!
ముంబై : మరి కొద్ది గంటల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్-2018 ఆరంభోత్సవ వేడుకల్లో సౌత్బ్యూటీ తమన్నా చిందేయనుంది. పదినిమిషాల ప్రదర్శనకు ఈ అమ్మడు ఏకంగా 50 లక్షల రూపాయలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముంబైలోని వాంఖడే మైదానంలో ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో తమన్నాతో కలిసి డ్యాన్సింగ్ మ్యాస్ట్రో ప్రభుదేవా ప్రేక్షకులను అలరించనున్నాడు. నాలుగు దక్షిణాది పాటల్లో చిందేసే వీరి నృత్యాన్ని శైమక్ దేవర్ కొరియోగ్రఫి చేసినట్లు సమాచారం. ఇక ఈ అవకాశంపై తమన్నా ఆనందం వ్యక్తం చేసింది. తొలిసారి క్రీడా ఈవెంట్లో ప్రదర్శన చేస్తున్నానని సంబరపడిపోయింది. ఇంతకముందు ఇలాంటి వేడుకల్లో ఎప్పుడు పాల్గొనలేదని, ఐపీఎల్ వంటి అద్భుతమైన టోర్నీకి అవకాశం రావడం సంతోషంగా ఉందని ఈ మిల్కీబ్యూటీ చెప్పుకొచ్చింది. సినిమాల్లో నటించడం వేరు స్టేడియంలో ప్రేక్షకుల ముందు చేయడం వేరని, మనమంతా పిచ్చిగా ఆరాధించే క్రికెట్ పండుగ ఈ రాత్రి మొదలవుతుందని ఆనందం వ్యక్తం చేసింది. అయితే ఈ వేడుకల్లో తమన్నా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ప్రదర్శన చేయనుంది. దీనిపై స్పందిస్తూ.. ముంబై, హైదరాబాద్, చెన్నైలు తన సొంత నగరాలని తెలిపింది. తాను తెలుగు, తమిళం, హిందీ, కన్నడ నాలుగు భాషలకు చెందిన నాలుగు పాటలకు డ్యాన్స్ చేస్తున్నట్లు పేర్కొంది. ఈ సాయంత్రం ఆరు గంటలకు మొదలయ్యే ఈ వేడుకల్లో తమన్నా, ప్రభుదేవాలతో పాటు స్టార్ హీరోలు హృతిక్ రోషన్, వరుణ్ ధావన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్లు డ్యాన్సులతో అభిమానులను కనువిందు చేయనున్నారు. అయితే ఈ వేడుకల నుంచి భుజగాయంతో రణవీర్సింగ్, షూటింగ్ బిజీతో పరణితీ చోప్రాలు తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ ఆరంభ వేడుకలు అనంతరం చెన్నైసూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ మొదలవుతుంది. It's time for some great adrenaline, it's time for IPL!! #vivoipl A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) on Apr 6, 2018 at 10:47pm PDT -
ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో హృతిక్ రోషన్
-
ఐపీఎల్ ఆరంభోత్సవానికి కెప్టెన్లందరు రారట!
సాక్షి, స్పోర్ట్స్ : ఏప్రిల్ 7న ప్రారంభమయ్యే ఈ సీజన్ ఐపీఎల్ ఆరోంభత్సవాలకు అన్ని జట్ల కెప్టెన్లు హాజరుకావల్సిన అవసరం లేదని బీసీసీఐ నిర్ణయించింది. దీంతో కేవలం తొలి మ్యాచ్ ఆడుతున్న కెప్టెన్లు మాత్రమే పాల్గొనున్నారు. ఐపీఎల్ లీగ్కు సంబంధించిన 8 మంది కెప్టెన్లతో ఓ వీడియో రూపొందించి ఆరంభ వేడుకలతో పాటు ఫ్రాంచైజీలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయా నగారాల్లో ప్రదర్శించాలని బీసీసీఐ భావిస్తోంది. అందరు కెప్టెన్లు హాజరుకావడం వల్ల మరుసటి రోజు ఉండే మ్యాచ్లకు హాజరయ్యే విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఈ సమస్యను పరిష్కరించే దిశగా ఈనిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తాత్కలిక అధ్యక్షుడు సీకే ఖన్నా మీడియాకు తెలిపారు. అన్ని జట్ల కెప్టెన్లను ఆరంభానికి ముందు రోజు రప్పించి వారితో ప్రత్యేక వీడియో షూట్ చేసి ఆరంభ వేడుకల్లో వీటిని ప్రదర్శించాలని అనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఇక ఏప్రిల్ 7న ముంబైలోని వాంఖడే మైదానంలో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్లో తలపడనున్న విషయం తెలిసిందే. -
రూ.18 కోట్లతో ఐపీఎల్ ప్రారంభోత్సవం
న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరగనున్న 11వ సీజన్ ఐపీఎల్ను అట్టహాసంగా ఆరంభించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఆరంభ సంబరాలకు రూ.18 కోట్లు ఖర్చు చేయనున్నట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి. ‘ప్రారంభవేడుక కోసం సీఓఏ నుంచి రూ. 30 కోట్ల బడ్జెట్ మంజూరైంది. అయితే బీసీసీఐ ఫైనాన్స్ కమిటీ రూ. 18 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది’ అని బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా తెలిపారు. వచ్చే నెల 7న ముంబైలో జరిగే ప్రారంభ వేడుకల్లో అన్ని ఫ్రాంచైజీల కెప్టెన్లు పాల్గొంటారు. ప్లే ఆఫ్ మ్యాచ్ల వేదిక కూడా ఖరారైంది. పుణేలో ఈ మ్యాచ్లు జరుగుతాయి. అయితే ఏవైనా అవాంతరాలు ఎదురైతే రాజ్కోట్, లక్నో (నూతన స్టేడియం) వేదికలను స్టాండ్బైగా ఎంపిక చేశారు. సామాజిక బాధ్యతగా టాటా క్యాన్సర్ ట్రస్టుతో బీసీసీఐ ఒప్పందం కుదుర్చుకుంది. క్యాన్సర్ అవగాహన కార్యకలాపాలకు చేయూతనందించనుంది. -
ఐపీఎల్ నిర్వాహకులకు షాక్
సాక్షి, న్యూఢిల్లీ: నెల రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఆరంభ వేడుకలను అట్టహాసంగా జరుపడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా వేదికగా ఏప్రిల్ 6 న అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు బీసీసీఐ భావించింది. అయితే తాజాగా ప్రారంభ వేడుకలపై సుప్రీంకోర్టు నియమిత పాలక కమిటీ(సీవోఏ) తీసుకున్న నిర్ణయం బీసీసీఐను షాక్కు గురి చేసింది. అయితే ఏప్రిల్ 7న ఓపెనింగ్ మ్యాచ్ జరిగే రోజున వాంఖేడే స్టేడియంలో వేడుకలు నిర్వహించాలని సీవోఏ తాజాగా నిర్ణయించింది. అంతే కాకుండా రూ. 50 కోట్లతో ప్రారంభ వేడుకులు జరపాలన్న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయానికి సీవోఏ బ్రేక్ వేస్తూ.. ఆ బడ్జెట్ మొత్తాన్ని రూ. 30 కోట్లకు కుదించింది. బడ్జెట్లో కోత, వేడుకల తేదీలో మార్పుతో లీగ్లో తొలి మ్యాచ్ (ఏప్రిల్ 7) ఆరంభానికి కొన్ని గంటల ముందే వేడుకలు నిర్వహించడానికి బీసీసీఐ ప్రస్తుతం సన్నాహాలు చేస్తోందని ఓ అధికారి తెలిపారు. కాగా ఐపీఎల్-11 సీజన్లో తొలి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)ల మధ్య జరుగనుంది. రెండేళ్ల నిషేధం తర్వాత బరిలోకి దిగుతున్న సీఎస్కే సీజన్ తొలి మ్యాచ్లోనే సత్తాచాటేందుకు కసరత్తులు చేస్తోంది. -
వింటర్ ఒలింపిక్స్ ప్రారంభం
-
సాహోరే ఐపీఎల్ 2017
-
ఐపీఎల్-10 ఫొటో సె'న్సే'షన్ చూశారా..?
ఐపీఎల్-10వ సీజన్ కు సంబంధించి ట్రోఫీతో 8 జట్ల కెప్టెన్లు ఉన్న ఫొటోను తొలిసారిగా మంగళవారం విడుదలచేశారు. మరి కొద్ది గంటల్లో హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం(ఉప్పల్) స్టేడియం వేదికగా ఐపీఎల్-10 పోటీ మొదలుకానుంది. బుధవారం రాత్రి 8 గంటలకు సన్ రైజర్స్- రాయల్ చాలెంజర్స్ మధ్య తొలి మ్యాచ్ నిర్వహణకు ముందు ప్రారంభవేడుకలు జరుగుతాయి. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ఓపెనింగ్ సెర్మనీలో నటి అమీ జాక్సన్ ('ఐ', 'రోబో2.0' ఫేమ్) ప్రత్యేక ప్రదర్శన ఇస్తోంది. ఈ మేరకు నిర్వహకులు ప్రకటనలో తెలిపారు. కోల్ కతాలో శ్రద్ధా కపూర్.. ఢిల్లీలో పరిణితీ చోప్రా.. ఐపీఎల్ ప్రారంభమై దశాబ్ధం పూర్తవుతోన్న సందర్భంగా, గత సంప్రదాయాలకు భిన్నంగా ఈ సారి ఎనిమిది వేదికల్లో (ఆయా టీమ్ ల హోమ్ గ్రౌండ్స్ లో) ప్రారంభవేడుకలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో అమీ జాక్సన్, ముంబైలో జరిగే ప్రారంభవేడుకలో రితేశ్ దేశ్ ముఖ్, గుజరాత్ లో టైగర్ ష్రాఫ్, కోల్ కతా ఈడెన్ గార్డెన్ లో శ్రద్ధాకపూర్, ఢిల్లీలో నిర్వహించే ప్రారంభవేడుకలో పరిణీతి చోప్రా ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. మిగతా వేదికల్లో ఏయే స్టార్లు మెరిపిస్తారనేది ఇంకా ఖరారు కాలేదు. 47 రోజులు.. 60 మ్యాచ్ లు ఏప్రిల్ 5న హైదరాబాద్ లో ప్రారంభమయ్యే ఐపీఎల్-10 సీజన్.. మే 21న హైదరాబాద్ లోనే జరిగే ఫైనల్ మ్యాచ్ తో ముగుస్తుంది. 47 రోజులపాటు విభిన్న వేదికల్లో మొత్తం 60 మ్యాచ్ లు జరుగుతాయి. సోనీ మ్యాక్స్, సోనీ ఈఎస్పీఎన్ చానెళ్లలో ప్రత్యక్షప్రసారమయ్యే మ్యాచ్ లను Sony LIV యాప్ లేదా www.sonyliv.com. ద్వారానూ వీక్షించొచ్చు. -
సైనికుడి విన్యాసాన్ని ఆసక్తిగా తిలకించిన మోదీ
-
మరకానా జిగేల్
రియోడిజనీరో: క్రీడా ప్రపంచమంతా అతి పెద్ద సంబరంగా భావించే ఒలింపిక్స్ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 31వ ఒలింపిక్స్ లో భాగంగా బ్రెజిల్ నగరం రియో డి జనీరో పక్షం రోజులకు పైగా పాటు జరిగే క్రీడా సంబరాలకు అధికారికంగా తెరలేచింది. భారత కాలమాన ప్రకారం శనివారం తెల్లవారుజామున మరకానా స్టేడియంలో ఒలింపిక్స్ క్రీడలు ఆరంభమయ్యాయి. కళ్లు మిరమిట్లు గొలిపే బాణాసంచా వెలుగులు, అదిరిపోయే అథ్లెట్ల కవాతులు, ఆకట్టుకునే నృత్యాల నడుమ విశ్వ క్రీడా వేడుకలు 'కలర్ ఫుల్' గా ప్రారంభమయ్యాయి. బ్రెజిల్ చరిత్రను పరిచయం చేసే కళారూపం జిగేల్ మనిపించింది. దాదాపు ఆరువేల మంది కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు వారి చరిత్రకు అద్దం పట్టాయి. అలాగే బ్రెజిల్ సంస్కృతిని చాటే సాంబా, కార్నివాల్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఆగస్టు 5వ తేదీ నుంచి 21వ తేదీ వరకూ మరకానాతో సహా మొత్తం 37 వేదికల్లో ఒలింపిక్స్ క్రీడలు జరుగుతాయి. భారత్కు తొలి వ్యక్తిగత స్వర్ణం అందించిన అభినవ్ బింద్రా ఆరంభోత్సవంలో మన బృందానికి నాయకత్వం వహించాడు. ఈసారి భారత్ నుంచి అత్యధిక స్థాయిలో 118 మంది ఒలింపిక్స్లో బరిలోకి దిగుతున్నారు. మరోవైపు భారీ ఒలింపిక్ బృందంతో ఒలింపిక్స్ కు సిద్ధమైన అమెరికా ఆరంభ వేడుకల్లో ప్రత్యేకగా ఆకర్షణగా నిలిచింది. ఒలింపిక్స్ వేడుకలకు విచ్చేసిన అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ తమ దేశ క్రీడాకారులను చప్పట్లతో ఉత్సాహపరిచారు. భారత కాలమానం ప్రకారం రియో ఎనిమిదిన్నర గంటలు వెనక ఉంటుంది. కాబట్టి ప్రతి రోజూ మన కాలమానం సాయంత్రం ఆరు గంటల నుంచి పోటీలు జరుగుతాయి. ఉదయం ఏడు గంటల వరకూ పోటీలు సాగుతాయి. -
అంగరంగ వైభవంగా రియో ఒలింపిక్స్
-
రియో ఒలంపిక్స్ నేటి రాత్రి ప్రారంభం
-
నేడు బీబీనగర్ నిమ్స్ ప్రారంభోత్సవం
హైదరాబాద్ : నల్లగొండ జిల్లా బీబీనగర్లో ఏర్పాటు చేయనున్న నిమ్స్ ఆసుపత్రిని ఆదివారం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, విద్యుత్శాఖ మంత్రి జగదీశ్వర్రెడ్డి హాజరవుతారు. నిమ్స్ డెరైక్టర్ ఆధ్వర్యంలో ఇందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. -
కబడ్డీ పోటీల ప్రారంభ కార్యక్రమంలో అపశృతి
రాజమండ్రి : తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో గురువారం సాయంత్రం జాతీయ స్థాయి కబడ్డీ పోటీల ప్రారంభ కార్యక్రమంలో అపశృతి దొర్లింది. ప్రమాదవశాత్తు గ్యాలరీ కూలింది. ఈ ఘటనలో సుమారు 20 మంది ప్రేక్షకులకు స్వల్ప గాయాలయ్యాయి. ముగ్గురికి కాళ్లు విరిగాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. తెలుగు కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీలకు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు హాజరయ్యారు. -
అట్టహాసంగా ఆరంభమైన ఆసియా గేమ్స్
-
వైభవంగా ప్రారంభమైన వింటర్ ఒలింపిక్స్