pig
-
జన్యుమార్పిడి పంది కిడ్నీ గ్రహీత ఆకస్మిక మృతి
బోస్టన్: ప్రపంచంలో తొలిసారిగా జన్యుమార్పిడి చేసిన పంది మూత్రపిండాన్ని అమర్చుకున్న వ్యక్తి ఆకస్మికంగా మృతి చెందారు. అమెరికాలోని వేమౌత్ పట్టణంలో నివసించే 62 ఏళ్ల రిచర్డ్ ‘రిక్’ స్లేమాన్కు మసాచుసెట్స్ జనరల్ ఆస్పత్రిలో మార్చి నెలలో వైద్యులు విజయవంతంగా కిడ్నీని అమర్చారు. అది కనీసం రెండు సంవత్సరాలపాటు ఎలాంటి సమస్యల్లేకుండా పనిచేస్తుందని వైద్యులు ఆనాడు తెలిపారు. అయితే శనివారం ఆయన హఠాన్మరణం చెందారని వైద్యులు వెల్లడించారు. ట్రాన్స్ప్లాంట్ సర్జరీ వల్లే ఆయన మృతిచెందినట్లు ఎలాంటి ఆధారాలు ఇంకా లభ్యంకాలేదని వైద్యులు స్పష్టంచేశారు. సొంత కిడ్నీ పాడవడంతో 2018 డిసెంబర్లోనే స్లేమాన్కు మరో మనిషి కిడ్నీ అమర్చారు. అయితే ఐదేళ్ల తర్వాత అది నెమ్మదిగా పాడవుతూ వచి్చంది. దీంతో గత ఏడాది నుంచి మళ్లీ డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో వైద్యులు ఈసారి మరో ప్రత్యామ్నాయంలేక జన్యుమారి్పడి పంది కిడ్నీ అమర్చేందుకు ఆయనను ఒప్పించి రెండు నెలల క్రితం అమర్చారు. -
రోగికి పంది కిడ్నీ మార్పిడి.. అంతలోనే విషాదం
అమెరికా మసాచుసెట్స్ జనరల్ ఆస్పత్రిలో విషాదం చోటు చేసుకుంది. మసాచుసెట్స్ పంది కిడ్నీని ట్రాన్స్ప్లాంట్ చేసిన రిచర్డ్ స్లేమాన్ (62) మరణించారు.ఇంగ్లాండ్ వేమౌత్ నగరానికి చెందిన రిచర్డ్ స్లేమాన్ (62) కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. అయితే 2018లో వైద్యులు అతనికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేశారు. కొంత కాలం బాగున్నా.. ఆ తర్వాత కిడ్నీ సమస్య మొదటికి రావడంతో డయాలసిస్ చేయాల్సి వచ్చింది. దీంతో అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. ఫలితం లేకపోవడంతో వైద్యులు స్లేమాన్కు పంది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సలహా ఇచ్చారు.మసాచుసెట్స్ జనరల్ ఆస్పత్రి వైద్యులుఈ ఏడాది మార్చి 16న అమెరికా మసాచుసెట్స్ జనరల్ ఆస్పత్రి వైద్యులు నాలుగు గంటల శ్రమించి స్లేమాన్కు పంది కిడ్నీని అమర్చారు. ఆపరేషన్ అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ తరుణంలో ఏప్రిల్ 11న (నిన్న) స్లేమాన్ మరణించినట్లు కుటుంబసభ్యులు, మసాచుసెట్స్ వైద్యులు తెలిపారు.ఆధారాలు లేవుఈ సందర్భంగా పందికిడ్నీని అమర్చడం వల్లే స్లేమాన్ మరణించినట్లు ఆధారాలు లేవని వైద్యులు వెల్లడించారు. కుటుంబసభ్యులు తమకు స్లేమాన్తో మరికొంత కాలం పాటు తమతో గడిపేందుకు కృషి చేసిన వైద్యులకు కృతజ్ఞతలు చెప్పారు.గతంలో గతంలో బ్రెయిన్ డెడ్ అయి కృత్రిమ లైఫ్ సపోర్ట్పై కోలుకోలేని స్థితిలో ఉన్న వ్యక్తికి పంది కిడ్నీని అమర్చారు. న్యూయార్క్ యూనివర్సిటీ లాన్గోన్ హెల్త్ మెడికల్ సెంటర్లో వైద్యులు ఈ ఆపరేషన్ చేశారు. రెండు నెలల వ్యవధిలోనే బాధితుడు మరణించాడు. స్లేమాన్ మాత్రం తాను రెండేళ్లు జీవిస్తానని ధీమా వ్యక్తం చేశారు. తనకు పంది కిడ్నీని అమర్చాలని కోరడంతో మసాచుసెట్స్ వైద్యుల్ని బాధితునికి పంది కిడ్నీని అమర్చారు. కానీ స్వల్ప వ్యవధిలో స్లేమాన్ మరణించడం వైద్య చరిత్రలో విషాదం నెలకొంది. -
పంది గుండె అమర్చిన మరో వ్యక్తి మృతి
పంది గుండెను అమర్చిన మరో వ్యక్తి మరణించాడు. లారెన్స్ ఫాసెట్(58) అనే వ్యక్తికి సెప్టెంబర్ 20న జన్యుపరంగా మార్పులు చేసిన పంది గుండెను ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. దాదాపు 40 రోజుల తర్వాత గుండె వైఫల్యం చెందడంతో లారెన్స్ మృతి చెందారని మేరీల్యాండ్ మెడికల్ స్కూల్ వైద్యులు తెలిపారు. గుండె ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన నెలరోజుల వరకు చక్కగా పనిచేసిందని వెల్లడించాడు. ఆ తర్వాత గుండె పనితీరు క్షీణించడం మొదలయ్యిందని పేర్కొన్నారు. 'గుండె మార్పిడి చేసిన తర్వాత లారెన్స్ ఆరోగ్యంగా గడిపారు. ఫిజికల్ థెరపీలో కూడా పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేశారు. భార్య యాన్తో కార్డ్స్ కూడా ఆడేవారు. కానీ ఇటీవల గుండె పనితీరులో వైఫల్యం కనిపించింది. మానవ అవయవాల మార్పిడి విధానంలో ఇది అతి క్లిష్టమైన పద్దతి. ఆరు వారాలపాటు ఆరోగ్యంగా గడిపారు. కానీ సోమవారం ప్రాణాలు కోల్పోయారు.' అని మేరీల్యాండ్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. లారెన్స్ నావీలో పనిచేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్లో టెక్నీషియన్గా రిటైర్ట్ అయ్యారు. గుండె సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటంతో హర్ట్ ట్రాన్స్ప్లాంటేషన్కి మేరీల్యాండ్ ఆస్పత్రి వైద్యులు నిరాకరించారు. ఎట్టకేలకు గుండె మార్పిడి చేయగా ఇన్నాళ్లు బతికారని లారెన్స్ భార్య యాన్ తెలిపారు. జంతువుల అవయవాలను మానవులకు మార్పిడి చేసే పద్దతిని జెనోట్రాన్స్ప్లాంటేషన్ అని పిలుస్తారు. ఇది మానవ అవయవ దాతల కొరత సమస్యను తగ్గిస్తుంది. ఈ ప్రక్రియ సవాలుగా మారింది. రోగి రోగనిరోధక వ్యవస్థ మార్పిడి అవయవం పనితీరుకు సరిపోలడం క్లిష్టతరమైంది. పంది భాగాలను జన్యుపరంగా మార్పు చేయడం వల్ల మానవ అవయవాలలాగా పనిచేస్తాయని వైద్యులు భావించారు. ఇదీ చదవండి: హోటల్కు వచ్చిన మహిళకు చేదు అనుభవం -
పంది కిడ్నీతో కోతికి రెండేళ్ల ఆయుష్షు.. మరో మెట్టెక్కిన ఆధునిక వైద్యం!
మానవులకు జంతు అవయవ మార్పిడి చికిత్సలో వైద్యశాస్త్రం మరోముందడుగు వేసింది. జన్యు ఇంజనీరింగ్ చేసిన పంది కిడ్నీని అమర్చిన ఒక కోతి మరో రెండు సంవత్సరాల ఆయుష్షు పోసుకుంది. మానవులకు జంతు అవయవ మార్పిడి విషయంలో జరుగుతున్న ప్రయోగ పరిశోధనలలో ఇదొక మైలురాయి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నేచర్ జర్నల్లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో వెల్లడించిన వివరాల ప్రకారం పరిశోధకులు పందులలో జన్యు సవరణపై సాగిస్తున్న ప్రయోగాలలో మరింత పురోగతి సాధించారు. జంతువులలో జన్యుమార్పిడి చేసిన అవయవాలను అమర్చినప్పుడు, ఆ అవయవాలు నిద్రాణమైన వైరస్లను కలిగి ఉండవని, మార్పిడి అనంతరం ఆ నూతన అవయవాలు అంతర్గత దాడికి గురికావని శాస్త్రవేత్తలు గమనించారు. మానవేతర జీవులలో అవయవ మార్పిడి జరిగినప్పుడు ఆ మార్పిడి అవయవం సురక్షితంగా ఉందని, ఆ జీవికి లైఫ్ సపోర్ట్ అందిస్తుందని నూతన ప్రయోగ ఫలితాలలో తేలిందని యూఎస్ బయోటెక్ సంస్థ ఇజెనెసిస్లోని మాలిక్యులర్ బయాలజిస్ట్ వెన్నింగ్ క్విన్ తెలిపారు. జినోట్రాన్స్ప్లాంటేషన్ అనేది వివిధ జాతుల మధ్య ఒక అవయవాన్ని మార్పిడి చేసే విధానం. దీని ద్వారా బాధితులకు అవయవదానంతో ఉపశమనం లభిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక్క అమెరికాలోనే లక్షకు పైగా బాధితులు అవయవదానం కోసం ఎదురుచూస్తున్నవారి జాబితాలో ఉన్నారు. అవయవదానం కోసం ఎదురుచూస్తూ, ఫలితం లేకపోవడంతో ప్రతిరోజూ 17 మంది మృతి చెందుతున్నారు. అవయవ మార్పిడి చికిత్సల పరిశోధనల్లో సైన్స్ మరింతగా అభివృద్ధి చెందుతోంది. గత ఏడాది వైద్యులు జన్యు ఇంజనీరింగ్ చేసిన పంది గుండెను 57 ఏళ్ల వ్యక్తికి మార్పిడి చేశారు. అయితే ఆ పంది గుండె గ్రహీత చికిత్స జరిగిన రెండు నెలల తర్వాత మరణించాడు. ఇదేవిధంగా గత నెలలో మధ్య వయస్కుడైన ఒక వ్యక్తికి కూడా పంది గుండెను అమర్చారు. బ్రెయిన్ డెడ్ స్థితికి చేరిన మనుషులలో అవయవమార్పిడి చేసేందుకు జెనోట్రాన్స్ప్లాంట్ సహరిస్తుంది. తాజా పరిశోధనలో జెనోట్రాన్స్ప్లాంట్ చేసిన అవయవాల మార్పిడి కారణంగా కోతుల జీవితకాలం పెరిగినట్లు స్పష్టమయ్యింది. మొత్తం 69 జన్యువులను పరిశోధకులు పరిశీలించగా, వాటిలో ఎక్కువశాతం గ్రహీత రోగనిరోధక వ్యవస్థ అవయవంపై దాడి చేయవని వెల్లడయ్యింది. ఇందుకోసం పంది జన్యువులో నిద్రాణమైన వైరస్లను సవరించారు. అవి కోతుల రోగనిరోధక వ్యవస్థను నిర్వీర్యం చేయకుండా ఉండేందుకు ఔషధ చికిత్స చేశారు. అలాగే పంది అవయవాలలో మానవ జన్యువులను ప్రవేశపెట్టారు. మానవ జన్యువులు ప్రవేశపెట్టని మూత్రపిండాలు కలిగిన కోతులలో అవయవ మార్పిడి చేసినప్పుడు ఆ కోతులు చికిత్స అనంతరం సగటున 24 రోజులు మాత్రమే జీవించాయి. మొత్తం 21 కోతులపై ఈ ప్రయోగాలు జరిగాయి. అయితే మానవ జన్యువులను ప్రవేశపెట్టిన మూత్రపిండాలు కలిగిన కోతులలో అవయవ మార్పిడి చేసినప్పుడు అవి సగటున అధికంగా 176 రోజులు జీవించాయని తేలింది. అలాగే ఈ ప్రయోగాలలో వినియోగించిన ఐదు కోతులు ఒక సంవత్సరానికి మించి జీవించాయని, ఒకకోతి ఏకంగా రెండేళ్లు ఎటువంటి అనారోగ్య సమస్య లేకుండా జీవించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. గతంలో జెనోట్రాన్స్ప్లాంటేషన్ ప్రయోగాలకు సాధారణ పందులను ఉపయోగించినప్పటికీ, నూతన పరిశోధనల్లో మినీయేచర్ పిగ్లను ఉపయోగించారు. యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్కు చెందిన జెనోట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ ముహమ్మద్ మొహియుద్దీన్ మాట్లాడుతూ మనుషులలో జంతు అవయవ మార్పిడి చికిత్స విజయవంతం అయ్యేందుకు, ఆ అవయవాల జన్యువును మరింత సవరించాల్సిన అవసరం ఉందన్నారు. అవయవ దానం కోసం ఎదురు చూస్తున్న బాధితులకు ఈ ప్రయోగాలు వరం లాంటివని పేర్కొన్నారు. అయితే ఇది సాకారం అయ్యేందుకు మరికొంత కాలం పడుతుందని అన్నారు. ఇది కూడా చదవండి: ప్రపంచాన్ని తాకిన ‘వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్’ ఘుమఘుమలు -
అమెరికాలో మనిషికి పంది గుండె
వాషింగ్టన్: అమెరికాలోని మేరీలాండ్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తికి డాక్టర్లు పంది గుండె అమర్చారు. అతడి ప్రాణం కాపాడారు. ఇలాంటి అరుదైన చికిత్స జరగడం అమెరికాలో ఇది రెండోసారి కావడం విశేషం. బాధితుడు లారెన్స్ ఫాసెట్ నావికాదళంలో పనిచేసి పదవీ విరమణ పొందాడు. అతడి వయసు ప్రస్తుతం 58 ఏళ్లు. గుండె వైఫల్యంతో బాధపడుతున్నాడు. మరణానికి దగ్గరయ్యాడు. ఇతర వ్యాధులు కూడా ఉండడంతో సంప్రదాయ గుండె మారి్పడికి అవకాశం లేకుండాపోయింది. దాంతో ‘యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ మెడిసిన్’ డాక్టర్లు కష్టతరమైన ప్రయోగానికి సిద్ధమమయ్యారు. లారెన్స్ ఫాసెట్కు ఇటీవలే పంది గుండెను అమర్చారు. ఈ చికిత్స విజయవంతమైంది. రెండు రోజుల విశ్రాంతి తర్వాత అతడి ఆరోగ్యం మెరుగైంది. ఇదే ‘యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ మెడిసిన్’ వైద్యులు గత ఏడాది పంది గుండెను డేవిట్ బెనెట్ అనే వ్యక్తికి అమర్చారు. కానీ, అతడు రెండు నెలలు మాత్రమే జీవించాడు. ఈ విషయం తెలిసి కూడా లారెన్స్ ఫాసెట్ శస్త్రచికిత్సకు సిద్ధపడ్డాడు. తాను నిండు నూరేళ్లు జీవిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. అమెరికాలో మానవ అవయవాలకు కొరత ఏర్పడింది. దేశంలో గత ఏడాది కేవలం 4,100 గుండె మార్చిడి చికిత్సలు చేశారు. గుండెతోపాటు ఇతర అవయవాల కోసం పెద్ద సంఖ్యలో బాధితులు ఎదురు చూస్తున్నారు. -
మానవుడికి పంది కిడ్నీ..ప్రయోగం విజయవంతం
అవయవ దానం అనేది ఓ సమస్యాత్మకంగా మారింది. దాతలు దొరకక, బ్రెయిన్ డెడ్ వ్యక్తుల నుంచి అవయవాల సేకరణ పరిమితంగానే ఉండటం తదితర కారణాల దృష్ణ్యా ప్రస్తుతం అవయవాల మార్పిడి ఓ అర్థంకానీ ప్రశ్నలా ఉంది. ఆ ప్రశ్నకు సమాధానమే కాదు ఎన్నాళ్లుగా చిక్కుముడి వీడని ప్రశ్నలా వేధిస్తున్న సమస్యకు సమాధానం దొరికిందనే కొత్త ఆశని ఇచ్చింది. ఇంతవరకు పంది కిడ్నీని మనిషికి అమర్చి చేసిన ప్రయోగాల్లో చాలా వరకు ఒకటి రెండు రోజుల వరకే పనిచేస్తే ..ఈసారి మాత్రం ఏకంగా రెండు నెలలు విజయవంతంగా పనిచేసి రికార్డు సృష్టించింది. అదికూడా బ్రెయిన్డెడ్ మనిషిలో విజయవంతమవ్వడం పరిశోధకులకు సరికొత్త ఆశలను రేకెత్తించింది. ఈ పరిశోధన యూఎస్లో విజయవంతం అయ్యింది. మానవునిలో జన్యుపరంగా మార్పు చెందిన పంది కిడ్నీ సుదీర్ఘకాలం పనిచేయడం ఇదే తొలిసారి. ఈ మేరకు డాక్టర్ మోంట్గోమెరీ వైద్య బృందం మాట్లాడుతూ..ఈ ప్రయోగం అవయకొరత సమస్యను పరిష్కరించడంలో సహాయపడుతుందని ఆనందంగా చెప్పారు. తాము మారిస్ మిల్లర్ అనే బ్రెయిన్ డెడ్ వ్యక్తి మృతదేహాన్ని వెంటిలేటర్పై ఉంచి ఈ ప్రయోగాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. రెండు నెలలపాటు అతడిని వెంటిలేటర్పై ఉంచి మరీ ఆ పంది కిడ్నీ ఎలా పనిచేస్తుందో పరీక్షించినట్లు తెలిపారు. ఒక నెలపాటు విజయవంతంగా పనిచేసిందని ఆ తదుపరి నెమ్మదిగా మార్పులు కనిపించడం మొదలైంది. రోగనిరోధక వంటి మందుల చికిత్సతో కిడ్నీ పనితీరుని పొడిగించేలా చేశామని తెలిపారు. భవిష్యత్తులో ఇలా జంతువుల అవయవాల ట్రాన్స్ప్లాంట్ విజయవంతమవుతుందనే ఆశను ధృవీకరించింది. దీనిపై మరింతగా ప్రయోగాలు చేసి కృషి చేయాల్సిన అవసరాన్ని నొక్కి తెలిపిందని పరిశోధకులు చెబుతున్నారు. నిజానికి సదరు వ్యక్తి మిల్లర్ ఆకస్మికంగా కుప్పకూలి బ్రెయిన్డెడ్ అయ్యారు. అయితే క్యాన్సర్ కారణంగా అతడి అవయవాలను దానం చేయడం వీలుపడలేదు. అతని సోదరి మేరి మిల్లర్ డఫీ, పిగ్ కిడ్నీ ప్రయోగం కోసం అతడి మృతదేహాన్ని దానం చేయాలనే నిర్ణయాన్ని చాలా భారంగా తీసుకుంది. జూలై 14న మిల్లర్ 58వ పుట్టిన రోజుకు కొద్దిరోజుల ముందు పంది కిడ్నీని మిల్లర్కి మార్పిడి చేసి పరీక్షించడం ప్రారంభించారు. జంతువులోని థైమస్ గ్రంథికి రోగనిరోధక కణాలతో పనిచేయగలిగేలా పరిశోధకులు శిక్షణ ఇచ్చారు. దీంతో మొదటి నెలంతా చాలా విజయవంతంగా ఆ కిడ్నీ పనిచేసింది. ఇక రెండో నెల నుంచి మూత్రంలో తగుదల వంటి మార్పులు ప్రారంభమయ్యాయి. వైద్యులు అందుకు అనుగుణంగా చికిత్స అందించి అది పనిచేసేలా చికిత్స అందించారు. ఈ ప్రయోగం జన్యుపరంగా మార్పు చెందని పందుల నుంచి అవయవాలను ట్రాన్స్ప్లాంట్ చేయగలమనే నమ్మకాన్ని అందించింది. వైద్యలు గత మూడు నెలలుగా చేసిన ఈ ప్రయోగం విజయవంతంగా ముగిసింది. ఇక మిల్లర్ మృతదేహం నుంచి పంది కిడ్నీని తొలగించి దహనసంస్కారాల నిమిత్తం అతడి బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. అయితే ఇలా జంతువుల అవయవాల మార్పిడి కారణంగా శోషరస కణుపులు, జీర్ణవ్యవస్థలో ఏవైనా సమస్యలు వస్తాయా? అనేదాని గురించి మరింతగా పరిశోధనలు చేయాల్సి ఉందన్నారు. అందుకోసం జీర్ణవ్యవస్థలోని సుమారు 180 వేర్వేరు కణజాల నమూనాలను పరిశీలించాల్సి ఉందని కూడా అన్నారు. చావు అంచుల మధ్య కొట్టుమిట్లాడుతున్న వారికి అవయవదానం ..కొత్త ఊపిరి పోసి జీవితంలో రెండో అవకాశం లభించేలా చేయడమే లక్ష్యంగా ఈప్రయోగాలు చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. (చదవండి: చిన్నారుల్లో బ్రాంకియోలైటిస్ వస్తే...? ముఖ్యంగా అలాంటి పిల్లలు..) -
NYU Langone: పంది కిడ్నీ పని చేసింది
న్యూయార్క్: కిడ్నీ మార్పిడి చరిత్రలో పెద్ద ముందడుగు. అమెరికాలో న్యూయార్క్ లోని ఎన్ వైయూ లాంగ్ వన్ హెల్త్ సంస్థ వైద్యులు ఓ బ్రెయిన్ డెడ్ రోగికి పంది కిడ్నీ అమర్చగా అది ఏకంగా నెల రోజుల పాటు చక్కగా పని చేసింది. మనిషికి పంది కిడ్నీ ఇన్ని రోజుల పాటు పని చేయడం ఇదే తొలిసారి. గతంలో న్యూయార్క్ వర్సిటీ, అలబామా వర్సిటీ చేసిన కిడ్నీ మారి్పడులు రెండు మూడు రోజుల పాటు మాత్రమే పని చేశాయి. అన్నీ కుదిరితే త్వరలో సాధారణ రోగులకు కూడా పంది కిడ్నీ అమర్చుతామని వైద్య బృందం అంటోంది. అయితే మనిషి వ్యాధి నిరోధకతకు పంది కిడ్నీ ఎలా పని చేస్తుందో కూడా చూస్తామని చెబుతోంది. అందుకోసం రెండో నెల కూడా కిడ్నీని అలాగే ఉంచి చూడనున్నారు. -
14 పందులతో మొదలు నేడు 150కి సంఖ్య.. కిలోకు 280 చొప్పున అమ్మకం
తక్కువ కాలంలో మంచి నికరాదాయం పొందాలనుకుంటే సీమ పందుల పెంపకం చేపట్టడం ఒక్కటే మార్గం అంటున్నారు యువ మహిళా రైతు రాచెల్లి అనూష. తెలంగాణ రాష్ట్రం జిల్లా కేంద్రం సిద్దిపేటకు 12 కిలో మీటర్ల దూరంలోని మల్యాలకు చెందిన అనూష సీమ పందులను పెంచుతూ చక్కటి ఆదాయాన్ని గడిస్తున్నారు. పట్టభద్రురాలైన అనూష తన భర్త మల్లేశం ప్రోత్సాహంతో తన నాలుగు ఎకరాల పొలంలో మూడేళ్ల క్రితం నుంచి స్వయంగా వ్యవసాయం చేస్తున్నారు. ఈ క్రమంలో అనేక కష్టనష్టాల పాలయ్యారు. ఆవులు, గేదెలు, గొర్రెలు, నాటుకోళ్లు, కంజు పిట్టలు, కుందేళ్లు, కొర్రమీను చేపలు.. ఏవి పెంచినా కలిసిరాలేదు. మూడేళ్లు తిప్పలు పడిన తర్వాత వెటర్నరీ కళాశాలకు చెందిన నిపుణులు డా. ప్రసాద్, డా. విద్య సలహా మేరకు సీమ పందుల ఫాంను ఏర్పాటు చేసుకొని చక్కని ఆదాయం పొందుతున్నారు. పందులు పెంచటం ఏమిటని బంధువులు వారించినా పట్టించుకోకుండా భర్త సహకారంతో 2020 మార్చిలో 14 సీమ పందులను కొని తెచ్చుకొని పెంపకం ప్రారంభించారు. లార్ట్ వైట్ యార్క్ షేర్, ల్యాండ్రెస్, డ్యూరార్, లార్జ్ బ్లాక్ యార్క్ షేర్ వంటి సంకర జాతి పందులను ఆమె పెంచుతున్నారు. ఫాంలో ఇప్పుడు వాటి సంఖ్య 150కి పెరిగింది. ఫాం సమీపంలోనే ఇంటిని నిర్మించుకొని నిరంతరం తానే స్వయంగా అన్ని పనులూ చేసుకోవటం ద్వారా అనూష చక్కటి ఫలితాలు పొందుతున్నారు. మార్కెటింగ్ సమస్య లేదని అంటూ.. కర్ణాటక, అస్సాం తదితర రాష్ట్రాల నుంచి కూడా వ్యాపారులు వచ్చి సీమ పందులను కొనుక్కెళ్తున్నారని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక జిల్లాల నుంచి రైతులు వచ్చి ఫాంను చూసి, పిల్లలను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారన్నారు. వారానికో రోజు పంది మాంసాన్ని కిలో రూ. 280 చొప్పున ఫాం దగ్గరే విక్రయిస్తున్నారు. మార్కెటింగ్ సమస్య లేదు! సీమ పందులకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. పోటీ తక్కువ. శ్రమ తక్కువ. ఆదాయం ఎక్కువ. మార్కెటింగ్ సమస్య లేదు. ఒక ఎకరం భూమి సాగు చేస్తే ఎంత ఆదాయం వస్తుందో రెండు పందులను పెంచితే అంతే ఆదాయం వస్తుంది. దాణా, గడ్డి రోజుకు రెండు సార్లు వేయాలి. ఎప్పుడైనా వీలుకాకపోతే సాయంత్రం వేయకపోయినా పర్వాలేదు. 200 పందులను ఒక్కరే చూసుకోవచ్చు. పందులను సాదుకుంటూ వ్యవసాయం కూడా చేసుకోవచ్చు. – రాచెల్లి అనూష, యువ రైతు 75 రోజుల్లో 20 కేజీలు కోతకు అమ్మే పందులను, బ్రీడింగ్ కోసం అమ్మే పందులను ప్రత్యేక షెడ్లు వేసి వేర్వేరుగా పెంచుతున్నారు. పంది పిల్ల 75 రోజుల్లో 20 కేజీల బరువు పెరుగుతుందని అనూష వివరించారు. బ్రీడింగ్ కోసం 20 కేజీల బరువు పెరిగిన తర్వాత విక్రయిస్తున్నారు. మాంసం కోసం కోతకైతే సుమారుగా 80 కిలోలకు పైగా బరువు పెరిగిన తర్వాత విక్రయిస్తున్నారు. బ్రీడింగ్ పందులకు గడ్డితో పాటు రెండు పూటలా దాణా పెడుతున్నారు. కోతకు వెళ్లే పందులకు హోటళ్లలో మిగిలిన ఆహారాన్ని కూడా మేపుతున్నారు. పశు వైద్యుడు డా. అభిలాష్ సూచనల మేరకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. అనేక వ్యాక్సిన్లతోపాటు, ఇతర ఇంజక్షన్లను క్రమం తప్పకుండా ఇస్తూ నాణ్యమైన మేతను అందిస్తే సీమపందుల పెంపకం సులభమేనని అంటారు అనూష భర్త మల్లేశం (97044 99873). – గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, సిద్దిపేట ; ఫోటోలు: కె. సతీష్ కుమార్ (చదవండి: సీఎం జగన్ స్పూర్తిగా.. మహారాష్ట్రలో లక్షా 11వేల మొక్కలు నాటే కార్యక్రమం) -
వెరైటీ వైద్యం.. ఆ రెండు పందులతో వాకింగ్ చేస్తే ఆనందం, ఆరోగ్యం!
పంది అనగానే.. కొంతమంది దాని రూపం చూసి అసహ్యించుకుంటే, మరి కొంతమంది దేవుని వరాహావతారంగా భావించి గౌరవిస్తుంటారు. కానీ, ఇంగ్లండ్కు చెందిన జూలియా బ్లేజర్ మాత్రం వాటిని డాక్టర్లుగా భావిస్తుంది. తన పెంపుడు పందులైన ‘హాజెల్’, ‘హోలీ’లే ఆమె అధీనంలోని డాక్టర్లు. అంతేకాదు, 2015లో ‘గుడ్ డే అవుట్’ పేరుతో యూనెస్కోలోని బ్రీకాన్స్ నేషనల్ పార్క్లో చికిత్స కేంద్రాన్ని కూడా నిర్మించింది. ఇక్కడే రోజూ హాజెల్, హోలీ అనే ఈ రెండు వరాహాలు మనుషులకు చికిత్స అందిస్తుంటాయి. నిజం, జూలియాకు ఒకప్పుడు ఊపిరి ఆడనంతగా ఒత్తిడి.. ఉక్కిరిబిక్కిరి చేసినప్పుడు ఈ రెండు పందులే ఆమెకు ఊరటనిచ్చాయి. కోల్పోయిన తన ప్రశాంతతను తిరిగి తీసుకొచ్చాయి. రోజూ వాటితో వాకింగ్ చేస్తే, తన మనసు కుదుట పడేదట! వరాహాలతో తాను పొందిన ప్రయోజనాన్ని గుర్తించిన వెంటనే, తనలాగే బాధపడే వారికి ‘పిగ్ వాకింగ్ థెరపీ’ పేరుతో చికిత్స అందించాలని నిర్ణయించుకుంది. అలా ఇప్పటి వరకు ఎంతోమంది ఈ రెండు పందులతో షికారుకెళ్లి ఆనందం, ఆరోగ్యం పొందుతున్నారు. ఇక్కడ కేవలం పందులే కాదు, గాడిదలు, గుర్రాలు కూడా వైద్యం అందిస్తున్నాయి. ఒక్కో రకం చిక్సితకు గంటకు రూ. 4 వేల నుంచి రూ. 14 వేల వరకు తీసుకుంటారు. మీకు కూడా ఈ వైద్యం కావాలంటే మరో ఆరునెలలు వేచి చూడాల్సిందే. ఇప్పటికే, ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఉన్న స్లాట్లన్నీ బుక్ అయిపోయాయి. చదవండి: సూర్యుడికి పంచ్.. వీళ్లకి పోలీసుల పంచ్ -
టీ–17 పందులు సూపర్.. నెలకు లక్షకు పైగా నికరాదాయం!
తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఆర్జించే సీమ పందుల పెంపకంపై రైతుల్లో ఆసక్తి పెరుగుతోంది. తిరుపతిలో శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న పందుల పరిశోధనా కేంద్రం ఎస్వీవీయూ టీ–17 రకం సీమ పందుల జాతిని అభివృద్ధి చేసింది. శాస్త్రీయ పద్ధతులను పాటిస్తూ ఈ జాతి పందులను పెంచుతున్న రైతులు అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. యువ రైతులు సైతం ఆసక్తి చూపుతుండటం విశేషం. పంది మాంసాన్ని ‘పోర్క్’ అంటారు. కండ (హమ్), వారు (బాకన్), సాసెజ్, నగ్గెట్స్, ప్యాట్టీస్, పోర్క్ పచ్చడి, బ్యాంబూ పోర్క్ల రూపంలో సీమ పంది ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తున్నారు. వీటిలో మాంసకృత్తులు, విటమిన్లతో పాటు ఓలిక్ లినోలిక్ ఫాటీయాసిడ్స్ అధికంగా ఉంటాయి. పిల్లలు, వృద్ధులు, క్రీడాకారులకు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి సీమ పంది మాంసం ఉత్పత్తులు ఉపయోగపడతాయని ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ నిపుణులు చెబుతున్నారు. పందుల పెంపకాన్ని లాభదాయకం చేయడంతో పాటు కొత్త పంది రకాల అభివృద్ధికి తిరుపతిలోని పరిశోధనా కేంద్రం గడిచిన ఐదు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తోంది. స్థానికంగా లభ్యమయ్యే వివిధ వ్యవసాయ ఉప ఉత్పత్తులను 10–15 శాతం వరకు పందుల దాణా తయారీకి వినియోగించి ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు. పందులకు సంక్రమించే మేంజ్ అనే చర్మ వ్యాధికి డోరోమెక్టిన్ అనే ఔషధాన్ని కనిపెట్టారు. 20 శాతం మంది పోర్క్ తింటున్నారు దేశంలో 9 లక్షల మిలియన్ల పందులుంటే, ఆంధ్రప్రదేశ్లో 92 వేలున్నాయి. దేశంలో 22 శాతం మంది, రాష్ట్రంలో 11 శాతం మంది పందుల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ మాంసాహారుల్లో పంది మాంసం తినే వారి సంఖ్య 18–20 శాతం ఉన్నారని అంచనా. ఏటా రూ.18 కోట్ల విలువైన 894 టన్నుల పంది మాంసం ఉత్పత్తులు మన దేశం నుంచి వియత్నాం, కాంగో, జర్మనీ వంటి దేశాలకు ఎగుమతవుతున్నాయి. ఒక పంది... 80 పిల్లలు... ఐదేళ్ల క్రితం విదేశీ జాతి పందులతో దేశవాళీ పందులను సంకరపరిచి ఎస్వీవీయూ టీ–17 (75 శాతం లార్జ్వైట్ యార్క్షైరు, 25 శాతం దేశవాళీ పంది) అనే కొత్త పంది జాతిని అభివృద్ధి చేశారు. వాడుకలో సీమ పందిగా పిలిచే వీటి పెంపకంపై రైతులు అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారు. జీవిత కాలంలో ఈతకు 8 చొప్పున 10 ఈతల్లో 80 పిల్లలను పెడుతుంది. పుట్టినప్పుడు 1.12 కేజీలుండే ఈ పంది పిల్ల వధించే సమయానికి 85 కేజీల వరకు బరువు పెరుగుతుంది. పది ఆడ, ఒక మగ పందిని కలిపి ఒక యూనిట్గా వ్యవహరిస్తారు. కేంద్రం నుంచి అభివృద్ధి చేసిన పందులకు సంబంధించి 400 యూనిట్లను రైతులకు పంపిణీ చేశారు. ప్రస్తుతం ఏపీలో రైతుల దగ్గర 20 వేల పైగా ఈ రకం పందులు పెరుగుతున్నాయి. ఒక యూనిట్ దేశవాళీ పందుల పెంపకం ద్వారా సగటున ఏటా రూ. 3–3.5 లక్షల ఆదాయం వస్తుంటే, ఈ రకం సీమ పందుల పెంపకం ద్వారా రూ. 6–7 లక్షల ఆదాయం వస్తుంది. మాంసం రూపంలో అమ్మితే రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఆదాయం వస్తుందని చెబుతున్నారు. – పంపాన వరప్రసాదరావు, సాక్షి, అమరావతి నెలకు రూ. లక్షకు పైగా నికరాదాయం నేనో సాప్ట్వేర్ ఉద్యోగిని. రెండేళ్లుగా పశుపోషణ చేస్తున్నా. గతేడాది తిరుపతి పందుల పరిశోధనా కేంద్రం నుంచి 15 పిల్లలతో పాటు 5 పెద్ద పందులను కొని పెంపకం చేపట్టా. హాస్టళ్లు, హోటళ్ల నుంచి సేకరించే పదార్థాలను పందులకు మేపుతున్నాం. చూడి/పాలిచ్చే పందులకు విడిగా దాణా పెడతున్నా. నెలకు రూ. 49,400 ఖర్చవుతోంది. మాంసం ద్వారా రూ.1.40 లక్షలు, పంది పిల్లల అమ్మకం ద్వారా రూ.13,500 ఆదాయం వస్తోంది. ఖర్చులు పోను నెలకు రూ.లక్షకు పైగా నికరాదాయం వస్తోంది. పందుల పెంపకం లాభదాయకంగా ఉంది. – సుంకర రామకృష్ణ, నూజివీడు, ఎన్టీఆర్ జిల్లా మార్కెటింగ్పై అవగాహన కల్పిస్తే... నేనో సాప్ట్వేర్ ఉద్యోగిని. పందుల పెంపకంపై ఆసక్తితో తిరుపతి పరిశోధనా కేంద్రంలో శిక్షణ పొందాను. ఈ పరిశ్రమ ఎంతో లాభసాటిగా ఉందని గ్రహించాను. త్వరలో పందుల పెంపకం యూనిట్ పెడుతున్నా. మార్కెటింగ్పై మరింత అవగాహన కల్పిస్తే యువత ఆసక్తి కనపరుస్తారు. –జి.మహేష్, గాజులమండ్యం, తిరుపతి జిల్లా పొరుగు రాష్ట్రాల రైతుల ఆసక్తి శాస్త్రీయ పద్ధతుల్లో సీమ పందుల పెంపకంపై విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నాం. ఎస్వీవీయూ టీ–17 జాతి పందులకు మంచి డిమాండ్ ఉంది. పొరుగు రాష్ట్రాల రైతులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. పెంపకంలో మెళకువలతో పాటు వీటికి సంక్రమించే వ్యాధులను గుర్తించి తగిన చికిత్స, నివారణా చర్యలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. పంది మాంసం ఉత్పత్తుల్లో ఉండే పోషక విలువలపై వినియోగదారుల్లో అవగాహన కల్పిస్తున్నాం. – డాక్టర్ కే.సర్జన్రావు (99890 51549), పరిశోధనా సంచాలకులు, ఎస్వీవీయూ, తిరుపతి రైతులకు నిరంతర శిక్షణ తిరుపతిలో పందుల పరిశోధనా కేంద్రం ఏర్పాటై 50 ఏళ్లవుతోంది. తాజాగా విడుదల చేసిన ఎస్వీవీయూ టీ–17 రకం పంది జాతికి మంచి డిమాండ్ ఉంది. దేశవాళీ పందులతో పోల్చుకుంటే రెట్టింపు ఆదాయం వస్తుంది. వీటి పెంపకంపై ఆసక్తి గల యువతకు, రైతులకు ఏడాది పొడవునా శిక్షణ ఇస్తున్నాం. –డాక్టర్ ఎం.కళ్యాణ్ చక్రవర్తి (94405 28060), సీనియర్ శాస్త్రవేత్త, అఖిల భారత పందుల పరిశోధనా కేంద్రం, తిరుపతి -
పంది పిల్లకు పాలిచ్చిన మేక
ద్వారకాతిరుమల: వరాహం పిల్లకు పాలిచ్చి ఓ మేక దాని ఆకలిని తీర్చింది. ద్వారకాతిరుమల చినవెంకన్న శేషాచల కొండపైన పవర్స్టేషన్ ప్రాంతంలో మంగళవారం ఈ దృశ్యం కనిపించింది. దొరసానిపాడుకు చెందిన ఒక కాపరి తన మేకలను కొండపైన మేపుతోంది. అందులో ఓ మేక చుట్టూ కొద్ది రోజులుగా వరాహం పిల్ల తిరుగుతోంది. ఆకలిగా ఉందో ఏమో.. ఆ వరాహం పిల్ల మేక పాలను తాగింది. మేక సైతం కదలకుండా వరాహం పిల్లకు పాలివ్వడాన్ని చూసిన వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
పందిపిల్ల ఇతివృత్తంతో కమెడియన్ మూవీ.. థియేటర్లలో సందడి
చెన్నై సినిమా: 'పన్నికుట్టి' చిత్రం థియేటర్లలో సందడి చేస్తోంది. కొత్త దర్శకుడు అను చరణ్ తెరకెక్కించిన చిత్రం ఇది. ఇందులో కమెడియన్ యోగిబాబు, కరుణాకరన్ ప్రధాన పాత్రలు పోషించారు. సమీర్ భరత్ రామ్ నిర్మించిన ఈ చిత్రం విడుదల హక్కులను లైకా ప్రొడక్షన్ పొంది శుక్రవారం (జులై 8) విడుదల చేసింది. వినోదం మేళవించిన కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందుతోంది. యోగిబాబు కామెడీ పంచ్ డైలాగ్స్కు ప్రేక్షకుల కడుపుబ్బ నవ్వుకుంటున్నారు. నటుడు కరుణాకరన్ నటన ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా పందిపిల్ల ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రంలో పలు ఆసక్తికరమైన సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కుటుంబ సమస్యలతో సతమతమయ్యే కరుణాకరన్ వాటి నుంచి బయటపడేందుకు ఒక స్వామిజీని ఆశ్రయిస్తాడు. ఆయన ఏం చేశాడు? కరుణాకరన్ సమస్యల నుంచి బయటపడ్డాడా? అంశాలకు దర్శకుడు హాస్యాన్ని జోడించి చిత్రాన్ని జనరంజకంగా తీర్చి దిద్దారు. నమ్మకమే జీవితం అనే చక్కని సందేశంతో కూడిన ఈ చిత్రం థియేటర్లలో వినోదాలు విందులో సందడి చేస్తోంది. చదవండి: 36 ఏళ్ల క్రితం సినిమాలకు సీక్వెల్.. ఈ హీరోలకు కమ్బ్యాక్ హిట్.. యాదృచ్ఛికమా! నా భర్త నేను ఎప్పుడో ఓసారి కలుసుకుంటాం: స్టార్ హీరోయిన్ నితిన్కు అసలు డ్యాన్సే రాదు: అమ్మ రాజశేఖర్ -
పంది గుండె మార్పిడి చేయించుకున్న రోగి చనిపోవడానికి కారణం అదే...
Animal virus detected in patient: ఇటీవలే పందిగుండె అమర్చిన వ్యక్తి మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే అతను ఎందువల్ల చనిపోయాడు కారణాలేంటి అనే దానిపై వైద్యులు పరిశోధనలు చేయడం మొదలు పెట్టారు. అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ వైద్యులు 57 ఏళ్ల డేవిడ్ బెన్నెట్కి గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేశారు. పంది గుండెని అమర్చి ప్రపంచ చరిత్రోలోనే ఒక సంచలనాత్మక ప్రయోగానికి నాంది పలికారు. ఆ సర్జరీ కూడా విజయవంతమైంది. ఇది వైద్యశాస్రంలోనే ఒక సరికొత్త అధ్యయనం అని అందరూ ఆనందించేలోపే ఆ వ్యక్తి సర్జరీ జరిగిన రెండు నెలల్లోనే చనిపోయాడు. వైద్యులు కూడా అతన్ని బతికించేందుకు శతవిధాల ప్రయత్నించారు కూడా. అసలు ఎందుకు ఇలా జరిగిందని పరిశోధనలు చేస్తున్న వైద్యులు కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈమేరకు యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ వైద్యులు మాట్లాడుతూ... పంది గుండె లోపన వైరల్ డీఎన్ఏ ఉంది. పోర్సిన్ సైటోమెగలో వైరస్ అని పిలువబడే ఈ బగ్ రకరకాల ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందనే విషయాన్ని గుర్తించలేకపోయాం. జంతువుల నుంచి మనుషులను అవయవాలను అమర్చినప్పుడూ కొత్త ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవలసి ఉంటుంది. కొన్ని వైరస్లు చాలా గుప్తంగా ఉంటాయి. సర్జరీకి ముందు బెన్నెట్ మానవ గుండె మార్పిడికీ అనర్హుడని, పైగా అతనికి వ్యాధి నిరోధక శక్తి తక్కువని తెలిసే జన్యుమార్పిడి చేసిన పంది గుండెను అమర్చాం. పైగా ఆ వైరస్ భారిన పడకుండా ఉండేలా అతని అత్యంత మెరుగైన చికిత్స కూడా అందించాం. మా బృందం దాత పంది ఆరోగ్యంగా ఉందని, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ పరీక్షలు నిర్వహించి నిర్ధారించింది. అంతేకాదు ఆ పంది అంటువ్యాధులు వ్యాప్తి చేయకుండా నిరోధించేలా పెంచే ప్రత్యేక సదుపాయంలో ఉంది. బెన్నెట్కి యాంటీ వైరల్ మందులు, రోగనిరోధక శక్తిని పెంచే చికిత్సలను అందించాం. అని అన్నారు. బెన్నెట్ సర్జరీ తర్వాత నెమ్మదిగా కోలుకోవడం మొదలు పెట్టాడని, ముందు జాగ్రత్త చర్యగా వైరల్ ఇన్ఫెక్టకు సంబంధించిన పరీక్షలు కూడా నిర్వహించామని సర్జరీ చేసిన డాక్టర్ బార్ట్లీ గ్రిఫిత్ తెలిపారు. ఐతే పంది గుండే ఉబ్బిపోయి ద్రవంతో నిడిపోయి పనిచేయడం మానేసిందన్నారు. కానీ ఈ పంది వైరస్ ఎలా మానవ శరీరంపై ప్రభావితం చేస్తుందో స్పష్టం చేయలేదు. (చదవండి: పెనువిషాదం. పంది గుండె అమర్చిన వ్యక్తి కన్నుమూత) -
పెనువిషాదం. పంది గుండె అమర్చిన వ్యక్తి కన్నుమూత
వైద్య శాస్త్రంలో మరో చారిత్రక ఘట్టం అవుతుందనుకున్నది కాస్త విషాదంగా మిగిలింది. పంది గుండె అమర్చిన వ్యక్తి కన్నుమూశాడు. జనవరి 7వ తేదీన 57 ఏళ్ల డేవిడ్ బెన్నెట్ అనే వ్యక్తికి ఈ సర్జరీ జరిగింది. కానీ, ఆ ఆనందం రెండు నెలల్లోనే ముగిసింది. మేరీల్యాండ్(అమెరికా)కు చెందిన డేవిడ్ బెన్నెట్కు రెండు నెలల క్రితం అమెరికాలోని మేరీల్యాండ్ ఆసుపత్రిలో గుండెమార్పిడి శస్త్రచికిత్స చేశారు. ప్రపంచ వైద్య చరిత్రలోనే తొలిసారిగా జన్యుమార్పిడి చేసిన పంది నుంచి సేకరించిన గుండెను ఆయనకు విజయవంతంగా అమర్చారు. దీంతో దీనిని పెద్ద ముందడుగుగా భావించారు. కొన్ని రోజులుగా బెన్నెట్ ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుండడంతో ఆయనను బతికించేందుకు వైద్యులు తీవ్రంగా కృషి చేశారు. అయితే, ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. మంగళవారం బెన్నెట్ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. తండ్రి మృతి విషయాన్ని బెన్నెట్ కుమారుడు బెన్నెట్ జూనియర్ నిర్ధారించారు. 1984లోనూ ఇలాంటి ప్రయోగమే జరగ్గా అది కూడా విఫలమైంది. 1984లో బబూన్(కోతి జాతికి చెందినది) గుండెను ఓ నవజాత శిశువుకు అమర్చగా.. సర్జరీ విజయవంతం అయినప్పటికీ ఆ పసికందు మాత్రం 20 రోజులే జీవించగలిగింది. అయితే, ఈసారి పందిగుండె అమర్చుకున్న బెన్నెట్ రెండు నెలలు జీవించడం కొంత మెరుగైన ఫలితంగా భావించినా.. ఇప్పుడదీ విషాదమే అయ్యింది. -
పెంపుడు పంది కోసం న్యాయపోరాటం
కనజోహరే: అమెరికాకు చెందిన ఫ్లాట్ అనే వ్యక్తి ఎల్లి అనే తన పెంపుడు పంది కోసం న్యాయస్థానం మెట్లెక్కాడు. స్థానిక అధికారులు పందిని ఇంట్లో పెంచుకోవడం కుదరదని, అది ఫామ్ జంతువని, అందువల్ల దాన్ని ఫామ్హౌస్లో లేదా అడవిలో వదిలేయాలని ఫ్లాట్కు సూచించారు. పందిని ఇంట్లో పెంచుకోవడం కుదరదని తెగేసి చెప్పారు. దీంతో ఆగ్రహించిన ఫ్లాట్ అధికారులపై క్రిమినల్ కేసు వేశాడు. ఎల్లి తనను కష్ట సమయాల్లో ఓదార్చిందని, కుక్కల కన్నా ఎంతో తెలివైందని, దాన్ని వదులుకోనని వాదిస్తున్నాడు. -
25 ఏళ్ల కిందే పంది గుండె అమర్చిన అస్సాం డాక్టర్
గువాహటి: అమెరికాలో గుండె పూర్తిగా దెబ్బతిని ప్రాణాపాయస్థితిలో ఉన్న ఓ వ్యక్తికి పంది గుండెను అమర్చడం, ఆ సర్జరీ విజయవంతమై సదరు వ్యక్తి సొంతంగా ఊపిరిపీల్చుకోగలగడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అవయవ మార్పిడికోసం ఎదురుచూస్తున్నవారిలో భవిష్యత్తుపై ఆశలు రేపుతోంది. అమెరికా శాస్త్రవేత్తలు గొప్ప విజయం సాధించారన్న ప్రశంసలను కురిపిస్తోంది. కానీ ఎప్పుడో 25 ఏళ్ల క్రితమే.. పెద్దగా సాంకేతికత అందుబాటులో లేని కాలంలోనే.. మన దేశానికి చెందిన ఓ వైద్యుడు ఈ సర్జరీ చేశాడు. ఓ 32 ఏళ్ల వ్యక్తికి పంది గుండెను విజయవంతంగా అమర్చగలిగాడు. కానీ తాను చేసిన కొన్ని పొరపాట్లతో ఆ ఘనతను తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. పైగా పోలీసు కేసులు, జైలు శిక్షను ఎదుర్కొన్నాడు. లేకుంటే ప్రపంచంలో తొలి ‘హార్ట్ జెనో ట్రాన్స్ప్లాంట్ (జంతువుల అవయ వాలను మనుషులకు అమర్చడం)’ చేసిన వైద్యుడిగా నిలిచేవాడు. ఇంతకీ ఆ వైద్యుడు ఎవరో తెలుసా.. అస్సాంలోని సోనాపూర్కు చెందిన వైద్యుడు ధనిరామ్ బారువా. ప్రస్తు తం 68 ఏళ్ల వయసున్న ఆయన అప్పట్లో ఏం చేశారు, ఏం జరిగిందో తెలుసుకుందామా.. ప్రపంచస్థాయి వైద్యుడాయన.. అస్సాం రాజధాని గువాహటికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న శివారు పట్టణం సోనాపూర్. ‘టైం కంటే ముందుండే డాక్టర్’గా పేరుపొందిన డాక్టర్ ధనిరామ్ బారువా అక్కడ సొంతంగా ‘ధనిరామ్ హార్ట్ ఇనిస్టిట్యూట్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ హ్యూమన్ జెనెటిక్ ఇంజనీరింగ్’ వైద్య కళాశాలను నడుపుతుండేవారు. 1980వ దశకంలోనే ఆయన ప్రపంచంలోని గొప్ప గుండె వైద్య నిపుణుల్లో ఒక రిగా పేరు పొందారు. గుండెలో దెబ్బతిన్న వాల్వ్ల స్థానంలో అమర్చేందుకు 1989లోనే కృత్రిమంగా ‘బారువా హార్ట్ వాల్వ్’లను అభివృద్ధి చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వాల్వ్లను ఇప్పటికీ వినియోగిస్తున్నారు కూడా. ఇదేకాదు సొంతంగా మరెన్నో పరిశోధనలూ చేశారు. అప్పట్లో ప్రధాని ఇందిరాగాంధీ కూడా ధనిరామ్ను పలుమార్లు ప్రశంసించారు కూడా. కానీ 1997లో ఆయన చేసిన ప్రయోగంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అనైతికం, ప్రమాదకరమంటూ.. ధనిరామ్ బారువా 1997 జనవరిలో హాంగ్కాంగ్కు చెందిన జోనాథన్ హోకీ షింగ్ అనే హార్ట్ సర్జన్తో కలిసి సంచలన ప్రయోగం చేశారు. గుండెకు రంధ్రంపడిన ఓ 32 ఏళ్ల వ్యక్తికి సర్జరీ చేసి.. పంది గుండెను అమర్చారు. ఇప్పుడున్నంతగా వైద్య వసతుల్లేని ఆ కాలంలో, అదీ తన వైద్య కళాశాల లోనే ధనిరామ్ విజయవంతంగా ఈ సర్జరీ చేయ డం విశేషం. పంది గుండెతో వారం రోజుల పాటు బతికిన ఆ పేషెంట్.. పలు రకాల ఇన్ఫెక్షన్ల కార ణంగా వారం రోజుల తర్వాత చనిపోయాడు. ఇది ఒక్కసారిగా ఆందోళనలు రేపింది. మనుషులకు పంది గుండె అమర్చడం అనైతికమని, సదరు పేషెంట్ మరణానికి ధనిరామ్ కారణమంటూ విమర్శలు వచ్చాయి. ఆ పొరపాటుతో కేసులు, జైలు.. అప్పటికే ప్రపంచస్థాయి హార్ట్ సర్జన్ అయిన ధని రామ్ ‘జెనో ట్రాన్స్ప్లాంటేషన్’కు సంబంధించి ప్రభుత్వ అనుమతులు తీసుకోలేదు. అంతే కాదు.. తన పరిశోధనల వివరాలను ఉన్నతస్థాయి సమీక్ష లకు పంపకుండానే, నేరుగా పంది గుండె అమర్చే సర్జరీ చేశారు. దీంతో ఆయనపై, ఆస్పత్రిపై కేసులు నమోదయ్యాయి. 40రోజులు జైల్లో ఉన్నాక బెయిల్పై విడుదలయ్యారు. కానీ అప్పటికే ఆందో ళనకారులు ఆయన ఆస్పత్రిని, ఆస్తులను ధ్వంసం చేశారు. నీళ్లు, కరెంటు అందకుండా చేశారు. ఆ సమయంలో సుమారు ఏడాదిన్నర పాటు ఆయన ఇంట్లోంచి బయటికి రాకుండా గడపాల్సి వచ్చింది. ‘వివాదాస్పద’ ఆవిష్కరణలతో.. తన ఆస్పత్రి దెబ్బతిన్నా, తనపై ఎన్నో ఆరోపణలు చేసినా.. ధనిరామ్ తన పరిశోధనలు కొనసాగిం చాడు. కొన్ని ఆవిష్కరణలు చేసినట్టుగా ప్రకటిం చాడు. కానీ వాటిపై పలు వివాదాలు తలెత్తాయి. పుట్టుకతో వచ్చే గుండె సమస్యలను సరిచేసే జన్యు మార్పిడి వ్యాక్సిన్ను రూపొందించినట్టు 2008లో ధనిరామ్ ప్రకటించారు. హిమాలయాల్లోని ఔషధ మొక్కల నుంచి హెచ్ఐవీని నియం త్రించే జన్యువు లను సేకరించామని..86మందిలో హెచ్ఐవీని నిర్మూలించగలిగామని 2015లో ప్రకటించారు. ముందుచూపున్న మేధావి డాక్టర్ ధనిరామ్ బారువా ఎంతో ముందుచూపు ఉన్న వ్యక్తి అని, కానీ తగిన జాగ్రత్తలు, నిబంధనల ప్రకారం వ్యవహరించలేదని అస్సాంకు చెందిన ప్రముఖ గుండె వైద్య నిపుణుడు గోస్వామి చెప్పా రు. ధనిరామ్ 25 ఏళ్ల కింద అంతంత మాత్రం సదుపాయాలతో గుండె మార్పిడి చేశారని.. అదే ఇన్నేళ్లలో అభివృద్ధి చెందిన సదుపాయాలు, అత్యాధునిక టెక్నాలజీతో అమెరికా వైద్యులు పంది గుండెను మనిషికి అమర్చారని గుర్తు చేశారు. తన పరిశోధనలను పూర్తిస్థాయి సమీక్షలకు పంపక పోవడంతో అధికారిక గుర్తింపు పొందలేకపోయారని పేర్కొన్నారు. -
చారిత్రక ఘట్టం.. పంది గుండె మనిషికి!
Pig Heart Transplantation To Human: వైద్య శాస్త్రంలో మరో చారిత్రక ఘట్టం చోటు చేసుకుంది. మనిషికి పంది గుండెను విజయవంతంగా అమర్చారు అమెరికన్ వైద్యులు. తద్వారా అవయవాల కొరత, అవి దొరక్క చనిపోతున్న వేల మందికి ప్రాణదానం చేసే అవకాశం లభించినట్లయ్యింది. శుక్రవారం బాల్టిమోర్ ‘మేరీలాండ్ మెడికల్ స్కూల్ ఆస్పత్రిలో ఈ అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. పంది నుంచి తీసిన గుండెను మనిషికి అమర్చారు. ఆపరేషన్ విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు వైద్యులు. జన్యుపరంగా మార్పు చేయబడిన పంది గుండెను అమర్చడం ద్వారా పేషెంట్కు ప్రాణదానం చేసినట్లయ్యింది. 57 ఏళ్ల డేవిడ్ బెన్నెట్ అనే వ్యక్తికి ఈ సర్జరీ జరిగింది. సంప్రదాయ మార్పిడికి పేషెంట్ పరిస్థితి అనుకూలించని తరుణంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు వైద్యులు. ఇందుకోసం అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అత్యవసర అనుమతులు జారీ చేసింది. ప్రస్తుతం డేవిడ్ కోలుకుంటున్నాడని, ఇంకొన్నాళ్లు అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్తున్నారు. పేషెంట్ గనుక పూర్తిగా కొలుకుంటే గనుక అద్భుతమే అవుతుంది. వైద్య శాస్త్రంలో ఇదొక చారిత్రక ఘట్టమని చెబుతున్నారు వైద్యులు. తద్వారా భవిష్యత్తులో ఆర్గాన్ డొనేషన్స్ కొరతను పరిష్కరించడానికి ఒక మార్గం దొరికినట్లు అయ్యింది. ఇదిలా ఉంటే బ్రెయిన్ డెడ్ అయి కృత్రిమ లైఫ్ సపోర్ట్పై కోలుకోలేని స్థితిలో ఉన్న వ్యక్తికి పంది కిడ్నీని అమర్చిన సంగతి తెలిసిందే. కిందటి ఏడాది అక్టోబర్లో న్యూయార్క్ యూనివర్సిటీ లాన్గోన్ హెల్త్ మెడికల్ సెంటర్లో వైద్యులు ఈ ఆపరేషన్ చేయగా.. పేషెంట్ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. వేలల్లో మరణాలు అమెరికాలో ప్రతీ ఏడాది సగటున ఆరు వేల మందికి పైగా పేషెంట్లు.. గుండె మార్పిడికి ముందే చనిపోతున్నారు. అవయవాల కొరతే అందుకు ప్రధాన కారణం. ప్రస్తుతం అమెరికాలో లక్షా పదివేల మందికి పైగా గుండె మార్పిడి ఆపరేషన్ల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. 1984లో బబూన్(కోతి జాతికి చెందినది) గుండెను ఓ నవజాత శిశువుకు అమర్చగా.. సర్జరీ విజయవంతం అయినప్పటికీ ఆ పసికందు మాత్రం 20 రోజులే జీవించగలిగింది. అయితే ఇప్పుడా పరిస్థితి మారింది. ఇక పంది శరీరాకృతి, ఎదుగుదల, పైగా మాంసం తింటారు కాబట్టి ఆధారంగా.. అవయవాలు తీసుకోవడానికి ఉత్తమమైందని అమెరికన్ డాక్టర్లు భావిస్తున్నారు. సంబంధిత వార్త: పేషెంట్కు పంది కిడ్నీ అమర్చారు -
Animal Art: ‘పిగ్'కాసో పెయింటింగ్స్.. ఒక్క చిత్రం ధర ఏకంగా రూ. 14 లక్షలు!
Pig Painter Pigcasso’s Artwork Story In Telugu రవివర్మ, లియోనార్డో డావిన్సీ, మైకెలాంజిలో, ఆర్టెమిసియా జెంటిలేస్చి... వంటి ప్రసిద్ధ పెయింటర్స్ చేతుల్లో జీవం పోసుకున్న రకరకాల పెయింటింగ్లను మీరిప్పటివరకూ చూసి ఉంటారు. అఫ్కోర్స్! వాటి ధర కూడా కోట్ల రూపాయలు పలుకుతాయి. ఐతే మీమ్మల్ని అమితాశ్చర్యాలకు గురచేసే ఈ సరి కొత్త పెయింటర్ గురించి ఇప్పటివరకూ తెలిసుండదు. ఆ పెయింటర్ మనిషికాదు ఓ జంతువు. అది వేసే రంగుల చిత్రాలకు జనాల్లో యమ క్రేజీ ఉంది. ఒక పెయింట్ ధర లక్షల రూపాయలు పలుకుతోంది మరి! ఆ జంతువు మరేదోకాదు అక్షరాలా ఓ పంది. ఇక ఈ సునక పెయింటర్ కుంచెతో పట్టి గీసిన చిత్రాలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆ విశేషాలేమిటో తెలుసుకుందాం.. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఈ పంది పేరు పిగ్కాసో. పిగ్కాసో తాజాగా వేసిన పెయింటింగ్ 72 గంటల్లోనే డిసెంబర్ 13న జర్మనీకి చెందిన వ్యక్తి 20 వేల డాలర్లు (రూ. 14, 97, 000) కు కొన్నట్లు అక్కడి స్థానిక మీడియా తెల్పింది. గతంలో ఓ చింపాజీ వేసిన పెటింటింగ్ 14 వేల డాలర్లు పలకగా, తాజాగా ఆ రికార్డును పిగ్కాసో బద్ధలుకొట్టింది. నిజానికి దక్షిణాఫ్రికాలోని ఫ్రెంచ్వ్యాలీకి చెందిన జోన్ లెఫ్సన్, 2016లో కేప్ టౌన్లోని పదిమాంసం విక్రయించే దుకాణం నుంచి ఈ పందిని కాపాడింది. ఆతర్వాత ఆమె తనతో పాటు పందిని తీసుకువచ్చి పెంచుకోవడం ప్రారంభించింది. ఐతే ఒక రోజు అనుకోకుండా కొన్ని పెయింట్ బ్రష్లను పిగ్కాసో ఉంటున్న ఎన్క్లోజర్లో జోన్ వదిలేసింది. బ్రష్లతో ఆడుతున్న పందిని చూసిన జోన్కు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఇంకేముంది అప్పటినుంచి ఎన్నో అద్భుతమైన పెయింటింగ్స్ వేయడం ప్రారంభించింది పిగ్కాసో. 5 సంవత్సరాల వ్యవధిలో దాదాపు 400కుపైగా పెయింటింగ్స్ వేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పంది వేసిన పెయింటింగ్స్ ప్రజలు ఎంతగానో ఇష్టపడతారట. హాట్ కేకుల్లా వేసీవేయంగానే లక్షల్లో అమ్ముడుపోతున్నాయని, ఈ విధంగా పెయింటింగ్స్ ద్వారా వచ్చిన డబ్బును ఇతర జంతువుల పెంపకానికి వినియోగిస్తున్నట్లు జోన్ లెఫ్సన్ మీడియాకు తెల్పింది. యానిమల్ ఆర్ట్కు జనాల్లో బాగానే పాపులార్టీ ఉంది కదా! చదవండి: పరిస్థితి చేయి దాటుతోందా? ఒక్క రోజులోనే లక్ష కోవిడ్ పాజిటివ్ కేసులు.. -
డబ్బే డబ్బు!: జంతువు వేసిన పెయింటింగ్కు రికార్డు ధర
మాస్టారి టాలెంట్ ఏమిటో ఫొటో చూడగానే మీరో అంచనాకు వచ్చేసుంటారు.. ఇది ఉత్త పిగ్ కాదు.. దీని పేరు పిగ్కాసో.. అంటే.. పందుల్లో పికాసో టైపు అన్నమాట. నిజానికి బిర్యానీలో లెగ్పీసు కింద మారాల్సిన ఈ వరాహం.. జువానే లెఫ్సన్ అనే ఆవిడ పుణ్యాన రోజుకో ఆర్టు పీసును సృష్టించేస్తోంది.. ఇంతకీ ఏమైందంటే.. చిన్నప్పుడు దీన్ని ఓ మటన్ షాపుకు అమ్మేశారట.. కీమా కొట్టేయడానికి.. అయితే జువానే రక్షించి.. పెంచుకున్నారు.. అదే సమయంలో తన షాపులోపడి ఉన్న పెయింట్ బ్రష్షు పట్టుకుని.. విన్యాసాలు చేస్తుంటే చూసి.. ఆ దిశగా ప్రోత్సహించారు.. అంతే... అప్పట్నుంచి పిగ్ కాసో తనదైన రంగుల ప్రపంచాన్ని సృష్టించేసుకుంది.. తాజాగా వారాల తరబడి కష్టపడి.. ఇదిగో ఈ పెయింటింగ్ను వేసే సింది. తన కష్టం వృథా పోలేదు.. ఈ వరాహం వేసిన పెయింటింగ్కు అచ్చంగా వరహాల మూటే దక్కింది. జర్మనీకి చెందిన పీటర్ ఎసర్ అనే వ్యక్తి రూ.20 లక్షలకు పైగా చెల్లించి.. వేలంలో ఈ పెయింటింగ్ను దక్కించు కున్నారు. దాంతో పిగ్కాసో యజమాని జువానే ఆనందానికి అంతులేదనుకోండి.. మరో విషయం.. ఓ జంతువు వేసిన చిత్రానికి ఇంత ధర పలకడం కూడా ఇదే తొలిసారి.. గతంలో కాంగో అనే చింపాజీ వేసిన చిత్రానికి రూ.14 లక్షల ధర పలికింది. -
మొట్టమొదటి టూత్ బ్రష్ ఎలా తయారుచేశారో తెలిస్తే.. యాక్!! పంది శరీరంపై...!
Do You Know World's First Toothbrush Was Made By Pig Hair? మొదట పెరుగు తయారు చేసినప్పుడు తోడు ఎలా వచ్చింది..? విత్తనం ముందా, చెట్టు ముందా..? లాంటి అనుమానాలు మీ కెప్పుడైనా వచ్చాయా! అలాగే మనం రోజూ ఉదయానే పళ్లు తోమే బ్రష్ ఎలావచ్చింది.. ఎప్పుడు వచ్చింది? మొదట ఎవరు తయారు చేశారు, అది ఎలా ఉండేది? ఆ విశేషాలు తెలుసుకుందామా.. మన పూర్వులు వేపపుల్లలతో పళ్లు తోమేవారని అందరికీ తెలిసిందే. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పళ్లు తోముకోడానికి పుల్లలను వినియోగిస్తున్నారు కూడా! క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాలకు ముందే టూత్ బ్రష్ వినియోగం ఉందట! ప్రస్తుతం వినియోగంలో ఉన్న బ్రష్ను మొదట వినియోగించింది మాత్రం చైనా దేశం. 600 యేళ్లకు ముందే మన ప్రపంచానికి బ్రష్లను పరిచయం చేసింది ఈ దేశమే. చదవండి: Viral: 460 కోట్ల యేళ్లనాటి అరుదైన ఉల్క.. బంగారం కంటే ఎన్నో రెట్లు విలువైనది!! జూన్ 26, 1498న మొదటిసారిగా ఒక చైనీస్ రాజు టూత్ బ్రష్పై పేటెంట్ పొందాడు. ప్రపంచంలో మొట్టమొదటి టూత్ బ్రష్ను పంది వెంట్రుకలతో తయారు చేశారట. ఈ టూత్ బ్రష్పై ఉండే బ్రస్సెల్స్ చాలా గట్టిగా ఉండేవి. వీటిని పందుల మెడ వెనుక ఉండే మందపాటి జుట్టుతో తయారు చేయబడ్డాయి. ఈ వెంట్రుకలను వెదురు కర్రకు కట్టి టూత్ బ్రష్ లు తయారు చేశారు. 20వ శతాబ్ధం వరకు ఈ బ్రష్లను యూరప్, ఇంగ్లాండ్ దేశాలు చైనా నుంచి దిగుమతి చేసుకునేవి. 1780లో ఇంగ్లాండ్కు చెందిన విలియమ్ ఈడిస్ అనే ఖైదీ కనుగొనేంతవరకూ ఈ బ్రష్లనే వాడేవారు. ఆ కాలంలో విలియమ్ కూడా పంది వెంట్రుకలతోనే టూత్ బ్రష్ను తయారు చేసేవాడట. జైలు నుండి విడుదలయ్యాక 'విజ్డమ్ టూత్ బ్రష్' అనే కంపెనీని ప్రారంభించి, ఇంగ్లాండ్లో టూత్ బ్రష్ల ఉత్పత్తిని ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ కంపెనీలో ఏటా 70 మిలియన్ టూత్ బ్రష్లు తయారు చేయబడుతున్నాయి. 1950లో డుపాంట్ డె నెమోర్స్ అనే వ్యక్తి నైలన్ బ్రిస్టల్ టూత్ బ్రష్లను ప్రపంచానికి పరిచయం చేశాడు. నవంబర్ 7, 1857లో హెచ్ఎన్ వడ్స్వర్త్ అనే వ్యక్తి టూత్ బ్రష్లపై పేటెంట్ పొందిన మొదటి అమెరికన్గా పేరుగాంచాడు. ఆ తర్వాత 1885లో అమెరికా దేశంలో పెద్ద ఎత్తున టూత్ బ్రష్ల ఉత్పత్తి ప్రారంభమైంది. ఇలా వచ్చిందన్నమాట!! ప్రస్తుతం మనందరం వాడుతున్న టుత్ బ్రష్..! చదవండి: నదిలో తేలుతున్న వందల అస్థిపంజరాలు.. మిస్టరీ డెత్ వెనుక అసలు కారణం ఏమిటీ? -
చూడటానికి పంది రూపు... కానీ అది దూడ
మాస్కో: ఈ మధ్యకాలంలో విచిత్రాతి విచిత్రంగా జంతువులకు, మనుష్యులకు రకరకాలుగా పిల్లలు పుట్టడం చూసే ఉంటాం. హార్మోనుల తేడాలతో రకరకాలుగా అవకారాలతోనో లేక మరో విధంగానో వింత వింత జననాలను చూసి ఉంటాం. కానీ ఇలా మరో జంతు రూపుతో విచిత్రంగా జన్మించటం అత్యంత అరుదుగా జరుగుతుంది. అచ్చం అలాంటి ఘటన రష్యాలో చోటు చేసుకుంది. (చదవండి: సంవత్సరాల తేడాతో ఒకే నెల ఒకే తేదిలో జన్మించినన ముగ్గురు అక్కాచెల్లెళ్లు) వివరాల్లోకెళ్లితే...రష్యాలోని ఖాకాసియాలోని మట్కెచిక్ గ్రామంలో ఒక ఆవుకి పందులను పోలిన రూపంతో రెండు తలల దూడ జన్మించింది. అయితే ఈ నవజాత దూడ పుట్టిన వెంటనే చనిపోయింది. అంతేకాదు పాపం దాని తల్లి కూడా కొద్ది రోజులకే చనిపోయింది. జన్యుపరమైన అసాధారణతల వల్ల ఈ విధంగా జరిగే అవగాశం ఉందిన రష్యా వెటర్నరీ మెడిసిన్ విభాగం పేర్కొంది. ఈ మేరకు వారసత్వంగా వచ్చే జన్యువుల్లోని మార్పుల వల్ల కానీ లేదా క్రాస్ బ్రీడింగ్ సమయంలోనూ ఈ విధంగా జరిగే అవకాశం ఉంటుందని వెల్లడించింది. అదేవిధంగా రాజస్థాన్లోని ధోల్పూర్ జిల్లా పురా సిక్రౌడా గ్రామంలో ఓ గేదె రెండు తలల దూడకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. పైగా ఆ గేదె ఎవరి సాయం లేకుండా జన్మినివ్వడమే కాకా ఆ దూడ కూడా ఆరోగ్యంగానే ఉంది. ఏది ఏమైన ఇలాంటి అరుదైన ఘటనల్లో పుట్టినవి ఆరోగ్యంగా ఉండటమే విశేషం. చాలామటుకు అవి చనిపోయే అవకాశాలే ఎక్కువ. (చదవండి: పని ఒత్తిడితో చిర్రెత్తి ఉన్నారా!.....అయితే ఈ వీడియో చూడండి చాలు -
ట్రాన్స్ ప్లాంటేషన్ లో సంచలనం
-
ట్రాన్స్ప్లాంటేషన్లో సంచలనం
పరిశోధకులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ప్రయోగం ఫలించింది. ఒక రోగికి తాత్కాలికంగా పంది కిడ్నీని విజయవంతంగా అమర్చారు. ప్రపంచంలోనే తొలిసారిగా న్యూయార్క్ యూనివర్సిటీ లాంగోన్లో ఆసుపత్రిలో ఈ ట్రాన్స్ప్లాంటేషన్ నిర్వహించారు. వైద్యులు ఈ కొత్త ప్రయోగం విశేషంగా నిలుస్తోంది. ఈ సక్సెస్తో పంది గుండెను మనిషికి అమర్చే తరుణం కూడా దగ్గరలోనే ఉందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. కోతినుంచి ఆవిర్భవించిన మనిషి మిగిలిన జంతువులతో కూడా చాలా దగ్గర పోలికలున్నట్టు కనిపిస్తోంది. తాజాగ ప్రపంచంలో తొలిసారిగా పంది మూత్రపిండాన్ని మనిషికి మార్పిడి చేశారు. అవయవాల కొరతతో ఇబ్బందులుపడుతున్న తరుణంలో ఇది పెద్ద ముందడుగని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. బ్రెయిన్ డెడ్ అయిన మహిళా రోగికి కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయి. కానీ ఆమెకు మూత్ర పిండాన్ని దానం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యుల ఆమోదంతో వైద్యులు ఒక కొత్త ప్రయోగాన్ని చేపట్టారు. గత కొన్ని దశాబ్దాల పరిశోధనల నేపథ్యంలో ఆమెకు పంది కిడ్నీని అమర్చేందుకు నిర్ణయించారు. మూడు రోజుల పాటు, కొత్త కిడ్నీని ఆమె రక్తనాళాలకు జతచేశారు. మార్పిడి చేసిన మూత్ర పిండాల పనితీరు, పరీక్షఫలితాలు చాలా మెరుగ్గా కనిపించాయని దీనికి నాయకత్వం వహించిన వైద్యుడు డాక్టర్ రాబర్ట్ మోంట్ గోమేరీ తెలిపారు. ఈ ప్రయోగ ఫలితంగా అవయవ మార్పిపై కొత్త ఆశలు చిగురించాయి. జెనోట్రాన్స్ప్లాంటేషన్ కల సాకారంలో ఇదొక కీలక అడుగు అని యునైటెడ్ థెరప్యూటిక్స్ సీఈవో మార్టిన్ రోత్బ్లాట్ ఒక ప్రకటనలో తెలిపారు. అంతేకాదు భవిష్యత్తులో ప్రతి ఏడాది వేలాదిమంది ప్రాణాలను కాపాడే సమయం ఎంతో దూరంలో లేదని వ్యాఖ్యానించారు. జన్యుపరంగా మార్పు చెందిన పందిని గాల్సేఫ్ అని పిలుస్తారు. దీనిని యునైటెడ్ థెరప్యూటిక్స్ కార్పొరేషన్కు చెందిన రివైవికర్ యూనిట్ అభివృద్ధి చేసింది. మాంసం అలెర్జీ ఉన్నవారికి ఆహారంగా, మానవ చికిత్సా సంభావ్య వనరుగా ఉపయోగించడం కోసం దీనిని డిసెంబర్ 2020లో యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించింది. మానవ రోగులకు గుండె కవాటాల నుండి చర్మ అంటుకట్టుట వరకు గాల్సేఫ్పందులు అన్నింటికి పరిష్కరంగా ఉంటాయని అందుకు పరిశోధకులు పరిశోధన చేస్తున్నారు. ఈ మూత్రపిండ మార్పిడి ప్రయోగం ఎండ్-స్టేజ్ కిడ్నీఫెయిల్యూర్ ఉన్న రోగులలో, వచ్చే ఏడాది లేదా రెండేళ్లలో ట్రయల్స్కు మార్గం సుగమం చేయాలని, స్వయంగా గుండె మార్పిడి గ్రహీత అయిన మోంట్గోమేరీ అన్నారు. జంతువుల అవయవాలను మార్పిడి అవకాశంపై దశాబ్దాలుగా కృషి జరుగుతోంది. పంది గుండె ఆకారంలోనూ, నిర్మాణంలోనూ మనిషి గుండెను పోలి ఉంటుందని ఇప్పటికే పరిశోధకులు తేల్చారు. ఈ నేపథ్యంలోనే 2022 కల్లా వరాహం గుండెను మనిషికి అమర్చే ప్రయోగాలు సక్సెస్ అవుతాయని ప్రఖ్యాత వైద్యుడు సర్ టెరెన్స్ గతంలోనే ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే పంది మూత్రపిండం మనిషికి మార్చే అవకాశంపై కూడా ఈయన చర్చించారు. ఒకవేళ మనిషికి పంది మూత్రపిండం మార్చడం సాధ్యపడితే గుండెను కూడా మార్చటం సాధ్యమేనని ఆయన స్పష్టం చేశారు. యూకేలో గుండె మార్పిడి చికిత్సలకు పేరుగాంచిన టెరెన్స్ 40 ఏళ్ల క్రితమే మొట్టమొదటి గుండె మార్పిడి చికిత్స చేయడం విశేషం. కాగా భారతదేశంలో మొట్టమొదటి మానవ మూత్రపిండ మార్పిడి 1965లో బొంబాయిలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్లో జరిగింది. అయితే విజయవంతమైన తొలి మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్స వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో జరిగిందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. 1971 ఫిబ్రవరి 2న షణ్ముగం అనే రోగికి ట్రాన్స్ప్లాంటేషన్ చేసి వైద్యులు తొలి విజయాన్ని నమోదు చేశారు. అమెరికాలో దాదాపు 1,07,000 మంది ప్రస్తుతం అవయవ మార్పిడి కోసం వేచి చూస్తున్నారని ఒక నివేదిక తెలిపింది. ఇందులో 90వేలకు పైగా రోగులు కిడ్నీ కోసం ఎదురుచూస్తుండగా, రోజుకు 12 మంది చని పోతున్నారు. భారతదేశంలో కిడ్నీ సంబధిత వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా అవయవాల మార్పిడికి ఆర్గాన్స్ అందుబాటులో లేక దాదాపు 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఏటా 2 లక్షల మందికి పైగా రోగులు కిడ్నీ మార్పిడి చేయించు కుంటున్నారు. అలాగే లక్షా యాభై వేల మంది కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్కు ఎదురు చూస్తున్నారట. ముఖ్యంగా అవయవ దానంపై అవగాహన లేక పోవడం, సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఈ ఆర్గాన్ డొనేషన్కి ముందుకు రాకపోవడం ప్రధాన కారణంగా భావిస్తున్నారు. -
Viral: ‘పంది పిల్లకు పాలిచ్చి, శునకం తల్లి ప్రేమను చాటింది’
సాధారణంగా అన్ని జీవాలకు ఆకలి బాధలు ఒకేలా ఉంటాయి. ఒక్కోసారి తీవ్రమైన ఆకలితో వాటికి జాతి వైరం కూడా గుర్తుకురాదు. అలా కొన్ని జంతువుల పిల్లలు.. ఇతర జంతువుల చెంతకు చేరి పాలు తాగి తమ ఆకలి తీర్చుకున్న సందర్భాలను చూశాం. తాజాగా ఓ చిన్న పంది పిల్ల ఆకలి వేయడంతో శునకం పాలు తాగింది. ఆ పందిపిల్ల పాలు తాగుతున్న క్రమంలో శునకం మరో చోటుకి వెళ్లుతుంది. కానీ, పంది పిల్లకు ఎంత ఆకలి ఉందో? దాని వెంటనే పరుగెడుతూ మళ్లీ శునకం దగ్గరుకు వెళ్లీ పాలు తాగుతుంది. దీంతో శునకం అక్కడే ఉండి పంది పిల్ల ఆకలి తీర్చుతుంది. ఈ వింత ఘటన పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమీపంలోని వీధిలో శునకం పంది పిల్లకు పాలు ఇచ్చింది. దీన్ని ఆ ప్రాంత ప్రజలు ఆశ్చర్యంగా తిలకించారు. జాతి వైరం వీడి పంది పిల్లకు పాలిచ్చి, శునకం తల్లి ప్రేమను చాటిందని పలువురు పేర్కొన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
పంది పాలు తాగిన పిల్లి.. వైరల్ అవుతున్న వీడియో
సాక్షి, జడ్చర్ల టౌన్(మహబూబ్నగర్): సమాజంలో ఏ వింత జరిగినా బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందని పెద్దలు చెప్పడం వింటూ ఉంటాం. అలాంటిదే ఈ వింత. జడ్చర్లలో మంగళవారం ఓ పిల్లి పందిపాలు తాగుతున్న వీడియో వైరల్గా మారింది. శ్రీలక్ష్మీనగర్ కాలనీలో కారుపక్కన గోడచాటున పందిపడుకుని ఉండగా అటునుంచి వచ్చిన పిల్లి దాని పాలు తాగడం గమనించిన కొందరు వీడియో తీశారు. పిల్లి కొద్దిసేపు పాలు తాగినా పంది వద్దని వారించకపోవటం విశేషం. దీన్ని సోషల్ మీడిమాలో పోస్టు చేయడంతో వైరల్గా మారింది. చదవండి: ఈ తెల్లటి డేగ రేటెంతో తెలుసా? జస్ట్ 3.4 కోట్లు!! -
‘వరల్డ్ఫేమస్’ మృగరాజు, చైనా వరాహం.. ఇక లేవు
ముఖంపై గాటు, క్రూరమైన చూపులు, హుందాగా వ్యవహరించే తీరు.. వెరసి విలక్షణమైన లక్షణాలతో గుర్తింపు పొందిన ఆఫ్రికన్ సింహం ‘స్కార్ఫేస్’ ఇక లేదు. 14 ఏళ్ల మగ సింహం.. అనారోగ్యంతో చనిపోయినట్లు సఫారీ నిర్వాహకులు ధృవీకరించారు. కెన్యాలోని మసాయి మారా గేమ్ రిజర్వ్లో ఇది ఇంతకాలం బతికింది. కాగా, కుడికన్ను పక్కన గాటుతో ఉండే ఈ సింహాన్ని.. లయన్కింగ్ దుష్ట సింహం ‘స్కార్’ క్యారెక్టర్తో పోలుస్తుంటారు చాలా మంది. ఇదే టూరిస్టుల్లో ఈ సింహానికి గుర్తింపు తెచ్చిపెట్టింది. చనిపోయే ముందు అది తాను పుట్టిన ప్రాంతంవైపు నడిచిందని, దురదృష్టవశాత్తూ గమ్యానికి 15 కిలోమీటర్ల అది చనిపోయిందని సఫారీ నిర్వాహకులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో స్కార్ఫేస్ మీద బీబీసీ, నేషనల్ జియోగ్రఫిక్, హిస్టరీ లాంటి చానెల్స్ ఎన్నో డాక్యుమెంటరీలను తీశాయి కూడా. సెన్సేషన్ పిగ్ కూడా.. చైనా హీరో పిగ్ ఇక లేదు. జూన్ 14న అది చనిపోయినట్లు దాని సంరక్షకులు వైబో ద్వారా ప్రకటించారు. 2008లో చైనా భారీ భూకంపం తర్వాత ఓ భారీ పంది ఫేమస్ అయ్యింది. సిచువాన్ ప్రావిన్స్లో దాదాపు 36 రోజుల తర్వాత శకలాల నుంచి అది ప్రాణాలతో బయటపడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. జు జియాంగియాంగ్ అనే పేరుతో జనాలు ముద్దుగా పిల్చుకునే ఆ పంది.. అన్నిరోజులపాటు వర్షం నీళ్లు, కాల్చిన బొగ్గు తిని అంతకాలం ప్రాణాల్ని నిలబెట్టుకోగలిగింది. విపత్కరకాలంలో ఎలా బతకాలో జియాంగియాంగ్ను చూసి నేర్చుకోవాలని పేర్కొంటూ చైనావాళ్లు దానిని ‘హీరోయిక్ పిగ్’గా ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ తర్వాత ఓ మ్యూజియం నిర్వాహకులు ఇంతకాలం దాని సంరక్షణ చూస్తూ వచ్చారు. చదవండి: గుంపుగా అడవి దున్నలు-సింగిల్గా సింహం, ఆ తర్వాత.. -
కుంచనపల్లిలో పందుల పోటీలు
తాడేపల్లిగూడెం రూరల్: సంక్రాంతి పేరు చెబితే మనకు ప్రధానంగా గుర్తుకొచ్చేది కోడిపందేలు. అయితే, మండలంలోని కుంచనపల్లి గ్రామంలో మాత్రం ఈ సంప్రదాయానికి భిన్నంగా పందుల పోటీలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఎస్టీ సంక్షేమ సంఘం నాయకులు సింగం పట్టాభి, సుబ్బారావు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ పోటీలు బుధవారం జరిగాయి. జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పందుల పెంపకందారులు ఈ పోటీలకు తరలివచ్చారు. కత్తులు కట్టకుండా ఎటువంటి జీవహింస లేకుండా ఈ పోటీలను నిర్వహిస్తున్నట్టు సింగం సుబ్బారావు తెలిపారు. పోటీ నుంచి పారిపోయిన పంది పరాజయం పొందినదిగా భావించి బరిలో నిలబడిన పంది విజయం సాధించినట్లుగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ పోటీల్లో ఎటువంటి జీవహింస లేదని, తమపై వన్యప్రాణి సంరక్షణ సమితి వారు కేసులు నమోదు చేయడం సరికాదని వివరించారు. పోటీలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. -
వరాహం కుక్కపిల్లలకు పాలిచ్చి వెళుతోంది..
శింగనమల/పుట్లూరు: సహజంగా పందులు కనిపిస్తే కుక్కలు వెంటబడి తరుముతుంటాయి. అదేస్థాయిలో అసహాయ స్థితిలో ఉన్న కుక్కపిల్లలను తీవ్రంగా గాయపరిచి పందులు చంపేస్తుంటాయి. అలాంటిది జాతి వైరాన్ని మరిచి శునకం పిల్లలకు తమ స్తన్యాన్ని అందిస్తున్నాయి సుకరాలు! వివరాల్లోకి వెళితే.. శింగనమలలో వారం రోజుల క్రితం ఐదు పిల్లలకు ఓ కుక్క జన్మనిచ్చింది. ఆ తర్వాత ప్రమాదవశాత్తు తల్లి కుక్క వాహనాల కిందపడి చనిపోయింది. ఆకలి తట్టుకోలేక విలవిల్లాడుతున్న కుక్కపిల్లలను గమనించిన ఓ వరాహం.. వాటిని కరవకుండా పాలిస్తూ వస్తోంది. ఇలాంటిదే పుట్లూరు జెడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలోనూ చోటు చేసుకుంది. పదిరోజులుగా ఓ వరాహం క్రమం తప్పకుండా నాలుగు కుక్కపిల్లలకు పాలిస్తోంది. అనారోగ్యం కారణంగా పిల్లలకు తల్లి కుక్క పాలు ఇవ్వడం లేదు. దీంతో ఉదయం 9 గంటలకు ఓ వరాహం అక్కడకు చేరుకుని గంట పాటు కుక్కపిల్లలకు పాలిచ్చి వెళుతోంది. -
టీవీ రిపోర్టర్ను వెంటాడిన పంది..
లైవ్ టీవీ రిపోర్టింగ్ చేసే జర్నలిస్ట్లకు కొన్నిసార్లు అనుహ్య పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. తాజాగా గ్రీక్కు చెందిన ఓ రిపోర్టర్కు వింత అనుభవం ఎదురైంది. ఇటీవల ఏఎన్టీ1 టీవీకి చెందిన మాంటికోస్ అనే రిపోర్టర్ కైనెటా నగరంలో వరద నష్టంపై రిపోర్ట్ చేస్తున్నాడు. అయితే అతను రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో ఓ పంది అతని వద్దకు వచ్చింది. అయితే దాని నుంచి తప్పించుకుని రిపోర్ట్ చేద్దామని చూసిన అది అతన్ని వెంబడించింది. ఆ సమయంలో స్టూడియోలో ఉన్న జర్నలిస్టులతో మాంటికోస్ మాట్లాడుతూ.. ‘ఇక్కడ ఓ పంది మమ్మల్ని ఉదయం నుంచి వెంబడిస్తుంది. పంది నన్ను కోరకాడానికి ప్రయత్నిస్తుంది.. అందుకే ఇక్కడ నిల్చోలేకపోతున్నాను. నన్ను క్షమించండి’ అని పేర్కొన్నాడు. ఇది అంతా చూస్తున్న స్టూడియోలోని జర్నలిస్టులు తమ నవ్వును ఆపుకోలేకపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా, గతంలో లైవ్ రిపోర్టింగ్ చేస్తున్న మహిళా రిపోర్టలతో కొందరు వ్యక్తులు అసభ్యకరంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. Greek journo pestered by a pig while reporting on the recent floods in #Kinetta #Greece #tv #bloopers #ant1tv #Ant1news pic.twitter.com/vsLBdlWCMB — Kostas Kallergis (@KallergisK) November 26, 2019 -
వింత : ఏనుగు ఆకారంలో పంది పిల్లలు
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో వింత సంఘటన జరిగింది. గూడూరు మండలం నాయక్ పల్లి గ్రామంలో ఓ పందికి ఏనుగు ఆకారంలో ఉన్న రెండు పిల్లలు పుట్టాయి. ఏనుగు లాగ తొండం కలిగి ఉండడం ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. విషయం తెలిసిన గ్రామస్థులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పందిపిల్లలను చూడడానికి తరలివస్తున్నారు. పిల్లలు తెల్లగా ఉండి, చూడ్డానికి బాగున్నాయని పలువురు ప్రశంసిస్తున్నారు. కలియుగంలో ఇలాంటి సంఘటనలే జరుగుతాయని గ్రామంలోని కొందరు వృద్ధులు వాపోతున్నారు. 2016లో కాంబోడియా, 2014లో చైనాలలో ఇలాంటి పిల్లలు పుట్టాయి. -
హృదయ కాలేయం@వరాహం
గుండె సమస్య వచ్చిందా.. కొత్త గుండె కావాలా.. నో ఫికర్.. రంధి ఎందుకు పంది ఉందిగా.. మూత్ర పిండాలు చెడిపోయాయి.. కొత్తవి కావాలా.. అలా పందుల ఫాం దాకా వెళ్లొస్తే సరి.. కాలేయం కరాబ్ అయిందా.. అరే బాయ్.. వరాహం ఉందిగా.. అదే వెయ్యి వరహాలు లెక్క! అసలేంటి? పంది ఉంటే.. ప్రాబ్లెమ్ లేకపోవడమేంటి? పందికి మనకు ఉన్న ఆ లంకె ఏంటి? అన్నీ అనుకున్నట్లు జరిగితే.. సమీప భవిష్యత్తులో పంది మనపాలిట వరాహావతారమే కానుంది. ఎందుకంటే.. మనకు ఏ అవయవం కావాలన్నా.. పంది శరీరం నుంచి తీసుకోవచ్చంటున్నారు జపాన్ శాస్త్రవేత్తలు. మన అవయవాలను పందిలో పెంచుకో వచ్చని వారు చెబుతున్నారు. మన మూల కణాలను (స్టెమ్సెల్స్) వేరే జంతువులోకి చొప్పించి.. మన అవయవాలను పెంచే అవకాశాలపై ప్రొఫెసర్ హిరోమిట్సు నకౌచీ అనే శాస్త్రవేత్త తన బృందం తో కలసి పదేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా మానవుల అవయవాలను ఏదైనా క్షీరదంలో ప్రవేశపెట్టి.. పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రపంచంలోనే తొలిసారిగా జపాన్ ప్రభుత్వం వీరికి అనుమతిచ్చింది. ఇలా పెంచుతారట.. ఇప్పటికే మూల కణాలను ఉపయోగించి అవయవాలను వృద్ధి చేసే ప్రయోగాలు చాలానే జరిగాయి. - ఏ అవయవాన్ని పెంచాలనుకుంటున్నామో ముందు శాస్త్రవేత్తలు నిర్ణయించుకుంటారు. - మన మూల కణాలను క్షీరదం (జంతువు) పిండంలోకి ఎక్కించి.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా డీఎన్ఏలో మార్పులు చేస్తారు. - డీఎన్ఏ మార్పులు చేయడం ద్వారా మనకు కావాల్సిన అవయవం మళ్లీ పెరగకుండా ఉండేందుకు దోహదపడుతుంది. - దీనివల్ల పిండం ఎదుగుతున్న కొద్దీ దాని శరీరం లో వేరే (మానవుడి) అవయవం పెరిగినా ఇబ్బందులు రాకుండా ఉంటుంది. - ఆ తర్వాత ఆ పిండాన్ని తల్లి క్షీరదం గర్భంలోకి ఎక్కిస్తారు. - గర్భంలో సాధారణ జంతువు మాదిరిగానే పెరుగుతుంది. - అయితే పుట్టబోయే జంతువులో మనకు కావాల్సిన అవయవం సాధారణంగా పెరుగు తుంటుంది. కానీ అందులోని ప్రతి కణం మాత్రం మానవుడిదే. - ఆ జంతువు ఎదిగిన తర్వాత మనకు కావాల్సిన అవయవాన్ని ఆ జంతువును చంపేసి తీసుకుని రోగి శరీరంలోకి మార్పిడి చేసుకోవచ్చు. సాధ్యమయ్యే పనేనా.. మన మూల కణాలను జంతువు తన శరీరంలో ఎలా వాడుకుంటుందనే విషయంపై ఎలాంటి స్పష్టత లేకుండా పోయింది. ఉదాహరణకు మూల కణాలు మనం అనుకున్న అవయవం కాకుండా వేరే భాగాల్లో ముఖ్యంగా జంతువు మెదడులోకి వెళ్లి.. మనలాగే తెలివి మీరితే ఏం చేస్తారన్న దానికి పరిశోధకుల దగ్గర సమాధానం లేదు. ఎంతవరకు మానవుల లాగా వాటి శరీరాలు మారిపోతాయన్నది కూడా సమాధానం లేని ప్రశ్నే. తొలుత ఎలుకలపై ఇలాంటి పరిశోధనలు చేసి, ఆ తర్వాత పందుల పిండాల్లోకి మన మూలకణాలను ఎక్కించి పెంచుతానని ప్రొఫెసర్ హిరోమిట్సు చెబుతున్నాడు. ఇలా మన మూలకణాలున్న పిండాలు పూర్తిగా గర్భంలో ఎదిగి ఆ జంతువు ప్రసవం అయ్యే వరకు ఉంచేలా అనుమతినిస్తూ జపాన్ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. బ్రిటన్, ఫ్రాన్స్ ఇలాంటి ప్రయోగాలకు వారి దేశాల్లో అనుమతివ్వలేదు. అయితే ఈ వివాదాస్పదమైన ప్రయోగం వల్ల భవిష్యత్తులో మానవ విలువల విషయంలో సమస్యలు వస్తాయని, ఇలాంటివి ఇప్పటివరకు ప్రయోగ దశలోనే ఆగిపోయాయని, మరి ఇది ఎంతవరకు సఫలీకృతం అవుతుందో చూద్దామని చాలా మంది పెదవి విరుస్తున్నారు. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
గేదె కడుపున పందిపిల్ల..?
సాక్షి, సిరిసిల్లఅర్బన్: రాజన్న సిరిసిల్లా జిల్లాలో వింత సంఘటన చోటు చేసుకుంది. సిరిసిల్ల పరిధిలోని చిన్నబోనాలలో గేదె(బర్రె) కడుపులో పంది ఆకారంలో జంతువు జన్మించింది. దీంతో గ్రామ ప్రజలు ఆశ్చర్యానికి లోనయ్యారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గోసుకుల మల్లయ్య అనే రైతు ఆదివారం పశువుల అంగడిలో బాలమల్లు అనే రైతు వద్ద గేదెను కొనుగోలు చేశాడు. ఆ మరుసటి రోజే పంది ఆకారంలో ఉన్న దూడకు గేదె జన్మనిచ్చింది. వింత ఆకారంలో ఉన్న దూడను చూసేందుకు జనం తరలివచ్చారు. నెలలు నిండకపోవడం వల్లే ఇలాంటి సంఘటన జరిగిందని గ్రామస్తులు చర్చించుకున్నారు. -
మేక కడుపులో పందిని పోలిన పిల్ల
కంగ్టి(నారాయణఖేడ్): మేక కడుపులో పంది జన్మించిందంటే అందరూ వేళాకోలం అని కొట్టి పారేస్తారు. కానీ కంగ్టి మండలం ముర్కుంజాల్ గ్రామంలో ఓ మేక పందిని పోలిన పిల్లకు జన్మనిచ్చింది. గ్రామానికి చెందిన రఘునాథ్రావు పాటిల్కు చెందిన మేక ఈనిన ప్రతీసారి నాల్గు పిల్లలకు జన్మనిచ్చేది. ఈ క్రమంలో గత మూడు రోజులుగా నిండు చూలుతో ఉన్న మేక అస్వస్థతకు గురి కావడంతో సమీపంలోని తడ్కల్కు చెందిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఎంఏ రహీం పరిశీలించి మందులు ఇచ్చారు. కాగా గురువారం రాత్రి మేక మూడు మేక పిల్లలకు జన్మనిచ్చింది. అనంతరం మృతిచెందింది. మూడు మేక పిల్లలు జన్మించిన అనంతరం మేక కడుపు ఉబ్బెత్తుగా ఉండటంతో అనుమానం వచ్చిన స్థానికులు మేక కడుపు కోసి చూడగా ఆశ్ఛర్యకరంగా వింత జంతువు బయట పడింది. వింత జంతువు పిల్ల దాదాపు ఐదు కిలోగ్రాముల బరువుతో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. దీంతో గ్రామస్తులే కాకుండా పొరుగు గ్రామాల నుంచి జనాలు తండోపతండాలుగా వచ్చి వింతను తిలకించారు. ఈ విషయంలో వీఏఎస్ డాక్టర్ ఎంఏ రహీంను విచారించగా చాలా అరుదుగా ఇలాంటి సంఘటనలు జరుగుతాయని పేర్కొన్నారు. దీనికి కారణం జన్యుపరమైన లోపాలని తెలిపారు. -
బస్టాండ్లో పంది దాడి.. ముగ్గురికి గాయాలు
సంగారెడ్డి: జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్లో ఓ అడవి పంది గురువారం హల్ చల్ చేసింది. బస్టాండ్లోకి వచ్చి ప్రయాణికుల్ని పరుగులు పెట్టించింది. అకస్మాత్తుగా ప్రయాణికులపై దాడి చేసి ముగ్గుర్ని తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటనలో ఓ మహిళ చేతికి తీవ్రగాయమైంది. ఆర్టీసీ సిబ్బంది వెంటనే స్పందించి అడవి పందిని రాళ్లతో బయటకు తరిమికొట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన మహిళను 108 వాహనంలో స్థానిక ఆసుపత్రికి తరలించారు. అడవి పంది విషయం అటవీ శాఖాధికారులకు తెలియజేయడంతో వారు వలతో సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పందిని పట్టుకోవడానికి అటవీశాఖ సిబ్బంది కూడా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఆఖరికి జాలీ వేసి పట్టుకుని అడవికి తరలించారు. -
వరాహంపై వానరం
కురవి : వరాహం వీపుపై వానరం కూర్చుని సుమారు అరగంటపాటు ఆడుకున్న సంఘటన కురవి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వెనుక భాగంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. వరాహం రోడ్డు పక్కన వెళ్తుండగా కోతి(వానరం) ఒక్క ఉదుటున వచ్చి దాని వీపుపై ఎక్కి కూర్చుంది. కొద్దిసేపు అలానే పడుకుని నిద్రపోయింది. వరాహం మేత మేసుకుంటూ వెళ్తూ ఉండగ వానరం వీపుపై అలాగే ఉన్న దృశ్యం చూపరులను ఆకట్టుకుంది. వరాహం కోతిని ఏమి అనకపోవడంతో సుమారు అరగంట పాటు వినోదాన్ని పంచింది. -
తారాస్థాయికి చేరిన నకిలీ వార్తలు
సోషల్ మీడియాలో నకిలీ వార్తలు పేట్రేగిపోతున్నాయి. తాజాగా ‘బ్రహ్మం గారు చెప్పినట్లే జరిగింది. పంది కడుపున మనిషి జన్మించాడు.’ అనే నకిలీ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. పంది కడుపున మనిషి శిశువు జన్మించినట్లు చూపుతున్న ఫొటోలు పోస్టుకు జత చేసి నెటిజన్లు షేర్ చేసుకుంటున్నారు. అయితే, అవన్నీ తప్పుడు కథనాలు. సిలికాన్తో బొమ్మలను తయారు చేసే ఆర్టిస్ట్ మగానుకో లైరా పంది రూపంలో ఉన్న మానవ శిశువును తయారు చేశారు. లైరా సొంత దేశం ఇటలీ. సిలికాన్తో అద్భుతమైన బొమ్మలు చేయడంలో ఆమె చేయి తిరిగిన వారు. అలా పంది రూపంలోని మానవ శిశువును తయారు చేసిన ఆమె దాన్ని తన సొంత ఆన్లైన్ స్టోర్ ఎస్టీ.కామ్ అమ్మకానికి పెట్టారు. రకరకాలుగా దాన్ని ఫొటోలు తీసి, అందంగా ఉంచేందుకు ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలే నకిలీ వార్తగా మారి, బ్రహ్మంగారు చెప్పినదే జరిగిందనే భ్రమలో ప్రజలను పడేసింది. ముఖ్యంగా ఈ వార్త తెలంగాణలో విపరీతంగా చక్కర్లు కొట్టింది. ఎక్కడో కాదు యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లిలోనే ఈ సంఘటన జరిగిందని వాట్సాప్లో షేర్ అవుతోంది. నకిలీ వార్తల ప్రభావంతో ఈ మధ్యకాలంలోనే వాట్సాప్ కొత్త అప్డేట్ను ప్రవేశపెట్టింది. అంతేకాకుండా పత్రికల్లో ప్రకటన ఇస్తూ సైతం నకిలీ వార్తలను నమ్మొద్దని ఏ విషయాన్నైనా రెండు, మూడు సార్లు తరచి చూసిన తర్వాతే షేర్ చేయండని ప్రజలను కోరింది. ఒకరికి తెలిసిన మాట, ఇంకొకరి నోటి నుంచి బయటకు వెళ్లేప్పుడు దాన్ని కొంత ఎక్కువ చేసి చెప్పడం సహజం. ఈ రకంగానే పంది వార్త షేర్ అయినట్లు అర్థం అవుతోంది. కాగా, నకిలీ వార్తల కారణంగా దేశంలో పిల్లలు ఎత్తుకుపోతున్నారనే సందేహంతో ఏ నేరం చేయని వారిని ప్రజలు చంపుతున్న సంగతి తెలిసిందే. -
పికాసో కాదు.. పిగ్కాసో!
చిత్ర కళలో పేరొందిన కళాకారుడు పికాసో.. ఆయన తర్వాత నేనేనంటూ చిటికెలో చిత్రాలు గీస్తోంది ఈ పిగ్కాసో. ఎవరీ పిగ్కాసో అనుకుంటున్నారా! పక్క చిత్రంలో కనిపిస్తున్న పందిగారే.. దక్షిణాఫ్రికాలో ఓ కబేళాకు తరలిస్తున్న నాలుగు వారాల పందిపిల్లను కాపాడి దత్తత తీసుకుంది జంతు హక్కుల సామాజిక కార్యకర్త జొన్నె లెఫ్సోన్. అప్పటి నుంచి దాన్ని వ్యవసాయ క్షేత్రానికి తరలించి పెంచుకోసాగింది. ఓ రోజు పంది ఆడుకోవడానికి వెరైటీ బొమ్మలను దాని ముందు పడవేసింది. అది మాత్రం తనకు నచ్చిన పెయింటింగ్ బ్రష్ను ఎంచుకుంది. ఇది గమనించిన లెఫ్సోన్ దాని ముందు కెన్వాస్ అమర్చి రంగుల్ని అందుబాటులో ఉంచింది. ఇంకేముంది నోట్లో బ్రష్ పట్టుకొని రంగుల్లో ముంచుతూ బొమ్మలు గీయడం ప్రారంభించింది. అప్పటినుంచి పిగ్ కాస్తా పిగ్కాసోగా మారింది. ఇప్పటికే ఎన్నో చిత్రాలను గీసింది. అన్నట్టు చెప్పడం మరిచానండోయ్.. పిగ్కాసో కళాఖండాలకు మంచి డిమాండ్ కూడా ఉంది. ఒక్కో చిత్రం దాదాపు 2 వేల డాలర్లకు అమ్ముడవుతోంది. పిగ్కాసో గురించి లెఫ్సోన్ను ప్రశ్నిస్తే.. అది చాలా తెలివైందని, అసాధారణ ప్రతిభ గలదని ప్రశంసించింది. చిత్రాలు గీయాలనుకున్నప్పుడే గీస్తుందని.. బొమ్మలు గీయాలని ఏనాడూ బలవంతపెట్టలేదని చెప్పింది. -
ఘర్షణకు దారితీసిన పంది వ్యవహారం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పంది విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సంఘటన టేకులపల్లి మండలం బేతంపూడి గ్రామంలో బుధవారం జరిగింది. పంచాయతీలో మాట్లాడుదామని చెప్పి ఓ వర్గానికి చెందిన వారిని మరో వర్గానికి చెందిన వారు చితకబాదారు. గ్రామానికి చెందిన సింగబోయిన నాగరాజు మిర్చి తోటలో మేడ కృష్ణకు చెందిన పంది వెళ్లి నాశనం చేసిందని పందిని చంపారు. ఈ విషయమే ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలోఇద్దరు దంపతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలిసిన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మూడు పంది పిల్లలు – తోడేలు
అనగనగా ఒక అడవి. అడవి ప్రక్కన ఒక గ్రామం. ఆ గ్రామంలో మూడు పంది పిల్లలు వాళ్ళ అమ్మనాన్నలతో హాయిగా జీవించేవి. అవి పెద్దవయ్యాక వాళ్ళ ఇల్లు సరిపోకపోవడంతో తల్లిదండ్రులు వాటిని వేరేగా మంచి ఇల్లు కట్టుకుని ఉండమన్నాయి. అప్పుడవి మంచి ప్రదేశం కోసం వెతుకుతూ అడవిలోకి వెళ్ళాయి. ఒక రావి చెట్టు దగ్గర మంచి ప్రదేశం చూసుకున్నాయి. అక్కడ ఇల్లు ఎలా కట్టుకోవాలా అనుకుంటుండగా ఆ దారినే పోతున్న ఒక ఒంటె ఈ పంది పిల్లలని చూసి సంగతేంటని అడిగింది. ‘‘మేము ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాము. అయితే ఇల్లు దేనితో కట్టుకోవాలో తెలియడంలేదు’’ అన్నాయవి. అప్పుడా ఒంటె ‘‘ఏమీ దిగులు పడకండి. నాకు ఇటుకల బట్టీ ఉంది. బాగా కాల్చిన ఇటుకలు ఇస్తాను. వాటితో కట్టుకోండి’’ అంది. అవి ఒంటెకి ధన్యవాదాలు చెప్పుకుని ఇంటికి కావలసినన్ని ఇటుకలు తెచ్చుకుని, ఇల్లు కట్టుకుని అక్కడ ఉండసాగాయి. ఒకరోజు ఈ మూడు పందులని గమనించిన ఒక తోడేలు ఎలాగైనా వాటిని పట్టి తినాలనుకుంది. అది పందులున్న ఇంటి దగ్గరకొచ్చి ‘‘ఏయ్, మురికి పందులూ, నన్ను లోపలకి రానివ్వండి’’ అంది. ‘‘నిన్ను మేము రానివ్వం. రానిస్తే మమ్మల్ని తింటావని మాకు తెలుసు’’ అన్నాయి పందులు. ‘‘మీరు రానివ్వకపోతే మీ ఇల్లు ఊదేస్తాను, ఇంటిని పీకేస్తాను, మిమ్మల్ని పట్టి తినేస్తాను’’ అంది తోడేలు. ‘‘వద్దు, వద్దు’‘ అని అరిచాయి లోపల నుండి పందులు. తోడేలు ‘హఫ్, హుఫ్, హఫ్, హుఫ్’ అని ఊదింది. ఇటుకలని పీకడానికి ప్రయత్నించింది. ‘‘అబ్బ! ఈ ఇల్లుగట్టిగా ఉందే’’ అని, ‘‘సరే ఇçప్పుడు చీకటి పడింది కాబట్టి వెళ్ళిపోతున్నాను. రేపు సాయంత్రం సుత్తితో వస్తాను. తలుపు పగలగొట్టి లోపలకి వస్తాను’’ అంటూ వెళ్ళిపోయింది. ‘‘వద్దు, వద్దు. మా ఇంటినేం చేయొద్దు’’ అరిచాయి పందులు. తెల్లవారింది. మూడు పందులకి ఏం చేయాలో పాలుపోక ఏడుçస్తూ కూర్చున్నాయి. అప్పుడు ఆ దారిలో పోతున్న నిప్పు కోడి విషయం తెలుసుకుని.. ‘‘ఏడవకండి, నా దగ్గర పట్టుకుంటే షాక్కొట్టే తాళాలు ఉన్నాయి. వాటిని బిగించండి. ఆ తోడేలు వచ్చినప్పుడు స్విచ్ వేయండి. పట్టుకుంటే షాక్కొట్టి అల్లంత దూరాన పడుతుంది. ఇక మీ జోలికిరాదు’’ అంది. మూడు పందులూ నిప్పుకోడికి కృతజ్ఞతలు చెప్పుకుని కరెంటు తాళాలు తెచ్చి తలుపులకు బిగించాయి. సాయంత్రమైంది. సుత్తితో తోడేలు వచ్చింది. ‘‘ఏయ్, మురికి పందులూ.. మీ తాళాన్ని పీకేస్తాను, తలుపులని పగలగొట్టి, లోపలకొచ్చి మిమ్మల్ని పట్టి తినేస్తాను’’ అంది తోడేలు. ‘‘వద్దు, వద్దు’’ అని అరిచి గబగబా స్విచ్చి వేశాయి. స్విచ్చి వేయగానే తాళాలన్నీ ఎర్రగా మండసాగాయి. తోడేలు సుత్తి తీసుకుని తాళం పగలగొట్టబోయింది. షాక్కొట్టి ఎగిరి అవతలపడింది. ‘‘ఓ, కరెంటు తాళాలు వేశారా, సరే రేపు వస్తాను, డ్రిల్లింగ్ మిషిన్ తెస్తాను, తాళాలు పగలగొట్టి లోపలకి వస్తాను’’ అంది కోపంగా. ‘‘వద్దు, వద్దు.’’ అరిచాయి పందులు. తెల్లవారింది. ఏం చేయాలో తెలియక ఏడుస్తూ కూర్చున్నాయి పందులు. అప్పుడా దారిలో పోతున్న సీతాకోకచిలుకల గుంపు ఈ పందుల దగ్గర వాలి ‘‘ఎందుకేడుస్తున్నారు?’’ అని అడిగాయి. విషయం చెప్పగానే ‘‘మేము చెప్పినట్లు చేయండి. ముందుగా అదిగో ఆ ప్రక్కనున్న చెరువులో స్నానం చేసిరండి’’ అంది ఒక తెల్లని సీతాకోకచిలుక. అవి స్నానం చేసి వచ్చాయి. ‘‘ఇంటి ముందు పూల చెట్లతో అలంకరించండి’’ అన్నాయి ఎరుపు, నలుపు, నీలం రంగు సీతాకోక చిలుకలు. మూడు పందులూ గబగబా రకరకాల రంగుల పూల చెట్లను తెచ్చి నాటాయి. ‘‘ఇంటిపైకి పాకేలా పూల తీగలని నాటండి’’ అన్నాయి పసుపు సీతాకోక చిలుకలు. పందులు పూల తీగలను తెచ్చి ఇంటి పైకి పాకించాయి. ఇల్లు అందంగా తయారయింది. ‘‘ఆహా! మీ ఇల్లు ఎంత బాగుంది?’’ అంటూ సీతాకోక చిలుకలన్నీ ఇంటి ముందు పుప్పొడితో రంగవల్లులు వేసి వెళ్ళిపోయాయి. పందులు సీతాకోక చిలుకలకి వీడ్కోలు పలికాయి. ‘‘ఆహా! మన ఇల్లు ఎంత బాగుంది?’’ అనుకున్నాయవి. అలిసిపోయిన అవి హాయిగా పడుకుని నిద్రపోయాయి. సాయంత్రమయింది. తోడేలు డ్రిల్లింగ్ మిషెన్తో వచ్చింది. ‘‘పందులుండే ఇల్లు ఇది కాదే, దారితప్పానా?’’ అనుకుంది. సరిగ్గా చూసింది. ‘‘ఆహా! ఇదే కాని ఈ ఇల్లు ఎంత బాగుంది?’’ అనుకుంటూ వచ్చి ‘‘పందులూ, శుభ్రంగా ఉన్న పందులూ మీ ఇల్లు ఎంత బాగుంది, ఎంత సువాసనగా ఉంది? నన్ను లోపలకి రానివ్వండి’’ అని చిన్నగా అడిగింది. ‘‘రానిస్తాం, కాని నువ్వు మమ్మల్ని ఎందుకు తినాలనుకుంటున్నావ్? మా దగ్గర బోలెడన్ని దుంపలు, తేనె ఉంది. నీకు అవి ఇస్తాం. నువ్వు మాతో స్నేహం చేస్తే నీకు చాలా ఆటలు కూడా నేర్పుతాం!’’ అన్నాయవి. ‘‘ఓ! అలాగే, నేను మీతో స్నేహం చేస్తాను. మీరు పెట్టినవే తింటాను, మీతో ఆటలాడతాను, లోపలకి రానివ్వండి. మీ ఇంటిని చూస్తుంటే నాకు హాయిగా ఉంది. ఇంతకు ముందు మిమ్మల్ని తింటానని బెదిరించినందుకు క్షమించండి’’ అంది తోడేలు. ‘‘ఇప్పుడు మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాము’’ అంటూ పందులు తలుపు తీశాయి. తోడేలు లోపలకి వెళ్ళింది. శుభ్రంగా ఉన్న పందులనీ, ఇంటినీ చూసి చాలా ఆనందపడింది. అన్నీ చక్కగా చేతులు కడుక్కుని దుంపలుతిని, తేనెని తాగాయి.ఇంటి వెనుకనున్న తోటలో అవన్నీ కలసిమెలసి సంతోషంగా ఆటలాడుకున్నాయి. రావిచెట్టు మీద వాలి ఇదంతా చూస్తున్న సీతాకోక చిలుకలు కిలకిలా నవ్వాయి. – రాధ మండువ -
ఇది కొత్త పంది.. పేరు తిరుపతి వరాహ
నూతన రకాన్ని రూపొందించిన తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీ యూనివర్సిటీ క్యాంపస్: తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ నూతన పంది రకాన్ని రూపొందించింది. దీనికి ‘తిరుపతి వరాహ’ అనే పేరు పెట్టింది. వెటర్నరీ యూనివర్సిటీలో శనివారం జరిగే కార్యక్రమంలో భారత వ్యవసాయ పరిశోధన మండలి ( ఐసీఏఆర్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జేకే జీనా విడుదల చేయనున్నారు. వీసీ ప్రొఫెసర్ వై.హరిబాబు దీనికి సంబంధించిన వివరాలను శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తిరుపతి వెటర్నరీ కళాశాల పరిధిలో ఆలిండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఆన్ పిగ్స్లో 1971 నుంచి పరిశోధనలు జరుగుతున్నట్లు తెలిపారు. 1971 నుంచి 80 వరకూ లార్జ్ యార్క్షైర్ పిగ్స్ ( సీమ పందులు)పై, 1981 నుంచి 87 వరకూ దేశీయ పందుల (నాటు పందులు)పై పరిశోధనలు చేసినట్లు చెప్పారు. అనంతరం 1987 నుంచి 2007 వరకూ సీమ పందులు, నాటు పందులను సంకరీకరించి నూతన రకాన్ని రూపొందించినట్లు చెప్పారు. అప్పటి నుంచి 21 తరాలకు ఈ రకాన్ని పరిశీలించామని, ప్రతి తరంలో పంది పిల్లల్లో ఏర్పడిన అవలక్షణాలను సరిచేస్తూ పరిశోధనలు చేసినట్లు చెప్పారు. 21 తరాల తర్వాత ఎలాంటి అవలక్షణాలూ లేని రకం లభించిందన్నారు. దీంతో ఈ రకాన్ని రైతులకు, పందుల పెంపకందార్లకు అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. ఈ రకంలో 75 శాతం సీమ పందుల లక్షణాలు, 25 శాతం నాటు పందుల లక్షణాలు ఉంటాయన్నారు. ప్రస్తుతం తమ వద్ద 224 పందులు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. నేషనల్ బ్యూరో ఆఫ్ ఆనిమల్ జెనటిక్ రీసెర్చ్( ఎన్బీఏజీఆర్) ప్రతినిధులు శనివారం ఈ రకాన్ని రిజిస్టర్ చేసుకుంటారని, రిజిస్టర్ చేయడం అంటే పేటెంట్ పొందడంవంటిదని వివరించారు. కార్యక్రమంలో పరిశోధన డైరెక్టర్ ప్రొఫెసర్ రాఘవరావు, పందుల పరిశోధన సంస్థ ఇన్చార్జ్ ప్రొఫెసర్ జే.సురేశ్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గంగరాజు, ఫిజియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ రాంబాబునాయక్ పాల్గొన్నారు. -
బాసర ఆలయంలో పంది హల్చల్
బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఓ పంది హల్ చల్ చేసింది. మరి ఏమైందో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఆలయ ప్రాంగణంలో పంది ప్రత్యక్షమైంది. దానిని పట్టుకోవడానికి సిబ్బంది ఆష్టకష్టాలు పడ్డారు. చివరికి పట్టుకుని బయట వదిలేశారు. పంది ఆలయ ప్రాంగణంలోనికి ఎలా వచ్చిందనే దానిపై అధికారులు విచారిస్తున్నారు. -
పందుల దాడిలో చిన్నారికి గాయాలు
కౌతాళం : కౌతాళానికి చెందిన నరసయ్య, ఎలమ్మ దంపతుల కుమారుడు చరణ్ (3) పందుల దాడిలో గాయపడ్డాడు. గురువారం ఉదయం తల్లిదండ్రులు ఇంటి పనిలో నిమగ్నం కాగా, ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై పందులు దాడి చేశాయి. గాయపడిన బాలుడిని స్థానిక పీహెచ్సీలో ప్రాథమిక చేయించి ఆదోనికి తరలించారు. కౌతాళంలో పందుల బెడద అధికంగా ఉందని ఫిర్యాదు చేసినా పంచాయతీ సిబ్బంది, అధికారులు పట్టించుకోవడం లేదని ఆయా కాలనీవాసులు విమర్శిస్తున్నారు. -
ట్రంప్ ఓ పంది, కుక్క.. అంతకంటే ఎక్కువే
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్పై వ్యతిరేకత ఎక్కువవుతోంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబర్ట్ డే నీరో ట్రంప్పై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ట్రంప్ ఓ పంది, ఓ కుక్క, పనికిమాలిన ఎద్దు ఇంకా చాలా అంటూ ఆయన ఓ వీడియో సందేశంలో చెప్పారు. అతడొక జాతీయ విపత్తులాంటివారంటూ ఆరోపించారు. ట్రంప్ విషయమే తనకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోందని, అసలు ఇతడు ఎక్కడి నుంచి వచ్చాడో అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ట్రంప్ ముక్కుమీద ఒక్కసారి గట్టిగా ఒక పంచ్ ఇవ్వాలని అనుకుంటున్నానని చెప్పాడు. అంతకుముందు కూడా ట్రంప్ ఓ ట్యాక్సీ డ్రైవర్ లాంటి వాడంటూ విమర్శించాడు. -
పెద్దింట్లమ్మ ఆలయ ఈవోకు తీవ్ర గాయాలు
ఉండి : ఉండి బస్టాండ్ సమీపంలో ఎన్నార్పీ అగ్రహారం వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో కృష్ణాజిల్లా కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం ఈవో కొండలరావు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. శుక్రవారం సాయంత్రం ఈవో కొండలరావు ద్విచక్రవాహనంపై మరో వ్యక్తితో కలిసి ఉండివైపు వస్తున్నారు. ఆ సమయంలో వర్షం పడుతుండడంతో వేగంగా వస్తున్నారు. ఈ క్రమంలో ఉండి బస్టాండ్కు సమీపంలో పంది అడ్డుగా రావడంతో దానిని ఢీకొట్టి ద్విచక్రవాహనం పల్టీకొట్టింది. దీంతో కొండలరావుతోపాటు, మరోవ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. కొండలరావు తలకు తీవ్ర గాయమైంది. ఘటనా స్థలంలోనే ఆయనకు ఫిట్సు రావడంతో స్థానికులు సపర్యలు చేశారు. 108కు ఫోన్ చేశారు. 20 నిమిషాలు ఆలస్యంగా 108 రావడంతో కొండలరావు పరిస్థితి విషమించింది. ఎట్టకేలకు ఆయనతోపాటు మరో వ్యక్తిని భీమవరం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో పంది మరణించింది. -
అదుగో... పంది పిల్ల
రవిబాబు ఎప్పుడు సినిమా ఆరంభిస్తారో.. ఎప్పుడు పూర్తి చేస్తారో ఎవరికీ తెలియదు. సెలైంట్గా మొదలుపెట్టేసి, షూటింగ్ పూర్తి చేసేస్తారు. మరో నెల, రెండు నెలల్లో విడుదల అనగా ఆ సినిమా వివరాలు బయటపెడతారు. ఇప్పుడు ఆయన పందిపిల్ల ముఖ్యపాత్రలో ఓ సినిమా చేశారు. ఇందులో అభిషేక్, నాభ ప్రధాన పాత్రధారులు. ‘ఏనుగు’, ‘కోతి’, ‘ఈగ’లు మనల్ని అలరించాయి. వెండితెర పైన వరాహం ముఖ్యపాత్రలో కనిపించనుండటం ఇదే ప్రథమం. అందుకే టాలీవుడ్లో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి ‘అదుగో’ అనే టైటిల్ ఖరారు చేశారు. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.సురేశ్బాబు ఈ సినిమా నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ‘‘ఇప్పటి వరకూ ఎవరూ తీయని వైవిధ్యమైన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కించాం. త్వరలోనే ఆడియో, సినిమా విడుదల వివరాలు తెలియజేస్తాం’’ అని నిర్మాత పేర్కొన్నారు. -
దళితులను ‘పంది’తో పోల్చిన ఎమ్మెల్యే
ముంబై: దళితులను అభ్యున్నతి గురించి మాట్లాడుతూ వారిని పందితో పోల్చిన ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ నెల 17న థానే జిల్లాలో జరిగిన ఓ మీటింగ్ లో బీజేపీ ఎమ్మెల్యే దొంబివ్లీ రవీంద్ర చవాన్ దళితుల అభ్యున్నతిపై ఉపన్యసిస్తూ వారిని పందితో పోల్చారు. అబ్రహం లింకన్ డ్రైనేజీలోని పందిని తీసి శుభ్రం చేసిన తరహాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ లు కూడా దళితుల అభ్యన్నతికి కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ అభ్యతరంకరమైన వ్యాఖ్యలపై ఆన్లైన్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనిపై నిరసన చేపట్టిన ఎన్సీపీ ఆ పంది పేరు రవీంద్ర చవాన్ అంటూ కార్యక్రమాన్ని నిర్వహించారు. దళితులపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని ఎన్సీపీ డిమాండ్ చేసింది. దీనిపై స్పందించిన చవాన్ తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని, దళితులపై అలాంటి వ్యాఖ్యలు తాను చేయలేదని, తన వ్యాఖ్యల వీడియోను మార్ఫింగ్ చేశారని అన్నారు. -
'మనుషులకు పందుల అవయవాలు'
వాషింగ్టన్: వివిధ ప్రమాదాలలో, వ్యాధుల వల్ల అవయవాలు కోల్పోయే వారికి పందుల నుండి సేకరించిన అవయవాలను అమర్చడానికి శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నంలో కీలక ముందడుగు పడింది. నూతన జన్యు ఎడిటింగ్ విధానం ' సిఆర్ఐఎస్పీ ఎస్9' ద్వారా ఇంతకు ముందు సాధ్యం కానటువంటి క్లిష్టమైన జీన్ ఎడిటింగ్ ప్రక్రియ సాధ్యమైనట్లు హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం తెలిపింది. మానవుని గుండెకు సంబంధించిన కవాటాల మార్పిడి చికిత్సలో పందుల యొక్క గుండె కవాటాలను ప్రస్తుతం వాడుతున్నారు. కాగా అవయవాలను, కణజాలాలను ఉపయోగించాల్సిన సందర్భంలో ఎదురయ్యే సమస్యలు నూతన విధానంతో తొలగిపోనున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. నూతన జన్యు విధానం ద్వారా సుమారు 62 రకాల జన్యువులను ఎడిట్ చేసినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ విధానం పూర్తిగా అందుబాటులోకి వస్తే త్వరలోనే పందుల యొక్క పూర్తి స్థాయి కణజాలాలు, అవయవాలు మనుషులకు అమర్చనున్నారు. -
చట్టం ముందు పశువులూ సమానమే!
చట్టం ముందు అందరూ సమానమే అని చెబుతారు గానీ, అన్నీ సమానమే అనరు. ఒకానొకప్పుడు మాత్రం చట్టం ముందు అన్నీ సమానమే అనే సూత్రాన్ని తు.చ. తప్పకుండా పాటించేవారు. మధ్యయుగాల నాటి ఆ సర్వసమాన చట్టాలు మనుషులకు మాత్రమే పరిమితం కాదు. నల్లులు, బల్లులు, కొంగలు, కోళ్లు, పిల్లులు, ఎలుకలు, పందులు, ఏనుగులు వంటి సమస్త క్రిమికీటకాలకు, పశుపక్ష్యాదులకు కూడా ఇవి వర్తించేవి. చట్టరీత్యా వాటికి నేర విచారణ కూడా జరిగేది. నాటి సర్వసమాన చట్టాలకు ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఫ్రాన్స్లో 1494 సంవత్సరంలో జరిగిన సంఘటన ఇది. ఉయ్యాలలో నిద్రిస్తున్న చిన్నారిపై దాడిచేసిన ఒక పందిని అక్కడి రక్షక భటులు అరెస్టుచేసి, న్యాయస్థానం ముందుకు తీసుకొచ్చారు. ఘనతవహించిన న్యాయస్థానం చట్టబద్ధంగా విచారణ చేపట్టింది. సాక్షుల నుంచి వాంగ్మూలాలూ తీసుకుంది. సాక్ష్యాలన్నీ పందికి వ్యతిరేకంగా ఉండటంతో, దానికి మరణశిక్ష విధించింది. ఆ రోజుల్లో ఫ్రాన్స్లోనే మరో కోర్టు బార్లీ పంటను నాశనం చేసిన ఎలుకలపై న్యాయవిచారణ చేపట్టింది. అంతకంటే విచిత్రం ఏమిటంటే ఎలుకల తరఫున వాదించడానికి బార్తలోమ్యూ చేసెనీ అనే న్యాయవాది కూడా సిద్ధపడ్డాడు. నిందితులైన ఎలుకలు విచారణకు హాజరు కాలేదు. అవి ఎందుకు హాజరు కాలేదని న్యాయమూర్తి ప్రశ్నిస్తే, వాటికి సమన్లు అందలేదని ఒకసారి, వేరే ఊరికి వెళ్లాయని మరోసారి, వీధుల్లో తిరిగే పిల్లులకు భయపడి అవి కోర్టుకు రాలేకపోయాయని ఇంకోసారి... సాకులు చెబుతూ వచ్చాడు. ఇక న్యాయమూర్తి కూడా చేసేదేమీ లేక వాటిపై కేసును ఎత్తివేశాడు. -
పంది లాంటి గుర్రం!
ప్లే టైమ్ చూడటానికి పంది లాగా కనిపిస్తున్న ఈ జంతువు నిజానికి గుర్రం జాతికి చెందినది. దీన్ని ‘టాపిర్’ అంటారు. దక్షిణ అమెరికా ఖండంలో ఎక్కువగా కనిపించే టాపిర్ భూమిపై జంతుజాలం ఆవిర్భవించినప్పటి నుంచీ మనుగడలో ఉందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. దీనికి గుర్రం లాగా సకిలించే గుణం ఉంటుంది. దీని జీవన ప్రమాణం 25 నుంచి 30 సంవత్సరాలు. బరువు 360 కిలోల వరకూ పెరుగుతుంది. ప్రస్తుతానికి అయితే వీటి ఉనికి దక్షిణ అమెరికా, మధ్య అమెరికాల్లోని గడ్డిభూముల్లో ఎక్కువగా కనిపిస్తుంది. వేగంగా ఈదగల జంతువుల్లో టాపిర్ ఒకటని పరిశోధకులు గుర్తించారు. బుర దలో పొర్లడం దీనికి బాగా ఇష్టం. ఇవి నివసించే ప్రాంతాల్లో కూడా దీన్ని మచ్చిక చేసుకొన్న దాఖలాలు లేవు. ఇది సాధుజంతువు కాదు, అలాగని అకారణంగా దాడి చేసే క్రూర జంతువు కూడా కాదు. సాధారణంగా టాపిర్ ఎవరి మీదా దాడి చేయదు, కానీ మనుషులు ఎవరైనా దానిపై దాడికి పూనుకొంటే తన పటిష్టమైన ముందుకాలి పాదంతో ఎదురుదాడి చేస్తుంది.