ramayana
-
రాకీ భాయ్ కాదు.. రావణ్ భాయ్..!
-
థాయ్ వెర్షన్ రామాయణం
ఇతిహాసాన్ని శక్తివంతమైన కథగా చెప్పడం, సాంస్కృతిక నేపధ్యంతో దానిని సజీవంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కళాకారుడికి అత్యంత సాహసోపైతమైన చర్య. దీనిని థాయ్లాండ్ కళాకారులు మన ఇతిహాసాన్ని తమ సంప్రదాయ కళారూపంతో మన దేశ రాజధానిలో ప్రదర్శించనున్నారు. భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి సహకారంతో రాయల్ థాయ్ ఎంబసీ ఖోన్ థాయ్ మాస్క్డ్ డ్యాన్స్ డ్రామాను న్యూఢిల్లీలో నిర్వహించనుంది. ఈ గ్రాండ్ ఈవెంట్ ఫిబ్రవరి 7, 2025న సాయంత్రం 6:30 గంటలకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లోని భీమ్ హాల్లో జరుగుతుంది.థాయిలాండ్ అత్యంత గౌరవనీయమైన కళారూపాలలో ఒకటైన ఖోన్, శాస్త్రీయ నృత్యం, లిరికల్ స్టోరీ టెల్లింగ్, ప్రత్యక్ష సాంప్రదాయ థాయ్ సంగీతాన్ని మిళితం చేస్తుంది. యునెస్కో చేత సాంస్కృతిక వారసత్వంగా గుర్తించబడింది. దుస్తులు, కొరియోగ్రఫీ, ఆధ్యాత్మిక వ్యక్తీకరణ ఈ నృత్యం ప్రత్యేకతలు. వారియర్ హనుమాన్ఈ ప్రదర్శనలో రామాయణం ఇతిహాసం నుండి హనుమాన్ ది మైటీ వారియర్ అనే ఎపిసోడ్ ఉంటుంది, ఇది హనుమంతుడి శౌర్యం, విధేయతను చూపే ఆకర్షణీయమైన కథ. ఈ కథ ఐదు దశలలో.. రావణుడిని ఓడించాలనే తపనతో రాముడికి సేవ చేయడానికి వాయు దేవుడు సృష్టించిన హనుమంతుడి దివ్య జననంతో ప్రారంభమవుతుంది. కథ ముందుకు సాగుతున్న కొద్దీ, హనుమంతుడి బాల్య దుశ్చర్య, రాముడి ఆశీర్వాదంతో అతని బలం తిరిగి వస్తుంది. సీతను రక్షించడానికి అతని అచంచలమైన నిబద్ధతను ఇది అన్వేషిస్తుంది. హనుమంతుడు, రాముడు వారి మిత్రులు రావణుడిపై విజయం సాధించే యుద్ధంతో కథనం ముగుస్తుంది. చారిత్రక సంబంధాలుఖోన్ థాయిలాండ్ రాజ ప్రాంగణాలలో భారతీయ ఇతిహాసం రామాయణంతో గల సంబంధం భారతదేశం– థాయిలాండ్ మధ్య గల లోతైన చారిత్రక సంబంధాలను తెలియజేస్తుంది. దీంతో పాటు తమ కళ ద్వారా వ్యక్తీకరణ హావభావాలు, శక్తివంతమైన కథ చెప్పడం తరతరాలుగా అందించిన గొప్ప సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తాయి. ఇది థాయ్ వారసత్వంలో ఒక ప్రతిష్టాత్మక అంశంగా మారుతుంది. భారతీయ ప్రేక్షకులకు థాయిలాండ్ సాంస్కృతిక వారసత్వం గొప్పతనాన్ని చూపిస్తుంది. ఇది ఉమ్మడి వారసత్వం, కళాత్మకత, రామకీన్, రామాయణ ఇతిహాసాల ద్వారా ప్రతిధ్వనించే భక్తి, శౌర్యం, సార్వత్రిక ఇతివృత్తాల వేడుక. రాయల్ థాయ్ ఎంబసీ, ఐసీసీఆర్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం రెండు దేశాల మధ్య సాంస్కృతిక వారధిగా పనిచేస్తుంది. -
హీరోకన్నా విలన్ కు ఎక్కువ పేమెంట్
ఏదైనా సినిమాకు సంబంధించి క్యాస్టింగ్ ఖర్చు లెక్క రాసుకుంటే టాప్ రెమ్యునరేషన్ హీరోకు ఉంటుంది.. తరువాత హీరోయిన్.. అలా ఉంటుంది చివరి రేటు విలన్ కు ఉంటుంది. కానీ ఈ సరికొత్త రామాయణం సినిమాకు సంబంధించి హీరో అయిన రాముడి పాత్రధారి కన్నా విలన్ అయినా రావణుడి పాత్రధారికే ఎక్కువ పేమెంట్ ఇస్తున్నారు. ఎక్కువ అంటే అలాంటిలాంటి పేమెంట్ కాదండి.. ఏకంగా రెండొందల కోట్లు ఇస్తున్నారు. ఇంతకూ ఎవరా రాముడు.. ఎవరా రావణుడు అనేదేగా మీ అనుమానం..బాలీవుడ్ నిర్మాత, నటుడు నితీష్ తివారి నిర్మిస్తున్న రామాయణం(Ramayana) సినిమాకు సంబంధించి హీరోగా అంటే శ్రీరాముడిగా రణబీర్ కపూర్ ను ఎంపిక చేయగా అందులో మరో ప్రధాన పాత్రధారి అయిన రావణుడిగా కేజీఎఫ్ సిరీస్ హీరోగా చేసి బాక్సాఫీస్ కొల్లగొట్టిన కన్నడ స్టార్ యష్(Yash) కు మాత్రం హీరోకన్నా ఎక్కువే చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. నటుడిగా ఇచ్చిన పారితోషికంతోబాటు డిస్ట్రిబ్యూషన్ హక్కులు.. అన్నీకలిపి మొత్తం రూ. 200 కోట్లవరకు యష్ కు ఇచ్చేనందుకు తివారీ అంగీకరించారట. ఇది హిందీ సూపర్ స్టార్లు అయినా సల్మాన్ ఖాన్.. అమీర్ ఖాన్.. షారూక్ ఖాన్ ల హీరోల పారితోషికం కన్నా ఎక్కువని తెలుస్తోంది.(చదవండి: తగ్గని శంకర్.. పెరిగిన బడ్జెట్)ఇటీవల ప్రభాస్(Prabhas) హీరోగా వచ్చిన కల్కి చిత్రంలో విలన్ గా నటించిన కమల్ హాసన్ కూడా రూ. 40 కోట్లలోపే తీసుకున్నారట. కానీ యష్ మాత్రం ఏకంగా రూ. 200 కోట్లు తీసుకోవడాన్ని చూసి బాలీవుడ్ సైతం షాక్ అయిందని అంటున్నారు. సల్మాన్ , షారూక్.. అమీర్ ఖాన్లు సైతం ఇంతవరకూ హీరో పారితోషికంతోబాటు డిస్ట్రిబ్యూషన్ హక్కులు సైతం తీసుకుంటారు. ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ వంటివి అన్నీ కలుపుకున్న వారికి ఇంతవరకూ.. రూ. 150 కోట్లు దాటలేదట. కానీ తన అసాధారణ నటనతో కన్నడ బాక్సాఫీస్ కొల్లగొట్టిన యష్ మాత్రం విలన్ పాత్రకోసం ఏకంగా రూ. 200 కోట్లు తీసుకుంటున్నట్లు నితీష్ తివారి అఫీస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక సూపర్ స్టార్లు కూడా ఈ మార్కును టచ్ చేయలేదంటే ఇక రణబీర్ కపూర్ పారితోషికం ఈయనతో సరికిపోల్చడం కూడా కుదరదు అంటున్నారు. ఇక షారూక్ వంటి స్టార్లతో సమానంగా పారితోషికం తీసుకున్నది సౌత్ ఇండియాలో ముగ్గురే ఉన్నారు. రజనీకాంత్, విజయ్ తలపతి , అల్లు అర్జున్ మాత్రమే ఒక్కో సినిమాకు రూ. 200 కోట్లు తీసుకుంటున్నారట . మొత్తానికి మన సౌత్ ఇండియన్ నటుడు యష్ విలన్ పాత్రలో రెండు వందలకోట్ల పారితోషికం తీసుకుని బాలీవుడ్ హీరోలకు సవాల్ విసిరారు.- సిమ్మాదిరప్పన్న -
అభిరామం నృత్యంతో చెప్పే రామాయణం : ఎవరీ ఐశ్వర్య హరీష్!
ఇతిహాసమైన రామాయణం అందం, భక్తి, సంక్లిష్టతలను ఐశ్వర్య హరీష్ ప్రదర్శించే భరతనాట్యం అన్వేషిస్తుంది. శాస్త్రీయ నృత్యాన్ని బహుభాషా కథనాలతో మిళితం చేసి మన ముందు ప్రదర్శిస్తుంది. రామాయణంలో తెలియని మరో కోణాన్ని ఆవిష్కరించడానికి ‘అభిరామం’ ప్రదర్శనను ఎంచుకున్నాను అని చెబుతుంది. ఐశ్వర్య హరీష్ పుట్టుకతోనే నృత్యకారిణి అని చెప్పవచ్చు. ఐదు తరాలుగా ఆ ఇంట నృత్యకళాకారులే ఉన్నారు. ఆ విధంగా చాలా చిన్న వయస్సు నుండి తన తల్లి ద్వారా శిక్షణ పొందుతూ ఐశ్వర్య తన స్వంత నృత్య కథల గురించి కలలు కంటూ పెరిగింది. ఇటీవల ముంబయ్లో ప్రఖ్యాత నేషనల్ సెంటర్ ఫర్ ది పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎన్సిపిఎ)లో ప్రదర్శన ద్వారా అబ్బురపరిచిన ఐశ్వర్య రామాయణాన్ని నృత్యంగా ఎందుకు ఎంచుకున్నానో వివరించింది.నృత్యంతో అన్వేషణ‘‘రాముడు నా ఇష్ట దేవత. నా చిన్నప్పుడు రాముని గంభీరమైన రూపం, అతనిపై పాట, పద్యం, నృత్యం ఏది నేర్చుకున్నా అది నన్ను ఉత్తేజపరిచింది. ఇటీవల, వ్యక్తిగత ఆధ్యాత్మిక సాధనగా వాల్మీకి రామాయణాన్ని దాని అనువాదంతో పాటు చదవడం ప్రారంభించాను. చదివేటప్పుడు కథలో ఇంకా ఏవో తెలియని అంశాల సారంశాం ఉందని గ్రహించాను. చాలా అన్వేషించని కోణాలు ఉన్నాయి. ప్రతి క్యారెక్టర్లోనూ రసాలు ఎక్కువ. ఇది నాకు నృత్యంలో అన్వేషించాలనే ఆలోచనను ఇచ్చింది. రామాయణానికి చాలా వెర్షన్లు ఉన్నాయి. అందుకే నా పరిశోధన విస్తృతం చేశాను. దీంతో అనేక అవకాశాలు నాకు లభించాయి. అన్ని వెర్షన్లు కథాంశం చెక్కుచెదరకుండా ఉన్నప్పటికీ, ప్రతి ఒక్కటి విభిన్న దృష్టి, రుచిని కలిగి ఉన్నాయి. ఉదాహరణకు– వాల్మీకి రామాయణం రాముడిని మానవ శ్రేష్ఠతగా చూస్తే, అధ్యాత్మ రామాయణం అతనిని అంతిమ భగవంతునిగా, అద్భుతంగా చూసింది. రామాయణంలో సీత పాత్రకు భిన్నమైన టేకింగ్ ఉంది.ఆత్మను కదిలించాలిఅభిరామం నృత్య రూపకం వివిధ రామాయణ గ్రంథాల నుండి సేకరించిన ఆరు అరుదైన ఎపిసోడ్లను వర్ణిస్తుంది. రామాయణం భారతీయ మనస్తత్వంలో చాలా పాతుకుపోయింది కాబట్టి, నేను కథ టైమ్లైన్ను నిర్వహించాలనుకున్నాను. రాముడి కథ ప్రతి మట్టిని దాని స్వంత ఫ్లేవర్లో తాకింది. నేను దానిని ఉపదేశాత్మకంగానో, సాదాసీదాగానో స్తుతించేలనుకోలేదు. శృంగార భక్తి కోణాన్ని కొనసాగించాను. అదే నన్ను మొదటి స్థానంలో ప్రాజెక్ట్లోకి తీసుకువచ్చింది. ఎక్కడి నుంచైనా ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని, దానిని మరో కోణంలో వివరిస్తే అది వినోదభరితంగా ఉండాలి అలాగే ఆత్మను కదిలించాలి. ప్రేక్షకుల ఊహల మైదానంలో ఆ అంశం తిరగాలి. నేను ఎంచుకున్న కథ మాత్రమే కాదు నా డ్యాన్స్ ఎలిమెంట్ను కూడా కోల్పోకూడదు. దీన్ని మరింత థియేట్రికల్ ప్రెజెంటేషన్గా మార్చాలనుకున్నాను. ఆకర్షించిన అంశాలుమొదట వాల్మీకి రామాయణాన్నే చదివాను. మా అమ్మ అప్పటికే తులసీదాస్ రచనలపై కొంత పరిశోధన చేసింది. అలా తులసి రామాయణం నుండి నాకు నచ్చిన అంశాలను సేకరించడానికి అది ఒక కిటికీలా ఉపయోగపడింది. కౌసల్య తన నవజాత శిశువుతో చేసిన మొదటి సంభాషణ నన్ను అమితంగా ఆకర్షించింది. అదేవిధంగా, రావణుడి పాత్రను చూస్తే విష్ణువు దైవిక బలాన్ని ఎదుర్కోవడంలో పూర్తి జ్ఞానంతో అతను సీతను అపహరించాడు. రావణుడు మోక్షానికి తన ఏకైక సాధనం – భగవంతుడి చేతిలో మరణం ఇదేనని గ్రహించాడు. తులసీరామాయణం రాముడు, సీత స్వయంవరం, వారి కలయిక గురించి చాలా అందంగా, సుందరంగా కవితాత్మకంగా అన్వేషించబడింది. రావణుడి సోదరి శూర్పణఖ సీతను అపహరించడానికి, ఆమె చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి తన సోదరుడిని ప్రేరేపించడం ద్వారా రామాయణంలో మలుపు తిరిగింది. అరుణాచల కవి తమిళంలో రామనాటకంలో ఈ క్యారెక్టరైజేషన్ని చాలా అందంగా చూపించాడు, రాక్షసి బెంగను అనుభూతి చెందాడు. ప్రొడక్షన్లో ఇది మూడో ఎపిసోడ్గా తీసుకోబడింది. కథను ఇలా ముందుకు తీసుకెళ్తుంటే హనుమంతుని అద్భుతమైన చర్యలు, సెయింట్ పురందర దాసు కన్నడ పద్యాల పదునుగా బయటకు వచ్చాయి. తల్లే గురువుమా అమ్మ నా గురువుగా ఉండటం నాకు దొరికిన అద్భుతమైన ఆశీర్వాదం. చిన్నతనం నుండే సాంప్రదాయ సంగీతం, నృత్యం, కథల రూపంలో ఉండే సాహిత్యం, ఏదైనా సాధించాలనే కల, క్రమశిక్షణతో కూడిన ఆలోచనలతో ఉన్నాను. పరిపూర్ణత గురించి ఎప్పుడూ చర్చలు ఉండకూడదు. అలాగే, నాణ్యతలో ఎప్పుడూ రాజీ పడకూడదు. ఇది నా వారసత్వాన్ని చెక్కుచెదరకుండా కొనసాగించే సవాల్, మరింత పరిపూర్ణత కోసం పట్టుదలతో కూడిన బాధ్యత. దానిని స్వీకరించి ముందు తరాలకు ఇవ్వాలనే నిబద్ధతో కృషి చేస్తున్నాను. కూర్పులో సవాల్ప్రతి ఎపిసోడ్ లోనూ కథనంలో మార్పు లేకుండా అందులోని అందాన్ని బయటకు తీసుకురావడానికి ప్రయత్నించాం. సంగీతం, నృత్యం అన్నీ వేర్వేరు వ్యక్తులచే కం΄ోజ్ చేయబడ్డాయి. కౌసల్య వాత్సల్యమైనా, రాముడు– సీతల శృంగారమైనా, సీత వైభవం, హనుమంతుడి సుందరకాండ ఇలా ప్రతీది ‘అందం’లోని అంశమే ఈ నృత్యంలో ప్రత్యేకంగా నిలుస్తుంది’’ అని వివరిస్తుంది ఐశ్యర్వ. -
అరబిక్లో రామాయణ భారతాలు..అనువాదకులతో ప్రధాని భేటీ
కువైట్సిటీ: ప్రధాని మోదీ కువైట్ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా శనివారం(డిసెంబర్21) రామాయణ మహాభారతాలను అరబిక్లో అనువదించిన అబ్దుల్లా అల్ బరూన్,ఈ ఇతిహాసాల అరబిక్ వెర్షన్లను ప్రచురించిన అబ్దుల్ లతీఫ్ అల్ నెసెఫ్లను కలిశారు. తనకు రామాయణమహాభారతాలను అరబిక్లో అనువదించేందుకు రెండు సంవత్సరాల 8 నెలలు పట్టిందని అల్ బరూన్ అన్నారు. తాము ప్రచురించిన అరబిక్ రామాయణ మహాభారత పుస్తకాలను ప్రధాని మోదీ చూసి సంతోషించారని,రెండు పుస్తకాలపై ఆయన సంతకం చేశారని ప్రచురణకర్త అబ్దుల్లతీఫ్ అల్నెసెఫ్ చెప్పారు. అల్బరూన్,అల్నెసెఫ్ ప్రపంచంలోని ముప్పై దాకా గొప్ప కావ్యాలను అరబిక్లో ప్రచురించారు. 43 ఏళ్లలో భారత ప్రధాని కువైట్లో పర్యటించడం ఇదే తొలిసారి. కువైట్లో ప్రధాని రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. గతంలో ప్రధాని మన్కీబాత్లో కూడా అరబిక్లో రామాయణ మహాభారతాలను అనువదించిన ఇద్దరి గురించి ప్రస్తావించడం గమనార్హం. #WATCH | Kuwait | Ramayana and Mahabharata published in Arabic language; Abdullateef Alnesef, the book publisher and Abdullah Baron, the translator of Ramayana and Mahabharata in the Arabic language, met PM Narendra Modi in Kuwait CityAbdullateef Alnesef, the book publisher… pic.twitter.com/jO3EqcflXJ— ANI (@ANI) December 21, 2024 మా తాతను కలవండని ఓ నెటిజన్ విజ్ఞప్తి.. కలిసిన ప్రధాని ప్రధాని మోదీ కువైట్ పర్యటన నేపథ్యంలో కువైట్లో ఉంటున్న తన తాత,రిటైర్డ్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఉద్యోగి మంగళ్ సేన్ హండా (101)ను కలవండని ఎక్స్(ట్విటర్)లో ఓ నెటిజన్ ప్రధాని మోదీని విజ్ఞప్తి చేశారు. ఆయనను తప్పకుండా కలుస్తానని బదులిచచ్చిన మోదీ కువైట్ చేరుకున్న అనంతరం మంగల్సేన్హండాను కలిశారు. — Narendra Modi (@narendramodi) December 21, 2024 -
అలాంటి వార్తలు రాస్తే లీగల్ నోటీసులు పంపిస్తా..సాయి పల్లవి వార్నింగ్
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి పుడ్ విషయం చాలా జాగ్రత్తగా ఉంటుంది. చిన్నతనం నుంచే ఆమె వెజిటేరియన్. బయట పదార్థాలు ఎక్కువగా తినదు. ఈ విషయం ఆమె చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పింది. కానీ ఇప్పుడు ఆమె తిసుకునే ఫుడ్పై రకరకాలు పుకార్లు పుట్టుకొస్తున్నాయి. రామాయణ మూవీ కోసమే సాయి పల్లవి నాన్ వెజ్ తినడం లేదని ఓ తమిళ మీడియా రాసుకొచ్చింది. ఆ సినిమా కోసమే చాలా రోజులుగా బయటి ఫుడ్ తినడం లేదని అందులో పేర్కొంది. దీనిపై సాయి పల్లవి తీవ్ర స్థాయిలో మండిపడింది. (చదవండి: పుష్పరాజ్ వసూళ్ల సునామీ.. ఆరు రోజుల్లోనే రప్ఫాడించాడు!) వాస్తవలు తెలియకుండా ఇలాంటి పిచ్చి పిచ్చి వార్తలు రాయకండని వార్నింగ్ ఇచ్చింది. తాను అసలు రూమర్లు, బేస్ లెస్ వార్తల్ని చూసి పట్టించుకోనని, కానీ ఇప్పుడు ఇలాంటి పిచ్చి రాతల్ని చూసి మాట్లాడకతప్పని పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చింది.తెలిసి రాస్తారో.. తెలియకుండా రాస్తారో.. వ్యూస్ కోసం రాస్తారో.. అదంతా దేవుడికే తెలియాలి.. ఇలానే ఇకపై రాస్తామంటే మాత్రం కుదరదు.. ఇక్కడితో ఆపేయండి.. నా సినిమా రిలీజ్ టైంలో ఇలాంటివి రాస్తే ఊరుకునేది లేదు.. అవన్నీ నాకు చాలా స్పెషల్ మూమెంట్స్.. మీరు ఇలాంటి వార్తలు రాసి కష్టాలు కొనితెచ్చుకోకండి.. ఇదే చివరి ఛాన్స్.. ఇకపై ఇలాంటి వార్తలు రాస్తే లీగల్ నోటీసులు పంపిస్తాను అంటూ సాయి పల్లవి వార్నింగ్ ఇచ్చింది.Most of the times, Almost every-time, I choose to stay silent whenever I see baseless rumours/ fabricated lies/ incorrect statements being spread with or without motives(God knows) but it’s high-time that I react as it keeps happening consistently and doesn’t seem to cease;… https://t.co/XXKcpyUbEC— Sai Pallavi (@Sai_Pallavi92) December 11, 2024 -
రెండు భాగాలుగా 'రామాయణ’ విడుదలపై ప్రకటన
-
రెండు భాగాలుగా 'రామాయణ'.. విడుదలపై ప్రకటన
భారత ఇతిహాసాలను వెండితెరపై చూపించాలంటే పెద్ద సాహసమేనని చెప్పాలి. ఈ క్రమంలో వచ్చిన చిత్రాలు ఇప్పటకే చాలావరకు విజయాన్ని అందుకున్నాయి. బాలీవుడ్ తెరకెక్కిస్తున్న 'రామాయణ' గురించి ఒక ప్రకటన వచ్చింది. ఈ చిత్రం గురించి ఇప్పటికే కన్నడ స్టార్ యశ్ పలు విషయాలను పంచుకున్నాడు. ఇప్పుడు పోస్టర్స్ విడుదల చేస్తూ విడుదల తేదీలను కూడా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.దంగల్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రామాయణ' చిత్రంలో రణ్బీర్కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రావణుడిగా కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్నారు. హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్సింగ్ కనిపించనున్నట్లు ప్రచారం ఉంది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యశ్ నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నాయి. రెండు భాగాలుగా ఈ చిత్రం నిర్మిస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. 2026 దీపావళికి మొదటి భాగం, 2027 దీపావళికి రెండో భాగం విడుదల చేస్తున్నట్లు పోస్టర్స్ను కూడా పంచుకున్నారు.ఈ సినిమాలో తాను పోషించనున్న రాముడి పాత్ర ఆహార్యం కోసం రణ్బీర్ కపూర్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకోనున్నారు. డైలాగ్స్ స్పష్టంగా పలికేందుకు కూడా డైలాగ్ డిక్షన్లో రణ్బీర్ ప్రత్యేక శిక్షణ పొందారు. ఈ విషయంపై ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ పాత్ర కోసం ప్రత్యేక శిక్షణతో పాటు డైట్ కూడా ఫాలో అవుతున్నట్లు తెలిపారు. రాముడి పాత్రలో నటిస్తుండటం వల్ల తాను మద్యపానం మానేసినట్లు చెప్పారు. ఇదే సమయంలో సీత పాత్రలో నటిస్తున్న సాయిపల్లవి కూడా పలు విషయాలను పంచుకున్నారు. సీతమ్మ పాత్రలో నటించే అవకాశం దక్కడం తన అదృష్టమని సాయిపల్లవి పేర్కొన్నారు. ఒక నటిగా కాకుండా భక్తురాలిగా నటిస్తున్నట్లు తెలిపారు. -
రామాయణ, భారత, భాగవతాల తెలుగు ఆడియోలు ఆవిష్కరణ
సాక్షి, తిరువనంతపురం: గజల్ శ్రీనివాస్ గానం చేసిన రామాయణ, భారత, భాగవతాల తెలుగు ఆడియోలను జ్యోతిర్ మఠ్ శంకరాచార్య శ్రీ అవి ముక్తేశ్వరానంద సరస్వతి ఆవిష్కరించారు.పోతన విరచిత భాగవతంలోని ముఖ్య 108 పద్యాలు, కవిత్రయం రచించిన ఆంధ్ర మహాభారతంలోని ముఖ్య 108 పద్యాలు, డా.ముకుంద శర్మ వ్రాసిన గేయ రామాయణాల ఆడియోలను ఉత్తరాఖండ్ జ్యోతిర్ మఠ్ శంకరాచార్య శ్రీ అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామీ తిరువనంతపురం (కేరళ) పద్మనాభ స్వామి వారి ఏకాంత దర్శన అనంతరం వేలాది మంది భక్తుల సమక్షంలో ఆవిష్కరించారు.మన సనాతన ధర్మంలో అతి ముఖ్యమైన రామాయణ, భారత, భాగవతాల తెలుగు ఆడియోలను ఒకే రోజు ఆవిష్కరించడం అతి గొప్ప ధార్మిక కార్యక్రమం అని, వీటిని స్వరపరచి సందర్భ, తాత్పర్య సహితంగా అందరికీ అర్ధమయ్యేలా గానం చేసిన డా.గజల్ శ్రీనివాస్ అభినందనీయుడని శంకరాచార్య అన్నారు. ఆడియో తొలి ప్రతులను సి.ఎల్.రాజం దంపతులకు, మిజోరమ్ పూర్వ గవర్నర్ కుమ్మనం రాజ శేఖర్లకు స్వామి అందించారు. -
వాగులో కొట్టుకుపోయిన ఉపాధ్యాయులు
పార్వతీపురం మన్యం: వృత్తి రీత్యా రాష్ట్రాలు దాటి వచ్చిన ఇద్దరు ఉపాధ్యాయులు వాగులో కొట్టుకుపోయారు. వీరిలో ఒకరు మృతిచెందగా, మరొకరి ఆచూకీ తెలియాల్సి ఉంది. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో శుక్రవారం జరిగిన ఘటనకు సంబంధించి ఎస్ఐ నారాయణరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సరాయివలస ఏకలవ్య మోడల్ స్కూల్లో వార్డెన్గా మహేష్, సోషల్ టీచర్గా ఆర్తి పనిచేస్తున్నారు. వీరిది హరియాణ రాష్ట్రం. ఎప్పటివలే శుక్రవారం విధులు ముగించుకుని స్థానికంగా గురివినాయుడుపేట గ్రామంలో తమ నివాసాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ద్విచక్రవాహనంపై మహేష్, ఆర్తి ఇద్దరూ సాయంత్రం 4 గంటల సమయంలో గురివినాయుడుపేట వైపు వస్తుండగా, మార్గమధ్యంలోని రాయిమానువాగు దాటే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఇద్దరూ కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. ఆర్తి మృతదేహం లభ్యం కాగా.. మహేష్ ఆచూకీ దొరకలేదు. మహేష్ వాగులోని చెట్టుకొమ్మ సాయంతో బయటపడి వాగు అంచును పట్టుకొన్నప్పటికీ.. ఆ అంచు జారిపోవడంతో మళ్లీ వాగులో పడి కొట్టుకుపోయాడని స్థానికులు చెబుతున్నారు. -
రామాయణ...సాయి పల్లవికి రికార్డ్ స్థాయి రెమ్యూనరేషన్..
-
భారత్.. దేశం కాదు ఉపఖండం
చెన్నై: తమిళనాడుకు చెందిన అధికార డీఎంకే సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా మరో వివాదానికి ఆజ్యం పోశారు. బీజేపీ సిద్ధాంతాలైన భరతమాత, జైశ్రీరామ్ను తమిళనాడు ఎప్పటికీ స్వీకరించబోదని, అవి తమకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఇండియా ఒకే దేశం కాదని, ఇదొక ఉపఖండం మాత్రమేనని అన్నారు. ఒకే దేశం అయితే దేశమంతటా ఒకే భాష ఉండాలని చెప్పారు. మధురైలో మంగళవారం డీఎంకే కార్యక్రమంలో ఎ.రాజా ప్రసంగించారు. ‘‘రాముడికి శత్రువు ఎవరు? రాముడి గురించి, రామాయణం గురించి నాకు అంతగా తెలియదు. వాటిపై నాకు నమ్మకం లేదు. రాముడు సీతతో కలిసి అడవికి వెళ్లాడని చిన్నప్పుడు మా తమిళ టీచర్ చెప్పారు. ఒక వేటగాడిని, సుగ్రీవుడిని, విభీషణుడిని రాముడు తన సోదరులుగా స్వీకరించాడు. ఇందులో కులం, మతం ప్రసక్తి లేదని అర్థమవుతోంది. ఇండియా ఒకే దేశమని అంటున్నారు. ఒకే దేశమైతే ఒకే భాష, ఒకే సంప్రదాయం, ఒకే సంస్కృతి ఉండాలి. ఇండియాలో అలా లేదు కాబట్టి ఇదొక ఉపఖండం. ఇండియా గతంలో ఎన్నడూ ఒక దేశంగా లేదు. తమిళనాడు, కేరళ, ఢిల్లీ, ఒడిశా తదితర రాష్ట్రాల్లో వాటి సొంత సంస్కృతులు ఉన్నాయి. భిన్న జాతులు, భాషలు, సంస్కృతుల సమాహారమే ఇండియా. ఇక్కడ ఒక సామాజిక వర్గం ప్రజలు గొడ్డు మాంసం తింటారు. లోక్సభ ఎన్నికల తర్వాత తమిళనాడులో డీఎంకే ఉండదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటున్నారు. తమిళనాడులో డీఎంకే లేకపోతే అసలు భారతదేశమే ఉండదు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే.. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే భారతదేశ రాజ్యాంగమే ఉండదు. రాజ్యాంగం లేకపోతే దేశం కూడా మనుగడ కోల్పోతుంది. భారతదేశం లేకపోతే తమిళనాడు రాష్ట్రం ఉండదు. దేశం నుంచి మేము విడిపోతాం. ఇలా జరగాలని భారతదేశం కోరుకొంటోందా?’’ అంటూ ఎ.రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజాను వెంటనే అరెస్టు చేయాలి డీఎంకే నేత ఎ.రాజా వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను తక్షణమే అరెస్టు చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డీఎంకే నాయకులు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం మానుకోవడం లేదని బీజేపీ నేత∙అమిత్ మాలవీయా విమర్శించారు. సనాతన ధర్మం గురించి ఉదయనిధి స్టాలిన్ అనుచితంగా మాట్లాడారని చెప్పారు. దేశాన్ని ముక్కలు చేయాలన్నదే డీఎంకే నేతల కుటిల యత్నమని మండిపడ్డారు. రాజాపై కఠిన చర్యలు తీసుకోవాలని తిమళనాడు డీఎంకే అధికార ప్రతినిధి తిరుపతి అన్నారు. రాజా వ్యాఖ్యలను డీఎంకే మిత్రపక్షం కాంగ్రెస్ సైతం ఖండించింది. మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని సూచించింది. రాజా వ్యాఖ్యలతో విభేదిస్తున్నానని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాతే చెప్పారు. -
శూర్పణఖ?
రామాయణం ఆధారంగా హిందీలో దర్శకుడు నితీష్ తివారి ఓ భారీ బడ్జెట్ ట్రయాలజీ ఫిల్మ్ను తెరకెక్కించనున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండేళ్లుగా జరుగు తున్న ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ తుది దశకు చేరుకున్నాయి. దీంతో నితీష్ తివారి ఈ సినిమాలోని నటీనటుల ఎంపికపై దృష్టి సారించారు. ఈ సినిమాలోని రాముడి పాత్రలో రణ్బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, హనుమంతునిగా బాబీ డియోల్, విభూషణుడిగా విజయ్ సేతుపతి, రావణుడిగా యశ్ నటిస్తారనే ప్రచారం సాగుతోంది. తాజాగా శూర్పణఖ పాత్రలో రకుల్ప్రీత్ సింగ్ నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. రకుల్కు ఆల్రెడీ నితీష్ స్టోరీ చెప్పారని, లుక్ టెస్ట్ కూడా పూర్తయిందని టాక్. కాగా ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన ఈ వేసవిలో రానుందని, 2025 చివర్లో తొలి భాగం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని బాలీవుడ్ టాక్. మరోవైపు ఈ నెలలో రకుల్ప్రీత్ సింగ్ వివాహం జాకీ భగ్నానీతో జరగనుంది. -
రామాయణంలో రకుల్.. ఆ పాత్రకు సెట్ అయ్యేనా?
రకుల్ ప్రీత్ సింగ్.. ఒకప్పుడు టాలీవుడ్లో ఈ పేరు మారుమ్రోగింది. వరుస సినిమాల్లో నటిస్తూ తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ మొదలు రవితేజ లాంటి స్టార్ హీరోల వరకు అందరితో రకుల్ నటించింది. ఇక్కడ వచ్చిన ఫేమ్తో బాలీవుడ్కు చక్కెసింది. అక్కడ అనుకున్న స్థాయిలో క్లిక్ కాలేదు. ఇటీవల అయితే ఈ బ్యూటీకి అటు బాలీవుడ్తో పాటు ఇటు టాలీవుడ్లోనూ ఒక్క సినిమా లేదు. తాజాగా తమిళ్లో అలయాన్ సినిమాతో ఓ మోస్తరు కమర్షియల్ హిట్ అందుకుంది. అయినా కూడా ఈ బ్యూటి చేతికి పెద్ద ప్రాజెక్టులు రాలేదు. దీంతో వెస్ సిరీస్ల మీదనే ఎక్కువ దృష్టిపెట్టింది. ఇక వెండితెరకు రకుల్ దూరమైనట్లే అనుకుంటున్న సమయంలో ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఓ భారీ పాన్ ఇండియా సినిమాలో రకుల్ నటించబోతుందని ఆ వార్త సారాంశం. (చదవండి: పెళ్లయి ఏడాది కూడా కాలేదు, అంతలోనే నటి విడాకులు!) బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారి రామాయణాన్ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ ప్రొడ్యూసర్లతో కలిసి నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే కాస్టింగ్ పనులు ప్రారంభం అయ్యాయి. ఇందులో రాముడిగా రణ్బీర్ కపూర్ నటించబోతున్నారు. సీత పాత్రలో సాయి పల్లవి లేదా జాన్వీ కపూర్ నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. హనుమంతుడిగా నటించేందుకు సన్నీ డియోల్ అంగీకారం తెలిపాడు. తాజాగా మరో కీలకమైన పాత్ర కోసం మేకర్స్ రకుల్ని సంప్రదించారట. రామాయణంలో కీలకమైన శూర్పణఖ పాత్రను రకుల్ పోషిస్తున్నట్లు సమాచారం. ఈ పాత్ర కోసం మేకర్స్ ఆమెను సంప్రదించగా..వెంటనే ఓకే చెప్పిందట. త్వరలోనే లుక్ టెస్ట్ నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో రావణుడిగా యష్, విభీషణుడిగా విజయ్ సేతుపతి నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
రాముడి కోసం శిక్షణ
భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా హిందీలో ‘రామాయణ’ అనే సినిమా రూపొందనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మూడు భాగాలుగా రానున్న ఈ చిత్రంలో రాముడి పాత్రలో రణ్బీర్ కపూర్, సీత పాత్రలో సాయిపల్లవి, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, రావణుడి పాత్రలో యశ్ నటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాది వేసవిలో ప్రారంభించాలనుకుంటున్నారట. ఈ సినిమాలో తాను పోషించనున్న రాముడి పాత్ర ఆహార్యం కోసం రణ్బీర్ కపూర్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకోనున్నారని బాలీవుడ్ సమాచారం. డైలాగ్స్ స్పష్టంగా పలికేందుకు కూడా డైలాగ్ డిక్షన్లో రణ్బీర్ ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారట. ఇక ఈ సినిమాను నమిత్ మల్హోత్రా, మధు మంతెన, అల్లు అరవింద్లు భారీ బడ్జెట్తో నిర్మిస్తారనే ప్రచారం సాగుతోంది. మరోవైపు హిందీలో ‘లవ్ అండ్ వార్’, ‘బ్రహ్మాస్త్రం’, ‘యానిమల్’ ఫ్రాంచైజీలు కమిటయ్యారు రణ్బీర్ కపూర్. -
తిరుమలలో నేడు రామాయణ పారాయణం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 9 కంపార్ట్మెంట్లు నిండాయి. నిన్న ఆదివారం 77,334 మంది స్వామివారిని దర్శించుకోగా 23,694 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.04 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతుండగా, దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. తిరుమలలో నేడు రామాయణ పారాయణం తిరుమలలోని ధర్మగిరి వేదపాఠశాలలో సోమవారం సంపూర్ణ రామాయణ పారాయణం కార్యక్రమాన్ని టీటీడీ నిర్వహించనుంది. అయోధ్యలో సోమవారం రామాలయంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు రామాయణ పారాయణం నిర్వహించనున్నారు. అయోధ్యలో ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగే ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని ఎస్వీబీసీ తమిళం, కన్నడ, హిందీ ఛానళ్లతో పాటు యూట్యూబ్ తెలుగు ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఎస్వీబీసీ తెలుగు ఛానల్లో తిరుమలలోని కళ్యాణోత్సవం అనంతరం 12 గంటల నుంచి అయోధ్య కార్యక్రమాలు ప్రత్యక్షప్రసారం కానున్నాయి. భక్తులు ఈ విషయాలను గమనించి ఎంతో వైభవంగా, ఆగమోక్తంగా జరిగే అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమాలను ఎస్వీబీసీ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ ఛానళ్లలో వీక్షించి తరించాలని భక్తలోకానికి టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. -
పంపాతీరం గుర్తుకు రావడంతో హనుమంతుడు ఒక్కసారిగా..!
రామావతారం పరిసమాప్తమైన తర్వాత హనుమంతుడు గంధమాదన పర్వతానికి వెళ్లిపోయాడు. కపివీరుల్లో కొందరు ముఖ్యులు కూడా కిష్కిందకు వెళ్లకుండా ఆ పర్వత పరిసర ప్రాంతాల్లోనే ఉండసాగారు. ఒకనాడు హనుమంతుడికి పంపా తీరానికి వెళ్లాలనిపించింది. సుగ్రీవుడి కొలువులో ఉండగా మొదటిసారిగా రామలక్ష్మణులను కలుసుకున్నది పంపా పరిసర ప్రాంతాల్లోనే! రామునితో సుగ్రీవునికి మైత్రి కుదరిన ప్రదేశం అదే! పంపాతీరం గుర్తుకు రావడంతోనే హనుమంతుడు తన వాహనమైన ఒంటె మీద బయలుదేరాడు. అతడి ప్రయాణాన్ని గమనించిన సుషేణుడు, నలుడు, నీలుడు, జాంబవంతుడు తదితర కపివీరులందరూ అతణ్ణి అనుసరించారు. తోవ పొడవునా భక్తులు బారులుతీరి ఎక్కడికక్కడ హనుమంతునికి నీరాజనాలు పలికారు. కొందరు ఆయన దీవెనలందుకుని ఇళ్లకు మళ్లితే, ఇంకొందరు ఆయనను అనుసరించి ప్రయాణించసాగారు. హనుమంతుడు పంపాతీరానికి విచ్చేస్తున్న సమాచారం తెలుసుకుని, సమీపంలోని కిష్కిందరాజ్యంలో ఉంటున్న వానరులు, పంపాతీరంలోని తాపసులు అక్కడకు చేరుకుని, ఆయనకు ఘనస్వాగతం పలికారు. హనుమంతుడు పంపాతీరంలో కొలువుతీరాడు. అక్కడే ఒక చెట్టు కింద శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి, రోజూ పంపా సరోవరంలో స్నానమాచరించి, శ్రీరాముడి విగ్రహానికి పూజలు చేసేవాడు. తాపసులతో కొలువుదీరి, వారితో వేదశాస్త్ర చర్చలు సాగించేవాడు. వారి ద్వారా పురాణగాథలు వింటూ కాలక్షేపం చేసేవాడు. హనుమంతుడు పంపాతీరంలో కొలువుదీరిన కొద్దిరోజులకు మహతి మీటుతూ నారద మహర్షి అక్కడకు వచ్చాడు. నారదుడి రాక గమనించిన హనుమంతుడు ఆయనకు స్వయంగా ఎదురేగి స్వాగతం పలికాడు. ఉచితాసనం మీద కూర్చుండబెట్టి, పండ్లు, తేనె తెచ్చి ఇచ్చి అతిథి సత్కారాలు చేశాడు. ‘మహాత్మా! భక్తాగ్రేసరుడవైన నీ రాకతో పంపాతీర ప్రాంతమంతా పావనమైంది. త్రిలోక సంచారివి అయిన నీవెరుగని విశేషాలు ఉండవు. నేను తెలుసుకోదగిన విషయమేదైనా ఉంటే సెలవివ్వు’ అని వినమ్రంగా అడిగాడు హనుమంతుడు. ‘అంజనానందనా! నీవు శివాంశ సంభూతుడవు, రామమంత్ర మహిమాన్వితుడవు, లోకపూజ్యుడవు. మాబోటి మునిగణాలతో పూజలందుకోవడానికి సర్వవిధాలా అర్హుడవు. నీవు ఇంత వినతుడవై నన్ను పూజించడం నాకే ఆశ్చర్యంగా ఉంది. నిన్ను ఒకసారి చూసిపోవాలని, నీ చెవిన ఒక మాట చెప్పాలని ఇక్కడకు వచ్చాను’ అన్నాడు నారదుడు. ‘చెప్పు మునివరా!’ అన్నాడు హనుమంతుడు. ‘రామావతార కాలంలో దానవుల దాష్టీకాలు దాదాపుగా అంతమొందాయి. అయితే, దానవ వంశం మళ్లీ బలం పుంజుకుంటోంది. అమాయక జనాలను పీడిస్తోంది. అసిరోముడనే రాక్షసుడు జనాలను నానా విధాల పీడించి, చచ్చాడు. వాడి తర్వాత వాడి కొడుకు త్రిశూలరోముడు రాక్షసరాజ్యానికి రాజయ్యాడు. శివుడి ద్వారా వాడు వరాలు పొందాడు. వాడు ఈ ప్రాంతంలోనే సంచరిస్తున్నాడు. యజ్ఞయాగాది క్రతువులకు అడుగడుగునా అడ్డు తగులుతూ, మునిజనులను నానావిధాలుగా హింసిస్తున్నాడు’ అని చెప్పాడు నారదుడు. ‘మునివరా! ఎంతో శ్రమతీసుకుని ఇక్కడకు వచ్చారు. కాసేపు విశ్రమించండి. ఆ రాక్షసుడి సంగతి నేను చూసుకుంటాను’ అన్నాడు హనుమంతుడు. నారదుడు కొద్దిసేపు అక్కడే విశ్రమించి, హనుమంతుడి వద్ద వీడ్కోలు పుచ్చుకుని బయలుదేరాడు. కొద్దిరోజుల్లో పంపాతీరంలో ఉంటున్న మునులు యజ్ఞం తలపెట్టారు. హోమగుండం ఏర్పాటు చేసి, వేదమంత్రాలు పఠిస్తూ, హవిస్సులను స్వీకరించడం కోసం దేవతలను ఆహ్వానిస్తున్నారు. వారి వేదగానాన్ని రహస్యంగా వినడానికి హనుమంతుడు ఒక చెట్టుపైకి ఎక్కి, నక్కి కూర్చుకున్నాడు. ఆ సమయంలో కలకలం మొదలైంది. ‘దేవతలెవరు? దేవతలకు దేవుణ్ణి నేనే! హోమగుండంలో వేసే హవిస్సులను నేనే గ్రహిస్తాను’ అని కేకలు వేస్తూ, ఒక భీకరాకారుడు దట్టమైన చెట్లను దాటుకుని వచ్చి, అక్కడ ప్రత్యక్షమయ్యాడు. వాడే త్రిశూలరోముడు. వాడిని చూడగానే హోమగుండం వద్దనున్న మునులు హాహాకారాలు చేస్తూ పరుగులు ప్రారంభించారు. హోమసంభారాలను గ్రహించడానికి త్రిశూలరోముడు ముందుకు కదిలాడు. చెట్టు మీద కూర్చుని ఉన్న హనుమంతుడు తన వాలాన్ని వాడి మీదకు విసిరి, వాలంతో చుట్టి బంధించాడు. జరుగుతున్నదేమిటో గ్రహించేలోగానే వాడి మీదకు ఒక్కసారిగా దూకాడు. త్రిశూలరోముడు తిరగబడ్డాడు. ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. చుట్టూ ఉన్న మునులు నివ్వెరపోయి చూడసాగారు. హనుమంతుడి ముష్టిఘాతాలకు తాళలేక త్రిశూలరోముడు ఒక పెంకులా మారి, రాతి లోపల దాగాడు. అది గమనించిన హనుమంతుడు, తన పిడికిటి పోటుతో పెంకు దాగిన రాతిని ఛిన్నాభిన్నం చేశాడు. ఆ దెబ్బకు త్రిశూలరోముడు నిజరూపం దాల్చి నెత్తురు కక్కుతూ ప్రాణాలు విడిచాడు. అలా పంపాతీరంలోని మునులకు రాక్షసపీడ విరగడైంది. తర్వాత అక్కడ కొన్నాళ్లు గడిపిన హనుమంతుడు తిరిగి గంధమాదన పర్వతానికి వెళ్లిపోయాడు. సాంఖ్యాయన (చదవండి: భగవంతుడుకి పూజలు, వ్రతాలు కంటే అదే అత్యంత ముఖ్యం! అందులోనూ..) -
ఆదిపురుష్: ఆ జిల్లాలోని ప్రతి రామాలయానికి 101 టిక్కెట్లు
‘ఆదిపురుష్’ సినిమా కోసం పాన్ ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఓమ్ రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతీసనన్ సీతగా నటించారు. భూషణ్ కుమార్, క్రిష్ణకుమార్, ఓమ్ రౌత్, ప్రసాద్ సుతారియా, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 16న విడుదలవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ రిలీజ్ చేస్తోంది. ‘రామాయణ పారాయణం జరిగే ప్రతి చోటుకి హనుమంతుడు విచ్చేస్తాడు అనేది మన నమ్మకం. ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ ‘ఆదిపురుష్’ సినిమాని ప్రదర్శించే ప్రతి థియేటర్లో ఒక సీటు విక్రయించకుండా హనుమంతుడి కోసం ప్రత్యేకంగా కేటాయిస్తున్నాం’ అంటూ యూనిట్ ఇటీవల ప్రకటించింది. ఈ మంచి కార్యాన్ని తమవంతుగా ప్రోత్సహిస్తూ శ్రేయాస్ మీడియా వారు మరో నిర్ణయం తీసుకున్నారు. ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి రామాలయానికి 100+1(1 టిక్కెట్ హనుమాన్కి) టిక్కెట్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు శ్రేయాస్ మీడియా అధినేత శ్రీనివాస్ తెలిపారు. టిక్కెట్లు కావాల్సిన వారు తమను సంప్రదించాలని పేర్కొన్నారు. జై శ్రీరామ్ 🙏Spreading the Divine Aura of Lord Rama unconditionally🤩The Motto to take the Epic & Divine Tale #Adipurush to everyone & every corner continues to be celebrated 🙏@shreyasgroup announces 100+1⃣ tickets to Every Ramalayam in Every Village of Khammam Dt for… pic.twitter.com/2FB5BWVbh6— Shreyas Media (@shreyasgroup) June 11, 2023 చదవండి: నేను తండ్రినయ్యా.. ఇప్పటిదాకా పరిగెత్తింది చాలు: ప్రభుదేవా -
Cheriyal Painting: నేర్చిన కళే నడిపిస్తోంది.. నకాశి
గృహిణి అనగానే ఇంటిని చక్కదిద్దుకుంటూ, వంట చేస్తున్న మహిళలే మనకు గుర్తుకు వస్తారు. ఇల్లు, వంట పనితో పాటు పిల్లల ఆలనాపాలనా చూస్తూనే చేర్యాల చిత్రకళను ఔపోసన పట్టారు వనజ. ఆరుపదులకు చేరవవుతున్న వనజ హైదరాబాద్ బోడుప్పల్లో నివాసం ఉంటున్నారు. కుటుంబకళగా పేరొందిన నకాశీ చిత్రకళ గురించి, ఈ కళలో మమేకమైన జీవితం గురించి, పొందిన సత్కారాల గురించి ఆనందంగా వివరిస్తారు వనజ. తెలంగాణలో అతి ప్రాచీన జానపద చిత్రకళగా చేర్యాల పెయింటింగ్స్కి పేరుంది. దీనినే నకాశి చిత్రకళ అని కూడా అంటారు. రామాయణ, మహాభారత, పురాణాలను, స్థానిక జానపద కథలను కూడా ఈ కళలో చిత్రిస్తారు. ఈ పెయింటింగ్స్తో పాటు రాజా రాణి, సీతారామ.. పోతరాజు, వెల్కమ్ మాస్క్లను తయారు చేస్తుంటారు వనజ. పెయింటింగ్ నేర్చుకుంటామని వచ్చినవారికి శిక్షణ కూడా ఇస్తుంటారు. వర్క్షాప్స్ నిర్వహిస్తుంటారు. 37 ఏళ్ల క్రితం ‘‘చదువుకున్నది ఏడవ తరగతి వరకే. పెళ్లయ్యాక ముగ్గురు పిల్లలు. నా భర్త వైకుంఠం ఈ చిత్రకళలో రోజంతా ఉండేవారు. ఓ వైపు ఇంటిపని, పిల్లల పని.. అంతా పూర్తయ్యాక మధ్యాహ్నం రెండు గంటల నుంచి పెయింటింగ్ నేర్చుకోవడానికి కూర్చునేదాన్ని. అంతకుముందు ఈ కళ మా కుటుంబానికి మా మామగారి ద్వారా ఏ విధంగా వచ్చిందో, ఎంత ప్రాచీనమైనదో తెలుసుకున్నాను. ప్రాణం పెట్టే ఈ కళ సహజత్వం గురించి అర్ధమవుతున్న కొద్దీ నాకు ఎంతో ఇష్టం పెరిగింది. కళ నేర్పిన చదువు వందల ఏళ్ల క్రితం నిరక్షరాస్యులకు ఈ బొమ్మల ద్వారా కథ తెలియజేసే విధానం ఉండేది. ఆ విధంగా సమాజానికి మంచి నేర్పే కళగానూ పేరుంది. దేవతా వర్ణనలతో, ఇతిహాసాలను, పురాణాలను, స్థానిక కుల కథలను కూడా ఈ కళద్వారా చిత్రిస్తాం. ఖాదీ వస్త్రం లేదా కాన్వాస్పై ప్రత్యేకంగా ప్రాసెస్ చేసిన చింత గింజల గుజ్జు, కొన్ని చెట్ల జిగురు, సహజ రంగులతో చిత్రిస్తాం. ఎరుపురంగు ప్రధాన భూమికగా ఉంటుంది. నీలం, పసుపు రంగులో దేవతల చిత్రాలు, బ్రౌన్ లేదా డార్క్ షేడ్స్ రాక్షసులకు, పింక్ స్కిన్ టోన్లు మనుషులకు ఉంటాయి. వందల సంవత్సరాల క్రితం పురుడు పోసుకున్న కళ ఇది. 3 అడుగుల వెడల్పుతో 60 అడుగులకు పైగా పొడవుతో ఈ బొమ్మలను చిత్రించవచ్చు. స్క్రోల్లో దాదాపు 40 నుంచి 50 ప్యానెల్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ప్యానెల్ కథలోని కొంత భాగాన్ని వర్ణిస్తుంది. ఏడాదికి పైగా... రోజూ కనీసం 5–6 గంటల పాటు సాధన చేస్తూ ఉండటంతో ఏడాదిలో కళను నేర్చుకున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్లే వయసొచ్చాక ఇంకాస్త సమయం కలిసొచ్చింది. దీంతో మెల్లమెల్లగా ఈ పెయింటింగ్స్లో లీనమవడం పెరిగింది. స్కూల్ నుంచి వచ్చాక పిల్లలు కూడా నాతోపాటు పెయింటింగ్స్ నేర్చుకోవడం మొదలుపెట్టారు. పిల్లలు చదువుతోపాటు ఈ కళనూ ఒంటపట్టించుకున్నారు. దేశమంతా ప్రయాణించాను ఎక్కడ మా ప్రోగ్రామ్ ఉన్నా నేనూ మెల్ల మెల్లగా వాటిల్లో పాల్గొనడం మొదలుపెట్టాను. ఆ విధంగా ఢిల్లీ, కలకత్తా, ముంబాయ్.. దేశమంతా తిరిగాను. ఎగ్జిబిషన్స్లో పెట్టే స్టాల్స్ చూసుకోవడంతో పాటు, ఇంటి వద్దకు వచ్చే మహిళలకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాను. కాలేజీ అమ్మాయిలు కూడా వస్తూ ఉండేవారు. కాలేజీల్లో వర్క్షాప్స్ పెట్టేవాళ్లం. ఇప్పుడు రోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకైనా పెయింటింగ్ పూర్తయ్యేవరకు వర్క్ చేస్తూనే ఉంటాను. మా వారికి జాతీయ స్థాయిలో అవార్డు వస్తే, నాకు రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చింది. జంట మాస్క్లు చిత్రకళతో పాటు వినాయకుడు, రాజూరాణి, సీతారాములు, పోతరాజు, బోణాల పండగ సమయంలో అమర్చే అమ్మవార్ల రూపు మాస్క్లను చేస్తున్నాం. అలాగే, ఇంట్లోకి ఆహ్వానించడానికి అలంకరణగా, ఇంటి లోపలి అలంకరణగా కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. ఉడెన్ బాక్స్లు, ట్రేలు, జ్యువెలరీ బాక్స్లను కూడా పెయింటింగ్ తీర్చిదిద్దుతు న్నాం. వీటిని కానుకలుగా ఇవ్వడానికి వీటిని ఎంచుకుంటు న్నారు. మాస్క్ల తయారీలో చింతగింజల పొడి, కర్ర పొట్టు రెండూ కలిపి, తయారుచేసి, పెయింటింగ్ చేస్తాం. అలాగే, మెటల్ ప్లేట్కి ఖాదీ క్లాత్ ని పేస్ట్ చేసి, నేచురల్ కలర్స్తో పెయింటింగ్ చేసి, వార్నిష్ చేస్తాం. ఇవన్నీ ఇంటి అలంకరణలో అందంగా అమరిపోతాయి. ఈ చిత్రకళ అన్నింటికీ ప్రధాన ఆకర్షణగా తయారయ్యింది. నా తర్వాత మా ఇంటి కోడలు నాతో కలిసి మెల్ల మెల్లగా ఈ కళను నేర్చుకుంటోంది. కుటుంబంలో కలిసిపోవడం అంటే ఆ కుటుంబంలో ఉన్న ఇష్టాన్ని, కష్టాన్ని కూడా పంచుకోవడం మొదలుపెడుతూ ఉండాలి. ఈ విషయాన్ని నా జీవితం నాకే నేర్పింది. నా కుటుంబం చేతిలో కళ ఉంది. దానిని నేనూ అందిపుచ్చుకుంటే నా తర్వాతి తరం దానిని మరింత నైపుణ్యంగా ముందుకు తీసుకువెళుతుంది. ఇదే నేను నమ్మాను. నాలాంటి మహిళలకు ఈ కళలో శిక్షణ ఇచ్చే స్థాయికి ఎదిగాను. ఇప్పుడు ఎంతో గుర్తింపుతో పాటు, ప్రపంచాన్ని కొత్తగా చూశానన్న సంతృప్తితో పెయింటింగ్స్ను చిత్రిస్తున్నాను. దీని వల్ల నా కుటుంబ ఆదాయమూ పెరిగింది’’ ఆని ఆనందంగా వివరించారు వనజ. – నిర్మలారెడ్డి -
‘యాదాద్రి’ గోపురంపై రామాయణ గాథ
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ గోపురాలు మరింత ఆధ్యాత్మికతను సంతరించుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఉత్తర రాజగోపురంపై రామాయణానికి సంబంధించిన చిత్రాలపై ఆడియో పవర్ ప్రొజెక్టర్ ద్వారా శుక్రవారం రాత్రి ట్రయల్ నిర్వహించారు. రామాయణం, ఇతర ఇతిహాసాలను ప్రొజెక్టర్ ద్వారా తమిళనాడులోని రామేశ్వరం ఆలయంలో మాత్రమే ప్రదర్శిస్తున్నట్లు వీటిని ఏర్పాటు చేస్తున్న సంస్థ ప్రతినిధులు తెలిపారు. భక్తులు ఉత్తర రాజగోపురం వైపు ఉన్న పచ్చికలో కూర్చొని కట్టడాలను వీక్షించే అవకాశం ఉన్నందున్న.. శ్రీనృసింహస్వామి, ప్రహ్లాద చరిత్రను కూడా ప్రదర్శించేందుకు సన్నాహాలు చేయనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును వైటీడీఏ అధికారులు ఖరారు చేయాల్సి ఉంది. -
రావణ పాత్రధారి అరవింద్ త్రివేది కన్నుమూత
ముంబై: 1986లో వచ్చిన రామాయణం సీరియల్లో రావణుడి పాత్ర పోషించిన ప్రముఖ నటుడు అరవింద్ త్రివేది కన్నుమూశారు. మంగళవారం రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో మరణించారని ఆయన బంధువు కౌస్తుభ్ తెలిపారు. వయో సంబంధిత సమస్యలతో ఆయన చాలా కాలం నుంచి బాధపడుతు న్నారని పేర్కొన్నారు. బుధవారం ఉదయం దహనుకార్ వాడి ప్రాంతంలో ఆయన అంత్యక్రియలు పూర్తి చేసినట్లు వెల్లడించారు. అరవింద్ మృతిపై ప్రధాని∙మోదీ స్పందించారు. రామాయణం సీరియల్లో ఆయన పాత్రను ప్రజలు చిరకాలం గుర్తుంచు కుంటారని అన్నారు. 1991లో అరవింద్ బీజేపీ తరఫున సబర్కాతా నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. 1996 వరకు ఆయన ఎంపీగా సేవలందించారు. -
భారత్ విజయగాథ అపూర్వం
వాషింగ్టన్ : ప్రభుత్వాలు తరచూ మారిపోయినా.. రాజకీయ పార్టీల్లో కుట్రలు ఎన్ని ఉన్నా.. సాయుధ వేర్పాటు ఉద్యమాలు ఎన్ని నడిచినా, అన్ని రకాల స్కామ్లు, అవినీతి ఉన్నప్పటికీ ఆధునిక భారత దేశం సాధించిన ఘనతలు పలు విధాలుగా ఓ విజయగాథ అని అగ్రరాజ్యం అమెరికా 44వ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన పుస్తకం ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’లో రాసుకున్నారు. 1990 తొలినాళ్లలో ఆర్థిక సరళీకరణలు చేపట్టడంతో భారత్లోని అసాధారణ భారతీయ వ్యాపార నైపుణ్యాలు ప్రపంచానికి పరిచయం అయ్యాయని, ఫలితంగా దేశ అర్థ వ్యవస్థ పరుగులు పెట్టిందని, టెక్నాలజీ రంగం వృద్ధి చెందిందని ఒబామా ఆ పుస్తకంలో వివరించారు. 2008లో ఒబామా చేపట్టిన అధ్యక్ష ఎన్నికల ప్రచారం మొదలుకొని అధ్యక్షుడిగా తన అనుభవాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. అల్ కాయిదా అధ్యక్షుడు బిన్ లాడెన్ను హతమార్చడంతో పాటు తొలి దఫా అధ్యక్ష పదవీ కాలం ముగిసేంత వరకూ జరిగిన పలు ఘట్టాలను ఆయన ఎ ప్రామిస్డ్ ల్యాండ్లో విపులీకరించారు. ఈ నెల 15న విడుదలైన ఈ పుస్తకంలో 2010లో ఒబామా భారత్ పర్యటన వివరాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందులోని కొన్ని ముఖ్యాంశాలు.. మన్మోహన్పై ప్రశంసలు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్పై ఒబామా ప్రశంసల వర్షం కురిపించారు. సిక్కు మైనార్టీ వర్గానికి చెందిన మన్మోహన్ దేశ అత్యున్నత పదవిని అందుకోవడం దేశ పురోగతికి ఓ తార్కాణమని, నిజాయితీపరుడిగా గుర్తింపు పొందడం వంటివి మన్మోహన్ సాధించిన విజయాలని ఒబామా వర్ణించారు. ఢిల్లీలో మన్మోహన్ సింగ్ను తాను కలిసినప్పుడు ఆయనలోని అసాధారణ విజ్ఞానాన్ని, హుందా వ్యవహారశైలిని గుర్తించానని చెప్పారు. వినడం సోనియాకు ఇష్టం.. 2010లో తొలిసారి ఢిల్లీ వెళ్లినప్పుడు కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, రాహుల్గాంధీలతో విందు సమావేశంలో పాల్గొన్నట్లు ఒబామా వివరించారు. సోనియా మాట్లాడటం కంటే ఎదుటి వ్యక్తి చెప్పింది వినేందుకే ఎక్కువ ఇష్టపడేవారని తెలిపారు. రాహుల్ గాంధీ తెలివైనవాడిగా, పట్టుదల ఉన్నవాడిగానే కనిపించాడు. అయితే రాహుల్లో ధైర్యం లేని అపరిపక్వతను తాను గమనించానని, పాఠాలన్నీ చదివి టీచర్ వద్ద మంచి మార్కులు కొట్టేయాలని చూసే విద్యార్థిలా అనిపించాడని ఒబామా వ్యాఖ్యానించారు. -
సెహ్వాగ్కు ‘రామాయణం’ గుర్తొచ్చింది..!
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టులో విధ్వంసకర ఓపెనర్గా పేరుగాంచిన వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్ శైలి మాత్రం విన్నూత్నంగా ఉంటుంది. సాధారణంగా క్రికెట్ ఆడే వాళ్లలో ప్రతీ ఒక్కరూ తమ ఫుట్వర్క్ను ఎంతోకొంత కదుపుతూ షాట్లను డిసైడ్ చేసుకుంటారు. మరి మనోడి బ్యాటింగ్ స్టైల్ మాత్రం అందుకు పూర్తి భిన్నం. నిల్చున్న చోట నుంచే ఒక్క అంగుళం కూడా కదలకుండా భారీ షాట్లు ఆడేయగలడు. తన ఆటతో క్రికెట్కే వన్నె తెచ్చిన సెహ్వాగ్.. ఫుట్వర్క్పై ఇప్పటికీ చాలామందికే అనుమానాలున్నాయి. అసలు లెగ్ మూమెంటే లేకుండా ఎలా విరుచుకుపడతాడనే సందేహం చాలామందిలో ఉంది. అప్పట్లో సెహ్వాగ్ ఫుట్వర్క్పై చాలామంది విమర్శలు చేసినా ‘నేనింతే’ అన్నట్లు ఉండిపోయాడు. అందుకు బ్యాట్తోనే సమాధానం చెబుతూ ఉండటంతో విమర్శకులు కూడా ఏమీ మాట్లాడలేకపోయేవారు. తాజాగా తన ఫుట్వర్క్పై సమాధానమిచ్చాడు సెహ్వాగ్. మరి తన ఫుట్వర్క్ గురించి చెప్పాలనుకున్నాడో లేక బ్యాటింగ్ చేయడానికి ఫుట్వర్క్ అనేది అవసరం లేదన్నకున్నాడో ఏమో కానీ హిందూ పురాణాల్లో ఒకటైన రామయాణాన్ని గుర్తుచేసుకున్నాడు సెహ్వాగ్. ఆ రామాయణ పురాణంలోని వానర సైన్యంలో ఒకరైన అంగధుడ్ని ప్రేరణగా తీసుకున్నాడు ప్రత్యేకంగా తన ఫుట్వర్క్ని అంగధుడితో పోల్చుకున్నాడు సెహ్వాగ్. లాక్డౌన్ కారణంగా టీవీలో ప్రసారం అవుతున్న రామాయణాన్ని వీక్షించినట్లు ఉన్న సెహ్వాగ్.. ఈ మేరకు ఒక ఫోటోను పోస్ట్ చేశాడు. సీతను రావణుడు అపహరించిన తర్వాత సంధికోసం వెళ్లిన అంగధుడు అక్కడ ఉన్న లంకేయులతో సవాల్ చేస్తాడు. తన పాదాన్నిఎవరైనా కదిపితే.. శ్రీరాముడు ఓటమిని అంగీకరించినట్లే అని అంగధుడు అంటాడు. అయితే అంగధుడి పాదాన్ని కదిపేందుకు లంకేయులు ప్రయత్నించి విఫలం అవుతారు. ఇదే విషయాన్ని తనకు ఆపాదించుకున్న సెహ్వాగ్ తన ఫుట్వర్క్ని ఏ ఒక్కరూ మార్చలేకపోయారని చెప్పకనే చెప్పేశాడు. So here is where i took my batting inspiration from :) Pair hilana mushkil hi nahi , namumkin hai . #Angad ji Rocks pic.twitter.com/iUBrDyRQUF — Virender Sehwag (@virendersehwag) April 12, 2020 -
థ్యాంక్స్ మోదీ... థ్యాంక్స్ డీడీ
ప్రపంచమంతా కరోనా కల్లోలం కారణంగా ఇంటి గడపదాటని స్థితి. ప్రధాని పిలుపుతో లాక్డౌన్ వల్ల ప్రజలందరితో పాటు సెలబ్రిటీలు సైతం సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. ఈ సమయంలో ఓ ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. దూరదర్శన్ ఛానెల్ 32 ఏళ్లకిందట ప్రసారం చేసిన ‘రామాయణ్’ సీరియల్ని మళ్లీ ప్రసారం చేస్తోంది. దీంతో పెద్దవాళ్లు, సెలబ్రిటీలు రామాయణాన్ని టీవీలో తిలకిస్తూ తమ బాల్యస్మృతులను నెమరేసుకుంటున్నారు. ‘భారతీయ ఇతిహాసాలు పిల్లలు తెలుసుకోవడానికి ఇది ఓ గొప్ప మార్గం’ అంటూ పలువురు సెలబ్రిటీలు సోషల్మీడియా ద్వారా అభిప్రాయాలను పంచుకుంటున్నారు. సీరియల్ చూస్తూ ఫొటోలు తీసుకొని వాటిని ఆనందంగా షేర్ చేసుకుంటున్నారు. రోజూ 2 ఎపిసోడ్లు రామాయణ్ ధారావాహిక ఈ శనివారం (28–03–2020) ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు మొదటి ఎపిసోడ్తో దూరదర్శన్ లో మళ్లీ ప్రారంభమైంది. తిరిగి రాత్రి 9 నుంచి 10 గంటల వరకు మరో ఎపిసోడ్ను ప్రసారం చేసింది. ‘ప్రజల డిమాండ్ మేరకు రామాయణం సీరియల్ను పునఃప్రసారం’ చేస్తున్నట్టు సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ శుక్రవారం ప్రకటించారు. దీంతో చాలామంది సోషల్ మీడియా ద్వారా ప్రధాని మోదీకి, దూరదర్శన్ ఛానెల్కు ‘థ్యాంక్స్ మోదీ... థ్యాంక్స్ డీడీ’ అంటూ ధన్యవాదాలు చెబుతున్నారు. అప్పట్లో ఎక్కడివారక్కడే.. జనవరి 25, 1987లో 30 నిమిషాల నిడివితో 78 ఎపిసోడ్లతో మొదటిసారి దూదర్శన్లో రామాయణం ప్రసారమైంది. అప్పట్లో ఇది టీవీలో ఓ విప్లవం. ఈ సీరియల్ వచ్చే సమయంలో ప్రజారవాణా సదుపాయాలన్నీ స్తంభించిపోయేవి. రైళ్లు, బస్సులు, ఇంటర్ సిటీ ట్రక్కులు.. జనం లేక వెలవెలబోయేవి. ఊళ్లలో సమూహాలుగా టీవీ సెట్స్ ముందు చేరిపోయేవారు. టీవీల ముందు కొబ్బరికాయలు కొట్టి, అగరొత్తులు వెలిగించేవారు. పువ్వులు జల్లి నీరాజనాలు సమర్పించేవారు. నిజానికి ఇది ఒక కార్యక్రమమే. కానీ పిల్లా జెల్లాతో కలిసి కుటుంబం అంతా ఈ సిరియల్ని చూసింది. సీరియల్ పూర్తయ్యాక సత్యమే పలకాలనే వాగ్డానాలు చేసుకునేవారు. పిల్లలు ఇంటి గడప దాటి బయటకు వెళ్లాలన్నా తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకునేవారు. రామాయణంతో టీవీ అలా ప్రతి ఒక్కరినీ కథలో లీనమయ్యేలా చేస్తూ జీవన విలువలనే ధ్యేయంగా విద్యాభ్యాసం చేయించింది. ముప్పై రెండేళ్ల క్రితం ప్రతి ఆదివారం ఉదయం వేళ కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టించిన రామాయణం ఇప్పుడు కర్ఫ్యూ వాతావరణంలో మళ్లీ బుల్లితెర మీదకు వచ్చేసింది. రామనవమి వస్తున్న ఈ తరుణంలో రామాయణం మళ్లీ వీక్షించడం మహద్భాగ్యంగా చెప్పుకుంటున్నారు జనం. పాలసంద్రం నుంచి పట్టాభిషేకం దాకా! ‘శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం..’ పాల సముద్రం మీద శేష శయనుడైన నారాయణుడు, పాదాలు వత్తుతూ లక్ష్మీదేవి. బ్రహ్మాది దేవతలంతా స్తుతిస్తున్న సన్నివేశంతో రామాయణం మొదలవుతుంది. యోగనిద్రలో ఉన్న నారాయణుడు కనులు తెరిచి విషయం ఏంటని అడుగుతాడు. రావణాసురుడి ఆగడాలకు అంతులేదు. అధర్మమే అంతటా ఉంది. పాప నాశనం చేసి, ధర్మ సంస్థాపన చేయండి అని వేడుకుంటారు దేవతలు. వరాలను దుర్వినియోగం చేస్తున్న రావణాసురుడిని నిలువరించాల్సిన అత్యావశ్యకం వచ్చింది చెపుతాడు శివుడు. సత్యమే గెలుస్తుందని తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, సూర్యచంద్రులు ఉండేంతవరకు ఆ ధర్మం అందరికీ మార్గదర్శకం కావాలని కోరుకుంటారు. రావణుడి అహంకారాన్ని మట్టుపెట్టేందుకు తాను జన్మిస్తానని వరమిస్తాడు నారాయణుడు. ‘సత్యమేవ జయతే’ అంటారు దేవగణం. అక్కడి నుంచి.. రాముడు జననం, విద్యాభ్యాసం, వివాహం, వనవాసం మీదుగా కథ నడుస్తూ సీతాదేవి అపహరణ, రావణాసుర సంహారం, తిరిగి అయోధ్యనగర ప్రవేశం, పట్టాభిషేకంతో కథ ముగుస్తుంది. డీడీ1లో ప్రసారమవుతున్న ‘రామాయణ్’ సీరియల్ చూస్తూ, సోషల్మీడియాలో ఫోటోలు షేర్ చేసుకుంటున్నారు నిత్యవిద్యార్థి రామానంద సాగర్ రామానంద సాగర్ దాదాపు వందేళ్ల క్రితం కశ్మీరీ ధనిక కుటుంబంలో పుట్టాడు. రచయితగా ఎన్నో మారు పేర్లతో రచనలు చేశాడు. ఒకానొక సమయంలో ముంబయ్కి అతని కుటుంబ వలస వచ్చింది. సినిమా మీద వ్యామోహంతో పృథ్వీ థియేటర్లో పృథ్వీరాజ్ కపూర్ దగ్గర అసిస్టెంట్గా చేరాడు. 1950లో సాగర్ ఆర్ట్స్ పేరుతో సొంత ప్రొడక్షన్ కంపెనీని నిర్మించాడు. పదుల సంఖ్యలో నామమాత్రపు సినిమాలు అతని ప్రొడక్షన్లో వచ్చాయి. ఆ తర్వాత అతని దశ, దిశ మార్చింది మాత్రం చిన్నతెరనే. అంతకాలం అతనొక విద్యార్థి. రామాయణంతో అతనిలోని మేధావి ప్రపంచానికి కనిపించాడు. తనలో సాంకేతికæ పరిజ్ఞానం ఏ మాత్రం లేదని ఒప్పుకున్న సాగర్ రామాయణాన్ని బుల్లితెర మీద చూపించడంలో అపారప్రతిభను కనబరిచాడని అంతా చెబుతుంటారు. తులసీదాస్ రామాయణమే మూలం రామానంద సాగర్ తులసీదాస్ రామాయణంలోని కథను తన సీరియల్కి ఎంచుకున్నాడు. రామరాజ్య స్థాపనకు ముందు రాముడి జీవితాన్ని ఇందులో తీసుకున్నారు. రాముడు తిరిగి అయోధ్యను చేరుకోవడం, పట్టాభిషేకంతో కథ ముగుస్తుంది. చివరలో సీతను రాముడు వదిలేయడం, లవకుశల అంశాలతో కూడిన ఉత్తర రామాయణ్ తీసుకోలేదు. ‘చాలా మంది రచయితలు రాముడు సీతను వదిలేసినట్టు రాశారు. ‘కానీ, నా రాముడు అలా కాదు అనేవాడు నాన్న. ఆ తర్వాత ప్రత్యేకంగా లవ–కుశ సీరియల్ తీయాలనుకున్నాడు. కానీ, అనారోగ్య కారణంగా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది’ అని చెప్పారు ఓ ఇంటర్వూ్యలో రామానంద్ సాగర్ తనయుడు ప్రేమ్సాగర్. భారత దేశంలో పౌరాణిక ఇతివృత్తంతో సీరియల్స్ రూపొందించడానికి రామాయణం ఒక మాధ్యమంగా సాగింది. జీవించిన నటీనటులు రామ పాత్రధారి అరుణ్గోవిల్ గళం ఈ సీరియల్కే పెద్ద ఎస్సెట్. ప్రశాంత చిత్తం. మృదుమైన మాట. అతను మాట్లాడుతుంటే వినేవారి చెవులు ఆసక్తితో రిక్కించుకుని వింటాయి. ఇక ఇప్పటి వరకు వచ్చిన సీత క్యారెక్టర్లలో ఎవరు ది బెస్ట్ అని కళ్లు మూసుకొని వెతికినా దీపికా చికాలియా రూపం కళ్లముందు నిలుస్తుంది. కళ్లతో ఆమె పలికించిన భావాలు మనసు నుంచి చెదిరిపోవు. ఇప్పటికి వచ్చిన రామాయణ్ సీరిస్లో హనుమాన్ పాత్ర ధారులను గమనిస్తే హనుమాన్గా నటించిన ధారా సింగ్ అపరమేధావిలా కనిపిస్తాడు. హనుమాన్ అంటే ధారాసింగ్ మాత్రమే అనేలా మెప్పించాడు. ఇక రాముడికి దీటుగా రావణుడి పాత్రకోసమే పుట్టాడేమో అనిపించేలా అరవింద్ త్రివేది కనిపిస్తారు. మరింత అందంగా! మూడు దశాబ్దాల క్రితమే కోటి రూపాయల బడ్జెట్తో తీసిన ఈ సీరియల్ పాత్రదారులకు బ్రైట్ కలర్ కాస్ట్యూమ్స్ వాడారు. మన దేశ ప్రజలకు అప్పుడప్పుడే కలర్ టెలివిజన్ చేరవవుతుంది. ఈ చిన్న తెరమీద గులాబీ, నీలం, పసుపు, ఎరుపు రంగులతో షోని బ్లాస్ట్ చేశాడు దర్శకుడు. ఇప్పుడు మనంటి గోడ మీద ఠీవీగా స్థానం సంపాదించుకున్న టీవీలో రామాయణం వర్ణాలన్నీ మరింత క్లారిటీగా వీక్షించవచ్చు. రికార్డులు ఇండియన్ టీవీలో మొట్టమొదటి బ్లాక్ బస్టర్, అత్యంత ఎక్కువ ప్రజాదరణ పొందిన పౌరాణిక షో గా రామాయణం వరల్డ్ లిమ్కా బుక్ రికార్డ్స్లో చోటు చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన రామాయణాలకు రామానంద్ సాగర్ రామాయణమే పెద్ద బాలశిక్ష అయ్యింది. – నిర్మలారెడ్డి -
ఇంత చిన్న ప్రశ్నకు సమాధానం తెలియదా?!
ముంబై: దేశంలో రామాయణం, మహాభారతం గురించి తెలియని చాలా తక్కువగా ఉంటారు. హిందు మత ఇతిహాసాలైన ఈ గ్రంథాల గురించి.. సినిమాలు, సీరియళ్లతోపాటు నవలలు ఇప్పటికీ వెలువడుతూనే ఉన్నాయి. కానీ, రామాయణానికి సంబంధించి ఓ చిన్న ప్రశ్నకు ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా సమాధానం చెప్పలేకపోయారు. ఇటీవల ఆమె ప్రముఖ క్విజ్ రియాలిటీ షో కౌన్ బనేగా కరోడపతిలో పాల్గొన్నారు. గత రాత్రి ప్రసారమైన ఈ షోలో ‘హాట్ సీట్’లో కూర్చున్న సోనాక్షిని హోస్ట్ అమితాబ్ బచ్చన్ రామాయణానికి సంబంధించి ఓ ప్రశ్న అడిగారు. ఎవరికోసం హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చాడు? అని అడిగిన అమితాబ్.. ఏ. సుగ్రీవుడు, బీ.లక్ష్మణుడు, సీ. సీత, డీ. రాముడు అని నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. సోనాక్షి మాత్రం ఈ ప్రశ్న సమాధానం చెప్పలేక.. ఒక లైఫ్లైన్ను ఉపయోగించుకున్నారు. దీంతో ఇంత చిన్న ప్రశ్నకు సమాధానం తెలియదా? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. జనరల్ నాలెడ్జ్ ప్రశ్నల ఆధారంగా సాగే క్విజ్ షో అయిన కౌన్ బనేగా కరోడపతి షోకు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. -
రావణుడిగా ప్రభాస్.. సీతగా దీపికా పదుకోన్!
‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా తిరుగులేని స్టార్డమ్ను ప్రభాస్ సొంతం చేసుకున్నాడు. ఇటీవల వచ్చిన ప్రభాస్ ‘సాహో’ సినిమాకు నెటిగివ్ టాక్, రివ్యూలు వచ్చినా.. కలెక్షన్లు మాత్రం సూపర్బ్ అనిపించాయి. ఈ సినిమా సాధించిన వసూళ్లు బాలీవుడ్ను సైతం ఔరా అనిపించాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ను ఓ ప్రతిష్టాత్మకమైన పురాణ పాత్రలో నటింపజేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. రామాయణ కథతో ప్రముఖ దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కించబోతున్న సినిమాలో ప్రభాస్ రావణుడిగా కనిపించనున్నారని బాలీవుడ్లో వినిపిస్తోంది. రూ. 600 కోట్ల బడ్జెట్తో మూడు భాగాలుగా తెరకెక్కనున్న ఈ సినిమాలో బలమైన రావణుడి పాత్ర కోసం ప్రభాస్ను చిత్రబృందం సంప్రదించినట్టు తెలుస్తోంది. అయితే, ఇప్పటివరకు ప్రభాస్ ఈ సినిమాకు ఓకే చెప్పలేదని, ఆయన టీమ్ ప్రస్తుతం ఈ ప్రాజెక్టు టేకాప్ చేయొచ్చా లేదా? అన్నది బేరిజు వేసే పనిలో ఉందని పింక్విల్లా వెబ్సైట్ ఓ కథనాన్ని ప్రచురించింది. రూ.600 కోట్ల అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ప్రభాస్కు ఉన్న దేశవ్యాప్త స్టార్డమ్తోపాటు హైట్, పర్సనాలిటీ పరంగా రావణుడి పాత్రకు పర్ఫెక్ట్గా సూటయ్యే లక్షణాలు ఉండటంతో ఆయనను ఈ సినిమా కోసం తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోందట. ప్రభాస్ రావణుడి పాత్రను చేస్తే.. ఆ పాత్రకు న్యాయం చేయడమే కాకుండా ప్రజల్లో మరింత హైప్ వచ్చే అవకాశముంటుందని, మరోవైపు రాముడిగా హృతిక్ రోషన్, సీతగా దీపికా పదుకోణ్ నటించే అవకాశముండటంతో వారికి దీటుగా రావణుడి పాత్రలో ప్రభాస్ అలరించే అవకాశముంటుందని బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక సినిమాలో సీతారాములుగా హృతిక్, దీపిక నటించనున్నారని కథనాలు రాగా.. ఇంకా ఈ సినిమా కోసం క్యాస్టింగ్ ఫైనల్ చేయలేదని ఈ వార్తలను దర్శకుడు నితేశ్ కొట్టిపారేశారు. మరోవైపు ఈ సినిమాలో నటించే తారాగణంపై ఊహాగానాలు మాత్రం ఆగడం లేదు. -
రామ గానం
-
రామాయణం
-
మహా ఇండియా
1988వ సంవత్సరం అక్టోబర్ 2 నుంచి 1990 ఆగస్టు వరకు ప్రతి ఆదివారం ఉదయం 9:00 గంటలు... ఇండియాలో టీవీ ఉన్న ప్రతి ఇంటికీ వచ్చి ‘మహాభారత్’గారియల్ ఇండియాని మహదానందానికి గురి చేసింది. ‘మహా ఇండియా’గా మార్చేసింది. ప్రపంచ గ్రంథమైన మహాభారతాన్ని దత్తత తీసుకోవాలని కలగన్నాడు ఓ వ్యక్తి.‘లోకంలో లేనిది మహాభారతంలో లేదు, మహాభారతంలో లేనిది లోకంలో లేద’న్న వ్యాసుడి జ్ఞానాన్ని కూడా దత్తత తీసుకోవాలనుకున్నాడు. నిజంగా అది సాధ్యమేనా?!.. మహాభారతం, రామాయణం వంటి పురాణాల గురించి తెలియని ఆధునిక తరాలు ఈ దృశ్యీకరణను చూసి తప్పుగా అర్థం చేసుకోకూడదు. అంటే, మూలం చెడకూడదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాలి అనుకున్నాడు. అతనే నిర్మాత బి.ఆర్.చోప్రా. ఎంత ఖర్చుకైనా వెనకాడేది లేదన్నాడు. సిద్ధం అన్నాడు దర్శకుడిగా రవిచోప్రా. కృష్ణార్జునుల్లా యుద్ధంలో అడుగుపెట్టి విజేతలై నిలిచారు ఈ తండ్రీ కొడుకులు. 1988 గాంధీ జయంతినాడు దూరదర్శన్లో 45 నిమిషాలపాటు ‘మ...హా...భా..ర...త్...’ సీరియల్ ప్రసారమయ్యింది. 94 ఎపిసోడ్లలో హస్తినాపురం బుల్లితెర మీదుగా నట్టింటికి దిగి వచ్చింది. కురుక్షేత్రాన్ని కళ్లముందు నిలిపింది. రామాయణం సీరియల్ తర్వాత ప్రజలందరినీ టీవీల ముందు కట్టిపడేసిన సీరియల్ మహాభారత్. ఈ సీరియల్ను చూసి కానీ ప్రజలు తమ పనులకు వెళ్లేవారు కాదు. ఈ సీరియల్ని ఆ తర్వాత కెనడా బిబిసిలో ప్రసారం చేస్తే యాభైలక్షల మంది వీక్షించారట. కాలం చెప్పిన కథ ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు అస్త్రాలు ఆకాశంలో తారాజువ్వల్లా లేవడం, శత్రువుల గుండెలను చీల్చడం బుల్లితెర ప్రేక్షకులు విస్మయంగా వీక్షించారు. ఎవరికీ తెలియని కథను కళ్లకు కట్టడం వేరు...అందరికీ తెలిసిన కథను అందునా యుగయుగాలుగా ప్రజల నోళ్లలో నానుతున్న కథను దృశ్యీకరించడం అంటే, ఎలా చెప్పాలి? అందుకే కాలంతో దోస్తీ చేశాడు దర్శకుడు. కాలం సాక్షీభూతంగా కథను చెప్పడం మొదలుపెట్టింది. ‘నేను కాలాన్ని. అజరామరంగా వెలుగొందే భారత కథను మీకు చెబుతున్నాను. ఇది కేవలం భరతవంశానికి చెందిన కథ మాత్రమే కాదు. భారతీయ సంస్కృతికి చెందినది. సత్య–అసత్యాల మధ్య జరిగిన మహా యుద్ధ కథ ఇది. చీకటికి – వెలుగుకు మధ్య జరిగిన యుద్ధ కథ ఇది. ఇందులోని పాత్రలు, సందర్భాలు నేను దగ్గరగా చూశాను. నేను అనుభూతించాను. ఇప్పటికీ మంచి – చెడులతో పోరాడుతూనే ఉన్నాను. నాకు ముగింపు అన్నది లేదు. గతంలో జరిగింది ఇప్పుడూ జరుగుతుంది. భవిష్యత్తులోనూ జరుగుతుంది. ఇది ఇతిహాస గ్రంథం మాత్రమే కాదు. ఇది అందరి కథ. అందరూ ఈ కథలో ఉన్నారు. ఈ కథలో ఉన్నవారందరూ ప్రపంచమంతటా ఉన్నారు. కృష్ణుడు అర్జునుడికి గీతా ఉపదేశం చేయడమో, దుర్యోధనుడు ద్రౌపదిని అవమానించడం మాత్రమే భారత కథ కాదు. ఇది మీ కథ. ఇది నా కథ..’ అంటూ కాలం భరత మహారాజును పరిచయం చేస్తుంది. మహారాజు భరతుడి హస్తినాపురం రాజదర్బారుతో ఈ కథ మొలుపెడుతుంది కాలం.హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు ఒకే దేశంగా పరిపాలించిన చంద్రవంశరాజు భరతడు తన తదనంతరం రాజును ప్రకటించాల్సి సమయం వచ్చింది. తన తొమ్మిది మంది పుత్రులలో ఎవరిని యువరాజుగా ప్రకటించాలన్నదే భరతుడి సమస్య. ఒక రోజు దర్బారులో భరతుడు –‘రాజుకు ఉండాల్సిన లక్షణాలు నా తొమ్మిది మంది పుత్రుల్లో ఎవరికీ లేవు. అన్ని లక్షణాలూ గల భరద్వాజ ముని పుత్రుడు భుమన్యుడిని దత్తతు తీసుకుంటున్నాను. అతడే ఈ సామ్రాజ్యాధినేత’ అని ప్రకటిస్తాడు. ఇక్కడ తల్లి–కొడుకుల మధ్య సంవాదం మనల్ని ఆలోచింపచేస్తుంది. రాజు కావాలంటే వారసత్వంగా కాదు ప్రజలను రక్షించి, పరిపాలించేవాడు కావాలి అని తల్లికి చెప్పే భరతుడి మాటలు భవిష్యత్తుతరాలకు మార్గదర్శకం చేస్తున్నట్టుగా ఉంటాయి. ప్రతీపుడి కొడుకు శంతనుడు. అతనికి సురగంగ వల్ల దేవరాతుడు, సత్యవతి ద్వారా విచిత్రవీర్యుడు, చిత్రాంగదుడు అనే ఇద్దరు కొడుకులు జన్మిస్తారు. కొడుకులిద్దరూ అర్ధంతరంగా చనిపోవడంతో కురువంశానికి వారసుడు లేకపోవడంతో తల్లి సత్యవతి అభ్యర్థనకు వ్యాసుడు తలవంచుతాడు. వ్యాసుని ద్వారా అంబిక, అంబాలికలకు దృతరాష్ట్రుడు, పాండురాజులు జన్మిస్తారు. పుట్టుకతో అంధుడైన దృతరాష్ట్రుడికి రాజ్యం కట్టబెట్టలేక అతని తమ్ముడు పాండురాజును రాజును చేస్తారు. అన్న దృతరాష్ట్రుడికి పుట్టిన వందమంది కొడుకులకు, పాండురాజుకు పుట్టిన ఐదుగురు కొడుకులకు మధ్య జరిగిన దాయాదుల పోరుకు కురుక్షేత్రం వేదిక అవుతుంది. ఇది న్యాయ–అన్యాయాలకు మధ్య జరిగిన పోరుగా కురుక్షేత్రం చూపుతుంది. యుద్ధం ముగిసి, ధర్మరాజు హస్తినాపుర రాజుగా పట్టాభిషిక్తుడవుతాడు. అంపశయ్య మీద భీష్ముడు ప్రాణాలు వదలడంతో సీరియల్ ముగుస్తుంది.జీవితం ప్రశ్నార్థకంగా మారినప్పుడల్లా కాలం దానికి సమాధానం చెబుతూ వస్తోందని మహాభారతంలోని ప్రతి కథ మన కళ్లకు కడుతుంది. వర్తమానం భయపెట్టినప్పుడల్లా ధర్మంవైపుగా అడుగు వేయమని అభయమిస్తుంది. అన్ని సంఘటనలను మౌనసాక్షిగా వీక్షించిన కాలం చెప్పే మాటలకు మన మనసులో గూడు కట్టుకున్న ఒక్కోపొర తొలగిపోతున్నట్టుగా ఉంటుంది. ‘నేను ధర్మం అధర్మం మీద గెలిచే విధానాన్ని మీకు పరిచయం చేశాను. ధర్మం వైపుగా ఉండాలా, అధర్మం వైపుగా సాగాలా అనేది మీ మనసుల్లోనే ఉంది. ఇది కౌరవులకు – పాండవులకు జరిగిన యుద్ధం కాదు. మీ మనసుల్లో ధర్మం–అధర్మం ప్రస్తావన రేగినప్పుడల్లా కురుక్షేత్రం ప్రతిబింబమై మీకు సమాధానమిస్తుంది. మీ మనసే ఓ కురుక్షేత్రం. దాంట్లో ఏ వైపుగా మీరుంటే గెలుపు సుసాధ్యమో మీరే తెలుసుకోవాలి’ అని ధర్మబోధ చేస్తుంది కాలం. బుల్లితెర వ్యాసుడు బి.ఆర్.చోప్రా రామాయణం, మహాభారతం రెండు మహాగ్రంధాలు. రామానంద్ సాగర్, బిఆర్ చోప్రా ఇద్దరికిద్దరూ సమర్థులు. సాగర్ రామాయణం తర్వాత బరిలోకి దిగాలని మహాభారత్ మేకింగ్ను పోస్ట్పోన్ చేసుకున్నారట చోప్రా. ఆ సమయంలో చోప్రా, అతని కుమారుడు రవి కొన్ని టెలీఫిల్మ్స్ తీశారు. ఈ సమయంలో రహి మసూన్ రెజా, సతీష్ భట్నాగర్, నరేంద్ర శర్మలతో కలిసి స్క్రీన్ ప్లే, మాటలు సిద్ధం చేసుకున్నారట. దీనికి ఆరు నెలల సమయం పట్టింది. కొత్త ఆర్టిస్టుల కోసం వేలమందిని స్క్రీన్ టెస్ట్ చేశారు. అమితాబ్బచ్చన్ని మహాభారత్కు తీసుకోవాలనే ఆలోచన చేశారు. అయితే ఓ సినిమా సందర్భంలో అమితాబ్కి గాయాలు అవడంతో ఆ ప్రయత్నాన్ని మానుకున్నారట. రామాయణం బుల్లితెర మీద అప్పటికే సూపర్ సక్సెస్ అయ్యింది. అంటే, తమ ప్రయత్నం ఇంకా ఘనంగా ఉండాలి. పురాణేతిహాసాలు అన్ని కాలాలకు సంబంధించినవి. అందుకే కాలం వాయిస్తో ‘మై సమయ్ హూ’ అంటూ ఈ సీరియల్ని మొదలుపెట్టారు. రెండేళ్ల పాటు వచ్చిన ఈ సీరియల్ ద్వారా వందలాది నటులు సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలన్నది చోప్రాల లక్ష్యం. దాదాపు రూ.9 కోట్లతో తీసిన ఈ సీరియల్లోని కురుక్షేత్ర సన్నివేశానికి ముంబయ్ ఫిల్మ్ సిటీ వేదిక అయ్యింది. కొన్ని సన్నివేశాలను రాజస్థాన్లో తీశారు. ఈ సీరియల్ అంతా ఒక ఎత్తు అయితే ‘హరీష్ భిమాని’ వాయిస్ ఒక ఎత్తు. గంభీరంగా పలికే ఆ స్వరం టీవీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి కూచోబెట్టింది. రామాయాణం పౌరాణిక గాథగా తీస్తే, మహాభారత్ పూర్తిగా డ్రమాటిక్ మోడల్కే వాల్యూ ఇచ్చారు. బి.ఆర్.చోప్రా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘మహాభారత్ గ్రంథంలోని ప్రతి నీడనూ అన్వేషించాం. అందుకే ప్రేక్షకులు అంతగా ఆదరించారు. కొన్ని వివరణలను వదిలివేసింది అనే విమర్శకులూ ఉన్నారు. కానీ ప్రేక్షకుల నాడియే అసలు సిసలు విజయం’ అన్నారు. ‘అథ శ్రీ మహాభారత కథ’ అంటూ చిన్నితెర మీద అతి పెద్ద ప్రయత్నం చేసి గెలిచిన చోప్రాకి దూరదర్శన్, తిలకించిన అశేష ప్రేక్షకజనం కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే. ►ఉర్దూ రచయిత, కవి రహి మసూమ్ రజా వ్యాస మహాభారతం నుంచి ఈ సీరియల్ మూల కథను రాసుకున్నారు. ►‘మ..హా..భా..ర..త్’ టైటిల్ సాంగ్ను కంపోజ్ చేసింది ప్రసిద్ధ సంగీత దర్శకుడు రాజ్కమల్. దీనిని గాయకుడు మహేంద్ర కపూర్ పాడగా, హరీష్ భిమాని తన గొంతును (కాలం) జత కలిపాడు. ఇందులోని శ్లోకాలు భగవద్గీత నుంచి తీసుకున్నారు. ►బాలీవుడ్ నటుడు రాజ్బబ్బర్ అప్పటికే అగ్రనటుల జాబితాలో ఉన్నారు. చోప్రా తీసే సినిమాల్లో రాజ్బబ్బర్ నటించాలనేది వారికి ఒక సెంటిమెంట్గా వస్తుండేది. మహాభారత్ టీవీ సీరియల్లోనూ భరతుడుగా రాజ్బబ్బర్ను చూస్తాం. 1988లో మహాభారత్ వస్తే, 1989లో ఉత్తరాఖండ్ నుంచి రాజ్యసభకు ఎం.పీగా ఎన్నికయ్యారు రాజ్బబ్బర్. ►భీష్మ పాత్రధారి ముఖేష్ఖన్నా మహాభారత్ తర్వాత సినిమా నటుడిగా నిలదొక్కుకున్నారు. చంద్రకాంత, శక్తిమాన్ వంటి సీరియల్స్తోనూ ప్రసిద్ధి పొందారు. ►ద్వారకాధీశుడు శ్రీకృష్ణుడే బుల్లితెర మీద కనిపిస్తున్నాడా అనిపించే నటుడు, దర్శకుడు నితిష్ భరద్వాజ్ నటన ఈ సీరియల్కి ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ►కర్ణపాత్రధారి పంకజ్ధీర్కి ఈ సీరియల్తో స్టార్డమ్ వచ్చేసింది. సనమ్ బేవఫా, బాద్షా వంటి సినిమాలతో పాటు చంద్రకాంత, కింగ్ జునాడ్గడ్, హరిశ్ఛంద్ర వంటి సీరియల్లోనూ ఆ తర్వాత షారూఖ్ఖాన్ చెన్నై ఎక్స్ప్రెస్లోనూ పంకజ్ధీర్ నటించారు. ►అర్జున్గా నటుడు ఫిరోజ్ఖాన్, ద్రౌపదిగా రూపా గంగోలితో పాటు ఈ సీరియల్లోని ప్రధాన పాత్రధారులంతా ప్రముఖులయ్యారు. ద్రౌపది పాత్రకు ముందు జుహీచావ్లాను అనుకున్నారట. చివరగా రూపాగంగూలీని ద్రౌపది పాత్రకు ఎంపిక చేశారు. అభిమన్యుడిగా నటుడు చంకీపాండే సంతకాలు చేసినా, అతనికున్న సినిమా షెడ్యూల్ కుదరకపోవడంతో మాస్టర్ మయూర్ని అభిమన్యుడి పాత్రకు తీసుకున్నారు. ►1988 లో వచ్చిన చోప్రా మహాభారత్ తర్వాత 2013 లో స్వస్తిక్ ప్రొడక్షన్స్ అనే సంస్థ దాదాపు రూ. 120 కోట్ల వ్యయంతో మహాభారత్ సీరియల్ని నిర్మించింది. ఈ సీరియల్ మొత్తం 128 ఎపిసోడ్లుగా వచ్చింది. -
ఆసియాన్ సదస్సులో రామాయణ కథలు!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: మహాకావ్యం రామాయణానికి ఒక్క భారత్తోనే కాదు ఆసియాన్ దేశాలతోనూ విడదీయరాని బంధముంది. చరిత్ర, నాగరికతల పరంగా భారత్ను ఆసియాన్ దేశాలతో మమేకం చేసింది ఈ ఇతిహాసమే. ఈ విశేషాలు ప్రస్ఫుటించేలా 25–26న ఢిల్లీలో జరిగే భారత్–ఆసియాన్ సదస్సులో ఆయా దేశాలకు చెందిన కళాకారులు రామాయణంలోని కొన్ని ఘట్టాలను ప్రదర్శించనున్నారు. ఆసియాన్ దేశాల(ఇండోనేసియా, సింగపూర్, ఫిలిప్పైన్స్, మలేసియా, థాయిలాండ్, కాంబోడియా, వియత్నాం, బ్రూనై, మయన్మార్, లావోస్) అధినేతలు ఈ కార్యక్రమాల్ని తిలకించనున్నారు. భారత్–ఆసియాన్ సంబంధాలకు పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా ఈసారి జరిగే గణతంత్ర వేడుకలకు ఆ దేశాల అధినేతలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. ఆసియాన్ దేశాలతో దౌత్య సంబంధాలు మెరుగుపరచుకోవడంలోనూ రామాయణం దోహదపడింది. -
అది రామసేతువే!
‘రామసేతు’ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. శ్రీరాముడు వానర సేన సాయంతో నిర్మించాడన్న వాదన ఒకవైపు.. వేల సంవత్సరాలుగా భూ పలకల్లో చోటు చేసుకున్న మార్పుల వల్ల ఏర్పడిన సహజ సిద్ధ నిర్మాణమన్న వాదన మరోవైపు కొనసాగుతున్న నేపథ్యంలో.. అమెరికాకు చెందిన సైన్స్ చానెల్ ఒకటి మొదటి వాదననే సమర్ధిస్తూ ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. పలువురు భూగర్భ, పురాతత్వ శాస్త్రవేత్తలు, ఉపగ్రహ చిత్రాలను ఉటంకిస్తూ.. ఆ నిర్మాణం సహజసిద్ధమైనది కాదని, మానవ నిర్మితమైనదేనని తేల్చింది. వివాదం పూర్వాపరాలతో కథనం.. రామాయణంలో ఉన్నట్లుగా తమిళనాడులోని పంబన్, శ్రీలంకలోని మన్నార్ దీవుల మధ్య దాదాపు 50 కిలో మీటర్ల దూరంపాటు సముద్రంలో నిజంగా శ్రీరాముడు వంతెన నిర్మించాడా? రామసేతువు, ఆడమ్ బ్రిడ్జి అని రెండు పేర్లు కలిగిన ఈ మార్గం సముద్రంలో సహజసిద్ధంగా ఏర్పడిందా లేక మానవ నిర్మితమా అనే విషయాలు తాజాగా మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఇందుకు కారణం అమెరికా డిస్కవరీ కమ్యూనికేషన్స్ సంస్థకు చెందిన ‘సైన్స్ చానల్’ రూపొందించిన ఓ కార్యక్రమం. రామసేతువు నిజంగానే మానవ నిర్మితమేననడానికి ఆధారాలు ఉన్నాయని ఆ కార్యక్రమం చెబుతోంది. నాసా ఉపగ్రహాల చిత్రాలు, ఇతర ఆధారాలను పరిశీలించి తాము ఈ నిర్ధారణకు వచ్చామంది. ఆ ప్రాంతంలోని ఇసుక సహజసిద్ధంగా ఏర్పడినదే కాగా, దానిపై ఉన్న రాళ్లు మాత్రం కృత్రిమంగా తీసుకొచ్చి పేర్చినట్లు ఉన్నాయని అలన్ లెస్టర్ అనే భూవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు ఈ కార్యక్రమంలో చెబుతున్నారు. రామసేతువును దాదాపు 5 వేల ఏళ్ల క్రితం నిర్మించి ఉంటారనీ, ఇది మానవుల అద్భుత నిర్మాణమని కార్యక్రమంలో సైన్స్ చానల్ పేర్కొంది. రామ సేతువు ప్రాంతంలో ఉన్న రాళ్లు 7 వేల ఏళ్ల పురాతనమైనవి కాగా, ఇసుక మాత్రం అంత పాతది కాదని తమ పరిశోధనలో తేలినట్లు శాస్త్రవేత్త చెల్సియా రోస్ చెప్పారు. ఐసీహెచ్ఆర్ ద్వారా పరిశోధన రామసేతువు నిర్మాణానికి కారణమైన ద్వీపాలు చారిత్రకంగా ఉన్నాయా లేక మానవనిర్మితాలా అన్న అంశాన్ని పరిశోధించే బాధ్యతను గతంలో భారత చారిత్రక పరిశోధన మండలి (ఐసీహెచ్ఆర్)కు అప్పగించారు. ప్రస్తుతం ఈ పరిశోధన కొనసాగుతోంది. సేతు సముద్రం ప్రాజెక్టు భవితవ్యం గురించి ప్రభుత్వం చేసే ఆలోచనలపై తమ పరిశోధన ప్రభావం చూసే అవకాశం ఉందని ఈ ఏడాది మార్చి నెలలో ఐసీహెచ్ఆర్ చైర్మన్ వై. సుదర్శన్రావు అభిప్రాయపడ్డారు. రామసేతువు సహజసిద్ధమైనదా లేదా మానవనిర్మితమా అన్నది నిర్ధారించే అంశాలపై తాము దృష్టి పెట్టినట్లు ఆయన చెప్పారు. అయితే చరిత్రలోని క్రీ.పూ 4,000– క్రీ.పూ 1,000ల మధ్య కాలాన్ని ‘డార్క్ పీరియడ్’గా పరిగణిస్తున్నట్టు, అందువల్లే ఈ కాలాన్ని మరింత లోతుగా విశ్లేషించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన వివరించారు. కాంగ్రెస్పై బీజేపీ విమర్శలు సైన్స్ చానల్ కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకుని అధికార బీజేపీ ప్రతిపక్ష కాంగ్రెస్పై విమర్శలు మొదలుపెట్టింది. ఇందుకు కారణం గతంలో యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపిన వివరాలే. ప్రస్తుతం నౌకలు దేశ తూర్పు తీరం నుంచి పశ్చిమ తీరానికి రావాలంటే శ్రీలంకను చుట్టి రావాల్సి వస్తోంది. అందుకు కారణం రామసేతువు వంతెన ఉన్నట్లుగా భావిస్తున్న ప్రాంతంలో సముద్రం ఎక్కువ లోతు లేకపోవడమే. ఆ ప్రాంతంలో మట్టిని తవ్వి, సముద్రాన్ని మరింత లోతుగా చేస్తే నౌకలు అక్కడ నుంచే రాకపోకలు సాగించవచ్చనీ, తద్వారా 350 నాటికల్ మైళ్ల దూరం, దాదాపు 30 గంటల ప్రయాణ సమయాన్ని తగ్గించవచ్చంటూ అప్పట్లో కాంగ్రెస్ ఓ ప్రతిపాదన తీసుకొచ్చింది. దీనిని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మిత్రపక్షం డీఎంకే వాదనతో కాంగ్రెస్ అంగీకరిస్తూ ‘అక్కడ వంతెన అనేదే లేదు. అది మానవనిర్మితం కాదు. ఒకవేళగతంలో ఎవరైనా దానిని నిర్మించి ఉంటే వారే దానిని నాశనం కూడా చేసి ఉండొచ్చు. రామసేతువు ఈ మధ్యే పూజ్యనీయ ప్రాంతంగా మారింది’ అని సుప్రీంకోర్టుకు చెప్పింది. అయితే ప్రజల విశ్వాసాలను గౌరవించాలని కాంగ్రెస్ నేత, న్యాయవాది కపిల్ సిబల్ నాడు సుప్రీంకోర్టులో అన్నారు. మరోవైపు సీతను రక్షించేందుకు ‘రామసేతువు’ మార్గాన్ని శ్రీరాముడు సృష్టించాడన్నది ప్రజల ప్రగాఢ విశ్వాసమనీ, అందువల్ల ఆ మార్గంలో ఉన్న ద్వీపాలను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని బీజేపీ గట్టిగా వాదించింది. తాజాగా సైన్స్ చానల్ కథనం ఆధారంగా పలువురు బీజేపీ మంత్రులు కాంగ్రెస్పై విమర్శలు ప్రారంభించారు. ‘రామసేతువు అంశంపై బీజేపీ వైఖరి సరైనదేనని సైన్స్ ఛానల్ పరిశోధన నిరూపించింది. రామాయణంలో పేర్కొన్న మేరకు సీతను రక్షించేందుకు శ్రీరాముడు లంకకు వంతెనను నిర్మించాడనే ప్రజల విశ్వాసాన్ని ప్రశ్నిస్తూ యూపీఏ పక్షాన సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన వారిప్పుడు మాట్లాడాలి. మన సాంస్కృతిక వారసత్వంలో రామసేతువు ఒక భాగం’ అని కేంద్ర మంత్రి రవిశంకర్ అన్నారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ Are the ancient Hindu myths of a land bridge connecting India and Sri Lanka true? Scientific analysis suggests they are. #WhatonEarth pic.twitter.com/EKcoGzlEET — Science Channel (@ScienceChannel) December 11, 2017 -
ఎప్పుడు... ఎలా మాట్లాడాలి ?
ఎప్పుడు, ఎలా మాట్లాడాలో తెలిసిన వారిని ఉద్దేశించే కాబోలు, ‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది’ అనే సామెత పుట్టి ఉండవచ్చు. ఉదాహరణకు... రామాయణంలో సుగ్రీవుడి సచివుడిగా మొట్టమొదటిసారి హనుమ రాముడిని కలిశాడు. నాలుగు మాటలు మాట్లాడాడు. వెంటనే రాముడు లక్ష్మణుడితో – ‘‘చూశావా? ఇతను నవ వ్యాకరణ పండితుడు. శాస్త్రాలన్నీ చదివినవాడు. మాటలో తడబాటులేదు. అస్పష్టత లేదు. అసందిగ్ధం లేదు. కొట్టినట్లు లేదు. మృదువుగా, ప్రియంగా ఉంది. ఎంత మాట్లాడాలో అంతే, అర్థవంతంగా, మనసుకు హత్తుకునేలా మాట్లాడుతున్నాడు’’ అని మెచ్చుకున్నాడు. అంటే హనుమ మాటలకే రాముడు మంత్రముగ్ధుడయ్యాడన్నమాట. మరో సందర్భంలో హనుమ మాటలు సీతమ్మకు ఉపశమనంలా అనిపించాయి. అంతులేని నిర్వేదంలో ఉన్న సీతమ్మ, హనుమ మాటలకు దుఃఖం నుంచి తేరుకుంది. అదెప్పుడో చూద్దామా..? అప్పటికి పదినెలలుగా సీతమ్మ కంటికి మంటికి ఏకధారగా విలపిస్తోంది. హనుమ అశోక వనం చేరి – ఆమె సీతమ్మేనని నిర్ధారించుకున్నాడు. ఆమె కూర్చున్న చెట్టుకొమ్మ మీద అంతా గమనిస్తూ ఉన్నాడు. ఈ లోపు తెల్లవారకముందే రావణాసురుడు మందీమార్బలంతో బయలుదేరాడు. రాముడు ఉన్నాడో లేడో, ఉన్నా రాలేడు. ఇక రెండు నెలలు గడువిస్తా. అయినా మనసు మారకపోతే, గడువు తరువాత రోజు ఉదయం ఫలహారంగా సీతను తింటానని – హుంకరించి వెళ్ళిపోయాడు. రావణుడి మాటలతో రాక్షసులు మరింతగా సీతమ్మను ఏడిపించారు. సీతమ్మకు అంతులేని వేదన. తనను తాను చంపుకుందామన్నా తగిన వస్తువు అందుబాటులో లేదు. తన జడనే చెట్టుకొమ్మకు బిగించి, ఆపై మెడకు బిగించుకుందామని సిద్ధం కాబోతోంది. ఇంతలో హనుమ మెరుపులా స్పందించాడు. హనుమంతుడు... రామకథను, గంధర్వగానంగా, మృదువుగా అమ్మకు చైతన్యం కలిగేలా, రాక్షసులకు నిద్రవచ్చేలా, మైథిలీ ప్రాకృత భాషలో, అది కూడా అయోధ్యా మాండలికంలో ప్రారంభించాడు. అమృతపు జల్లువంటి ఆ మాటలతోనే సీతమ్మ ఎంతో సాంత్వన పొందింది. ఆ తర్వాత హనుమ తనకోసం ఎదురు చూస్తున్న వానరులతో, రామలక్ష్మణులతోనూ ‘‘చూశాను సీతను’’ అని చెప్పాడు. అంటే సూటిగా స్పష్టంగా చెప్ప వారికి ఉపశమనం కలిగించాడు. -
రామాయణం @ 500కోట్లు
మూడు... మూడు... మూడు... సుమారు రూ.500 కోట్ల బడ్జెట్తో తెరకెక్కనున్న నయా రామాయణం సినిమా మూడు చుట్టూ తిరుగుతోంది. తెలుగు, తమిళ, హిందీ... మూడు భాషల్లో మూడు భాగాలుగా త్రీడీలో రామాయణాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తెలుగు నిర్మాత అల్లు అరవింద్, హిందీ నిర్మాత మధు మంతెన, విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ ‘ప్రైమ్ ఫోకస్’ అధినేత నమిత్ మల్హోత్రా... ఈ చిత్రానికి ఈ ముగ్గురూ నిర్మాతలు. అక్టోబర్లో లేదా నవంబర్లో చిత్రీకరణ ప్రారంభం అవుతుందట. -
మాంసం ఏమైనా కొత్తగా తింటున్నామా?
చిన్న పిల్లల మనస్తత్వం కలిగిన వారు మాత్రమే ధర్మం, నిజమైన మార్గం, పవిత్రమైనది లేదా అపవిత్రమైనది అనే దాని గురించిన ఆలోచిస్తారని మత్స్యేంద్రనాథ్( ఉత్తర భారతదేశంలో నాథ్ ఫౌండేషన్ను స్ధాపించిన గోరక్నాథ్ గురువు) ఆయన రాసిన అకుల్వీర్ తంత్ర గ్రంథంలో పేర్కొన్నారు. మరి మత్స్యేంద్రనాథ్ను అనుసరించే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు బహుశా ఈ విషయం తెలుసో లేదో!. ధర్మం పేరిట సృష్టించుకున్న కొన్ని నిబంధనలను సడలించుకోవాలని గురు మత్స్యేంద్రనాథ్ ఆ కాలంలో పిలుపునిచ్చారు. కౌలోపనిషత్తులో ఈ విషయాన్ని మరింత విపులంగా వివరించారు. నిజమైన స్వీయ జ్ఞానం కలిగిన వ్యక్తి ఉపవాసం ఉండడని, సమాజంలో ఒక వర్గాన్ని స్ధాపించడని, ఎలాంటి నిబంధనలు పెట్టుకోడని, అతని దృష్టిలో మనుషులందరూ ఒకటేనని కౌలోపనిషత్తు వివరించింది. కానీ ప్రస్తుత పరిస్ధితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రతి విషయం త్వరగా రాజకీయ రంగు పులుముకుంటోంది. అందులోకి తాజాగా శాకాహారం వచ్చి చేరింది. శాకాహారిగా ఉండటం భారత సంప్రదాయమని చెబుతూ.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాంసాహారంపై నిషేధం విధించారు. మాంసాహారం చరిత్ర వాస్తవానికి మాంసాహారాన్ని తీసుకునే అలవాటు రామాయణ కాలం నుంచి ఉంది. సింధు లోయ నాగరికత కాలంలో భారతీయులు ఎద్దు, దున్న, గొర్రె, మేక, తాబేలు, ఉడుం, చేపల మాంసాన్ని రోజూ వారీ ఆహారంగా వినియోగించారనడానికి ఆధారాలు ఉన్నాయి. అప్పట్లో ఏర్పాటు చేసుకున్న మార్కెట్లలో మాంస క్రయ, విక్రయాలు జోరుగా సాగేవి. 250 రకాల జంతువుల్లో 50 రకాల జీవులను చంపి వాటి మాంసాన్ని తినొచ్చని వేదాల్లో రాసి ఉంది. గుర్రం, గేదే, మేకల మాంసాన్ని తినొచ్చని బుగ్వేదంలో ఉంది. ఇందులోని 162వ శ్లోకంలో చక్రవర్తులు గుర్రాలను ఎలా వధించేవారో వివరంగా ఉంది. ఒక్కో దేవుడికి ఒక్కో రకమైన జంతువును బలి ఇచ్చేవారు. అగ్నికి ఎద్దు, ఆవులను, రుద్రుడికి ఎరుపు వర్ణం గల గోవులను, విష్ణువుకి మరగుజ్జు ఎద్దును, ఇంద్రుడికి తలపై మచ్చ కలిగిన ఎద్దును, పుషణ్కి నల్ల ఆవును బలి ఇచ్చేవారు. అగస్య మహాముని ఒకేసారి వంద ఎద్దులను బలి ఇచ్చిన సంఘటనను తైత్రేయ ఉపనిషత్తు ప్రశంసలతో ముంచెత్తింది. కొంతమంది బ్రహ్మణులు బంధువులు వచ్చిన సమయంలో కచ్చితంగా ఆహారంలో మాంసం ఉండేలా ఏర్పాట్లు చేసుకునేవారు. బృహాదారణ్యక ఉపనిషత్తులో మాంసాన్ని బియ్యంతో కలిపి వండే వారని ఉంది. దండకారణ్యంలో వనవాసానికెగిన రాముడు, సీత, లక్ష్మణులతో అలాంటి ఆహారాన్ని తీసుకున్నారని కూడా ఇందులో ప్రస్తావించారు. దీన్ని మాంసం భుత్తాదన అనేవారు. అయోధ్య రాజు దశరథుడు మటన్, పోర్క్, చికెన్, నెమలి మాంసంతో కూరలు వండే సమయంలో వాటిలో సుగంధ ద్రవ్యాలను ఉపయోగించేవారు. మహాభారతంలో కూడా మాంసానికి సంబంధించిన వివరణలు ఉన్నాయి. ఉడికించిన అన్నంతో కలిపి మాంసాన్ని తీసుకునేవారని, కొన్ని రకాల పక్షులను కాల్చి తినేవారని, గేదె మాంసంపై నెయ్యి వేసుకుని తినేవారని ఉంది. - ఓ సామాజిక వాది వ్యాసం -
ఆదికవి... ఆదర్శకావ్యం
రామాయణం, మహాభారతం భారతీయుల జీవనంతో ముడివేసుకుని అవిచ్ఛిన్నంగా ప్రయాణం సాగిస్తున్నాయి. విరగకాచిన చెట్లకొమ్మల్లో ఫలాలను తిని తన్మయత్వంతో పాడే కోయిలలా, రాముడి గురించి తెలుసుకున్న వాల్మీకి పరవశంతో మధురమైన అక్షరాలతో రామాయణాన్ని గానం చేశాడు. తమసానదీ తీరంలో వాల్మీకి నోటి వెంట వెలువడిన తొలి శ్లోకాన్ని మొట్టమొదట విన్నవాడు శిష్యుడు భరద్వాజుడు. గురువర్యా! ఈ శ్లోకం రాగయుక్తంగా పాడుకోవడానికి వీలుగా, పదే పదే మననం చేసుకోవడానికి సులభంగా ఉందే అని భరద్వాజుడు పులకింతల్లో మునిగిపోతాడు. ధర్మం కోసం, ధర్మనిష్ట లో జరిగే సంఘర్షణ లో మంచివైపు నిలబడడం కోసం, ఆడిన మాట తప్పకుండా ఉండడం కోసం, స్నేహం విలువ తెలుసుకోవడం కోసం, అన్నదమ్ముల అనురాగాల సౌధాల కోసం, ఒక్క మాటలో చెప్పాలంటే రామరాజ్యం కోసం రామాయణాన్ని చదవాలి. వాల్మీకి మహర్షి హృదయాన్ని అర్థం చేసుకోవాలి. కవిగా వాల్మీకి భారతీయ సాహిత్యానికి దారిదీపం. మబ్బులు, కొండలు, కోనలు, చెట్లు, పూలు, పక్షులు యావత్ ప్రపంచాన్ని ఒక్క అక్షరం ఎక్కువ - తక్కువ కాకుండా తన రచనలో అద్దం పట్టడంలో వాల్మీకికి సాటిరాగల వారులేరు. ఉపమా కాళిదాసస్య అని అలంకారాల్లో తనదైన ముద్రవేసిన కాళిదాసాదులు వాల్మీకి చూపిన బాటలో నడిచినవారే. మానసిక ప్రవృత్తులు, అంతర్మథనాలు, ధర్మాధర్మ విచక్షణ మీద వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు వాల్మీకి హిమవత్పర్వతం కంటే ఎత్తులో ఉంటాడు. వాల్మీకి ఆదికవి - రామాయణం ఆదికావ్యం. ప్రపంచ ఇతిహాసాల్లో రామాయణం ఎప్పటికీ చర్చనీయాంశమే. యుగాలు మారుతున్నా, కాలధర్మాలు మారుతున్నా, జీవన వేగం రాకెట్లతో పోటీ పడుతున్నా వాల్మీకి రామాయణం నిలిచి వెలుగుతూనే ఉంది. ధర్మ పరాయణులకు దారిచూపుతూనే ఉంది. మిన్ను విరిగి మీద పడ్డా ధర్మాన్ని వదలకుండా ఎందుకు నిలబడాలో చెబుతూనే ఉంది. అలజడి లేని కొలనులో తేట నీరు పైకితేలి ప్రశాంతంగా ఉన్నట్లు వాల్మీకి మనసు అత్యంత ప్రశాంతంగా ఉన్న సమయంలో తారసపడ్డ వ్యక్తులు, సంఘటనలు, ఉదయించిన ప్రశ్నల్లో నుండే రామాయణం పుట్టింది. కోపాన్ని జయించినవాడు, అసూయలేనివాడు, సత్య ధర్మ పరాక్రమవంతుడు... ఇలా సకల గుణ సంపన్నుడు ఎవరైనా ఉన్నారా అని వాల్మీకి మనసు వెతుకుతోంది. ఆ సమయంలో ఎదురైన నారదుడిని స్పష్టంగా అదే అడిగాడు వాల్మీకి. ఎందుకు లేడు? అయోధ్యలో రాముడున్నాడు అని వాల్మీకికి నారదుడు రామదర్శనం చేయించాడు. ఇక వాల్మీకి మనసు ఆగలేదు. అదే ధ్యాస, అదే స్మరణ, అదే పులకింత, అదే సర్వస్వం. ఫలితం - శ్రీ రామాయణం. మనం రామాయణాన్ని పారాయణ చేయాలని, సీతారామ హనుమలను పూజించాలని మాత్రమే వాల్మీకి రామాయణం చేశారనుకుంటే మనం ఆ మహర్షి గౌరవాన్ని తగ్గించిన వాళ్లం ్లఅవుతాం. ఆయనే ఒకచోట మారీచుడి చేత చెప్పించినట్లు రామో విగ్రహవాన్ ధర్మః అని ధర్మాన్ని పోతపోస్తే రాముడి రూపమవుతుంది. నేను లేనప్పుడు అమ్మ కైకేయి వరంగా తీసుకున్న రాజ్యం, నేను అడగని, తెలిసిన తరువాత కూడా తీసుకోని రాజ్యసింహాసనం ఇంకా ఖాళీగానే ఉంది అన్నా, నేనే వచ్చి అడుగుతున్నాను కాబట్టి నీవు అడవినుంచి అయోధ్యకు వచ్చి సింహాసనం అధిష్టించ వల్సిందిగా సకల పరివారంతో వెళ్లి అడిగాడు భరతుడు. రామ - భరతుల మధ్య ఈ విషయంలో వాదోపవాదాలు చాలా దీర్ఘంగా సాగుతాయి. మనం భరతుడి వైపు వింటున్నప్పుడు ఇక రాముడు మనసు మార్చుకోవాల్సిందే అనిపిస్తుంది. కానీ పితృవాక్య పరిపాలన అంటే ఆయన లేనప్పుడు పట్టించు కోవాల్సిన పనిలేని మాట కాదని ధర్మం, ధర్మసూక్ష్మాన్ని రాముడు తమ్ముడికి విడమరిచి చెబుతాడు. అయినా భరతుడు ఒక పట్టాన వినడు. చివరికి వశిష్ఠుడి ప్రమేయంతో రామ పాదుకలను భరతుడు నెత్తిన పెట్టుకుని వచ్చేస్తాడు. నీవు వచ్చేవరకు మాత్రమే అది కూడా నీ పాదుకలే పాలిస్తున్నాయని భావిస్తూ నేను సంరక్షకుడిగా ఉంటానని రాముడికి చాలా స్పష్టంగా చెప్పాడు భరతుడు. రామ భరతులు, రామ-విశ్వామిత్రులు, రామ-హనుమలు, దశరథ-జనకుల మధ్య వాల్మీకి ఎంత ఉదాత్తమైన నడక నడిపాడో, రావణ- కుంభకర్ణాదు లు, రావణ- హనుమ, రావణ-సీత, రావణ- మారీచుల మధ్య కూడా అంతే గంభీరంగా నడక నడుస్తుంది. రావణుడిని మొట్టమొదట హనుమ చూసినప్పుడు అహోరూపం, అహోధైర్యం అంటూ ఏమి రూపం, ఎంత తేజస్సు? అని ఆశ్చర్యపోయేలా చేసిన వాల్మీకి వెంటనే తెల్ల నీళ్ల మధ్య పెద్ద ఏనుగులా, మినుముల రాశిలా రావణుడు పడుకుని ఉన్నాడంటాడు. ఫలానావాడు మంచివాడు, ఫలానావాడు దుర్మార్గుడు అని వాల్మీకి తీర్పుల జోలికి వెళ్లలేదు. రామచరితను మనముందు పెట్టాడు. రామాయణ సారంగా, రాముడి గుణగణాలకు సర్టిఫికేట్ లాంటి మాటలను దుష్ట రాక్ష పుడైన మారీచుడిచేత చెప్పించాడు- అది కూడా రావణాసురుడికి. ఆధునిక జీవితంలో వేగం పెరుగుతోంది. వసతుల మీద ఉన్న శ్రద్ధ విలువల మీద ఉండడంలేదు. భార్యాభర్తల మధ్య పరస్పర అనురాగం, అవగాహన సన్నగిల్లుతున్నాయి. పగలు, రాత్రి ఉద్యోగాలతో కుటుంబంలో ఎవరు ఎప్పుడు ఇంట్లో ఉంటారో వారికే తెలియడంలేదు. అనుమానాల పునాదుల మీద సంసారాలు కదిలిపోతున్నాయి. అభిరుచులు, ఆర్జనలు, పట్టింపులే తప్ప దంపతులుగా కలకాలం కలిసి నడవాల్సిన దారులు మధ్యలోనే వేరవుతున్నాయి. సీతారాములు పడ్డ కష్టాలెన్ని? ఎదుర్కొన్న అవమానాలెన్ని? ఎలాంటి వైభవోపేత జీవితం నుండి ఎలాంటి వనవాసంలోకి వెళ్లారు? దంపతులు కష్టనష్టాల్లో తోడు నీడగా నడవాలన్న సందేశం రామాయణం కంటే మరొకటి ఇవ్వగలదా? వావి వరసలు మరచి ప్రవర్తిస్తున్నవారు తారసపడుతూనే ఉన్నారు. వారానికో పెళ్లి, నెలకో విడాకులు, సంవత్సరానికి సంతానంతో - అన్నా చెల్లెళ్ల ప్రేమలు, పెళ్లిళ్ల దాకా వెళ్తే ఎవరు, ఎవరికి ఏమవుతారో తెలియక చివరికి మాడి మసి అవుతున్న బంధుత్వాలు మన కళ్లముందే కనబడుతున్నాయి. అన్నదమ్ములు, వదిన-మరుదులు ఎలా ఉండాలో రామాయణం కంటే మరొకటి చెప్పగలదా? అయోధ్య రాముడు ఆటవికుడైన గుహుడిని ఆత్మ సమాన మిత్రుడిగా సంబోధించాడు. వానరజాతి సుగ్రీవుడి ఆచారాలను గౌరవించాడు. రాక్షసజాతి విభీషణుడి విలువలకు పట్టం కట్టాడు. ఎదుటివారిని గౌరవించడం, ఎదుటివారి అభిప్రాయాలను వినడం, వారి సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించడం ఒక సంస్కారం. మనకు నచ్చినా, నచ్చకపోయినా అవతలివారి జీవన విధానాన్ని, ఆలోచనా సరళిని గౌరవించి తీరాలన్న ప్రాథమిక నియమాన్ని రామాయణం కంటే మరొకటి చెప్పగలదా? లోకంలో ధర్మాధర్మాలకు ఎప్పుడూ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. పదితలలు లేకపోయినా వేయి చెడు ఆలోచనల తలలతో రావణాసురులు మన మధ్య తిరుగుతూనే ఉన్నారు. రక్తమాంసాలతోపాటు తమ సర్వస్వాన్ని ధారపోసి పెంచి పోషించిన తల్లిదండ్రులను పూచికపుల్లకంటే హీనంగా చూస్తున్న వారున్నారు. అధికారం కోసం తండ్రిని బందీ చేసేవారున్నారు. తోబుట్టువులను చంపేవారున్నారు. మంచి చెప్తే మొహాన ఉమ్మేసేవారున్నారు. ఏది తప్పో - ఏది ఒప్పో తెలియక తాము చేస్తున్నదే మంచి అన్న భ్రమలో పాపకూపంలో కూరుకుపోతున్నవారున్నారు. ఇలాంటి వారికి చేరాలనే వాల్మీకి రామాయణాన్ని గ్రంథస్థం చేశాడు. శీలం, గుణం ప్రాణంగా బతికితే మనలో రాముడుంటాడు. విలువల వలువలు విప్పి తిరిగితే మనలో రావణుడుంటాడు. ధర్మం మీద మన జీవితం నిలబడితే రామబాణం దొరుకుతుంది. అధర్మం మీద బతికితే రావణ వధ జరుగుతుంది. యుగాలు మారినా వాల్మీకి రామాయణం నిచిలి ఉంటుంది. - పమిడికాల్వ మధుసూదన్, సీనియర్ పాత్రికేయులు (నేడు వాల్మీకి జయంతి ) -
స్నేహ పురాణం
నేడు స్నేహితుల దినోత్సవం స్నేహం గురించి, స్నేహం ఔన్నత్యాన్ని గురించి రామాయణమహాభారతాలలో అద్భుతంగా వర్ణించారు. రామాయణంలోని శ్రీరామ సుగ్రీవుల మైత్రి, మహాభారతంలో కుచేల శ్రీకృష్ణుల మైత్రి, కర్ణదుర్యోధనుల మైత్రీబంధం... ఈ మూడు స్నేహాలూ గొప్పవే. అయితే ఒక్కొక్క స్నేహంలో ఒక్కో కోణం ఉంది. ముందుగా రామాయణం విషయానికొస్తే... అవసరానుగుణమైన స్నేహం రామసుగ్రీవులది... తన ప్రియసఖి సీతను వెదుకుతూ అడవిమార్గంలో వెళుతున్నాడు రాముడు తన సోదరుడు లక్ష్మణునితో కలిసి. వారిని చూసిన వానర రాజు సుగ్రీవుడు తన అన్న వాలి తనను సంహరించడానికి ఎవరినో పంపాడేమోనని భయపడ్డాడు. అది గమనించిన ఆంజనేయుడు వారి రాకకు కారణం తెలుసుకుని, అటు రాముడికీ, ఇటు సుగ్రీవుడికీ ప్రయోజనం చేకూరే విధంగా వారి మధ్య మైత్రి కుదిర్చాడు. ఇది పరస్పర ప్రయోజనాన్ని చేకూర్చేదే అయినా, రాముడితో పోల్చితే సుగ్రీవుడి బలం ఏపాటి? అయితే సీతావియోగ దుఃఖంలో ఉన్న రాముడికి సుగ్రీవుడు చేస్తానన్న సాయం ఆశాకిరణంలా తోచింది. పైగా అధర్మపరుడు, అమిత బలశాలి అయిన అతడి అన్న వాలి నుంచి అతడిని కాపాడ్డం కర్తవ్యంగా భావించాడు. అందుకే సుగ్రీవుడికి తన స్నేహహస్తాన్ని అందించాడు. అంతేకాదు, వాలిని సంహరించి, సుగ్రీవుడికి రాజ్యాన్ని కట్టబెట్టేవరకు అండగా నిలిచి స్నేహధర్మానికి మారుపేరుగా నిలిచాడు. సుగ్రీవుడు కూడా అమిత బలపరాక్రమాలు గల ఆంజనేయుడి తో సహా ఎందరో వానర వీరులను సీతాన్వేషణలో భాగస్వాములను చేసి, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఇక్కడ గ్రహించలసిందేమంటే, రాముడు బలశాలి అయిన వాలితో స్నేహం చేస్తే, అతని సాయంతో అవలీలగా రావణుని జయించగలడు. కానీ బలహీనుడైన సుగ్రీవుడితోనే స్నేహం చేశాడు. అవతలివారి ధనబ లాన్నో, అంగబలాన్నో చూసి, వారితో స్నేహం చేయాలని ఉవ్విళ్లూరేవారు ఇది గ్రహించాలి. పూలూ దారంలాంటి స్నేహం శ్రీకృష్ణ కుచేలురది... శ్రీకృష్ణుడు, కుచేలుడు సాందీపుని ఆశ్రమంలో సహాధ్యాయులు, స్నేహితులు. కాల క్రమేణా కృష్ణుడేమో రాజయ్యాడు, కుచేలుడేమో గంపెడంత మంది పిల్లలతో చాలీచాలని ఆదాయంతో సంసారాన్ని ఈదలేక మరింత పేదవాడయ్యాడు. దుర్భరమైన పరిస్థితుల్లో భార్య సలహా మేరకు స్నేహితుడైన కృష్ణుడి వద్దకు బయలేరాడు సాయం కోరడానికి. ఉట్టిచేతులతో వెళ్లలేక ఇంట్లో ఉన్న కాసిన్ని అటుకులను మూటకట్టుకుని వెళ్లాడు. అతని అవతారాన్ని చూసిన ద్వారపాలకులు లోపలికి పోనివ్వకుండా అడ్డుపడ్డారు. కృష్ణుడది చూసి వారిని వారించి, ఎదురెళ్లి మరీ బాల్యస్నేహితుడికి ఘన స్వాగతం పలికాడు. కావలించుకుని, కుశలప్రశ్నలు వేస్తూ, నాకోసం ఏం తెచ్చావని అడుగుతూనే అతని మూటలో ఉన్న అటుకులను చూసి, వాటినే ఎంతో ప్రీతితో తిన్నాడు. రాచమర్యాదలతో అతనికి ఆతిథ్యమిచ్చాడు. ఈ స్నేహమాధుర్యంలో తడిసి ముద్దయిన కుచేలుడు తానక్కడికెందుకు వచ్చాడో కూడా మర్చిపోయాడు. అయితే కృష్ణుడు ఆ మాత్రం గ్రహించకుండా ఉంటాడా... స్నేహితుడు ఇల్లు చేరేసరికే అతని దారిద్య్రాన్ని తీర్చేశాడు. తరాలపాటు కూర్చుని తిన్నా తరగని సంపదను ఇచ్చాడు. స్నేహమంటే అది! తాను రాజైనా, అవతలివాడు కూటికి లేని పేదవాడైనా సరే, తనను వెతుక్కుంటూ వచ్చిన మిత్రుడు నోరు తెరిచి అడక్కుండానే అతనిక్కావలసిన దానిని అనుగ్రహించాడు. అడిగేవరకూ ఊరుకోలేదు. అడగాలని కోరుకోలేదు. అవసరమైనది ఇచ్చాడు. అవసరార్థస్నేహం కర్ణదుర్యోధనులది... వీరిద్దరూ గొప్ప స్నేహితులనే విషయాన్ని ఎవరూ కాదనలేరు కానీ వారిది కేవలం అవసరానుగుణమైన స్నేహమే. ఒకరి స్వార్థం కోసం ఒకరు స్నేహితులయ్యారు. ఎలాగంటే కర్ణుడు కూడా రాజపుత్రుడే! సూర్యుని అనుగ్రహంతో సహజ కవచకుండలాలతో జన్మించిన ఉత్తమ కుల సంజాతుడే!! అయినప్పటికీ, కారణాంతరాలవల్ల సూతపుత్రుడుగా పెరిగిన వాడు కాబట్టి కురుపాండవుల బలాబలాల్ని పరీక్షించే క్షాత్ర పరీక్షలో అర్జునుడితో తలపడేందుకు అతి సామాన్యుడిగా, దాసీపుత్రునిగానే కొలువుకు వచ్చాడు. అతని తేజస్సును, బలపరాక్రమాలను, వీర్యశౌర్యాలను అంచనా వేసిన దుర్యోధనుడు అతడు తనకు బాగా పనికి వస్తాడని గ్రహించి, అప్పటికప్పుడు అంగరాజ్యానికి రాజును చేశాడు. కర్ణుడు కూడా తానెవరో, తన అర్హత ఏమిటో, దుర్యోధనుడు తనను రాజుగా ఎందుకు చేస్తానంటున్నాడో తెలుసుకోలేనంతటి అమాయకుడు కాడు. అయినా సరే, అంగరాజుగా సుయోధన సార్వభౌమునితో పట్టం కట్టించుకున్నాడు. ఆ కృతజ్ఞతాభావంతోనే దుర్యోధనుడికి ఆఖరివరకు అండగా నిలిచాడు. తెలిసి తెలిసీ, తన వీర్యశౌర్యపరాక్రమాలన్నింటినీ నీచుడు, స్వార్థపరుడు, అధికార దాహంతో తపించిపోయే దుర్యోధనుడికే ధారపోశాడు. దుర్యోధనుడు కూడా కర్ణుడున్నాడనే ధైర్యంతోనే పాండవులతో పోరాటానికి సిద్ధపడ్డాడు. అర్జునుడి చేతిలో చస్తాడని తె లిసినా, కర్ణుడిని తన స్వార్థానికే ఉపయోగించుకున్నాడు. స్నేహమనేది వీరిలా ఉండకూడదని నిరూపించారు ఇద్దరూ. -
రావణుడి కాళ్లు ఎందుకు తిరిగొచ్చాయి?
రామాయణంలో మనం ఇంతవరకు పెద్దగా వినని అంశాలను కూడా నాయకులు గుర్తుచేస్తున్నారు. లంకలో రామరావణ యుద్ధం జరిగినప్పుడు శ్రీరాముడు రావణాసురుడి చేతులు, కాళ్లు నరికేశాడని, రథం విరగ్గొట్టేశాడని.. కానీ ఆ తర్వాత కాళ్లు మాత్రం మళ్లీ రప్పించాడని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి అన్నారు. తన కోటలోకి తిరిగి వెళ్లిపోడానికి వీలుగా అలా ఎందుకు చేశాడు అంటూ ట్విట్టర్ జనాలకు ఆయన ఓ ప్రశ్న సంధించారు. సాధారణంగా ఇంతకాలం తెలిసినదాని ప్రకారం, రావణాసురుడి కడుపులో ఉన్న అమృతభాండాన్ని ఛేదించిన తర్వాత రావణవధ జరిగిందంటారు. ఆ రహస్యాన్ని కూడా విభీషణుడు రాముడి చెవిలో వేసిన తర్వాతే రావణాసురుడు నేలకొరిగాడని చెబుతారు. కానీ సుబ్రమణ్యం స్వామి మాత్రం సరికొత్త అంశాలను చెబుతున్నారు. PTs may remember Bhagwan Ram in the Lanka war chopped Ravan's arms, legs and chariot but restored his limbs to walk back to his palace. Why? — Subramanian Swamy (@Swamy39) 22 June 2016 -
జెమిని టీవీలో... శ్రీ ఆంజనేయం
రామాయణం.. ఇందులో చిన్నవాళ్ల నుంచీ పెద్దవాళ్ల వరకూ అందర్నీ ఆంజనేయుని పాత్ర ఆకట్టుకుంటుం ది. ఈ హనుమంతుని చుట్టూ ఎన్నో కథలు, సీరియల్స్ వచ్చాయి. అందులో ఎక్కువ శాతం రామాయణ కాలంలోని హనుమాన్ పాత్ర గురించి వచ్చినవే. కానీ, దాని తర్వాత చిరంజీవిగా ఉన్న ఆంజనేయుని చరిత్ర చాలామందికి తెలియదు. ఈ చరిత్రనే జెమిని టీవీ ‘శ్రీ ఆంజనేయం’ అనే మెగా సీరియల్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానుంది. మే 9న ఆరంభమయ్యే ఈ సీరియల్ సోమవారం నుంచి శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రసారం అవుతుంది. ఇందులో అద్భుతమైన కథ, కథనమే కాదు, అబ్బురపరిచే గ్రాఫిక్స్ కూడా ఉంటాయి. ఈ సీరియల్ వేసవిలో పిల్లలకు మంచి వినోదం అందించబోతోంది అనడంలో సందేహమే లేదు. -
సలహా
సలహాను తిరగేస్తే .. హాలస అవుతుంది! సమయం, సందర్భం ఎరగక ఇచ్చే సలహాకూడా ఎదుటివారి జీవితాన్ని ఇలాగే తారుమారు చేస్తుంది! అందుకే సలహాలివ్వబోయేముందు కాస్త జాగ్రత్త అని చెప్పే ప్రయత్నమే ఇది. అవసరమైన సలహా స్వీకరించు, అనవసరమైన వాటిని తిరస్కరించు. అలాగే నీలోని ప్రత్యేకతను దానికి జోడించు -బ్రూస్లీ నాకు తెలిసి నీ మనసు విరిగినప్పుడు మాత్రం ఎవరూ నీకు సలహాలు ఇవ్వరు -బ్రిట్నీ స్పియర్స్ సలహా ఇచ్చేందుకు రానివారందరికీ కృతజ్ఞతలు, ఎందుకంటే వారి వల్లనే నేను స్వంతంగా పని చేయడం నేర్చుకోగలిగాను -ఐన్స్టీన్ మానవుడికి కవలసోదరి సలహా! కానీ ఎక్కువసార్లు ఈ ఇద్దరి మధ్య వైరం చోటు చేసుకుంటుంది. చాలా తక్కువసార్లు స్నేహం కుదురుతుంది. అవసరమున్నా లేకున్నా.. అడిగినా అడగకపోయినా నేనున్నానంటూ వస్తుందని అని సోదర మానవుడు విసుక్కుంటుంటాడు. ఖ్యాతి కన్నా ఇది మూటగట్టుకున్న అపఖ్యాతే ఎక్కువని అతని ఉద్దేశం. ఆదేశం, ఆజ్ఞ, ఉద్బోధ, సూచన... ఇలా సందర్భాన్ని బట్టి సలహా తన పేరు మార్చుకుంటూ ఉంటుంది. చాలా సార్లు ఉచితంగానే వినిపిస్తుంది. కొండొకచో కాస్ట్ చేస్తుంది. ఏమైనా తను లేకుండా మనిషి మనలేడనే చరిత్రను సృష్టించింది. రామాయణం పురాణాల్లోనూ.. సలహాది ముఖ్య భూమికే. రామాయణంలో కొంచెం నెగటివ్ షేడ్ దీనిది. కైకకు మంధర సలహా ఇవ్వకపోతే రామాయణ రచన జరిగేది కాదేమో! ఒకవేళ జరిగినా ఇంకోరకంగా ఉండేదేమో! సవతి తల్లి విలన్గా మిగిలేది కాదు! రాముడు అడవులకు వెళ్లకుండానే.. సీతను అడవుల పాలు చేయకుండానే.. రావణుడి కీర్తి తగ్గకుండానే రామాయణానికి ఎండ్ కార్డ్ పడేదేమో! అంతెందుకు.. అన్నతో పాటు అడవులకు బయలుదేరిన లక్ష్మణుడు.. భార్య ఊర్మిళకు తను వచ్చేవరకు నిద్రపొమ్మనే సలహా ఇచ్చి ఉండకపోతే రామాయణంలో ఊర్మిళ పాత్రా ఇంకేదన్నా స్ఫూర్తిని పంచేదేమో! పోనీ.. సీతను అలా బంధించడం నీకు.. ఈ లంకారాజ్యానికీ శుభం కాదు, పట్టు వీడండి అన్న విభీషణుడి సలహాను రావణుడు విన్నా కథ ఇంకో మలుపు తిరిగేది. భారతం భారతం విషయానికి వచ్చినా సలహాది చాంతాడంత నిడివే. కాకపోతే మంచిచెడ్డలను కలబోసుకుంది. ‘రాజ్యంలో పాండవులకూ పాలు ఉంది.. సగరాజ్యం ఇవ్వండి’ అంటూ పెద్దలు ఇచ్చిన సలహాను కౌరవులు పెడచెవిన పెట్టబట్టే దాయాదుల పోరు గురించి ప్రపంచానికి తెలిసిందనుకోవచ్చు. శకుని సలహాలు దర్యోధనుడు పాటించకపోతే అతని పేరూ ధర్మరాజుపేరుతో పోటీపడి ఉండేది. ‘కర్ణుడు శూద్రుడు.. వాడితో స్నేహమేంటి?’ అన్న సలహాకు సుయోధనుడు ప్రాధాన్యమిచ్చి ఉంటే లోకంలో స్నేహానికి విలువే ఉండేది కాదు. ఇలా భారతంలో తనను తాను బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలానే ప్రయత్నించినా.. ‘సలహా’ అనేది చివరకు అపప్రథనే మోసింది! భాగవతంలో రెండు రకాల ప్రభావాన్ని చూపింది. తండ్రీకొడుకుల మధ్య తంపులు తెచ్చింది... స్నేహితుల చెలిమికి స్వచ్ఛతను అద్దింది. నారాయణ నామస్మరణ చేస్తున్న తనను ఎద్దేవా చేయడం మంచిది కాదు నాన్నా అంటున్నా హిరణ్యకశిపుడు వినిపించుకోలేదు. తప్పు నాన్నా.. ఆ విష్ణువు శరణువేడుకోమని ప్రహ్లాదుడు తండ్రికి సలహా ఇచ్చినా అహకారంతో వినిపించుకోక చివరకు ఆ హరి చేతిలోనే హరీమన్నాడు. కటికదరిద్రం అనుభవించిన కుచేలుడికి సకలసంపదలను చేకూర్చింది ఈ సలహానే. భార్య సలహామేరకే చిన్ననాటి స్నేహితుడైన కృష్ణుడికి అటుకులను పెడ్తాడు కుచేలుడు ప్రేమగా. స్నేహితుడి చెలిమికి కరిగిపోయిన కృష్ణుడు సిరిని కానుకగా ఇస్తాడు. ఇలా ‘సలహా’ పురాణాలలో, ఇతిహాసాలలో పెద్ద పాత్రనే పోషించింది. అనేకానేక మలుపులకు కారణం అయింది. చరిత్ర చాణక్యుడి సలహా చంద్రగుప్త మౌర్యుడిని చక్రవర్తిని చేసింది. అలాగే మూర్ఖుల మెదళ్లను ప్రభావితం చేసి రక్తపాతాన్నీ సృష్టించింది. హిట్లర్ నియంతృత్వ నైజాన్ని పెంచడంలో ఇది పోషించిన పాత్ర అంతా ఇంతా కాదు. అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేయాలనే గోబెల్స్ సలహాను విని ఆ రకమైన ప్రాపగాండకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు హిట్లర్. ఇక్కడితో ఆగితే బాగుండు.. కనీసం చరిత్రలో ఎక్కడైనా మంచిగా కనిపించేవాడు. సలహా కనుక దుష్టరూపంలోకి వస్తే వీసమంత మంచికీ చాన్స్ ఇవ్వదు కదా! యూదులంటే హిట్లర్కున్న ద్వేషాన్ని తెలుసుకున్న అతని సలహాదారుడు ఆల్ఫ్రెడ్ రోజెన్బర్గ్... ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకున్నాడు. యూదుల మీద తనకున్న పగను హిట్లర్ ద్వారా తీర్చుకోవాలనుకున్నాడు. అందుకే యూదుల ఊచకోత అనే వికృత సలహా ఇచ్చి రెండో ప్రపంచ యుద్ధానికే ఘంటికలు మోగించాడు. చరిత్రను తవ్వితే... ఇలాంటివెన్నో! ప్రతి ఆక్రమణ వెనక... ప్రతి దాడి ముందు ఉన్నది సలహానే! కొందరికి ఇది విజయాలను పంచిపెడితే కొందరికి ఓటమిని తేల్చింది! రాజకీయాలు దైనందిన జీవితంలో దీన్ని ఎవరూ అడగకపోయినా.. దీని జాడనే సహించకపోయినా.. రాజకీయాల్లో మాత్రం దీని ప్రమేయం అనివార్యమైంది. అయితే మామూలు జీవితాల్లో ఇది కంచిగరుడ సేవ చేస్తే.. పాలిటిక్స్లో మాత్రం దీని సర్వీస్ పాష్గానే ఉంటుంది. ఆంతరంగిక సలహాదారు, ప్రభుత్వ సలహాదారు..అనే హోదాలున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో దేశ ప్రధానిగా ఢిల్లీ పీటమెక్కిన నరేంద్ర మోదీ విజయానికి అమిత్షా సలహానే కారణమైంది. కానీ తర్వాత కాలంలో ఆ అమిత్షా సలహాలే సెల్ఫీల పిచ్చోడిగా.. కోట్లు (ధరించేవి) మార్చే వెర్రోడిగా మోదీలోని కొత్త కోణాన్ని పరిచయం చేశాయి. మతోన్మాది ముద్రనూ వేశాయి. అరవింద్ కేజ్రివాల్నూ ఈ సలహాలు నానా ప్రాంతాలను ఊడిపించాయి.. ఆఖరకు ఏడిపించాయి. సామాన్యుడి జీవితంలో... సలహా ఒక రొద.. వ్యధ. ఖర్చయ్యేది కాదుకదా.. అని విసిరిపారేసే ఓ వల. వద్దన్నా చిక్కుకు పోతాడు మనిషి. విననూ అంటూ దూరంగా పారిపోతుంటే వెంటాడి వేటాడి మరీ చెవిలో దూరుతుంది. నడక నేర్చిన దగ్గర్నుంచి మొదలవుతాయి ఈ కవల సోదరి పెట్టే కష్టాలు. అటు వెళ్లకు.. ఇటు రాకు.. అది చూడకు.. ఇది విను.. అది తినకు.. ఇది తీసుకో అంటూ! కాస్త పెద్దయితే ఇది చదువు.. ఈ పని చెయ్ అని. పెళ్లీడు వచ్చిందంటే.. ప్రేమించమని ఓ సలహా.. వద్దని ఇంకో సలహా. కట్నం తీసుకో అని ఒకరి సలహా. పెళ్లయ్యాకైతే భార్య రూపంలో భర్తకు.. భర్త రూపంలో భార్యకు ఈ సలహా శాశ్వతతోడుగా మారిపోతుంది. సొంత వ్యక్తిత్వం ఎదగనివ్వకుండా అనుక్షణం వెంటాడుతూనే ఉంటుంది. పైగా సొంత వ్యక్తిత్వం లేదనే తెగడ్తనూ ఇస్తుందిదే! ఒకవేళ సలహాసొదను వినకుండా సొంతంగా ఆలోచించి అడుగులేసి పొరపాటున కిందపడితే మూతి మూర జాపి నవ్వేదీ అదే! ఎప్పుడు మంచిది? పీపుల్ డోంట్ అల్వేస్ నీడ్ అడ్వయిజ్.. సమ్టైమ్స్ ఆల్ దె రియల్లీ నీడ్ ఈజ్ ఎ హ్యాండ్ టు హోల్డ్.. యాన్ ఇయర్ టు లిజన్... అండ్ ఎ హార్ట్ టు అండర్స్టాండ్ దెమ్! అంటే సలహా అవసరాన్ని బట్టి తన ఆకారాన్ని మార్చుకుంటే అందరి మన్ననలనూ పొందుతుంది. ప్రతి విజేత తన సక్సెస్ క్రెడిట్ను సలహాకే సొంతం చేస్తాడు. సలహాలు అందరూ ఇస్తారు.. కానీ సరైన సమయంలో ఇచ్చినవారే శ్రేయోభిలాషులుగా మిగులుతారు. ఆ సలహాకీ ఆ మంచితనం అంటుతుంది. ఈ కోవలోకి రాని సలహాలకు ఉచితం అనే బరువైన ట్యాగ్ పడేదందుకే! పాండవాగ్రజుడు ధర్మరాజుని ఎవరో అడిగారట.. మనిషి చేయగల చాలా సులువైన పని ఏంటీ అని. దానికి ఆయన.. ‘‘సలహా’’ ఇవ్వడం’ అని చెప్పాడట. అలా కష్టపడకుండా ఎదుటివారికి సలహాలివ్వడమంటే సలహాకున్న విలువ తగ్గించడమన్నట్టే! - సరస్వతి రమ -
ఉడతాభక్తి
నానుడి రామాయణంలోని చిన్న ఉదంతం నుంచి పుట్టిన నానుడి ఇది. లంకలో ఉన్న సీతను తీసుకు రావడానికి రామలక్ష్మణులు సుగ్రీవుని అధీనంలోని వానరసైన్యంతో యుద్ధానికి బయలుదేరతారు. సముద్రానికి ఆవల ఉన్న లంకను చేరుకునే శక్తి వానర యోధుల్లో కొద్ది మందికి తప్ప అందరికీ లేదు. సుగ్రీవుడి సేనాని నీలుడికి సముద్రంపై ఎలాంటి పదార్థాన్నయినా తేలియాడేలా నిలిపే శక్తి ఉంది. లంక వరకు వారధి నిర్మించడానికి వానర యోధులు యథాశక్తి పెద్దపెద్ద బండరాళ్లను సముద్రంలో పడవేస్తుంటారు. అది చూసిన ఓ ఉడతకు రామునికి సాయం చేయాలనిపిస్తుంది. తన శక్తి మేరకు నోటితో చిన్న చిన్న మట్టిబెడ్డలను తీసుకొచ్చి సముద్రంలో పడవేయసాగింది. బృహత్తర కార్యక్రమానికి ఆ స్థాయిలో కాకున్నా, శక్తివంచన లేకుండా చిత్తశుద్ధితో చేసే తన వంతు సాయాన్ని ఉడతాభక్తి అనడం వాడుకగా మారింది. -
విజయానికి రామాయణం
13-19 కేరెంటింగ్ అందరూ ఆ దశను దాటి వచ్చినవారే! అందరూ ఆ దశను అర్థం చేసుకోవడం పట్ల నిర్లక్ష్యం చేసేవారే! ఎందుకలా?! జీవితంలో అత్యంత ప్రాధాన్యం గల కౌమార దశను అర్థం చేసుకునేదెలా? సరైన మార్గం చూపేదెలా?! ఆ మార్గం చూపే ప్రయత్నమే ఈ 13-19... పందిళ్లు... పెళ్లి వేడుకలతో ఊరూ, వాడా కళకళలాడే రోజు శ్రీరామనవమి. ఎంతో సందడిగా ఉండే ఈ రోజు దేవుడి కల్యాణంగా మాత్రమే ఎందుకు మిగిలిపోవాలి?! మనిషిగా పుట్టి మనిషిగా ఎదిగి.. సకల జనులకు ఆదర్శప్రాయుడైన రాముడి గాథను రేపటి తరానికి పరిచయం చేస్తే! అయితే ఎందుకు ఆలశ్యం.. జీవితంలోని సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో ఈ వయసు వారికి ఈ రోజే తెలియజేయండి. రాముడు సకల గుణాభిరాముడుగా మనందరికీ తెలుసు. గౌరవం, ప్రేమ, దయ, ధైర్యం, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం.. ఇలా ఎన్నో విశేషాలు ఆయనను కోటాను కోట్ల మందిలో ఉన్నతంగా నిలిపింది. యుగాలు గడిచినా నాటి కథనం ఇంకా ఇంకా అందరినీ ఆకట్టుకుంటూనే ఉంటుంది. విధి నిర్వహణే ప్రధానం... బాల్యంలో తండ్రి దశరథమహారాజు, తల్లి కౌసల్య, పిన తల్లులైన సుమిత్ర, కైకల చెంత రాజసౌధంలో రాముడు ఎంతో గారాబంగా పెరిగాడు. ఏది కోరినా క్షణాల్లో అతని చెంత తెచ్చిపెట్టేందుకు బోలెడంత పరివారం చుట్టూతా ఉంది. అలాంటి చోట నుంచి ఓ రోజు గురువు విశ్వామిత్రుని ఆదేశం ప్రకారం అరణ్యాలకు పయనం కావల్సి వచ్చింది. అదీ పన్నెండేళ్ల వయసులో. అరణ్యంలో రాక్షసులను ఎదుర్కొని, రుషులు చేసే యజ్ఞానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాల్సిన బాధ్యతను రాముడి మీద పెట్టారు గురువు. అంత చిన్నవయసులో అంత పెద్ద పని... అయినా రాముడు భయపడలేదు. తనకు గురువు అప్పజెప్పిన పనిని పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. మరో ఆలోచనకు తావివ్వకుండా ఏకచిత్తంతో కార్యసాధనకు పూనుకున్నాడు. తన విధికి ఆటంకం కలిగించే రాక్షసులను సంహరించి, యజ్ఞం సవ్యంగా జరిగేలా చూశాడు. గురువు తనకు చెప్పిన బాధ్యతను కాద నకుండా నిర్వర్తించాడు. అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. భయం అనేది దరిచేరకుండా చూసుకుంటే చేసే ప్రతి పనిలో విజయం చేకూరుతుందని ఈ సందర్భం మనకు తెలియపరుస్తుంది. అంతేనా, గురువు మాటలకు ఎదురుచెప్పకుండా అరణ్యంలో ఉంటూ కఠిన విద్యను అభ్యసించారు రాముడు, ఆయన తమ్ముడు లక్ష్మణుడు. శ్రమ, నేర్చుకోవాలనే తపన మనిషిని ఎంత మెరుగు పరుస్తుందో వారి బాల్యాన్ని ఉదాహరణగా తీసుకొని చెబితే పిల్లలు ఆసక్తిగా వింటారు. సమస్యను అర్థం చేసుకునే నేర్పు... రాముడికి పెళ్లైంది. వనవాసంలో అతని భార్య అయిన సీతను ఎవరో దుండగుడు ఎత్తుకెళ్లిపోయాడు. చాలా పెద్ద సమస్య!! ఎవరిని అడగాలి? పెద్ద అడవిలో... ఆమె ఎక్కడ ఉందో తెలియదు. ఎలాంటి స్థితిలో ఉందో తెలియదు. మనకో సమస్య వచ్చినప్పుడు మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. అప్పుడు ఎవరిని సాయం అడగాలో తెలియదు. ఎదుటపడినవారి నుంచి ఎలాంటి సాయం పొందాలో తెలియదు. సీతను వెతుకుతూ వెళ్లే దారిలో రామునికి ఎంతో మంది కలిశారు. ముఖ్యంగా వానరసైన్యం గల సుగ్రీవుడు. అతనికీ ఓ సమస్య ఉంది. సుగ్రీవుడి సోదరుడు వాలి దౌర్జన్యంగా అతని రాజ్యాన్ని లాక్కున్నాడు. విషయం తెలుసుకున్న రాముడు సుగ్రీవుడికి సాయంగా నిలిచాడు. వాలితో యుద్ధం చేసి, రాజ్యం సుగ్రీవుడికి తిరిగి దక్కేలా చేశాడు. ‘మనమే సమస్యలో ఉన్నాం, అలాంటప్పుడు ఇంకొకరికి ఎలా సాయం చేస్తాం..?!’ అనేది మనలో చాలా మందికి కలిగే ఆలోచన. అలాంటప్పుడు ఇంకొకరి సమస్య మనకు పట్టదు. కానీ, ఎవరు సాయం చే యగలరని రాముడిక్కడ డీలా పడలేదు. ఎలా ఈ సమస్యను పరిష్కరించాలా అని ఆలోచించాడు. సుగ్రీవుడికి స్నేహితుడయ్యాడు. అతని కష్టాన్ని తీర్చి, అతని రాజ్యాన్ని అతనికి ఇప్పించాడు. సుగ్రీవుని వానర సాయంతోనే సముద్రంపై వంతెన కట్టించాడు. లంకను చేరుకొని, రావణాసురుడితో యుద్ధం చేసి తన భార్యను తిరిగి తెచ్చుకున్నాడు. అంటే, మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టం నుంచి బయటపడటానికి ఎలాంటి వారి సాయం పొందాలో, కష్టంలో ఎదుటివారికి ఎలా సాయ పడాలో ఈ సందర్భం మనకు తెలియజేస్తుందన్నమాట. సమస్యల పర్వతం... రామరావణాసుర యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు అతన్ని మేల్కొల్పడానికి హనుమంతుడికి ఒక పనిని అప్పజెప్పాడు రాముడు. సంజీవనీ అనే మొక్కను తీసుకురమ్మని. అది కూడా చాలా త్వరగా తెమ్మని చెప్పాడు. హనుమంతుడు వెనకాముందు చూసుకోలేదు. మొక్కను తీసుకురావడానికి వెళ్లిపోయాడు. రాముడు చెప్పిన పర్వతం చేరుకున్నాక, హనుమకు సందేహం వచ్చింది. సంజీవని మొక్క ఎలా ఉంటుంది? పర్వతమంతా వెతికాడు. ఎన్నో చెట్లు.. మొక్కలు.. పెద్ద పెద్ద రాళ్లు.. ఆ మొక్క ఎలా ఉంటుందో తెలియనప్పుడు వాటి మధ్య ఉన్న దానిని ఎలా తీసుకురావడం?! అందుకే పర్వతాన్నే పెకిలించి, మోసుకొచ్చేశాడు. మనలో ప్రతి ఒక్కరికీ సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆ సమస్యకు భయపడితే పర్వతం కన్నా పెద్దదిగా కనిపిస్తుంది. భయపడకుండా చూస్తే అదే సమస్య చాలా చిన్నగా కనిపిస్తుంది. అప్పుడే ధైర్యం, సాధించగలననే నమ్మకం మనలో కలుగుతాయి. రాముడి జీవితమంతా సమస్యలే. కానీ, ఆ సమస్యల్ని ఎదుర్కొన్న విధమే ఆయనకా ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. అంతేకాదు, రామాయణంలోని ప్రతి సన్నివేశం, ప్రతి పాత్రా కౌమారంలో ఉన్న పిల్లలకే కాదు పెద్దలకూ జీవితపాఠాలు నేర్పిస్తుంది. రామనవమి నాడు రామ జీవితకథను పాఠ్యాంశంగా పిల్లలకు పరిచయం చేస్తే వారి జీవనరాదారిలో వచ్చే ఎన్నో సవాళ్లను ఎదుర్కొనే నేర్పును పంచినవారవుతారు. పురాణాలు, ఇతిహాసాలు చెప్పేటప్పుడు పిల్లలకు అభూతకల్పనలతో కాకుండా సమస్యలు వచ్చినప్పుడు ఎలా పరిష్కరించుకోవాలో సూచించేలా కథనాలు ఎంచుకోవాలి. నేను దశావతరాలను కథ లుగా చెప్పేటప్పుడు చిన్న చిన్న పద్యాలు కూడా పరిచయం చేస్తాను. పిల్లల్లో ఊహాత్మక శక్తిని, ఆలోచనా విధానాన్ని పెంచేవి ఈ కథనాలే! - దీపాకిరణ్, స్టోరీ టెల్లర్ -
మానవేతిహాసమే రామాయణం
‘ర’ అంటే కాంతి. ‘మ’ అంటే నేను అని అర్థం. రామ అంటే ‘నా లోపలి వెలుగు’ అని భావం. రాముడి తలిదండ్రులు కౌసల్య, దశరథులు. దశరథ అంటే పది రథాలు. ఈ పది రథాలూ మన పంచ జ్ఞానేంద్రియాలను, పంచ కర్మేంద్రియాలనూ సూచిస్తాయి. కౌసల్య అంటే నైపుణ్యం (కుశలత). అయోధ్య అంటే హింసలేని సమాజం అని అర్థం. మీ లోపల ఏం జరుగుతోందో మీరు కుశలతతో గమనిస్తే మీలో జ్ఞానకాంతి ఉదయిస్తుంది. అదే ధ్యానం. మానసిక ఒత్తిడినుంచి విశ్రాంతి పొందేందుకు మీకు కొంత నైపుణ్యం కావాలి. మీ లోపల వెలుగు ఉదయించినప్పుడు మీరే రాముడు. మనసు లేదా బుద్ధి సీతకు చిహ్నం. సీత రావణుని చేత అంటే బుద్ధి అహంకారం చేత అపహరింపబడింది. రావణునికి పది తలలు. రావణుడు (అహంకారం) తన తలలలో అంటే అహంకారపు ఆలోచనలలో చిక్కుకుపోయి ఉన్నాడు. హనుమ అంటే శ్వాస. హనుమంతుని (శ్వాస) సహాయంతో సీత (బుద్ధి) తిరిగి రాముని వద్దకు (మూలానికి) చేరుకోగలిగింది. అంటే రామాయణం ఒక మానవేతిహాసం. జర్మనీలోని రామ్బాగ్, ఇటలీలోని రోమ్ పట్టణాల పేర్లకు మూలం రామ శబ్దమే. ఇండోనేసియా, బాలి, జపాన్ వంటి దేశాలు రామాయణ ప్రభావానికి లోనైనాయి. - శ్రీ శ్రీ రవిశంకర్, వ్యవస్థాపకులు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ -
సుందరకాండకు సుందర అనువాదం...
Finding The Mother అనువాదం రామాయణమే ఒక సుందర కావ్యం. అందులోని సుందరకాండ ఇంకా సుందరమైన భాగం. రామాయణంలోని ఒక విశిష్టమైన కాండంగా, పారాయణ కాండంగా, గాయత్రీ మంత్రాన్ని నిగూఢంగా నిక్షిప్తం చేసుకున్న కాండంగా, శ్రీరాముని సుందర నామాన్ని పలుమార్లు గానం చేసే కాండంగా, అన్నింటి కంటే ముఖ్యం మారుతి లీలలను వర్ణించే కాండంగా సుందరకాండకు పండితులూ పామరులు ప్రాముఖ్యం ఇస్తారు. వాల్మీకి మహర్షి అన్ని కాండాలకూ వాటి కథాంశాన్నో, కథాస్థలినో తెలిపే పేరు పెట్టినా ఒక్క ఈ కాండానికి మాత్రం ‘సుందరకాండ’ అని పెట్టి పాఠకులకు ప్రహేళిక వదిలాడు. సుందరకాండలో సుందరమైనది ఏది? ఎవరు? శ్రీరాముడు అని కొందరు, మహాశక్తికి ప్రతిరూపమైన సీత యొక్క సౌందర్యమూర్తి అని కొందరు, సుందరుడనే అసలు పేరు కలిగిన హనుమంతుడని కొందరు... ఇలా ఎన్నో వ్యాఖ్యానాలు... ఏ వ్యాఖ్యానం ఎలా ఉన్నా తల్లి సీతమ్మను వెతకడానికి బయలుదేరిన హనుమంతుడు చూసి రమ్మంటే కాల్చి వచ్చిన వైనం వల్ల కూడా ఇది ఆబాల గోపాలానికి ఇష్టమైన కాండం. అంతే కాదు దీనిని పారాయణం చేయడం వల్ల కష్టాలు తొలుగుతాయనే నమ్మకం వల్ల కూడా ఇది కోట్లాది మంది భక్తుల నాల్కల మీద అనునిత్యం తారాడుతుంటుంది. ఇట్టి సుందరకాండను మూల రచన నుంచి ఇంగ్లిష్లో అనువాదం చేయాలంటే కేవలం భాష, భక్తి మాత్రమే చాలవు. ఆ సుందరకావ్యం పట్ల నిమగ్నం కాగల మస్తిష్కం కూడా కావాలి. అందులోని సూక్ష్మపార్శ్వాలను అర్థం చెడకుండా అన్యభాషలోకి పరావర్తనం చేయగల పద సంపద, మేధస్సు కావాలి. ‘మహతి’ అనే కలం పేరు పెట్టుకున్న నెల్లూరు వాసి మైడవోలు వెంకట శేష సత్యనారాయణ ఆ పనిని సమర్థంగా చేశారని అతి సుందరతతో మెప్పించారని ఈ గ్రంథం చదివితే తెలుస్తుంది. ప్రపంచ పాఠకులకు ఇది తెలుగు రచయిత కానుక. తెలుగు చదవలేని తెలుగు నూతన తరానికి కూడా కానుకే. ఈ గ్రంథానికి పెద్దలు ఐ.వి.చలపతిరావు రాసిన ముందుమాట తప్పక పరిశీలించదగ్గది. -
ఆదిదేవ నమస్తుభ్యం...
‘ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం’ అని రామాయణం చెబుతుంది. అంతటి మహిమాన్విత దైవంగా గ్రహరాజు, త్రిమూర్తి స్వరూపుడైన శ్రీసూర్యనారాయణస్వామి దక్షిణ భారతాన కళింగ దేశంల అరసవల్లి క్షేత్రంలో వెలిశాడు. విశ్వ విఖ్యాతమైన ఈ దేవాలయానికి గల 5 ద్వారాల నుంచి ప్రతి సంవత్సరం రెండు ఆయనాలలో అంటే మార్చి 7 నుంచి 10 వరకు, మరలా అక్టోబరు 1, 2, 3 తేదీలలో ప్రాతఃకాల సూర్యకాంతి నేరుగా శ్రీస్వామివారి పాదపద్మాలపై పడటం విశేషం. మాఘశుద్ధ సప్తమీ సోమవారం అనగా జనవరి 26 నాడుఈ క్షేత్రంలో సూర్యజయంతి ఉత్సవాలు జరగనున్న సందర్భంగా ఈ వ్యాస కుసుమం. ఆంధ్రప్రదేశంలో శ్రీకాకుళం పట్టణంలో అరసవల్లి క్షేత్రంలో శ్రీఉషా, ఛాయా, పద్మినీ సమేత శ్రీసూర్యనారాయణ స్వామివారిని దేవరాజయిన ఇంద్రుడు లోక కల్యాణార్థం ప్రతిష్టించినట్లు పురాణగాథల మనకు తెలుస్తోంది. అలనాటి హర్షవల్లే.. నేటి అరసవల్లి! క్షేత్రంలో ప్రవేశించగానే ఒక విధమైన హర్షాతిశయం కలుగుతున్నందువల్ల దీనిని ‘హర్షవల్లి’గా పిలవవచ్చు. సూర్యనారాయణ మూర్తి సాన్నిధ్యం వల్ల చాలా ఆనంద ప్రదమైన సుఖశాంతులు ఇచ్చే దివ్య క్షేత్రం ఇది. దీనిని అన్మోహరక్షేత్రం అని కూడా పెద్దలు అంటారు. అర్మస్సు అనగా మూలవ్యాధి, ఇదొక మొండి తెగులు. అట్టి జబ్బులను తొలగించు దివ్యక్షేత్రం అవటంతో ‘అర్సవల్లి’ అనికూడా అంటారు. పుష్కరిణీ విశిష్టత ఇక్కడి పుష్కరిణిని దేవేంద్రుడు తన వజ్రాఘాతంతో తవ్వేడని, ఆలయ మూలవిరాట్టు శ్రీసూర్యనారాయణ మూర్తి విగ్రహం ఇందులో లభించిందని, దేవేంద్రుడు అక్కడ ప్రతిష్ట చేశాడని స్కాందపురాణంలో ఉంది. ఆ జలంలో కొన్ని రోగ నిర్మూలన ఔషధాలైన లవణాలు ఉన్నాయని, వాటికి అన్ని రోగాలను తొలగించే శక్తి ఉందని అభిజ్ఞులు చెప్పగా, శాస్త్రజ్ఞులు ఒప్పుకున్నారు. సర్వపాప ప్రణాశనమై, సర్వరోగ నివార కమైన ఈ జలం ఎప్పుడూ అమృతాయమానంగా ఉంటుంది. ఆలయ ప్రాశస్త్యం ఆలయ ప్రాకారం అంబరాన్ని చుంబించేంతగా శిఖరాలతో కనపడుతుంది. ఆలయ ప్రవేశానికి ముందు గోపురం అతి ప్రాచీనం కాకున్నా అందంగా అమరికైన శిల్పంతో ఉంటుంది. ఆలయావరణ చాలా పెద్దది. గరుడ స్తంభం దాటిన వెంటనే ముఖమండపం చేరుతాం. శ్రీస్వామివారి దేవాలయాన్ని కళింగ శిల్పశైలిలో నూతనంగా నిర్మించారు. ఒక మండపం, రెండు ముఖ ద్వారాలు, ఇతర నిర్మాణాలను దాతల సహకారంతో చేయించారు. శివస్వరూపుడుగా జ్ఞానాన్ని, కేశవ స్వరూపుడుగా ముక్తిని, తేజో స్వరూపుడుగా ఆరోగ్యాన్ని ఆ దేవుడు ఇయ్యగలడని ప్రతీతి. ఇంద్రియాలను బంధించు సర్వరోగాలను ఆ దేవుని తేజస్సు తొలగిస్తుంది. వాత, పిత్త, శ్లేష్మ, కుష్టోదర, ప్రమేహ, భగందర, గ్రహణ్యాది మహారోగ హర్తగా ఆర్వాద్వాదశ స్తోత్రంలో సూర్యుడు వర్ణించబడ్డారు. చర్మ, నేత్ర, హృదయేంద్రియాలకు కలిగే సమస్తరోగాలను ఈ దేవుడు నాశనం చేస్తాడు. ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణ లు చేస్తూ, అభిషేక జలపూర్ణమయిన సోమసూత్ర జలం తలపై జల్లుకుంటే సర్వరోగాలు నశిస్తాయని సూర్యమండలాష్టకంలో చెప్పబడింది. సౌర్యోపాసకులు సూర్యుని ఎర్రమందారాల తో పూజిస్తారు. ఎర్రని బట్టలు కడతారు. బంగారు పాదుకలు, నేత్రాలు, వజ్రకవచం ధరింపచేసి ఆరాధిస్తారు. మూల విరాట్టు పాదాల దగ్గర సౌరయంత్రం ఉంది. యంత్రం అంటే భగవంతుని దివ్యశక్తిని కేంద్రీకరించుకొని, భక్తులకు ప్రసాదించే పీఠం. ఈ యంత్రాన్ని సూర్యమండలం అంటారు. ఇది ఇంద్రధనుస్సులోగల సప్తవర్ణాలతో రచించపబడింది. చారిత్రక నేపథ్యం అరసవిల్లి సూర్యాలయానికి చారిత్రక ఖ్యాతి చాలా ఉంది. కళింగ దేశంలో 7వ శతాబ్దం ఉత్తర భాగం నాటికి పూర్వ గాంగరాజులు కళింగంలో వైదిక ధర్మోద్ధరణం బాగా చేశారు. ఆ వంశంలో క్రీశ.676 నుంచి 688 మధ్య రాజ్యం చేసిన దేవేంద్రవర్మ కాలంలో అరసవల్లి దేవాలయం నిర్మాణం జరిగినట్లు పరిశోధకులు చెపుతున్నారు. సూర్యకిరణాల ప్రాశస్త్యం సూర్యనారాయణ స్వామి ప్రతి ఏడాది రెండు పర్యాయాలు ఇక్కడి స్వామివారి పాదాలను ప్రత్యక్ష నారాయణుడి కిరణాలు తాకుతాయి. ఈ సమయంలో స్వామివారు బంగారు రంగులో మెరిసిపోతూ భక్తులకు ఆదిత్యుడు దర్శనమిస్తాడు. ప్రతి ఏడాది సూర్యుడు ఉత్తరాయనం నుంచి దక్షిణాయనాని (మార్చి 7నుంచి 10 తేదీలు)కి, దక్షిణాయనం నుంచి ఉత్తరాయనానికి (అక్టోబరు 1, 2, 3తేదీలు)కి మారినపుడు మాత్రమే సూర్యభగవానుని పాదాలను తాకుతుంటాయి. ఈ సుందర కమనీయ దృశ్యాన్ని వీక్షించేందుకు సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఇక్కడకు వస్తుంటారు. సూర్యనమస్కారాలు ఇక్కడి ఆలయంలో సూర్యనమస్కారాల సేవ ఉంది. కొందరు అర్చకులు భక్తులు చెల్లించే టిక్కెట్టుపై ఆలయ మండపంలో సూర్యనమస్కారాలను నిర్వహిస్తారు. ఆరోగ్యం కోసం చేయించే ఈ సూర్య నమస్కారాల వలన ఎంతో మంది ఆరోగ్యవంతులైనట్లు తెలుస్తోంది. ఆదివారం సమయంలో ఎక్కువ మంది భక్తులు సూర్యనమస్కారాలను చేయించుకొని వారి అనారోగ్య సమస్యలను తొలగించుకుంటారు. రథసప్తమి నాడు విశేషపూజలు సందర్భంగా 26 అర్ధరాత్రి 12.15 గంటలకు సుప్రబాత సేవ, ఉషఃకాలార్చన, శ్రీస్వామివారికి మహాభిషేకసేవ, తెల్లరుజామున ఒంటిగంట నుంచి 5 గంటలవరకు జరుగుతుంది. నిజరూపదర్శనం ఉదయం 5గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు జరుగుతుంది. 4 గంటలనుంచి స్వామివారికి విశేష పుష్పమాలాల ంకార సేవ, సర్వదర్శనం జరుగుతుంది. సాయంత్రం 6గంటలకు విశేషార్చన, నీరాజనం, సర్వదర్శనం రాత్రి 9గంటలకు స్వామివారి ఏకాంత సేవ సందర్భంగా ఉత్సవ సంప్రదాయ కీర్తనలు జరుగుతాయి. ఆ రోజున రూ.100లు ప్రత్యేక దర్శనం, ఉచిత దర్శనం ఉంటాయి. - దువ్వూరి గోపాలరావు ఫోటోలు: కె. జయశంకర్, సాక్షి శ్రీకాకుళం ప్రత్యక్షదైవం ఆదిత్యుడు ప్రత్యక్షదైవంగా భాసిల్లుతున్న ఆదిత్యుడు అందరి అనారోగ్య సమస్యలనూ నయం చేస్తూ ఆరోగ్యప్రదాతగా కీర్తి చెందాడు. వేలాదిమంది భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చి పూజలు చేసి సంపూర్ణ ఆరోగ్యవంతులైనారు. ఎంతో ప్రాముఖ్యత గల ఈ ఆలయం దేశంలోనే ప్రసిద్ధి పొందింది. ఈ స్వామి ఎంతో మహిమాన్వితుడు. - ఇప్పిలి శంకరశర్మ, ఆలయ ప్రధాన అర్చకుడు -
వందే గురు పరంపరామ్
వివరం: యుగయుగాలుగా వర్ధిల్లుతున్న భారతీయ సంస్కృతిలో గురుస్థానం చాలా ప్రధానమైనది. ‘మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ’ అనే వేద వాక్యం క్రమ పరిణామ దశలో బుద్ధి వికసించే సమయానికి ఆచార్యుడే దేవుడౌతున్నాడు. ఉపాధ్యాయుడు, గురువు, ఆచార్యుడు, బోధకుడు, శిక్షకుడు మొదలైనవి పర్యాయపదాలుగా కనపడినప్పటికీ వాటికి వేరువేరు అర్థాలు ఉన్నాయి. దగ్గర కూర్చోబెట్టుకొని చదువు చెప్పేవారిని ఉపాధ్యాయుడు అంటారు. గురు శబ్దానికి విస్తృతమైన అర్థం ఉంది. చదువు చెప్పేవారే కాక, తల్లిదండ్రులు, పెద్దలు, పూజనీయులు, హితం చెప్పేవారు... అందరినీ గురు శబ్దంతో గౌరవించాలి. సక్రమంగా చేయవలసిన విధివిధానాలను, ఆచారాలను శాసించి ఆచరింపజేసేవారు ఆచార్యులు. బోధ చేసేవాడు బోధకుడు. శిక్షణ ఇచ్చేవారు శిక్షకుడు. వీరందరినీ సమానంగా సూచించే పదం గురువు. భారతీయ సంస్కృతికి ప్రధాన గ్రంథాలైన భారత, భాగవత, రామాయణాలను పరిశీలిస్తే, ప్రసిద్ధులైన గురువులు, వారి నుంచి మనం తెలుసుకోవలసిన వ్యక్తిత్వ వికాస లక్షణాలు ఎన్నో ఈ తరానికి ఉపయోగపడతాయి. రామాయణ గురువులు త్రేతాయుగం నాటి రామాయణం మనకు ఆదికావ్యం. రామాయణం పేరు వినగానే గుర్తొచ్చే గురువు వశిష్ఠుడు. ఈయన ఇక్ష్వాకు వంశానికి తరతరాలుగా గురువు. రామ, లక్ష్మణ, భరత, శతృఘు్నలకు నామకరణం చేసి, విద్యాబుద్ధులు నేర్పించి, వేదాలు, శాస్త్రాలు ఆయన నేర్పిస్తే, ధనుర్వేదం మొదలైన యుద్ధ విద్యలను దశరథ మహారాజు పర్యవేక్షణలో నేర్చుకున్నారు. రామావతారం ఆరంభం నుంచి పరిసమాప్తి వరకు వశిష్ఠుడు గురు స్థానంలో ఉన్నాడు. ఏనాడూ ఆయన వారి నుంచి దక్షిణలు ఆశించలేదు. విద్యాబుద్ధులతో, వినయ విధేయతలతో సర్వజన హితంగా, సద్గుణాలతో మానవ జీవితం ఎలా వికసించాలో శ్రీరాముని ద్వారా లోకానికి చాటిచెప్పిన గురువు వశిష్ఠుడు. విద్యార్థికి మరొక పేరు శిష్యుడు. అనగా గురువు చేత శాసింపదగిన వాడు. విద్యార్థి గురువు చెప్పినది భక్తిశ్రద్ధలతో విని, చెప్పినది చేయాలి. గురువు యందు పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి. శ్రీరాముని పట్టాభిషేకానికి ముహూర్తం నిర్ణయించినవాడు వశిష్ఠుడే. కానీ ఆ ముహూర్తానికి రాముడు అరణ్యవాసానికి వెళ్లవలసి వచ్చింది. అంతమాత్రంతో వశిష్ఠుణ్ని తక్కువగా భావించలేదు. రాక్షస సంహారం రామావతార ప్రయోజనం కనుక, రాముణ్ని అరణ్యవాసానికి పంపటానికే బ్రహ్మర్షి వశిష్ఠుడు ఆ ముహూర్తం పెట్టాడని రాముడికి తెలుసు. అరణ్యవాసంలో అరుంధతీ వశిష్ఠుల సత్కారాలను, హితబోధనలను సీతారామలక్ష్మణులు పొందారు. యోగవాసిష్ఠంలో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను వశిష్ఠ మహర్షి రామునికి బోధించాడు. చివరకు పట్టాభిషేకం కూడా జరిపించాడు. అభిప్రాయ భేదాలు లేని గురుశిష్య సంబంధానికి వశిష్ఠుని గురుత్వం ఆదర్శం. రామాయణంలో మరొక గురువు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు. రామునికి పద్నాలుగు, పదిహేనేళ్ల వయసులో యాగ సంర క్షణ పేరుతో దశరథుని అనుమతితో రామలక్ష్మణులను విశ్వామిత్రుడు వెంటబెట్టుకొని అడవికి తీసుకెళ్లాడు. సంచార విద్యాబోధన పద్ధతిలో ఆయా ప్రదేశాలను, ఆశ్రమాలను చూపిస్తూ, వాటి వృత్తాంతాలన్నీ వివరించాడు. తరగతి గదుల్లో పుస్తక పరిజ్ఞానం వస్తే, పర్యటనతో ప్రత్యక్ష జ్ఞానం కలుగుతుంది. దేశాన్ని పరిపాలించబోయేవాడు దేశం నలుమూలలా ఎక్కడ ఏముందో తిరిగి తెలుసుకోవాలి. ధర్మాధర్మాలు, న్యాయాన్యాయాలు రాజభవనం లో కాక, ప్రజల్లో తిరిగి పరిశీలించాలి. యుద్ధవిద్యలు అభ్యాసం చెయ్యటమే కాక, అనుభవంలోకి రావాలి. గతంలో పరిపాలనానుభవం ఉన్న రాజర్షిగా విశ్వామిత్రుడు ఇన్ని కోణాలలో రామునికి గురువైనాడు. స్త్రీ సంహారం అధర్మమైనా, తాటకి వంటి దుష్ట స్త్రీలను శిక్షించడం తప్పుకాదని వివరించాడు. అహల్య వంటి ఆర్తులను ఆదుకోవటం పర్యటనలోనే సాధ్యమని చూపించాడు. తన పూర్వజీవితంలోని తప్పొప్పులను దాచకుండా చెప్పటం ద్వారా దాపరికం లేని వ్యక్తిత్వ వికాసాన్ని బోధించాడు. ముందుగా చెప్పి మానసికంగా ఒత్తిడి పెట్టకుండా, మిథిలా నగరానికి చుట్టపు చూపుగా తీసుకువెళ్లి, శివధనుర్భంగం చేయించి, సీతారాములను కలిపాడు. అప్పటివరకు తెలియని ఎన్నో అస్త్ర విద్యలను రామునికి బోధించాడు. రామాయణంలో విశ్వామిత్రుడు ఉపాధ్యాయుడు, గురువు, ఆచార్యుడు, బోధకుడు, శిక్షకుడు అన్నీ తానే అయి, రాక్షస సంహారానికి రంగం సిద్ధం చేసిన ఆదర్శగురువు. రామాయణంలో మరొక గురువు సూర్యభగవానుడు. ఇక్ష్వాకు వంశానికి మూలపురుషుడు, కర్మసాక్షి, గ్రహాధిపతి అయిన సూర్యుడు... తన కర్తవ్యాన్ని తాను ఆచరిస్తూనే, తనతో తిప్పుకుంటూ విద్యలు బోధించిన ఉత్తమ ఉపాధ్యాయుడు. చిన్ననాడే పండు అనుకొని, తనను మింగటానికి వచ్చి నోరు కాల్చుకున్న చిలిపి హనుమంతుని కృషి, పట్టుదల, కార్యదీక్ష గమనించిన సూర్యుడు... ఉదయం నుంచి అస్తమయం వరకు తనతో ఎగిరే శక్తిశాలి అయిన ఆంజనేయుణ్ని, ఎన్నో వ్యాకరణాలు నేర్చిన బుద్ధిశాలిగా తీర్చిదిద్దాడు. మంచి వక్తగా, పరిశీలనా దక్షునిగా, కార్యసాధకునిగా ఒక విద్యార్థిని సానబెట్టిన ఘనత సూర్యునికే చెల్లుతుంది. గురువుగారితో తూర్పు నుండి పడమరకు ఆగకుండా తిరిగిన సామర్థ్యంతోనే హనుమ సముద్రం దాటి, లంకకు వెళ్లగలిగాడు. చిన్ననాటి గురువుల ప్రభావం విద్యార్థుల భావి జీవితంపై తప్పకుండా ఉంటుందనటానికి ఈ గురుశిష్యులు ఉదాహరణ. రామాయణంలో ఇంకొక సుప్రసిద్ధ గురువు వాల్మీకి మహర్షి. తన ఆశ్రమంలో పుట్టి పెరిగిన లవకుశులకు అమిత వాత్సల్యంతో విద్యాబుద్ధులు నేర్పటమే కాక, సంగీత సాహిత్యాది కళాభినివేశం కూడా కలిగించాడు. దానివల్లనే వారు అయోధ్యకు వెళ్లి, తండ్రిని చూసి, మాట్లాడటం వీలైంది. తల్లిని అడవిలో వదిలిన తండ్రిపై వారికి పగ, ద్వేషం పెరగకుండా లలిత కళలతో వారి వ్యక్తిత్వాన్ని మలచిన వాల్మీకి మహర్షి... నేటి ఉపాధ్యాయ లోకానికి, విద్యాప్రణాళికకు ఆదర్శప్రాయుడు. మహాభారత గురువులు పద్దెనిమిది పర్వాలు, లక్షా పాతికవేల శ్లోకాల మహాభారతంలో లోకం అంతా ఉంది. గురువు ఎట్లా ఉండాలో, శిష్యుడు ఎట్లా ఉండాలో, ఎట్లా ఉండకూడదో చెప్పే ఎన్నో ఉదాహరణలకు ఆలవాలం మహాభారతం. ఉదంకోపాఖ్యానమే గురు శిష్య అనుబంధానికి పరిపూర్ణోదాహరణ. పైల మహర్షి దగ్గర ఉదంకుడు విద్యాభ్యాసాన్ని పూర్తిచేశాడు. గురుదక్షిణ ఇచ్చి వెళ్లాలి. చదువు అయిపోయిందని దక్షిణ ఇవ్వకుండా వెళ్లే శిష్యుడు, ఇస్తానన్నాడని ఎక్కువగా అడిగే గురువు ఇద్దరూ నశించిపోతారని భారత సూక్తి. ఉదంకుడు గురువుగారితో దక్షిణ గురించి ప్రస్తావించాడు. ‘నువ్వు నాకు చాలా సేవ చేశావు. ఏమీ ఇవ్వద్దు. పో’ అన్నాడు గురువు. ‘కాదు కాదు. ఏదో ఒకటి అడగండి’ అన్నాడు ఉదంకుడు. ‘నాకేమీ అక్కర్లేదు. గురుపత్ని ఏవి అడిగితే అవి తెచ్చిపెట్టు’ అన్నాడు గురువు. ఉదంకుడు గురుపత్నికి ఈ సంగతి చెప్పాడు. ఆమె ‘ఈ దేశపు రాజుగారి భార్య కర్ణాభరణాలు చాలా గొప్పవి. నాలుగు రోజుల్లో మనింట్లో ఒక ఉత్సవం ఉంది. అప్పుడు నేను అవి పెట్టుకోవాలనుకుంటున్నాను. వెళ్లి త్వరగా తెచ్చిపెట్టు’ అంది. ఉదంకుడు రాజధానికి బయలుదేరాడు. దారిలో ఎన్నో వింతలు విశేషాలు జరిగాయి. పౌష్య మహారాజు దగ్గరకు వెళ్లాడు. ఆయన ‘రాణిగారిని అడిగి తీసుకుపో’ అన్నాడు. అపరిశుభ్రంగా ఉన్న ఉదంకుడికి ఆమె కనపడలేదు. శుచి అయిన తరువాత కనపడి, కుండలాలు ఇచ్చింది. దారిలో వాటిని తక్షకుడనే సర్పరాజు ఎత్తుకుపోయి, పాతాళంలో దాచిపెట్టాడు. వాటికోసం ఉదంకుడు నేల తవ్వుకొని, పాతాళానికి వెళ్లి, అక్కడ ఎన్నో వింతలు చూశాడు. ఒక కొత్త వ్యక్తి సహాయంతో తక్షకుణ్ని భయపెట్టి, కుండలాలు తీసుకొని సమయానికి తెచ్చి గురుపత్నికి ఇచ్చి, ఆమె ఆశీస్సులు పొందాడు. అప్పుడు గురువుగారికి తాను చూసిన వింతలు విశేషాలు చెప్పి, వాటి అర్థాలు అడిగాడు. గురువుగారు అన్నీ వివరించాడు. నీకు సహాయం చేసిన వ్యక్తి ఇంద్రుడు. అతడు నా స్నేహితుడు. అందుకే నీకు సహాయం చేశాడు... అని చెప్పాడు. ఈ కథలో విద్యార్థి ఉదంకుడికి వ్యక్తిత్వ వికాసం, కార్యసాధకత మొదలైన అంశాల శిక్షణ ప్రయోగాత్మకంగా జరిగింది. గురువు వెనుక నుండి గమనిస్తూ, తోడ్పడుతూ సొంతగా, ధైర్యంగా పని సాధించే ఆత్మస్థైర్యాన్ని కలిగించాడు. మహాభారతంలోని మరొక ప్రసిద్ధ సన్నివేశం ‘కచదేవయానుల కథ’. ఈ కథలో గురువు... దేవయాని తండ్రి శుక్రుడు. శిష్యుడు బృహస్పతి కొడుకు కచుడు. మృత సంజీవనీ విద్య కోసం శుక్రుని దగ్గరకు వచ్చిన కచుడు, ‘ఉత్తమ విద్యార్థి పక్కదారులు పట్టకుండా తన లక్ష్యాన్నిఎలా సాధించాలో’ మనకు చూపించాడు. తన సేవలతో, వినయ విధేయతలతో గురువుకు, గురువుగారి అమ్మాయికి ఆత్మీయుడైనాడు. గురువుగారికి రెండు బలహీనతలు ఉన్నాయి. ఒకటి పుత్రికా వ్యామోహం. రెండు మద్యపాన వ్యసనం. ఈ రెండూ కచుడికి లాభదాయకమైనాయి. లేకపోతే శత్రువర్గంవాడైన కచుడికి మృతసంజీవనీ విద్యను శుక్రాచార్యుడు చెప్పేవాడు కాదు. ఈ కథ ఉత్తమ ఉపాధ్యాయునికి బలహీనతలు, వ్యసనాలు, వ్యామోహాలు ఉండకూడదనే సందేశాన్ని ఇస్తోంది. స్వయంగా శుక్రుడే ‘ఇక ఎవ్వరూ మద్యపానం చెయ్యకండి’ అని చెప్పాడు. ఇది లోకానికి పాఠం. అటువంటి గురువులకు గుణపాఠం. ప్రధాన భారత కథలో ప్రసిద్ధుడైన కౌరవ పాండవ గురువు ద్రోణాచార్యుడు. గురువులో ఉండవలసిన ప్రధాన గుణం శిష్య వాత్సల్యం. అది లేకుండా ఏ గురువూ సరిగా పాఠం చెప్పలేడు. ఆసక్తి, శక్తి ఉన్న విద్యార్థిని ఉపాధ్యాయుడు కన్నకొడుకు కంటే అధికంగా ప్రేమిస్తాడు, ప్రేమించాలి అని ద్రోణార్జున బంధం చెబుతోంది. అందరి కంటె నిన్ను గొప్పవాడిని చేస్తానని ద్రోణుడు అర్జునునికి మాట ఇచ్చాడు. ఇచ్చినట్లే తన కొడుకు అశ్వత్థామకు కూడా చెప్పని యుద్ధ విద్యా రహస్యాలు, అస్త్రశస్త్రాలను అర్జునుడికి చెప్పాడు. పరోక్షంగా తనను పూజించి ఏకాగ్రతతో, స్వయంకృషితో విద్యాభ్యాసం చేసి అర్జునుని కన్నా మరింత విజ్ఞానాన్ని పొందిన ఏకలవ్యుడు దాన్ని దుర్వినియోగం చేసి, రాజకుమారుల దృష్టిలో పడ్డాడు. కక్షతో వాళ్లు అతణ్ని ఎప్పటికీ చంపకుండా, బొటనవేలు గురుదక్షిణగా తీసుకొని, చెడ్డపేరు తెచ్చుకున్న శిష్య వత్సలుడైన గురువు ద్రోణాచార్యుడు. కక్షలు, కార్పణ్యాలు గల రెండు వర్గాల విద్యార్థులను తన కనుసన్నల్లో క్రమశిక్షణతో విద్యాభ్యాసం చేయించిన నైపుణ్యం గల గురువు ద్రోణాచార్యుడు. మహాభారతంలో పైతరం భీష్మునికీ, యువతరం కర్ణునికీ యుద్ధవిద్యలు బోధించిన పరశురాముడు గురువులూ శిష్యులూ గుర్తుపెట్టుకోవలసిన విలక్షణ గురువు. భీష్ముడు పరశురాముని దగ్గర మహేంద్ర పర్వతంపై విద్యాభ్యాసం చేసి, ఆయన ప్రియ శిష్యుడైనాడు. అయినా కాశీరాజు కూతురు అంబకు భీష్ముని వలన అన్యా యం జరిగిందని తెలుసుకొన్న పరశురాముడు, శిష్యుడు చెప్పిన మాట వినకపోవటంతో 24 రోజులు భయంకరమైన యుద్ధం చేసి, ప్రత్యేక పరిస్థితుల్లో విరమించాడు. తప్పు చేసినవాడు తన ప్రియశిష్యుడైనా, క్షమించకుండా పోరాడిన ధర్మగురువు పరశురాముడు. మరికొంత కాలానికి కర్ణుడు అసత్యం చెప్పి, పరశురాముడి దగ్గర విద్యార్థిగా చేరాడు. విద్యాభ్యాసం పూర్తవుతుండగా, ఒక సన్నివేశంలో కర్ణుని అసత్యం గురువుకు తెలిసింది. ఏ విద్య కోసం అతడు అసత్యం చెప్పాడో, అది అతనికి అవసరమైన సమయంలో గుర్తురాదని శపించాడు. విద్య కోసం అసత్యం చెప్పే వక్రబుద్ధి ఉన్నవాడు, అధర్మం కోసమే దానిని ఉపయోగిస్తాడు. అటువంటి శిష్యుల విషయంలో గురువులు జాలిపడకూడదనే సందేశాన్ని అందిస్తున్నాడు. పరశురాముని ధర్మకాఠిన్యం గురువులకు అవసరం. భాగవత గురువులు భక్తుల చరిత్రలు, భగవంతుని చరిత్ర చెప్పే మహాభాగవతం గురుత్వాన్ని, గురుతత్వాన్ని కూడా చెబుతోంది. వామన చరిత్రలో బలిచక్రవర్తి గురువు శుక్రాచార్యుడు. తన శిష్యుడు ప్రమాదంలో ఉన్నాడని కనిపెట్టాడు. కష్టకాలంలో మాట తప్పవచ్చునని కొన్ని ధర్మసూక్ష్మాలు చెప్పాడు. ఏది ఏమైనా నేను మాట తప్పనని గురువును ఎదిరించి, బలిచక్రవర్తి మూడడుగులు దానం చేశాడు. పాతాళానికి తొక్కబడినా ఇప్పటికీ పూజలందుకొంటున్నాడు. గురువు అపకీర్తి అలాగే నిలబడింది. గురువుల, తల్లిదండ్రుల వాత్సల్యం, ప్రేమ పిల్లల విద్యాభివృద్ధికి, ఉత్తమ వ్యక్తిత్వానికీ తోడ్పడాలి కానీ, వారు చెడ్డపనులు చేసినా క్షేమంగా ఉండాలని ప్రోత్సహించరాదని భాగవతం బోధిస్తోంది. ప్రహ్లాద చరిత్రలో ప్రహ్లాదునికి ఇద్దరు గురువులను తండ్రి హిరణ్యకశిపుడు ఏర్పాటు చేశాడు. వారు చండామర్కులు. శుక్రాచార్యుని కొడుకులు. తల్లిదండ్రులు గురువులకు పిల్లల్ని అప్పగించేటప్పుడు ఎలా మాట్లాడాలో హిరణ్యకశిపుని మాటల్లో మనకు తెలుస్తుంది. ‘అయ్యా! మీరు గురువులు. కారుణ్య చిత్తులు, మాకు పెద్దలు. మా పిల్లవాడు ఏమీ తెలియనివాడు, సరిగా మాట్లాడటం కూడా రాదు. బాగా చదివించి నీతి కుశలురుగా చెయ్యండి’ అని ఇంద్రాది దేవతల్ని, విష్ణుమూర్తిని లెక్కచెయ్యనివాడు కూడా తన దగ్గర బతికే గురువుల దగ్గర పిల్లవాడి కోసం వినయంగా మాట్లాడాడు. ఇందులో గురువుల ప్రధాన లక్షణాలు చెప్పాడు. భాగవతంలో మరొక ప్రసిద్ధ గురువు జగద్గురువైన శ్రీకృష్ణుని గురువు సాందీపని. బలరామకృష్ణులు, కుచేలుడు మొదలైనవారు ఆయన దగ్గర వేదశాస్త్రాది విద్యలు అభ్యసించారు. గురువు బాధ్యత... పుస్తకాల్లో ఉన్నది విద్యార్థుల బుర్రకెక్కించటం మాత్రమే కాదు. ఆయన ప్రతి మాట, కదలిక విద్యార్థుల వ్యక్తిత్వాన్ని వికసింపజేయాలి. పేదవాడైన ద్రోణుడు, రాజకుమారుడైన ద్రుపదుడు ఒక గురువు దగ్గరే సన్నిహితంగా చదువుకున్నారు. కానీ తరువాత ద్రుపదుడు రాజై, ద్రోణుడు కనపడితే, ‘నువ్వెవరో నాకు తెలీదు’ అన్నాడు. అలాగే సాందీపని దగ్గర పేదవాడైన కుచేలుడు, శ్రీకృష్ణుడు కలిసి చదువుకున్నారు. ఆ స్నేహాన్ని స్వార్థానికి వాడుకోవాలని కుచేలుడు అనుకోలేదు. వచ్చిన కుచేలుణ్ని శ్రీకృష్ణుడు సాదరంగా ఆహ్వానించి, బంగారు పళ్లెంలో కాళ్లు కడిగాడు. ఇది విద్యాలయ ప్రభావం. అలాగే తమకు ఇష్టమైన గురువుగారి కోసం విద్యార్థులు ఎంతటి అసాధ్యమైన పనులైనా చేస్తారు. ద్రోణుని కోసం అర్జునుడు ద్రుపదుణ్ని బంధించి తెచ్చాడు. గురువుగారి అబ్బాయి చనిపోతే బలరామకృష్ణులు యమలోకానికి వెళ్లి, యమునితో పోరాడి, పిల్లవాణ్ని తెచ్చి గురువుగారిని సంతోషపెట్టారు. గురుదక్షిణగా సమర్పించారు. సర్వజ్ఞులు, జగద్గురువులు, సంపూర్ణులు అయిన అవతార పురుషులు బలరామకృష్ణులు గురువుగారి దగ్గర చేరి, ఎందుకు చదువుకున్నారు? మానవులెవరైనా గురు సన్నిధానంలో గురు ప్రబోధితులై తీరాలి. లేదంటే పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసం కలగదని లోకానికి తెలియజెప్పటానికే వారు సాందీపని వద్ద చదువుకున్నారు... అని భారత సందేశం. రామాయణ భారత భాగవతాల్లోని ప్రసిద్ధ గురువుల పరిచయంతో భారతీయ విద్యావిధానంలో గురువు ప్రాధాన్యాన్ని, ప్రాముఖ్యాన్ని తెలుసుకుందాం. గురువులను గౌరవించి, వారి ఆశీస్సులతో అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిద్దాం. - డా॥పాలపర్తి శ్యామలానందప్రసాద్ -
లంకలో రామాయణ దర్శనం
పాఠక ప్రయాణం శాంకరీదేవి శక్తి పీఠ సందర్శనం.. బుద్ధుని బోధనల ఆధ్యాత్మిక సౌరభం... రామాయణంలోని చివరి అంకానికి సాక్షీభూతమైన ప్రదేశాల ప్రాభవం... సుందర జలపాతాల సౌందర్యం... అడుగడుగునా చారిత్రక వైభవం... కళ్లకు కట్టే శ్రీలంక పర్యటన ఆజన్మాంతం ఓ మధురజ్ఞాపకమని వర్ణిస్తున్నారు ఒంగోలు వాసి అయిన విశ్రాంత ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఎస్వీఎస్ భగవానులు. ద్వాదశ జ్యోతిర్లింగాలను గతంలోనే సందర్శించిన నేను ప్రథమ శక్తి పీఠమైన శ్రీ శాంకరీదేవిని దర్శించాలనుకున్నాను. అందులో భాగంగానే శ్రీలంక ప్రయాణానికి మా బంధువులతో కలిసి బయల్దేరాను. శ్రీలంక ట్రావెల్ ఏజెన్సీతో ముందుగానే ఒప్పందం చేసుకున్నాం. ఒంగోలు నుంచి చెన్నైకి రైలులో అటు నుంచి ఇండియన్ ఎయిర్లైన్స్ వారి విమానంలో బయల్దేరి, గంటన్నర వ్యవధిలో శ్రీలంక రాజధాని కొలంబో విమానాశ్రయంలో దిగాం. అక్కడ శ్రీలంక ట్రావెల్ ఏజెన్సీ వారు తమ వాహనంలో మమ్మల్ని తీసుకెళ్లారు. కొలంబో నుంచి ట్రిన్కోమలీకి... ముందుగా మున్నేశ్వరం చేరుకొని అక్కడ మున్నేశ్వరస్వామి దేవాలయాన్ని సందర్శించాం. రావణవధ అనంత రం రాముడు ప్రతిష్ఠించిన శివ దేవాలయాన్ని, తిరుకోనేశ్వర దేవస్థానం పక్కన సముద్రపు ఒడ్డున గల రావణబ్రహ్మ ఏకైక విగ్రహాన్ని చూసి.. అక్కణ్ణుంచి బయల్దేరి 268 కి.మీ దూరంలోని ట్రిన్కోమలీ పట్టణం చేరాం. ట్రిన్కోమలీలో శక్తి పీఠం ట్రిన్కోమలీ పట్టణానికి సమీపంలో సముద్రంలోకి చొచ్చుకొని వచ్చినట్టున్న కొండపై శాంకరీదేవి ఆలయం ఉంది. ఇక్కడ శాంకరీదేవి దర్శనం మాటల్లో వర్ణించలేం. ఇక్కడే శివుడి గుడి ఉన్న ప్రాంతాన్ని తిరుకోనేశ్వరం అంటారు. ఎటు చూసినా హిందూ, బౌద్ధమతాల సమ్మేళనం కళ్లకు కడుతుంది. డంబుల్లా గుహలలో బంగారు బుద్ధుడు మరుసటి రోజు ట్రిన్కోమలీ నుంచి కాండీ పట్టణానికి బయల్దేరి, మధ్యలో డంబుల్లా గుహలలో బంగారు బుద్ధుని ఆలయం, శ్రీ రాములవారు పాశుపతాస్త్రం సంధించిన ధన్వేలి, రామబాణం పడిన లగ్గాల గ్రామాలను సందర్శించాం. రామ-రావణ సంగ్రామం జరిగిన ప్రదేశాన్ని పరికిస్తూ, టీ తోటల సోయగాలను వీక్షిస్తూ, ఆయుర్వేద మూలికల మందుల తయారీ కేంద్రాలను చూస్తూ, రాత్రి కాండీ పట్టణంలోనే బస చేశాం. మరుసటి రోజు బుద్ధుని అవశేషాలను భద్రపరిచి, దాని పైన నిర్మించిన సుందరమైన బుద్ధ దేవాలయాన్ని సందర్శించాం. లంకలో రామాయణం చివరి అంకం కాండీ నుంచి బయల్దేరి రాంబోడా పర్వతాలపై చిన్మయ మిషన్ వారు నిర్మించిన 18 అడుగుల నిలువెత్తు ఆంజనేయ విగ్రహాన్ని దర్శించి, సముద్రమట్టానికి 6135 అడుగుల ఎత్తు గల నువారా ఎలియా అనే పట్టణం చేరాం. అక్కడ నుండి రావణాసురుడి గుహ కలిగిన ఇస్తిపురం బండారువేల చూశాం. ఈ గుహలు ఆసియా ఖండ ప్రాచీనతకు ప్రత్యక్ష నిదర్శనాలు. హనుమ పాదముద్రలు హనుమంతుడు సంజీవని పర్వతం తెచ్చిన గుర్తుగా ఆయన పాదముద్రలు రుమస్సాలలో చూశాం. మటారాలో నిలువెత్తు బౌద్ధ విగ్రహాన్ని సందర్శించి, హిక్కాదువ అనే సముద్ర ప్రాంతానికి చేరుకున్నాం. ఇక్కడ సుమద్రం గంభీరంగా, రామాయణంలోని సంగ్రామ ఘట్టానికి గుర్తుగా నేటికీ కళ్లెదుట నిలిచింది. రామాయణం జరిగింది అనడానికి పూర్తి ఆధారాలు ఆనవాళ్లతో సహా ఇక్కడ కనిపించాయి. కొలంబోలో సుప్రసిద్ధ రథ పంచముఖ హనుమాన్ మందిరం దర్శించుకొని కొలంబో నుంచి చెన్నై మీదుగా ఒంగోలు చేరాం. మన దేశంలో అయోధ్యలో మొదలైన రామాయణం చివరి అంకాన్ని శ్రీలంకలో వీక్షించి, జన్మ ధన్యైమైందని అందరం భావించాం. సింహళానికి చలో చలో... ఒంగోలు నుంచి చెన్నై మీదుగా కొలొంబో కొలంబో నుంచి ట్రిన్కోమలి 268 కి.మీ. ట్రిన్కోమలిలో అష్టాదశ శక్తిపీఠాలలో తొలిదైన శ్రీశాంకరీదేవి శక్తి పీఠం ఉంది. ట్రిన్కోమలి నుంచి కాండీ పట్టణం 181 కి.మీ -
నివృత్తం: రామాయణమంతా విని, రాముడికి సీతేమౌతుందన్నట్టు...
ఒక ఊళ్లో ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు రాత్రీపగలూ కష్టపడి పని చేస్తుండేవాడు. ఓసారి ఆ ఊళ్లో రామాయణ కథాశ్రవణం ఏర్పాటు చేశారు. దానికి ఇతగాడు కూడా వెళ్లాడు. అయితే బాగా అలసిపోయి ఉండటంతో ఏమీ వినకుండా నిద్రపోయాడు. వారం రోజుల పాటు అలా వెళ్తూనే ఉన్నాడు, నిద్రపోతూనే ఉన్నాడు. చివరి రోజున శ్రవణం ముగిశాక ఓ ఆసామి... ‘‘అసలు నువ్వు ఒక్కరోజైనా రామాయణం విన్నావా, నిద్రపోతూనే ఉన్నావ్’’ అని అన్నాడు. దానికి ఇతడు... ‘‘ఎందుకు వినలేదూ... బాగా విన్నాను. చక్కగా అర్థం చేసుకున్నాను. కానీ ఒక్కటే సందేహం. రాముడికి సీతేమవుతుంది?’’ అన్నాడు. దాంతో అందరూ ఘొల్లుమన్నారు. అప్పట్నుంచీ ఈ మాట వాడుకలోకి వచ్చింది. చెప్పినదంతా విని కూడా ఎవరైనా అర్థం లేని ప్రశ్నలు అడిగినప్పుడు ఈ సామెత వాడుతుంటారు. సీమంతం ఎందుకు చేస్తారు? కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికి తల్లి శారీరక, మానసిక ఉల్లాసం ఎంతో అవసరం. ఆమెను అలా ఉంచేందుకుగాను భర్త రెండు నియమాలు పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. వాటిలో ఒకటి దోహదం. అంటే గర్భిణి అయిన భార్య కోరికలను తెలుసుకుని తీర్చడం. రెండోది సీమంతం. అంటే తల్లి కాబోతున్న భార్యను అపురూపంగా చూసుకోవడం. గర్భిణిగా ఉన్నకాలంలో ఐదు లేక ఏడో నెలలో సీమంతాన్ని జరుపుతారు. సీమంతం రోజున గర్భవతికి చేతినిండా గాజులు వేస్తారు. ఎందుకంటే... గర్భం ధరించిన స్త్రీ గర్భకోశంలోని జీవనాడుల మీద తగినంత ఒత్తిడి పడాలి. దానివల్ల సుఖప్రసవం అవుతుంది. చేతుల్లోని నరాలకి, గర్భకోశానికి సంబంధం ఉండటం వల్ల గాజులు తొడగడం ద్వారా తగినంత ఒత్తిడి కలిగించవచ్చని ఓ నమ్మకం. -
సంపూర్ణ రామాయణం - 3
1. దశరథుని రాజ్యం పేరు ఏమిటి? 2. దశరథునికి భార్యలు ఎందరు? 3. భార్యల పేర్లు ఏమిటి? 4. దశరథుడు చేసిన యాగం పేరు ఏమిటి? 5. యజ్ఞపురుషుడు ఇచ్చిన ప్రసాదాన్ని ఎవరెవరికి ఎలా పంచాడు? జవాబులు: 1. అయోధ్య 2. ముగ్గురు 3. కౌసల్య, కైకేయి, సుమిత్ర 4. పుత్రకామేష్ఠి 5. కౌసల్యకు ఒక భాగం, కైకేయికి ఒక భాగం, సుమిత్రకు రెండు భాగాలు. -
కష్టాలను ఎదిరించి సాగటమే సజ్జనుల నైజం
‘‘క్రియాసిద్ధిః సత్త్వే భవతి మహతాం నోపకరణే’’ అని పెద్దల సూక్తి. మానవ జీవితంలో అనేక లక్ష్యాలుంటాయి. ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే వాటిని భారతీయ సంస్కృతి పురుషార్థాలుగా చెప్పింది. అంటే ప్రతి మానవుడు జన్మనెత్తిన తరువాత పైవాటిని సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. అసలు ఏదీ సాధించకపోతే జీవితానికి అర్థం ఉండదు. ఏ అర్థాన్నీ చెప్పక సాధారణంగా మిగిలిపోయే శబ్దంలాగ లక్ష్యం లేని జీవితం విలువ లేనిది అవుతుంది. సూక్ష్మంగా పరిశీలిస్తే మానవులకేగాక, జ్ఞానం కలిగిన జంతువులకూ లక్ష్యం ఉండటం గమనిస్తాం. రామాయణంలో పరిశీలిస్తే జటాయువుకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. అది కేవలం పక్షి మాత్రమే కాక, ఎంతో ధర్మజ్ఞానంతో కూడినది. సీతను రావణుడు అపహరిస్తున్నప్పుడు పక్షి అయినా వీరులకు సైతం సాధ్యం కాని విధంగా పోరాడటం మాత్రమేగాక సీతాపహరణ వార్తను శ్రీరామునికి చెప్పాలని చాలాకాలం ఎదురుచూసింది. చివరకు ఆ వార్తను రామునికి అందించి తన కర్తవ్యాన్ని నెరవేర్చుకుంది. అందుకే అది శాశ్వతమైన కీర్తిని పొందింది. ఒక సామాన్యమైన పక్షే తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంటే దానితో సమానంగా మానవులు కూడా లక్ష్యాన్ని నెరవేర్చుకోకపోతే తక్కువ అవుతారు. లక్ష్యం సాధించాలని ఉండాలేకాని, సాధనాలు అన్నీ లేకపోయినా లక్ష్యాన్ని సాధిస్తారు. కష్టాలను ఎదిరించి సాగటమే సజ్జనుల నైజం. రాముడి విషయం చూస్తే, ఎక్కడో సముద్రం అవతల లంక ఉంది. మధ్యలో అగాథమైన సముద్రాన్ని దాటాలి. పోనీ శత్రువు ఏమైనా సామాన్యుడా అంటే, కాదు. పులస్త్యబ్రహ్మ వంశంలో పుట్టిన రావణుడు. పోనీ గొప్పవాళ్ల అండదండలేమైనా ఉన్నాయా అంటే, అదీ లేదు. కేవలం సానుభూతితో చుట్టూ చేరిన కోతులే సహాయకులు. రావణునికి ఉన్నంత గా రథాలు, ఏనుగులు, గుర్రాలు, బంట్లు లేరు. ప్రతిపక్షంలో ఇంద్రజిత్తు ఉన్నాడు. అతడు మహా మాయావి. అలాంటి మాయలు తెలిసినవారు ఎవరూ రాముని వద్ద లేరు. అయినా రాముడు జయించాడంటే దానికి కారణం ఆయనకు గల ధైర్యం, విశ్వాసం, ధర్మదీక్ష. ఇలాగే పరిశీలిస్తే సూర్యుడు కూడా మంచి ఉదాహరణ అవుతాడు. అతని రథానికి ఒకటే చక్రం, పాములతో రథానికి కట్టబడ్డ ఏడుగుర్రాలు. శూన్యమైన ఆకాశమే మార్గం. పైగా సారథి అయిన అనూరునికి కాళ్లు లేవు. అయినా అనంతమైన ఆకాశం చివరి భాగం వరకు ప్రతిరోజూ ప్రయాణిస్తున్నాడు. అదే కార్యదీక్ష, దృఢసంకల్పం, అచంచలమైన ఆత్మవిశ్వాసం. ఈ గుణాలనే భారతీయ సంస్కృతి నేర్పింది. - డా. నిష్ఠల సుబ్రహ్మణ్య శాస్త్రి