Pakistan vs West Indies
-
WI vs Aus: పదేళ్ల తర్వాత తొలిసారిగా.. షెడ్యూల్ విడుదల
ఎట్టకేలకు విండీస్ వేదికగా ఆస్ట్రేలియా- వెస్టిండీస్(West Indies Vs Australia) మధ్య ఫ్రాంక్ వొరెల్ ట్రోఫీ(Frank Worrell Trophy) నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఇరుజట్లు కరేబియన్ గడ్డ మీద ఈ ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్లో పోటీపడనున్నాయి. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు గురువారం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు త్వరలోనే తమ దేశంలో పర్యటించనుందని తెలిపింది.డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్లో తొలి సిరీస్మరోవైపు.. ఈ విషయం గురించి క్రికెట్ ఆస్ట్రేలియా అధికారి బెన్ ఓలివర్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా- వెస్టిండీస్ క్రికెట్ బోర్డులకు ఘనమైన చరిత్ర ఉందని పేర్కొన్నారు. పదేళ్ల తర్వాత ఇరుజట్లు టెస్టు సిరీస్ ఆడటం శుభసూచకమని.. ఈ సిరీస్ను మూడు మ్యాచ్లకు పెంచినట్లు వెల్లడించారు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2025-2027 ఎడిషన్లో ఇదే తమకు ఇదే తొలి సిరీస్ అని.. ఈసారీ ఫ్రాంక్ వొరిల్ ట్రోఫీని తామే సొంతం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.అదే విధంగా ఈ పర్యటనలో భాగంగా వెస్టిండీస్తో ఐదు టీ20లు కూడా ఆడనున్నట్లు ఓలివర్ తెలిపారు. ఏడాది తర్వాత జరునున్న టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఇదే ఆరంభ సన్నాహకం కానుందని హర్షం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. ఆసీస్ ప్రస్తుతంశ్రీలంక పర్యటనలో ఉంది. అనంతరం చాంపియన్స్ ట్రోఫీతో బిజీ కానుంది. ఇక ఆసీస్ ఇప్పటికే డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ చేరిన విషయం తెలిసిందే.వెస్టిండీస్- ఆస్ట్రేలియా మధ్య సిరీస్లకు షెడ్యూల్మూడు టెస్టులుతొలి టెస్టు: జూన్ 25- 20- బ్రిడ్జ్టౌన్, బార్బడోస్రెండో టెస్టు: జూలై 3-7- సెయింట్ జార్స్, గ్రెనెడామూడో టెస్టు: జూలై 12- 16- కింగ్స్టన్, జమైకాటీ20 సిరీస్తొలి టీ20- జూలై 20- కింగ్స్టన్, జమైకారెండో టీ20- జూలై 22- కింగ్స్టన్, జమైకామూడో టీ20- జూలై 25- బసెటెరె, సెయింట్ కిట్స్నాలుగో టీ20- జూలై 26- బసెటెరె, సెయింట్ కిట్స్ఐదో టీ20- జూలై 28- బసెటెరె, సెయింట్ కిట్స్అతడి జ్ఞాపకార్థంవెస్టిండీస్- ఆస్ట్రేలియా మధ్య జరిగే టెస్టు సిరీస్లో విజేతకు ఫ్రాంక్ వొరిల్ అవార్డు ప్రదానం చేస్తారు. వెస్టిండీస్ జట్టు తొలి నల్లజాతి కెప్టెన్గా పేరొందిన వొరిల్ జ్ఞాపకార్థం ఈ ట్రోఫీని ప్రవేశపెట్టారు. 1960-61లో తొలిసారి ఆస్ట్రేలియాలో ఈ ట్రోఫీని ప్రదానం చేశారు.ఇక 1995 నుంచి ఇప్పటి దాకా ఆస్ట్రేలియా ఈ సిరీస్లో ఒక్కసారి కూడా ఓడిపోలేదు. అయితే, గతేడాది జరిగిన టెస్టు సిరీస్లో వెస్టిండీస్ ఆసీస్ ఆధిపత్యాన్ని తగ్గించింది. గబ్బాలో అనూహ్య విజయంతో సిరీస్ను 1-1తో డ్రా చేసి.. దాదాపు పదిహేడేళ్ల తర్వాత తొలిసారి ఆసీస్పై టెస్టు విజయం నమోదు చేసింది.ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో సిరీస్లు ముగిసిన తర్వాత వెస్టిండీస్ పాకిస్తాన్కు ఆతిథ్యం ఇవ్వనుంది. రిజ్వాన్ బృందంతో సొంతగడ్డపై మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లు ఆడనుంది. జూలై 31 నుంచి టీ20లు, ఆగష్టు 8 నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది. -
విండీస్ సిన్నర్ల మాయాజాలం.. 154 పరుగులకే పాక్ ఆలౌట్
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ స్పిన్నర్లు చెలరేగారు. విండీస్ స్పిన్నర్ల దాటికి పాకిస్తాన్ తమ తొలి ఇన్నింగ్స్లో 154 పరుగులకే కుప్పకూలింది. జోమెల్ వారికన్ 4 వికెట్లతో సత్తాచాటగా.. మరో స్పిన్నర్ గుడ్కేష్ మోటీ మూడు వికెట్లతో మెరిశాడు. వీరిద్దరితో పాటు ఫాస్ట్ బౌలర్ కీమర్ రోచ్ రెండు వికెట్లు సాధించాడు. పాకిస్తాన్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్(75 బంతుల్లో 8 ఫోర్లతో 49) టాప్ స్కోరర్గా నిలవగా.. సౌధ్ షకీల్(32) పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. పాక్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం మరోసారి నిరాశపరిచాడు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన బాబర్ ఆజం.. మోటీ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. అంతకుముందు విండీస్ కూడా బ్యాటింగ్లో విఫలమైంది. కరేబియన్లు తమ తొలి ఇన్నింగ్స్లో కేవలం 163 పరుగులకే ఆలౌటైంది. పాక్ స్పిన్నర్ నోమాన్ అలీ 6 వికెట్లు పడగొట్టి విండీస్ను దెబ్బతీశాడు. అతడితో పాటు సాజిద్ ఖాన్ రెండు, కాషిఫ్ అలీ, ఆర్బర్ ఆహ్మద్ తలా వికెట్ సాధించాడు. విండీస్ బ్యాటర్లలో టెయిలాండర్ మోటీ(55) టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడితో పాటు వారికన్(36), రోచ్(25) రాణించారు. కాగా విండీస్కు తొలి ఇన్నింగ్స్లో 9 పరుగుల ఆధిక్యం లభించింది. కాగా తొలి రోజు ఆటలో ఇరు జట్ల స్పిన్నర్లు ఏకంగా 16 వికెట్లు పడగొట్టడం గమనార్హం.తుది జట్లుపాకిస్తాన్: షాన్ మసూద్ (కెప్టెన్), ముహమ్మద్ హుర్రైరా, బాబర్ ఆజం, కమ్రాన్ గులాం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సల్మాన్ అఘా, సాజిద్ ఖాన్, నోమన్ అలీ, కాషిఫ్ అలీ, అబ్రార్ అహ్మద్వెస్టిండీస్: క్రైగ్ బ్రాత్వైట్ (కెప్టెన్), మికిల్ లూయిస్, అమీర్ జాంగూ, కవెమ్ హాడ్జ్, అలిక్ అథానాజ్, జస్టిన్ గ్రీవ్స్, టెవిన్ ఇమ్లాచ్ (వికెట్ కీపర్), కెవిన్ సింక్లైర్, గుడాకేష్ మోటీ, కెమర్ రోచ్, జోమెల్ వారికన్చదవండి: BCCI: టీమిండియాకు భారీ షాక్.. ఇంగ్లండ్ సిరీస్ నుంచి ఇద్దరు స్టార్లు ఔట్ -
PAK Vs WI: చరిత్ర సృష్టించిన నొమన్ అలీ
వెస్టిండీస్తో రెండో టెస్టులో పాకిస్తాన్(Pakistan Vs West Indies) శుభారంభం చేసింది. వరుస విరామాల్లో వికెట్లు కూల్చి పర్యాటక జట్టును కోలుకోలేని దెబ్బ కొట్టింది. పాకిస్తాన్ బౌలర్ల దెబ్బకు విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు వెస్టిండీస్ క్రికెట్ జట్టు పాకిస్తాన్ పర్యటనకు వచ్చింది.ఈ క్రమంలో ఇరుజట్ల ముల్తాన్లో జనవరి 17- 21 వరకు జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య పాక్ ఘన విజయం సాధించింది. విండీస్ను ఏకంగా 127 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఇక అదే వేదికపై శనివారం రెండో టెస్టు మొదలైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.విండీస్ బ్యాటర్లకు చుక్కలుఅయితే, పాకిస్తాన్ స్పిన్నర్లు ఆది నుంచే విండీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఓపెనర్ మికైల్ లూయిస్(4)ను కశిఫ్ అలీ(Kashif Ali) పెవిలియన్కు పంపగా.. సాజిద్ ఖాన్(Sajid Khan) వన్డౌన్ బ్యాటర్ ఆమిర్ జాంగూ(0)ను రెండో వికెట్గా వెనక్కి పంపాడు.నొమన్ అలీ సరికొత్త చరిత్రఈ క్రమంలో పదో ఓవర్లో తన వికెట్ల వేట మొదలుపెట్టిన నొమన్ అలీ(Noman Ali) తొలుత కెప్టెన్ క్రెగ్ బ్రాత్వైట్(9)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అనంతరం సాజిద్ ఖాన్ అథనాజ్(0) ను అవుట్ చేయగా.. నొమన్ అలీ మరోసారి యాక్షన్లోకి దిగాడు.విండీస్ ఇన్నింగ్స్లో పన్నెండో ఓవర్ మొదటి బంతి నుంచే చెలరేగిన ఈ వెటరన్ స్పిన్నర్ వరుస బంతుల్లో జస్టిన్ గ్రీవ్స్(1), టెవిన్ ఇమ్లాచ్(0), కెవిన్ సిన్క్లెయిర్(0)లను అవుట్ చేశాడు. ఇలా హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగిన 38 ఏళ్ల నొమన్ అలీ.. సరికొత్త చరిత్ర సృష్టించాడు.పాకిస్తాన్ తరఫున టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన తొలి స్పిన్నర్గా నొమన్ అలీ రికార్డులకెక్కాడు. ఓవరాల్గా ఈ ఘనత సాధించిన ఐదో పాక్ బౌలర్గా నిలిచాడు. అతడి కంటే ముందు వసీం అక్రం, అబ్దుల్ రజాక్, మొహ్మద్ సమీ, నసీం షా ఈ ఫీట్ నమోదు చేశారు.పాకిస్తాన్ తరఫున టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన బౌలర్లువసీం అక్రం- 1999లో శ్రీలంకపై లాహోర్ వేదికగావసీం అక్రం- 1999లో శ్రీలంకపై ఢాకా వేదికగాఅబ్దుల్ రజాక్- 2000లో శ్రీలంకపై గాలే వేదికగానసీం షా- 2020లో బంగ్లాదేశ్పై రావల్పిండి వేదికగానొమన్ అలీ- 2025లో వెస్టిండీస్ ముల్తాన్ వేదికగా..163 పరుగులకు ఆలౌట్ఇక పాక్ బౌలర్ల ధాటికి వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 163 పరుగులకే ఆలౌట్ అయింది. టెయిలెండర్ గుడకేశ్ మోటీ(55) అర్ధ శతకంతో చెలరేగగా.. కేమార్ రోచ్(25), జామెల్ వారికన్(36 నాటౌట్) రాణించారు. టాప్, మిడిలార్డర్లో కలిపి కేవెం హాడ్జ్(21) ఒక్కడే డబుల్ డిజిట్ స్కోరు సాధించాడు. -
విండీస్తో టెస్టులకు పాక్ జట్టు ప్రకటన.. అన్క్యాప్డ్ ప్లేయర్కు చోటు
వెస్టిండీస్తో టెస్టు సిరీస్కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తమ జట్టును ప్రకటించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన టీమ్ వివరాలను శనివారం వెల్లడించింది. ఇటీవల సౌతాఫ్రికాలో పర్యటించిన టెస్టు జట్టులో ఏకంగా ఏడు మార్పులు చేసి.. ట్విస్ట్ ఇచ్చింది. ఇమామ్-ఉల్- హక్(Imam-ul-Haq) రీఎంట్రీతో పాటు మరెన్నో ఆశ్చర్యకర నిర్ణయాలు తీసుకుంది.అబ్దుల్లా షఫీక్పై వేటు వేసిన సెలక్టర్లు.. ఇమామ్కు పిలుపునిచ్చారు. కాగా ఇమామ్ ఇటీవల దేశవాళీ క్రికెట్లో అదరగొట్టాడు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ తొమ్మిది ఇన్నింగ్స్లో కలిపి 635 పరుగులు చేశాడు. ఇందులో రెండు భారీ సెంచరీలు(184, 160) ఉన్నాయి. దీంతో సూపర్ ఫామ్లో ఉన్న ఇమామ్ ఉల్ హక్కు సెలక్టర్లు పిలుపునివ్వడం గమనార్హం.విండీస్తో సిరీస్కు పూర్తిగా దూరంఇదిలా ఉంటే.. మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్(Abrar Ahmed) కూడా తిరిగి రాగా.. షాహిన్ ఆఫ్రి(Shaheen Afridi)ది మాత్రం ఈ జట్టులో లేడు. పని భారాన్ని తగ్గించే క్రమంలో మేనేజ్మెంట్ అతడికి విశ్రాంతినిచ్చినట్లు తెలుస్తోంది.అదే విధంగా.. నసీం షా, ఆమిర్ జమాల్, మీర్ హంజాలను కూడా సెలక్టర్లు రెస్ట్ పేరిట పక్కనపెట్టినట్లు సమాచారం. ఇక ఫామ్లో ఉన్న సయీమ్ ఆయుబ్ సౌతాఫ్రికాతో రెండో టెస్టు సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే. దీంతో అతడు విండీస్తో సిరీస్కు పూర్తిగా దూరమయ్యాడు.అన్క్యాప్డ్ ప్లేయర్కు చోటుఈ నేపథ్యంలో ఖుర్రం షాజాద్తో పాటు మహ్మద్ అలీ, అన్క్యాప్డ్ ప్లేయర్ కశిఫ్ అలీ పేస్దళ విభాగంలో చోటు దక్కించుకున్నారు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25లో తమ చివరి సిరీస్లో పాకిస్తాన్ సొంతగడ్డపై వెస్టిండీస్తో తలపడుతోంది. ముల్తాన్ వేదికగా జనవరి 17-21 మధ్య తొలి టెస్టు, జనవరి 25-29 మధ్య రెండో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.అనంతరం న్యూజిలాండ్, సౌతాఫ్రికాతో స్వదేశంలో పాకిస్తాన్ త్రైపాక్షిక వన్డే సిరీస్ ఆడనుంది. అనంతరం ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలోనే.. ప్రధాన పేసర్లు షాహిన్ ఆఫ్రిది, నసీం షాలకు టెస్టు జట్టు నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది.సౌతాఫ్రికాలో పరాభవంఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్లో పాకిస్తాన్కు ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. సెంచూరియన్, కేప్టౌన్ టెస్టుల్లో ఓడి 2-0తో క్వీన్స్వీప్నకు గురైంది. అంతకు ముందు టీ20 సిరీస్ను ప్రొటిస్ జట్టుకు చేజార్చుకున్న పాక్.. వన్డే సిరీస్ను మాత్రం 3-0తో వైట్వాష్ చేసింది. తద్వారా సౌతాఫ్రికా జట్టును తమ సొంతగడ్డపై వన్డేల్లో ఈ మేర క్లీన్స్వీప్ చేసిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది.వెస్టిండీస్తో టెస్టు సిరీస్కు పాకిస్తాన్ జట్టుషాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఇమామ్-ఉల్-హక్, కమ్రాన్ గులామ్, కాశిఫ్ అలీ, ఖుర్రం షాజాద్, మహ్మద్ అలీ, మహ్మద్ హురైరా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్ బ్యాటర్), నొమన్ అలీ, రోహైల్ నజీర్ (వికెట్ కీపర్ బ్యాటర్), సాజిద్ ఖాన్, సల్మాన్ అలీ అఘా.చదవండి: సిక్సర్లు బాదడంలో యువీ తర్వాత అతడే! -
18 ఏళ్ల తర్వాత... పాక్లో టెస్టు సిరీస్ ఆడనున్న వెస్టిండీస్
వెస్టిండీస్ క్రికెట్ జట్టు 18 ఏళ్ల తర్వాత పాకిస్తాన్లో పర్యటిస్తోంది. చివరిసారిగా 2006లో పాకిస్తాన్లో టెస్టు మ్యాచ్ ఆడిన వెస్టిండీస్... మళ్లీ ఇన్నేళ్ల తర్వాత టెస్టు సిరీస్ ఆడేందుకు సోమవారం ఇస్లామాబాద్లో అడుగు పెట్టింది. ఈ మధ్య కాలంలో కరీబియన్ జట్టు పాకిస్తాన్ గడ్డపై రెండుసార్లు పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడింది. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఈ నెల 16 నుంచి కరాచీ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. 24 నుంచి జరగనున్న రెండో టెస్టుకు ముల్తాన్ ఆతిథ్యమిస్తుంది. అంతకుముందు 10 నుంచి విండీస్ జట్టు పాకిస్తాన్ షాహీన్స్తో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023–25లో ఇరు జట్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. విండీస్ జట్టుకు క్రెయిగ్ బ్రాత్వైట్ సారథ్యం వహిస్తుండగా... అమీర్ జాంగో తొలిసారి టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. పాకిస్తాన్ ఇంకా తమ జట్టును ప్రకటించాల్సి ఉంది.పాక్ ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. ప్రోటీస్తో జరిగిన రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో 2-0తో పాక్ వైట్వాష్కు గురైంది. ఒకట్రెండు రోజుల్లో పాక్ జట్టు స్వదేశంలో అడుగుపెట్టనుంది. అయితే ఈ సిరీస్కు పాక్ యువ ఓపెనర్ సైమ్ అయూబ్ దూరమయ్యే అవకాశముంది.దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో అయూబ్ కూడి కాలి పాదానికి గాయమైంది. దీంతో అతడు మ్యాచ్ మధ్యలోనే వైదొలిగాడు. అతడు శస్త్ర చికిత్స కోసం లండన్కు వెళ్లనున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ సమయానికి ఫిట్నెస్ సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే విండీస్తో రెడ్ బాల్ సిరీస్కు అతడు దూరం కానున్నాడు.వెస్టిండీస్ జట్టు: క్రెయిగ్ బ్రాత్వైట్ (కెప్టెన్), అలిక్ అథనాజ్, కీసీ కార్టీ, జోషువా డిసిల్వా, జస్టిన్ గ్రేవ్స్, కవెమ్ హాడ్జ్, టెవిన్ ఇమ్లాచ్, అమీర్ జంగూ, మికిల్ లూయిస్, గుడకేశ్ మోతీ, అండర్సన్ ఫిలిప్, కీమర్ రోచ్, జేడెన్ సీల్స్, కెవిన్ సింక్లెయిర్, వారికన్.చదవండి: ఆసీస్ గడ్డపై ఎంతో నేర్చుకున్నాను.. మళ్లీ బలంగా పైకి లేస్తాం: జైస్వాల్ -
వెస్టిండీస్ జట్టు ప్రకటన.. ఫాస్టెస్ట్ సెంచరీ వీరుడికి చోటు
వెస్టిండీస్ క్రికెట్ జట్టు 18 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్(Pakistan) పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా విండీస్ ఆతిథ్య పాకిస్తాన్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడనుంది. వచ్చే ఏడాది జనవరి 17 నుంచి ముల్తాన్ వేదికగా ఈ రెండు మ్యాచ్ల సిరీస్ ఆరంభం కానుంది.ఈ క్రమంలో ఈ సిరీస్కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును వెస్టిండీస్ క్రికెట్ ప్రకటించింది. వికెట్ కీపర్ బ్యాటర్ అమీర్ జంగూ(Amir Jangoo)కు తొలిసారి విండీస్ టెస్టు జట్టులో చోటు దక్కింది. జంగూ ఇటీవలే బంగ్లాదేశ్తో జరిగిన రెండో వన్డేతో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. తన అరంగేట్రంలోనే అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. తద్వారా వన్డే అరంగేట్రంలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్గా జంగూ వరల్డ్ రికార్డు సృష్టించాడు.అంతేకాకుండా దేశీవాళీ రెడ్ బాల్ టోర్నీల్లో సైతం అతడు మెరుగ్గా రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడికి సెలక్టర్లు పిలుపునిచ్చారు. మరోవైపు గాయం కారణంగా బంగ్లాతో టెస్టు సిరీస్కు దూరమైన స్పిన్నర్ గుడాకేష్ మోతీ తిరిగి ఈ సిరీస్తో పునరాగమనం చేయనున్నాడు.అదేవిధంగా విండీస్ స్పీడ్ స్టార్ షమర్ జోసెఫ్ గాయం కారణంగా దూరమయ్యాడు. మరో స్టార్ పేసర్ అల్జారీ జోసెఫ్ ఇతర ఒప్పందాల కారణంగా ఈ సిరీస్కు అందుబాటులో లేడు. జోసెఫ్ సౌతాఫ్రికా టీ20 లీగ్-2025లో ఆడనున్నాడు.వెస్టిండీస్ టెస్టు జట్టు: క్రైగ్ బ్రాత్వైట్ (కెప్టెన్), జాషువా డా సిల్వా, అలిక్ అథానాజ్, కీసీ కార్తీ, జస్టిన్ గ్రీవ్స్, కావెం హాడ్జ్, టెవిన్ ఇమ్లాచ్, అమీర్ జాంగూ, మైకిల్ లూయిస్, గుడాకేష్ మోటీ, అండర్సన్ ఫిలిప్, కెమర్ రోచ్, జేడెన్ సీల్స్, జోమెల్ వారికన్చదవండి: రుతురాజ్ గైక్వాడ్ ఊచకోత.. 16 ఫోర్లు, 11 సిక్సర్లతో విధ్వంసకర శతకం -
పురుషులే అనుకున్నాం.. మహిళా క్రికెటర్లది అదే తీరు!
పాకిస్తాన్ క్రికెట్ నిలకడలేమికి మారుపేరు. ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరికి తెలియదు. గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోవడం.. ఓడిపోవాల్సిన మ్యాచ్ల్లో అద్భుత విజయాలు సాధించడం వారికి అలవాటే. అయితే ఇలాంటివి పురుషుల క్రికెట్లో బాగా చూస్తుంటాం. తాజాగా పాకిస్తాన్ మహిళల జట్టు కూడా గెలవాల్సిన మ్యాచ్ను చేజేతులా ఓడిపోయింది. అది కూడా మహిళల టి20 వరల్డ్కప్లో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ను ఓడిపోయి సెమీస్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. గ్రూప్-బిలో భాగంగా ఆదివారం పాకిస్తాన్, వెస్టిండీస్ వుమెన్స్ మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ వుమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. రష్దా విలియమ్స్ 30 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది. మిగతావారిలో క్యాంప్బెల్లె 23 పరుగులు, హేలీ మాథ్యూస్ 20 పరుగులు చేసింది. అనంతరం 117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 113 పరుగులకే పరిమితమై మూడు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పాక్ బ్యాటర్లలో అలియా రియాజ్ 29 పరుగులు, నిదా దార్ 27 పరుగులు, బిస్మా మరుఫ్ 26 పరుగులు చేశారు. విండీస్ వుమెన్స్ బౌలర్లలో మాథ్యూ 2 వికెట్లు తీయగా.. అరీ ఫ్లెచర్, కరీష్మా, షమీలా కనెల్లు తలా ఒక వికెట్ తీశారు. పాక్ చివరి మూడు ఓవర్లలో 30 పరుగులు చేయాల్సిన దశలో విండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ అద్బుతంగా బౌలింగ్ చేసింది. ఆ ఓవర్లో ఒక వికెట్తో పాటు ఐదు పరుగులు మాత్రమే ఇచ్చుకుంది. ఆ తర్వాతి ఓవర్ చినెల్లే కూడా సూపర్గా వేసింది. తొలి రెండు బంతులు వైడ్ వేసినప్పటికి ఆ తర్వాత ఐదు పరుగులు ఇవ్వడంతో చివరి ఓవర్లో 18 పరుగులు అవసరం అయ్యాయి. ఈ దశలో పాకిస్తాన్ బ్యాటర్లు వరుసగా మూడు ఫోర్లు కొట్టడంతో సమీకరణం 2 బంతుల్లో ఐదు పరుగులుగా మారింది. అయితే ఐదో బంతికి అలియా రియాజ్ ఔట్ కావడంతో మ్యాచ్ విండీస్ వైపు తిరిగింది. చివరి బంతికి నాలుగు పరుగులు కావాల్సి ఉండగా ఒక్క పరుగు మాత్రమే రావడంతో విండీస్ మూడు పరుగుల తేడాతో సంచలన విజయం అందుకుంది. చదవండి: 'గెలిచాం.. కానీ చాలా పాఠాలు నేర్చుకున్నాం' -
వెస్టిండీస్ కెప్టెన్ అరుదైన రికార్డు.. దిగ్గజాల సరసన
వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ వన్డేల్లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. బ్యాటింగ్ ప్రధానంగా ఉండే కెప్టెన్.. ఒక వన్డేల్లో బౌలింగ్లో మెరుగైన ప్రదర్శన చేయడం చాలా తక్కువగా చూస్తుంటాం. ఒక కెప్టెన్ బౌలింగ్లో ఐదు వికెట్ల ఫీట్ నమోదు చేయడం కూడా అరుదుగానే కనిపిస్తోంది. రెగ్యులర్ బౌలర్ కెప్టెన్గా ఐదు వికెట్లు తీయడం కొత్త కాకపోవచ్చు.. కానీ ఒక బ్యాటర్ తొలిసారి బౌలింగ్లో మూడు అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడం అరుదు. తాజాగా పాకిస్తాన్తో జరిగిన మూడో వన్డేలో నికోలస్ పూరన్ అదే ఫీట్ నమోదు చేశాడు. బౌలింగ్లో సూపర్ ప్రదర్శన చేసి దిగ్గజ ఆటగాళ్ల సరసన నిలిచాడు. ఇంతకముందు వన్డే కెప్టెన్గా ఉంటూ బౌలింగ్లో మూడు అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఆటగాళ్లు నలుగురు మాత్రమే. వారిలో సౌరవ్ గంగూలీ, మైక్ గాటింగ్, గ్రహం గూచ్, నవ్రోజ్ మంగల్లు మాత్రమే ఉన్నారు. పూరన్.. పాకిస్తాన్తో మ్యాచ్లో 10 ఓవర్లు బౌలింగ్ చేసి 48 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అయితే డక్వర్త్ లూయిస్ పద్దతిలో పాకిస్తాన్ 53 పరుగుల తేడాతో విజయం సాధించిన సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేయడం విశేషం. ఇక పూరన్ పాక్తో మ్యాచ్కు ముందు వన్డేల్లో కేవలం మూడు బంతులు మాత్రమే వేశాడు. తాజాగా మాత్రం 10 ఓవర్ల కోటా బౌలింగ్ పూర్తి చేసి రెగ్యులర్ బౌలర్ తరహాలో నాలుగు వికెట్లు తీసి అందరిని ఆకట్టుకున్నాడు. ఇక పూరన్ ప్రదర్శనను మెచ్చుకున్న ఐసీసీ.. గతంలో బ్యాటింగ్ కెప్టెన్ బౌలింగ్లో అద్బుత ప్రదర్శన చేసిన సందర్భాలను మరోసారి గుర్తుచేసుకొంది. వాటిని ఒకసారి పరిశీలిద్దాం. సౌరవ్ గంగూలీ: టీమిండియా తరపున విజయవంతమైన కెప్టెన్లలో సౌరవ్ గంగూలీ ఒకడు. తన కెరీర్లో 311 వన్డేలు ఆడిన గంగూలీ సరిగ్గా వంద వికెట్లు తీయడం విశేషం. ఎక్కువగా పార్ట్టైమ్ బౌలర్గా బౌలింగ్ చేసిన గంగూలీ.. ఒక కెప్టెన్గా 25 వన్డేల్లో 10 ఓవర్ల కోటాను పూర్తి చేశాడు. ఇక 2000లో కాన జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో గంగూలీ 10 ఓవర్లు వేసి 34 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. ఆ తర్వాత బ్యాటింగ్లోనూ 68 బంతుల్లో 78 పరుగులు నాటౌట్గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గ్రహం గూచ్: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ గ్రహం గూచ్ 1989లో ఎంఆర్ఎఫ్ వరల్డ్ సిరీస్లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో తొలిసారి బౌలింగ్లో చెలరేగాడు. 10 ఓవర్ల కోటా బౌలింగ్ పూర్తి చేసిన గ్రహం గూచ్ 19 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. జావెంద్ మియాందాద్, సలీమ్ యూసఫ్, వసీం అక్రమ్ల రూపంలో తన ఖాతాలో వేసుకున్నాడు. గ్రహం గూచ్ దెబ్బకు పాకిసతఆన్ 148 పరుగులు చేసింది. ఆ తర్వాత 44 ఓవర్లలో ఆసీస్ విజయం అందుకుంది. మైక్ గాటింగ్: మైక్ గాటింగ్ తన కెరరీలో 10 వికెట్లు తీయగా.. అందులో మూడు వికెట్లు 1987లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో తీశాడు. 9 ఓవర్లు వేసిన గాటింగ్ 59 పరుగులిచ్చి మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే దురదృష్టవశాత్తూ ఇంగ్లండ్ ఈ మ్యాచ్లో ఓడిపోయింది. నౌరోజ్ మంగల్: అఫ్గన్కు కెప్టెన్గా పనిచేసిన నౌరోజ్ మంగల్ 2009లో నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో సూపర్ బౌలింగ్తో మెరిశాడు. 6 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన మంగల్ 35 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. కాగా నెదర్లాండ్స్ ఓపెనర్లు టెన్ డెస్కటే,ఎరిక్ క్రిన్స్కిల 113 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీసిన మంగల్ ఆ తర్వాత మరో రెండు వికెట్లు తీశాడు. 232 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గానిస్తాన్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించడం విశేషం. -
పాక్ పై ఓటమి మమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచింది: పూరన్
ఆదివారం ముల్తాన్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన అఖరి వన్డేలో 53 పరుగుల తేడాతో వెస్టిండీస్ ఓటమి చెందింది. తద్వారా పాక్ చేతిలో 0-3 తేడాతో విండీస్ వైట్వాష్కు గురైంది. కాగా మ్యాచ్ అనంతరం మాట్లాడిన విండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్.. ఈ సిరీస్లో ఓటమి తమను తీవ్రంగా నిరాశ పరిచింది చెప్పాడు. త్వరలో బంగ్లాదేశ్తో జరగబోయే సిరీస్ కోసం తాను ఎదురు చూస్తున్నానని పూరన్ తెలిపాడు. స్వదేశంలో బంగ్లాదేశ్తో రెండు టెస్టులు, మూడు టీ20లు, మూడు వన్డేల్లో వెస్టిండీస్ తలపడనుంది. జూన్ 16 (గురువారం) నుంచి ఇరు జట్లు మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. “అఖరి రెండు మ్యాచ్లు మాకు నిరాశ కలిగించాయి. తొలి వన్డేలో మేం బాగా రాణించాం. తర్వాతి మ్యాచ్ల్లో మేము పూర్తిగా విఫలమయ్యాం. దీని ఫలితంగా సిరీస్కు కోల్పోయాము. ఈ పరాజయం నుంచి చాలా పాఠాలు నేర్చుకుంటాం. త్వరలో బంగ్లాదేశ్తో ఆడనున్నాం. ఈ సిరీస్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాము" అని పూరన్ పేర్కొన్నాడు. పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ మూడో వన్డే: టాస్: పాకిస్తాన్- తొలుత బ్యాటింగ్ పాక్ స్కోరు: 269/9 (48) వెస్టిండీస్ స్కోరు: 216 (37.2) విజేత: డీఎల్ఎస్ మెథడ్లో 53 పరుగుల తేడాతో పాకిస్తాన్ విజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: షాదాబ్ ఖాన్(78 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 86 పరుగులు) చదవండి: IPL: ఐపీఎల్ ప్రసార హక్కులను దక్కించుకున్న సోనీ, జియో! ఒక్కో మ్యాచ్కు ఎంతంటే! -
Pak Vs WI: వారం రోజుల వ్యవధిలోనే అటు క్లీన్స్వీప్.. ఇటు వైట్వాష్!
Pakistan vs West Indies ODI Series: వెస్టిండీస్తో జరిగిన మూడో వన్డేలోనూ పాకిస్తాన్ పైచేయి సాధించింది. వరుణుడి ఆటంకం కారణంగా 48 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో 53 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా స్వదేశంలో విండీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసి సత్తా చాటింది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడ్డ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం నికోలస్ పూరన్ బృందం పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముల్తాన్ వేదికగా జరిగిన మొదటి రెండు మ్యాచ్లలో పరాజయం పాలైన వెస్టిండీస్.. మూడో వన్డేలోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని భావించింది. కానీ, పాకిస్తాన్ ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్ 86 పరుగులతో పాక్ జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించి.. పర్యాటక జట్టు ఆశలపై నీళ్లు చల్లాడు. ఓపెనర్లు ఫఖార్ జమాన్(35),ఇమామ్ ఉల్-హక్(62)కు తోడు షాబాద్ బ్యాట్ ఝులిపించడంతో 48 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి ఆతిథ్య పాక్ 269 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్కు టాపార్డర్ కుప్పకూలడంతో కష్టాలు తప్పలేదు. ఏడో స్థానంలో బ్యాటింగ్కు దిగిన అకీల్ హుసేన్ ఒక్కడే 60 పరుగులతో మెరుగ్గా రాణించాడు. మిగతా వాళ్లంతా చేతులెత్తేయడంతో 37.2 ఓవర్లలోనే విండీస్ ఆలౌట్ అయి, పాక్ చేతిలో 53 పరుగుల తేడాతో పరాజయం మూటగట్టుకుంది. మూడో వన్డేలో ఓటమితో 0-3 తేడాతో వైట్వాష్కు గురైంది. కాగా ఐసీసీ వరల్డ్కప్ సూపర్ లీగ్లో భాగంగా పాక్ పర్యటన కంటే ముందు నెదర్లాండ్స్లో పర్యటించిన వెస్టిండీస్ జట్టు ఆతిథ్య జట్టును 3-0 తేడాతో క్లీన్స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఆ వెంటనే పాక్ వచ్చి అదే రీతిలో ఆతిథ్య జట్టు చేతిలో పరాభవం చూడటం గమనార్హం. పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ మూడో వన్డే: టాస్: పాకిస్తాన్- తొలుత బ్యాటింగ్ పాక్ స్కోరు: 269/9 (48) వెస్టిండీస్ స్కోరు: 216 (37.2) విజేత: డీఎల్ఎస్ మెథడ్లో 53 పరుగుల తేడాతో పాకిస్తాన్ విజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: షాదాబ్ ఖాన్(78 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 86 పరుగులు) చదవండి: Rishabh Pant: అదే మా పొరపాటు.. అందుకే ఓడిపోయాం.. ఇక మూడింటికి మూడు గెలవాల్సిందే! Dwaine Pretorius: ప్రతీసారి కలిసిరాదు.. ఈ చిన్న లాజిక్ ఎలా మరిచిపోయారు High-quality action, spectacular performances, huge crowds - it's a wrap from Multan 🙌#PAKvWI | #KhelAbhiBaqiHai pic.twitter.com/WxMWLtm2LV — Pakistan Cricket (@TheRealPCB) June 12, 2022 Excellent in his first series since comeback from injury 👏 🗣️ Player of the match @76Shadabkhan reflects on his scintillating display in the third ODI #PAKvWI | #KhelAbhiBaqiHai pic.twitter.com/74q1UMqhft — Pakistan Cricket (@TheRealPCB) June 12, 2022 -
మ్యాచ్కు ఆటంకం కలిగించిన అభిమాని.. క్రికెటర్ చర్య వైరల్
పాకిస్తాన్, వెస్టిండీస్ మధ్య శుక్రవారం జరిగిన రెండో వన్డేలో ఒక సంఘటన ఆసక్తి కలిగించింది. మ్యాచ్ జరుగుతుండగానే ఒక అభిమాని మైదానంలోకి దూసుకొచ్చాడు. ఈ చర్యతో ఆటగాళ్లు సహా అంపైర్లు షాక్కు గురయ్యారు. అయితే సదరు వ్యక్తి ఎవరికి హాని కలిగించకుండా నేరుగా స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న పాక్ బ్యాటర్ షాదాబ్ ఖాన్ వద్దకు వచ్చాడు. మొదట ఆశ్చర్యంగా చూసినప్పటికి.. ఆ తర్వాత తన వద్దకు వచ్చిన అభిమానిని సంతోషంగా హగ్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి సంతోషంగా నవ్వుకుంటూ పెవిలియన్కు వెళ్లిపోయాడు. కాగా షాదాబ్ ఖాన్ తన చర్యతో మిగతా క్రికెట్ ఫ్యాన్స్ మనసులు గెలుచుకున్నాడు. ఇన్నింగ్స్ 39వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. ఇక రెండో వన్డేలో పాకిస్తాన్ 120 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో పాకిస్తాన్ కైవసం చేసుకుంది. పాక్ విజయంలో ఇమామ్-ఉల్-హక్, బాబర్ అజాం,మహ్మద్ నవాజ్ కీలక పాత్ర పోషించారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. 276 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 155 పరుగులకే కుప్పకూలింది. విండీస్ ఇన్నింగ్స్లో షమర్ బ్రూక్స్ 42 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచారు. Shadab Khan fan enter in the ground and hug him. Best moment 😍. Video of the day.#PAKvWI pic.twitter.com/c51kmIXfMl — Gokboru (@gokboru_se) June 10, 2022 చదవండి: Babar Azam: విండీస్తో మ్యాచ్ పాకిస్తాన్ కెప్టెన్ ‘ఇల్లీగల్ ఫీల్డింగ్’.. అందుకు మూల్యంగా.. పాక్ కెప్టెన్పై తిట్ల దండకం.. వీడియో వైరల్ -
Pak Vs WI: పాకిస్తాన్ కెప్టెన్ ‘ఇల్లీగల్ ఫీల్డింగ్’.. అందుకు మూల్యంగా..
Pakistan Vs West Indies: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం చర్య కారణంగా ప్రత్యర్థి జట్టుకు ఐదు పరుగులు లభించాయి. వెస్టిండీస్తో మ్యాచ్లో తన అనుచిత ప్రవర్తనతో ఆన్ ఫీల్డ్ అంపైర్ దృష్టిలో పడ్డాడు బాబర్. దీంతో పాక్ జట్టు ఈ మేరకు మూల్యం చెల్లించాల్సి వచ్చింది. అయితే, ఈ మ్యాచ్లో ఆతిథ్య పాకిస్తాన్ ఏకపక్ష విజయం నమోదు చేయడంతో ఈ విషయం పెద్దగా ప్రభావం చూపలేదు. అసలేం జరిగిందంటే.. రీషెడ్యూల్డ్ వన్డే సిరీస్లో భాగంగా ముల్తాన్ వేదికగా పాక్ జట్టు వెస్టిండీస్తో రెండో మ్యాచ్లో తలపడింది. శుక్రవారం నాటి ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్, కెప్టెన్ బాబర్ ఆజం చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన పర్యాటక విండీస్ కైల్ మేయర్స్(33 పరుగులు), బ్రూక్స్(42 పరుగులు), కెప్టెన్ నికోలస్ పూరన్(25) మినహా ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో ఘోర పరాజయం చవిచూసింది. ఏకంగా 120 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. అయితే, వెస్టిండీస్ ఇన్నింగ్స్ సమయంలో 29వ ఓవర్లో బాబర్ వికెట్ కీపింగ్ గ్లోవ్ తొడుక్కుని ఫీల్డింగ్ చేశాడు. కాగా క్రికెట్ చట్టాల్లోని 28.1(ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్) నిబంధన ప్రకారం.. ఫీల్డింగ్ సమయంలో వికెట్ కీపర్ తప్ప మరే ఇతర ఫీల్డర్ గ్లోవ్స్ తొడుక్కోవడానికి వీల్లేదు. లెగ్ గార్డ్స్ విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఒకవేళ ఫీల్డర్ వేళ్లకు గాయమైతే అంపైర్ అనుమతి తీసుకున్న తర్వాతే గ్లోవ్స్ ధరించవచ్చు. ఈ నేపథ్యంలో తన పర్మిషన్ లేకుండా గ్లోవ్తో ఫీల్డింగ్ చేసిన బాబర్కు ఆన్ ఫీల్డ్ అంపైర్ శిక్ష విధించాడు. వెస్టిండీస్కు ఐదు పరుగులు యాడ్ చేశాడు. ఈ విషయంపై స్పందించిన నెటిజన్లు.. ‘‘రికార్డులు సాధిస్తే సరిపోదు.. కాస్త క్రమశిక్షణ కూడా ఉండాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే ఇలాగే ఉంటుంది’’ అని ట్రోల్ చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్లో 77 పరుగులు చేసిన బాబర్.. మూడు ఫార్మాట్లలో వరుసగా తొమ్మిది ఫిప్టీ ప్లస్ స్కోర్లను నమోదు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో విజయంతో పాక్ 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. నామమాత్రపు మూడో వన్డే జూన్ 12న జరుగనుంది. పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ రెండో వన్డే స్కోర్లు పాకిస్తాన్: 275/8 వెస్టిండీస్: 155/10 ఫలితం: 120 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం End of another fantastic innings from @babarazam258 👏 He has scores of 77, 103, 105*, 114, 57 and 158 in his last six ODI innings 💪#PAKvWI | #KhelAbhiBaqiHai pic.twitter.com/tOAc1aRm0m — Pakistan Cricket (@TheRealPCB) June 10, 2022 The perfect finish 😍@Wasim_Jnr picks up three wickets on his comeback 🌟 #PAKvWI | #KhelAbhiBaqiHai pic.twitter.com/8oL8ekoxUp — Pakistan Cricket (@TheRealPCB) June 10, 2022 A rare thing happened tonight. West Indies were awarded 5 penalty runs due to illegal fielding by Pakistan. Laws of cricket: 28.1 - No fielder other than the wicket-keeper shall be permitted to wear gloves or external leg guards. #PakvWI pic.twitter.com/WPWf1QeZcP — Mazher Arshad (@MazherArshad) June 10, 2022 -
చరిత్ర సృష్టించిన బాబర్ ఆజాం.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా..!
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం తన అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ముల్తాన్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో 77 పరుగులు సాధించిన బాబర్.. పాక్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్లో బాబర్ ఆజాం అరుదైన ఘనత సాధించాడు. మూడు ఫార్మాట్లలో వరుసగా తొమ్మిది ఫిప్టీ ప్లస్ స్కోర్లను నమోదు చేసిన తొలి ఆటగాడిగా బాబర్ నిలిచాడు. ఇక ఈ మ్యాచ్లో పాకిస్తాన్ 120 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో పాకిస్తాన్ కైవసం చేసుకుంది. స్కోర్లు పాకిస్తాన్: 275/8 వెస్టిండీస్: 155/10 ఫలితం: 120 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం మూడు ఫార్మాట్లలో గత తొమ్మిది ఇన్నింగ్స్లలో బాబర్ సాధించిన స్కోర్లు ►196 వర్సెస్ ఆస్ట్రేలియా (2వ టెస్టు - మార్చి 12) ►67, 55 వర్సెస్ ఆస్ట్రేలియా (3వ టెస్టు - మార్చి 21) ►57 వర్సెస్ ఆస్ట్రేలియా (తొలి వన్డే - మార్చి 29) ►114 వర్సెస్ ఆస్ట్రేలియా (రెండో వన్డే - మార్చి 31) ►105( నాటౌట్) వర్సెస్ ఆస్ట్రేలియా(మూడో వన్డే-ఏప్రిల్ 2) ►66 వర్సెస్ ఆస్ట్రేలియా(ఏకైక టీ20-ఏప్రిల్ 5 ) ►103 వర్సెస్ వెస్టిండీస్ (తొలి వన్డే - జూన్ 8) ►77 vs వెస్టిండీస్ (రెండో వన్డే - జూన్ 10) చదవండి: PAK vs WI: వెస్టిండీస్పై పాకిస్తాన్ ఘన విజయం.. సిరీస్ కైవసం.. -
వెస్టిండీస్పై పాకిస్తాన్ ఘన విజయం.. సిరీస్ కైవసం..
ఐసీసీ వరల్డ్కప్ సూపర్ లీగ్లో భాగంగా ముల్తాన్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్ 120 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో పాకిస్తాన్ కైవసం చేసుకుంది. పాక్ విజయంలో ఇమామ్-ఉల్-హక్, బాబర్ అజాం,మహ్మద్ నవాజ్ కీలక పాత్ర పోషించారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో ఇమామ్-ఉల్-హక్(72),బాబర్ అజాం(77) పరుగులతో రాణించారు. విండీస్ బౌలర్లలో అకేల్ హోసేన్ మూడు, ఫిలిప్, జోషఫ్ చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక 276 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 155 పరుగులకే కుప్పకూలింది. విండీస్ ఇన్నింగ్స్లో షమర్ బ్రూక్స్ 42 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచారు. పాక్ బౌలర్లలో మహ్మద్ నవాజ్ నాలుగు వికెట్లు పడగొట్టి విండీస్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు మహ్మద్ వసీం మూడు, షదాబ్ ఖాన్ రెండు, షాహిన్ ఆఫ్రిది ఒక్క వికెట్ సాధించారు. ఇక ఈ సిరీస్లో అఖరి వన్డే ఆదివారం జరగనుంది. చదవండి: T20 WC 2022: 'అతడు టీ20 ప్రపంచకప్లో టీమిండియాకు బెస్ట్ ఫినిషర్ అవుతాడు' One jaffa after another! 🌟 Superstar @mnawaz94 registers his career-best figures of 𝟭𝟬-𝟬-𝟭𝟵-𝟰 🙌#PAKvWI | #KhelAbhiBaqiHai pic.twitter.com/jf8Eg05fwO — Pakistan Cricket (@TheRealPCB) June 10, 2022 -
వన్డే క్రికెట్ చరిత్రలో పాక్ బ్యాటర్స్ అరుదైన ఫీట్
వన్డే క్రికెట్ చరిత్రలో పాక్ బ్యాట్స్మెన్ బాబర్ ఆజం, ఇమాముల్ హక్లు అరుదైన ఫీట్ సాధించారు. తమ కెరీర్లోనే ఈ ఇద్దరు భీకరమైన ఫామ్లో ఉన్నారు. కొడితే హాఫ్ సెంచరీ లేదంటే సెంచరీ అనేంతలా వీరిద్దరి ఇన్నింగ్స్లు ఉంటున్నాయి. తాజాగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో వన్డేలో బాబర్ అజం, ఇమాముల్ హక్లు హాఫ్ సెంచరీలతో మెరిశారు. కాగా ఈ ఇద్దరికి వరుసగా ఆరో అర్థశతకం కావడం విశేషం. వన్డే క్రికెట్ చరిత్రలో ఇలా ఒకేసారి ఇద్దరు పాక్ బ్యాట్స్మన్లు వరుసగా సమాన అర్థశతకాలు నమోదు చేయడం ఇదే మొదటిసారి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. బాబర్ ఆజం 77, ఇమాముల్ హక్ 72 పరుగులు చేసి ఔటయ్యారు. చదవండి: PAK vs WI 2nd ODI: పాక్ కెప్టెన్పై తిట్ల దండకం.. వీడియో వైరల్ -
పాక్ కెప్టెన్పై తిట్ల దండకం.. వీడియో వైరల్
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంపై తోటి బ్యాటర్ తిట్ల దండకం అందుకున్నాడు. అనవసరంగా రనౌట్ చేశాడన్న కారణంతో పాక్ కెప్టెన్పై ఆగ్రహం వ్యక్తం చేయడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విషయంలోకి వెళితే.. వెస్టిండీస్తో జరుగుతున్న రెండో వన్డేలో పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. 17 పరుగులు చేసి ఫఖర్ జమాన్ ఔటైన తర్వాత బాబర్ ఆజం క్రీజులోకి వచ్చాడు. మరో ఓపెనర్ ఇమాముల్ హక్తో కలిసి పాక్ ఇన్నింగ్స్ను నడిపించాడు. ఇద్దరి మధ్య రెండో వికెట్కు 120 పరుగులు కీలక భాగస్వామ్యం కూడా ఏర్పడింది. తమ బ్యాటింగ్తో ప్రమాదకరంగా మారుతున్న సమయంలో బాబర్ ఆజం చేసిన చిన్న తప్పు వికెట్ పడేలా చేసింది. ఇన్నింగ్స్ 28వ ఓవర్లో అకీల్ హొసేన్ బౌలింగ్కు వచ్చాడు. ఇమాముల్ హక్ మిడ్వికెట్ దిశగా ఆడి సింగిల్కు ప్రయత్నించాడు. అయితే బంతి ఎక్కువ దూరం వెళ్లకపోవడంతో బాబర్ పరుగు తీయలేదు. అయితే అప్పటికే ఇమాముల్ హక్ సగం క్రీజు దాటి నాన్స్ట్రైకర్ ఎండ్కు వచ్చేశాడు. బాబర్ పిలుపుతో వెనక్కి వెళ్లినప్పటికి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బంతిని అందుకున్న షెయ్ హోప్ వికెట్లను గిరాటేయడంతో ఇమాముల్ హక్ 72 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. అంతే ఇమాముల్ హక్లో కోపం కట్టలు తెచ్చుకుంది. పెవిలియన్కు వెళ్తూ బ్యాట్ను కింద కొట్టుకుంటూనే తిట్ల దండకం అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ తర్వాత బాబర్ ఆజం 77 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓవరాల్గా పాకిస్తాన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. కాగా బాబర్ ఆజం, ఇమాముల్ హక్లకు ఇది వరుసగా ఆరో అర్థసెంచరీలు కావడం విశేషం. చదవండి: దీనస్థితిలో ఉత్తరాఖండ్ రంజీ ఆటగాళ్లు .. రోజూవారి వేతనం తెలిస్తే షాకవుతారు 'కిల్లర్' మిల్లర్ అనగానే ఆ ఎపిక్ ఎంట్రీ గుర్తుకురావడం ఖాయం View this post on Instagram A post shared by Pakistan Cricket (@therealpcb) -
కోహ్లి రికార్డు బద్దలు.. వన్డేల్లో బాబర్ ఆజాం అరుదైన ఫీట్..!
వన్డే క్రికెట్లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం అరుదైన ఘనత సాధించాడు. కెప్టెన్గా అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా బాబర్ రికార్డులకెక్కాడు. ముల్తాన్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డేలో 103 పరుగులు చేసిన బాబర్.. ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుమందు ఈ ఘనత టీమిండియా స్టార్ ఆటగాడు,మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి పేరిట ఉండేది. కోహ్లి ఈ రికార్డును 17 ఇన్నింగ్స్లలో సాధించగా.. బాబర్ కేవలం 13 ఇన్నింగ్స్లోనే తన పేరిట లిఖించుకున్నాడు. మరోవైపు వన్డే క్రికెట్ చరిత్రలో డబుల్ హ్యాట్రిక్ సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా బాబర్ నిలిచాడు. విరాట్ కోహ్లి వర్సెస్ బాబర్ ఆజం: ►బాబర్ ఆజాం 86 వన్డేల్లో 17 సెంచరీలు సాధించగా.. కోహ్లి 260 వన్డేల్లో 43 సెంచరీలు చేశాడు. ►బాబర్ ఆజం కేవలం 13 ఇన్నింగ్స్ల్లోనే కెప్టెన్గా అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ►కోహ్లి 17 ఇన్నింగ్స్ల్లో ఈ మైలురాయిని అందుకున్నాడు. ►విరాట్ కోహ్లీ వన్డే సగటు 58.07 కాగా, బాబర్ ఆజం సగటు 59.78. ►బాబర్ ఆజం రెండు సార్లు హ్యాట్రిక్ సెంచరీలు సాధించాడు చదవండి: PAK vs WI: వన్డేల్లో చరిత్ర సృష్టించిన పాక్ కెప్టెన్.. తొలి ఆటగాడిగా..! -
బాబర్ ఆజం ఊహించని చర్య.. ఆ ఆటగాడి కోసం!
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం తన క్రీడా స్పూర్తితో అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. ముల్తాన్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డేలో పాక్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ బాబర్ ఆజాం(103) సెంచరీతో చెలరేగి పాక్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో బాబర్ ఆజాంకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అయితే బాబర్ అందరనీ ఆశ్చర్యపరుస్తూ.. తనకు దక్కిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటర్ ఖుష్దిల్ షాకు బాబర్ అందజేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక బాబర్ క్రీడా స్పూర్తికి అభిమానులు ఫిదా అవుతున్నారు. కాగా ఈ మ్యాచ్లో ఖుష్దిల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అఖరి ఓవర్ వరకు జరిగిన ఈ మ్యాచ్లో.. కేవలం 23 బంతుల్లోనే 41 పరుగులు సాధించి జట్టుకు ఖుష్దిల్ అద్భుతమైన విజయాన్ని అందించాడు. పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ మొదటి వన్డే: ♦టాస్- వెస్టిండీస్- బ్యాటింగ్ ♦వెస్టిండీస్ స్కోరు: 305/8 (50) ♦పాకిస్తాన్ స్కోరు: 306/5 (49.2) ♦విజేత: పాకిస్తాన్.. 5 వికెట్ల తేడాతో పర్యాటక విండీస్పై విజయం చదవండి: PAK vs WI: వన్డేల్లో చరిత్ర సృష్టించిన పాక్ కెప్టెన్.. తొలి ఆటగాడిగా..! Beautiful gesture from the skipper 😍@babarazam258 gives his player of the match award to @KhushdilShah_ 🏆👏#PAKvWI | #KhelAbhiBaqiHai pic.twitter.com/7BrSiV7TyL — Pakistan Cricket (@TheRealPCB) June 8, 2022 -
PAK vs WI: వన్డేల్లో చరిత్ర సృష్టించిన పాక్ కెప్టెన్.. తొలి ఆటగాడిగా..!
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం వన్డే క్రికెట్లో చరిత్ర సృష్టించాడు. ముల్తాన్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డేలో బాబర్ సెంచరీతో చెలరేగాడు. కాగా ఏడాదిలో వన్డేల్లో బాబర్కు ఇది వరుసగా మూడో సెంచరీ కావడం గమనార్హం. ఈ క్రమంలో బాబర్ అరుదైన ఘనత సాధించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో రెండుసార్లు వరుసగా హ్యాట్రిక్ సెంచరీలు సాధించిన తొలి బ్యాటర్గా బాబర్ ఆజాం రికార్డులకెక్కాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో అఖరి రెండు మ్యాచ్ల్లో బాబర్ వరుసగా సెంచరీలు సాధించాడు. ఆసీస్తో వన్డే సిరీస్ తర్వాత స్వదేశంలో విండీస్తో పాక్ తలపడతోంది. విండీస్తో ఆడిన తొలి వన్డేలోనే బాబర్ సెంచరీ సాధించాడు. తద్వారా ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక 2016లో యూఏఈ వేదికగా వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో తొలి సారిగా బాబర్ వరుసగా మూడు సెంచరీలు సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముల్తాన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో విండీస్పై పాక్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లలో షాయీ హోప్ 127,బ్రూక్స్ 70 పరుగులతో రాణించారు. అనంతరం 306 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పాక్ ఇన్నింగ్స్లో కెప్టెన్ బాబర్ ఆజం(103) సెంచరీతో చెలరేగాడు. పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ మొదటి వన్డే: ♦టాస్- వెస్టిండీస్- బ్యాటింగ్ ♦వెస్టిండీస్ స్కోరు: 305/8 (50) ♦పాకిస్తాన్ స్కోరు: 306/5 (49.2) చదవండి: SL Vs Aus: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా! మా ఓటమికి కారణం అదే! The moment @babarazam258 etched his name in the record books 🙏#PAKvWI | #KhelAbhiBaqiHai pic.twitter.com/D7caU729F3 — Pakistan Cricket (@TheRealPCB) June 8, 2022 -
Pak Vs WI: విండీస్కు షాక్.. పాక్ చేతిలో పరాజయం
West Indies tour of Pakistan, 2021-22: 1st ODI- నెదర్లాండ్స్ను 3-0 తేడాతో క్లీన్స్వీప్ చేసి పాకిస్తాన్లో అడుగుపెట్టిన వెస్టిండీస్కు ఓటమి ఆహ్వానం పలికింది. మొదటి వన్డేలో పాకిస్తాన్ చేతిలో విండీస్ పరాజయం పాలైంది. నికోలస్ పూరన్ బృందంపై 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. కాగా కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడ్డ వన్డే సిరీస్ ఆడేందుకు విండీస్ జట్టు పాకిస్తాన్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం(జూన్ 8) ముల్తాన్ వేదికగా పాక్- విండీస్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. ఓపెనర్ షాయీ హోప్ 127 పరుగులతో విండీస్ టాప్ స్కోరర్గా నిలిచాడు. బ్రూక్స్ సైతం 70 పరుగులతో రాణించాడు. అయితే, నెదర్లాండ్స్ పర్యటనలో తీవ్రంగా నిరాశ పరిచిన కెప్టెన్ నికోలస్ పూరన్ మరోసారి విఫలమయ్యాడు. కేవలం 21 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. రోవ్మన్ పావెల్ 32 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఇక విండీస్ విధించిన లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ ఆదిలోనే ఓపెనర్ ఫఖార్ జమాన్(11 పరుగులు) వికెట్ కోల్పోయినా.. మరో ఓపెనర్ ఇమామ్-ఉల్-హక్(65) బ్యాట్ ఝులిపించడంతో ఊపిరి పీల్చుకుంది. ఈ క్రమంలో వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ బాబర్ ఆజమ్ 103 పరుగుల భారీ స్కోరుతో పాక్ విజయానికి బాటలు వేశాడు. మరోవైపు.. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ అర్ధ శతకం(59పరుగులు) ఆకట్టుకోగా.. ఖుష్ దిల్ షా 23 బంతుల్లోనే 41 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. పాకిస్తాన్ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ సూపర్ లీగ్లో భాగంగా ఈ సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ మొదటి వన్డే: ♦టాస్- వెస్టిండీస్- బ్యాటింగ్ ♦వెస్టిండీస్ స్కోరు: 305/8 (50) ♦పాకిస్తాన్ స్కోరు: 306/5 (49.2) ♦విజేత: పాకిస్తాన్.. 5 వికెట్ల తేడాతో పర్యాటక విండీస్పై విజయం 🔥🔥🔥 🔊🔛 @KhushdilShah_ sends the ball sailing for THREE 6️⃣s in a row! 💪#PAKvWI | #KhelAbhiBaqiHai pic.twitter.com/JBRxSN5Ihi — Pakistan Cricket (@TheRealPCB) June 8, 2022 .@KhushdilShah_ THE FINISHER 💥 Unbelievable striking from the southpaw! 😍#PAKvWI | #KhelAbhiBaqiHai pic.twitter.com/MDqnCK3abS — Pakistan Cricket (@TheRealPCB) June 8, 2022 🏏 𝟒𝟏* (23) 💥 𝟒 massive sixes ⚡ 𝟏𝟕𝟖.𝟐𝟔 strike rate 🗣️ Player of the match @KhushdilShah_ reflects on his explosive knock and his power-hitting prowess 💪 #PAKvWI | #KhelAbhiBaqiHai pic.twitter.com/bNqPo2v848 — Pakistan Cricket (@TheRealPCB) June 8, 2022 -
వెస్టిండీస్తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన పాకిస్తాన్.. స్టార్ ఆటగాడు వచ్చేశాడు
స్వదేశంలో వెస్టిండీస్తో జరగనున్న వన్డే సిరీస్కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును సోమవారం ప్రకటించింది. ఈ జట్టకు బాబర్ ఆజాం సారథ్యం వహించనున్నాడు. ఇక గాయం కారణంగా జట్టుకు దూరమైన ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. కాగా ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా సిరీస్కు 21 మంది సభ్యులను ఎంపిక చేసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సెలెక్టర్లు .. ఈ సారి ఆ సంఖ్యను 16కు తగ్గించారు. దీంతో జట్టుకు ఆసిఫ్ అఫ్రిది, ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, ఉస్మాన్ ఖాదిర్ వంటి ఆటగాళ్లు దూరమయ్యారు. ఇక ఇరు జట్లు మధ్య తొలి వన్డే రావల్పిండి వేదికగా జూన్ 8న జరగనుంది. పాకిస్తాన్ జట్టు బాబర్ ఆజాం(కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, ఇఫ్తీకర్ అహ్మద్, ఇమామ్-ఉల్-హక్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్ మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మహ్మద్ వసీం జూనియర్, షాహీన్ షా ఆఫ్రిది, షానవాజ్ దహానీ, జాహిద్ మహమూద్ చదవండి: IPL 2022: ప్లే ఆఫ్ మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయితే..? -
హోల్డర్కు రెస్ట్.. నెదర్లాండ్స్, పాక్తో సిరీస్కు విండీస్ జట్టు ఇదే!
నెదర్లాండ్స్, పాకిస్తాన్తో పర్యటనల నేపథ్యంలో వెస్టిండీస్ తమ క్రికెట్ జట్టును ప్రకటించింది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ల కోసం 15 మంది సభ్యులతో కూడిన టీమ్ను ఎంపిక చేసింది. ఐసీసీ ప్రపంచకప్ సూపర్లీగ్లో భాగంగా జరుగనున్న ఈ సిరీస్లతో పరిమిత ఓవర్ల కెప్టెన్గా నికోలస్ పూరన్ తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. ఇక పూరన్ నాయకత్వంలోని ఈ జట్టులో కొత్త ముఖాలు జేడెన్ సీల్స్, షెర్మోన్ లూయిస్, కీసీ కార్టీకి చోటు దక్కింది. జేడెన్, షెర్మోన్ ఫాస్ట్ బౌలర్లు కాగా.. కార్టీ బ్యాటర్. కాగా మే 31న నెదర్లాండ్స్తో విండీస్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2022లో భాగమైన పూరన్, పావెల్, రొమారియో షెఫర్డ్ తదితరులు లీగ్ ముగిసిన వెంటనే జాతీయ జట్టుతో కలవనున్నారు. ఇక లక్నో సూపర్జెయింగ్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న జేసన్ హోల్డర్కి మాత్రం సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. నెదర్లాండ్స్, పాకిస్తాన్తో వన్డే సిరీస్లకై వెస్టిండీస్ 15 మంది సభ్యులతో కూడిన జట్టు: 👉🏾నికోలస్ పూరన్(కెప్టెన్), షాయ్ హోప్(వైస్ కెప్టెన్), ఎన్క్రుమా బానర్, షామర్ బ్రూక్స్, కేసీ కార్టీ, అకీల్ హొసేన్, అల్జరీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, షెర్మోన్ లూయిస్, కైల్ మేయర్స్, అండర్సన్ ఫిలిప్, రోవ్మన్ పావెల్, జేడెన్ సీల్స్, రొమారియో షెఫర్డ్, హైడెన్ వాల్ష్ జూనియర్. వెస్టిండీస్ నెదర్లాండ్స్ టూర్ 2022 షెడ్యూల్: 👉🏾మే 31- మొదటి వన్డే- వీఆర్ఏ క్రికెట్ గ్రౌండ్- అమ్స్టెల్వీన్ 👉🏾జూన్ 2- రెండో వన్డే- వీఆర్ఏ క్రికెట్ గ్రౌండ్- అమ్స్టెల్వీన్ 👉🏾జూన్ 4- మూడో వన్డే-వీఆర్ఏ క్రికెట్ గ్రౌండ్- అమ్స్టెల్వీన్ వెస్టిండీస్ పాకిస్తాన్ టూర్ 2022 షెడ్యూల్ 👉🏾జూన్ 8- మొదటి వన్డే- పిండి స్టేడియం- రావల్పిండి 👉🏾జూన్ 10- రెండో వన్డే- పిండి స్టేడియం- రావల్పిండి 👉🏾జూన్ 12- మూడో వన్డే- పిండి స్టేడియం- రావల్పిండి చదవండి👉🏾Jasprit Bumrah: నాకు అవన్నీ తెలుసు.. అయినా నేను అలాంటి వాడిని కాదు: బుమ్రా -
Pak Vs WI ODI Series: విండీస్తో మూడు వన్డేలు.. త్వరలోనే టీ20 సిరీస్ కూడా!
ICC World Cup Super League Pakistan Vs West Indies: వెస్టిండీస్తో స్వదేశంలో జరుగబోయే వన్డే సిరీస్కు సంబంధించిన షెడ్యూల్ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ప్రకటించింది. జూన్ 8 నుంచి జూన్ 12 వరకు మూడు వన్డేలు ఆడనున్నట్లు పేర్కొంది. కాగా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం విండీస్ జట్టు పాకిస్తాన్లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఐసీసీ వరల్డ్కప్ సూపర్ లీగ్లో భాగంగా ఈ సిరీస్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి పీసీబీ సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. రావల్పిండిలో ఈ మ్యాచ్లు జరుగనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు.. ‘‘ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్ సూపర్లీగ్లో భాగంగా వెస్టిండీస్తో జూన్ 8 నుంచి 12 మధ్య జరిగే సిరీస్కు రావల్పిండి ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందుకోసం వెస్టిండీస్ జట్టు జూన్ 5న ఇస్లామాబాద్కు చేరుకుంటుంది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో డిసెంబరు 2021లో జరగాల్సిన ఈ సిరీస్ను రీ షెడ్యూల్ చేసేందుకు ఇరు వర్గాల అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. అంతేకాదు అప్పుడు జరగాల్సిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కూడా 2023లో వీలైనంత త్వరగా ఆడటానికి విండీస్ బోర్డు అంగీకారం తెలిపింది. ఇందుకు సంబంధించి త్వరలోనే షెడ్యూల్ విడుదల చేస్తాం’’ అని పీసీబీ వెల్లడించింది. పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ వన్డే సిరీస్ రావల్పిండిలోని పిండి స్టేడియం వేదికగా మూడు తొలి వన్డే: జూన్ 8 రెండో వన్డే: జూన్ 10 మూడో వన్డే: జూన్ 12 చదవండి: IPL 2022: ఎవరీ ఆయుష్ బదోని.. తొలి మ్యాచ్లోనే అదరగొట్టాడు IPL 2022 GT Vs LSG: అతడొక సంచలనం; తను నన్ను అవుట్ చేశాడు, నేను గెలిచా.. కుటుంబం మొత్తం హ్యాపీ: హార్దిక్ పాండ్యా -
ఇది పాక్ క్రికెటర్లకే సాధ్యం.. 13 ఏళ్లకు సేమ్సీన్ రిపీట్
వెస్టిండీస్తో సొంతగడ్డపై జరిగిన టి20 సిరీస్ను పాకిస్తాన్ గెలుచుకుందనే విషయం కంటే మరొక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్టాఫిక్గా మారింది. పాకిస్తాన్ ఆటగాళ్లు ఇఫ్తికార్ అహ్మద్, మొహ్మద్ హస్నేన్లు చేసిన పని పాక్ జట్టును ట్రోల్స్ బారిన పడేలా చేసింది. ఇద్దరి మధ్య ఏర్పడిన సమన్వయ లోపంతో విండీస్ బ్యాట్స్మన్ బ్రూక్స్ ఇచ్చిన క్యాచ్ను నేలపాలు చేశారు. తప్పు నీదంటే నీది అని కాసేపు వాదోపవాదాలు చేసుకున్నారు. ఆ సమయంలో తమ చెత్త ఫీల్డింగ్తో 13 ఏళ్ల కింద జరిగిన సంఘటనను రీక్రియేట్ చేశామని పాపం వారికి తెలియదు. ఇదే వారి కొంపముంచింది. అసలు విషయం ఏంటంటే.. 2008లో అచ్చం ఇదే తరహాలో షోయబ్ మాలిక్, సయీద్ అజ్మల్లు సమన్వయ లోపంతో ఒక క్యాచ్ను వదిలేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అప్పుడు, ఇప్పుడు ప్రత్యర్థి వెస్టిండీస్ కావడం విశేషం. సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ ఇఫ్తికార్ అహ్మద్, మొహ్మద్ హస్నేన్లను ట్యాగ్ చేస్తూ.. మాలిక్, అజ్మల్ 2.0 అంటూ ట్రోల్ చేశారు. ''ఏదైనా పాక్ క్రికెటర్లకే సాధ్యం.. చరిత్రను తిరగరాశారు''.. '' హస్నేన్ క్యాచ్ వదిలేసి సయీద్ అజ్మల్ గౌరవాన్ని పెంచాడు.''.. ''న్యూ అజ్మల్, మాలిక్లు.. బట్ సేమ్ ఓల్డ్ వెస్టిండీస్'' అంటూ కామెంట్స్ పెట్టారు. Hasnain & ifti 🤝 Malik & ajmal On both occasions opponent was west indies 😂😂❤️ #PAKvWI pic.twitter.com/YQj12liy5P — Saad Irfan 🇵🇰 (@SaadIrfan967) December 16, 2021 -
కోపంతో ఊగిపోయిన బౌలర్.. తన స్టైల్లో ప్రతీకారం
పాకిస్తాన్, వెస్టిండీస్ మధ్య ముగిసిన మూడో టి20లో ఒక ఆసక్తికరఘటన చోటుచేసుకుంది. వెస్టిండీస్ బ్యాటింగ్ సమయంలో పాకిస్తాన్ బౌలర్ మహ్మద్ వసీమ్ జూనియర్ తన స్టైల్లో ప్రతీకారం తీర్చుకోవడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విషయంలోకి వెళితే.. వెస్టిండీస్ పవర్ప్లేలో బౌండరీలు, సిక్సర్ల మోత మోగిస్తూ దాటిగా ఆడుతుంది. తొలి పవర్ప్లే ఆఖరి ఓవర్ను మహ్మద్ వసీమ్ వేశాడు. చదవండి: Mohammad Rizwan: టి20 క్రికెట్లో పాక్ ఓపెనర్ కొత్త చరిత్ర.. ఒక్క ఏడాదిలోనే ఓవర్ ఐదో బంతిని 43 పరుగులతో దూకుడుగా ఆడుతున్న బ్రాండన్ స్టార్క్ వెనక్కి జరిగి స్క్వేర్లెగ్ దిశగా భారీ సిక్సర్ కొట్టాడు. అతని దెబ్బకు బంతి వెళ్లి రూఫ్టాప్ మీద పడింది. దీంతో కోపంతో ఊగిపోయిన మహ్మద్ వసీమ్ తర్వాతి బంతికే దెబ్బకు దెబ్బ తీశాడు. ఓవర్ చివరి బంతిని వసీమ్ గుడ్లెంగ్త్తో వేయగా.. బ్రాండన్ కింగ్ వెనక్కి జరిగి షాట్ ఆడాలనుకున్నాడు. కానీ బంతి మిస్ అయి ఆఫ్స్టంప్ను ఎగురగొట్టింది. దీంతో వసీమ్ తన స్టైల్లో వెళ్లు.. పెవిలియన్ వెళ్లు.. అంటూ సైగలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియోనూ పాకిస్తాన్ క్రికెట్ తన ట్విటర్లో షేర్ చేసింది. ఇక మహ్మద్ వసీమ్ ఈ సిరీస్లో విశేషంగా రాణించాడు. ఆడిన మూడు మ్యాచ్ల్లో 8 వికెట్లు తీసి మంచి ప్రదర్శన కనబరిచాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ పూరన్, బ్రూక్స్, బ్రాండన్ కింగ్ చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. అయితే బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్(87), బాబర్(79) అజమ్లు చెలరేగడంతో 18.5 ఓవర్లో విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో మూడు టి20ల సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. కరోనా కారణంగా శనివారం నుంచి జరగాల్సిన వన్డే సిరీస్ను జూన్ 2022లో నిర్వహించాలని ఇరుబోర్డులు ఒక అంగీకారానికి వచ్చాయి. చదవండి: చంపేస్తానంటూ హెచ్చరిక.. ఆటగాడిపై జీవితకాల నిషేధం pic.twitter.com/Y0LwFWWKbk — Pakistan Cricket (@TheRealPCB) December 16, 2021 -
టి20 క్రికెట్లో పాక్ ఓపెనర్ కొత్త చరిత్ర
Mohammad Rizwan First Batter Reach 2000 Runs T20Is Single Calender Year.. పాకిస్తాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ టి20 క్రికెట్లో కొత్త చరిత్ర సృష్టించాడు. ఒకే క్యాలండర్ ఇయర్లో టి20 క్రికెట్లో 2వేల పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్గా మహ్మద్ రిజ్వాన్ రికార్డులకెక్కాడు. కరాచీ వేదికగా వెస్టిండీస్తో జరిగిన చివరి టి20లో 45 బంతుల్లోనే 87 పరుగులు మెరుపు ఇన్నింగ్స్ ఆడిన రిజ్వాన్.. ఒక్క ఏడాదిలోనే అంతర్జాతీయ, ఇతర లీగ్లు కలిపి 2వేల పరుగులు సాధించాడు. చదవండి: చంపేస్తానంటూ హెచ్చరిక.. ఆటగాడిపై జీవితకాల నిషేధం అతనికి తోడుగా మరో ఓపెనర్ బాబర్ అజమ్ కూడా 79 పరుగులు చేయడంతో పాకిస్తాన్ 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. అంతకముందు వెస్టిండీస్ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (64), బ్రూక్స్ (49), బ్రెండన్ కింగ్ (43) చెలరేగారు. స్టిండీస్తో జరిగిన మూడు టి20ల సిరీస్ను పాకిస్తాన్ 3–0తో సొంతం చేసుకుంది. ఇక ఇరుజట్ల నుంచి ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడుతుండడంతో విండీస్ పూర్తి జట్టును బరిలోకి దింపగలదా అనే అనుమానం కనిపించింది. అయితే ఏదో రకంగా చివరి టి20 ఆడే విధంగా విండీస్ను పాక్ బోర్డు ఒప్పించగలిగింది. అయితే శనివారంనుంచి జరగాల్సిన వన్డే సిరీస్ను ప్రస్తుతానికి రద్దు చేసి జూన్ 2022లో మళ్లీ జరిపేందుకు ఇరు బోర్డులు అంగీకరించాయి. చదవండి: పాక్ క్రికెట్కు కరోనా కాటు.. మరో సిరీస్ వాయిదా -
పాక్ క్రికెట్కు కరోనా కాటు.. మరో సిరీస్ వాయిదా
West Indies Vs Pakistan ODI Series: గత కొంతకాలంగా వివిధ కారణాల చేత పాకిస్థాన్లో జరగాల్సిన అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు రద్దవుతూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కరోనా కారణంగా ఆ దేశంలో జరగాల్సిన మరో సిరీస్ వాయిదా పడింది. ఇప్పటికే పాక్ పర్యటనలో ఉన్న విండీస్ జట్టులో కరోనా కేసులు నమోదవ్వడంతో ఇరు జట్ల మధ్య జరగాల్సిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ వచ్చే ఏడాది(2022) జూన్కు వాయిదా పడింది. విండీస్ క్యాంపులో తాజాగా మరో ఐదుగురు(మొత్తం 9 మంది) కరోనా బారినపడడంతో ఇరు జట్లు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) గురువారం సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. ఇదిలా ఉంటే, విండీస్ క్యాంప్లో గురువారం నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో 15 మంది ఆటగాళ్లకు నెగిటివ్ రిపోర్ట్ రావడంతో పాక్తో జరగాల్సిన మూడో టీ20 యధాతథంగా కొనసాగుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన విండీస్.. తొలుత బ్యాటింగ్కు దిగి నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్ చేసింది. బ్రెండన్ కింగ్(21 బంతుల్లో 43; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), బ్రూక్స్(31 బంతుల్లో 49; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), పూరన్(37 బంతుల్లో 64; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), డారెన్ బ్రావో(27 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు) చెలరేగి ఆడారు. ఈ సిరీస్లో తొలి రెండు మ్యాచ్లు నెగ్గిన పాక్ ఇదివరకే సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. చదవండి: Ashes 2nd Test: ఇంగ్లండ్ బౌలర్ అరుదైన ఘనత.. -
బాబర్ అజమ్ మరీ ఇంత బద్దకమా!
PAK vs WI: Babar Azam Run Out Viral.. వెస్టిండీస్తో జరిగిన రెండో టి20లో బాబర్ అజమ్ రనౌట్ అయిన తీరు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విండీస్ స్పిన్నర్ ఏకియల్ హొస్సేన్ వేసిన మూడో ఓవర్ మూడో బంతిని మహ్మద్ రిజ్వాన్ బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఆడాడు. అయితే క్విక్ సింగిల్ తీయొచ్చనే ఉద్దేశంతో రిజ్వాన్ నాన్ స్ట్రైక్ ఎండ్వైపు పరిగెత్తాడు. కాల్ అందుకున్న బాబార్ అజమ్ కూడా పరిగెత్తినప్పటికి సకాలంలో క్రీజులోకి చేరుకోలేకపోయాడు. ఇంతలో బంతిని అందుకున్న హెడెన్ వాల్ష్ కీపర్ పూరన్కు త్రో విసిరాడు. చదవండి: PAK Vs WI: ప్రపంచ రికార్డు సాధించిన పాకిస్తాన్.. ఏకైక జట్టుగా! దీంతో బాబర్ అజమ్ క్రీజుకు చాలా దూరంలో ఉండగానే పూరన్ బెయిల్స్ ఎగురగొట్టడంతో బాబర్ రనౌటయ్యాడు. ప్రస్టేషన్తో బాబర్ అజమ్ పెవిలియన్కు వెళ్తూ బ్యాట్ను కోపంతో కొట్టడం కెమెరాలకు చిక్కింది. దీంతో బాబర్ అజమ్ను క్రికెట్ ఫ్యాన్స్ తమదైన శైలిలో ట్రోల్ చేశారు. ''బాబర్ అజమ్ మరీ ఇంత బద్దకమా.. నీకు వయసు అయిపోతుంది.. సింగిల్ వద్దు అనుకుంటే రిజ్వాన్కు కాల్ ఇవ్వాల్సింది..'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక మ్యాచ్లో పాకిస్తాన్ తొమ్మిది పరుగుల తేడాతో నెగ్గి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది. తొలుత పాకిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులు చేసింది. రిజ్వాన్ (38; 4 ఫోర్లు, 1 సిక్స్), ఇఫ్తిఖార్ అహ్మద్ (32; 1 ఫోర్, 2 సిక్స్లు), హైదర్ అలీ (31; 4 ఫోర్లు) రాణించారు. విండీస్ 20 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. బ్రాండన్ కింగ్ (67; 6 ఫోర్లు, 3 సిక్స్లు), షెపర్డ్ (35 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) పోరాడారు. చివరి ఓవర్లో గెలుపు కోసం 23 పరుగులు చేయాల్సిన స్థితిలో వెస్టిండీస్ 13 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాక్ పేసర్ షాహీన్ అఫ్రిది 3 వికెట్లు తీశాడు. చివరి టి20 గురువారం జరుగుతుంది. Early loss for Pakistan, Babar Azam in run out!#PAKvWI#HumTouKhelainGey pic.twitter.com/wNWyZVt2fa — Pakistan Cricket (@TheRealPCB) December 14, 2021 -
చెలరేగిన షాహిన్ అఫ్రిది.. పాకిస్తాన్దే టి20 సిరీస్
కరాచీ: వెస్టిండీస్తో రెండో టి20 క్రికెట్ మ్యాచ్లో పాకిస్తాన్ తొమ్మిది పరుగుల తేడాతో నెగ్గి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది. తొలుత పాకిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులు చేసింది. రిజ్వాన్ (38; 4 ఫోర్లు, 1 సిక్స్), ఇఫ్తిఖార్ అహ్మద్ (32; 1 ఫోర్, 2 సిక్స్లు), హైదర్ అలీ (31; 4 ఫోర్లు) రాణించారు. విండీస్ 20 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. బ్రాండన్ కింగ్ (67; 6 ఫోర్లు, 3 సిక్స్లు), షెపర్డ్ (35 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) పోరాడారు. చివరి ఓవర్లో గెలుపు కోసం 23 పరుగులు చేయాల్సిన స్థితిలో వెస్టిండీస్ 13 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాక్ పేసర్ షాహీన్ అఫ్రిది 3 వికెట్లు తీశాడు. చివరి టి20 గురువారం జరుగుతుంది. -
Pak Vs WI: విండీస్ 137 పరుగులకే ఆలౌట్.. పాకిస్తాన్ ఘన విజయం
T20 Series- Pakistan Won In 1st T20 Against West Indies: సొంతగడ్డపై వెస్టిండీస్తో జరిగిన తొలి టి20 మ్యాచ్లో పాకిస్తాన్ 63 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా పాక్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. మొహమ్మద్ రిజ్వాన్ (52 బంతుల్లో 78; 10 ఫోర్లు), హైదర్ అలీ (39 బంతుల్లో 68; 6 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ సెంచరీలు సాధించగా...చివర్లో నవాజ్ (10 బంతుల్లో 30 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడాడు. అనంతరం విండీస్ 19 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. షై హోప్ (26 బంతుల్లో 31; 4 ఫోర్లు) టాప్ స్కోరర్. వసీమ్ (4/40), షాదాబ్ ఖాన్ (3/17) ప్రత్యర్థిని పడగొట్టారు. హైదర్ అలీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో పాక్ 1–0తో ఆధిక్యంలో నిలవగా, రెండో మ్యాచ్ నేడు ఇదే మైదానంలో జరుగుతుంది. స్కోర్లు: పాకిస్తాన్- 200/6 (20) వెస్టిండీస్- 137 (19) Player of the match @iamhaideraly reviews his 68-run innings.#PAKvWI #HumTouKhelainGey pic.twitter.com/WSw3OxZsXN — Pakistan Cricket (@TheRealPCB) December 13, 2021 It's a WRAP from the National Stadium Karachi! Pakistan win by 63 runs and go 1-0 in three-match #PAKvWI T20I series.#HumTouKhelainGey pic.twitter.com/QqGvlhgauZ — Pakistan Cricket (@TheRealPCB) December 13, 2021 But falls to @76Shadabkhan shortly after pic.twitter.com/UnejzC7gKw — Pakistan Cricket (@TheRealPCB) December 13, 2021 -
వెస్టిండీస్ జట్టులో కరోనా కలకలం
పాకిస్తాన్ పర్యటనలో వెస్టిండీస్కు షాక్ తగిలింది. సిరీస్ ప్రారంభానికి ముందు నిర్వహించిన కరోనా పరీక్షలో ముగ్గురు ఆటగాళ్లు సహా సిబ్బందిలో ఒకరికి కోవిడ్-19 పాజిటివ్గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని విండీస్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా కోవిడ్ పాజిటివ్గా తేలిన క్రికెటర్లు రోస్టన్ చేజ్, కైల్ మేయర్స్, షెల్డన్ కాట్రెల్లతో పాటు సిబ్బందిలో ఒకరిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్లో ఉంచినట్లు తెలిపింది. చదవండి: Omicron cases: బంగ్లా క్రికెట్ జట్టులో ఒమిక్రాన్ కలకలం.. ఇద్దరికి నిర్ధారణ మిగతా ఆటగాళ్లకు పరీక్షలు నిర్వహించగా.. కోవిడ్ నెగెటివ్ అని తేలడంతో సిరీస్ యథాతదంగా జరుగుతుందని విండీస్ బోర్డు పేర్కొంది. కాగా పాకిస్తాన్ పర్యటనలో విండీస్ జట్టు మూడు టి20లు.. మూడు వన్డేలు ఆడనుంది. డిసెంబర్ 13, 14, 16 తేదీల్లో మూడు టి20లు జరగనుండగా.. డిసెంబర్ 18 నుంచి 22 మధ్య మూడు వన్డేలు జరగనున్నాయి. -
ఒక్క వికెట్.. అప్పుడు గెలుపు.. ఇప్పుడేమో ఇలా
న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో టీమిండియాకు ఒక్క వికెట్ విజయాన్ని దూరం చేసింది. కివీస్ టెయిలెండర్లు రచిన్ రవీంద్ర, ఎజాజ్ పటేల్లు 52 బంతుల పాటు ఓపికగా ఆడి ఓటమి నుంచి గట్టెక్కించారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగియడంతో టీమిండియాకు నిరాశ తప్పలేదు. అయితే ఇదే ఏడాది పాకిస్తాన్, వెస్టిండీస్ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్లో దాదాపు ఇదే తరహాలో జరిగింది. అయితే ఇక్కడి సందర్భాలు వేరుగా ఉన్నాయి. అప్పటి మ్యాచ్లో విండీస్ ఒక్క వికెట్ తేడాతో పాకిస్తాన్పై చారిత్రక విజయాన్ని సాధించగా.. తాజాగా భారత్ మాత్రం కివీస్తో మ్యాచ్లో ఒక వికెట్ తేడాతో విజయానికి దూరమైంది. రెండు సందర్భాలు వేరుగా ఉన్నా.. ఇక్కడ ఒక్క వికెట్ అనేది కామన్గా కనిపిస్తోంది. చదవండి: Test Cricket: ఇది ఆటంటే.. టెస్టు మజా ఏంటో చూపించింది పాకిస్తాన్- విండీస్ టెస్టు మ్యాచ్ ఫోటో విషయంలోకి వెళితే.. ఆగస్టులో పాకిస్తాన్ విండీస్ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో పాకిస్తాన్పై వెస్టిండీస్ 1 వికెట్ తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 217 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక విండీస్ తొలి ఇన్నింగ్స్లో 253 పరుగులకు ఆలౌటై 36 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్లో 203 పరుగులకు ఆలౌట్ కావడంతో విండీస్ ముందు 167 పరుగుల లక్ష్యం ఉంచింది. అయితే విండీస్ పాకిస్తాన్ బౌలర్ల దెబ్బకు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఆట ముగియడానికి 1.1 ఓవర్ మిగిలి ఉండగా.. సింగిల్ తీయడంతో విండీస్ 1 వికెట్ తేడాతో విజయం సాధించింది. ఇక టీమిండియా, న్యూజిలాండ్ మధ్య ఒక వికెట్ తేడాతో మ్యాచ్ డ్రాగా ముగియడంతో ప్రస్తుతం అభిమానులు రెండు మ్యాచ్ల ఫోటోలను షేర్ చేయడం వైరల్గా మారింది. చదవండి: Rahul Dravid: ద్రవిడ్ రూటే సెపరేటు! గ్రౌండ్స్మెన్కు రూ.35 వేలు.. కారణం -
పాక్కు గుడ్న్యూస్ చెప్పిన వెస్టిండీస్.. పర్యటన ఖరారు.. షెడ్యూల్ ఇదే
West Indies To Tour Pakistan 3 T20s 3 ODIs Schedule: వెస్టిండీస్ క్రికెట్ జట్టు పాకిస్తాన్ పర్యటన ఖరారైంది. ఈ ఏడాది డిసెంబరులో విండీస్ జట్టు పాక్ టూర్కు వెళ్లనుంది. మూడు టీ20 మ్యాచ్లు సహా 3 వన్డే మ్యాచ్లు ఆడనుంది. డిసెంబరు 9న పాకిస్తాన్కు చేరనున్న వెస్టిండీస్ పురుషుల జట్టు... 13 నుంచి 22 వరకు పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడనుంది. ఈ విషయాన్ని క్రికెట్ వెస్టిండీస్ గురువారం ధ్రువీకరించింది. కాగా ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ సూపర్ లీగ్లో భాగంగా ఈ మేరకు విండీస్ జట్టు పాక్తో వన్డే సిరీస్ ఆడనుంది. ఇక ఇప్పటి వరకు నాలుగు విజయాలు, ఐదు పరాజయాలతో ఎనిమిదో స్థానంలో ఉన్న వెస్టిండీస్.. ఎలాగైనా ఈ సిరీస్లో గెలుపొంది తమ స్థానాన్ని మెరుగుపరచుకోవాలని భావిస్తోంది. విండీస్ కంటే ఒక స్థానం మెరుగ్గా ఉన్న పాక్ సైతం సిరీస్ విజయంపై కన్నేసింది. ఇక 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్.. వన్డే మ్యాచ్ మొదలు కావడానికి కొన్ని నిమిషాల ముందు టూర్ను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. భద్రతా కారణాల దృష్ట్యా పాక్లో పర్యటించలేమని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ సైతం ఇదే బాటలో నడవడంతో కివీస్ బోర్డు తీరుపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రతినిధులు సహా మాజీ ఆటగాళ్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దారుణంగా దెబ్బకొట్టిన న్యూజిలాండ్పై టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో ప్రతీకారం తీర్చుకోవాలని సూచించారు. అందుకు అనుగుణంగానే పాకిస్తాన్.. విలియమ్సన్ సేనపై అద్బుత విజయం సాధించింది. కాగా భద్రతా కారణాలను చూపి కివీస్, ఇంగ్లండ్ టూర్ రద్దు చేసుకున్న నేపథ్యంలో.. విండీస్ మాత్రం పాక్ పర్యటనకు వెళ్లనుండటం గమనార్హం. 2018 తర్వాత వెస్టిండీస్ పాక్లో పర్యటించనుండటం ఇదే తొలిసారి. పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ షెడ్యూల్: ►డిసెంబరు 9న కరాచికి చేరుకోనున్న వెస్టిండీస్ జట్టు.. అన్ని మ్యాచ్లు అక్కడే ఆడనుంది. ►డిసెంబరు 13- మొదటి టీ20 ►డిసెంబరు 14- రెండో టీ20 ►డిసెంబరు 16- మూడో టీ20 ►డిసెంబరు 18- మొదటి వన్డే ►డిసెంబరు 20- రెండో వన్డే ►డిసెంబరు 22- మూడో వన్డే. చదవండి: T20 WC Aus Vs Ban: బంగ్లాదేశ్ మరో చెత్త రికార్డు.. కెన్యా, అఫ్గనిస్తాన్ సరసన Details of West Indies tour of Pakistan#PAKvWI | #HarHaalMainCricket pic.twitter.com/H5f8Dp2uHA — Pakistan Cricket (@TheRealPCB) November 4, 2021 -
పాక్ జట్టులో కరోనా కలకలం..ముగ్గురికి పాజిటివ్గా నిర్ధారణ
Three Pakistan Women Cricketers Tested For Covid Positive: పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టులో కరోనా కలకలం రేపింది. జట్టులోని ముగ్గురు క్రికెటర్లకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు గురువారం వెల్లడించింది. స్వదేశంలో విండీస్తో జరగనున్న వన్డే సిరీస్ కోసం ఏర్పాటు చేసిన సన్నాహక శిబిరంలో జట్టు సభ్యులుండగా రొటీన్ చెకప్లో భాగంగా జరిపిన పరీక్షల్లో విషయం వెలుగు చూసినట్లు పేర్కొంది. అయితే, కోవిడ్ బారిన పడిన ఆటగాళ్ల వివరాలను మాత్రం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వెల్లడించలేదు. బాధితులను 10 రోజుల క్వారంటైన్కు తరలించామని.. మిగతా జట్టు సభ్యులను వారి నుంచి వేరుగా ఉంచామని తెలిపింది. కాగా, పాక్ మహిళా జట్టు కరాచీ వేదికగా నవంబర్ 8, 11, 14 తేదీల్లో విండీస్తో మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. ప్రస్తుతం పాక్ జట్టులో కరోనా కలకలం రేగడంతో ఈ సిరీస్పై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. చదవండి: బీసీసీఐ బాస్ కీలక నిర్ణయం.. 'ఆ పదవికి' రాజీనామా -
'ముసలివాడివయ్యావు'.. బాబర్ అజమ్ ట్రోల్
T20 WC 2021 Babar Azam Troll Shadab Khan.. టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా సోమవారం పాకిస్తాన్, వెస్టిండీస్ మధ్య జరిగిన వార్మప్ మ్యాచ్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వెస్టిండీస్ బ్యాటింగ్ సమయంలో ఇన్నింగ్స్ తొలి ఓవర్ను షాహిన్ అఫ్రిది వేశాడు. ఓవర్ రెండో బంతిని లెండి సిమ్మన్స్ ఇన్సైడ్ ఎడ్జ్ ఆడాడు. నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న ఆండ్రీ ఫ్లెచర్ సింగిల్కు కాల్ ఇయ్యడంతో సిమ్మన్స్ పరిగెత్తాడు. చదవండి: T20 WC IND vs PAK: బాబర్ అజమ్ బ్యాటింగ్.. రెప్పవాల్చని టీమిండియా అయితే రనౌట్కు అవకాశం ఉన్నప్పటికీ గల్లీ నుంచి వేగంగా పరిగెత్తుకు వచ్చిన షాదాబ్ ఖాన్ డైరెక్ట్ హిట్ చేయడంలో విఫలమయ్యాడు. దీంతో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ షాదాబ్ను ట్రోల్ చేస్తూ పలికిన మాటలు నవ్వులు పూయించాయి. '' నువ్వు ముసలివాడివి అయిపోయావు.. యంగ్గా ఉండి ఉంటే మాత్రం కచ్చితంగా రనౌట్ చేసేవాడివి'' అంటూ కామెంట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక వెస్టిండీస్తో జరిగిన వార్మప్ మ్యాచ్లో పాకిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 130 పరుగులు చేసింది. అనంతరం పాకిస్తాన్ మూడు వికెట్లు కోల్పోయి 27 బంతులు మిగిలిఉండగానే విజయాన్ని అందుకుంది. బాబర్ అజమ్ (41 బంతుల్లో 50 పరుగులు; 4 ఫోర్లు, ఒక సిక్స్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. ఫఖర్ జమాన్ (24 బంతుల్లో 46 పరుగులు; నాలుగు ఫోర్లు, 2 సిక్సర్లు)తో అతనికి సహకరించాడు. చదవండి: T20 World Cup: ఇండియా- పాక్ మ్యాచ్ రద్దు చేసే వీలు లేదు.. ఆడాల్సిందే! Babar Jani To Shadab:- 'Bhuda hogya, Bhuda hogya, "Pean dy sri Ay Jawani Ich Run Out Ni Honda" 😂#KingBabar👑 pic.twitter.com/eGNApAWtjg — || A S A D || (@Asad_Labana) October 19, 2021 -
T20 World Cup: అరె... నాలుగు మ్యాచ్లలోనూ అదే ఫలితం!
T20 World Cup 2021: ఐసీసీ మెగా టోర్నీ టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్లలో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. గ్రూపు-ఏలో భాగంగా జరిగిన రెండు మ్యాచ్లలోనూ ఏడు వికెట్ల తేడాతో విజయం నమోదవడం విశేషం. అంతేకాదు.. ఇరు మ్యాచ్లలోనూ బౌలర్లే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచారు. ఐర్లాండ్ వర్సెస్ నెదర్లాండ్స్ (IRE Vs NED) టీ20 ప్రపంచకప్-2021 క్వాలిఫయర్స్ పోటీల్లో భాగంగా అక్టోబరు 18న ఐర్లాండ్- నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఐర్లాండ్ ప్రత్యర్థి జట్టుపై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 4 వికెట్లు పడగొట్టి నెదర్లాండ్స్ పతనాన్ని శాసించిన కర్టిస్ కాంపర్కు ‘‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’’ అవార్డు లభించింది. అంతేకాదు అంతర్జాతీయ టి20 క్రికెట్లో 4 వరుస బంతుల్లో 4 వికెట్లు తీసిన మూడో బౌలర్గా కర్టిస్ ఘనత సాధించాడు. స్కోర్లు: నెదర్లాండ్స్- 106 (20) ఐర్లాండ్ 107/3 (15.1) శ్రీలంక వర్సెస్ నమీబియా(SL Vs Nam) ఇక శ్రీలంక- నమీబియా మ్యాచ్లోనూ.. దసున్ షనక సేన.. 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడు వికెట్లు పడగొట్టిన మహీశ్ తీక్షణ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. స్కోర్లు: నమీబియా- 96 (19.3) శ్రీలంక 100/3 (13.3) టీమిండియా- ఇంగ్లండ్ వార్మప్ మ్యాచ్లోనూ సేమ్.. జోస్ బట్లర్ సారథ్యంలోని ఇంగ్లండ్.. కోహ్లి సేన చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో ఓపెనింగ్ చేసిన కేఎల్ రాహుల్(52), ఇషాన్ కిషన్(70) అర్ధ సెంచరీలతో మెరిశారు. భారత బౌలర్ షమీ 3 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ను దెబ్బకొట్టాడు. స్కోర్లు: ఇంగ్లండ్- 188/5 (20) టీమిండియా- 192/3 (19) పాకిస్తాన్- వెస్టిండీస్ వార్మప్ మ్యాచ్లో కూడా.. డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్- పాకిస్తాన్ మధ్య సోమవారం వార్మప్ మ్యాచ్ జరిగింది. ఇందులో బాబర్ ఆజం బృందం ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ బాబర్ ఆజం అర్ధ సెంచరీ సాధించగా... ఫఖార్ జమాన్ మెరుగ్గా రాణించాడు. స్కోర్లు: విండీస్- 130/7 (20) పాకిస్తాన్ 131/3 (15.3) చదవండి: T20 WC IND vs PAK: బాబర్ అజమ్ బ్యాటింగ్.. రెప్పవాల్చని టీమిండియా ఆటగాళ్లు -
ఫవాద్ ఆలమ్ అజేయ శతకం.. పటిష్ట స్థితిలో పాక్
కింగ్స్టన్: మిడిలార్డర్ బ్యాట్స్మెన్ ఫవాద్ ఆలమ్(213 బంతుల్లో 124 నాటౌట్; 17 ఫోర్లు) అజేయ శతకానికి, కెప్టెన్ బాబర అజామ్(174 బంతుల్లో 75; 13 ఫోర్లు) అర్థశతకం తోడవడంతో వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్ట్లో పాకిస్థాన్ 302/9 వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. వీరికి తోడు మహమ్మద్ రిజ్వాన్(115 బంతుల్లో 31), ఫహీమ్ అష్రఫ్ (78 బంతుల్లో 28) మాత్రమే కాస్త పర్వాలేదనిపించారు. విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్, జైడన్ సీల్స్ మూడేసి వికెట్లు తీయగా, జేసన్ హోల్డర్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 18 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 39 పరుగులు మాత్రమే సాధించి ఎదురీదుతోంది. ఓపెనర్లు క్రైగ్ బ్రాత్ వైట్(4), కీరన్ పోవెల్(5), మిడిలార్డర్ బ్యాట్స్మన్ రోస్టన్ చేజ్(10) తీవ్రంగా నిరాశపర్చగా.. క్రీజులో బోన్నర్(18 బ్యాటింగ్), అల్జారీ జోసెఫ్(0 బ్యాటింగ్) ఉన్నారు. పాక్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది రెండు వికెట్లు తీయగా.. ఫహీమ్ అష్రఫ్ ఓ వికెట్ పడగొట్టాడు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్ను వరుణుడు వెంటాడుతున్నాడు. తొలి రోజు కొన్ని ఓవర్ల ఆటకు అంతరాయం కలగగా.. రెండో రోజు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. మూడో రోజైన ఆదివారం కూడా వర్షం మధ్య మధ్యలో అంతరాయం కలిగించింది. కాగా, రెండు టెస్ట్ల సిరీస్లో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్లో ఆతిధ్య జట్టు వికెట్ తేడాతో ఉత్కంఠ విజయం సాధించిన సంగతి తెలిసిందే. చదవండి: మూడో టెస్ట్కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్.. -
నరాలు తెగే ఉత్కంఠత.. రోచ్ 'సూపర్' ఇన్నింగ్స్తో విండీస్ థ్రిల్లింగ్ విక్టరీ
జమైకా: పాక్తో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిధ్య విండీస్ జట్టు నరాలు తెగే ఉత్కంఠత నడుమ అద్భుత విజయం సాధించింది. చివరి వరకూ ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్లో విండీస్ జట్టు వికెట్ తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. పాక్ నిర్దేశించిన 168 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో విండీస్ జట్టు తడబడినప్పటికీ.. ఆఖర్లో కీమర్ రోచ్ (52 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు) సూపర్ ఇన్నింగ్స్తో జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు. 142 పరుగులకే 8 వికెట్లు కోల్పోయినా.. జోమెల్ వారికన్ (6), జేడెన్ సీల్స్ (2) అండతో రోచ్ తన జట్టును గట్టెక్కించాడు. ఈ విజయంతో విండీస్ రెండు టెస్టుల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్ట్ ఆగష్టు 20న ప్రారంభం కానుంది. కాగా, ఓవర్నైట్ స్కోరు 160/5తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన పాక్.. రెండో ఇన్నింగ్స్లో 203 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ బాబర్ ఆజామ్ (55) టాప్ స్కోరర్గా నిలిచాడు. విండీస్ పేసర్ జేడెన్ సీల్స్ (5/55) ఐదు వికెట్లతో అదరగొట్టాడు. ఈ క్రమంలో టెస్ట్ల్లో విండీస్ తరఫున 5 వికెట్ల ఘనత సాధించి అత్యంత పిన్న వయస్కుడిగా(19 ఏళ్లు) రికార్డుల్లోకెక్కాడు. అనంతరం పాక్ నిర్దేశించిన 168 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్ తడబడింది. రోస్టన్ ఛేజ్ (22), జెర్మైన్ బ్లాక్వుడ్ (55), హోల్డర్(16), జాషువా డిసిల్వా(13), కీమర్ రోచ్(30 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. హసన్ అలీ(3/37), షాహీన్ ఆఫ్రిది(4/50), ఫహీమ్ అష్రాఫ్(2/29) విండీస్ను దారుణంగా దెబ్బకొట్టారు. ఓ దశలో కరేబియన్ల ఓటమి దాదాపు ఖరారైంది. ఈ సమయంలో కీమర్ రోచ్ సూపర్ ఇన్నింగ్స్తో జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు. 8 వికెట్లతో రాణించిన జేడెన్ సీల్స్కు మ్యాచ్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. కాగా, పాక్ తొలి ఇన్నింగ్స్లో 217 పరగులు చేయగా.. విండీస్ 253 రన్స్కు ఆలౌటైంది. చదవండి: Afghanisthan: క్రికెటర్ల పరిస్థితి.. ఐపీఎల్లో ఆడతారా? -
రెండో ఇన్నింగ్స్లోనూ తడబడుతున్న పాక్.. ఆదుకున్న కెప్టెన్
జమైకా: పాకిస్తాన్తో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 89.4 ఓవర్లలో 253 పరుగులకు ఆలౌటై 36 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్వైట్ (97; 12 ఫోర్లు) మూడు పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు. హోల్డర్ (58; 10 ఫోర్లు)తో కలసి బ్రాత్వైట్ ఐదో వికెట్కు 96 పరుగులు జతచేశాడు. పాక్ బౌలరల్లో షాహీన్ అఫ్రిది 4 వికెట్లు, మహ్మద్ అబ్బాస్ 3, ఫహీమ్ అష్రాఫ్, హసన్ అలీ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 36 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాక్ మరోసారి తడబడింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 160 పరుగులు సాధించింది. కెప్టెన్ బాబర్ ఆజమ్(54 నాటౌట్) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇమ్రాన్ బట్, ఫవాద్ ఆలం డకౌట్ కాగా, ఆబిద్ అలీ(34), అజార్ అలీ(23), మహ్మద్ రిజ్వాన్(30) రెండంకెల స్కోర్ చేయగలిగారు. విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్, జేడెన్ సీల్స్ తలో రెండు వికెట్లు, హోల్డర్ ఓ వికెట్ పడగొట్టాడు. అంతకుముందు పాక్ తమ తొలి ఇన్నింగ్స్లో 217 పరగులకు ఆలౌటైంది. ప్రస్తుతం ఆ జట్టు 124 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. -
ఆసీస్ మ్యాచ్ ముఖ్యమా.. పాక్ను డీగ్రేడ్ చేయడమే ఇది!
Pakistan Tour Of West Indies 2021: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీరుపై ఆ జట్టు మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ మండిపడ్డాడు. వెస్టిండీస్ బోర్డు ప్రతిపాదనలకు అంగీకరించి, మ్యాచ్ను రద్దు చేసుకోవడం ఏమిటని ప్రశ్నించాడు. 5 మ్యాచ్ల సిరీస్ను నాలుగు మ్యాచ్లకు కుదించడం పాకిస్తాన్ క్రికెట్ జట్టును తక్కువ చేసి చూపడమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా పాకిస్తాన్ జట్టు టీ20 సిరీస్ నిమిత్తం వెస్టిండీస్లో పర్యటించాల్సి ఉంది. మంగళవారం నుంచి ప్రారంభం కావాల్సిన ఈ సిరీస్లో ఓ మ్యాచ్ను రద్దు చేసి... బుధవారం నుంచి రీషెడ్యూల్ చేశారు. కోవిడ్ కారణంగా వాయిదా పడిన వెస్టిండీస్- ఆస్ట్రేలియా(విండీస్ టూర్) వన్డే మ్యాచ్ను నిర్వహించడానికే విండీస్ బోర్డు ఈ మేరకు పీసీబీ వద్ద ప్రతిపాదనలు చేసింది. ఇందుకు పాక్ బోర్డు అంగీకరించడంతో పాకిస్తాన్తో ఆడాల్సిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను 4 మ్యాచ్లకు పరిమితం చేసింది. ఈ విషయంపై స్పందించిన ఇంజమామ్.. ‘‘అసలు పీసీబీ ఇలాంటి ఒక ప్రపోజల్కు ఎందుకు అంగీకరించిందో అర్థం కావడం లేదు. కరోనా కేసు వెలుగు చూసిన కారణంగా విండీస్- ఆసీస్ మ్యాచ్ రీషెడ్యూల్ అయిన సంగతి మనకు తెలిసిందే. అయితే... దీనితో పాక్ టీ20 సిరీస్కు ఏం సంబంధం? నిజానికి టీ20 సిరీస్కు, ఆగష్టు 12న ప్రారంభం కావాలిస్న టెస్టు సిరీస్కు మధ్య మధ్య తొమ్మిది రోజుల వ్యవధి ఉంది. కావాలంటే ఈ గ్యాప్లో మరో మ్యాచ్ నిర్వహించవచ్చు. కానీ, ఆస్ట్రేలియా కోసం విండీస్ పాక్ మ్యాచ్ను రద్దు చేయాలని భావించింది. ఇది నిజంగా పాక్ జట్టును డీగ్రేడ్ చేయడమే. పీసీబీ ఎందుకు సానుకూలంగా స్పందించిందో నాకింకా షాకింగ్గానే ఉంది. ఈసారి ఈ జట్టుతో లేదంటే ఆ జట్టుతో అని పదేపదే జట్లు మార్చడానికి.. ఇవేమీ క్లబ్ మ్యాచ్లు కాదు కదా. అంతర్జాతీయ మ్యాచ్లు’’ అని తన యూట్యూబ్ చానెల్ వేదికగా పీసీబీ, విండీస్ బోర్డు తీరును విమర్శించాడు. కాగా టాస్ వేసిన తర్వాత వెస్టిండీస్ జట్టు సిబ్బందిలో ఒకరు కరోనా బారిన పడినట్లు తెలియడంతో విండీస్- ఆసీస్ మధ్య జరగాల్సిన రెండో వన్డేను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. A battle to end the #WIvAUS tour on a high note.🏆 pic.twitter.com/V5kWV28wwy — Windies Cricket (@windiescricket) July 26, 2021 Hosein finds the 1st wicket! #WIvAUS #MenInMaroon pic.twitter.com/WG1nsnopqv — Windies Cricket (@windiescricket) July 26, 2021 -
ఆ మ్యాచే మా కొంపముంచింది: పాక్ కెప్టెన్
లండన్ : వెస్టిండీస్తో జరిగిన ప్రపంచకప్ ఆరంభ మ్యాచే తమ కొంపముంచిందని పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అభిప్రాయపడ్డాడు. ఆ మ్యాచ్ ఘోర ఓటమే మెగా టోర్నీ నుంచి నిష్క్రమించేలా చేసిందన్నాడు. తమ జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చినా అదృష్టం కలిసిరాలేదని తెలిపాడు. ఇక పాకిస్తాన్ 5 మ్యాచ్లు గెలిచి 11 పాయింట్లు సాధించినప్పటికీ నెట్ రన్రేట్ లేని కారణంగా ప్రపంచకప్ రేసు నుంచి తప్పుకోగా.. 11 పాయింట్లే ఉన్న న్యూజిలాండ్ సెమీస్కు చేరింది. అయితే విండీస్తో ఘోర ఓటమే పాక్కు రన్రేట్ లేకుండా చేసింది. ఈ మ్యాచ్లో పాక్ 105 పరుగులకే కుప్పకూలగా.. విండీస్ 13.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి 7 వికెట్లతో ఘనవిజయం సాధించింది. ఇదే పాక్ జట్టుపై తీవ్రప్రభావం చూపింది. (చదవండి: విండీస్ వలలో పాక్ గిలగిల) శుక్రవారం బంగ్లాదేశ్తో విజయానంతరం సర్ఫరాజ్ మాట్లాడుతూ.. ఇదే అంశాన్ని ప్రస్తావించాడు. ‘గత నాలుగు మ్యాచ్ల్లో మేం అద్భుతంగా ఆడాం. కానీ దురదృష్టవశాత్తు మేం సెమీస్ బెర్త్ అందుకోలేకపోయాం. వెస్టీండీస్తో జరిగిన మ్యాచే మాకు నష్టం కలిగించింది. భారత్తో ఓటమి ఆనంతరం ఆటగాళ్ల పోరాటం అద్భుతం. ఆరంభంలో మాజట్టు కూర్పు కూడా బాగాలేదు. షాహిన్ షా, హారీస్ సోహైల్ వచ్చిన తర్వాతా జట్టు బలపడింది. మా బ్యాట్స్మెన్ ఇమామ్,బాబర్, హ్యారిస్.. అదే విధంగా బౌలర్ల ప్రదర్శన చాలా బాగుంది. ముఖ్యంగా గత నాలుగు మ్యాచ్ల్లో షాహిన్ బౌలింగ్ మాకు మరింత ప్రోత్సాహంగా నిలిచింది. ఈ రోజైతే మరి ముఖ్యం. ఆరు వికెట్లు పడగొట్టాడనుకుంటా. ఇక మా ఆటపై కూర్చుని ఆత్మపరిశీలన చేసుకుంటాం. మా తప్పులను గుర్తించి దానికనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం. మాకు సుమారు రెండు నెలల సమయం దొరికింది. ఇక టోర్నీ ఆసాంతం మద్దతు పలికిన అభిమానులకు ధన్యవాదాలు’ అని సర్ఫరాజ్ తెలిపాడు. ఇక బంగ్లాదేశ్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో 94 పరుగులతో పాక్ విజయం సాధించింది. (చదవండి: పాక్కు ఊరట గెలుపు) -
మా కెప్టెన్కు బాగా కొవ్వెక్కింది : అక్తర్
ఇస్లామాబాద్ : ప్రపంచకప్ తొలి మ్యాచ్లోనే పాకిస్తాన్ చిత్తుగా ఓడటాన్ని ఆ దేశ అభిమానులు, మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. శుక్రవారం వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో పాక్ చిత్తుచిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. విండీస్ బౌలర్లు వరుసగా షార్ట్పిచ్ బంతులతో చెలరేగడంతో బెంబేలెత్తిపోయిన పాక్ 105 పరుగులకే చేతులెత్తేసి ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమితో ఇప్పటికే ఆదేశ అభిమానులు పాక్ జట్టుపై ట్రోలింగ్కు మొదలుపెట్టారు. తాజాగా ఆ జట్టు మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘మా కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ టాస్కి వస్తున్న సమయంలో.. కొవ్వు పేరుకుపోయిన అతని పొట్ట వెలుపలికి వచ్చి అసహ్యంగా కనిపించింది. నేను చూసిన మొదటి అన్ఫిట్ కెప్టెన్ అతనే. అతను తనకున్న కొవ్వుతో కనీసం కదల్లేకపోతున్నాడు. వికెట్ కీపింగ్ సమయంలోనూ ఇబ్బంది పడటం కనిపించింది’ అని అక్తర్ మండిపడ్డాడని పాక్ జర్నలిస్ట్ సాజ్ సాదిక్ పేర్కొన్నారు. ఇక అక్తర్ మాత్రం పాక్ ఆటతీరుపై మాటల్లేవ్ అంటూ కామెంట్ చేశాడు. మ్యాచ్ అనంతరం ‘అయ్యిందేదో అయిపోయింది.. నా ఆలోచనలు భావోద్వేగాలను మరోసారి నెమరువేసుకుంటున్నాను. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లకు మనమంతా అండగా నిలవాలి. టోర్నీ ఆసాంతం మన మద్దతు వారికి అవసరం. మ్యాచ్ ఓడటం మనందరిని నిరాశకు గురిచేసింది. ఇక వారిని మరింత బాధపెట్టకుండా మద్దుతుగా నిలుద్దాం’ అని ట్వీటర్ వేదికగా పిలుపునిచ్చాడు. ఇక ఈ ఓటమిపై పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ స్పందిస్తూ.. ఛాంపియన్స్ ట్రోఫీ 2017లో కూడా భారత్ చేతిలో తొలుత ఓడామని కానీ ఫైనల్లో గెలిచి టైటిల్ సాధించామని గుర్తు చేశాడు. ఈ దారుణ ఓటమి నుంచి తమ ఆటగాళ్లు కోలుకుంటారని, టైటిల్ పోరులో నిలుస్తారనే నమ్మకం తనకు ఉందన్నాడు. ఇంకా 8 మ్యాచ్లున్నాయని, రాణిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. Harsh - Shoaib Akhtar "When Sarfaraz Ahmed came for the toss, his stomach was sticking out and his face was so fat. He's the first captain I've seen who is so unfit. He's not able to move across and he's struggling with wicket-keeping" #CWC19 #PAKvWI — Saj Sadiq (@Saj_PakPassion) May 31, 2019 Ok the match is over. Recollecting my thoughts and emotions. We have to back these boys, they are representing our nation. They need our support throughout the World Cup. #PAKvWI #CWC19 — Shoaib Akhtar (@shoaib100mph) May 31, 2019 -
మీడియం పేసర్నని ఎవడు చెప్పిండు: రసెల్
నాటింగ్హామ్ : ‘ఆండ్రీ రసెల్’.. భారత క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ ఆసాంతం మారుమోగిన పేరు. రస్సెల్ మెరుపులు.. రసెల్ విధ్వంసకరం అంటూ అంతా అతని బ్యాటింగ్ గురించే చర్చ జరిగింది. భారత్లో అతనికి విపరీతమైన అభిమాన గణాన్ని తెచ్చిపెట్టింది. అయితే ఈ వెస్టిండీస్ ఆటగాడి విధ్వంసకరం ఐపీఎల్తోనే ఆగిపోలేదు.. మెగా ఈవెంట్ ప్రపంచకప్లోనూ కొనసాగుతుంది. కానీ ఈసారి మాట్లాడుతోంది మాత్రం అతని బౌలింగ్ గురించి! శుక్రవారం పాక్తో వరల్డ్ కప్ మ్యాచ్లో రసెల్ బౌలింగ్ ఒక అద్భుతం. దాదాపు 146 కిలోమీటర్ల వేగంతో వరుసగా షార్ట్ పిచ్ బంతులు విసిరి అతను పాక్ బ్యాట్స్మెన్ను ఒక ఆటాడుకున్నాడు. ఎక్కడా వేగం తగ్గకుండా, కచ్చితత్వంతో, నిలకడగా షార్ట్ బంతులు వేయడంలో అతని అసాధారణ ప్రతిభ కనిపించింది. రసెల్ వేసిన 18 బంతుల్లో 15 బంతులు షార్ట్ పిచ్వే కావడం విశేషం! అతని మూడు ఓవర్ల స్పెల్ పాక్లో భయం పుట్టించింది. రసెల్ తొలి ఓవర్లో బౌన్సర్ను ఫఖర్ జమాన్ ఆడలేకపోయాడు. అతని హెల్మెట్ గ్రిల్కు తగిలి బంతి వికెట్లపై పడింది. రెండో ఓవర్లో షార్ట్ బంతులను ఆడలేక బాబర్ బెదిరిపోయాడు. మెయిడిన్గా ముగిసిన మూడో ఓవర్లో ఎత్తులో వేగంగా దూసుకొచ్చిన బంతిని ఆడలేక సొహైల్ వికెట్ సమర్పించుకున్నాడు. 3 ఓవర్లలో కేవలం 4 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీసిన రసెల్.. ‘నేను మీడియం పేసర్ను కాదు.. ఫాస్ట్ బౌలర్ను’అని గట్టిగా చెబుతూ ప్రత్యర్థులను పరోక్షంగా హెచ్చరించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘చాలా మంది నేను ఓ బిగ్హిట్టర్నని చెబుతుంటారు. వారందరికీ తెలియనిది ఏమిటంటే నేను ఓ ఫాస్ట్ బౌలర్ను. అందరూ నన్ను తక్కువ అంచనా వేసారు. నన్నందరూ మీడియం పేసర్గా పరిగణిస్తుంటే అసూయ పుట్టేది. నేను బంతి అందుకోవడానికి వచ్చినప్పుడు స్క్రీన్పై ‘మీడియం పేసర్’ అని కనిపించేది. అప్పుడు నాకు తెగ కోపం వచ్చేది. ఎవడు చెప్పిండ్రా నేను మీడియం పేసర్నని గట్టిగా అరవాలనిపించేది.’ అని రసెల్ తన ఆవేదనను వెళ్లగక్కాడు. ఇక గాయంపై స్పందిస్తూ.. ‘చాలా ఏళ్లుగా మోకాలి గాయంతోనే ఆడుతున్నాను. కొన్నిసార్లు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ నేను ఫ్రొఫెషనల్ క్రికెటర్ను కాబట్టి మాములే. గాయం నుంచి ఎలా కోలుకోవాలో నాకు బాగా తెలుసు. మరుసటి మ్యాచ్కు ఇంకా ఐదు రోజులున్నట్లుంది. నా గాయం తగ్గడానికి ఈ సమయం సరిపోతుంది. నాకు మంచి ఫిజియో టీమ్, మసాజ్ టీమ్ ఉంది. వారంతా నా గాయం తగ్గడానికి కృషి చేస్తారు.’ అని రసెల్ చెప్పుకొచ్చాడు. -
పాకిస్తాన్ను చిత్తు చిత్తుగా ఓడించిన వెస్టిండీస్
-
పాక్పై సెటైర్లే సెటైర్లు..
నాటింగ్హామ్: వన్డే వరల్డ్కప్ టోర్నీని పాకిస్తాన్ జట్టు దారుణంగా ఆరంభించింది. వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ 105 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని చవిచూసింది. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన వెస్టిండీస్కు పాకిస్తాన్ దాసోహమైంది. దాంతో పాకిస్తాన్ జట్టుపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. ఏ మాత్రం పోటీ లేకుండా లొంగిపోయిన పాకిస్తాన్ను ఏకిపారేస్తున్నారు నెటిజన్లు. అందులో కొన్ని సెటైర్లను చూద్దాం. ‘నేను మ్యాచ్ చూసే క్రమంలో గ్రౌండ్కు రావడానికి పట్టిన సమయ 125 నిమిషాలు అయితే, పాకిస్తాన్ ఇన్నింగ్స్ మాత్రం 111 నిమిషాల్లోనే ముగిసింది’ అని ఒకరు ఎద్దేవా చేయగా, ఇంగ్లండ్కు పాకిస్తాన్ 38 రోజలు ముందు వస్తే, మ్యాచ్ను 38 నిమిషాల్లో ముగించేశారు’ అని మరొకరు విమర్శించారు. (ఇక్కడ చదవండి: పాకిస్తాన్ చిత్తు చిత్తు) ‘పాకిస్తాన్కు వంద శాతం ప్రదర్శన చేయమని ఇమ్రాన్ ఖాన్ చెబితే, వీళ్లకి వంద పరుగులు చేయమన్నట్లు వినబడిందేమో’ అని మరొక అభిమాని ట్వీట్ చేశారు. ‘ డియర్ పాకిస్తాన్.. ఇది వన్డే వరల్డ్కప్.. టీ20 వరల్డ్కప్ అనుకుంటున్నారేమో.. కాస్త చూసి ఆడండి’ అంటూ మరొకరు సెటైర్ వేశాడు. ఇక పాక్ ఘోర ప్రదర్శనపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ స్పందిస్తూ.. ఇది ఎవరికీ అర్థం కాని పాకిస్తాన్.. అనుమానమే లేదు పాకిస్తాన్ వరల్డ్కప్ గెలుస్తుంది’ అంటూ కాస్త వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. -
వరల్డ్కప్: పాకిస్తాన్ చిత్తు చిత్తు
నాటింగ్హామ్: పెద్దగా అంచనాలు లేకుండా వరల్డ్కప్ సమరానికి సిద్ధమైన వెస్టిండీస్ టోర్నీని ఘనంగా ఆరంభించింది. పాకిస్తాన్ను చిత్తు చిత్తుగా ఓడించి శుభారంభం చేసింది. తొలుత పాకిస్తాన్ను కూల్చేసిన వెస్టిండీస్.. ఆపై గెలుపును సునాయాసంగా అందుకుంది. పాకిస్తాన్ నిర్దేశించిన 106 పరుగుల టార్గెట్ను విండీస్ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. విండీస్ ఓపెనర్ క్రిస్ గేల్(50; 34 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.మరో ఓపెనర్ షాయ్ హోప్(11) నిరాశపరిచగా, డారెన్ బ్రేవో డకౌట్గా పెవిలియన్ చేరాడు. కాగా, గేల్ మాత్రం తనదైన శైలిలో ఆడుతూ ఇన్నింగ్స్ నడిపించాడు. అయితే గేల్ హాఫ్ సెంచరీ సాధించిన తర్వాత మూడో వికెట్గా పెవిలియన్ చేరగా, మిగతా పనిని నికోలస్ పూరన్(34 నాటౌట్; 19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) పూర్తి చేశాడు. పూరన్ ధాటిగా ఆడటంతో విండీస్ 13.4 ఓవర్లలో విజయాన్ని సాధించింది. పాక్ బౌలర్లలో మహ్మద్ ఆమిర్ మూడు వికెట్లు సాధించడం మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : పాకిస్తాన్ను చిత్తు చిత్తుగా ఓడించిన వెస్టిండీస్ (ఇక్కడ చదవండి: 27 ఏళ్ల తర్వాత పాకిస్తాన్..) అంతకుముందు పాకిస్తాన్ 105 పరుగులకే ఆలౌటైంది. ఏ దశలోనే విండీస్ పేస్ బౌలింగ్ ఎటాక్ను ఎదుర్కోలేక మూడంకెల స్కోరును దాటడానికి అష్టకష్టాలు పడింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఇమాముల్ హక్(2) ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరాడు. దాంతో 17 పరుగులకే పాకిస్తాన్ తొలి వికెట్ను కోల్పోయింది. ఆపై పాక్ టాపార్డర్ ఆటగాళ్లలో ఫకార్ జమాన్(22), హరీస్ సోహైల్(8), బాబర్ అజమ్(22), సర్పరాజ్ అహ్మద్(8)లు సైతం నిరాశపరిచారు. విండీస్ బౌలర్ల నుంచి వచ్చే పదునైన బంతులకు పాక్ వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఆటు తర్వాత వచ్చిన ఆటగాళ్లలో వహబ్ రియాజ్(18; 11 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించడంతో పాకిస్తాన్ వంద పరుగుల మార్కును అతికష్టం మీద చేరింది. చివరి వికెట్గా రియాజ్ ఔట్ కావడంతో పాకిస్తాన్ ఇన్నింగ్స్ 21. 4 ఓవర్లలోనే ముగిసింది. విండీస్ బౌలర్లలో థామస్ నాలుగు వికెట్లతో సత్తాచాటగా, జేసన్ హోల్డర్ మూడు వికెట్లతో పాక్ వెన్నువిరిచాడు. ఇక ఆండ్రీ రసెల్ రెండు వికెట్లు తీయగా, కాట్రెల్కు వికెట్ లభించింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘యూనివర్సల్ బాస్ ఖాతాలో మరో రికార్డ్’
నాటింగ్హామ్: వెస్టిండీస్ విధ్వంకసర ఆటగాడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ మరో రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఐసీసీ వన్డే ప్రపంచకప్లో అత్యధిక సిక్సర్లు(39) కొట్టిన ఆటగాడిగా నయా రికార్డు సృష్టించాడు. ప్రపంచకప్ 2019లో భాగంగా స్థానిక ట్రెంట్ బ్రిడ్జ్లో పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో ఈ ఘనత అందుకున్నాడు. పాక్ బౌలర్ హసన్ అలీ వేసిన నాలుగో ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టి దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు డివిలియర్స్(37) పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డును గేల్ అధిగమించాడు. ఇప్పటివరకు ప్రపంచకప్లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో రికీ పాంటింగ్(31), బ్రెండన్ మెకల్లమ్(29), హెర్షల్ గిబ్స్(28), జయసూర్య, సచిన్ టెండూల్కర్(27)లు తరువాతి స్థానాల్లో ఉన్నారు. అంతేకాకుండా ఈ మ్యాచ్లో అర్ద సెంచరీ సాధించడంతో వన్డేల్లో వరుసగా ఆరో అర్దసెంచరీ సాధించిన ఎనిమిదో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో వరుసగా అత్యధిక అర్దసెంచరీలు సాధించిన ఆటగాడిగా మియాందాద్(9) తొలి స్థానంలో ఉన్నాడు. ఇక ఇదే ఊపులో గేల్ మరో రికార్డుపై కన్నేశాడు. ప్రపంచకప్లో విండీస్ దిగ్గజం లారా (1,225) చేసిన పరుగుల్ని గేల్ (944) అధిగమించే అవకాశముంది. -
పాకిస్తాన్ 105 పరుగులకే ఆలౌట్
-
27 ఏళ్ల తర్వాత పాకిస్తాన్..
నాటింగ్హామ్: వరల్డ్కప్ చరిత్రలో పాకిస్తాన్ మరోసారి చెత్త ప్రదర్శన చేసింది. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా వెస్టిండీస్తో మ్యాచ్లో పాకిస్తాన్ 105 పరుగులకే చాపచుట్టేసింది. ఏ దశలోనే విండీస్ పేస్ బౌలింగ్ ఎటాక్ను ఎదుర్కోలేక మూడంకెల స్కోరును దాటడానికి అష్టకష్టాలు పడింది. పాకిస్తాన్ ప్రధాన ఆటగాళ్లు ఇమాముల్ హక్(2), ఫకార్ జమాన్(22), హరీస్ సోహైల్(8), బాబర్ అజమ్(22), సర్పరాజ్ అహ్మద్(8)లు సైతం నిరాశపరచడంతో ఆ జట్టు చెత్త గణాంకాలను నమోదు చేసింది. (ఇక్కడ చదవండి: పాకిస్తాన్ పేకమేడలా..) కనీసం పోరాడాకుండానే చేతులెత్తేసిన పాకిస్తాన్ వంద పరుగుల మార్కును అతికష్టం మీద చేరింది. తద్వారా తమ వరల్డ్కప్ చరిత్రలో రెండో అత్యల్ప స్కోరును పాక్ నమోదు చేసినట్లయ్యింది. అది కూడా 27 ఏళ్ల తర్వాత ఒక వరల్డ్కప్ మ్యాచ్లో పాకిస్తాన్ అత్యల్ప స్కోరుకు పరిమితమైంది. 1992లో అడిలైడ్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్లో పాకిస్తాన్ 74 పరుగులకే ఆలౌట్ కాగా, ఆ తర్వాత స్థానాన్ని తాజా మ్యాచ్ ఆక్రమించింది. వరల్డ్కప్లో పాకిస్తాన్ టాప్-5 అత్యల్ప స్కోర్లు ఇలా ఉన్నాయి.. 74 పరుగులకు ఆలౌట్- 1992లో ఇంగ్లండ్పై 105 పరుగులకు ఆలౌట్-2019లో వెస్టిండీస్పై 132 పరుగులకు ఆలౌట్-1999లో ఆసీస్పై 132 పరుగులకు ఆలౌట్-2007లో ఐర్లాండ్పై 134 పరుగులకు ఆలౌట్- 2003లో ఇంగ్లండ్పై -
పాకిస్తాన్ పేకమేడలా..
నాటింగ్హామ్: పాకిస్తాన్ క్రికెట్ జట్టు అంటేనే నిలకడలేమికి మారుపేరు. ఆ జట్టులో స్టార్ క్రికెటర్లు ఉన్నా అది కాగితాలకే పరిమితం అవుతుందనే విషయం మరోసారి రుజువైంది. వన్డే వరల్డ్కప్లో భాగంగా వెస్టిండీస్తో జరుగుతున్న మ్యాచ్లో పాకిస్తాన్ 105 పరుగులకే కుప్పకూలింది. ఏ దశలోనే విండీస్ పేస్ బౌలింగ్ ఎటాక్ను ఎదుర్కోలేక మూడంకెల స్కోరును దాటడానికి అష్టకష్టాలు పడింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఇమాముల్ హక్(2) ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరాడు. దాంతో 17 పరుగులకే పాకిస్తాన్ తొలి వికెట్ను కోల్పోయింది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : పాకిస్తాన్ 105 పరుగులకే ఆలౌట్ ఆపై పాక్ టాపార్డర్ ఆటగాళ్లలో ఫకార్ జమాన్(22), హరీస్ సోహైల్(8), బాబర్ అజమ్(22), సర్పరాజ్ అహ్మద్(8)లు సైతం నిరాశపరిచారు. విండీస్ బౌలర్ల నుంచి వచ్చే పదునైన బంతులకు పాక్ వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఆటు తర్వాత వచ్చిన ఆటగాళ్లలో వహబ్ రియాజ్(18; 11 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించడంతో పాకిస్తాన్ వంద పరుగుల మార్కును అతికష్టం మీద చేరింది. చివరి వికెట్గా రియాజ్ ఔట్ కావడంతో పాకిస్తాన్ ఇన్నింగ్స్ 21. 4 ఓవర్లలోనే ముగిసింది. విండీస్ బౌలర్లలో థామస్ నాలుగు వికెట్లతో సత్తాచాటగా, జేసన్ హోల్డర్ మూడు వికెట్లతో పాక్ వెన్నువిరిచాడు. ఇక ఆండ్రీ రసెల్ రెండు వికెట్లు తీయగా, కాట్రెల్కు వికెట్ లభించింది. -
విండీస్తో మ్యాచ్: పాకిస్తాన్ విలవిల
నాటింగ్హామ్: వన్డే వరల్డ్కప్లో భాగంగా వెస్టిండీస్తో జరుగుతున్న మ్యాచ్లో పాకిస్తాన్ విలవిల్లాడుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 78 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. పాక్ ఓపెనర్లు ఇమాముల్ హక్(2), ఫకార్ జమాన్(22), హరీస్ సోహైల్(8), బాబర్ అజమ్(22), సర్పరాజ్ అహ్మద్(8), ఇమాద్ వసీం(1), షాదబ్ ఖాన్(0)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరారు. (ఇక్కడ చదవండి: వెస్టిండీస్ 7..పాకిస్తాన్ 3) కాట్రెల్ వేసిన మూడో ఓవర్లో ఇమాముల్ హక్ ఔట్ కాగా, ఆండ్రీ రసెల్ వేసిన ఆరో ఓవర్లో ఫకార్ జమాన్ పెవిలియన్ బాటపట్టాడు. రసెల్ వేసిన 10వ ఓవర్లో సోహైల్ ఔట్ కాగా, ఓష్నే థామస్ వేసిన 14వ ఓవర్లో బాబర్ అజమ్ పెవిలియన్ చేరాడు. ఇక సర్ఫరాజ్ అహ్మద్, ఇమాద్ వసీంలను జేసన్ హోల్డర్ ఔట్ చేయగా, ఓష్నే థామస్ బౌలింగ్లో షాదబ్ ఖాన్ పెవిలియన్ చేరాడు. కట్టుదిట్టమైన వెస్టిండీస్ బౌలింగ్ను ఎదుర్కోలేక ఆపసోపాలు పడుతున్న పాకిస్తాన్ స్వల్ప విరామాల్లో కీలక వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు శిబిరంలో ఒత్తిడి నెలకొంది. -
వెస్టిండీస్ 7..పాకిస్తాన్ 3
నాటింగ్హామ్: వన్డే వరల్డ్కప్లో భాగంగా ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ ముందుగా పాకిస్తాన్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఇప్పటివరకూ ప్రపంచకప్లో ఈ రెండు జట్లు పది మ్యాచ్ల్లో ఎదురుపడగా విండీస్ ఏడింటిలో నెగ్గగా, పాకిస్తాన్కు మూడింటిలో విజయం సాధించింది. మరొకవైపు జేసన్ హోల్డర్ నేతృత్వంలో ప్రస్తుత వెస్టిండీస్ బలంగానే ఉంది. నాలుగు నెలల క్రితం సొంతగడ్డపై ఇంగ్లండ్ను వన్డేల్లో నిలువరించింది. నిలకడగా ఆడే షై హోప్, దూకుడుగా బాదే హెట్మైర్ జట్టుకు మరింత బలాన్ని చేకూర్చారు. గేల్కు తోడుగా ఇన్నింగ్స్ ప్రారంభించే ఎవిన్ లూయిస్ సైతం భారీ షాట్లతో హడలెత్తించగలడు. మిడిలార్డర్లో డారెన్ బ్రావో ఫామ్ అందుకోవాల్సి ఉంది. రోచ్, కాట్రెల్ ప్రధాన పేసర్ల పాత్ర పోషించనున్నారు. ఇక బౌలింగ్ ఆల్రౌండర్లు హోల్డర్, రసెల్ పాత్ర కీలకం కానుంది. (ఇక్కడ చదవండి: ఈ క్యాచ్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..) ఇదిలా ఉంచితే పాకిస్తాన్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వరల్డ్కప్ ప్రాక్టీస్ మ్యాచ్ సహా గత పది వన్డేల్లో పాక్ ఓటమి పాలైంది. మిడిలార్డర్ నుంచి మెరుగైన ప్రదర్శన లేకపోవడం ఒక కారణమైతే, బౌలింగ్లో పదును తగ్గడం మరో కారణం. ఓపెనర్లు ఇమాముల్ హక్, ఫఖర్ జమాన్, వన్డౌన్ బ్యాట్స్మన్ బాబర్ ఆజమ్ ఫామ్తోనే ఆ జట్టు అడపా దడపా విజయాలు సాధిస్తుంది. ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లో భారీ పరుగులు చేసినా పేలవమైన బౌలింగ్ కారణంగా సిరీస్ను పాక్ కోల్పోయింది. తుది జట్లు పాకిస్తాన్ సర్ఫరాజ్ అహ్మద్(కెప్టెన్), ఇమాముల్ హక్, ఫకార్ జమాన్, బాబర్ అజమ్, హరీస్ సోహైల్, మహ్మద్ హఫీజ్, ఇమాద్ వసీం, షాదబ్ ఖాన్, హసన్ అలీ, మహ్మద్ అమిర్, వహబ్ రియాజ్ వెస్టిండీస్ జేసన్ హోల్డర్(కెప్టెన్), క్రిస్ గేల్, షాయ్ హోప్, డారెన్ బ్రేవో, హెట్మైర్, నికోలస్ పూరన్, ఆండ్రీ రసెల్, కార్లోస్ బ్రాత్వైట్, ఆశ్లే నర్స్, షెల్డాన్ కాట్రెల్, ఓష్నే థామస్