rachamallu Shiva Prasad Reddy
-
బాబూ.. ఇదే మందు నాడు విషమైతే నేడు అమృతమా?: రాచమల్లు
సాక్షి, వైఎస్సార్: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం బ్రాండ్లపై చంద్రబాబు విష ప్రచారం చేశారని ఆరోపించారు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి. రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గిస్తామన్న చంద్రబాబు హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. అలాగే, ఏపీలో గతంలో ఉన్న బ్రాండ్సే ప్రస్తుతం ఏపీ వైన్ షాపుల్లో ఉన్నాయి.వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘ఎన్నికల సమయంలో మందుబాబులను రెచ్చగొట్టి చంద్రబాబు లబ్ధి పొందారు. ఎన్నికలు అయ్యాక మద్యం ధరలు తగ్గిస్తామని మోసం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం బ్రాండ్లపై చంద్రబాబు విష ప్రచారం చేశారు. గతంలో ఉన్న బ్రాండ్స్ ప్రస్తుతం ఏపీ వైన్ షాపుల్లో ఉన్నాయి. మా ప్రభుత్వ హయాంలో ఉన్న ధరలే ఇప్పుడూ ఉన్నాయి. మద్యం ధరలు తగ్గిస్తామన్న చంద్రబాబు హామీ ఏమైంది? అని ప్రశ్నించారు.వైఎస్ జగన్ ప్రభుత్వంలో అధిక ధరలన్నాడు.. నాణ్యత లేదన్నాడు. ఆడ పిల్లల మంగళ సూత్రాలు తెంపుతాడు.. మీ ఆరోగ్యం గోవింద అన్నాడు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయాడు. 99 రూపాయలకే మద్యం అన్నాడు.. కానీ ఆ చీఫ్ లిక్కర్ మాత్రం దొరకడం లేదు. మీరిచ్చిన మాట ప్రకారం ధరలు ఎక్కడ తగ్గించారు?. జగన్ ప్రభుత్వంలో అది విషం.. ఇప్పుడు అదే మందు అమృతం అవుతుందా?. ఇప్పుడు ఆడ బిడ్డల మెడలో తాళిబొట్టు తెగవా?. మేము ఓడిపోవడానికి ప్రధాన కారణం మద్యం తాగే సోదరులే. వారితో ఓటు వేయించుకుని అధికారంలోకి వచ్చి ఇప్పుడు వారిని కూడా బాబు మోసం చేశాడు.చంద్రబాబు ఇచ్చే చీఫ్ లిక్కర్ 99కి అమ్మితే.. అదే మందు కేరళలో 85కి ఇస్తున్నారు. దానికి తోడు ఈ చీఫ్ లిక్కర్ నాణ్యమైనది కాదనేది నా అభిప్రాయం. కొన్ని ఏళ్లు ఈ మద్యం తాగితే వారి ఆరోగ్యం తప్పకుండా చెడిపోతుంది. చివరికి మద్యం వ్యాపారులను కూడా మోసం చేశారు. వారికి 20 శాతం మార్జిన్ అని చెప్పి ఇప్పుడు 9.5శాతం మార్జిన్ ఇస్తున్నాడు. విచ్చలవిడిగా బెల్టు షాపులు వెలిశాయి.. అధిక ధరలకు మద్యం అమ్ముతున్నారు. మా ప్రభుత్వంలో 47వేల బెల్టు షాపులు రద్దు చేస్తే మళ్ళీ వాటిని తెరిచి విచ్చలవిడిగా అమ్ముతున్నారు. మద్యం షాపులు సంఖ్య తగ్గించి పర్మిట్ రూమ్స్ లేకుండా చేశాం. కానీ, మళ్ళీ చంద్రబాబు పాత రోజులు తెచ్చి మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు -
ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి: రాచమల్లు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఏపీలో ఎంత మందిపై కేసులు పెడతారో పెట్టుకోండి అని అంటూ కామెంట్స్ చేశారు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్రెడ్డి. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటాలు చేస్తూనే ఉంటామన్నారు.సోషల్ మీడియాలో టీడీపీ వారు పెట్టిన అసభ్యకర పోస్టులపై వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి.. ప్రొద్దుటూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం, రాచమల్లు మీడియాతో మాట్లాడుతూ.. నాపై గతంలో అసభ్యకర పోస్టులు పెట్టిన టీడీపీ వారిపై చర్యలు తీసుకోవాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తూనే ఉంటాం. మేము మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము.కూటమి ప్రభుత్వం ఎంతమందిపై కేసులు పెడతారో పెట్టుకోండి. ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటాలు చేస్తాము. మా పార్టీ ప్రతి కార్యకర్త, నాయకులకు మేము అండగా ఉంటాము అని హామీ ఇచ్చారు. అలాగే, కూటమి నేతల అబద్ధాలను ఎండగడతాం. ప్రజలకు అన్ని నిజాలు తెలుస్తున్నాయి అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: అక్రమ బెల్ట్ షాపులు.. బాలకృష్ణ నియోజకవర్గంలో ఏరులై పారుతున్న లిక్కర్! -
ఆ గ్యారెంటీ ఈ కూటమి ప్రభుత్వం ఇస్తుందా?: రాచమల్లు
సాక్షి, వైఎస్సార్ జిల్లా : కనీసం చనిపోయిన బిడ్డ మృతదేహాన్ని కనిపెట్టలేని పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో దారుణాలు జరుగుతుంటే వాటిని అదుపు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇద్దరు ఆడబిడ్డలకు జన్మనిచ్చిన తండ్రిగా మాట్లాడుతున్నా.. రాష్ట్రంలో ఏ ఇంట్లో ఆడ పిల్లలైనా బయట అడుగుపెడితే భద్రతగా ఇంటికి వస్తారనే గ్యారెంటీ లేదు. ఆ గ్యారెంటీ ఈ కూటమి ప్రభుత్వం ఇస్తుందా? అని ప్రశ్నించారు.నిందితులకు వెన్నులో వణుకు పుట్టాలిదాదాపు 100 మంది ఆడపిల్లల మానాలు, ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కూటమి నేతలకు మాత్రం దున్నపోతుపై వానపడ్డట్లుంది.. ఒక ఆడపిల్ల జీవితం సర్వనాశనం అయితే ప్రభుత్వం ఎంత సీరియస్గా స్పందించాలి..? నిజంగా అంత సీరియస్గా ఈ ప్రభుత్వం స్పందించి ఉంటే వంద సంఘటనలు ఎందుకు జరుగుతాయి? ప్రారంభంలోనే వెన్నులో వణుకు పుట్టించి ఉంటే ఇలా జరిగేది కాదు.కూటి ప్రభుత్వంది పేరు గొప్ప.. ఊరు దిబ్బఈ నేతలు కేవలం మాటలకు మాత్రమే పరిమితి.. చేతలు శూన్యం. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. వాటిని కాపాడడంలో ప్రభుత్వం విఫలమైపోయింది. నిత్యం వైఎస్ జగన్ను నిందించడం..టీడీపీ గొప్పలు చెప్పకోవడం తప్ప చేసిందేమీ లేదు. సెల్ ఫోన్ మేమే కనిపెట్టాం..హైదరాబాద్కు బీచ్ తెచ్చాం అని గొప్పలు చెప్పుకోవడం తప్ప వీరు చేసిందేమీ లేదు. కనీసం చనిపోయిన బిడ్డ మృతదేహాన్ని కూడా కనిపెట్టలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది.మా కులం, మా పార్టీ అని నేరానికి పాల్పడిన వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల్లో ఏమో కానీ దేవుడి వద్ద మాత్రం మీకు శిక్ష తప్పదు. మూడేళ్ల చిన్నారిపై దారుణం జరిగితే నిందితుల్ని బహిరంగంగా ఉరితీయాలి. కానీ ఈ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లయినా లేదు. వాళ్లకు ఓటు వేసిన ప్రతి తల్లి, చెల్లి కూటమి నేతలను చూసి సిగ్గు పడుతున్నారు.ప్రభుత్వ అసమర్ధతను పవన్ అంగీకరించారుపవన్ కల్యాణ్ జరిగిన తప్పును, వారి అసమర్ధతను కనీసం ఒప్పుకున్నారు. మా హోం మంత్రి శాంతిభద్రతల విషయంలో విఫలమయ్యిందని అంగీకరించారు. పవన్..పరోక్షంగా సీఎం చంద్రబాబునే అన్నారు. నేరుగా చంద్రబాబును అనే ధైర్యం లేక హోం మంత్రిపై పెట్టి అన్నారు. శాంతిభద్రతలు దెబ్బతింటుంటే క్యాబినెట్కు బాద్యత లేదా..? ఈ ప్రభుత్వం బాధ్యత వహించదా?. మీకు మానం, మర్యాద ఉంటే ప్రభుత్వం నుంచి వైదొలగాలి..అధికారంలో కొనసాగే అర్హతే మీకు లేదు. పైపెచ్చు పోలీసులపై నిందలు వేస్తున్నారు. పోలీసులకు మీరు స్వతంత్య్రం ఇచ్చారా..? ఈ ఎస్పీలు, ఇంటిలిజెన్స్ అధికారులు మొదటి నుంచీ ఉన్నారు..గతంలో ఇలా జరగలేదేం..?.ఇలా జరగడానికి కారణం నేరం చేసే వారి ఆలోచనలు పెచ్చురిల్లిపోతున్నాయి...చిన్నపిల్లల్ని సైతం వదలడం లేదు.ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు దానికి తోడు విచ్చలవిడిగా మద్యం, మత్తు పదార్ధాలు..నేరస్థుడికి ఇవి ఊతం ఇస్తున్నాయి. ఎక్కడంటే అక్కడ మద్యం, గంజాయి దొరికితే నేరస్థులు రాక్షసులు కారా..? పోలీసుల విధి నిర్వహణకు మీరు మోకాలడ్డుతున్నారు కాబట్టే పరిస్థితి ఇలా ఉంది. మీరు పోలీసులకు స్వేచ్ఛనిస్తే ..వారు కఠినంగా వ్యవహరించే వారు. మీరు తప్పు చేసి పోలీసులపై నింద వేస్తున్నారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు మీ ఆత్మన్యూనత భావంతో పోలీసులను విమర్శిస్తున్నారు.డైవర్షన్ పాలిటిక్స్ తప్ప మీరేం చేశారు?దిశా చట్టాన్ని పదును పెట్టండి. పోలీసులకు స్వేచ్చనివ్వండి..నేరం జరుగుతుందా?. తాను తప్పించుకోగలను..అనే ధైర్యం నేరస్థుడిలో రాబట్టే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. ఓ బిడ్డ జరిగిన అన్యాయాన్ని చూసి ఆ తల్లిదండ్రుల గుండె ఎన్నిసార్లు పగిలిపోయి ఉంటుంది?. ఇలా ఎంత మంది తల్లిదండ్రుల ఉసురు పోసుకుంటారు..? వీటన్నిటినీ పక్కదోవ పట్టించేందుకు వైఎస్ జగన్పై డైవర్షన్ పాలిటిక్స్ రోజుకొకటి చేస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఈ రాష్ట్రంలో ఏముంది..? ఏ అబివృద్ధి లేకపోయినా పర్వాలేదు..కనీసం మా ఆడబిడ్డలకు రక్షణనైనా కల్పించండి.తల్లీ.. అనిత..? పవన్ నిన్ను పొగడలేదుపవన్ కల్యాణ్ నిన్ను పొగిడాడా తల్లీ..అనిత..?హోం శాఖ నేను తీసుకుంటాను అంటుంటే అర్ధం మీరు పూర్తిగా విఫలం అయ్యారనే అర్థం. ఆయన స్పష్టంగా చెప్తున్నారు. కానీ మీరే మిమ్మల్ని సమర్ధించుకుంటున్నారు. డిప్యూటీ సీఎం మాట్లాడిన మాటలను ముఖ్యమంత్రి కూడా బాద్యత వహించాలి. మా ఆడబిడ్డలకు రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వానికి పాలించే అర్హతే లేదు. మా బిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడమని కోరితే అది కూడా మీరు చేయలేకపోతున్నారు.పిల్లల మానాలు, ప్రాణాలు కాపాడలేని నువ్వు..2047కి ఏదో చేస్తానంటున్నావు. ఎప్పుడో ఏదో చేసేది కాదు..ముందు మా బిడ్డలకు రక్షణ కల్పించండి. ఇలాంటి సంఘటన జరిగితే ప్రొద్దుటూరులో పెద్ద స్థాయిలో దీక్షకు దిగుతా’ అని రాచమల్లు శివప్రసాద్రెడ్డి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. -
ఏపీ ప్రజలకు కరెంట్ షాక్ రాచమల్లు కామెంట్స్
-
విద్యుత్ చార్జీలు పెంచితే ఉద్యమిస్తాం: రాచమల్లు శివప్రసాద్రెడ్డి
సాక్షి,వైఎస్ఆర్జిల్లా: చంద్రబాబు ఇచ్చిన మాట తప్పి నవంబర్ ఒకటవ తేదీ నుంచి విద్యుత్ చార్జీలు పెంచనున్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి విమర్శించారు. సోమవారం(అక్టోబర్ 28) ప్రొద్దుటూరులో రాచమల్లు మీడియాతో మాట్లాడారు.‘ఎన్నికలకు ముందు ఐదు సంవత్సరాల వరకు విద్యుత్ చార్జీలు పెంచేది లేదని బాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట తప్పి నవంబర్ ఒకటవ తేదీ నుంచి విద్యుత్ చార్జీలు పెంచనున్నారు. ఎన్నికల ముందు ఒక మాట,ఇప్పుడు ఇంకో మాట సరైన పద్ధతి కాదు. ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి..లేదంటే వైఎస్సార్సీపీ తీవ్రస్థాయిలో ఉద్యమిస్తుంది.విద్యుత్ చార్జీలు పెరిగితే ప్రజల జీవితాలు గాడాంధకారంలోకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. ప్రజలు 164 సీట్లు ఇచ్చి బాబుకు ఇస్తే, బాబు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలకు షాక్ ఇచ్చారు. మధ్య తరగతి ప్రజలపై అధిక భారం మోపనున్నారు. దీపావళి నుంచి గ్యాస్ సిలిండర్ ధరల తగ్గింపు పేరు చెప్పి,విద్యుత్ చార్జీల రూపంలో దండుకుంటున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ చార్జీలు పెంచి చేనేత,అమ్మ ఒడి,ఇతర సంక్షేమాలు రద్దు చేసి బాబు పాలన సాగిస్తున్నారు. రాష్ట్ర ఖజానాకు భారమైనా సరే రానున్న రోజుల్లో విద్యుత్ చార్జీలు పెంచకూడదు అని డిమాండ్ చేస్తున్నా. 2014 నుంచి 2019 వరకు బాబు పాలనలో దాదాపు 57 వేల కోట్లు విద్యుత్ కోసం అప్పు చేశారు. కోవిడ్ కాలంలో కూడా వైఎస్ జగన్ విద్యుత్ చార్జీలు పెంచలేదు. ఎలాంటి విపత్కర పరిస్థితి లేని ఈ సమయంలో బాబు ఎందుకు విద్యుత్ చార్జీలు పెంచుతున్నారు?వైఎస్ జగన్ హయాంలో దళితులకు ఉచిత విద్యుత్ అందించి దాదాపు రూ. 650 కోట్ల రూపాయల విద్యుత్ సబ్సిడీ చెల్లించారు. మద్యం బెల్ట్ షాపులు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పి మద్యం ఏరులై పారేలా చేస్తున్నారు. ఐదు సంవత్సరాలు ఇలాగే పాలన కొనసాగితే రాష్ట్ర ప్రజలు అప్పుల్లో కూరుకుపోతారు. ప్రభుత్వం మెడలు వంచి ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ చార్జీలు తగ్గించేలా పోరాడతాం. కరెంట్ ఆఫీసులను చుట్టుముడతాం,ఉద్యమం తీవ్రతరం చేస్తాం,దీక్షలకు పూనుకుంటాం’అని రాచమల్లు హెచ్చరించారు.ఇదీ చదవండి: చంద్రబాబు ఇది మీరిచ్చిన వాగ్దానామే: వైఎస్ జగన్ -
ఇచ్చిన హామీలు అడుగుతారని డైవర్షన్ పాలిటిక్స్: రాచమల్లు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా పెన్షన్ తప్ప చెప్పిన పథకాలు ఒక్కటీ అమలు కావడం లేదని మండిపడ్డారు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. విజయవాడ వదరపాలు కావడానికి సీఎం చంద్రబాబు నాయుడే కారణమని ధ్వజమెత్తారు. కొవ్వొత్తులకు రూ. 26 కోట్లు, పులిహోరకు రూ. 360 కోట్లు ఖర్చు అంటూ మోసం చేస్తున్నారని విమర్శించారు.వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి శివప్రసాద్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చాక చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని, రాష్ట్రంలో శాంతిభద్రతలను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అడుగుతారని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని దుయ్యబట్టారు.‘తెలంగాణాలో హైడ్రాలాగా, ఏపీలో తిరుమల లడ్డూ వ్యవహారం బయటకు తెచ్చారు. ఎన్ని రోజులు వీటితో తప్పించుకు తిరుగుతారు? నాలుగు నెలల కాలంలోనే ఇంతగా ఒక ప్రభుత్వ గ్రాఫ్ పడిపోవడం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు. లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు ఈ దేశ ప్రజలనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీ వారి భక్తులను నమ్మకాన్ని దెబ్బ తీసే ప్రయత్నం చేశారు. నాణ్యత లేదని నాలుగు నెయ్యి ట్యాంకర్లు వెనక్కు పంపినామని ఈఓ స్పష్టంగా చెప్పినా సీఎం కల్తీ జరిగిందని ఎలా చెబుతారని సుప్రీం కోర్టు కూడా ప్రశ్నించింది.లడ్డూ ప్రసాదం వ్యవహారంలో చంద్రబాబు తన తప్పుడు ప్రచారంతో అబాసు పాలయ్యారు. సుప్రీంకోర్టు ప్రభుత్వ తీరును నిలదీయడంతో శ్రీవారి భక్తులు లడ్డూ అపవిత్రత కాలేదని తేలిపోయింది. చంద్రబాబు తప్పుడు ప్రచారాలతో అపవిత్రుడు అయ్యాడు.. ఆయన జీవితం అంతా అపవిత్రమే. ఇచ్చిన వాగ్దానాలను ప్రజలకు అందే వరకు వైఎస్సార్సీపీ పోరాడుతూనే ఉంటుంది’ అని పేర్కొన్నారు. -
చంద్రబాబుని చీ కొడుతున్న ప్రజలు..రాచమల్లు స్ట్రాంగ్ కౌంటర్
-
కూటమి మేనిఫెస్టోపై రాచమల్లు కామెంట్స్
-
టీడీపీకి ఎమ్మెల్యే రాచమల్లు ఓపెన్ ఛాలెంజ్..
-
ఏమయ్యా చంద్రబాబు..వాలంటీర్లు అంటే ఇంత భయమా..
-
6 జెండాలు, 3 పెళ్లాలు మార్చినోడు పవన్..జగన్ వెంట్రుక కూడా పీకలేరు
-
చంద్రబాబు నమ్మించి గొంతుకోసే రకం: నందిగం సురేష్
సాక్షి, బాపట్ల: టీడీపీ అధినేత చంద్రబాబు నమ్మించి గొంతుకోసే రకమని ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. బడుగు, బలహీన వర్గాలను చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేశారని తెలిపారు. బడుగు బిడ్డలకు సీఎం జగన్ పాలనలోనే మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. సీఎం ప్రజలకు చేసిన మేలే మళ్లీ జగన్ను ముఖ్యమంత్రిని చేస్తుందని అన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో పార్టీ ఇంచార్జి కరణం వెంకటేష్ ఆధ్వర్యంలో సోమవారం వైఎస్సార్సీపీ సామాజిక సాధికార సభ నిర్వహించారు. ఈ సభలో మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్ , రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే కరణం బలరాం, ఎమ్మెల్సీ పోతుల సునీత, వైఎస్సార్సీపీ యువనాయలు, ఏపీఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ యనమల నాగార్జున యాదవ్, తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్ పేదల పక్షపాతి అని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. బాబుకు దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే తెలుసన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆత్మ బంధువు సీఎం జగన్ అంటూ ప్రశంసించారు. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని తెలిపారు. బీసీలను ఎప్పుడూ బాబు బ్యాక్వర్డ్గానే చూశారని మేరుగు నాగార్జున మండిపడ్డారు. బాబు హయాంలో దళితులపై జరిగినన్ని దాడులు దేశంలో ఎక్కడా జరగలేదని పర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అక్కున చేర్చుకున్న ఘనత సీఎం జగన్దేనని అన్నారు. సోనియా, రాహుల్, బాబు చేతుల్లో షర్మిల కీలు బొమ్మ అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో షర్మిల ఉనికి కోల్పోయి, కాంగ్రెరస్లో పార్టీనిని వీలినం చేశారంటూ దుయ్యబట్టారు. సీఎం జగన్ పాలనను తప్పుబట్టే అర్హత షర్మిలకు లేదని తెలిపారు. వైఎస్సార్సీపీపై షర్మిల విమర్శలు రాజకీయ స్వార్థంతో చేసినవని మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆమెకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. చదవండి: AP: ఓటర్ల తుది జాబితా విడుదల.. జిల్లాల వారీగా లిస్ట్ ఇదే -
పెన్షన్ల పెంపుతో వృద్ధుల్లో చిరుమందహాసం కనపడుతోంది: రాచమల్లు
-
16 కోట్లతో ప్రొద్దుటూరు అభివృద్ధి పనులు
-
కుమార్తెకు ఆదర్శ వివాహం చేసిన ఎమ్మెల్యే రాచమల్లు
ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తన పెద్ద కుమార్తె పల్లవికి ఆదర్శ వివాహం చేశారు. రాచమల్లు శివప్రసాద్రెడ్డి కుమార్తె పల్లవి, కమ్మర లీలా గోపి పవన్కుమార్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. వీరి కులాలు వేరు అయిప్పటికీ వారి పెళ్లికి ఎమ్మెల్యే అభ్యంతరం చెప్పలేదు. ఆయనే స్వయంగా పల్లవి, పవన్కుమార్లను గురువారం స్థానిక బొల్లవరంలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయానికి తీసుకువెళ్లి సంప్రదాయ ప్రకారం పెళ్లి చేశారు. అనంతరం సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంలో వారికి రిజిష్టర్ మ్యారేజీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ తన కుమార్తె ఎంబీఏ చదివేటప్పుడు పవన్కుమార్ను ప్రేమించిందని తెలిపారు. తన కుమార్తె ఇష్ట్రపకారం మనస్ఫూ ర్తిగా ప్రేమ వివాహం చేశానని చెప్పారు. పవన్కుమార్ తండ్రి ఆర్టీసీలో మెకానిక్గా పనిచేస్తున్నారని, ఇష్టపడిన అబ్బాయితో కుమార్తె వివాహం చేశానన్న తృప్తి తనకు ఉందని వివరించారు. వాస్తవానికి ఈ వివాహాన్ని ఘనంగా చేయాలని భావించానని, అయితే తన కు మార్తె ఇందుకు అంగీకరించకపోవడంతో నిరాడంబరంగా జరిపించానని ఎమ్మెల్యే చెప్పారు. చదవండి: ఏపీ విద్యాసంస్కరణలు అద్భుతం -
వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేసి విచారణ: రాచమల్లు
-
నిరుపేద.. ఆపై పెద్ద బాధ.. నేనున్నానంటూ ఎమ్మెల్యే రాచమల్లు భరోసా
సాక్షి, ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె పంచాయతీ పరిధిలోని మీనాపురం గ్రామానికి చెందిన బత్తల మల్లికార్జున, మునిలక్ష్మి దంపతులు నిరుపేదలు. మల్లికార్జున కూలీ పనికి వెళ్తుంటాడు. వారికి ముగ్గురు కుమార్తెలు. కీర్తన చివరి సంతానం. స్థానికంగా ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. 10 ఏళ్ల కీర్తనకు పెద్ద కష్టం వచ్చింది. కొన్ని నెలల క్రితం ముఖంలో గడ్డలు ఏర్పడి వాపు వచ్చింది. తగ్గుతుందిలే అని కుటుంబ సభ్యులు భావించారు. అయితే ఆ వాపు కాస్త ముఖమంతా ఎక్కువగా వ్యాపించింది. దీంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు మందులు వాడుతూ వచ్చారు. చాలా ఆస్పత్రుల్లో చూపించినా నయం కాలేదు. ఆదుకున్న ఎమ్మెల్యే ఏం చేయాలో పాలుపోని స్థితిలో బాలిక తల్లిదండ్రులు నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డిని ఆశ్రయించారు. ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం నెల్లూరులోని మెడికోవర్ ఆస్పత్రికి పంపించారు. అన్ని రకాల పరీక్షలు చేసి దవడ ఎముక లోపలి భాగంలో క్యాన్సర్ సోకినట్లు నిర్ధారించారు. తల్లిదండ్రులు ఒకింత షాక్కు గురయ్యారు. ఆపరేషన్ చేయిస్తే పూర్తిగా నయం అవుతుందని వైద్యులు చెప్పారు. ఆపరేషన్కు రూ.10 లక్షలు మేర ఖర్చు అవుతుందని తెలపడంతో.. వారు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. అంత డబ్బు భరాయించే స్థోమత తమకు లేదని రోదించసాగారు. వారి ఆవేదనను అర్థం చేసుకున్న ఎమ్మెల్యే రాచమల్లు తాను ఉన్నానని భరోసా ఇచ్చారు. రెండు రోజుల్లో ఆపరేషన్ చిన్నారి కీర్తన ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి స్థానిక మున్సిపల్ కార్యాలయంలో బుధవారం మీడియాకు వెల్లడించారు. వెంటనే ఆపరేషన్ చేయకపోతే పాప ప్రాణానికి ప్రమాదమని వైద్యులు చెప్పారన్నారు. ముగ్గురు వైద్యులు కలిసి ఆపరేషన్ చేయనున్నారని తెలిపారు. మానవతా దృక్పథంతో సాయం చేయాలని తాను కోరిన మేరకు వైద్యులు రూ.6 లక్షలకు అంగీకరించారన్నారు. కొంత డబ్బు కుటుంబ సభ్యులు పెట్టుకుంటామని చెప్పారని, మిగతా రూ.5 లక్షలు లేదా అంతకు ఎక్కువైనా తానే భరాయిస్తున్నట్లు తెలిపారు. ఆపరేషన్ నిమిత్తం బుధవారం కీర్తనను ఎమ్మెల్యే నెల్లూరుకు పంపించారు. అడ్మిట్ అయిన తర్వాత ఒకటి, రెండు రోజుల్లో ఆపరేషన్ చేస్తారన్నారు. పేదరికంలో ఉన్న ప్రజల ప్రాణాలను కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే రాచమల్లుకు కీర్తన తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: (ఆరోజు ఏమయ్యావు రామకృష్ణా?!.. నీ కమ్యూనిజాన్ని పక్కన పెట్టేసి మరో ఇజానికి వెళ్లిపోయావు) -
వైఎస్ కుటుంబానికి రక్తపు మరకలు అంటించే కుట్ర
ప్రొద్దుటూరు: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ కుటుంబానికి రక్తపు మరకలు అంటించాలని మాజీ సీఎం చంద్రబాబు, టీడీపీ నాయకులు కుట్ర పన్నుతున్నారని వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ఏబీఎన్, టీవీ5 చానళ్లు, ఆంధ్రజ్యోతి పత్రిక వైఎస్ కుటుంబంపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి నేరం చేశాడనే రీతిలో ఏబీఎన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తోందన్నారు. అవినాష్ని నిందితుడిగా చూపించేందుకు నానా తంటాలు పడుతున్నారని అన్నారు. నాలుగు నెలల క్రితమే తాను ఈ విషయాన్ని చెప్పానని, అదే ప్రకారం అవినాష్రెడ్డిని కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఎంపీ అవినాష్రెడ్డి అత్యంత సౌమ్యుడని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకి ఈ హత్యతో సంబంధం ఉండదని విశ్వసించాను కాబట్టే తనతో పాటు జిల్లాలోని 8 మంది ఎమ్మెల్యేలం రాజీనామా చేస్తామని ప్రకటించానన్నారు. ఎంపీపై నేరం రుజువైతే చెప్పిన మాట ప్రకారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. కుక్కతోక పట్టుకుని సముద్రాన్ని ఈదాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. తన తండ్రి రాజారెడ్డిని హత్య చేసిన వారినే క్షమించిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై బురద చల్లేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని అన్నారు. తనపై కత్తితో దాడి చేసిన వ్యక్తిపై కూడా ప్రతీకారం తీర్చుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనుకోలేదని, అలాంటి కుటుంబంలో పుట్టిన ఎంపీ అవినాష్రెడ్డికి హత్యా రాజకీయాలు అంటగట్టాలని చూడటం దుర్మార్గమని చెప్పారు. ప్రజాస్వామ్యం పట్ల అమితమైన గౌరవం ఉన్న వైఎస్ కుటుంబానికి ప్రజా సేవలో తరించాలనే తపన తప్ప మరొకటి లేదని తెలిపారు. -
రాచమల్లుపై ఎన్టీవీలో కక్షపూరిత కథనం
ప్రొద్దుటూరు : కరోనా కమ్ముకున్న వేళ నా కుటుంబంపై కనికరం లేని కథనాలేలని, మాతృమూర్తి సేవ కోసం వెళ్లిన తనపై విమర్శలు చేయడం దారుణమని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. స్వాతంత్య్ర వేడుకలు జరుపుకోవడం తన జన్మహక్కు అని, దాన్ని ప్రశ్నించే అర్హత ఎవరికీ లేదని పేర్కొన్నారు. ఎన్టీవీలో వచ్చిన కథనాలకు దీటుగా ఎమ్మెల్యే సమాధానం చెప్పారు. తన మాతృమూర్తి రాచమల్లు మునిరత్నమ్మతోపాటు హైదరాబాదు కూకట్పల్లి హోలిస్టిక్ ఆస్పత్రిలో ఎమ్మెల్యే కరోనా చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆదివారం ఫోన్లో మీడియాతో మాట్లాడారు. కరోనా మొదలైనప్పటి నుంచి ప్రొద్దుటూరులో ఎమ్మెల్యేగా దాన్ని అదుపులో ఉంచేందుకు చేయని ప్రయత్నమంటూ లేదన్నారు. తనను కానీ, తన కుటుంబాన్ని కానీ కరోనా ఆవహిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ మా నుంచి ఎవరికీ వ్యాధి సోకకూడదని ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు.ఎన్టీవీలో కక్షపూరిత, దురుద్దేశంతో కూడిన కథనం ప్రచారం చేశారని తెలిపారు. ‘ఒక్కసారిగా సైలంట్ అయిన అధికార పార్టీ ఎమ్మెల్యే’అని విషప్రచారం చేసిందన్నారు. ఈనెల 12న వైఎస్సార్ చేయూత కార్యక్రమానికి హాజరు కాబోయే ముందు రోజే తాను కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోగా నెగిటివ్ వచ్చిందన్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమం కాబట్టి నిబంధనలకు అనుగుణంగా ఎమ్మెల్యే హోదాలో కార్యక్రమంలో పాల్గొన్నానని తెలిపారు. ఈనెల 14న మా తల్లి రాచమల్లు మునిరత్నమ్మకు పాజిటివ్ రావడంతో ఆమె చికిత్స కోసం హైదరాబాద్కు బయల్దేరాను.అంతకుముందే తాను మరో సారి కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకున్నానన్నారు. ప్రొద్దుటూరు–హైదరాబాద్ మార్గమధ్యలో ఉండగా తనకు కరోనా పాజిటివ్ అని తెలిసిందన్నారు. తాను, తన తల్లి హైదరాబాద్లోని ఆస్పత్రిలో చేరామన్నారు. ఎన్టీవీ తనపై కక్షకట్టి ఉద్దేశపూర్వకంగానే ఎక్కడో ఆరుబయట స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నట్టు చిత్రీకరించారని ఆరోపించారు. మానవత్వం ఉన్న తన నియోజకవర్గ ప్రజలు, ఆఖరికి ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం తన ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అయితే ఎన్టీవీ వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా మారి, జర్నలిజం విలువలు మరిచిపోయి అసత్యప్రచారం చేస్తోందన్నారు. గౌరప్రదంగా, నియోజకవర్గ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ ఫలాలను అందించడం,జెండా వందనం చేయడం తన విధి అన్నారు. దీనిని ప్రశ్నించే అర్హత ఎవరికీ లేదన్నారు. కరోనా వ్యాధిగ్రస్తుల మధ్య స్వాతంత్య్ర వేడుకులను నిర్వహించడం తప్పు ఎలా అవుతుందో ఎన్టీవీనే చెప్పాలన్నారు. -
ఎమ్మెల్యే రాచమల్లుపై దుష్ప్రచారం
ప్రొద్దుటూరు : ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డిపై ఉద్దేశ పూర్వకంగానే కొంత మంది దుష్ప్రచారం చేస్తున్నారని, ఇందులో భాగంగానే ఓ మీడియాలో కథనం ప్రసారం చేశారని టీటీడీ పాలకమండలి సభ్యుడు చిప్పగిరి ప్రసాద్ అన్నారు. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి, ఎమ్మెల్యే రాచమల్లుకు సత్సంబంధాలు లేవని చెప్పడం వాస్తవం కాదన్నారు. సీఎంతో ఉన్న సన్నిహిత సంబంధంతోనే ఎమ్మెల్యే తనలాంటి సాధారణ వ్యక్తికి టీటీడీ పాలకమండలి సభ్యుడిగా పదవి ఇప్పించారన్నారు. సీఎంతో చర్చించిన తర్వాతే ప్రొద్దుటూరులో టిడ్కో ఇళ్లను రద్దు చేసి, ప్రస్తుతం లబ్ధిదారులకు స్థలాలు ఇస్తున్నారన్నారు. కార్యకర్తలను ఎమ్మెల్యే పట్టించుకోలేదని చెప్పడంలో అర్థం లేదన్నారు. తనలాంటి కార్యకర్తకు చాలా కాలం తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్ష పదవి ఇచ్చారని పేర్కొన్నారు. సోములవారిపల్లె గ్రామ పంచాయతీకి చెందిన శేఖర్ యాదవ్కు ఎంపీపీ పదవికి ప్రతిపాదన చేశారని, నంగనూరుపల్లెకు చెందిన యాలం తులశమ్మకు మార్కెట్ చైర్పర్సన్, కొర్రపాడు సూర్యనారాయణరెడ్డికి వైస్ చైర్మన్, ఎస్ఏ నారాయణరెడ్డికి రాజుపాళెం మండల బాధ్యునిగా పదవులు ఇచ్చారన్నారు. వరదరాజులరెడ్డి వస్తారనేది అవాస్తవం 1996 నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటున్న బంగారురెడ్డి చొరవతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. తొలి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ఆయన కార్యకర్తలా శక్తివంచన లేకుండా పని చేస్తున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని గత ఎన్నికల సమయంలోనే ప్రకటించారన్నారు. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని ప్రచారం చేయడంలో వాస్తవం లేదని పేర్కొన్నారు. ఎంపీపీ అభ్యర్థి శేఖర్ యాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే రాచమల్లు పనితీరును సీఎం జగన్మోహన్రెడ్డి సైతం ప్రశంసించారన్నారు. మార్కెట్యార్డు వైస్ చైర్మన్ కొర్రపాడు సూర్యనారాయణరెడ్డి, రాజుపాళెం మండల కన్వీనర్ నారాయణరెడ్డి, హౌస్ బిల్డింగ్ సొసైటీ చైర్మన్ ద్వార్శల భాస్కర్రెడ్డి, మాజీ కౌన్సిలర్ వరికూటి ఓబుళరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుడు శంకర్యాదవ్ పాల్గొన్నారు. -
లాక్డౌన్ వల్లే విద్యుత్ చార్జీలపై అపోహలు
ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు పట్టణంలో విధించిన లాక్డౌన్ వల్లే విద్యుత్ బిల్లులు పెరిగాయి తప్ప ప్రభుత్వం ధరలను పెంచలేదని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. ట్రాన్స్కో ఎస్ఈ శ్రీనివాసులు, డీఈ శ్రీనివాసులరెడ్డి, ఏఏఓ బాలసుబ్రహ్మణ్యంతో కలసి విద్యుత్చార్జీలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ పలు మార్లు అధికారులతో చర్చించిన అనంతరం అనుమానాలను నివృతి చేసుకుని ఈ విషయాలను చెబుతున్నట్లు తెలిపారు. ప్రొద్దుటూరులో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కావడంతో విద్యుత్సిబ్బంది బిల్లులు వసూలు చేయడానికి వీలు లేకుండా పోయిందన్నారు.దాదాపు 70 రోజుల పాటు బిల్లులు వసూలు చేయలేదని చెప్పారు. ప్రస్తుతం ఏప్రిల్, మే నెలతోపాటు జూన్ నెలకు సంబంధించి 15 రోజుల బిల్లును కూడా కలుపుతున్నారన్నారు. దీనికి సంబంధించి స్లాబ్లు మార్చలేదన్నారు. కేవలం రోజువారీ విద్యుత్ ఖర్చును లెక్కించి బిల్లు వేశారన్నారు. ప్రొద్దుటూరు నియోజకర్గంలో లక్షా 5వేల విద్యుత్ మీటర్లు ఉండగా కేవలం ప్రొద్దుటూరు పట్టణంలో మాత్రమే ఈ సమస్య ఏర్పడిందన్నారు. మండలంతోపాటు రాజుపాళెం మండలంలో కరోనా ప్రభావం లేకపోవడంతో యధావిధిగా వసూలు చేశారన్నారు. అక్కడ బిల్లు పెరగలేదన్నారు. టీడీపీ నేతలు చేసిన విమర్శలపై తాను వివరణ ఇవ్వలేదని, కేవలం ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పరిపాలన సాగిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి బిల్లులు పెంచి ఖజానా నింపుకోవాల్సిన అవసరం లేదన్నారు. 500 యూనిట్లుపైగా విద్యుత్ ఖర్చు చేసేవారికి మాత్రమే యూనిట్కు 90పైసలు చొప్పున చార్జీలు పెంచారన్నారు. పెరిగిన విద్యుత్ బిల్లులకు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఏమాత్రం సంబంధం లేదని అన్నారు. ప్రజలు తమకు పథకాలు వర్తించబోమని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ చార్జీలు ఓ మారు పెంచి ఏడాదికంతటికీ అదే విధానాన్ని అమలు చేసేవారన్నారు. ప్రస్తుతం విద్యుత్ ఖర్చు ఆధారంగా వచ్చే కేటగిరిని బట్టి ప్రతి నెలా వసూలు చేస్తారన్నారు. చంద్రబాబు తన హయాంలో రూ.2.5లక్షల కోట్లు అప్పు పెట్టగా సీఎం జగన్ ఆ బకాయిలను పూడ్చి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు.టీటీడీ పాలకమండలి సభ్యుడు చిప్పగిరి ప్రసాద్, వైఎస్సార్సీపీ కడప పార్లమెంటరీ అధ్యక్షురాలు జింకా విజయలక్ష్మి, మాజీ కౌన్సిలర్ వరికూటి ఓబుళరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కామిశెట్టిబాబు పాల్గొన్నారు. అనంతరం విద్యుత్ రెవెన్యూ కార్యాలయాన్ని పరిశీలించారు. నూతన భవనం నిర్మించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ విషయంపై ప్రతిపాదనలు తయారు చేసి పంపితే తాను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ద్వారా నిధులు మంజూరు చేయిస్తానన్నారు. -
లాక్డౌన్లోనూ మద్యం అమ్మకాలా..
ప్రొద్దుటూరు: పట్టణంలో కొందరు బార్ల యజమానుల తీరుపై ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో వారు మద్యం అమ్మకాలెలా జరుపుతున్నారని ఎక్సై జ్ అధికారులను ఆయన ప్రశ్నించారు. మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఎక్సైజ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. రాచమల్లు మాట్లాడు తూ నష్టం వస్తున్నా ప్రజల ఆరోగ్యం కోసం ప్రభు త్వం మద్యం అమ్మకాలను నిలిపివేసిందన్నారు. కానీ కొంత మంది ధరలు దారుణంగా పెంచి అమ్ముకుంటున్నారన్నారు. తన వద్ద రుజువులు ఉన్నాయన్నారు. ఓ బార్ యజమాని లాక్డౌన్ సమయంలో రూ.10లక్షలు ఆర్జించినట్లు తెలిసిందన్నారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి అమ్మకాలు సాగుతున్నా పట్టించుకోవడం దారుణమన్నా రు. కోగటంలో మద్యం తయారు చేసి సరఫరా చేస్తున్నారని తెలిపారు. రామేశ్వరంలో రోజూ సాయంత్రం గుంపులుగుంపులుగా చేరుతున్నారన్నారు. ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో నిరోధించకపోతే ప్రభుత్వానికి నేరుగా ఫిర్యాదు చేస్తానని అధికారులను ఎమ్మెల్యే హెచ్చరించారు. సమావేశంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రాధాకృష్ణ, సీఐ సీతారామిరెడ్డి పాల్గొన్నారు. ♦ మున్సిపాల్ పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి చేతుల మీదుగా శానిటైజర్లను పంపిణీ చేశారు. మున్సిపల్ కమిషనర్ రాధ, అసిస్టెంట్ కమిషనర్ గంగాప్రసాద్, డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ, వైఎస్సార్సీపీ కడప పార్లమెంటరీ అధ్యక్షురాలు జింకా విజయలక్ష్మి పాల్గొన్నారు. ♦ 19వ వార్డులో వైఎస్సార్సీపీ నాయకుడు మునీర్, అమీర్ 1000 మందికి కూరగాయలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకుడు పాతకోట బంగారు మునిరెడ్డి, చాంద్బాషా, జగన్, ప్రసాద్ పాల్గొన్నారు. -
సీఎం జగన్ను కలిసిన ఎమ్మెల్యే రాచమల్లు
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేసి గత ఎన్నికల సందర్భంగా తాను ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, ఆయన సతీమణి రాచమల్లు రమాదేవి శుక్రవారం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి విన్నవించారు. అనంతరం ఎమ్మెల్యే సాక్షికి విషయాన్ని ఫోన్ ద్వారా వివరించారు. పట్టణంలోని వైఎస్సార్ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటై 12 ఏళ్లు అయినా నేటికీ అద్దె గదుల్లో నడుస్తోందని ఎమ్మెల్యే అన్నారు. సొంత భవనాలు, ల్యాబ్లు, ఇతర మౌలిక వసతుల నిర్మాణానికి రూ.173కోట్లు నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. పట్టణంలో పారిశుద్ధ్య సమస్య పరిష్కారానికి ఐదు ప్రధానమైన డ్రైనేజీలను ఆధునీకరించాల్సి ఉందన్నారు. ఇందు కోసం రూ.80కోట్లు కేటాయించాలని కోరినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్లో మహిళలు నడవడానికి వీలులేకుండా అసౌకర్యంగా ఉందని, దీని ఆధునీకరణకు రూ.83కోట్లు అవసరమని చెప్పారు. జిల్లా ప్రభుత్వాస్పత్రి అభివృద్ధి కోసం రూ.38.60కోట్లు మంజూరు చేయాలని కోరినట్లు వివరించారు. పూర్వం నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ పూర్తిగా దెబ్బతిందని, ఆధునీకరణకు రూ.3కోట్లు మంజరు చేయాలని, 6వేల మంది జనాభా నివసిస్తున్న అమృతానగర్లో ఉన్నత పాఠశాలను నిర్మించడంతోపాటు పట్టణంలో లా కళాశాలను ఏర్పాటు చేయాలని, రూ.15కోట్లతో ఇండోర్ స్టేడియం నిర్మించాలని విన్నవించినట్లు చెప్పారు. రామేశ్వరంలోని పెన్నానదిపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.53కోట్లతో ప్రతిపాదనలు పంపడం జరిగిందని, ఈ బ్రిడ్జిని నిర్మిస్తే రామేశ్వరం హౌసింగ్ కాలనీలో ఉగాది నాటికి ఇవ్వబోయే ఇళ్ల పట్టాల వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ సమస్యలన్నింటిపై సీఎం సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో టిడ్కో ఇళ్లు రద్దు చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు చెప్పినట్లు తెలిపారు. -
2024 నాటికి వినికిడి దృష్టి లోపాలుండవు
ప్రొద్దుటూరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం కారణంగా 2024 నాటికి రాష్ట్రంలో వినికిడి, దృష్టి లోపాలు ఉన్నవారు కనిపించరని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. విర్చోస్, వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ఆదివారం సాహి నేతృత్వంలో హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రి వైద్యులు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వాగ్దేవి ఇంజినీరింగ్కళాశాలలో చెవిలో నొప్పి, వినికిడి సమస్య, చీము కారడం లాంటి సమస్యలకు వైద్యులు పరీక్ష చేసి చికిత్స చేశారు. జిల్లాలోని నలుమూలల నుంచి తల్లిదండ్రులు పిల్లలను శిబిరానికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యకంటే జ్ఞానం గొప్పదని, జ్ఞానం కంటే మానవత్వం గొప్పదని, ఆ మానవత్వానికి నిలువెత్తు రూపమే సాహి సంస్థ అని తెలిపారు. మానవీయ కోణంలో తన కుటుంబాన్నే కాకుండా పేదరికంలో ఉన్న అందరి కుటుంబాలు ఆరోగ్యంగా ఉండాలనే నిస్వార్థ ఆలోచనతో సంస్థ వ్యవస్థాపకులు సజ్జల దివాకర్రెడ్డి అందిస్తున్న సేవలు గొప్పవని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు సేవ చేసి ఓటును ఆశిస్తారన్నారు. అయితే ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా రూ.కోట్లు పెట్టడంతోపాటు తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఇలాంటి వైద్య శిబిరాలను నిర్వహిస్తుండటం గొప్ప విషయమన్నారు. ఎంతో మంది ధనవంతులు ఉన్నారని, అలాంటి వారు సామాజిక సేవకు ముందుకు రావడం లేదన్నారు. వారందరూ ఈ దిశగా ఆలోచించాలని కోరారు.ఆకలితో పోరాటం చేసే పేదలు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేసుకోవాలంటే సాధ్యం కాదన్నారు. ఈ ఆపరేషన్ చేసుకోవడానికి ఒక చెవికి రూ.6లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. ఇలాంటి వారికి సాహి సంస్థ ముందుకు వచ్చి ఉచితంగా ఆపరేషన్లు చేయించడం గొప్ప విషయమని చెప్పారు. సజ్జల దివాకర్రెడ్డి మా కుటుంబానికి ఆత్మ బంధువు అని అన్నారు. దాతృత్వానికి పేరెన్నికగన్నారని తెలిపారు. తాను ఈ స్థాయిలో ఉండటానికి ప్రధానంగా నలుగురు కారణమన్నారు. తనకు టికెట్ ఇచ్చి ఎంతో అభిమానంతో తనను ప్రోత్సహించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒకరైతే, మానసికంగా తనను వెన్నుతట్టి ప్రోత్సహించి అన్ని విధాలా సహాయం అందించిన మా అన్న కిరణ్కుమార్రెడ్డి రెండో వారన్నారు. తనను ఆదరించి ఎమ్మెల్యేగా చేసిన నియోజకవర్గ ప్రజలు మూడో వారని, కౌన్సిలర్ స్థాయి నుంచి తన వెనకుండి ప్రోత్సహించిన సజ్జల దివాకర్రెడ్డి నాలుగోవారని అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డితో సాన్నిహిత్యం పెరగడానికి కూడా ఆయన కారణమని పేర్కొన్నారు. రాజన్న మానస పుత్రిక ఆరోగ్యశ్రీ– జగనన్న మానస పుత్రిక అమ్మ ఒడి ప్రాణానికి ప్రాధాన్యత ఇచ్చి అందరూ ఆరోగ్యంతో జీవించాలని నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే రాచమల్లు తెలిపారు. ప్రపంచంలోనే ఎవరికి రాని ఆలోచనతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టి అకాల మరణం పొందారన్నారు. ఈ కారణంగానే నేటికీ అందరి మనస్సుల్లో రాజశేఖరరెడ్డి అమరుడుగా ఉన్నారని చెప్పారు. అలాగే ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరక్షరాస్యత లేకుండా ఉండేందుకుగాను అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి పథకాల ద్వారా ప్రతి ఒక్కరినీ అక్షరాస్యులను చేస్తే తద్వారా వారి కుటుంబాలు బాగుపడుతాయనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. సాహి (సొసైటీ టు ఎయిడ్ ది హియరింగ్ ఇంపైర్డ్) సంస్థ వ్యవస్థాపకుడు సజ్జల దివాకర్రెడ్డి మాట్లాడుతూ ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోని పేదల కుటుంబాల వారు వినికిడిలోపం సమస్యతో బాధపడుతున్నారన్నారు. వారికి అవగాహన కల్పించి, చికిత్స చేసేందుకు చాలా క్యాంప్లను నిర్వహించామని పేర్కొన్నారు. సరైన సమయంలో చికిత్స చేయించుకుంటే ఉపయోగం ఉంటుందని, వయసు పెరిగే కొద్ది సమస్య తీవ్రతరమయ్యే అవకాశం ఉందన్నారు. వినికిడి లోపం సమస్యతో ఎవరు కుటుంబానికి, సమాజానికి భారం కాకూడదనే లక్ష్యంతో సంస్థను ఏర్పాటు చేశామన్నారు. ఎంతో మంది వినికిడి లోపం ఉన్న వారు ఆపరేషన్ చేయించుకుని ఉన్నత ఉద్యోగాలు పొందారని, క్రీడల్లో రాణిస్తున్నారని వివరించారు. 16 ఏళ్లుగా ఇలాంటి సేవలు అందిస్తున్నామని, ప్రయత్నంలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. మెటర్నిటి ఆస్పత్రుల్లోనే ఆడియాలజిస్టును ఏర్పాటు చేసి వెంటనే జబ్బును గుర్తించేందుకు వీలుగా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. రిమ్స్లాంటి ఆస్పత్రుల్లో ఈ సౌకర్యం ఏర్పాటు చేస్తే హైదరాబాద్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. ఇప్పటికే ఈ సమస్యను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఆయన సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకునే అవకాశ ఉందని తెలిపారు.కార్యక్రమం ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాని పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో చక్రయపేట మండల వైఎస్సార్సీపీ ఇన్చార్జి వైఎస్ కొండారెడ్డి, వాగ్దేవి ఇంజినీరింగ్ కాలేజి కరస్పాండెంట్ జి.హుసేన్రెడ్డి, డైరెక్టర్ పీఆర్ బాబాజీ, ప్రిన్సిపాల్ జి.జగదీశ్వరరెడ్డి, డిజెబుల్ వెల్ఫేర్ జిల్లా ఏపీఓ మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు. 70 మందికి కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు ప్రొద్దుటూరు : విర్చోస్, వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాల, వైఎస్ కొండారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం సాహి నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం 70 మందికి కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయించాల్సిన అవసరం ఉందని డాక్టర్లు నిర్ధారించినట్లు చక్రాయపేట మండల వైఎస్సార్సీపీ ఇన్చార్జి వైఎస్ కొండారెడ్డి తెలిపారు. సాయంత్రం 36 మందికి అవసరమైన వినికిడి యంత్రాలను వైఎస్ కొండారెడ్డి పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ ఒక్కో వినికిడి యంత్రం దాదాపు రూ.10వేలు అవుతుందని తెలిపారు. వైద్య శిబిరానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 348 మంది వచ్చారన్నారు. వీరిలో 70 మందికి కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు అవసరమని వైద్యులు చెప్పారన్నారు. రెండు మూడు నెలల్లో దశల వారిగా వీరందరిని హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లి ఆపరేషన్లు చేయిస్తామన్నారు. రెండు రోజులు అక్కడే ఉండేందుకు వసతి సౌకర్యం కూడా కల్పిస్తామని తెలిపారు. ఆపరేషన్లు అనంతరం వారిని తిరిగి ఇంటికి తీసుకొచ్చే బాధ్యత కూడా తమదేనని చెప్పారు. అనంతరం సాహి వైద్య బృందాన్ని, వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులను వైఎస్ కొండారెడ్డి అభినందించారు. పేదలకు మంచి సేవ చేశారని కొనియాడారు. కార్యక్రమంలో వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాల కరస్పాండెంట్ జి.హుసేన్రెడ్డి, ప్రిన్సిపాల్ జి.జగదీశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జగనన్న నమ్మకాన్ని నిలబెట్టారు
రాజుపాళెం : ఎన్నికల ముందు ఇచ్చిన హహామీలను నెరవెర్చడంతో జగనన్న నమ్మకాన్ని నిలబెట్టారని, టీడీపీ మోసం, దగాలను ప్రజలు గమనించాలని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. రాజుపాళెం మండలంలోని చిన్నశెట్టిపల్లె గ్రామంలోని గ్రామ సచివాలయం వద్ద శుక్రవారం బియ్యం కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ హయాంలో బియ్యం కార్డులను రెండు, మూడు పంపిణీ చేసి మమ అనిపించారన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. భవిష్యత్తులో టీడీపీ తుడిచి పెట్టుకొని పోతుందని అన్నారు. ప్రతి కుటుంబంలో అర్హులైన అవ్వాతాతకు పింఛను, అమ్మ ఒడి, వైఎస్సార్ రైతుభరోసా కింద ఖాతాల్లో నగదు జమ చేశారని, ఈ ప్రకారం ఏడాదికి రూ.55 వేల నుంచి రూ.60 వేల వరకు లబ్ధి కలిగిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని చెప్పారు.గత ప్రభుత్వంలో రాజుపాళెం మండలంలోని చిన్నశెట్టిపల్లె గ్రామంలో నువ్వు వైఎస్సార్సీపీకి చెందిన వాడవు.. నీకు సంక్షేమ పథకాలు ఇవ్వమని తెలిపిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం అలా కాకుండా టీడీపీ జెండా మోసిన వారికి కూడా పథకాలను అందింస్తోందని చెప్పారు.ఇదంతా ప్రజలు గమనించి రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్యార్డు వైస్ చైర్మన్ దొంతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, పార్టీ మండల కన్వీనర్ ఎస్ఏ నారాయణరెడ్డి, మాజీ సర్పంచ్ ఇరగంరెడ్డి జయరామిరెడ్డి, నాయకులు ఎంబీ శివశంకరరెడ్డి, గోవర్ధన్రెడ్డి, రాజారాంరెడ్డి, వెంకటరెడ్డి పాల్గొన్నారు. -
బాల్యంలో కథలు రాయడం గొప్ప అనుభూతి
ప్రొద్దుటూరు : బాల్యంలో విద్యార్థులు కథలు రాయడం గొప్ప అనుభూతినిస్తుందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని కొత్తపేట ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు డీకే చదువుల బాబు సంపాదకత్వంలో 20 మంది విద్యార్థులు రాసిన ‘‘కొత్తపేట కలాలు’’పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గురువారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థి వయసులోనే పుస్తకాలను రాయాలనే ఆలోచన రావడం అరుదైన విషయమన్నారు. విద్యార్థులను ఈ వైపుగా ప్రోత్సహించిన చదువుల బాబును అభినందించారు. గురువులేని విద్య ప్రకాశించదని తెలిపారు. సమాజానికి ఉపయోగపడే రచనలు చేయాలని పేర్కొన్నారు. కథలు రాయడం వల్ల విద్యార్థుల్లో పరిశీలన, సృజనాత్మక శక్తి అభివృద్ధి చెందుతుందని అన్నారు. కథల్లో స్నేహం, సహకార గుణం, సేవాతత్వం, తల్లిదండ్రుల ప్రేమ, పరోపకారం తదితర అంశాలు కనిపించాయన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శతావధాని నరాల రామారెడ్డి మాట్లాడుతూ రాచమల్లు శివప్రసాదరెడ్డిలా మాట్లాడే శాసనసభ్యులు రాష్ట్రంలోనే అరుదుగా ఉన్నారని చెప్పారు. రాచమల్లు రామచంద్రారెడ్డి, భైరవ కొండారెడ్డి గొప్ప కవులు అని తెలిపారు. ఆయన వంశంలో కవులు ఉన్న కారణంగానే ఆయనకు వాక్చాతుర్యం అలవడిందన్నారు. ఆయన భాష, భావం చక్కగా ఉంటాయని పేర్కొన్నారు. సంస్కృతి స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి ఒంటేరు శ్రీనివాసులరెడ్డి పాఠశాల వయసులోనే సమాజంపై అవగాహన పెంచుకుని కథలు రాసిన విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని మంచి కథలు రాయాలని కోరారు. కార్యక్రమంలో ఎంఈఓ సావిత్రమ్మ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయభారతి, ఉపాధ్యాయులు గజ్జల వెంకటేశ్వరరెడ్డి, చదువులబాబు, హిమజాత, దేవదత్తు, పద్మావతి, రమాదేవి, కృష్ణ మాధవీలత, రామానాయుడు పాల్గొన్నారు. -
ఆదరణ పథకం కమీషన్ల మయం
వైఎస్ఆర్ జిల్లా,ప్రొద్దుటూరు : చంద్రబాబు నాయుడు హయాంలోని ఆదరణ పథకం కమీషన్ల మయంగా ఉండేదని ఎమ్మెల్యే రాచమల్లు శిపవ్రసాదరెడ్డి తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని 687 మంది ఆదరణ–2 పథకం కింద పనిముట్ల కోసం 10 శాతం చొప్పున డిపాజిట్ చెల్లించగా ఇంత వరకు పనిముట్లు రాలేదు. దీంతో లబ్ధిదారులకు రూ.6,68,549ను గురువారం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, అధికారులు పంపిణీ చేశారు. గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏడాదిన్నర కిందట ఎంతో మంది పేదలు ఆదరణ పథకానికి కుట్టు మిషన్లు, వాషింగ్ మిషన్లు, ఇస్త్రీ పెట్టెలు కావాలని దరఖాస్తు చేశారన్నారు. వాస్తవానికి మార్కెట్లో కుట్టుమిషన్ విలువ రూ.5వేలు ఉండగా టీడీపీ ప్రభుత్వం మాత్రం రూ.8,400తో లబ్ధిదారులకు ఇవ్వాలని చూసిందన్నారు. ఆదరణ–1 పథకం ద్వారా ముందుగా కొంత మందికి పరికారాలు మంజూరు చేయగా ఆదరణ–2 పథకానికి మళ్లీ దరఖాస్తు చేశారన్నారు. 10 శాతం చెల్లిస్తే సామగ్రి వస్తుందని లబ్ధిదారులు భావించారన్నారు. దీని ద్వారా ప్రజా ధనం దుర్వినియోగమైందని తెలిపా రు. జిగ్జాగ్ మిషన్ రూ.9,600, జాకార్డు మిషన్కు రూ.18,500కు 10 శాతం చొప్పున డబ్బు చెల్లించారన్నారు. రూ.6,500తో జాకార్డు తెచ్చి తాను పంపిణీ చేసిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు.లబ్ధిదారులకు డబ్బు చెల్లించడంలో జాప్యం అవుతుండటంతో ఈ విషయాన్ని సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లానని, అధికారులకు ఫోన్ చేశానని తెలిపారు. అర్హులందరికీ ఇంటి స్థలంతోపాటు అమ్మ ఒడి పథకం తప్పక మంజూరవుతుందని, ఇందులో ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దన్నారు. వైఎస్సార్కాంగ్రెస్పార్టీ ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ ఎన్.రాధ మాట్లాడుతూ ఆదరణ లబ్ధిదారులు చెల్లించిన డబ్బు తిరిగి ఇవ్వడానికి జాప్యం జరిగిన మాట వాస్తవమేనన్నారు. సమావేశంలో మెప్మా టీఈ కెజియా జాస్లిన్ పాల్గొన్నారు. -
వైఎస్సార్ నేతన్న నేస్తం వరం
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు: వైఎస్సార్ నేతన్న నేస్తం చేనేతలకు వరం లాంటిదని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. మున్ముందు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో చేనేతలకు మరింత మేలు జరుగుతుందని అన్నారు. స్థానిక 37 వార్డు పరిధిలోని హనుమాన్నగర్ ఆంజనేయ స్వామి ఆలయంలో చేనేత నాయకుడు సింపిరి అనిల్ కుమార్ అధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ తాను పుట్టింది చేనేతల ఇళ్ల మధ్యనే అని, పుట్టినప్పటినుంచీ మీతో తత్సంబంధాలు కొనసాగిస్తున్నాని చెప్పారు. ఏప్రభుత్వం చేనేతల అభివృద్ధి గురించి ఆలోచిస్తుందో, ఏ ముఖ్యమంత్రి మీ పట్లప్రేమాభిమానాలు చూపుతున్నారో తెలుసుకోవాలని కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేనేతలకు రూ.350 కోట్ల రుణమాఫీ చేశారని అన్నారు. అలాగే సబ్సిడీ పథకాన్ని అమలుచేసింది ఆయనే అని తెలిపారు. ఆయన కుమారుడైన వైఎస్ జగన్ బీసీ వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని తర్వాత మీ అభివృద్ధి గురించి ఆలోచించలేదన్నారు. 2014 ఎన్నికల్లో చేనేతల సంక్షేమం కోసం మేనిఫేస్టోలో పెట్టినా ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. గతంలో చేనేతల ఫించన్లకు తాను దీక్ష చేసిన విషయాన్ని గుర్తుచేశారు. పేదల ఇళ్లనిర్మాణం కోసం రూ.150 కోట్లు ఖర్చుపెట్టి 300 ఎకరాలకు పైగాభూములు కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో తొలిమారు ఈ విధంగా చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అనుమతితో ఈ పక్రియ చేపట్టామన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో చేనేతలకు తప్పక ప్రాధాన్యతను ఇస్తామన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ ఉండేల గురివిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాష్ట అభివృద్ధి కోసం నిర్విరామంగా కృషిచేస్తున్నారని తెలిపారు. చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ అవ్వారు ప్రసాద్ మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేనేత సామాజిక వర్గం ఓట్లతో మూడు మార్లు ముఖ్యమంత్రి అయినా తమ సంక్షేమాన్ని గాలికొదిలేశారని వివరించారు. ఆప్కోను నిర్వీర్యం చేసి చేనేతల ఆత్మహత్యలకు కారణమయ్యారని విమర్శించారు. చేనేతల అభివృద్ధి కి జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కడప పార్లమెంటరీ అధ్యక్షురాలు జింకా విజయలక్ష్మి, చేనేత విభాగం రాష్ట్రప్రధాన కార్యదర్శి బలిమిడిచిన్నరాజు, జిల్లా అధ్యక్షుడు బీఎన్ఆర్, చేనేత నాయకులు, మెడికల్షాపు శ్రీను, పల్లా సురేష్, పుణ్యవతి, రమణారెడ్డి, శివారెడ్డి, బండారు సుబ్రమణ్యం, రాగా నరసింహరావు, శ్రీను, కృష్ణా, నాగేంద్ర, కన్నయ్య పాల్గొన్నారు. -
రాష్ట్రంలో ఇంతకంటే దయనీయం మరొకటి ఉంటుందా?
సాక్షి, ప్రొద్దుటూరు : ఆర్థిక ఇబ్బందులతో అవస్థలు పడి మంజూరు చేయించుకున్న ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను సైతం బ్యాంకుల్లో డబ్బు లేక బౌన్స్ చేయించిన ఘనత నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిదని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. అలాంటి పేదవారికి తమ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ద్వారా మళ్లీ చెక్కులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తున్నానన్నారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో శనివారం ఆయన 60 మంది బాధితులకు రూ.21.90లక్షల విలువైన సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఇప్పటికే సుమారు రూ.కోటి వరకు సీఎం రిలీఫ్ఫండ్, ఎల్ఓసీ లెటర్లను మంజూరు చేయించామన్నారు. చౌడూరు గ్రామానికి చెందిన ఎర్రంరెడ్డి స్రవంతికి ఈ ఏడాది మార్చి 5న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంజూరు చేసిన రూ.1,02,722 విలువగల చెక్కును చూపించారు. ఎంతో ఆశతో బాధితురాలు బ్యాంకుకు వెళితే డబ్బు లేదని బౌన్స్ అయినట్టు తెలిపారన్నారు. ఇలాంటి కేసులు నియోజకవర్గంలో సుమారు 100 వరకు ఉంటాయని, జిల్లాలో, రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉన్నాయన్నారు. అనారోగ్యంతో చికిత్స చేయించుకున్న బాధితుల చెక్కులు కూడా బౌన్స్ అయితే ఇంతకంటే దయనీయ పరిస్థితి మరొకటి ఉంటుందా అన్నారు. బౌన్స్ అయిన చెక్కులకు సంబంధించి మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, మల్లేల లింగారెడ్డి 25 శాతం చొప్పున చెల్లిస్తే తాను మిగతా 50 శాతం చొప్పున చెల్లించి డబ్బు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి రాదని తెలిపారు. అలాంటి పరిస్థితి వస్తే తాను రాజీనామా చేయడానికి వెనుకాడనన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఉండేల గురివిరెడ్డి, వైఎస్సార్సీపీ మహిళా విభాగం కడప పార్లమెంటరీ అధ్యక్షురాలు జింకా విజయలక్ష్మీ, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరు నాగేంద్రరెడ్డి, రాజుపాళెం మండల కనీ్వనర్ ఎస్ఏ నారాయణరెడ్డి, కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, నియోజకవర్గ అధ్యక్షురాలు గజ్జల కళావతి, పోసా భాస్కర్, మద్దూరి దేవి, షమీమ్బాను పాల్గొన్నారు. -
కష్టంలో ఉన్న వారే నా ఆత్మ బంధువులు: రాచమల్లు
సాక్షి, ప్రొద్దుటూరు : కష్టంలో ఉన్నవారే నా ఆత్మ బంధువులని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. పేదల ప్రేమతోనే నా రాజకీయ జీవితం ఆరంభమైందని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తీట్ల రాజేష్ కుమారుడు అభిరాం ప్రసాద్కు రూ.10.33లక్షల విలువైన ఎల్ఐసీ బాండును శనివారం తన కార్యాలయంలో అందించారు. అభిరాంప్రసాద్ యుక్త వయసు నాటికి ఈ డబ్బు అందనుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడారు. ఈ ఏడాది జూలై నెలలో పులివెందులకు ద్విచక్రవాహనంలో వెళుతూ తీట్ల రాజేష్తోపాటు మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కూలి పనులు చేసుకునే వారి కుటుంబాల గాథను విన్న వెంటనే ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, తాను స్పందించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ద్వారా మూడు కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున రూ.15లక్షలు చెక్కును మంజూరు చేయించామన్నారు. ఆ సమయంలో తీట్ల రాజేష్ సతీమణి షబానా నిండు గర్భిణిగా ఉండటాన్ని చూసి తాను చలించి పోయానన్నారు. ఆమె కుటుంబాన్ని ఆదుకుంటామని అక్కడే తెలిపామన్నారు. పురిటినొప్పులతో ఉన్న ఆమెను ఆస్పత్రిలో చేరి్పంచి వైద్య సాయం కూడా అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆగస్టు 26న షబానా రెండో సంతానంగా మగబిడ్డకు జన్మనిచ్చిందన్నారు. తానే ఆ బిడ్డకు అభిరాం అని పేరు పెట్టగా షబానా కుటుంబీకులు తనపై ఉన్న మమకారంతో అభిరాంప్రసాద్గా పేరు మార్చుకున్నారన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ద్వారా సేవా గుణం అలవర్చుకున్నా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ద్వారా తాను సేవా గుణాన్ని అలవర్చుకున్నానని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తకు ఈ విషయాన్ని బోధించానన్నారు. పేదల ఆశీర్వాదంతోనే తాను ఈ స్థాయికి ఎదిగానని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఇటీవల నూనెలో పడిన బాలుడు భువనేశ్వర్కు వైద్య సాయం అందిస్తున్నానని చెప్పారు. షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి లాలసకు ఆర్థిక సహాయం చేశానన్నారు. కశెట్టి చిన్న వెంకటసుబ్బయ్య ఉన్నత పాఠశాలలో చదువుతున్న బాలికను దత్తత తీసుకున్నట్లు తెలిపారు. భగవద్గీత, బైబిల్, ఖురాన్ల సారాంశం సేవా మార్గమేనన్నారు. టీడీపీ నేతలు కూడా ఇదే మార్గాన్ని అలవర్చుకోవాలని, ఇతరులపై విమర్శలను మానుకోవాలని సూచించారు. ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఉండేల గురివిరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుడు చౌడూరు బోరెడ్డి, మహిళా విభాగం కడప పార్లమెంటరీ అధ్యక్షురాలు జింకా విజయలక్ష్మి, నియోజకవర్గ అధ్యక్షురాలు గజ్జల కళావతి, మాజీ కౌన్సిలర్లు రాగుల శాంతి, గరిశపాటి లక్ష్మీదేవి, టప్పా గైబుసాహెబ్, రఫిక్, పోసా భాస్కర్, జంబాపురం రామాంజనేయరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు మద్దూరి దేవి, గుమ్మళ్ల పద్మావతి, బోగాల లక్ష్మీనారాయణమ్మ, నరాల మల్లికార్జునరెడ్డి, శంకరాపురం నాగమునిరెడ్డి, ఆర్సీ సుబ్రహ్మణ్యం, బలిమిడి చిన్నరాజు, ఫయాజ్, 24వ వార్డు ఇన్చార్జి రఫిక్ తదితరులు పాల్గొన్నారు. -
ఎంత డబ్బు అయినా ఖర్చు పెడతా
ప్రొద్దుటూరు : మీరు డబ్బు కోసం వెనుకాడాల్సిన అవసరం లేదు. ధనవంతుల పిల్లలకు ఎలాంటి చికిత్స చేయిస్తారో అలాగే చికిత్స చేసి గాయపడిన బాలుడిని బతికించండి.. అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి వైద్యులను కోరారు. ఆ బాలుడికి అయ్యే ఖర్చును తాను భరించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. సోములవారిపల్లె గ్రామ పంచాయతీ ఈశ్వర్రెడ్డినగర్కు చెందిన శివప్రసాద్, ప్రియాంకలు ఇటీవల అమృతానగర్లో స్థిరపడ్డారు. కాగా పది రోజుల క్రితం వీరు అయ్యప్ప స్వాములకు భోజనం ఏర్పాటు చేసేందుకు వంటలు చేసే పనిలో ఉన్నారు. వీరి నాలుగేళ్ల కుమారుడు భువనేశ్వర్ ఆడుకుంటూ వెళ్లి నూనె గోళంలో పడటంతో శరీరం ఎక్కువ భాగం కాలిపోయింది. వీరు బాలుడిని బతికించుకునేందుకు వేలూరు, తిరుపతి ప్రాంతాల్లోని ఆస్పత్రులకు వెళ్లారు. ప్రస్తుతం ప్రొద్దుటూరులోని నాగదస్తగిరిరెడ్డి ఆస్పత్రిలో చేరారు. సోములవారిపల్లె మాజీ సర్పంచ్ శేఖర్ యాదవ్ ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి బుధవారం ఆస్పత్రిలో ఉన్న బాలుడిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వైద్యులు నాగదస్తగిరిరెడ్డి, టీడీ వరుణ్కుమార్రెడ్డితో మాట్లాడుతూ పిల్లాడిని బతికించేందుకు ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. ఎలాగైనా బాలుడిని బతికించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కోరారు. బాలుడి తల్లిదండ్రులు దొమ్మర సంఘానికి చెందిన నిరుపేదలు అని అన్నారు. వారిని తప్పకుండా తాను ఆదుకుంటానని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు మాజీ సర్పంచ్ రమణయ్య, సెల్ సుబ్బయ్య పాల్గొన్నారు. -
షాహిదా బేగం ఇక నా దత్త పుత్రిక : ఎమ్మెల్యే రాచమల్లు
సాక్షి, ప్రొద్దుటూరు : ఓ పేద విద్యార్థినిని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అక్కున చేర్చుకున్నారు. ఆమెను అన్ని విధాలా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. సోమవారం ప్రొద్దుటూరులో టీటీడీ పాలకమండలి సభ్యుడు చిప్పగిరి ప్రసాద్ సన్మాన కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముందు 6 తరగతి విద్యార్థిని షాహిదా బేగం జానపద గేయం పాడి అందరినీ అలరించింది. ఎమ్మెల్యే స్పందించి విద్యార్థినిని వేదికపైకి పిలిచారు. రూ.5వేలు నగదు బహుమతి అందించారు. మండలంలోని మీనాపురం గ్రామానికి చెందిన షాహిదాబేగంకు తండ్రి లేడని ఆయన తెలుసుకున్నారు. పేదరికంలో పుట్టిన ఆమె చదువుకు తాను పూర్తిగా సహకరిస్తానని వెంటనే ప్రకటించారు. ఎంత వరకు చదివినా ఆర్థిక సహాయం అందిస్తానన్నారు. పెళ్లి బాధ్యత కూడా తీసుకుంటానని చెప్పడంతో హర్షధ్వానాలు మారుమోగాయి. ఎమ్మెల్యే నిర్ణయం పట్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. -
నేతన్ననేస్తంతో ఎంతో ప్రయోజనం
ప్రొద్దుటూరు : ‘నియోజకవర్గంలో చేనేత కార్మికుల జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి? వారి పరిస్థితి ఏమిటి? వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా ఏడాదికి రూ.24 వేలు చొప్పున ఇవ్వబోతున్నాం.. ఈ ఏడాది డిసెంబర్ 21 నుంచి పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డితో అన్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో గురువారం సాయంత్రం 6 గంటలకు ఎమ్మెల్యే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆయన ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా చర్చించిన అంశాలను ఎమ్మెల్యే ‘సాక్షి’కి వివరించారు. నియోజకవర్గంలో ఎక్కువ మంది చేనేత కార్మికులు ఉండటంతో ప్రత్యేకంగా వారి సంక్షేమం గురించి చర్చించానన్నారు. ప్రొద్దుటూరు పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజి కాలువను మంజూరు చేస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ ఆధునికీకరణకు అడిగిన మేరకు రూ.2 కోట్లు మంజూరు చేయిస్తానని సీఎం చెప్పారన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సంబంధించి రోడ్ల విస్తరణకు నిధులు మంజూరు చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించే విషయాన్ని సీఎంకు వివరించానన్నారు. అలాగే రైతు భరోసా పథకం, గ్రామ సచివాలయాల పనితీరు గురించి సీఎం అడిగి తెలుసుకున్నారని తెలిపారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి పనులతోపాటు తన కుటుంబ యోగక్షేమాల గురించి సీఎం అడిగి తెలుసుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని వివరించారు. ఎమ్మెల్యే రాచమల్లు వెంట వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు జింకా విజయలక్ష్మి, వైఎస్సార్సీపీ నాయకుడు పోతిరెడ్డి మురళీనాథరెడ్డి, పీఈటి కోనేటి సుధాకర్రెడ్డి ఉన్నారు. -
మద్యంపై యుద్ధం
అక్కచెల్లెమ్మల సంతోషం కోసం నివాస ప్రాంతాల్లో ఉన్న మద్యం షాపులను తొలగించాలని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి యుద్ధం చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 48 గంటలపాటు దీక్ష చేసినా అప్పటి ప్రభుత్వం స్పందించలేదు. అయినా ఎమ్మెల్యే తన నిర్ణయాన్ని మార్చుకోకుండా వైఎస్సార్సీసీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదిశగా అడుగులు వేశారు. తాను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చారు. ఎమ్మెల్యే నిర్ణయంతో ఆయా ప్రాంతాల్లోని మహిళలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సంఘాల నేతలు సైతం ఎమ్మెల్యే తీరును స్వయంగా ప్రశంసించారు. ప్రొద్దుటూరు : నివాస ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మద్యం షాపులను తొలగించడం మహిళలకు ఎంతో ఊరట కలిగించింది. దీనికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం కలిసి వచ్చింది. ప్రొద్దుటూరు పట్టణంలోని రామేశ్వరం రోడ్డులో సాయిబాబా ఆలయానికి ఇరువైపులా చాలా కాలం నుంచి ఐదు మద్యం షాపులు నడిచేవి. ఇక్కడ ఉన్న ఓ మద్యం షాపు టెండర్ జిల్లాలోనే అత్యధికంగా రూ.కోటి పలికిన సందర్భాలు ఉన్నాయి. మద్యం షాపుల మధ్యలోనే సాయిబాబా ఆలయం ఉండటంతో వసంతపేట మున్సిపల్ హైస్కూల్, చుట్టూ పేదలు నివసించే ప్రాంతాలు ఉన్నాయి. రాత్రి వేళల్లో, ఆదివారాల్లో మద్యం ప్రియుల ధాటికి తట్టుకోలేక మహిళలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. రోజురోజుకు సమస్య తీవ్రతరమైంది. 48 గంటలకు దీక్ష చేసిన ఎమ్మెల్యే రాచమల్లు వరుసగా ఉన్న ఈ మద్యం షాపులను ఎత్తివేయాలని కోరుతూ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి 2017లో 48 గంటలపాటు నిరసన దీక్ష చేపట్టారు. అప్పట్లో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి స్వయంగా వచ్చి ఎమ్మెల్యే చేత దీక్షను విరమింపజేశారు. ఆ సందర్భంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు హామీ ఇచ్చినా టీడీపీ ప్రభుత్వం నిర్వాకం కారణంగా ఆ హామీ అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యే రాచమల్లు తిరిగి ఈ సమస్యను పరిష్కరించాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్టు 16న ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ సీతారామిరెడ్డి, ఎస్ఐ కల్యాణ్తో కలసి నివాస ప్రాంతాల్లోని మద్యం షాపులను పరిశీలించి ఆయా ప్రాంతాల్లోని మహిళలతో మాట్లాడారు. ఈ సందర్భంగా రామేశ్వరం రోడ్డుతోపాటు ఆర్ట్స్కాలేజీ నాలుగు రోడ్ల కూడలి, వైఎంఆర్ కాలనీ ఎంట్రెన్స్ వద్ద ఉన్న మద్యం షాపులను తొలగించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. పలువురు మద్యం షాపులు తిరిగి ఏర్పాటు చేయాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అయితే ఎమ్మెల్యే సూచన మేరకు రామేశ్వరంలోని నాలుగు, ఆర్ట్స్కాలేజీ నాలుగు రోడ్డు కూడలి, వైఎంఆర్ కాలనీ వద్ద ఉన్న మద్యం షాపులను ఈనెల 1వ తేదీ తొలగించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మద్యం షాపులను నియంత్రించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏటా 20 శాతం మద్యం దుకాణాలను రద్దు చేయాలని నిర్ణయించడం ఎమ్మెల్యేకు కలిసి వచ్చింది. . ఎమ్మెల్యేను అభినందించిన ప్రజా సంఘాలు గతంలో మద్యం షాపులను తొలగించాలని ఆందోళన చేయడంతోపాటు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇబ్బందులు లేకుండా నివాస ప్రాంతాల్లోని మద్యం దుకాణాలను తొలగించాలని ఎమ్మెల్యే రాచమల్లు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజా సంఘాలు హర్షిస్తున్నాయి. సంఘాల నేతలు ఆగస్టు 18న స్థానిక ఎన్జీఓ హోంలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయడంతోపాటు ఎమ్మెల్యే రాచమల్లు ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ, విరసం నేత వరలక్ష్మి, సీపీఐ, సీపీఎం నేతలు సుబ్బరాయుడు, సత్యం, చైతన్య మహిళా సంఘం అధ్యక్షురాలు పద్మ, జమా అతె ఇస్లామి హింద్ అధ్యక్షుడు మహబూబ్ఖాన్ తదితరులు ఎమ్మెల్యేను అభినందించిన వారిలో ఉన్నారు. -
టీడీపీ నేతలందరూ కలసి వచ్చినా..
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు : రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా రెండో మారు ఘన విజయం సాధించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హవాతోపాటు రాచమల్లు సొంత ఇమేజ్ కూడా ఆయన విజయానికి కారణమైంది. టీడీపీ తరఫున నియోజకవర్గంలో నేతలు ఎక్కువగా ఉన్నారు. వారందరూ కలసి వచ్చినా వైఎస్ఆర్సీపీ తరఫున రాచమల్లు అవిశ్రాంత పోరాటం చేశారు. ఆయనను ఓడించడానికి టీడీపీ నేతలు పన్నిన వ్యూహాలు ఫలించలేదు. ఈ కారణంగా రాచమల్లు మరో మారు పట్టు నిలుపుకొన్నారు. దీంతో ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాక టీడీపీ నేతలు అయోమయంలో పడ్డారు. 2014 ఎన్నికల్లో తొలిమారు ఎమ్మెల్యేగా ఎన్నికైన రాచమల్లు ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా లొంగకుండా.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు. అనతి కాలంలోనే సొంత ఇమేజ్ను తెచ్చుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాటం చేసిన ఎమ్మెల్యే రాచమల్లుపై.. పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ఆయన మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతూ వచ్చారు. పార్టీ మారాలని కూడా తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు వచ్చాయి. తన ఊపిరి ఉన్నంత వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని పలు సందర్భాల్లో రాచమల్లు ప్రకటించారు. ఈ కారణంగా ఆయన ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. రాచమల్లు విజయం ఎన్నికల కంటే ముందే ఖరారైనట్లు భావించవచ్చు. స్వయంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తమ పార్టీ అభ్యర్థులతో చర్చించిన సందర్భంలో.. ప్రజల మద్దతు రాచమల్లుకే ఉందని, ఆయన ఓటమి కోసం మనమంతా కష్టపడాలని సూచించారు. తెరపైకి వచ్చిన పలువురి పేర్లు ప్రజల మద్దతు కూడగట్టుకున్న రాచమల్లును ఓడించడానికి.. టీడీపీ అధిష్టానం చేయని ప్రయత్నాలు లేవు. ప్రస్తుతం పార్టీలో ఉన్న నేతలకు పట్టు లేదని, కొత్తగా పలువురి పేర్లను తెరపైకి తెచ్చింది. మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ను తొలుత ప్రొద్దుటూరులో పోటీ చేయించాలని ప్రతిపాదించారు. మరో మారు మంత్రి ఆదినారాయణరెడ్డి కుమారుడిని పోటీ చేయిస్తారని ప్రచారం జరిగింది. మరో వైపు ఆప్కో చైర్మన్ బండి హనుమంతు, సినీ హబ్ రాజేశ్వరరెడ్డి, డాక్టర్ వైవీ స్వరూప్కుమార్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, వీరశివారెడ్డి ఇలా అనేక మందిని తెరపైకి తెచ్చారు. చివరగా మాజీ ఎమ్మెల్యే మల్లేల లింగారెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేశారు. టీడీపీ విజయం సాధించే దిశలో భాగంగా వరదరాజులరెడ్డి, లింగారెడ్డి మధ్య సయోధ్య కుదిర్చారు. ఇందులో భాగంగానే వరదరాజులరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ విజయం కోసం ఓ వైపు లింగారెడ్డి, మరో వైపు వరదరాజులరెడ్డి శక్తివంచన లేకుండా కృషి చేశారు. ప్రొద్దుటూరులో అనుచర గణం కలిగి ఉన్న మంత్రి ఆదినారాయణరెడ్డి రాచమల్లును ఎలాగైనా ఓడించాలని పట్టుబట్టారు. బహిరంగ వేదికల్లో ఆయనపై వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. అయినా రాచమల్లు విజయాన్ని నిలువరించలేకపోయారంటే ఆయనకు ఉన్న ప్రజల మద్దతు ఏ పాటిదో అర్థమవుతోంది. కలిసొచ్చిన పార్టీ కార్యక్రమాలు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కూడా అదనంగా కలిసి వచ్చాయి. ఆయన ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేయగా.. పార్టీ కార్యక్రమాలను కూడా వాడవాడలా తిరిగి ప్రజల్లోకి తీసుకెళ్లారు. గడపగడపకు వైఎస్సార్, కావాలి జగన్– రావాలి జగన్ కార్యక్రమాల్లో భాగంగా ఆయన నియోజకవర్గంలోని ప్రతి గడప తొక్కారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమి చేస్తుందో ప్రజలకు వివరించడంతోపాటు ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వ తీరును ఎండగట్టారు. టీడీపీ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి రాచమల్లు శివప్రసాదరెడ్డి విజయం సాధించారు. సింహం సింగిల్గా వస్తుందని రాచమల్లు నిరూపించారు. -
మాట నిలబెట్టుకోకుంటే మళ్లీ పోటీచేయను : రాచమల్లు
-
టీడీపీ కుతంత్రాల పర్వం
ప్రభుత్వ పథకాల లబ్ధితోపాటు వ్యక్తిగత వివరాలను కూడా టీడీపీ గుప్పెట్లో పెట్టుకుంటోందన్న సమాచారం జిల్లాలో కలకలం సృష్టించింది. ఇప్పటికే వైఎస్సార్సీపీ ఓట్ల తొలగింపునకు స్వపక్షీయులే దరఖాస్తు చేసినట్లు కుట్రలు పన్నిన సర్కారు మరో మోసానికి తెరలేపింది. అధికార పార్టీ తాజా పన్నాగంతో జిల్లా ప్రజలు ఒక్కసారిగా ఉలికిపడ్డారు. అడ్డదారులు తొక్కయినా విజయం సాధించాలనే కుట్రపై జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఇంతటి అరాచకానికి దిగిన సర్కారు మరొకటి లేదంటూ నిరసిస్తున్నారు. తమ పార్టీ అధికార యాప్‘ సేవామిత్ర’ ద్వారా కూడా వైఎస్సార్సపీ ఓట్ల తొలగింపునకు కుతంత్రం నడుపుతోందని తెలిసి కలవరపడుతున్నారు. అధికార పక్షానికి చెందిన సర్వే బృందాలు జిల్లాలో ఇప్పటికే తిరుగుతున్నాయి. టీడీపీ అధికార యాప్ ‘సేవామిత్ర’ ద్వారా వైఎస్సార్సీపీ సానుభూతిపరుల వివరాలను గోప్యంగా సేకరిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలపై అభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు నటిస్తున్నాయి. రకరకాల ప్రశ్నలను సంధిస్తూ ప్రభుత్వ వ్యతిరేకుల్ని గుర్తిస్తున్నాయి. ప్రభుత్వానికి ప్రతికూలంగా ఉన్నవారి వివరాలను సేకరించి యాప్లో నిక్షిప్తం చేస్తున్నాయి. తద్వారా వీరి ఓట్లను తొలగించేందుకు ప్రభుత్వం నయవంచనకు పథక రచన చేసింది. తాజాగా బయటపడిన భారీ డేటా స్కామ్పై వైఎస్సార్సీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. తక్షణమే దీనిపై లోతుగా విచారించి సర్కారు నైజాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. డేటా చౌర్యం చేస్తున్న టీడీపీ కుతంత్రాన్ని జిల్లా ప్రజలు..విపక్షాల నాయకులు ఎండగడుతున్నారు. సాక్షి కడప : టీడీపీని పరాజయ భయం వెంటాడుతోంది. ఏం చేయాలో పాలుపోక..బలంగా ఉన్న వైఎస్సార్ సీపీని ఎదుర్కోలేక పలు ఎత్తులు వేస్తోంది. విపక్ష ఓట్ల తొలగింపునకు దొంగ దరఖాస్తుల వైనాన్ని జనం మర్చిపోకముందే మరో హైటెక్ కుట్రకు పాల్పడిన వైనం జిల్లా వాసులను నిశ్చేష్టులను చేసింది. సర్వే పేరుతో కష్టసుఖాలు....సంక్షేమ పథకాలతో సంతృప్తిని కనుగుంటూనే.....సర్కారు తమకు వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లను తొలగించేందుకు పూనుకోవడంవైఎస్సార్సీపీ శ్రేణుల్ని నివ్వెరపరిచాయి. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి....విపక్ష సానుభూతి పరుల ఓట్లను తొలగించడానికి ఆధునిక టెక్నాలజీని సైతం వినియోగించుకుంటున్న తీరు సంచలనం రేకెత్తించింది....జిల్లాలో పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపునకు దరఖాస్తుల సంఖ్యను పరిశీలిస్తే ఈ వాదనకు బలం చేకూరుతోంది. గతంలోనూ సర్వేల పేరుతో కొంతమంది ప్రజల వద్దకు వచ్చి విచారిస్తూ.....పథకాల లబ్దిని కనుగొంటున్నామంటూనే ఓట్లను తొలగిస్తున్నారని పలుచోట్ల గ్రామస్థులు పోలీసులకు అప్పగించిన సంఘటనలు జరిగాయి. పులివెందుల పోలీసుస్టేషన్లో వైఎస్ వివేకా ఫిర్యాదు పులివెందులలో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఓటును కూడా తొలగించేందుకు కుయుక్తులు చేశారు. అగంతకులు ఆయన ఓటును తొలగించాలని దరఖాస్తు చేసిన వైనం బయటపడింది. మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా ఎన్నో పదవుల ద్వారా ప్రజలకు సేవ చేసిన నాయకుడిగా గుర్తింపు పొందిన వైఎస్ వివేకానందరెడ్డి ఓటును సైతం తొలగించడానికి కుట్ర చేశారు. ఈ దారుణ వ్యవహారం నిగ్గు తేల్చాలని మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ సీపీ ఓట్ల తొలగింపే లక్ష్యం నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ ఓట్లను భారీ ఎత్తున కొల్లగొడితే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా ప్రభావం చూపించవచ్చని తమ్ముళ్లు పచ్చ రాజకీయం చేస్తున్నారు. టీడీపీ అధినేత నేతృత్వంలో తమ్ముళ్లు చివరి అస్త్రంగా వైఎస్సార్ సీపీ సానుభూతి పరుల ఓట్ల తొలగింపు లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాలను కలుసుకుని సుమారు 50 వేల ఓట్ల తొలగింపునకు జరిగిన పథక రచనలో అసలు కథ అంతా టీడీపీ నేతలే నడుపుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నేతలు అనుకున్న మేరకు అనుకూలమైన ఓట్లను ఒకటి, రెండుచోట్ల చేర్పించుకున్న వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. గతంలోనూ ఓటరు అనలిస్ట్ అండ్ స్ట్రాటజీ (వాస్ట్) ఓటర్ల జాబితాలో అవకతవకల వ్యవహారాన్ని బహిర్గతం చేయడంతో నియోజకవర్గంలో దొంగ ఓట్ల వ్యవహారం బట్టబయలైంది. క్షేత్ర స్థాయిలో ఉన్న కొంతమంది అధికారులను అనుకూలంగా మా ర్చుకుని ఇష్టానుసారంగా కథ నడిపినట్లు తెలుస్తోంది. ఎక్కడపడితే అక్కడ..ఎలాపడితే అలా.....అనుకూలమైన వారిని చేర్పించుకోవడం, ప్రతిపక్షాలకు సంబంధించిన ఓట్లను తొలగించేలా తమ్ముళ్లు ప్రత్యేక వ్యూహం నడిపారు. సంక్షేమం ముసుగులో సంక్షోభం ఎన్నికలు దగ్గర పడేకొద్ది సర్కార్ కొత్తకొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. సంక్షేమానికి సంబంధించి ఐవీఆర్ఎస్ ద్వారా సంతృప్తిగా ఉన్నారా....అసంతృప్తిగా ఉన్నారా....అంటూ వివరాలు సేకరిస్తూనే వ్యక్తిగత డేటా సేకరించి....తర్వాత కుట్రలకు తెర తీస్తున్నారన్న అనుమానాలు ప్రజల్లో తలెత్తుతున్నాయి. ఐటీ గ్రిడ్స్ ద్వారా ఏపీకి సంబంధించిన డేటా బట్టబయలైన నేపథ్యంలో జిల్లాకు సంబంధించి కూడా ఓట్ల తొలగింపు ప్రక్రియకు దరఖాస్తులు, వ్యక్తిగత డేటా చోరీ వ్యవహారానికి సంబంధించి ప్రజలు అప్రమత్తమవుతున్నారు. పలువురు యాప్ల ద్వారా ఓట్లను కూడా పరిశీలించుకుంటున్నారు. ఏది ఏమైనా హైదరాబాదులో సైబర్ వ్యవహారం జిల్లాలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. నకిలీ దరఖాస్తులపై కొరడా జిల్లాలో ఎన్నికలకు సంబంధించి ఓట్లను తొలగించాలంటూ ఫారం–7 పేరుతో నకిలీ దరఖాస్తులు ఇచ్చిన వారిపై చర్యలకు ఎన్నికల సంఘం సిద్దమైంది. ఆదివారం కడప ఆర్డీఓ మాలోల వన్టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. నకిలీ దరఖాస్తులతో ఫిర్యాదు చేసిన అగంతకులను పట్టుకోవాలని ఆయన పోలీసులను కోరారు. ఆర్డీఓ మాలోల ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గట్టెక్కడం కోసం తెలుగుదేశం నేతలు అడ్డదారుల్లోనైనా గెలవాలని కొత్త ఎత్తుగడలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆఖరుకు ఓట్ల తొలగింపునకూ పూనుకున్నారు. తమ పార్టీమీద మచ్చ పడకుండా......ప్రత్యర్థి పార్టీలోని వారే ఓటు తీసేయాలని కోరినట్లుగా దరఖాస్తు చేస్తూ అంతర్గత చిచ్చుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ తిరుగులేని శక్తిగా ఆవిర్భవించడంతో ఎదుర్కొనే ధైర్యం లేక ఇలాంటి తెరచాటు కుట్రలకు శ్రీకారం చుట్టారు. చాపాడు మండలం కుచ్చుపాపలో విచిత్ర పరిస్థితి కనిపించింది. గ్రామానికి చెందిన ఎం.లక్షుమ్మ కొద్దికాలం క్రితం మృతి చెందింది. తాజాగా గ్రామానికి చెందిన 19 ఓట్లు తొలగించాలని లక్షుమ్మ పేరుతో దరఖాస్తు చేయడం ఆశ్చర్యం కలిగించింది. అందులోనూ వైఎస్సార్ సీపీ నాయకులతోపాటు కార్యకర్తల ఓట్లు తొలగించాలని పేర్కొనడం చూస్తే పరిస్థితి ఏ విధంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. చివరికి మృతి చెందిన వారి ఆత్మల పేరుతో కూడా దరఖాస్తు చేయడం చూస్తే ‘పచ్చ’ రాజకీయం ఎంత నీచ స్థితికి దిగజారిందో ఇట్టే అర్థమవుతోంది. గెలిచేందుకు అడ్డదారులు రానున్న ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు, లోకేష్ , టీడీపీ నాయకులు అడ్డదారుల్లో ప్రయాణిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రజల బ్యాంకు ఖాతాల వివరాలు, ఆధార్, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని సైబర్వీధిలో పెట్టారు. పోలీసులు దీనిపై పూర్తిస్థాయి విచారణ చేయాలి. బాధ్యులను కటకటాల్లో వేయాలి.– మాల్యాద్రి, యర్రశాల. పోరుమామిళ్ల మండలం -
అవకాశవాద రాజకీయాలకు రోల్ మోడల్ చంద్రబాబు
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు : ఈ ఎన్నికలు నూటికి నూరు శాతం విశ్వసనీయతకు, అవకాశవాద రాజకీయాల మధ్యనే జరుగుతాయని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని రామాపురం గ్రామంలో ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబునాయుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని కోరారు. తొలుత కాంగ్రెస్పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన చంద్రబాబు మామపై కూడా పోటీ చేస్తానని మాట్లాడారన్నారు. ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మామ పక్షాన చేరిపోయారన్నారు. తర్వాత టీడీపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ చాపకింద నీరులా తన అనుకూల వర్గాన్ని, వాతావరణాన్ని తయారు చేసుకున్నారని తెలిపారు. అదునుచూసి ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీని సంపాదించారని పేర్కొన్నారు. తర్వాత ఎన్టీఆర్ సంతానాన్ని, తన తోడల్లుడిన తన అవకాశవాద రాజకీయాల కోసం బలిచేశారన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హరికృష్ణతోపాటు వారి కుటుంబ సభ్యులెవ్వరిని పైకి రాకుండా చేశారని చెప్పారు. నాటి నుంచి నేటి వరకు ప్రతి ఐదేళ్లకు ఒక రాజకీయ పార్టీతో పొత్తు ఏర్పాటు చేసుకుని అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకుని నరేంద్రమోదీని ప్రశంసించిన చంద్రబాబు కాంగ్రెస్ను విమర్శించారన్నారు. నాడు సోనియాను ఇటలీ దెయ్యెం అన్న నోటితోనే నేడు ఇండియా దేవత అంటున్నారని ఎమ్మెల్యే తెలిపారు. తన అవకాశవాద రాజకీయాల కోసం ప్రజలను కూడా వాడుకోవడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. విశ్వసనీయతకు జగన్మోహన్రెడ్డి ప్రతిరూపమని తెలిపారు. ఇచ్చిన మాట కోసం కట్టుబడి పోరాటం చేస్తున్నారన్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణ వార్త విన్న వెంటనే ఓదార్పు యాత్ర చేస్తానని ప్రకటించినందుకు 9 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్నారని, 16 నెలలు జైలు శిక్ష కూడా అనుభవించారన్నారు. మధ్యలో ఎన్నో అవమానాలను, అపనిందనలను జగన్ ఎదుర్కొన్నారని చెప్పారు. చివరికి జగన్ కుటుంబ సభ్యులను అవమానించి కాకుల్లా పొడిచారన్నారు. ఇచ్చిన మాట కోసం సొంత అజెండాతో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీని స్థాపించి ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషిస్తున్నారన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో 14 నెలలపాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారని పేర్కొన్నారు. ఇలాంటి పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నందుకు తాను సంతోషిస్తున్నానని తెలిపారు. అపారమైన అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతుండగా, విశ్వసనీయతతో జగన్ ఆదర్శంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. సమావేశంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, మండల పరిషత్ ఉపా«ధ్యక్షుడు మల్లేల రాజారాంరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు ప్రాప్తం యాకోబ్, పోరెడ్డి నరసింహారెడ్డి, మండల కన్వీనర్ దేవీప్రసాదరెడ్డి, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ అక్బర్, ఆయిల్ మిల్ ఖాజా, జిల్లా ప్రధాన కార్యదర్శులు కల్లూరు నాగేంద్రారెడ్డి, శేఖర్, చెన్నకేశవరెడ్డి, పెద్దశెట్టిపల్లె సుధాకర్రెడ్డి, కొర్రపాడు సూర్యనారాయణరెడ్డి, బలిమిడి చిన్నరాజు, సుబ్బరా యుడు, తుపాకుల భాస్కర్రెడ్డి పాల్గొన్నారు. -
ధర గోరంత.. చెల్లిస్తోంది కొండంత
కడప, రాజుపాళెం: బీసీలకు ఆదరణ పేరుతో ఇచ్చే పనిముట్ల ధరలు గోరంత ఉంటే టీడీపీ నాయకులు వాటికి కొండంత ధర చెల్లించి వ్యత్యాసం డబ్బును చినబాబు, మంత్రుల ఇళ్లకు తరలిస్తున్నారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన రాజుపాళెం మండలం కొర్రపాడులో ఇంటింటి ప్రచారం చేశారు. చేనేత కార్మికుడికి మోటారుకు సంబంధించిన జా కార్డు ఇస్తామని,దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఇందుకు లబ్ధిదారుడు తన వాటా కింద 10 శాతం కట్టాలన్నారు.ఒక్కో జా కార్డుకు రూ.18,500 చెల్లిస్తోందన్నారు. ఇందులో 10 శాతం 1,850 లబ్ధిదారులు డీడీలు కట్టారన్నారు. ఇదే జా కార్డును ప్రొద్దుటూరు పురపాలక సంఘం గత ఏడాది ఏడో నెలలో దరఖాస్తు చేసుకున్న చేనేతలకు ఇంత వరకు జా కార్డులు ఇవ్వకపోతే, మా డీడీల సొమ్ము వెనక్కి ఇవ్వాలని కోరారన్నారు. వారికి తానే జా కార్డును ఇప్పిస్తానని మాట ఇచ్చానన్నారు. ప్రొద్దుటూరుకు చెందిన వైఎస్ఆర్సీపీ చేనేత నాయకులను వెంకటగిరికి పంపామన్నారు. అక్కడ రూ.6,500తో 86 కొనుగోలు చేశామన్నారు. మిగిలిన రూ.10,500 చినబాబు ఇంటికి, మంత్రులకు చేరడం లేదా అని ప్రశ్నించారు. ఎవడబ్బ సొమ్ము ఎవడు తీసుకుంటున్నారని మండి పడ్డారు. ఆదరణ పథకం టీడీపీ నాయకుల ఆర్థిక అభివృద్ధికి తప్ప బీసీల అభివృద్ధికి కాదన్నారు. ఈ విషయంపై ఏ మంత్రి, ఏ నాయకుడితోనైనా చర్చకు సిద్ధమన్నారు. బీసీలకు ఇచ్చే సబ్సిడీ రుణాలు పేపర్లకే పరిమితమయ్యాయన్నారు. 50 శాతంతో సబ్బిడీ రుణాల కోసం మున్సిపల్, ఎంపీడీఓ కార్యాలయాల చుట్టూ తిరగటానికే సరిపోతోందన్నారు. నూటికి 80 శాతం సబ్సిడీ రుణాలు మంజూరు కాలేదన్నారు. వ్యక్తిగత రుణాలను బ్యాంకులో ఇప్పించి వారిని ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం, ఇచ్చిన కొన్ని రుణాలు కూడా జన్మభూమి కమిటీ సభ్యుల సిఫారస్సులతో ఇచ్చినవే అన్నారు. ప్రభుత్వ ఖజానాలోని డబ్బులను పంచుకుంటున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రంగారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు దొంతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, ప్రతాప్రెడ్డి పాల్గొన్నారు. -
ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి
వైఎస్ఆర్ జిల్లా, రాజుపాళెం : ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలని, రెండు, మూడు ఓట్లు ఉంటే నేరమని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. రాజుపాళెం మండలంలోని వెంగళాయపల్లె, అయ్యవారిపల్లె గ్రామాల్లో ఆదివారం ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారంలో విలేకరులతో మాట్లాడారు. అన్ని సవరణల తర్వాత ఎలక్షన్ కమిషన్ తుది ఓటర్ల జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందేనన్నారు. వాటి ప్రకారం ప్రొద్దుటూరు నియోజకవర్గానికి 2,14,370 ఓట్లు ఉన్నాయన్నారు. అయితే నియోజకవర్గానికి సంబంధించి 9,871 ఓట్లు అర్హత లేనివి ఉన్నాయని చెప్పారు. ఇందులో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ఓట్లు ఉంటాయన్నారు. ఎవరిపై విమర్శలు చేయకుండా పార్టీలకతీతంగా, స్వచ్ఛందంగా అర్హత లేని ఓట్లను తొలగించాలని కోరుతున్నామన్నారు. వైఎస్ఆర్సీపీతో పాటు అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి, స్వచ్ఛమైన రాజకీయాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ ఏస్ఏ నారాయణరెడ్డి, జిల్లా అ«ధికార ప్రతినిధి భాస్కర్, జిల్లా సేవాదళ్ ప్రెసిడెంట్ ధనిరెడ్డి కిరణ్రెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాక్షస పాలన అంతమెందించే రోజులు దగ్గర్లోనే..
సాక్షి, వైఎస్సార్ జిల్లా : ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసిందేమి లేదని, అవినీతే తప్ప అభివృద్ది చేయలేదని వైఎస్సార్సీపీ నేతలు విమర్శించారు. స్వార్థం కోసం అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. గురువారం కడపలో జరిగిన వైఎస్సార్సీపీ సమర శంఖారావం సభలో పలువురు పార్టీ నేతలు మాట్లాడుతూ.. ఐదేళ్లుగా రాష్ట్రంలో రాక్షస పాలన జరుతుందని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చంద్రబాబుకు బుద్ది చెప్పేరోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. చంద్రబాబు ధనబలంలో ప్రజలను ప్రలోభపెట్టాలని చూస్తున్నారని.. అంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో బాబు ప్రలోభాలకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. వైఎస్ జగన్ను మించిన పోరాట యోధుడు లేరని, వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో వైఎస్సార్సీపీ నేతలను గెలిపించేలా కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు ఏం చెప్పిన నమ్మే స్థితి లేదు : సి. రామచంద్రయ్య ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చంద్రబాబును ప్రజలు మరోసారి నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేరని వైఎస్సార్సీపీ నేత సి. రామచంద్రయ్య అన్నారు. చంద్రబాబు ఏం చెప్పిన నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. ఆస్తులను కొల్లగొట్టేందుకే అగ్రిగోల్డ్ సమస్యను పరిష్కరించడంలేదని ఆరోపించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు పాలనకు చరమగీతం పాడాలని చెప్పారు. చంద్రబాబు ప్రలోభాలకు లొంగి మరోసారి మోసపోవద్దని ప్రజలను కోరారు. రాష్ట్రంలోని రాక్షస పాలనను అంతమెందించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. వైఎస్ జగన్ వల్లే రాష్ట్రాభివృద్ధి సాధ్యం : కోరుముట్ల తన స్వార్థం కోసం నక్కజిత్తుల చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు విమర్శించారు. రాష్ట్రాన్ని పీడిస్తున్న చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. పాదయాత్ర ద్వారా ప్రజల బాధలు తెలుసుకున్న వైఎస్ జగన్ వల్లే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఎవరు భయపడోద్దు : మిథున్ రెడ్డి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపైన టీడీపీ నేతలు అక్రమ కేసులు పెడుతున్నారని, ఎవరూ భయపడొద్దని అందరి బాగోగులు వైఎస్ జగన్ చూసుకుంటారని వైఎస్సార్సీపీ నేత మిథున్రెడ్డి హామీ ఇచ్చారు. అక్రమ కేసులు పెడుతున్నారని ఎవరూ అధైర్యపడొదన్నారు. అధికారంలోకి రాగానే అక్రమ కేసులన్ని ఎత్తేస్తామని చెప్పారు. ఐదేళ్లుగా చంద్రబాబు చేసిందేమి లేదని విమర్శించారు. ఏ ఒక్క వర్గాన్ని అభివృద్ధి చేయని టీడీపీ నేతలు.. అన్నీ చేశామంటూ విధుల్లో తిరగడం సిగ్గుచేటన్నారు. బాబు ప్రలోభాలకు గుణపాఠం చెప్పాలి : రాచమల్లు చంద్రబాబు నాయుడు ధనబలంతో ప్రజలను ప్రలోభపెట్టాలని చూస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో ఆయనకు తగిన గుణపాఠం చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రజలను కోరారు. ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాలను మోసం చేసిన చంద్రబాబు.. అవినీతి సొమ్ముతో మరోసారి మోసం చేయడానికి వస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. టీడీపీ పాలనకు చరమగీతం పాడే రోజులు త్వరలోనే ఉన్నాయని రాచమల్లు పేర్కొన్నారు. -
ఓట్ల కోసం బాబు పాట్లు
ప్రొద్దుటూరు : డ్వాక్రా మహిళలను మరో మారు మోసగించి వారి ఓట్లను దండుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు వ్యూహం పన్నారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు.గురువారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2014 ఎన్నికల సందర్భంగా డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని ప్రకటించారు. మహిళలు నమ్మి ఓట్లు వేశారని, అయితే నేటి వరకు వారి రుణాలు మాఫీ కాలేదన్నారు. మాటతప్పి, మడమ తప్పి పారిపోయిన పిరికిపంద కేవలం రుణమాఫీ కాకుండా రుణసాయాన్ని రూ.10వేలు చొప్పున అందజేస్తున్నారన్నారు. డ్వాక్రా గ్రూపునకు రూ.లక్ష చొప్పున మూల నిధిగా ఈ డబ్బు మహిళలకు ఇస్తున్నారని తెలిపారు. టీడీపీకి ఓట్లు వేస్తే మాఫీ చేస్తామని ప్రకటించి కనీసం వారి డబ్బుకు వడ్డీలు కూడా చెల్లించలేదన్నారు. 2016 నుంచి 2019 వరకు డ్వాక్రా రుణాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రూ.2,579 కోట్లు, వైఎస్సార్ జిల్లాలో రూ.170 కోట్లు, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రూ.9.54 కోట్లు వడ్డీ బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. ఇవన్నీ పక్కనపెట్టి చంద్రబాబు కేవలం డ్వాక్రా మహిళలకు రూ.10వేలు ఇచ్చి చేతులు దులుపేసుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఓట్లు అడుక్కోవడానికి వచ్చినప్పుడు డ్వాక్రా అక్కాచెల్లెమ్మలు గుర్తుకొస్తున్నారా అని ప్రశ్నించారు. డ్వాక్రా మహిళల రుణమాఫీకి సంబంధించి తమ పార్టీ ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, పుష్పశ్రీవాణి, గౌరు చరితారెడ్డి గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నించగా 2014 నుంచి 2018 వరకు డ్వాక్రా రుణాలు మాఫీ చేయలదేని, అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని స్వయంగా ప్రభుత్వం సమాధానం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అందని రుణాలు..తప్పని ఇబ్బందులు చంద్రబాబు రూ.10వేలతోపాటు స్మార్ట్ఫోన్ ఇస్తానని ప్రస్తుతం ప్రకటించారని ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. డ్వాక్రా రుణాలు అందక ఎంతో మంది మహిళలు ఇబ్బంది పడ్డారని, రుణాలు చెల్లించకపోవడంతో కోర్టు నుంచి చాలా మంది నోటీసులు అందుకున్నారన్నారు. ఇవన్నీ మరచిపోయిన చంద్రబాబు ప్రస్తుతం కేవలం రూ.10వేలు ఇచ్చి, అది కూడా మూడు విడుతలుగా తీసుకోవాలని, స్మార్ట్ ఫోన్ ఇస్తున్నట్లు గొప్పగా చెప్పుకొంటున్నారని తెలిపారు. ఓటును స్మార్ట్ ఫోన్ కోసం , పసుపు కుంకుమ పేరుతో మీరు ఇస్తున్న డబ్బుకు అమ్ముకునేందుకు మహిళలు సిద్ధంగా లేరన్నారు. పసుపు–కుంకుమ గురించి మంత్రి పరిటాల సునీత మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మద్యం షాపుల రద్దుతోనే మహిళల పసుపు, కుంకుమలు నిలుస్తాయి టీడీపీ అధికారంలోకి వచ్చాక విచ్చల విడిగా మద్యం షాపులు, బెల్టుషాపులు ఏర్పాటయ్యాయని, వీటి అమ్మకాలకు సంబంధించి ఎక్సైజ్ అధికారులకు చంద్రబాబు టార్గెట్ విధించారని ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. ప్రతి నెల రెట్టింపు అమ్మకాలు చేపట్టాలని వారిపై ఒత్తిడి తెచ్చారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంతోనే మహిళల పసుపు, కుంకుమలు నిలుస్తాయని తెలిపారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దశల వారిగా మద్య నిషేధం అమలు చేస్తామని ప్రకటించారని, దీని వల్ల ఎన్నో కుటుంబాల్లో వెలుగులు వస్తాయన్నారు. ఎన్టీ రామారావు హయాంలో మద్యం నిషేధించడం వల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయన్నారు. సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు రాగుల శాంతి, పోసా వరలక్ష్మి, వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, నియోజకవర్గ అధ్యక్షురాలు గజ్జల కళావతి, న్యాయవాది జింకా విజయలక్ష్మి పాల్గొన్నారు. నిజాలు రాసిన సాక్షిని కాల్చేస్తారా..? ప్రొద్దుటూరు : నిజాలు రాసిన సాక్షి పత్రికను మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కాల్చడం పట్ల ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం ఇవ్వబోతోన్న పసుపు, కుంకుమ డబ్బును రుణంగా ఇస్తున్నారని సాక్షి పత్రికలో రాసినందుకు ఓర్వలేని మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి పత్రికలను కాల్చడాన్ని తప్పుపట్టారు. నిత్యం అబద్ధాలు రాయడంతోపాటు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఆంధ్రజ్యోతి పత్రికను తాము ఏమి చేయాలని ప్రశ్నించారు. నిజాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. వాస్తవానికి తనకు జర్నలిజం పట్ల ఎంతో గౌరవం ఉందన్నారు. ఈ కారణంగానే తన పెద్ద కుమార్తెను ఇంజినీరింగ్, డాక్టర్ చేయకుండా జర్నలిజంలో పీజీ చేయించానన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బలిమిడి చిన్నరాజు, మద్దూరి దేవి, ధనలక్ష్మి, షమీమ్బాను, మాజీ కౌన్సిలర్లు గరిశపాటి లక్ష్మిదేవి, మల్లికార్జున ప్రసాద్, లక్ష్మీనారయణమ్మ, నిర్మలాదేవి పాల్గొన్నారు. -
కోర్టు స్టేతో ఆగిన ఇళ్ల నిర్మాణం
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు : హైకోర్టు స్టే కారణంగా ప్రభుత్వం హౌసింగ్ఫర్ ఆల్ పథకంలో నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. కలెక్టర్తోపాటు అధికార పార్టీ నేతలెవ్వరికి ఈ విషయంపై అవగాహన లేకపోవడం వల్లే ఇలా జరిగిందని ప్రస్తుతం లబ్ధిదారులకు ఎవరు సమాధానం చెబుతారని, డిపాజిట్ ఎలా తిరిగి చెల్లిస్తారని ప్రశ్నించారు. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అపెరల్పార్కు ఏర్పాటు కోసం ఏపీఐఐసీ అధికారులు 76.17 ఎకరాల స్థలాన్ని సేకరించారు. వైఎస్ మరణానంతరం పరిశ్రమలను ఏర్పాటు చేయలేదన్నారు. గత ఎన్నికల సందర్భంగా పేదలకు ఉచితంగా ఇళ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలం పూర్తవుతున్నా పట్టించుకోలేదన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అపెరల్ పార్కుకు కేటాయించిన స్థలాన్ని హౌసింగ్ ఫర్ ఆల్పథకం కింద 4150 ఇళ్లు నిర్మించేందుకు కేటాయించారన్నారు. అందులో ఉచితంగా పేదలకు ఇళ్లు ఇవ్వకుండా ముందుగా డిపాజిట్లు సేకరించి తర్వాత బ్యాంకు రుణం ద్వారా ఇళ్లు నిర్మిస్తున్నారని తెలిపారు. అపార్ట్మెంట్ తరహాలో నిర్మిస్తున్న ఈ ఇళ్లకు సంబంధించి అమ్మకాలు, కొనుగోళ్లు చేస్తూ పేదలను అప్పుల ఊబిలోకి నెడుతున్నారన్నారు. ఈ సమస్యపై తాను గతంలోనే 48 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టానన్నారు. కలెక్టర్ కేవీ రమణ హయాంలోనే తాను అపెరల్పార్కు స్థలంలో ఇళ్లు నిర్మించొద్దని కోరానన్నారు. అయితే జిల్లా అధికారులు మాలెపాడు గ్రామం వద్ద నిర్మించనున్న స్థలాన్ని మినహాయించి అపెరల్ పార్కులో ఇళ్లు నిర్మిస్తున్నారని తెలిపారు. వివాదాస్పద స్థలంలో ఇళ్లు నిర్మించడం వల్లే సమస్య.. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అపెరల్ పార్కు ఏర్పాటు కోసం 34 మంది రైతుల నుంచి 76.17 ఎకరాల భూమిని సేకరించారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. వీరిలో ప్రొద్దుటూరుకు చెందిన రైతు చిన్న వెంకటసుబ్బన్న సర్వే నంబర్ 679లోని 7.78 ఎకరాల భూమిపై, మల్లేల బాల పుల్లయ్య సర్వే నంబర్ 680లోని 3.76 ఎకరాలపై హైకోర్టును ఆశ్రయించారన్నారు. ఈ ప్రకారం చిన్న వెంకటసుబ్బన్నకు గత ఏడాది నవంబర్ 23న, బాలపుల్లయ్యకు డిసెంబర్ 4న హైకోర్టు స్టే మంజూరు చేసిందని పేర్కొన్నారు. దీంతో ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందని తెలిపారు. అధికారులు మొత్తం 4150 మందికి ఇళ్లు నిర్మించాలని తలపెట్టగా 825 మంది డీడీలు చెల్లించి అధికారులకు ఇచ్చారన్నారు. 107 బ్లాకుల్లో ఈ ఇళ్ల నిర్మాణం జరుగుతోందని అన్నారు. హైకోర్టు స్టే కారణంగా వీటిలోని 33 బ్లాకుల్లో నిర్మిస్తున్న 400 ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందన్నారు. అధికారులు సమాచారాన్ని బయటికి పొక్కకుండా జాగ్రత్తపడ్డారని తెలిపారు. ప్రస్తుతం డీడీలు చెల్లించిన వారికి అధికారులు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. భూమి ఇచ్చిన మిగతా 32 మంది రైతులు కోర్టును ఆశ్రయిస్తే హౌసింగ్ ఫర్ ఆల్ క్లోజ్ అయ్యే పరిస్థితి ఉందన్నారు. ప్రస్తుతం అక్కడ ఎకరం భూమి విలువ రూ.4కోట్ల నుంచి రూ.5కోట్లు పలుకుతోందన్నారు. వివాదాస్పద స్థలంలో ఇళ్లు నిర్మించడం వల్లే ఈ సమస్య తలెత్తిందని, ఇందుకు ప్రభుత్వంతోపాటు సంబంధిత అధికా రులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. త్వరలో ఈ విషయంపై లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ పట్టణా«ధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరు నాగేంద్రారెడ్డి, కౌన్సిలర్ టప్పా గైబుసాహెబ్, వైఎస్సార్సీపీ నాయకులు కొర్రపాడు సూర్యనారాయణరెడ్డి, వరికూటి ఓబుళరెడ్డి, గోనా ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. -
ప్రతి ముస్లిం గుండెలో వైఎస్సార్
ప్రొద్దుటూరు క్రైం : దివంగత ముఖ్యమత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రవేశపెట్టిన 4 శాతం రిజర్వేషన్ల వల్లనే ముస్లిం కుటుంబాల్లో అనేక మందికి ఉద్యోగాలు వచ్చాయని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి అన్నారు. పట్టణంలో బుధవారం సాయంత్రం ‘హర్ దిల్ మే వైఎస్సార్ ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుందరాచార్యుల వీధిలోని రాయల్ ఫంక్షన్ హాల్ నుంచి కేహెచ్ఎం స్ట్రీట్ మీదుగా భారీ జనసందోహం మధ్యన ఈ కార్యక్రమం కొనసాగింది. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డితో పాటు పార్టీ స్టేట్ మైనారిటీ ప్రెసిడెంట్ అబ్దుల్ఖాదర్తో, పలువురు మైనారిటీ నాయకులు వీధుల్లో పర్యటిస్తూ చంద్రబాబు నాయుడు ముస్లింలకు చేసిన మోసాలను వివరించారు. అనంతరం వన్టౌన్ సర్కిల్లో నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రతి గుండెలో వైఎస్సార్ ఉన్నారు అనే నినాదంతో ముస్లిం పెద్దలు మీ ముందుకు వచ్చారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్ల కాలంలో అనేక మోసాలకుపాల్పడిందన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మైనా రిటీల సభలో విస్మరించిన హామీలపై నంద్యాల యువకులు ప్ల కార్డులు ప్రదర్శిస్తే వారిని పోలీసులతో చంద్రబాబు కొట్టించారన్నారు.చంద్రబాబుకు మైనారిటీల పట్ల ప్రేమ లేదన్నారు. మైనా రిటీలపై అభిమానంతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి 4 శాతం రిజర్వేషన్ అమలు చేశారని, వారి పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయంటే అది కేవలం వైఎస్ వల్లనే అని అన్నారు. బీజేపీకి మద్దతు ఇవ్వమని ఆ పార్టీ పెద్దలు వైఎస్ జగన్ను అడుగగా.. ముస్లింల అభిమానాన్ని పోగొట్టుకోలేనని చెప్పారన్నారు. బెదిరించినా, జైల్లో పెట్టినా ఫరవాలేదని, ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న మీ పార్టీకి మద్దతు ఇవ్వనని ఖరాఖండిగా చెప్పిన నాయకుడు జగన్ అని అన్నారు. ముస్లింల పట్ల తండ్రీ కొడుకులకు ఉన్న అపారమైన ప్రేమ ఇది అని ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వడం టీడీపీ ఎన్నికల డ్రామా అని ఎమ్మె ల్యే చెప్పారు. నాలుగున్నరేళ్లు బీజేపీ ప్రభుత్వంలో కొనసాగి ఎన్నికలు వస్తున్నాయనే కారణంతో కాంగ్రెస్తో బాబు జతకట్టారన్నారు. బాబు మోసాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. మైనారిటీల అభిమానంతోనే వైఎస్సార్సీపీకి ఎక్కువ స్థానాలు రాష్ట్రంలో ఎక్కువ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు విజయం సాధించారంటే అం దుకు ముస్లింల అభిమానమే కారణమని ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. ప్రొద్దుటూరులోని ప్రతి వార్డులో ముస్లింలు తనను ఆదరించారన్నారు. అల్లా దయవల్ల వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే నియోజకవర్గంలోని ముస్లిం కుటుం బాల్లో ఉన్న పేదరికాన్ని పూర్తిగా నిర్మూలిస్తానని అన్నారు. మున్సిపల్ చైర్మన్ పదవిని టీటీపీ నాయకులు ఇతరులకు కేటాయిస్తే తాను మాత్రం ముస్లిం అయిన ముక్తియార్ను ప్రతిపాదించామన్నారు. ఇందు కోసం రూ. 4–5 కోట్లు ఖర్చు కూడా చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అయినా ముక్తియార్ మమ్మల్ని కాదని టీడీపీలోకి వెళ్లారన్నారు. ఇది న్యాయమా అని ఎమ్మెల్యే ప్రజలను అడిగారు. మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ ఖాదర్బాషా, కార్యదర్శి గౌస్లాజం ఎమ్మెల్యే రాచమల్లుకు మెమొంటోను అందచేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి గౌస్ లాజం, పట్టణా«ధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, మైనారిటీ నాయకులు ఆయిల్మిల్లు ఖాజా, పులివెందుల రఫి, పెన్నానగర్ అక్బర్,మార్కెట్ దాదాపీర్, షెక్షావల్లి, అబ్దుల్లా, టైలర్ నజీర్, జహింగీర్, అల్లాబకాష్, జమాల్వల్లి, రఫిక్, అన్సర్, షాపీర్, వైఎస్సార్సీపీ ప్రొద్దుటూరు నియోజకవర్గ అధ్యక్షురాలు గజ్జల కళావతి, పార్టీ మండల కన్వీనర్లు ఎస్ఏ నారాయణరెడ్డి, దేవీప్రసాద్రెడ్డి, దొంతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, సుబ్రమణ్యం, మనోహర్, తదితరులు పాల్గొన్నారు. -
పోరు ఆగదు
ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఇసుక క్వారీ మంజూరు చేసే వరకూ పోరును కొనసాగిస్తామని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి స్పష్టం చేశారు. ఇసుక క్వారీ మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక వన్టౌన్ సర్కిల్ నుంచి గాంధీ రోడ్డు, శ్రీరాములపేట నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఇసుక క్వారీ మంజూరు కాలేదని తెలిపారు. ఈ కారణంగా ట్రాక్టర్ ఇసుకను రూ.2,500 వరకు వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. పేద, మధ్యతరగతి, ధనవంతులను ఇసుక పేరుతో లూటీ చేస్తున్నారన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించి మంత్రి ఆదినారాయణరెడ్డి స్వగ్రామమైన దేవగుడితోపాటు సున్నపురాళ్లపల్లె, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ స్వగ్రామమైన పోట్లదుర్తికి ఇసుక క్వారీలను మంజూరు చేశారన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలో గత నాలున్నరేళ్లలో పలు క్వారీలు మంజూరు చేశారన్నారు. పట్టణ ప్రాంతమైన ప్రొద్దుటూరులో ఇసుకకు పూర్తి డిమాండ్ ఉందని, అయితే అధికారులు ఇక్కడ మాత్రం ఇసుక క్వారీ మంజూరు చేయలేదన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులు సర్వే చేసినా క్వారీల మంజూరుకు వెనుకంజ వేస్తున్నారని విమర్శించారు. ఈ సమస్య తీవ్రతను తాను స్వయంగా కలెక్టర్ మొదలు కింది స్థాయిలో ఉన్న తహసీల్దార్ వరకు పలుమార్లు విన్నవించినా వారు పెడచెవిన పెడుతున్నారన్నారు. ఈ ప్రభావం జనంతోపాటు అభివృద్ధి పనులపై కూడా పడుతోందన్నారు. మంత్రి, రాజ్యసభసభ్యుడు పెన్నానదిని తమ సొంతమని ఆక్రమించుకుని ఇతరులను రానివ్వడం లేదన్నారు. ఎవరైనా బయటి నుంచి ట్రాక్టర్లను తీసుకొని వెళితే దౌర్జన్యం చేస్తున్నారని, దీనిని పోలీసులతో సహా ఏ అధికారులు అరికట్టలేకపోతున్నారని తెలిపారు. ఇసుకపై తాను చేస్తున్న ఆర్తనాదాన్ని అధికారులకు చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లు ఉందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కావడంతోనే అధికారులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. దశల వారీగా ఆందోళన ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఇసుక క్వారీ మంజూరు చేసే వరకు దశల వారీగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ఐదారు రోజుల్లో అన్ని వర్గాల ప్రజలతో కలసి ప్రొద్దుటూరు బంద్కు పిలుపునిస్తామన్నారు. అప్పటికీ అధికారుల్లో చలనం రాకపోతే తాను 48 గంటల పాటు నిరాహార దీక్ష చేపడుతానని హెచ్చరించారు. ఆ తర్వాత కూడా సమస్యను పరిష్కరించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 43 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలలను ఆహ్వానించి శాంతియుతంగా ఆందోళన చేపడుతామని తెలిపారు. ఇన్ని రకాల ఆందోళనలను చేసినా స్పందించకుంటే సమస్య పరిష్కారం కోసం తాను ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడుతానని స్పష్టం చేశారు. అనంతరం తహసీల్దార్ కిరణ్జ్ఞానమూర్తికి వినతిపత్రం సమర్పించారు. వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, స్టేట్ అడిషనల్ సెక్రటరీ లక్కిరెడ్డి పవన్రెడ్డి, నియోజకవర్గ యూత్ ఇన్చార్జి సానపురెడ్డి ప్రతాప్రెడ్డి, మహిళా విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు గజ్జల కళావతి, జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరు నాగేంద్రారెడ్డి, జెడ్పీ కోప్షన్ మెంబర్ అక్బర్, మండల కన్వీనర్ దేవీప్రసాదరెడ్డి, చేనేత కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు బీఎన్ఆర్, జిల్లా అధికార ప్రతినిధి ఓబయ్య, జిల్లా సహాయ కార్యదర్శి షాపీర్ఆలీ పాల్గొన్నారు. -
సొంత డబ్బుతో కార్మికులకు వేతనాలు
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు మండలంలోని గోపవరం మేజర్ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న 37 మంది కాంట్రాక్టు కార్మికులకు ఒక్కొక్కరికి రూ.42వేల చొప్పున ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తన సొంత డబ్బు రూ.16లక్షలు చెల్లించారు. గురువారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో మాజీ సర్పంచ్, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ దేవీ ప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. పంచాయతీలో పారిశుద్ధ్య, నీటి సరఫరా వీధి లైట్లు తదితర విభాగాల్లో పనిచేసే 37 మంది కాంట్రాక్టు కార్మికులకు నిబంధనల ప్రకారం ప్రతి నెలా వేతనాలు చెల్లించాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోలేదన్నారు. కేవలం రూ.7,200 వేతనంతో ప్రతి నెలా వీరు నెట్టుకురావడమే కష్టమని, అలాంటిది నెలల తరబడి వేతనాలు ఇవ్వకుంటే వీరి ఇంటి అద్దెలు, పాలు, కరెంటు బిల్లులు, డిష్ బిల్లు ఎలా చెల్లిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల కుటుంబ పోషణ భారంగా మారిందని తెలిపారు. మానవీయ కోణంలో ఇది సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. వీరి పరిస్థితిని తెలుసుకుని సోమవారం మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య కార్మికుల కోసం ధర్నా చేయడాన్ని అభినందిస్తున్నానన్నారు. ధర్నా సందర్భంగా రెండు నెలల వేతనాలు శుక్రవారం చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చారన్నారు. కేవలం రెండు నెలలు వేతనాలు ఇస్తే తమ కష్టాలు తీరవని, బకాయిలు చెల్లించేందుకు తాము ఇబ్బంది పడాల్సి వస్తుందని కార్మికులు తన ఇంటి వద్దకు వచ్చి సంప్రదించారన్నారు. సహజ సిద్ధంగా పేదరికం నుంచి వచ్చిన తనకు వారి శ్రమ విలువ తెలిసిందన్నారు. వారి దయనీయ పరిస్థితిని గమనించి ప్రస్తుతం తాను డబ్బు చెల్లించానన్నారు. రెండు నెలల వేతనం చెల్లించేందుకు కూడా వీలు కాదని అధికారులు తెలిపారన్నారు. కొత్తపల్లె గ్రామ పంచాయతీ నుంచి అప్పుగా తీసుకోవాలంటే డీపీఓ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, ఇందుకు చాలా సమయం పడుతుందన్నారు. పండుగల పూట పస్తులుంటే ఎలా.. సమీపంలో క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలు వరుసగా వస్తున్నాయని, ఇలాంటి సందర్భంలో పేదలు పస్తులు ఉంటే ఎలా అని ఎమ్మెల్యే అన్నారు. అందరూ సంతోషంతో సమానంగా పండుగ చేసుకోవాలనే కారణంతో ఈ డబ్బు చెల్లించామని తెలిపారు. తమను కూడా కార్మికులకు డబ్బు ఇవ్వొద్దని ఒక వేళ ఇచ్చినా తమకు సంబంధం లేదని అధికారులు చెప్పడం సరి కాదన్నారు. ఎవరి ఒత్తిడి మేరకు అధికారులు ఇలా చెబుతున్నారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అధికారులతో సంబంధం లేకుండా పార్టీ కార్యకర్తలతో చర్చించి సొంతంగా కార్మికులకు డబ్బు ఇచ్చామని వారు ఇచ్చినప్పుడు తిరిగి తీసుకుంటామన్నారు. మాజీ సర్పంచ్ దేవీ ప్రసాదరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు కాచన చంద్ర ఓబుళరెడ్డి, ఆసం దస్తగిరిరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు దొంతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, ఆదినారాయణరెడ్డి, గోకుల సుధాకర్, కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, వెంకటరాముడు, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి ఓబయ్య యాదవ్, న్యాయవాది జింకా విజయలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి సోములవారిపల్లె శేఖర్, ఇర్ఫాన్, జిల్లా సహాయ కార్యదర్శి షాపీర్ఆలీ, మైనార్టీసెల్ మండల కన్వీనర్ ఖాదర్బాషా, నాయకులు కేశవరెడ్డి, తిరుపాల్ తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక ఇబ్బందులతో చితికిపోయాం ఆర్థిక ఇబ్బందులతో చితికిపోయాం. గోపవరం గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్నాం. గతంలో రూ.6వేలు మాత్రమే వేతనం ఇచ్చేవారు. ప్రస్తుతం రూ.7,200 పెంచారు. చేతిలో చిల్లి గవ్వ లేని కారణంగా పొద్దున్నే అల్పాహారం చేసుకునే ఆర్థిక స్తోమత లేక ఇతరుల ఇళ్ల వద్దకు వెళ్లి అన్నం తీసుకొచ్చి పిల్లలకు పెడుతున్నాం. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి చేసిన సహాయాన్ని మరువలేం. – విజయరాణి, బాలవెంకటమ్మ, ఓబుళమ్మ, రేణుక,లక్ష్మీనారాయణమ్మ, రాములమ్మ మహిళా కార్మికులు -
సీఎం రమేశ్ గడ్డం కోసమే పునాది రాయి వేస్తారా
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు: రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ గడ్డం తీయడానికే సీఎం చంద్రబాబు ఉక్కు పరిశ్రమ కోసం పునాది రాయి వేస్తున్నారా అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ధ్వజమెత్తారు. రమేశ్ దీక్షా సమయంలో రెండు నెలల్లో పరిశ్రమ కోసం పునాది రాయి వేస్తామని చెప్పారని, నిన్నటి ప్రొద్దుటూరు సభలో మరో నెల రోజుల్లో అని, కేబినెట్ మీటింగ్లో నెల రోజుల్లో అని ప్రకటించారన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యం లో రాయలసీమలో తన ఉనికిని కోల్పోకుండా ఉండేందుకు చంద్రబాబు ఉక్కు కర్మాగారం కోసం పునాది రాయి వేయాలని నిర్ణయించాడే తప్ప, పరశ్రమపై చిత్తశుద్ధి లేదన్నారు. స్థానిక 16వ వార్డులోని ముస్లిం మైనారిటీ నాయకుడు దాదాపీర్ స్వగృహంలో బుధవారం విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడారు. పరిశ్రమ ఏర్పాటుపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే విధి విధానాలను ప్రకటించాలని కోరారు. ఇందుకు అవసరమైన రూ.18వేల కోట్లు బడ్జెట్లో పెట్టకుండా, భూ సేకరణ చేపట్టకుండా, అవసరమైన ఖనిజం ఎలా వస్తుంది, నీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారో తెలియకుండా పరిశ్రమ పెట్టడం అంత సులువా అని అన్నారు. కుందూ–పెన్నా పథకానికి సంబం ధించి 400 ఎకరాల భూమిని సేకరించేందుకే 11 ఏళ్లుగా ప్రభుత్వానికి చేతకాలేదని, అలాంటిది వేల ఎకరాల భూమిని ఇప్పటికప్పుడు ఏవిధంగా సేకరిస్తారన్నారు. పండుగపూట కూడా పాతమొగుడేనా అన్న చందంగా దీపావళి రోజున కూడా ప్రజలు చంద్రబాబు అబద్ధాలను వినాల్సి వస్తోం దన్నారు. నాలుగున్నరేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంపై ఏమి చేశాయని ప్రశ్నిం చారు. తీరా ఎన్నికల ముందు పునాది రాయి వేసి ఈ ప్రాంత వాసులను మభ్యపెట్టడానికి జిల్లా ప్రజలు ఏమైనా అమాయకులా అని అన్నారు. రమేశ్ కోసమే ఉక్కు పరిశ్రమ పేరుతో 11 రోజులపాటు సీఎం రమేశ్ ద్రవ రూపంలో ఆహారం తీసుకుని దొంగ దీక్ష చేశాడని ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. ఆ ప్రకా రం ఆయన గడ్డం మూరెడు అయి, బారెడు పెరుగుతుందని ప్రస్తుతం పునాది రాయి వేస్తున్నారన్నారు. సీఎం రమేశ్ కేశఖండన కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేయడానికి టీడీపీ నేతలు వ్యూహం పన్నారన్నారు. రూ.వేల కోట్లతో పరిశ్రమ ఏర్పాటు చేస్తారని, ఇన్ని వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ఆర్థిక గణాంకాలు వేసి అందరిని భ్రమలో పెట్టే ప్రయత్నమే టీడీపీ నేతలు చేస్తున్నారన్నారు. ప్రజలెవ్వరూ ఈ నాటకాన్ని నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు. సమావేశంలో వార్డు ఇన్చార్జి పాపిగారి నాగసుబ్బారెడ్డి, మార్కెట్ జాఫర్, వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, ఆటో నగర్ అసోసియేషన్ అధ్యక్షుడు నన్నే సాహెబ్ పాల్గొన్నారు. -
పోలీసుల జులుం
వైఎస్ఆర్ జిల్లా , రాజుపాళెం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. గత నెల 28వ తేదీన జరిగిన చిన్న తగాదా విషయానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను శుక్ర వారం పోలీసులు చితకబాదారు. టీడీపీకి కొమ్ముకాస్తున్న పోలీసుల వైఖరికి నిరసనగా శుక్రవారం మధ్యాహ్నం రాజుపాళెం పోలీస్స్టేషన్లో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ధర్నా చేశారు. తమపార్టీ కార్యకర్తలను బట్టలు ఊడదీసి కొట్టినందుకు నిరసనగా ధర్నా చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గ్రామాల్లో చిన్న తగాదాలను బూచిగా చూపి వైఎస్ఆర్సీపీ నాయకులను, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని వారిపై పెద్ద కేసులు బనాయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజుపాళెం మండలం అయ్యవారిపల్లెలో ఇంటి వద్ద జరిగిన చిన్న తగాదాను పెద్దగా చేసి టీడీపీ కొమ్ముగాస్తున్న పోలీసులు తమ పార్టీ కార్యకర్తలను బూతులు తిడుతూ కొట్టడంపై ఎమ్మెల్యే పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరేమైనా పెద్ద నేరగాళ్ల అని ప్రశ్నించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కత్తితో హత్యాయత్నం చేసినా ఇప్పటికీ ఆవ్యక్తిని పోలీసులు కొట్టలేదని.. ఇక్కడ చిన్న తగాదాలో తమ పార్టీ కార్యకర్తలను కొట్టడం ఏంటని ఆయన పోలీసులను ప్రశ్నించారు. వినా యక నిమజ్జనం రోజున పండుగ చేసుకోకుండా తమ పార్టీ కార్యకర్తలను పోలీస్స్టేషన్లో నిర్భందించారన్నారు. గొడవ పడి స్టేషన్కు వచ్చినప్పుడు ఇరువురి వాదనలు విని, ఎవరి తప్పు ఉంటే వారిపై కేసు నమోదు చేయాలన్నారు. కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను టార్గెట్ చేసుకొని పెద్ద కేసులు ఎలా బనాయిస్తారని ప్రశ్నించారు.. కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయాలి... పోలీస్స్టేషన్లో ధర్నా అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. అయ్యవారిపల్లెలో జరిగిన చిన్న తగాదాను పెద్దదిగా చేసి పోలీసులు గంగా ధర్, మధు తమ కార్యకర్తలను కొట్టినందుకు పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేసి ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఆ ఇద్దరు పోలీసులు మద్యం దుకాణాల వద్ద, మట్కా బీటర్ల వద్ద, పేకాట రాయుళ్లు, సివిల్ పంచాయితీలు చేసి మామూళ్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటివారిపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఆ పోలీసులను సస్పెండ్ చేయకపోయినా, తమ పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయకపోయినా పోలీస్స్టేషన్లో నిరాహారదీక్ష చేస్తానన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ ఎస్ఏ నారాయణరెడ్డి, వెలవలి అన్నపురెడ్డి రాజశేఖరరెడ్డి, పార్టీ పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వెల్లాల భాస్కర్, జిల్లా జాయింట్ సెక్రటరీ నూకనబోయిన రవీంద్ర, ఎంపీటీసీ సభ్యుడు రమణారెడ్డి, పోలా వెంకటరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ అన్నపురెడ్డి అరుణ్కుమార్రెడ్డి, కానాల బలరామిరెడ్డి, ధనిరెడ్డి శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. బాధితులకు న్యాయం చేస్తాం.. అయ్యవారిపల్లెలో జరిగిన ఘర్షణపై సమగ్రంగా విచారించి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. చట్టం ఎవరికైనా ఒకటేనని, అన్యాయం చేసిన వారిని వదలమని చెప్పారు. ఎవరికైనా అన్యాయం జరిగితే పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయవచ్చునన్నారు. -
పారిశుద్ధ్య లోపంపై పోరు..
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం : మున్సిపల్ చైర్మన్, అధికారులు కలిసి ప్రొద్దుటూరును కసువుదిబ్బగా మార్చారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాయం ముందు బుధవారం నిర్వహించిన పారిశుద్ధ్య లోపంపై పోరు ధర్నాలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ధర్నాకు పట్టణంలోని వేలాది మంది మహిళలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూప్రొద్దుటూరును దోమల నిలయంగా తయారు చేశారని, జబ్బులకు ఆనవాలుగా చేశారన్నారు. ఊరంతా అపరిశుభ్రంగా మారిందని, ఎక్కడ చూసినా కుక్కలు, పందులు దుర్గంధాన్ని కలిగిస్తున్నాయన్నారు. మురికితో నిండిన కాలువల ద్వారా దోమలు స్వైరవిహారం చేస్తున్నాయని చెప్పారు. వీటి కారణంగా డెంగ్యూ, గన్యా, విషజ్వరాలతో ప్రజలు ఆస్పత్రి పాలవుతు రూ.వేలు. లక్షలు ఖర్చుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. వీటి నుంచి మమ్మల్ని కాపాడండని ధర్నా చేయాల్సి వచ్చినందుకు సిగ్గుగా ఉందన్నారు. అయితే మున్సిపల్ చైర్మన్కు, అధికారులకు చీమ కుట్టినట్లైనా లేదన్నారు. తాను ప్రతి రోజు ఉదయం 3 గంటల పాటు వార్డుల్లో తిరుగుతున్నానన్నారు. ఎక్కడికి వెళ్లినా కనీసం పూటకు ఒకసారి నీళ్లు ఇవ్వండి, దోమలు లేకుండా చేయండని మహిళలు అడుగుతున్నారని చెప్పారు. వైఎస్సార్సీపీ నాయకులను అణగతొక్కడానికి ఈ ప్రభుత్వం ఉపయోగపడుతుంది కానీ మంచి నీళ్లు ఇవ్వడానికి, దోమలు నివారించడానికి పని చేయదన్నారు. ప్రొద్దుటూరు బాగుపడాలంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారాలని, మున్సిపల్ చైర్మన్గా టీడీపీ వాళ్లు కొనసాగినంత సేపు ఈ ఊరు దుర్గంధభరితమే అని అన్నారు.టీడీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్ల కాలంలో పట్టణంలోని ప్రధానమైన నాలుగు మురికి కాలువలను ఎందుకు ఆధునీకరించలేదన్నారు. చిన్న కాలువల నీటిని ప్రధాన కాలువల ద్వారా ఊరి బయటికి పంపించాల్సి ఉందన్నారు. ప్రధాన కాలువ ఆర్టీసీ బస్టాండు వరకు మాత్రమే ఉండటంతో ఆ నీరంతా తిరిగి వెనక్కి వస్తుందని అన్నారు. డ్రైనేజి నీరు బయటికి పంపించాలంటే ఆర్టీసీ బస్టాండు తర్వాత భూమి కొనాల్సిన అవసరం ఉందన్నారు. పాలకుల నిర్లక్ష్యం వల్ల వందల మంది పిల్లలు డెంగీ వ్యాధితో మరణించారన్నారు. ఆ తల్లుల గర్భశోకానికి కారణం ఈ టీడీపీ నాయకులు కాదా అని అన్నారు. నాగేంద్ర నగర్లో ఒక తల్లికి ఇద్దరు కొడుకులు ఉంటే ఇద్దరు డెంగీతో మృతి చెందారని ఎమ్మెల్యే రాచమల్లు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారు టీడీపీ నాయకులు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. కాలువలను శుభ్రంగా ఉంచండని నిరసన తెలియచేయడానికి మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో పందిరి ఏర్పాటు చేస్తే మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, టీడీపీ ఇన్చార్జి నంద్యాల వరదరాజులరెడ్డి కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారని, ఇక్కడ పందిరి వేసి సభ నిర్వహించే అ«ధికారం వారికి లేదని కేసులు పెట్టారన్నారు. ఎమ్మెల్యేతో పాటు ధర్నాకు వచ్చిన మహిళలపై కూడా కేసు పెట్టండని వారు పోలీసులకు చెబుతున్నారన్నారు. మున్సిపల్ కాంపౌండ్లో మీటింగ్ పెట్టనివ్వద్దని తెలుగుదేశం పార్టీ నాయకులు తనపై ఒత్తిడి తెస్తున్నారని మున్సిపల్ కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి తనకు ఫోన్ చేశారని ఎమ్మెల్యే అన్నారు. ప్రజాసమస్యల కోసం చేసే ధర్నాల్లో తనపై ఎన్నో కేసులు పెట్టారని, నీళ్ల కోసం చేసిన ధర్నాకు సంబంధించి కేసు పెడితే మూడేళ్లుగా కోర్టుకు తిరుగుతున్నానని, రెండు రోజుల క్రితం ఆ కేసు కొట్టేశారని ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. కేసులు తనకు కొత్తకాదని, ప్రజల కోసం ఎన్ని కేసులైనా భరిస్తానని, ఎన్ని రోజులైనా జైల్లో ఉంటానని అది తనకు గౌరవమే తప్ప అగౌరవం కాదన్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా తెల్లటి బట్టలు ధరించి చైర్మన్ ఏసీ రూముల్లో కూర్చుంటున్నారని తెలిపారు. రోజు కార్యాలయానికి వచ్చి కాంట్రాక్టులకు ఎంత కమీషన్ వస్తుందోనని చూసుకొని వెళ్తారన్నారు. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచకుంటే72 గంటల నిరాహార దీక్ష ఈ రోజు నుంచి వారం రోజుల్లోగా పట్టణంలో స్పెషల్ డ్రైవ్ ఆపరేషన్ నిర్వహించి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలన్నారు. లేకపోతే ఇదే స్థానంలో 72 గంటల పాటు ఎలాంటి ఆహారం ముట్టకుండా నిరాహార దీక్ష చేస్తానని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది మహిళలు, వైఎస్సార్సీపీ పట్టణా«ధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, కౌన్సిలర్, ఎమ్మెల్యే సతీమణి రాచమల్లు రమాదేవి, పార్టీ నియోజకవర్గ అధ్యక్షురాలు గజ్జల కళావతి, జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరు నాగేంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ముస్లింలను వంచించిన టీడీపీని నమ్మొద్దు
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం : ముస్లింలను వంచించిన టీడీపీని నమ్మొద్దని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. ప్రొద్దుటూరులో ఆయన మంగళవారం ‘రావాలి జగన్.. కావాలి జగన్’ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర బడ్టెట్లో టీడీపీ ప్రభుత్వం ముస్లింల అభివృద్ధికి ఎలాంటి నిధులు కేటాయించలేదని ఆరోపించారు. ఇస్లామిక్ బ్యాంకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పి చంద్రబాబు ముస్లింలకు తీరని అన్యాయం చేశారన్నారు. ముస్లిం కుటుంబాల్లోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను ఇస్తామని, చేతి వృత్తులు చేసుకునే ముస్లిం మహిళలకు రూ.లక్ష, మదరసాలో చదివే చిన్న పిల్లలకు దుస్తులు కుట్టిస్తానని, బస్పాస్లు ఇస్తామని చెప్పి వారిని వంచించారని విమర్శించారు. అలాగే ఎమ్మెల్యే టికెట్లు, ఎమ్మెల్సీలు, చట్ట సభల్లో అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పి రాజకీయంగా ముస్లింలకు ఎక్కడా అవకాశం కల్పించలేదన్నారు. దేశ చరిత్రలోనే ముస్లిం మంత్రి లేకుండా ఉన్న ఏకైక క్యాబినెట్ చంద్రబాబుదే అని ఆయన పేర్కొన్నారు. టీడీపీకి ముస్లిం ఓట్లు 10 శాతం కూడా రావు రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు రాష్ట్రంలో 10 శాతం ముస్లింల ఓట్లు కూడా రావని ఎమ్మెల్యే తెలిపారు. ముస్లింల పట్ల అత్యంత గౌరవం, ప్రేమాభిమానాలను పంచిన వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని అధికారంలోకి తీసుకొని రావడానికి ముస్లిం కుటుంబాలు ఎదురు చూస్తున్నాయన్నారు. ముస్లింల అభివృద్ధికి వైఎస్ 4 శాతం రిజర్వేషన్లు కల్పించారనే కారణంతో ఆయన కుటుంబాన్ని ప్రేమిస్తున్నారంటే వారు ఎంత నమ్మకస్తులో అర్థం అవుతోందని తెలిపారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ముస్లింలు నివాసం ఉన్న ప్రాంతాలకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. టీడీపీ సాధించలేని ఇస్లామిక్ బ్యాంకింగ్ వ్యవస్థను వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే తీసుకొస్తుందని ఎమ్మెల్యే వివరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, రాజుపాళెం పార్టీ మండల కన్వీనర్ ఎస్ఏ నారాయణరెడ్డి, చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బలిమిడి చిన్నరాజు, జిల్లా అధ్యక్షుడు నాగరాజు, నాయకులు పోరెడ్డి నరసింహారెడ్డి, శివచంద్రారెడ్డి, పోతిరెడ్డి మురళీనాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అమరావతికి వెళ్లి ఏం సాధించారు?
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు టీడీపీ నాయకులు అమరావతికి వెళ్లి ఏం సాధించారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి ప్రశ్నించారు. స్థానిక 31వ వార్డులో సోమవారం ఎమ్మెల్యే విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎందుకు అమరావతికి వెళ్లారో ప్రొద్దుటూరులోని టీడీపీ నాయకులందరూ ఒక తా టిపైకి వచ్చి ప్రకటన చేయాలని డిమాండు చేశారు. ఏం అభివృద్ధి చేశారో టీడీపీ నాయకులు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అమరావతికి వెళ్లి ఫేస్బుక్లో ఫొటోలు పెడతారా.. సిగ్గు లేదా మీకు అని ఎమ్మె ల్యే అన్నారు. ఆధిపత్యం కోసం కొట్లాడుకొని, అమరావతికి వెళ్లి సీఎంతో చివాట్లు తిని ప్రొద్దుటూరుకు వస్తారా అని అన్నారు. ఆధిపత్యం కోసం పోరాడుతున్నారు తప్ప ఏనాడైనా అభివృద్ధి కోసం ఆలోచన చేశారా సీఎం చంద్రబాబు టీడీపీ నాయకులకు గడ్డిపెట్టినా బుద్ధి రాలేదన్నారు. 22 మంది రాజీనామా చేసి ఏం సాధించారని ప్రజలు అసహ్యింకుంటున్నారన్నారు. మీ రాజీనామాలను వెనక్కి తీసుకున్నట్టా.. తీసుకోనట్టా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. కౌన్సిల్ను రద్దు చేసే అధికారం సీఎంకు ఎవరిచ్చారు..? తెలుగుదేశం పార్టీ అంతర్గత కలహాల వల్ల ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ను రద్దు చేసే అధికారం సీఎం చంద్రబాబుకు ఎవరు ఇచ్చారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. టీడీపీ నేతలకు చివాట్లు పెట్టి ప్రొద్దుటూరును అభివృద్ధి చేయడానికి ఆలోచించాల్సిన సీఎం కౌన్సిల్ను రద్దు చేస్తానని చెప్పడం మంచిది కాదన్నారు. ప్రజాస్వామ్యంలో చట్టసభలను రద్దు చేసే అధికారం ఎవ్వరికీ లేదని ఎమ్మెల్యే చెప్పారు. ఫైవ్మ్యాన్ కమిటీ ఎందుకు వేశారో చెప్పాలని డిమాండు చేశారు. కుందూ–పెన్నా వరద కాలువలో ఎందుకు జాప్యం జరుగుతోంది, అమృత్ పథకం కింద మంజూరైన పప్లైన్ పనులు ఎంత వరకు వ చ్చాయి, పక్కా గృహాలు ఎన్ని కట్టించాలి.. ఇలాంటి విషయాలపై సీఎం చంద్రబాబు కమిటీ వేసి నివేదిక కోరి ఉంటే ధన్యవాదాలు చెప్పేవాళ్లమన్నారు. సమావేశంలో పార్టీ పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గజ్జల కళావతి, చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బలిమిడి చిన్నరాజు, జిల్లా అధ్యక్షుడు భీమునిపల్లి నాగరాజు, నాయకులు పోరెడ్డి నరసింహారెడ్డి, కల్లూరు నాగేం ద్రారెడ్డి, పోతిరెడ్డి మురళీనాథరెడ్డి పాల్గొన్నారు. -
నిరుద్యోగ భృతి కాదు.. టీడీపీ నేతల రాజకీయ భృతి
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం : యువనేస్తం పథకం నిరుద్యోగ భృతి కోసం కాదని, టీడీపీ నేతల రాజకీయ భృతిగా మారిందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి అన్నారు. ప్రొద్దుటూరులోని 36వ వార్డులో బుధవారం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో మరో ఐదారు మాసాల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో నిరుద్యోగ యువతకు గాలం వేయడానికి కొత్తగా ప్రవేశపెట్టిన పథకం ఇది అని అన్నారు. నిరుద్యోగులకు ఇచ్చే డబ్బు చాలా తక్కువ కానీ శిక్షణా సంస్థలకు ఇచ్చే సొమ్ము మాత్రం ఎక్కువని చెప్పారు. ఈ శిక్షణా సంస్థలన్నీ చంద్రబాబు కుమారుడు లోకేష్ బినామీలవన్నారు. యువనేస్తం పథకం ద్వారా రూ. వందల కోట్లు దోచుకోవడానికి రంగం సిద్ధమైందన్నారు. జిల్లాలో ప్రతి సంవత్సరం 25–30 వేల మంది డిగ్రీ పట్టా తీసుకుంటున్నారని, నాలు గేళ్లలో సుమారు లక్షా 10 వేల మంది నిరుద్యోగులు సమాజంలోకి వస్తున్నారు. అయితే జిల్లాలో కేవలం 12 వేల మందిని మాత్రమే గుర్తించారన్నారు. ప్రభుత్వం ఒక్క రోజులో 13 జిల్లాలకు సంబంధించి డిగ్రీ చదివిన వారి సమాచారం తెప్పించుకోవచ్చని అన్నారు. ఎలాంటి వడబోత కార్యక్రమం లేకుండా డిగ్రీ చదివిన వారి అకౌంట్కు నేరుగా డబ్బు ట్రాన్స్పర్ చేయొచ్చన్నారు. యువనేస్తం పట్ల ఈ రాష్ట్రంలోని యువత ఆగ్రహావేశాలతో ఉన్నారని, వారం, పది రోజుల తర్వాత తీవ్రమైన అలజడి మొదలవుతుంది. నిరుద్యోగులకు జరిగిన అన్యాయంపై దీక్ష నిరుద్యోగులకు జరిగిన అన్యాయంపై త్వరలో దీక్ష చేయనున్నట్లు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరులో కేవలం 1200 మందికి మాత్రమే నిరుద్యోగ భృతి ఇచ్చి, రాష్ట్రమంతా పంపిణీ చేశామని ఆర్భాటం చేస్తున్నారన్నారు. అర్హత పొందిన సంఖ్యను గుర్తించి ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తామన్నారు. సమావేశంలో సీపీ నరసింహులు, శేఖర్రెడ్డి, దేవి, రాయుడు వైఎస్సార్సీపీ నియోజకవర్గ అధ్యక్షురాలు గజ్జల కళావతి, మైనారిటి నాయకుడు ఆయిల్మిల్లు ఖాజా, నల్లం రవిశంకర్ పాల్గొన్నారు. -
బాధిత కుటుంబానికి సాంత్వన
వారిది చేనేత కుటుంబం. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. వారిలో ఒకరు ప్రైవేట్ పాఠశాలలో పని చేస్తుండగా వచ్చిన ఆ డబ్బుతోనే సంసారం నెట్టుకొస్తున్నారు. అలాంటి నిరుపేద కుటుం బంపై విధి పగపట్టింది. వారు ఉంటున్న పూరి గుడిసె బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. కట్టుకున్న బట్టలు మినహా ఏమీ మిగల్లేదు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి శుక్రవారం అక్కడికి వెళ్లారు. పూర్తిగా నిరాశ్రయులైన చేనేత కుటుంబాన్ని చూసి చలించిపోయారు. అసలే ఆడ పిల్లలు.. నిలువనీడ లేదు.. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందే పరిస్థితి లేకపోవడంతో తన సొంత డబ్బుతో ఇల్లు నిర్మించి ఇస్తానని ఎమ్మెల్యే వారికి భరోసా ఇచ్చారు. ధైర్యంగా ఉండాలని రెండు రోజుల్లో ఇంటి నిర్మాణ పనులు ప్రారంభిస్తానని చెప్పారు. వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం : అగ్నిప్రమాదంలో నిలువ నీడ కోల్పోయిన బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి భరోసా కల్పించారు. పట్టణంలోని శ్రీరాంనగర్లో పోలంకి రమాదేవి పూరిల్లు బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. సర్వం కోల్పోయిన ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రమాదేవికి ఇద్దరు కుమార్తెలు. వారిలో జ్యోతి ఎంకాం వరకు చదువుకొని ప్రైవేట్ పాఠశాలలో పని చేస్తుండగా పద్మావతి ఎమ్మెస్సీ చదువుతోంది. వారిది చేనేత కుటుంబం. జ్యోతికి వస్తున్న నెల జీతం రూ.6 వేలతోనే వారి సంసారం నడుస్తోంది. భవనం నిర్మించుకునే స్థోమత లేని చిన్నపాటి పురిగుడిసెలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో బుధవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో జరిగిన అగ్ని ప్రమాదంలో వారి పూరి గుడిసె కాలిపోయింది. ఇంట్లో ఉన్న రెండు తులాల బంగారుతోపాటు కొంత డబ్బు, రెండు గ్యాస్ సిలిండర్లు, ఇద్దరు కుమార్తెల విద్యార్హతల సర్టిఫికెట్లు, బియ్యం, బట్టలు, పూర్తిగా కాలిపోవడంతో వారు వీధిన పడ్డారు. తలదాచుకోవడానికి నీడ లేకపోవడంతో ఏం చేయాలో వారికి పాలుపోలేదు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి శుక్రవారం వారి ఇంటి వద్దకు వెళ్లారు. అగ్నికి ఆహుతి అయిన ఇంటిని పరిశీలించారు. రూ.2 లక్షలతో ఇంటి నిర్మాణం రమాదేవి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే రాచమల్లు కొండంత భరోసా ఇచ్చారు. ‘ధైర్యంగా ఉండాలని.. మీ కుటుంబానికి నేను అండగా ఉంటాను’ అని అన్నారు. ‘టీడీపీ ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి సాయం అందే పరిస్థితి లేదు. నాలుగేళ్లవుతున్నా ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు. అసలే ఆడపిల్లలు.. వారి గౌరవానికి రక్షణ లేని పరిస్థితి’ అని ఎమ్మెల్యే భావించి సొంత ఖర్చుతో ఇల్లు నిర్మిస్తానని రమాదేవి కుటుంబ సభ్యులకు చెప్పారు. బేస్మట్టం ఏర్పాటు చేసి, ఇటుకలతో ఇల్లు నిర్మిస్తానని అన్నారు. ఆదివారం నుంచి పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇంటి నిర్మాణం పూర్తయ్యాక ఎమ్మెల్యే రాచమల్లు సతీమణి రాచమల్లు రమాదేవి స్వయంగా వారిని బజారుకు తీసుకెళ్లి వంట సామగ్రి, బట్టలు, బీరువా, బియ్యం, పప్పు దినుసులు ఇప్పిస్తారన్నారు. ఇందుకు సుమారు రూ.2 లక్షలు పైగా అవసరం అవుతాయని ఎమ్మెల్యే తెలిపారు. ఇల్లు కాలిపోయి బాధలో ఉన్న తమకు ఎమ్మెల్యే చేస్తున్న సాయం కొండంత అండగా నిలిచిందని బాధితురాలు రమాదేవి అన్నారు. -
నేడు సామూహిక రిలే నిరాహార దీక్ష
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు : గుంటూరులో జరిగిన నారా హమారా – టీడీపీ హమారా సభలో 8 మంది ముస్లిం యువకులపై అక్రమ కేసులు బనాయించినందుకు నిరసనగా గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్థానిక పుట్టపర్తి సర్కిల్లో సామూహిక రిలే నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ఆయన బుధవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. ఈ దీక్షకు రిటైర్డు డీఐజీ ఇక్బాల్, మాజీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, కడప నియోజకవర్గ ఎమ్మెల్యే అంజాద్బాషా, వైఎస్సార్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్బాబు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. ఇక్బాల్ ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్షలో ఉంటారన్నారు. గుంటూరులో ముస్లిం మైనారిటీ సదస్సు ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలను పిలిపించుకుని గత నాలుగేళ్లుగా ముస్లింల కుటుంబాలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోనందు వల్ల ముస్లిం యువకులు శాంతియుతంగా తాము ఉన్న స్థానంలో నుంచే ప్లకార్డుల ద్వారా ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేశారన్నారు. అందుకు సీఎం చంద్రబాబు కోపోద్రిక్తుడై తన తప్పులను వేలెత్తి చూపారనే ఉక్రోశంతో కేవలం ప్రశ్నించిన పాపానికి ఆ యువకుల పెడరెక్కలు విరచి కుక్కల్లాగా పోలీస్స్టేషన్కు ఈడ్చుకుపోయి, అర్ధనగ్నంగా లాఠీలతో, బూటు కాళ్లతో విచక్షణ రహితంగా కొట్టారని తెలిపారు. కొట్టింది పోలీసులే అయినా, కొట్టించింది ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు అని అన్నారు. బలమైన సెక్షన్లు పెట్టి కేసులు నమోదు చేశారన్నారు. దేశద్రోహం, ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర, సభను విధ్వంసం చేయడానికి ప్రయత్నించారని 505, 505(2), 120బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ప్రథమం ఇలాంటి కేసులు పెట్టడం ఈ రాష్ట్ర చరిత్రలోనే ప్రథమమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎన్నో సభల్లో పౌరులు ప్లకార్డులను ప్రదర్శించి నిరసన తెలియజేశారన్నారు. అలాంటి వారిని పోలీసులు తాత్కాలికంగా అరెస్టు చేసి సభ అయిపోయిన తర్వాత 165 సెక్షన్ కింద స్టేట్మెంట్ నమోదు చేసుకుని ఇంటికి పంపేవారన్నారు. అయితే ఈ ప్రభుత్వం మాత్రం ముస్లిం యువకులను కొట్టడం, దేశద్రోహం, విధ్వంసకర సంఘటనలకు సంబంధించిన బలమైన సెక్షన్లను నమోదు చేయడం ఇదే ప్రథమమని తెలిపారు. ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికే చెల్లుతుందన్నారు. ముస్లింలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడం ఓ తప్పు అయితే వారిని సభకు పిలిపించుకుని అవమానం చేసి సబ్ జైలుకు పంపడం మరో పెద్ద తప్పన్నారు. చంద్రబాబు చేసిన ఈ సంఘటనలకు ఏ ముస్లిం సోదరుడు కూడా క్షమించరన్నారు. ఎన్నికల్లో తప్పక శిక్షిస్తారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలు జీవించాలంటే ప్రజాస్వామ్యం బతకాల్సిన అవసరం ఉందని, ప్రజా స్వామ్యం బతకాలంటే చంద్రబాబు దిగిపోవాల్సిందేనని ఎమ్మెల్యే అన్నారు. ప్రజల పట్ల, ప్రజల హక్కుల పట్ల గౌరవం కలిగిన ఎమ్మెల్యేగా ఈ ప్రభుత్వం చేసిన పనికి సిగ్గుపడుతూ ముస్లిం కుటుంబాలకు జరిగిన అన్యాయానికి విచారం వ్యక్తం చేస్తున్నానన్నారు. చేసిన పనికి సిగ్గుపడకుండా ప్రభుత్వం అహంభావపూరితంగా వ్యవహరిస్తుండటంతో గురువారం సామూహిక రిలే నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించామన్నారు. దీక్షకు వందలాది మంది ప్రజా స్వామ్య వాదులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు హాజరవుతారని చెప్పారు.ప్రతి ఒక్కరూ ఈ దీక్షకు సంఘీభావం తెలపాలని, ప్రజా స్వామ్యం వైపు నిలబడి పోరాటం చేయాలని ఆహ్వానిస్తున్నానన్నారు. నా వినయ పూర్వక విజ్ఞప్తిని స్వీకరించి తనను బలపరుస్తారని ఆకాంక్షిస్తున్నానన్నారు. -
ప్రతి ఎమ్మెల్యేకీ నిధులిస్తున్నారా?
సాక్షి, వైఎస్సార్ : వైఎస్సార్సీపీ నుంచి గెలిచి టీడీపీ ప్రభుత్వంలో మంత్రి పదవులు చేపట్టిన వారిపై చర్యలు తీసుకున్న మరుసటి రోజే అసెంబ్లీకి హాజరవుతామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. టీడీపీ గొప్పలు చెప్పుకోవడానికే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తోందని, ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీలో ప్రశ్నిస్తే మైక్కట్ చేస్తారని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా అంశం అసెంబ్లీలో కనీసం చర్చకు కూడా రానివ్వరని మండిపడ్డారు. చంద్రబాబుని పొగడటానికే అసెంబ్లీ.. చంద్రబాబు నాయుడుని పొగడటానికే టీడీపీ అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రతీ శాసనసభ్యుడికి నిధులు కేటాయిస్తున్నారా? అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్యేల నియోజవర్గాలకు పైసా కూడా ఇవ్వడంలేదని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించకపోవడం అప్రజాస్వామ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. -
అభివృద్ధి కోసమే కర్మాగారం..లాభాల కోసం కాదు
-
కొనసాగుతున్న ఎమ్మెల్యే శివప్రసాద్రెడ్డి దీక్ష
-
ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరాటం ఉధృతం
-
ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు రాచమల్లు దీక్ష
వైఎస్ఆర్ జిల్లా : జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మంగళవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు దీక్ష చేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కు పరిశ్రమ పేరుతో ఆడుతున్న డ్రామాలను నిరసిస్తూ దీక్ష చేయాలని నిర్ణయించారు. ప్రొద్దుటూరులోని పుట్టపర్తి సర్కిల్లో దీక్షా వేదికను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం రామేశ్వరం రోడ్డులో ఉన్న బుశెట్టి కల్యాణ మండపం నుంచి ఎమ్మెల్యే దాదాపు 10వేల మందితో భారీ ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీ రామేశ్వరం రోడ్డు, గాంధీ రోడ్డు, టీబీ రోడ్డు, రాజీవ్ సర్కిల్ మీదుగా పుట్టపర్తి సర్కిల్కు చేరుకుంటుంది. ఎమ్మెల్యే చేస్తున్న దీక్షకు మద్దతుగా పట్టణంలోని వ్యాపారులు, విద్యార్థులు పెద్ద ఎత్తున సంఘీభావం తెలపనున్నారు. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, జనసేన, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలన్నీ మద్దతు ఇవ్వనున్నాయి. కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, జిల్లాలోని ఎమ్మెల్యేలతోపాటు వైఎస్సార్సీపీ నియోజకవర్గ కన్వీనర్లు దీక్షలో పాల్గొని ఎమ్మెల్యేకు మద్దతు పలకనున్నారు. -
ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారు
ప్రొద్దుటూరు టౌన్ : ముఖ్యమంత్రి వస్తున్నారని ప్రజా స్వామ్యాన్ని కాలరాస్తూ పోలీసుల తుపాకుల నీడలో చెన్నమరాజుపల్లె ఉందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అసమర్థ ప్రభుత్వం నడుస్తోందన్నారు. 2016లో చెన్నమరాజుపల్లె గ్రామానికి చెందిన దేవర సునీతకు ఎన్టీఆర్ స్వగృహ పథకం కింద ఇంటిని మంజూరు చేశారన్నారు. ఈ పథకం కింద రూ.లక్షా 50వేలు ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. సీఎం చేతే ఇంటిని ప్రారంభించేందుకు అధికారులు ఇప్పుడు దగ్గర ఉండి పనులు చేయించడం విడ్డూరంగా ఉందని అన్నారు. రెండేళ్లకుపైగా నిధులు విడుదల చేయకుండా అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. గ్రామంలో విద్యుత్ వైర్లు వేలాడుతున్నాయని, వాటిని మార్చాలని ఎమ్మెల్యేగా తాను ఇప్పటికి ఆ శాఖ అధికారులకు పది సార్లు చెప్పానని.. 50 వీధి దీపాలు, ఎస్సీ, ఎస్టీలకు 30 మీటర్లు ఇవ్వాలని చాలాసార్లు చెప్పానన్నారు. సీఎం వస్తున్నారని... నవనిర్మాణ దీక్షకు ముఖ్యమంత్రి వస్తున్నారని కొత్త పెళ్లి కూతురులా గ్రామాన్ని మారుస్తున్నారని తెలిపారు. వీటన్నింటినీ ఏర్పాటు చేస్తున్నారంటే ఇప్పటి వరకు ఇక్కడ ఈ సౌకర్యాలు లేవనేది స్పష్టమవుతోందన్నారు. అమరావతిలో కూర్చొని ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నానని చెప్పే సీఎం ఒక్క సారి చెన్నమరాజుపల్లెలో ప్రజలు చెప్పే బాధలను వినాలన్నారు. ప్రమాదకర పరిస్థితిలో విద్యార్థులు పాఠాలు అభ్యసిస్తున్నా ఏ శాఖ అధికారులు పట్టించుకోలేదని విమర్శించారు. పైపై మెరుగులు చేయడం ద్వారా ఎలాంటి ఉపయోగం లేదని, పిల్లలకు పుస్తకాలు, యూనిఫాం సక్రమంగా ఇవ్వాలన్నారు. ఈ విషయంపై తాను అసెంబ్లీలో మాట్లాడానని తెలిపారు. ఇప్పటి వరకు ఏ అధికారైనా గ్రామాన్ని సందర్శించారా... ఇప్పటి వరకు ఏ అధికారి అయినా ఈ గ్రామానికి వచ్చారా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు.సీఎం వస్తున్నారని వచ్చారే తప్ప గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు కాదన్నారు. చెన్నమరాజుపల్లె, నాగాయపల్లె గ్రామాలకు సంబంధించి 67 ఎన్టీఆర్ గృహాలు మంజూరు చేశారని, ఇందులో 38 ఇళ్లు పూర్తయినా బిల్లులు ఇవ్వలేదన్నారు. ఈ రెండు గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీలకు ఒక్క ఎకరా భూమిని ఇవ్వలేదన్నారు. ఇంతటి దారుణమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో చంద్రబాబు పర్యటనను పండుగ చేయాలని వరదరాజులరెడ్డి చెబుతున్నారన్నారు. వరద ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న గ్రామ ప్రజల బాధలు ఒక్క సారైనా కనిపించలేదా అని ప్రశ్నించారు. తుపాకుల నీడలో సీఎం పర్యటన రెండు గ్రామాల్లో ఉన్న ప్రజలు ముఖ్యమంత్రి పర్యటనను వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. పోలీసుల తుపాకుల నీడలో సీఎం రాకపోకలు జరుగుతున్నాయన్నారు. అధికారం, చట్టాన్ని ఉపయోగించి మాట్లాడే అవకాశాన్ని ప్రజలకు కల్పించడం లేదన్నారు. ఎవరైనా అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పొచ్చని జిల్లా కలెక్టర్ ప్రకటించాలని సవాల్ విసిరారు. కేసులు పెట్టమని చెప్పాలన్నారు. దమ్ముంటే తన సవాల్ను స్వీకరించాలని కోరారు. వైఎస్సార్సీపీ లీడర్లు ఫ్యాక్షనిస్టులు అంటూ పోలీసులను ఇప్పటికే గస్తీగా పెట్టారన్నారు. నడిపెన్న కొడుకు శ్రీనును పోలీసులు వెంబడిస్తున్నారన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి రాష్ట్ర నిధులు ఒక్క రూపాయిని అయినా మంజూరు చేశారా అని సీఎంను ఎమ్మెల్యే ప్రశ్నించారు. మంచినీళ్లు తాగకుండా నిరసన బలహీనమైన పనితీరును తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానన్నారు. సీఎం ప్రొద్దుటూరులో అడుగు పెట్టిన నిమిషం నుంచి తిరిగి వెళ్లేంత వరకు మంచి నీళ్లు కూడా తాగకుండా నిరసన వ్యక్తం చేస్తానన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అని చెప్పి తన నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ప్రజలను కష్టాలపాలు చేశారన్నారు. గాంధీ మార్గంలోనే నిరసన తెలుపుతానన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకుడు పోరెడ్డి నరసింహారెడ్డి, వైఎస్సార్సీపీ రాజుపాళెం మండల కన్వీనర్ ఎస్ఏ నారాయణరెడ్డి, సోములవారిపల్లె నాయకుడు శేఖర్ పాల్గొన్నారు. -
ఫలించిన పోరాటం
ప్రొద్టుటూరు టౌన్ : ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఐదు రోజులుగా చేస్తున్న దీక్ష ఎట్టకేలకు ఫలించింది. చిరు వ్యాపారులైన పేదలపై అధికార పార్టీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాన్ని నిలువరించారు. గత ఐదు రోజులుగా ప్రొద్దుటూరు పాతబస్టాండులో చిరువ్యాపారులతో కలిసి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి దీక్ష చేపట్టారు. అన్న క్యాంటిన్ ఏర్పాటు పేరుతో పాతబస్టాండ్లో ఉన్న రెండు మున్సిపల్ దుకాణాలను, బస్షెల్టర్ను అక్కడ వ్యాపారాలు చేస్తున్న 30 మందిని ఖాళీ చేయాలంటూ మున్సిపల్ అధికారులు నెల రోజులుగా బెదిరిస్తున్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే రాచమల్లుకు వ్యాపారులు ఫిర్యాదు చేయడంతో ఆ ప్రాంతానికి వచ్చిన ఎమ్మెల్యే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు వెనుతిరిగి వెళ్లారు. మరల దుకాణాలను తొలగించాలంటూ కొలతలు వేసి భయాందోళనకు గురి చేశారు. దీనిపై కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఎమ్మెల్యే పాతబస్టాండ్కు వెళ్లి చిరువ్యాపారులకు అండగా నిలిచారు. వరదరాజులరెడ్డి చెప్పినట్లు చేస్తే పుట్టగతులుండవని హెచ్చరించారు. ఐదు రోజుల క్రితం.. మున్సిపల్ కమిషనర్ ఐదు రోజులక్రితం పాతబస్టాండ్లో ఉన్న బస్షెల్టర్ను, దుకాణాలను తొలగించేందుకు పోలీసు బందోబస్తు కోరారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే ఉదయం ఏడు గంటలకే చిరు వ్యాపారులతో కలిసి దీక్ష చేపట్టారు. కౌన్సిల్ తీర్మానం లేకుండా యాభైఏళ్ల క్రితంనిర్మించిన బస్టాండును ఎలా తొలగిస్తారంటూ కమిషనర్ను నిలదీశారు. వ్యాపారులకు 24వ తేదీ నోటీసులు ఇచ్చి 9వ తేదీ ఇచ్చారంటూ ఎందుకు మోసం చేశారని కమిషనర్ను ప్రశ్నించారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే రాచమల్లు జిల్లా కలెక్టర్ హరికిరణ్కు ఫోన్ చేసి వివరించారు. బస్టాండుకు పది అడుగుల దూరంలో త్రీటౌన్ పోలీస్స్టేషన్ పక్కనే 75 సెంట్ల మున్సిపల్ స్థలం ఉందని అక్కడ అన్న క్యాంటిన్ కడితే ప్రయోజనం ఉంటుందని చెప్పారు. పరిశీలిస్తానని కలెక్టర్ పేర్కొన్నారు. కమిషనర్ దీక్షా శిబిరానికి వచ్చి ఎమ్మెల్యేతో మాట్లాడారు. రాత్రివేళ దుకాణాలను కూల్చబోమని హామీ ఇచ్చారు. ఐదవ రోజుకు చేరిన దీక్ష: మంగళవారానికి దీక్ష ఐదవ రోజుకు చేరుకుంది. దీక్షా శిబిరానికి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, ఆర్ఓ మునికృష్ణారెడ్డి, ఇతర శాఖల అ«ధికారులు వచ్చారు. జిల్లా కలెక్టర్ తమను పిలిపించి ఈ విషయాన్ని చర్చించారని చెప్పారు. చిరువ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని చెప్పినట్లు వివరించారు. మున్సిపల్ గదులను, బస్షెల్టర్ను తొలగించి అన్న క్యాంటిన్తోపాటు బస్షెల్టర్ను ఆధునికీకరిస్తామని చెప్పారు. చిరు వ్యాపారులు తిరిగి వారి స్థానాల్లో వ్యాపారాలు నిర్వహించుకోవచ్చని పేర్కొన్నారు. దీనిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కమిషనర్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వ్యాపారులతో మాట్లాడారు. ప్రభుత్వం మనకోసం ముందుకు వచ్చి సహకరిస్తామన్నప్పుడు మనం కూడా సహకరించాల్సిన బాధ్యత ఉందన్నారు. అన్న క్యాంటిన్ను మొదలు పెట్టిన రోజు బస్షెల్టర్ ఆధునికీకరణ పనులు మొదలు పెడతారని, నెలలోపు ఆ రెండు పూర్తవుతాయని, తిరిగి మీరు యధాస్థానాల్లో వ్యాపారాలు నిర్వహించుకోవచ్చని తెలిపారు. దీంతో వ్యాపారులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. -
జిల్లా జడ్జి చెప్పినా.. పట్టదా?
ప్రొద్దుటూరు టౌన్ : అధికార పార్టీ నాయకులు తాము అనుకున్నదే చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించవద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి చెప్పినా.. పట్టించుకోలేదు. పట్టణంలోని గాంధీ పార్కులో ట్యాంక్ నిర్మాణ పనులను మున్సిపల్ పాలకవర్గం ఇటీవల ప్రారంభించింది. పార్కులో ట్యాంక్ నిర్మిస్తే.. ప్రశాంత వాతావరణం దెబ్బతింటుందని ప్రజలు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే.. జిల్లా జడ్జి జి.శ్రీనివాస్ దృష్టికి గురువారం తీసుకెళ్లారు. ఇందుకు స్పందించిన జడ్జి అక్కడ ట్యాంక్ నిర్మాణ పనులు ఆపాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నకు తెలిపారు. అలాగే అని కమిషనర్ జడ్జికి చెప్పారు. ఒక రోజు కూడా గడవక ముం దే తిరిగి పనులు చేపట్టారు. శుక్రవారం అర్ధరాత్రి 11.30 గంటల నుంచి శని వారం తెల్లవారుజామున 5.30 వరకు అధికార పార్టీకి చెందిన రామాపురం వాసి హిటాచితో వందల ట్రాక్టర్ల మట్టిని తరలించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకా రం క్రీడా మైదానాలు, ఉద్యానవనాల్లో ఎలాంటి నిర్మాణాలు చేయకూడదనే నిబంధనలు ఉన్నా.. అధికార పార్టీ నేతలు తుంగలో తొక్కి పార్కులో పెద్ద గోతులు తవ్వడం పర్యావరణ ప్రేమికుల్లో ఆందోళన కలిగిస్తోంది. ట్రాక్టర్ మట్టిని రూ.1000కి పైగా విక్రయించుకుని సొమ్ము చేసుకుంటున్నారు. అయినా మున్సిపల్ కమిషనర్ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఈ విషయంపై వైఎస్సార్సీపీ మున్సిపల్ ఫ్లోర్లీడర్ వంగనూరు మురళీధర్రెడ్డి అర్ధరాత్రి ఫోన్ చేసినా కమిషనర్ తీయలేదు. శనివారం ఉదయం ఆయన కమిషనర్కు తెలిపినా.. కనీసం పార్కులోకి వెళ్లి పరిశీలించిన దాఖలాలు లేవు. ఏది ఏమైనా పార్కులో అర్ధరాత్రి మట్టి తరలింపు చేస్తుంటే.. అధికార పార్టీ నేతల ఆగడాలు శ్రుతిమించాయని స్పష్టమవుతోంది. అర్ధరాత్రి హిటాచిని ఏర్పాటు చేసి ట్రాక్టర్లలో మట్టిని తరలిస్తుంటే.. అక్కడ పోలీసు వాహనంతోపాటు ఎస్ఐ, సిబ్బంది పహారా కాయడం కనిపించింది. -
పథకాలన్నీ దళారులకే!
కడప ఎడ్యుకేషన్: ప్రభుత్వం రైతుల కోసం ఇచ్చే సబ్సిడీ పథకాల వల్ల రైతుల కంటే దళారీలకే ఎక్కువ మేలు జరుగుతోందని, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని నేరుగా రైతు ఖాతాల్లో జమచేస్తే మరింత మేలు జరుగుతుందని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డితోపాటు మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘనామిరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక జెడ్పీ సమావేశం హాల్లో గురువారం సీఈఓ రామచంద్రారెడ్డి అధ్యక్షతన జెడ్పీ చైర్మన్ గూడూరు రవి ఆధ్వర్యంలో 13వ జెడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీలు అవినాష్రెడ్డి, రమేష్నాయుడు, ఎమ్మెల్యేలు శెట్టిపల్లె రఘరామిరెడ్డి, రాచమల్లు ప్రసాద్రెడ్డి, శ్రీకాంత్రెడ్డిలు ఎమ్మెల్సీలు కత్తి నరసింహారెడ్డి, రవీంద్రనాథ్రెడ్డి (బీటెక్రవి)లతోపాటు కలెక్టర్ బాబురావునాయుడు, జేసీ శ్వేత, ట్రెనీ ఐపీఎస్ వకుల్ జిందాల్ హాజరయ్యారు. ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టిన జెడ్పీ చైర్మన్ సభ ప్రారంభం కాగానే జెడ్పీ చైర్మన్ గూడూరు రవి కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుతోపాటు రాయలసీమలో హైకోర్టుకు ఏర్పాటుకు సంబంధించి తీర్మానాలను ప్రవేశపెట్టగా జెడ్పీటీసీ సభ్యుడు పొరెడ్డి ప్రభాకర్రెడ్డి ఇది ఎంతో ప్రాధాన్యత ఉన్న అంశం, సభలో చర్చించిన తర్వాత తీర్మానం చేస్తే బాగుంటుందని అనగా చైర్మన్ అలాగేనన్నారు. 5 విడత జన్మభూమికి సంబంధించి ఇళ్లు, పింఛన్లు, ఇంటిస్థలాలతోపాటు పలు సమస్య కోసం వచ్చిన అర్జీలు ఎన్ని, వాటి పరిష్కారం కోసం మీరు తీసుకున్న చర్యలేవని సీపీఓను అడిగారు. 3,97,145 అర్జీలు వచ్చాయని వీటిలో 3.96లక్షల అర్జీలను ప్రాసెస్ చేశామన్నారు. ఇందులో 2.63లక్షల అర్జీలు డబ్బులతో ముడిపడిన అంశాలని చెప్పారు. దీనిపై సంతృప్తి కరమైన సమాధానం రాకపోవడంతో ఎమ్మెల్యే రాచమల్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం 260మందికి ఇళ్ల స్థలాలుఇస్తే సరిపోతుందా? ప్రొద్దుటూరులో 70వేల మంది ఓటర్లు ఉంటే ఇందులో 3,579 మంది ఇంటి స్థలాల కోసం దరఖాస్తు చేసుకోగా మీరు 260 మందికి మాత్రమే ఇచ్చారని, మిగిలిన వారి పరిస్థితేంటో వివరించాలని ఎమ్మెల్యే రాచమల్లు పట్టుబట్టారు. కొత్తపల్లె పంచాయతీలో 2006–07లో వైఎస్సార్ 8 వేలమందికి ఇళ్లస్థలాలను మంజూరు చేశారు. 4 వేలమంది ఇళ్లు కట్టుకున్నారు. 2వేల మంది పునాదులు వేసుకున్నారు. అక్కడ మౌలిక సదుపాయాలను కల్పించకపోవడంతోనే వారు మందుకు రాలేదన్నారు. ఇప్పుడా స్థలాలను ఇతరులకు కేటాయిస్తామని అధికారులు చెప్పడం సరైనది కాదని మండిపడ్డారు. అలా చేస్తే వారి తరపున పోరాటం చేయాల్సి ఉంటందని హెచ్చరించారు. కలెక్టర్ ఈ అంశంపై స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. చాపాడు జెడ్పీటీసీ నరసింహారెడ్డి మాట్లాడుతూ 2015 నవంబర్లో కురిసిన వర్షాలకు మినుము, పెసర పంటలు దెబ్బతిన్నాయని, నష్టపరిహారం ఇంతవరకూ రాలేదన్నారు. దీనికి జేడీ స్పందిస్తూ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని వస్తాయన్నారు. గాలివీడు జెడ్పీటీసీ లక్ష్మీదేవి మాట్లాడుతూ గాలివీడు బస్టాండ్కు సర్పంచ్ స్థలం ఇస్తే ఆర్టీసీ వారు అక్కడ రూములు నిర్మించుకుని బాడుగలు తీసుకుంటున్నారు తప్పా మహిళలకు కనీసం మరుగుదొడ్లను కూడా నిర్మించలేదన్నారు. ఒక పక్క ప్రభుత్వం స్వచ్ఛభారత్ అని మొత్తుకుంటున్నా మహిళలకు వారిచ్చే గౌరవం ఇదేనా అని నిలదీశారు. అలాగే గాలివీడులో జెడ్పీ బాలికల పాఠశాలకు అన్ని వసతులు ఉన్నా ప్రైవేటు పాఠశాలకు పదవ తరగతి సెంటర్ను ఇచ్చారు.. ఇదేనా ప్రభుత్వ విద్య బలోపేతంపై ఉన్న చిత్తశుద్ధి అని ప్రశ్నించారు. దీనికి డీఈఓ స్పందిస్తూ ప్రభుత్వ పాఠశాలకు ప్రహారీ లేని కారణంగా సెంటర్ను వేయలేదన్నారు. దీనికి ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి స్పందిస్తూ ఇతర జిల్లాలో జెడ్పీ నిధులతో ప్రహారీలు నిర్మిస్తున్నారని తెలిపారు. దీనికి స్పందించిన జెడ్పీ చైర్మన్ గూడూరు రవి జిల్లాలో ప్రహరీలు లేని బాలికల జెడ్పీ హైస్కూల్స్ ఉన్నాయని, వాటి జాబితాను ఇవ్వాలని డీఈఓను ఆదేశించారు. వేసవిలో మంజూరు చేస్తామన్నారు. సబ్సిడీ మొత్తాన్ని రైతు ఖాతాకే జమ చేయాలి : ఎంపీ అవినాష్రెడ్డి ‘ప్రభుత్వం ççసబ్సిడీ కింద ఇచ్చే పరికరాల ధరలకంటే బహిరంగ మార్కె ట్లో లభించే పరికరాల ధరలు తక్కువగా ఉన్నాయని, వాటికోసం ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని నేరుగా రైతుఖాతాలో జమ చేస్తే వారికి మేలు జరుగుతుందని ఎంపీ అవినాష్రెడ్డి అన్నారు. రైతురథంకు ఆ విధానాన్ని అమలుచేస్తే బాగుంటుందన్నారు. ఈ పథకంలో రైతుకు రూ.1.50 లక్షలు ఇచ్చినప్పటికీ కేవలం రూ.50వేలు మాత్రమే మిగులుతోందని, మిగిలిన రూ.లక్ష ఆయా ట్రాక్టర్ల కంపెనీలకు వెళ్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఒక రైతుకు తానే ఐచర్ కంపెనీ వారితో మాట్లాడి రూ.లక్ష తగ్గించానన్నారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని నేరుగా రైతు ఖాతాకు జమచేస్తే ధర తక్కువ ఉన్నచోట కొనుగోలు చేసుకుంటారన్నారు. -
ప్రజా పోలీసు వస్తున్నాడు
ప్రొద్దుటూరు టౌన్ : మూడున్నరేళ్లు అధికారంలో ఉండి ప్రజా సొమ్మును దొంగతనం చేసిన దొంగల పార్టీ టీడీపీ నాయకుల భరతం పట్టడానికి ప్రజా పోలీసు వస్తున్నాడని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్రెడ్డి తలపట్టిన పాదయాత్రను ఉద్దేశించి టీడీపీ నాయకులు, రాజ్యసభ సభ్యులు, మాజీ శాసనసభ సభ్యులు దొంగలు వస్తున్నారు జాగ్రత్త అని విమర్శలు చేయడం ఏమేరకు సబబని ప్రశ్నించారు. మేము మిమ్ములను దొరలు వస్తున్నారు జాగ్రత్త అని అన్నా బూతుమాటగా వక్రీకరిస్తారని పేర్కొన్నారు. దొంగలపార్టీ టీడీపీ నాయకుల వద్ద నుంచి ప్రజల సొమ్మును కక్కించేందుకు, ప్రజా సం క్షేమం కోసం పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. మంత్రుల వద్ద నుంచి అందరికీ ఉలికిపాటు ఎందుకో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉన్నారని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మాట్లాడటం సిగ్గు చేటన్నారు. పేద వారికి ఇళ్లు ఇచ్చారా, రుణాలు మాఫీ చేశారా, ఇంటికో ఉద్యోగం ఇలా చేసిన వాగ్దానాల్లో ఏ ఒక్కటైనా నిలబెట్టుకున్నారా అని ప్రశ్నించారు. 175 సీట్లు వస్తాయని ప్రగల్బాలు పలుకుతున్న సీఎం రమేష్ 88 సీట్లు వస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని, నీవు రాజకీయ సన్యాసం చేస్తావా అని ఎమ్మెల్యే సవాలు విసిరారు. ప్రజలకు జగన్పై ఓ విశ్వసనీయత నాయకుడన్న నమ్మకం ఉంది కాబట్టే వేలాది మందిగా వచ్చి స్వాగతం పలుకుతున్నారని తెలిపారు. గృహాలు, ఎర్రచందనం, నీరు–చెట్టు, నానాక గడ్డి తిన్న మీరు గ్రామాల్లోకి వస్తే గుడ్డలు విప్పదీసి చెట్టుకు కట్టేసి కొడతారన్న విషయం సీఎం రమేస్ తెలుసుకోవాలన్నారు. ఆది రాకతో సీఎం రమేష్ మతి భ్రమించింది: జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి రాకతో సీఎం రమేష్ దుకాణం ఖాళీ అయిందని ఎమ్మెల్యే రాచమల్లు అన్నా రు. బాబు వద్ద పరపతి తగ్గి రెండు నెలలుగా అపాయింట్మెంట్ రాక పిచ్చి పిచ్చిగా మతి భ్రమించి మాట్లాడుతున్నారని తెలిపారు. జగన్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఇంతకన్నా దారుణంగా మేము మాట్లాడుతామని హెచ్చరిం చారు. వైఎస్సార్సీపీ మాజీ రాష్ట్ర కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, కల్లూరు నాగేంద్రారెడ్డి, పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, వైఎస్సార్టీయూసీ జిల్లా అధ్యక్షుడు షేక్షావలి పాల్గొన్నారు. -
ముస్లింలకు 8 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి
కడప కార్పొరేషన్ : రాష్ట్రంలో ముస్లిం, మైనార్టీలకు 8 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. ఖాదర్బాషా డిమాండ్ చేశారు. గురువారం కడపలోని వైఎస్ఆర్ ఆడిటోరియంలో ముస్లిం, మైనార్టీలతో నిర్వహించి న సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటు కు నోట్లు కేసులో చంద్రబాబు మోదీ కాళ్ల దగ్గర సాగిలపడి, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆరోపించారు. ముస్లింలు 20వేల మంది ఉండే ప్రతి ప్రాంతంలో పర్యటించి సద్భావనా సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ, పార్టీ జాతీ య కార్యదర్శి రెహమాన్ మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి పాలనలో ముస్లింలు ఒకరికి ఇచ్చే స్థితిలో ఉండేవారని, చంద్రబాబు పాలనలో పుచ్చుకొనే స్థాయికి చేరారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ సీని యర్ నాయకులతో కమిటీ వేసి ముస్లింల సమస్యలపై అధ్యయం చేస్తామన్నారు. కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం లో, యూపీ సీఎం ఆదిత్యనాథ్ ప్రభుత్వంలోనూ ముస్లిం మంత్రులున్నారని, చంద్రబాబు ప్రభుత్వంలో మాత్రం లేరని ఎద్దేవా చేశారు. లౌకికవాదం అంతమొందించేలా ప్రభుత్వ చర్యలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముస్లిం, మైనార్టీలను అణగదొక్కుతున్నాయని కడప శాసనసభ్యులు అంజద్బాషా ధ్వజమెత్తారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ముస్లింలకు అనేక హామీలిచ్చి న చంద్రబాబు ఒక్క హామీ అమలు చేయలేదని విమర్శించారు. రాజ« దాని పేరుచెప్పి ఎన్నో మసీదులు, దేవాలయాలు, చర్చిలను కూల్చివేశారని గుర్తు చేశారు. లౌకికవాదాన్ని అంతం చేసే విధంగా ప్రభుత్వ చర్యలున్నాయని తెలిపారు. విద్యతోనే ఉజ్వల భవిష్యత్ – రఘురామిరెడ్డి ముస్లిం, మైనార్టీలు అన్ని రంగాల్లో వెనుకబడ్డారని విద్య వల్లే వారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుదని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు. మైదుకూరులో 20 ఏళ్ల చరిత్ర కలిగిన దర్గాను అర్థరాత్రి కరెంటు తీసి కూల్చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని దుయ్యబట్టారు. ఇలాంటి పాపాలు చేస్తున్న ఆయన్ను దేవుడు కూడా క్షమించడని హెచ్చరించారు. ముస్లింలు నమ్మకానికి ప్రతిరూపం – రాచమల్లు ముస్లిం, మైనార్టీలు నమ్మకానికి ప్రతిరూపాలని ప్రొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్రెడ్డి అన్నారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ముస్లింల పట్ల కర్కషంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హబీబుల్లా, జిల్లా అధ్యక్షుడు ఎస్ఏ కరిముల్లా, నగర అధ్యక్షుడు ఎస్ఎండీ షఫీ, పార్టీ రాష్ట్ర నాయకులు గౌస్లాజం, తుమ్మలకుంట శివశంకర్, ఎంపీ సురేష్, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు టీపీ వెంకటసుబ్బమ్మ, బీసీసెల్ అధ్యక్షుడు బంగారు నాగయ్య యాదవ్, స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఖాజా రహమతుల్లా, దేవిరెడ్డి ఆదిత్య పాల్గొన్నారు. తీర్మానాలు ఇవే... ఫీజు రీయింబర్స్మెంట్ను సక్రమంగా అమలు చేయాలని, నియోజకవర్గానికి ఒక ఉర్దూ జూని యర్ కళాశాల, రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలని, ఓబీసీల వర్గీకరణ చేయాలని, ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసి బ్యాంకులతో సంబంధం లేకుండా రుణా లివ్వాలని, మైనార్టీల సబ్ప్లాన్ అమలు చేయాలని, దుల్హన్ పథకం కింద లక్ష రూపాయలు ఇవ్వాలని, వక్ఫ్ భూములకు రక్షణ కల్పించి దూదేకుల కమ్యూనిటీకి సమాన అవకాశాలు కల్పించాలని, వెయ్యి కోట్లతో మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. -
అధికారపార్టీ పలాయనం
పేదవాడికి ఇళ్లు నిర్మించి ఇచ్చే పేరుతో ప్రభుత్వం వారిని అప్పుల పాల్జేస్తోందని, బ్యాంకు కంతులు, లబ్ధిదారుని వాటా చెల్లించడానికి తెచ్చే అప్పులకు వడ్డీలు చెల్లించలేక చివరకు జైలు పాలయ్యే పరిస్థితి తెచ్చిపెట్టారని ప్రొద్దుటూరు శాసనసభ్యుడు రాచమల్లు శివప్రసాద్రెడ్డి ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పేదవాడు అప్పు చేయ కుండా ఇల్లు నిర్మించి ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. ఈ అంశంపై చర్చను పక్క దారి పట్టించేలా మంత్రులు సోమిరెడ్డి, ఆదినారాయణరెడ్డి వ్యవహరించిన తీరును నిరసిస్తూ ఆయన నేల మీద కూర్చున్నారు. రాచమల్లుకు మద్దుతుగా వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు స్వరం కలపడంతో మంత్రులు సమాధానం చెప్పలేక అజెండా ప్రారంభం కాకుండానే మంగళవారం జెడ్పీ సమావేశాన్ని ముగించి వెళ్లిపోయారు. కడప : గృహ నిర్మాణ పథకంపై జెడ్పీ సమావేశం దద్దరిల్లింది. పేదలను ఇబ్బందులకు గురిచేసే విధంగా ఉన్న పథకంపై వాడీవేడి చర్చ జరిగింది. సరైన సమాధానం చెప్పలేక అధికారపార్టీ పలాయనం చిత్తగించింది. చర్చను పక్కదారి పట్టించింది. జెడ్పీ చైర్మన్ గూడూరు రవి అధ్యక్షతన మంగళవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ముందుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి ప్రతిజ్ఞ చేశారు. సమావేశం ప్రారంభం కాగానే ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్రెడ్డి పట్టణ గృహ నిర్మాణ పథకం మీద మాట్లాడారు. పట్టణాల్లోని పేదలకు 3 సెంట్లలో ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పి ఇప్పుడేమో ముక్కాల్ సెంటు, సెంటు, సెంటు కంటే కొంచె ఎక్కువ స్థలంలో ఇళ్లు నిర్మిస్తామని ప్రభుత్వం చెబుతోందని మంత్రులను నిలదీశారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.3.65 లక్షలు ఇస్తే ఈ ఇల్లు తనఖా పెట్టుకుని బ్యాంకు 9 శాతం వడ్డీతో రూ.3లక్షల లోను ఇస్తుందని, దీన్ని 30ఏళ్లు కంతులు కట్టాలన్నారు. రిక్షా తొక్కే వాళ్లు, కూలి పనిచేసుకునే వాళ్లు లబ్ధిదారుని వాటా కింద మొదట రూ.లక్ష కట్టాలని, తర్వాత 30ఏళ్లు లోను, కంతులు కలిపి నెలకు రూ.7వేలు చెల్లించాలన్నారు. ఇందంతా పేదవాడు చేసుకోగలడా అని మంత్రులను ప్రశ్నించారు. కంతులు సక్రమంగా కట్టకపోతే బ్యాంకు వాళ్లు ఇల్లు జప్తు చేసి జైలుకు పంపించరా? అని రాచమల్లు ప్రశ్నించారు. ప్రజల కోసం ప్రశ్నిస్తా.. జిల్లా ఇన్చార్జ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి కల్పించుకుని ఇది అర్బన్కు సంబంధించిన విషయమని ఇక్కడ చర్చించకూడదన్నారు. ఏదైనా ఉంటే మీరు అసెంబ్లీకి రండి అక్కడ చర్చిద్దాం అన్నారు. జెడ్పీ సమావేశంలో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన సమస్యలను మాత్రమే చర్చించాలన్నారు. దీనిపై ఎమ్మెల్యే రాచమల్లు స్పందిస్తూ గతంలో ఇదే సభలో సమైక్యాంధ్ర కోసం పలు తీర్మానాలు చేశారని ఇప్పుడు ఎందుకు చేయకూడదన్నారు. ఇదేమైన వేరే రాష్ట్రం సమస్యా? లేక నా వ్యక్తిగత సమస్య అని ఆయన ప్రశ్నించారు. ప్రజల సమస్యల గురించి ఎక్కడైనా ప్రశ్నిస్తానని స్పష్టం చేశారు. ఈ దశలో మంత్రి ఆదినారాయణరెడ్డి, పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ ఎం.లింగారెడ్డి కల్పించుకుని జెడ్పీలో ఈ అంశం మీద చర్చించకూడదని ఎదురుదాడికి దిగారు. జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయనీ, జెడ్పీ సమావేశం అజెండాలో ఈ అంశం లేదని అభ్యంతరం చెప్పారు. ఒక దశలో రాచమల్లు, మంత్రి ఆది పరస్పరం విమర్శలు చేసుకున్నారు. లింగారెడ్డి కల్పించుకుని 300చదరపు అడుగుల లోపు ఇల్లు నిర్మించుకుంటే బ్యాంకు లోను తీసుకోవాల్సిన పనిలేదని చెప్పారు. ఈ సందర్భంలో లింగారెడ్డి, రాచమల్లు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ‘ చూడు మామ నువ్వు ప్రొద్దుటూరులో ఉన్నావ్. మల్లా టిక్కెట్ అడుగుతనావ్. ఇట్ల మాట్లాడితే ప్రజలు నీకు ఓటేయరు’’ అని రాచమల్లు పరోక్షంగా హెచ్చరించారు. కాంట్రాక్టర్ల కోసమే.. ప్రభుత్వం అర్బన్ హౌసింగ్లో మంజూరు చేసే ఇళ్ల నిర్మాణాలు కాంట్రాక్టర్ల కోసం తప్ప లబ్ధిదారుల కోసం కాదని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి విమర్శించారు. ఇది కేవలం టీడీపీ నాయకులకు లబ్ధి చేకూర్చేందుకు తప్ప మరొకటి కాదన్నారు. విషజ్వరాలతో చనిపోతున్నారు జిల్లావ్యాప్తంగా అనేకమంది విషజర్వాలతో చనిపోతున్నా పట్టించుకునే వారే లేరని ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్రెడ్డి విమర్శించారు. ఒక్క పొద్దుటూరులోనే పదుల సంఖ్యలో చనిపోయారన్నారు. ప్రజలకు సేవచేయలేని పదవులు, మంత్రి పదవులు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఒక్క పూరిగుడిసె లేకుండా చేశారు వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ఒక్క పూరిగుడిసె లేకుండా ప్రతి పేదవాడికి పక్కాఇల్లు నిర్మించి ఇచ్చారని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంతరెడ్డి అన్నారు. ఆయన సీఎంగా ఉన్న సమయంలో పచ్చ చొక్కాలు తొడుకున్న ఎంతోమంది నాయకులు భవంతులు నిర్మించుకున్నారన్నారు. ఇప్పుడేమో ఈ ప్రభుత్వం పేదల ఇళ్లను బ్యాంకులో తనఖా పెట్టుకుని లోను మంజూరు చేస్తోందని దుయ్యబట్టారు. సమస్యలపై చర్చించండి.. సభలో ఎవరు కూడా వ్యక్తిగత విమర్శలు చేసుకోరాదని, కేవలం జిల్లాలో ప్రజల సమస్యలను మాత్రమే మాట్లాడాలని జెడ్పీ చైర్మన్ గూడూరు రవి పదే పదే సభ్యులకు విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత విమర్శలకు దిగితే సహించేది లేదని ఏపార్టీ సభ్యులనైనా పోలీసులతో బయటకు పంపుతామని, అంతేకాకుండా మైక్ కూడా కట్ చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్యే జయరాములు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, కలెక్టర్ బాబురావునాయుడు, జేసీ శ్వేత, జెడ్పీ సీఈఓ ఆనంద్ సమావేశంలో పాల్గొన్నారు. మంత్రిని నిలదీసిన సభ్యులు వైఎస్ హయాంలో పులివెందులలో, రాష్ట్రంలో 4లక్షల ఇల్లు కనిపించకుండా పోయాయని మంత్రి సోమిరెడ్డి ఆరోపణలు చేశారు. దీంతో ఎంపీ అవినాష్రెడ్డి, ఎమ్మెల్యేలు పి. రవీంద్రనాథరెడ్డి, ఎస్.రఘురామిరెడ్డి, జి. శ్రీకాంత్రెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డితో పాటు పలువురు జెడ్పీటీసీలు, ఎంపీపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వైఎస్ హయాంలో అక్రమాలు జరిగి ఉంటే మూడేళ్లుగా మీరు అధికారంలో ఉండి ఎందుకు విచారణ చేయించలేకపోయారని నిలదీశారు. ఈ దశలో సభలో తీవ్రస్థాయిలో గందరగోళం నెలకొనడంతో చైర్మన్ రవి సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు. తర్వాత సభ ప్రారంభమయ్యాక పేదలకు భారం లేకుండా ఇల్లు నిర్మించి ఇవ్వాలని తీర్మానం చేయాలని చైర్మన్ రవి ప్రతిపాదించారు. ఇందుకు మంత్రి సోమిరెడ్డి అంగీకరించలేదు. ఈ దశలో ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతుండగా, జెడ్పీటీసీ సభ్యుడు పోరెడ్డి ప్రభాకర్రెడ్డి అడ్డుతగిలారు. ‘నువ్వు రాజకీయ వ్యభిచారివి నువ్వెందుకు మాట్లాడతావ్ కూర్చో’’ అని రాచమల్లు నిప్పులు చెరిగారు. దీంతో సభలో గందరగోళం రేగింది. 2015, 2016, 2017లో ఒక్క ఇల్లు కట్టకుండా 2018లో ఓట్ల కోసం ఇల్లు కట్టిస్తారా? అని మంత్రులను నిలదీశారు. వైఎస్సార్ గురించి ఆరోపణలు, విమర్శలు చేసే అర్హత ఎవరికీ లేదని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి అభ్యంతరం చెప్పారు. ఈ దశలో ఎమ్మెల్సీ బీటెక్ రవి రాజకీయ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వాగ్వాదం, తోపులాటలు చోటుచేసుకోవడంతో చైర్మన్ రవి సభను నిరవధికంగా వాయిదా వేశారు. దీంతో అజెండాలోని అంశాలు ప్రారంభం కాకుండానే సమావేశం ముగిసింది. -
రోడ్డు నిర్మాణంలో అక్రమాలు: రాచమల్లు
వైఎస్సార్ జిల్లా ప్రొద్దూటూరు పట్టణంలో రూ.8 కోట్ల వ్యయంతో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులు పూర్తి నాసిరకంగా ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి అన్నారు. స్థానికంగా రిలయన్స్ పెట్రోల్ పంప్ నుంచి సుమారు 5 కిలోమీటర్ల మేర జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనుల్లో తారు వేయాల్సినంతగా లేదని.. మెటల్ సైజు నిర్ణీత మేర లేదని అన్నారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కుమారుడు కొండారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈరోడ్డు నిర్మాణ పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే శనివారం నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్దంగా నిర్మాణం జరుగుతోందని అన్నారు. కాలువ నిర్మాణం చేయకుండా.. రోడ్డు పనులు పూర్తి చేశారని అన్నారు.