Ramesh Pokhriyal
-
కేంద్ర కేబినెట్ విస్తరణ: పలువురికి ఉద్వాసన
సాక్షి, న్యూడిల్లీ: కేంద్ర కేబినెట్ విస్తరణపై భారీ ఊహాగానాల మధ్య కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం దాదాపు ఖరారైనట్టే. ప్రస్తుత కేబినెట్లో మరో 43 మందిని కొత్తగా మంత్రి పదవులు వరించనున్నాయని అంచనా. వీరిలో నలుగురు మాజీ సీఎంలకు కేబినెట్లో బెర్త్ ఖాయంగా కనిపిస్తోంది. స్వతంత్ర హోదా, సహాయ మంత్రి బాధ్యతలను నిర్వహిస్తున్న మంత్రుల్లో ఒకరిద్దరికి కేబినెట్ ర్యాంకు దక్కే అవకాశం ఉంది. అలాగే సీనియర్ మంత్రుల నుంచి అదనపు బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్రపతి భవన్ వద్ద ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మోదీ కేబినెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ఇప్పటికే ఇద్దరు మంత్రులు వెల్లడించారు. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ రాజీనామా ప్రకటించారు. కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి సంతోష్ గాంగ్వర్ తాను మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ను మోదీ కేబినెట్ నుంచి తప్పించ నున్నారు. దీంతో కేబినెట్ విస్తరణకు ముందే రమేష్ రాజీనామాను ప్రకటించడం గమనార్హం. ప్రస్తుతం, 21 మంది క్యాబినెట్ మంత్రులు, స్వతంత్ర బాధ్యత కలిగిన తొమ్మిది మంది మంత్రులు, 23 మంది సహాయ మంత్రులు ఉన్నారు. తాజా ఈ విస్తరణతో ఈ సంఖ్య 81కి పెరగొచ్చని భావిస్తున్నారు. మోదీ కేబినెట్నుంచి రాజీనామా చేసినవారు ప్రధానంగా కీలకమంత్రులను మంత్రివర్గంనుంచి తప్పించడం పలువురిని విస్మయ పర్చింది. ఐటీ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్, ప్రకాష్ జవడేకర్, కేంద్ర కార్మిక శాఖమంత్రి, విద్యా శాఖా మంత్రికి తోడు కేంద్ర కెమికల్స్, ఎరువుల మంత్రి డీవీ సదానంద గౌడ కూడా కేంద్ర మంత్రి మండలికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి దేబశ్రీ చౌదరి, పర్యావరణ సహాయ మంత్రి బాబూల్ సుప్రియో తప్పుకున్నారు. అలాగే విద్యాశాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే కూడా తప్పుకోనున్నారు. బెంగాల్కు చెందిన మరో మంత్రి ప్రతాప్ సారంగి కూడా రాజీనామా చేశారు. -
JEE Mains: మూడవ, నాలుగో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: ఐఐటీ, నిట్ తదితర విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించి నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్స్ మూడు, నాలగవ విడతల పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. మూడో విడత పరీక్ష జులై 20 నుంచి 25వరకు.. నాలుగో విడత పరీక్షలు జులై 27 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ మంగళవారం వెల్లడించారు. కరోనా నేపథ్యంలో రిజిస్టర్ చేసుకోని విద్యార్థులు కూడా తాజాగా దరఖాస్తు చేసుకొనేందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ రోజు రాత్రి నుంచి జులై 8 రాత్రి వరకు ఎన్టీఏ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుండటంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఏప్రిల్, మేలో నిర్వహించాల్సిన సెషన్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) రద్దు చేసిన విషయం తెలిసిందే. దేశంలో జేఈఈ మెయిన్స్ను ఏడాదికి నాలుగు సార్లు నిర్వహించాలని గతంలో కేంద్రం నిర్ణయించింది. అయితే, తొలి విడత ఫిబ్రవరిలో, రెండో విడత మార్చిలో నిర్వహించగా.. మూడు, నాలుగవ విడత పరీక్షలు ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించాల్సి ఉండింది. అయితే కరోనా కారణంగా ఈ రెండు సెషన్ల పరీక్షలు వాయిదా పడ్డాయి. -
97 శాతం బడుల్లో.. బాలికలకు మరుగుదొడ్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల ఫలితాల ప్రభావం కనిపిస్తోంది. 2018–19తో పోల్చి చూస్తే 2019–20లో పాఠశాల విద్యకు సంబంధించిన అన్ని స్థాయిలలో స్థూల నమోదు నిష్పత్తి మెరుగుపడింది. అంతేగాక విద్యుత్ సౌకర్యం, కంప్యూటర్ల లభ్యత, ఇంటర్నెట్ సదుపాయం కలిగిన పాఠశాలల సంఖ్య 2019–20లో గణనీయంగా పెరిగిందని యూడీఐఎస్ఈ ప్లస్ నివేదిక వెల్లడించింది. భారతదేశంలో పాఠశాల విద్యపై రూపొందిన యునైటెడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యూడీఐఎస్ఈ ప్లస్) 2019–20 నివేదికను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గురువారం విడుదల చేశారు. 2019–20 సంవత్సరానికి సంబంధించి యూడీఐఎస్ఈ విధానంలో సేకరించిన సమాచారం ఆధారంగా ప్రస్తుత నివేదికను సిద్ధం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 15 లక్షల పాఠశాలలు, 96.87 లక్షల మంది ఉపాధ్యాయులు, 26.45 కోట్ల మంది విద్యార్థుల సమాచారాన్ని యూడీఐఎస్ఈ పర్యవేక్షిస్తోంది. 2019–20లో మొత్తం 26.45 కోట్ల మంది విద్యార్థులు ప్రీప్రైమరీ నుంచి హయ్యర్ సెకండరీ క్లాసుల వరకు పాఠశాలల్లో చదువుతున్నారని నివేదిక వెల్లడించింది. 2018–19తో పోలిస్తే 42.3 లక్షల మంది విద్యార్థులు పెరిగారు. 90% పాఠశాలల్లో హ్యాండ్ వాష్ సదుపాయం 2019–20లో 12.50 కోట్లకు పైగా బాలికలు ప్రాథమిక విద్య పూర్తి చేసుకుని మాధ్యమిక, ఉన్నత విద్యలో నమోదు చేసుకున్నారని నివేదికలో పేర్కొన్నారు. 2018–19తో పోలిస్తే బాలికల నమోదు సంఖ్య గణనీయంగా 14.08 లక్షలకు పైగా పెరిగింది. అంతేగాక పాఠశాల విద్యా రంగంలో విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి (పీటీఆర్) సైతం మెరుగుపడిందని నివేదిక వెల్లడించింది. దేశంలో స్వచ్ఛతా అభియాన్ ప్రచారం పెరగడంతో విద్యార్థులు చేతులను శుభ్రం చేసుకునే సౌకర్యం గల పాఠశాలల సంఖ్యలో మెరుగుదల నమోదైంది. 2019–20 సంవత్సరంలో దేశంలో 90% కంటే ఎక్కువ పాఠశాలల్లో హ్యాండ్వాష్ సౌకర్యాన్ని కల్పించారు. ఏపీలో 95% పాఠశాలల్లో విద్యుత్ సౌకర్యం 2019–20 నాటికి ఆంధ్రప్రదేశ్లో మొత్తం 63,824 పాఠశాలల్లో 83,23,103 మంది విద్యార్థులు ఉండగా, 3,17,430 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. రాష్ట్రంలోని 90% పాఠశాలల్లో బాలికల మరుగుదొడ్లు, 89% పాఠశాలల్లో లైబ్రరీ, 68% పాఠశాలల్లో అన్ని రకాల పుస్తకాలతో ఉన్న లైబ్రరీలు, 95% విద్యుత్ సౌకర్యం, 90% తాగునీటి సరఫరా, 84% హ్యాండ్ వాష్ సదుపాయం, 87% మెడికల్ ఫెసిలిటీ ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. తెలంగాణలో 96% పాఠశాలల్లో బాలికల మరుగుదొడ్లు తెలంగాణలో 42,575 పాఠశాలల్లో 69,37,640 మంది విద్యార్థులు ఉండగా, 3,05,597 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. రాష్ట్రంలోని 96% పాఠశాలల్లో బాలికల మరుగుదొడ్లు, 93% పాఠశాలల్లో లైబ్రరీ, 85% పాఠశాలల్లో అన్ని రకాల పుస్తకాలతో ఉన్న లైబ్రరీలు, 96% విద్యుత్ సౌకర్యం, 96% తాగునీటి సరఫరా, 88% హ్యాండ్ వాష్ సదుపాయం, 86% మెడికల్ ఫెసిలిటీ ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. యునైటెడ్ ఢిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యుడిఎస్ఇ +) 2019–20 నివేదిక ముఖ్యాంశాలు: 2019–20లో పాఠశాల విద్యలో ప్రీ–ప్రైమరీ నుంచి హయ్యర్ సెకండరీ వరకు చదువుతున్న విద్యార్థుల సంఖ్య 26.45 కోట్లు దాటింది. 20 18–19తో పోలిస్తే ఇది 42.3 లక్షలు ఎక్కువ. 2018–19తో పోలిస్తే 2019–20లో అన్ని స్థాయిలలో పాఠశాల విద్య స్థూల నమోదు నిష్పత్తి మెరుగుపడింది. స్థూల నమోదు నిష్పత్తి 2018–19తో పోలిస్తే 2019–20లో అప్పర్ ప్రైమరీ స్థాయిలో 87.7% నుంచి 89.7% కి, ప్రాథమిక స్థాయిలో 96.1% నుంచి 97.8%కి, సెకండరీ స్థాయిలో 76.9% నుంచి 77.9%కి, హయ్యర్ సెకండరీ స్థాయిలో 50.1% నుంచి 51.4%కి పెరిగింది. 2019–20లో పాఠశాల విద్యారంగంలో 96.87 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేయగా, 2018–19తో పోలిస్తే ఇది సుమారు 2.57 లక్షలు ఎక్కువ. 2019–20లో విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి (పిటిఆర్) ప్రైమరీ విద్యలో 26.5 గా, అప్పర్ ప్రైమరీ–సెకండరీలో పిటిఆర్ 18.5 గా, హయ్యర్ సెకండరీలో పిటిఆర్ 26.1 గా ఉంది. వికలాంగులకు సార్వత్రిక విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలను ఇస్తున్నాయి. 2018–19తో పోలిస్తే దివ్యాంగులైన విద్యార్థుల నమోదు 6.52% పెరిగింది. 2019–20లో ప్రైమరీ నుంచి హయ్యర్ సెకండరీ వరకు చేరిన బాలికల సంఖ్య 12.08 కోట్లకు పైగా ఉంది. 2018–19తో పోలిస్తే ఈ సంఖ్య 14.08 లక్షలకు పైగా పెరిగింది. 2018–19 నుంచి 2019–20లో బాలికల స్థూల నమోదు నిష్పత్తి అప్పర్ ప్రైమరీ స్థాయిలో 88.5% నుంచి 90.5%నికి, ఎలిమెంటరీ స్థాయిలో 96.7% నుంచి 98.7%నికి, సెకండరీ స్థాయిలో 76.9% నుంచి 77.8%నికి, హయ్యర్ సెకండరీ స్థాయిలో 50.8% నుంచి 52.4%కి పెరిగింది. 2019–20లో సెకండరీ, హయ్యర్ సెకండరీ స్థాయిలలో లింగ సమానత్వ సూచిక (జిపిఐ) మెరుగుపడింది. జిపిఐ మెరుగుదల హయ్యర్ సెకండరీ స్థాయిలో ఎక్కువగా కనిపించింది. 2019–20లో 1.04 కు చేరింది. కంప్యూటర్ సౌకర్యం ఉన్న పాఠశాలల సంఖ్య 2019–20లో 5.2 లక్షలకు చేరగా, 2018–19లో 4.7 లక్షల పాఠశాలలు కంప్యూటర్ సౌకర్యాన్ని కలిగి వున్నాయి. ఇంటర్నెట్ సదుపాయం ఉన్న పాఠశాలల సంఖ్య 2018–19లో 2.9 లక్షలు ఉండగా, 2019–20లో 3.36 లక్షలకు పెరిగింది. 2019–20 నాటికి 83% కంటే ఎక్కువ పాఠశాలలు విద్యుత్తు కలిగి ఉన్నాయి. 2018–19తో పోలిస్తే దాదాపు 7% వరకు పెరిగింది. 2019–20లో 82% కి పైగా పాఠశాలలు విద్యార్థులకు వైద్య పరీక్షలను నిర్వహించాయి. ఇది 2018–19తో పోలిస్తే 4% కంటే ఎక్కువ. భారతదేశంలో 2019–20 నాటికి 84%కి మించి పాఠశాలల్లో లైబ్రరీ/రీడింగ్ రూమ్/రీడింగ్ కార్నర్ సౌకర్యం ఉంది. చదవండి: ఆ కిడ్నాపర్కు జీవితకాల జైలు శిక్ష విధించలేం: సుప్రీంకోర్టు -
ఉన్నత విద్యలో ఏపీ భేష్
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యకు సంబంధించి పలు రంగాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే టాప్ రాష్ట్రాల జాబితాలో నిలిచింది. ఆలిండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఏఐఎస్హెచ్ఈ) 2019–20 నివేదికను కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ గురువారం విడుదల చేశారు. ఇందులో ఏపీ పలు అంశాల్లో సత్తా చాటింది. దేశంలో అత్యధిక విద్యార్థుల చేరికలున్న టాప్ రాష్ట్రాల్లో ఒకటిగా, అలాగే అత్యధిక ఉన్నత విద్యా సంస్థలున్న టాప్–8 రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. మన రాష్ట్రంలో ప్రతి లక్ష మంది జనాభాకు 51 కాలేజీలు ఉన్నాయని నివేదిక వెల్లడించింది. కాలేజీల సంఖ్య ప్రకారం.. ఏపీ పెద్ద రాష్ట్రాలను సైతం వెనక్కి నెట్టి దేశంలో ఐదో స్థానంలో నిలవడం విశేషం. ఏపీకంటే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో ప్రతి లక్షమంది జనాభాకు ఉన్న కాలేజీల సంఖ్య కేవలం 31. అలాగే ఈ సంఖ్య మహారాష్ట్రలో 34, రాజస్థాన్లో 37 మాత్రమే కావడం గమనార్హం. కాలేజీల సంఖ్యా పరంగా ఆలిండియా యావరేజ్ 30 కాగా ఏపీలో 51 ఉండటం విశేషం. మన రాష్ట్రంలో ఏకంగా 2,750 కళాశాలలున్నాయి. ఏపీ జోరు ఇలా.. ► దేశంలో మొత్తం విద్యార్థుల చేరికల్లో 54 శాతం ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఏపీల నుంచే ఉన్నాయని నివేదిక పేర్కొంది. ► విదేశీ విద్యార్థులను ఆకర్షిస్తున్న రాష్ట్రాల్లో కర్ణాటక (10,231) మొదటి స్థానంలో ఉండగా ఏపీ (2,094) 9వ స్థానం, తెలంగాణ (2,261) ఏడో స్థానంలో నిలిచాయి. ► దేశంలో టీచర్ ట్రైనింగ్ కోర్సుల్లో చేరిన అభ్యర్థులు 2.49 లక్షల మంది ఉండగా అందులో 55.4 శాతం మంది ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నారు. 23,421 మందితో ఏపీ నాలుగో స్థానంలో ఉండడం విశేషం. ► దేశంలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 27.1 శాతంగా ఉండగా.. ఎస్సీల శాతం 23.4, ఎస్టీల శాతం 18 ఉంది. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోలో మహిళలు 30 శాతానికి మించి ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ముందు వరుసలో నిలిచింది. జాతీయ స్థాయిలో ఇలా.. ► జాతీయ స్థాయిలో 3.38 కోట్ల మంది విద్యార్థులు అండర్గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరారు. వీరిలో 2.85 కోట్ల మంది (85 శాతం) ఆరు డిసిప్లిన్ కోర్సుల్లోనే చేరారు. వీరంతా హ్యుమానిటీస్, సైన్స్, కామర్స్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మెడికల్ సైన్స్, ఐటీ అండ్ కంప్యూటర్ విభాగాల్లో ఉన్నారు. ► పీహెచ్డీ కోర్సులకు సంబంధించి 2014–15లో 1.17 లక్షల మంది విద్యార్థులు ఉండగా 2019–20లో 2.03 లక్షల మంది పీహెచ్డీలో చేరారు. ► దేశంలో 2019–20 నాటికి 15,03,156 మంది అధ్యాపకులుండగా వీరిలో 42.5 శాతం మంది మహిళలు. ► ఉన్నత విద్యలో 2019–20లో 3.85 కోట్ల మేర చేరికలున్నాయి. 2018–19లో ఈ సంఖ్య 3.74 కోట్లు మాత్రమే. సర్వే జరిగింది ఇలా.. దేశవ్యాప్తంగా ఆయా విద్యా సంస్థలు సర్వేకు సమర్పించిన గణాంకాల ఆధారంగా ఈ నివేదికను కేంద్ర విద్యా శాఖ విడుదల చేసింది. దేశంలో 1,043 యూనివర్సిటీలు, 42,343 కాలేజీలు, 11,779 స్టాండ్ ఎలోన్ (ఒకే విభాగానికి సంబంధించిన కోర్సులను అందించేవి) విద్యాసంస్థలున్న సంగతి తెలిసిందే. వీటిలో 1,019 యూనివర్సిటీలు, 39,955 కాలేజీలు, 9,599 స్టాండ్ ఎలోన్ సంస్థలు సర్వేకు గణాంకాలను సమర్పించాయి. తక్కినవి స్పందించలేదు. దేశంలో ఉన్నత విద్యా రంగం గత ఐదేళ్లలో (2015–16 నుంచి 2019–20 వరకు) ఏ మేరకు ఉన్నత ప్రమాణాలు, వృద్ధి రేటు సాధించిందో గణాంకాలతో సహా నివేదిక విశ్లేషించింది. ఉన్నత విద్యలో విద్యార్థుల చేరికలు 2015–16 నుంచి 2019–20 మధ్య 11.4 శాతం మేర పెరిగాయి. ఇందులో మహిళల చేరికలు 18.2 శాతం పెరగడం విశేషం. -
పాఠశాల విద్యలో ఏపీ ప్రగతి
సాక్షి, న్యూఢిల్లీ: పాఠశాల విద్య గ్రేడింగ్ గవర్నెన్స్ ప్రాసెస్లో ఆంధ్రప్రదేశ్ ప్రగతి సాధించింది. 2018–19 కన్నా 20 శాతం మెరుగుపడింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పాఠశాల విద్య పనితీరు గ్రేడింగ్ ఇండెక్స్ (పీజీఐ) 2019–20 నివేదికకు కేంద్ర విద్యాశాఖమంత్రి రమేశ్ పోఖ్రియాల్ ఆమోదం తెలిపారు. కేంద్ర విద్యాశాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, లిటరసీ ఈ నివేదికను రూపొందించింది. పాఠశాల విద్యలో పరివర్తన తీసుకురావడానికి కేంద్రం 70 అంశాలతో పనితీరు గ్రేడింగ్ సూచీని ప్రవేశపెట్టింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2017–18 సంవత్సరం ఆధారంగా 2018–19లో తొలిసారి పీజీఐ ప్రచురించారు. ఇప్పుడు 2019–20 నివేదికను కేంద్రం ఆమోదించింది. 2018–19తో పోలిస్తే 2019–20లో ఆంధ్రప్రదేశ్ సహా 19 రాష్ట్రాలు కనీసం 20 శాతం (72 పాయింట్లు, అంతకంటే ఎక్కువ) మెరుగుదల చూపించాయి. పంజాబ్, చండీగఢ్, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ ఏ++ గ్రేడ్ సాధించాయి. ఆంధ్రప్రదేశ్ 72 పాయింట్లకుపైగా, తెలంగాణ 15 పాయింట్లు మెరుగుపరచుకున్నాయి. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ 4వ లెవెల్ గ్రేడ్–1 (801–850 పాయింట్లు), తెలంగాణ 5వ లెవెల్ గ్రేడ్–2 (751–800 పాయింట్లు) సాధించాయి. కేటగిరీ–1 డొమైన్–1లో లెర్నింగ్ అవుట్కమ్, క్వాలిటీలో 180 పాయింట్లకు ఆంధ్రప్రదేశ్ 154, తెలంగాణ 142 పాయింట్లు సాధించాయి. రాజస్థాన్ 168 పాయింట్లతో తొలిస్థానంలో ఉంది. కేటగిరీ–1 డొమైన్–2లో యాక్సెస్ విభాగంలో 80 పాయింట్లకు ఆంధ్రప్రదేశ్ 65, తెలంగాణ 69 పాయింట్లు సాధించాయి. కేరళ 79 పాయింట్లతో తొలిస్థానంలో నిలిచింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫెసిలిటీస్ విభాగంలో 150 పాయింట్లకు ఆంధ్రప్రదేశ్ 117, తెలంగాణ 113 పాయింట్లు సాధించాయి. పంజాబ్ 150 పాయింట్లతో తొలిస్థానంలో ఉంది. ఈక్విటీ విభాగంలో 230 పాయింట్లకు ఆంధ్రప్రదేశ్ 204, తెలంగాణ 210 పాయింట్లు సాధించాయి. 228 పాయింట్లతో పంజాబ్ మొదటి స్థానంలో నిలిచింది. గవర్నెన్స్ ప్రాసెస్లో 360 పాయింట్లకుగాను ఆంధ్రప్రదేశ్కు 271, తెలంగాణకు 238 పాయింట్లు లభించాయి. పంజాబ్ 346 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. పీజీఐ ప్రవేశపెట్టిన 2017–18 నుంచి ఇప్పటివరకు ఏ రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం కూడా లెవెల్ 1 (951–1000 పాయింట్లు) సాధించలేదు. -
Teachers Eligibility Test: టెట్ అభ్యర్థులకు కేంద్రం తీపికబురు..
న్యూఢిల్లీ: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) అభ్యర్థులకు కేంద్ర విద్యాశాఖ తీపికబురు అందించింది. టెట్ క్వాలిఫైయింగ్ సర్టిఫికెట్ గడువును 7 సంవత్సరాల నుంచి జీవిత కాలం పొడిగిస్తూ కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియల్ నిశాంక్ కీలక ఆదేశాలను జారీచేశారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) ప్రకారం 2011, ఫిబ్రవరి నుంచి ఈ పెంపును అమలు పరచాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉపాధ్యాయ రంగంలో స్థిరపడాలనే వారికోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. అభ్యర్థులందరికి ఉపాధి అవకాశాలు పెంచాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇప్పటికే 7 సంవత్సరాల గడువు ముగిసిన అభ్యర్థులకు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా కొత్త సర్టిఫికెట్ల జారీలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే, గతంలో టెట్కు 7 సంవత్సరాల అర్హత ఉండేది. అదే విధంగా, ఒక అభ్యర్థి టెట్ను ఎన్నిసార్లయినా రాసుకోవచ్చన్న విషయం తెలిసిందే. చదవండి: ఆమెను చీరలో చూడాలి.. ఫేర్వెల్ చేసుకోనివ్వండి.. ప్రధానికి ట్వీట్ -
కేంద్ర మంత్రికి ఏపీ విద్యాశాఖ మంత్రి లేఖ
సాక్షి, అమరావతి: 12వ తరగతి పరీక్షల నిర్వహణపై తమ ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఏపీ విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్కు బుధవారం లేఖ రాశారు. ఆ లేఖలో.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. విద్యాశాఖకు ప్రత్యేకంగా వ్యాక్సిన్ కేంద్రం కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంటర్ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నందున ప్రత్యేక కోటాలో వ్యాక్సిన్ కేటాయించాలని, టీచర్లు, ఇన్విజిలేటర్లు, ప్రొఫెసర్లను ఫ్రంట్లైన్ వారియర్లుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్ వేస్తే ఉపాధ్యాయులు, అధ్యాపకుల్లో మానసిక స్థైర్యం పెంపొందించగలుగుతామని, కేంద్రం వారిని పరిగణనలోకి తీసుకుని ప్రత్యేకంగా వ్యాక్సిన్ కోటా కేటాయించాలన్నారు. -
కరోనా కల్లోలం: ఎయిమ్స్లో చేరిన కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి సామాన్యుల నుంచి వీఐపీల వరకు ఏ ఒక్కరిని వదలడం లేదు. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడిన వారిలో చాలా మంది ఆసుపత్రులలో చేరుతున్నారు. అయితే, కరోనా సోకిన తర్వాత ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడం, రుచి తెలియక పోవడం, ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్కు గురవ్వడం మొదలైన లక్షణాలు ఉంటాయన్న విషయం మనకు తెలిసిందే. అయితే, ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో సరైన చికిత్స తీసుకొన్న కూడా కోవిడ్ నెగెటివ్ అనంతరం కూడా అనేక శారీరక సమస్యలు కొత్తగా ఉత్పన్న మవుతున్నాయి. వీటిని పోస్ట్ కోవిడ్ సమస్యలుగా పేర్కొంటారు. తాజాగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియల్ నిశాంక్ కోవిడ్ అనంతరం సమస్యలతో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఆసుపత్రిలో చేరారు. కాగా, 61 ఏళ్ల వయస్సున్న పోఖ్రియల్ నిశాంక్ గత ఏప్రిల్ 21 న కరోనా బారిన పడ్డారు. ఆ తర్వాత డాక్టర్ల పర్యవేక్షణలో సరైన మందులు, డైట్ పాటించడం జరిగింది. ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత ఆయన కోవిడ్ నుంచి కోలుకున్నారు. అప్పటి నుంచి ఆన్లైన్లో విద్యా శాఖ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కొత్తగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే డాక్టర్ల సూచన మేరకు ఆయన ఎయిమ్స్లో చేరారు. అయితే, ఇప్పటికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా వుండగా కేంద్ర విద్యాశాఖ గత కొన్ని రోజులుగా సిబిఎస్ఇ పరీక్షల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకొలేదు. ఈ క్రమంలో సుప్రీం కోర్ట్ వెంటనే సిబిఎస్ఇ పరీక్షలపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అయితే, ప్రస్తుతం కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియల్ ఆసుపత్రిలో ఉన్న తరుణంలో, సిబిఎస్ఇ పరీక్షలపై సరైన నిర్ణయం తీసుకోవడానికి మరో రెండు రోజుల సమయం కావాలని కేంద్ర విద్యాశాఖ సుప్రీం కోర్టును కోరింది. చదవండి: ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకం.. నల్లగా మారిన మహిళ చేయి -
CBSE 12th board Exams 2021: జూన్ 1లోగా నిర్ణయం
న్యూఢిల్లీ: కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో.. సీబీఎస్ఈ క్లాస్ 12 పరీక్షల నిర్వహణపై జూన్ 1వ తేదీలోగా నిర్ణయం తీసుకుంటామని కేంద్రం వెల్లడించింది. పరీక్షల నిర్వహణపై రాష్ట్రాల్లో కొంతవరకు ఏకాభిప్రాయం వ్యక్తమైందని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిషాంక్ తెలిపారు. రాష్ట్రాలు తమ అభిప్రాయాలు, సూచనలను సమగ్రంగా మే 25 లోగా తమకు పంపించాలని కోరారు. క్లాస్ 12 పరీక్షల నిర్వహణపై ఆదివారం కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. రాష్ట్రాలు తమ అభిప్రాయాలను ఈ సమావేశంలో వ్యక్తం చేశాయి. పరీక్షలు నిర్వహించకూడదనే ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవాలని మహారాష్ట్ర, పరీక్షలకు ముందే విద్యార్థులకు వ్యాక్సినేషన్ చేయాలని ఢిల్లీ, కేరళ సూచించాయి. మరోవైపు, జూలై 15 నుంచి ఆగస్ట్ 26 మధ్య పరీక్షలు నిర్వహించి, సెప్టెంబర్లో ఫలితాలను విడుదల చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సూచించింది. పరీక్షల నిర్వహణకు సంబంధించి సీబీఎఎస్ఈ రెండు ప్రతిపాదనలు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అవి 1) కొన్ని ఎంపిక చేసిన కేంద్రాల్లో మొత్తం 19 మేజర్ సబ్జెక్టుల్లో పరీక్షలు నిర్వహించాలి. మైనర్ సబ్జెక్టుల ఫలితాలను మేజర్ సబ్జెక్టుల్లో ఫలితాల ఆధారంగా నిర్ణయించాలి. మూడునెలల్లో మొత్తం ప్రక్రియను ముగించాలి. తొలినెలలో ప్రీ ఎగ్జామ్ యాక్టివిటీ, రెండోనెలలో పరీక్షలు, మూడోనెలలో ఫలితాలు వెల్లడించాలి. 2) మూడు గంటలు కాకుండా, గంటన్నర పాటే, వారి పాఠశాలలోనే పరీక్షలు జరపాలి. పరిస్థితిని బట్టి రెండుసార్లు పరీక్షలను నిర్వహించవచ్చు. జూలై 15 నుంచి ఆగస్ట్ 1 మధ్య ఫస్ట్ ఫేజ్, ఆగస్ట్ 8–26 మధ్య సెకండ్ ఫేజ్ పరీక్షలను నిర్వహించవచ్చు. కరోనా కారణంగా ఏ విద్యార్థి అయినా పరీక్ష రాయలేనట్లయితే.. ఆ విద్యార్థికి మరో అవకాశం ఇవ్వాలి. ఆబ్జెక్టివ్, షార్ట్ ఆన్సర్ తరహాలో ప్రశ్నపత్రం ఉండాలి. ఒక లాంగ్వేజ్, మూడు ఎలెక్టివ్ సబ్జెక్టుల్లో విద్యార్థి పరీక్ష రాయాల్సి ఉంటుంది. రాష్ట్రాల్లో భిన్నాభిప్రాయం సీబీఎస్ఈ మొదటి ప్రతిపాదనను కొన్ని రాష్ట్రాలు, రెండో ప్రతిపాదనను మెజారిటీ రాష్ట్రాలు సమర్ధించినట్లు సమాచారం. 10వ తరగతి పరీక్షలను సీబీఎస్ఈ ఇప్పటికే రద్దు చేసింది. ఏప్రిల్–మేలో నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్స్ కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే. సమావేశం ఫలవంతంగా జరిగిందని, రాష్ట్రాల నుంచి విలువైన సూచనలు అందాయని రమేశ్ పోఖ్రియాల్ పేర్కొన్నారు. ‘సలహాలు, సూచనలతో సమగ్ర నివేదికను మే 25లోపు పంపించాలని రాష్ట్రాలను కోరాం. ఆ తరువాత సాధ్యమైనంత త్వరగా ఒక నిర్ణయం తీసుకుని, అనిశ్చితికి తెరవేస్తాం’ అని వెల్లడించారు. కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, ప్రకాశ్ జవదేకర్, సంజయ్ ధాత్రే, పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విద్యాశాఖ మంత్రులు, కార్యదర్శులు ఈ వర్చువల్ సమావేశానికి హాజరయ్యారు. మరోవైపు, విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి పరీక్షలను రద్దు చేయాలన్న డిమాండ్ కూడా గట్టిగా వినిపిస్తోంది. ‘క్యాన్సిల్బోర్డ్ఎగ్జామ్స్’ హ్యాష్ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండింగ్లో ఉంది. పరీక్షల నిర్వహణకు తాము వ్యతిరేకమని, టీకాలు వేయకుండా విద్యార్థులను పరీక్షలు రాయమనడం పెద్ద పొరపాటవుతుందని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా 1.5 కోట్ల మంది క్లాస్ 12 విద్యార్థులున్నారని, వారిలో 90% 17 ఏళ్లు పైబడినవారేనని ఆయన వివరించారు. వారికి కోవిడ్ టీకా ఇవ్వడానికి వీలవుతుందేమో నిపుణులతో చర్చించాలని సూచించారు. పరీక్షల నిర్వహణకు సుముఖమే కానీ, కరోనా పరిస్థితులు సద్దుమణిగిన తరువాత పరీక్షలు జరిపితే మంచిదని భావిస్తున్నట్లు తమిళనాడు పేర్కొంది. ఈ పరీక్షలు విద్యార్థుల కెరీర్కు ఎంతో ముఖ్యమంది. -
ఎంట్రన్స్ పరీక్షల నిర్వహణపై కేంద్రం ఉన్నతస్థాయి సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ : వివిధ కోర్సుల పరీక్షల నిర్వహణపై కేంద్రం రేపు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల కార్యదర్శులు, బోర్డు ఛైర్మన్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పరీక్షల నిర్వహణపై వివిధ రాష్ట్రాలకు కేంద్రం ఈ మేరకు లేఖలు రాసింది. కాగా, కరోనా నేపథ్యంలో సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, వివిధ రాష్ట్రాల బోర్డులు ఇప్పటికే పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా ప్రొఫెషనల్ కోర్సుల ఎంట్రన్స్ పరీక్షలను వాయిదా వేసింది. కేంద్రమంత్రి రమేష్ పోక్రియాల్ ఈ పరీక్షల నిర్వహణపై వివిధ వర్గాల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలు వెల్లడించాలని కోరారు. -
జేఈఈ మెయిన్స్ పరీక్ష వాయిదా
-
జేఈఈ మెయిన్స్ 2021 వాయిదా
న్యూఢిల్లీ: కోవిడ్ దృష్టా కేంద్రం ప్రభుత్వం పలు పరీక్షలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా జేఈఈ మెయిన్స్ వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ మంగళవారం ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ కోసం సంబంధిత వెబ్సైట్ను సందర్శించాల్సిందిగా విద్యార్థులకు సూచించారు. కోవిడ్ విజృంభణ వల్ల పరీక్ష వాయిదా వేస్తున్నామన్నారు. ఇప్పటికే నీట్ పరీక్ష వాయిదా వేసిన సంగతి తెలిసిందే. చదవండి: కటాఫ్ ఎక్కువే! -
జూలై 3న జేఈఈ అడ్వాన్స్డ్ టెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: ఐఐటీ జేఈఈ–అడ్వాన్స్డ్ పరీక్ష జూలై 3వ తేదీన ఉంటుందని∙కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ చెప్పారు. ఈ క్వాలిఫయింగ్ పరీక్షను కంప్యూటర్ ఆధారితంగా నిర్వహిస్తారు. ఐఐటీల్లో ప్రవేశాలకు 12వ తరగతిలో 75 శాతం మార్కులు ఉండాలన్న నిబంధనను కూడా కోవిడ్ మహమ్మారి దృష్ట్యా ఈ ఏడాదికి సడలిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు గాను అభ్యర్థులు 12వ తరగతి బోర్డు పరీక్షల్లో కనీసం 75శాతం మార్కులు లేదా క్వాలిఫయింగ్ పరీక్షల్లో టాప్ 20 పర్సంటైల్ సాధించాల్సి ఉంటుంది. 2021నుంచి ఏడాదికి నాలుగు పర్యాయాలు జేఈఈ–మెయిన్స్ను నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జేఈఈ మెయిన్స్ మొదటి దఫా పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి 26వ తేదీ వరకు జరగనున్నాయి. 10,12వ తరగతి పరీక్షలను మే నెలకు సీబీఎస్ఈ వాయిదా వేసింది. -
ఐఐటీ హైదరాబాద్లో టైహాన్
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర సిగలో మరో మణిహారం.. నగర శివారు లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ–హైదరాబాద్)లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అడుగు పడింది. మానవ రహిత విమానాలు, రిమోట్ కంట్రోల్తో నడిచే వాహనాలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం పరీక్షించేందుకు ఉద్దేశించిన ‘టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఫర్ అటానమస్ నేవిగేషన్ సిస్టమ్స్(టైహాన్)’ ఏర్పాటుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ మంగళవారం పునాది వేశారు. వర్చువల్ పద్ధతిలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి మాట్లాడుతూ ఆత్మనిర్భర్ భారత్ దిశగా వేస్తున్న అతిపెద్ద ముందంజగా ఈ ప్రాజెక్టును అభివర్ణించారు. స్వతంత్ర నేవిగేషన్ వ్యవస్థకు సంబంధించిన పలు విభాగాలు ఈ ప్రాజెక్టులో కలసికట్టుగా పనిచేస్తాయన్నారు. మానవ రహి త విమానాల నిర్వహణలో ఎదురయ్యే వాస్తవ సమస్యలు, సవాళ్ల పరిష్కారానికి ఇది ఉపయోగపడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు. మానవ రహిత డ్రోన్లు, వాహనాలను ఎలాంటి అడ్డంకులు, ప్రమాదాలు లేకుండా పరీక్షించేందుకు ఇదో మేలైన వ్యవస్థగా రూపొందుతుం దని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీవీఎస్ మూర్తి తెలిపారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం ఐఐటీ–హెచ్కు రూ.135 కోట్లు మంజూరు చేశాయి. ప్రాజెక్టులో భాగం గా టైహాన్లో టెస్ట్ ట్రాక్లు, నిత్యజీవితంలో ఎదురయ్యే రకరకాల పరిస్థితులను తలపించేవి ఏర్పాటవుతాయి. అత్యాధునిక సిమ్యులేషన్ టెక్నాలజీలు, రహదారి వ్యవస్థలు, వీ2ఎక్స్ కమ్యూనికేషన్, డ్రోన్లు ఎగిరేందుకు, దిగేందుకు అవసరమైన రన్వేలు, ల్యాండింగ్ ఏరియాలు ఏర్పాటుచేస్తా రు. ఇటు సెంట్రలైజ్డ్ కంట్రోల్ రూమ్/గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్, హ్యాంగర్లు కూడా ఈ ప్రాజెక్టులో ఉంటాయని ఐఐటీ–హెచ్ ఓ ప్రకటనలో తెలిపింది. -
ఆన్లైన్ పాఠాలు అర్థం కావట్లేదు
కరోనా వేళ నాకు ఆన్లైన్ బోధన అందుబాటులో లేదు. పుస్తకాలు కొనుక్కునే పరిస్థితీ లేదు. అందుకే ఇప్పట్లో పరీక్షలు వద్దు. ఆఫ్లైన్ తరగతుల తర్వాతే పరీక్షలు పెట్టండి.’ – కరుణ శర్మ, 12వ తరగతి ఆన్లైన్ బోధన అర్థం కావట్లేదు. అభ్యసనపై సంతృప్తిగా లేదు. ప్రత్యక్ష విద్యా బోధన కావాలి. ఆ తర్వాతే పరీక్షలు పెట్టండి. పరీక్షలన్నీ జూన్ వరకు వాయిదా వేయండి. – అబు అనస్, విద్యార్థి సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్లో ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభం, పరీక్షల నిర్వహణ, జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలపై విద్యార్థులు నుంచి వ్యక్తమైన అభిప్రా యాలు. ప్రత్యక్ష విద్యా బోధన, సిలబస్ కుదింపుపైనా దేశవ్యాప్తంగా విద్యార్థులు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్కు అనేక విజ్ఞ ప్తులు, సూచనలు చేశారు. జేఈఈ మెయిన్, నీట్ వంటి ప్రవేశ పరీక్షలు, సీబీఎస్ఈ 11, 12 తరగతుల పరీక్షలకు సంబంధించి విద్యార్థులు తల్లిదండ్రులతో ఈనెల 10న 10 గంటలకు ట్విటర్ వేదికగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి ప్రకటించగా వేల మంది స్పందించారు. పరీక్షలు ఇప్పట్లో వద్దని 99 శాతం మంది స్పష్టం చేశారు. ప్రత్యక్ష బోధనపై చర్యలు చేపట్టాకే ముందుకు సాగాలని సూచించారు. మరికొంత మంది విద్యార్థులైతే 12వ తరగతి పరీక్షలు చాలా కీలకమని, అయితే ప్రస్తుతం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యక్ష విద్యా బోధన కంటే ఆన్లైన్ బోధన కొనసాగించాలని, పరీక్షలను కూడా ఆన్లైన్లోనే నిర్వహించాలని కోరారు. ప్రస్తుత ఆందోళనకర పరిస్థితుల్లో సిలబస్ను తగ్గించాలని సూరజ్ అనే విద్యార్థి విజ్ఞప్తి చేశారు. ఇంకొంత మంది విద్యార్థులైతే ప్రాక్టికల్ పరీక్షల ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. నీట్ పరీక్షను కూడా జూన్ వరకు వాయిదా వేయాలని కోరారు. ఆన్లైన్ విద్యా బోధనకు అవసరమైన చాలామంది విద్యార్థులకు మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు లేవని, అవి ఉన్నా కొందరు ఇంటర్నెట్ కనెక్షన్ సమస్యలతో విద్యా బోధన ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష విద్యా బోధనతోనే ప్రయోజనం ఉంటుందని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. ఆ తర్వాతే పరీక్షలపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 10న జరిగే ఆన్లైన్ చర్చా కార్యక్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి అభిప్రాయాలు తీసుకుని తుది నిర్ణయం వెల్లడించనున్నారు. పరీక్షలకు ఉపయోగపడని ఆన్లైన్ బోధన ఇంటర్మీడియెట్ విద్యలో ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆన్లైన్ బోధన.. పరీక్షలకు ఏ మాత్రం ఉపయోగపడేలా లేదు. ఆన్లైన్ విద్యతో పరీక్షలు నిర్వహించడం సరికాదు. నేరుగా తరగతులు నిర్వహించకుండా పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు. ప్రత్యక్ష విద్యా బోధన కనీసం 3 నెలలు నిర్వహించాల్సిందే. – ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు పి.మధుసూదన్రెడ్డి -
మాతృభాషలో ఇంజనీరింగ్!
న్యూఢిల్లీ: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ సహా టెక్నికల్ కోర్సులు స్థానిక భాషల్లో నేర్చుకునే వీలు కల్పించనున్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు కేంద్ర విద్యా మంత్రి రమేశ్ పొఖ్రియాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన రివ్యూమీటింగ్లో నిర్ణయం తీసుకున్నారు. ఇంజనీరింగ్ కోర్సులతో సహా టెక్నికల్ కోర్సులను మాతృభాషలో నేర్చుకునే వీలుకల్పించేలా కీలక నిర్ణయం తీసుకున్నామని, వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుందని, ఇందుకోసం కొన్ని ఐఐటీ, ఎన్ఐటీలను ఎంపిక చేస్తామని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. స్కాలర్షిప్పులు, ఫెలోషిప్పులు సమయానికి విద్యార్ధులకు అందించాలని, ఇందుకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారానికి ఒక హెల్ప్లైన్ ఏర్పాటు చేయమని యూజీసీని సమావేశంలో ఆదేశించారు. కష్టమే..: సాంకేతిక పదబంధాలు అధికంగా ఉండే టెక్నికల్ కోర్సులను ఇంగ్లిష్లో కాదని స్థానిక భాషల్లో బోధించడం సవాలేనని, పైగా వచ్చే విద్యాసంవత్సరం దగ్గరలో ఉన్న ఈ స్వల్పతరుణంలో ఈ సవాలను అధిగమించడం కష్టమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. మాతృభాషలో ఇంజనీరింగ్ సిలబస్కు తగిన పుస్తకాలు, స్టడీ మెటీరియల్ రూపొందించాలని, బోధించేందుకు సిబ్బందికి తర్ఫీదు ఇవ్వాల్సిఉంటుందని నిపుణులు వివరించారు. -
పేదలకు సులభ జీవనం అందించండి
న్యూఢిల్లీ: భారతదేశం తన యువతకు కావాల్సిన సదుపాయాలను (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) అందిస్తుందని, అనుభవం, నైపుణ్యం, నవీన ఆవిష్కరణల ద్వారా వారు దేశంలోని పేదలకు సులభతర జీవనాన్ని(ఈజ్ ఆఫ్ లివింగ్) అందించాలని ప్రధాని మోదీ కోరారు. ఆయన శనివారం ఢిల్లీ ఐఐటీ 51వ వార్షిక స్నాతకోత్సవంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రధానంగా నిరుపేదల కోసం కొత్త ఆవిష్కరణలు చేయాలని యువతకు సూచించారు. కోవిడ్ అనంతరం భిన్నమైన ప్రపంచాన్ని మనం చూడబోతున్నామని, ఇందులో సాంకేతిక పరిజ్ఞానం అత్యంత కీలక పాత్ర పోషించబోతోందని తెలిపారు. నాణ్యతపై కచ్చితంగా దృష్టి పెట్టాలని, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని ఐఐటీ విద్యార్థులకు ఉద్బోధించారు. మీ శ్రమ ద్వారా భారతదేశ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుందని అన్నారు.బ్రాండ్ ఇండియాకు విద్యార్థులే బ్రాండ్ అంబాసిడర్లు అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. టెక్నాలజీ ద్వారా మంచి పాలన అందించవచ్చనే విషయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని చెప్పారు. గత కొన్నేళ్లుగా ఈ టెక్నాలజీ పేదల వరకూ చేరుతోందన్నారు. సాంకేతికత ద్వారా సంక్షేమ ఫలాలను లబ్ధిదారులకు నేరుగా అందిస్తూ అవినీతికి అడ్డుకట్ట వేశామని మోదీ పేర్కొన్నారు. ఎన్ఈపీ అతిపెద్ద సంస్కరణ: రమేశ్ ఐఐటీకి చెందిన 2,019 మంది గ్రాడ్యుయేట్లకు శనివారం డిగ్రీలు అందజేశారు. విద్యార్థులను ఉద్దేశించి విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ ప్రసంగించారు. స్నాతకోత్సవం అంటే విద్యాభ్యాసం పూర్తయినట్లు కాదని, ఉద్యోగ రంగంలోకి అడుగపెట్టేందుకు ఇదొక గట్టి పునాది లాంటిదన్నారు. నూతన జాతీయ విద్యా విధానం అనేది ప్రపంచంలోనే అతి పెద్ద సంస్కరణ అని అభివర్ణించారు. -
గీతంపై కేంద్రమంత్రికి ఎంపీ విజయసాయి రెడ్డి లేఖ
సాక్షి, విశాఖపట్నం: గీతం యూనివర్శిటి నిబంధనల ఉల్లంఘనపై యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ ఇంద్రపాల్ సింగ్కు వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ సభ్యులు విజయసాయి రెడ్డి గురువారం లేఖ రాశారు. గీతం డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఏర్పాటులో నిబంధనల ఉల్లంఘన జరిగిందని లేఖలో పేర్కొన్నారు. భూమి యాజమాన్య హక్కు పత్రాల సమర్పణలో వాస్తవాలు దాచారని, యూజీసీకి ఇచ్చిన నివేదికలో ప్రభుత్వ భూమిని కూడా గీతం యాజమాన్యం చూపించిందని చెప్పారు. ఫార్మసీ, మెకానికల్ విభాగాలతో పాటు సివిల్ విభాగ నిర్మాణాల్లో కొంత భాగం ప్రభుత్వ స్థలంలోనే ఉన్నాయన్నారు. గీతం డీమ్డ్ టు బి యూనివర్సిటీగా ప్రజలకు వివరాలను బహిర్గతం చేయాలన్న నిబంధన పాటించలేదని, గీతం భూములకు సంబంధించిన డాక్యుమెంట్ ఆధారాలను సంబంధిత అధికారులకు పొందుపరచ లేదని లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా గీతం విద్యా విధానంలో లోపాలపై కేంద్రమంత్రి రమేష్ పొఖ్రియాల్ నిశాంత్కు కూడా రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి లేఖ రాశారు. ర్యాంకింగ్ విషయంలో గీతం నిబంధనలు తుంగలో తొక్కిందని చెప్పారు. తప్పుడు సమాచారంతో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ పొందినట్టు అనుమానం వ్యక్తం చేశారు. హైదరాబాద్, బెంగళూరులో ఏర్పాటు చేసిన స్టడీ సెంటర్ల విషయంలో నిబంధనలు పాటించలేదు అని పేర్కొన్నారు. గీతం ఉద్యోగ నియామకాల్లో రాజ్యాంగబద్ధంగా చేయాల్సిన రూల్ ఆఫ్ రిజర్వేషన్లు అమలు చేయలేదని, డీమ్డ్ టు బి యూనివర్సిటీ గా గీతం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్స్ విషయంలో నిబంధనలు పాటించడం లేదని ఆయన లేఖ ద్వారా రమేష్ పొఖ్రియాల్కు తెలిపారు. -
ప్రాంతీయ భాషల్లోనూ జేఈఈ మెయిన్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఐఐటీ వంటి ప్రఖ్యాత ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్) రాసే అభ్యర్థులకు శుభవార్త. ఈ పరీక్షను ఇకపై మాతృభాషలోనే రాయొచ్చు. కంప్యూటర్ ఆధారిత జేఈఈ (మెయిన్)ను వచ్చే ఏడాది నుంచి పలు ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ చెప్పారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)లో భాగంగా మాతృభాష వినియోగాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. ఎన్ఈపీ విజన్ను దృష్టిలో పెట్టుకొని జేఈఈ(మెయిన్) టెస్టును పలు ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని జాయింట్ అడ్మిషన్ బోర్డు(జేఏబీ) నిర్ణయించిందని పేర్కొన్నారు. దీనివల్ల విద్యార్థులు ఎక్కువ స్కోర్ సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ మేరకు రమేశ్ పోఖ్రియాల్ గురువారం ట్వీట్ చేశారు. జేఈఈ(మెయిన్) ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ భాషల్లో నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష పెట్టాలని పలు రాష్ట్రాల నుంచి చాలాకాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. గుజరాతీ భాషలో జేఈఈ(మెయిన్) నిర్వహిస్తూ ఇతర భాషలను విస్మరించడం పట్ల గత ఏడాది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై విద్యా శాఖ వివరణ ఇచ్చింది. గుజరాత్ ప్రభుత్వం కోరడం వల్లే గుజరాతీ భాషలో పరీక్ష నిర్వహిస్తున్నామని, 2021 నుంచి 11 ప్రాంతీయ భాషల్లోనూ జేఈఈ(మెయిన్) ఉంటుందని వెల్లడించింది. జేఈఈ(మెయిన్) ఫలితాల ఆధారంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లు కల్పించే రాష్ట్రాల భాషను ఇందులో చేర్చనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో మాతృభాషలో ఇంజనీరింగ్ అడ్మిషన్ టెస్టు నిర్వహిస్తున్నారు. అలాంటి భాషల్లో మెయిన్ ఉంటుందని సమాచారం. -
గ్రామ సచివాలయ వ్యవస్థ సూపర్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశ పెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ వల్ల ప్రజలకు ఎంతగానో మేలు జరుగుతోందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ అభినందించారు. ప్రభుత్వాన్ని ప్రజల ముంగిటకే తీసుకువెళ్లడంలో సఫలమయ్యారన్నారు. గురువారం ఆయన వెబినార్ ద్వారా జరిగిన ఎన్సీఈఆర్టీ 57వ జనరల్ కౌన్సిల్ సమావేశంలో జగన్ పాలనా నిర్ణయాలు, అమలు చేస్తున్న పథకాలు, ప్రధానంగా విద్యా సంస్కరణలను ప్రశంసించారు. అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, హెచ్ఆర్డీ ఉన్నతాధికారులతో వెబినార్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన విద్యా కానుక, నాడు–నేడు, అమ్మ ఒడి, జగనన్న గోరు ముద్ద పథకాలు, విద్యా రంగంలో ప్రమాణాల పెంపునకు తీసుకున్న చర్యలు, కోవిడ్ ప్రొటోకాల్ను అనుసరిస్తూనే విద్యార్థులకు వివిధ మార్గాల్లో బోధనా కార్యక్రమాల కొనసాగింపు తదితర అంశాల గురించి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సురేష్ కేంద్ర మంత్రికి వివరించారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా స్వాగతించిందని, అంతకు ముందు నుంచే పలు సంస్కరణల ద్వారా విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే అనేక చర్యలను తీసుకున్నామని స్పష్టం చేశారు. అనంతరం కేంద్ర మంత్రి రమేష్ స్పందిస్తూ మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. విద్యాభివృద్ధికి ఏపీ విశేష కృషి ♦మీ రాష్ట్రంలో చాలా మంచి పనులు చేస్తున్నారు. విద్యాభివృద్ధి కోసం ఎంతో శ్రమిస్తున్నారు. ఆ విషయం నాకు తెలుసు. విద్యామృతం, విద్యాకలశం కార్యక్రమాలు అమలు చేస్తుండటం అభినందనీయం. ♦విద్యారంగ అభివృద్ధికి చేపడుతున్న పథకాలు బడి పిల్లల వరకు పూర్తి స్థాయిలో తీసుకువెళ్లడంలో మీ ప్రయత్నం ఎంతో అభినందనీయం. ఆదర్శవంతం. ♦గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభించడం ముదావహం. అక్కడే ఆయా విభాగాలకు అధికారులను నియమించడం మంచిపని. ఇలాంటి పథకాలు, కార్యక్రమాల ద్వారా ప్రజలకు మేలు చేకూరడంతో పాటు నిర్దేశించుకున్న లక్ష్యాలను సులభంగా సాధించడానికి వీలవుతుంది. ఇతరులకూ ఆదర్శం ♦మీ రాష్ట్ర ముఖ్యమంత్రి చేపడుతున్న కార్యక్రమాలు ఇతరులకూ ఆదర్శవంతంగా ఉన్నాయి. విద్యారంగంలో జీడీపీని ఆరు శాతానికి ఎలా తీసుకువెళ్లాలనేది విద్యా శాఖ మంత్రులందరూ ఆలోచించాల్సిన సమయం ఇది. ♦కొత్త బడ్జెట్ను రూపొందించేటప్పుడు నూతన జాతీయ విద్యా విధానాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. విద్యా మంత్రులు కేబినెట్ సమావేశాల్లో విద్యా రంగ ప్రాధాన్యతను తెలియజెప్పాలి. ప్రస్తుతం దేశంలోని ముఖ్యమంత్రులందరూ జాతీయ విద్యా విధానం పట్ల సుముఖతతో ఉన్నారు. ♦అంగన్వాడీలు, మధ్యాహ్న భోజన పథకాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలను పరిగణనలోకి తీసుకొని ఇతర రాష్ట్రాల్లో అమలయ్యేలా సూచనలు చేస్తాం. -
ఇక ప్రాంతీయ భాషల్లో జేఈఈ మెయిన్స్
సాక్షి, న్యూఢిల్లీ : వచ్చే ఏడాది నుంచి జేఈఈ మెయిన్స్ను ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహిస్తామని కేంద్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ పేర్కొన్నారు. నూతన విద్యా విధానానికి అనుగుణంగా జాయింట్ అడ్మిషన్ బోర్డు (జేఏబీ) ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్ను ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ భాషల్లోనే నిర్వహిస్తున్నారు. 2021 నుంచి భారత్లోని పలు ప్రాంతీయ భాషల్లో జేఈఈ మెయిన్ పరీక్షలను నిర్వహించాలని జేఏబీ నిర్ణయించిందని మంత్రి గురువారం ట్వీట్ చేశారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నూతన విద్యా విధానం దిశగా మరిన్ని నిర్ణయాలకు ఇది దారితీయనుంది. ఇక భారత్లో వైద్య విద్య ప్రవేశ పరీక్షల నీట్ను మాత్రమే 11 భాషల్లో నిర్వహించనున్నారు. -
సీఎం జగన్పై కేంద్ర మంత్రి ప్రశంసలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనా నిర్ణయాలను కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోక్రియల్ అభినందించారు. గ్రామ సచివాలయాలు, విద్యాసంస్కరణలను ఆయన ప్రశంసించారు. గురువారం వెబినార్ ద్వారా జరిగిన ఎన్సీఈఆర్టీ 57వ జనరల్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర మంత్రి రమేష్ పోక్రియల్, అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, హెచ్ఆర్డీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరోనా సమయంలో తీసుకున్న ప్రత్యేక చర్యలను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కేంద్ర మంత్రికి వివరించారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన విద్యాకానుక, నాడు నేడు, అమ్మ ఒడి, జగనన్న గోరు ముద్ద పథకాలను వివరించారు. అనంతరం కేంద్ర మంత్రి రమేష్ పోక్రియల్ మాట్లాడుతూ.. ఏపీ సీఎం వైఎస్ జగన్ గ్రామ సచివాలయ వ్యవస్థతో చాలా మంచి పాలన అందిస్తున్నారన్నారు. ( గ్రామ పంచాయతీలకు రూ.1,168 కోట్లు ) ఆయన తీసుకొచ్చిన వ్యవస్థ ప్రజలకు మంచి మేలు చేస్తోందని అన్నారు. సీఎం జగన్ విద్యార్థుల కోసం చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, విద్యామృతం, విద్యా కళశం ఆన్ లైన్ క్లాసులు నిర్వహించటంపై ప్రశంసలు కురిపించారు. విద్యార్థులకు మంచి న్యూట్రీషియన్ ఆహారాన్ని అందిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వమే అదనంగా బడ్జెట్ని కేటాయించి ఇవ్వడం సంతోషమన్నారు. ఏపీ సీఎం చేస్తున్నట్టుగా ఇతర రాష్ట్రాలు కూడా చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని ఇతర రాష్ట్రాలకు కూడా తెలియజేస్తామని అన్నారు. -
వారి కోసం 14న నీట్ నిర్వహణ
న్యూఢిల్లీ: కరోనా కారణంగా, కంటైన్మెంట్ జోన్లలో ఉండిపోవడం వల్ల నీట్ రాయలేకపోయిన వారికోసం ఈ నెల 14వ తేదీన మళ్లీ పరీక్ష నిర్వహించేందుకు సుప్రీంకోర్టు సోమవారం అనుమతించింది. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో రెండోసారి నీట్కు అనుమతి ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ తుషార్ కోరగా, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆమోదం తెలిపింది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి(ఎన్టీఏ) ఆదేశాలు జారీ చేసింది. వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్) ఫలితాలను ఈ నెల 16వ తేదీన వెల్లడించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ పరీక్ష రాయలేకపోయిన అభ్యర్థులు ఈ నెల 14వ తేదీన పరీక్షకు హాజరుకావొచ్చని సూచించారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. 16వ తేదీన ఏ సమయానికి నీట్ ఫలితాలు ప్రకటిస్తారన్న సమాచారాన్ని తర్వాత తెలియజేస్తామని పేర్కొన్నారు. నీట్ పరీక్షను సెప్టెంబర్ 13న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈసారి నీట్ ద్వారా దేశవ్యాప్తంగా 13 ఎయిమ్స్లతోపాటు జవహర్లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్–పుదుచ్చేరిలోనూ ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్ చట్టం–2019లో సవరణ చేశారు. దీన్ని పార్లమెంట్ గతేడాది ఆమోదించింది. -
స్కూళ్లు రీఓపెన్.. కేంద్రం మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా దాదాపు ఆరు నెలలుగా సెలవులో ఉన్న విద్యాసంస్థలు ఈ నెల 15 నుంచి తెరుచుకోనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాటించాల్సిన జాగ్రత్తలకు సంబంధించి కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని కరోనా పరిస్థితులను బట్టి అక్టోబర్ 15 నుంచి పాఠశాలలు తెరువాలా వద్దా అన్నది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించుకోవాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ తెలిపింది. స్కూళ్లు తెరిచిన రెండు వారాల వరకు విద్యార్థులకు హోం వర్క్ ఇవ్వొద్దని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. ఆన్లైన్ తరగతులు మాత్రం తప్పని సరిగా ప్రారంభం కావాలని పేర్కొన్నారు. స్కూళ్లను పునరుద్ధరించే పక్షంలో తప్పని సరిగా పేర్కొన్న మార్గదర్శకాలను అనుసరించాలని వెల్లడించారు. (పాఠశాలలు ప్రారంభం: వారంలో 70 కేసులు) DoSEL, @EduMinOfIndia has issued SOP/Guidelines for reopening of schools. pic.twitter.com/pwJXZZd40w — Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) October 5, 2020 స్కూలులోని అన్ని చోట్ల పరిశుభ్రత, స్వచ్ఛమైన గాలి, కరోనా వ్యాప్తి నిరోధక చర్యలు చేపట్టాలి. దీని కోసం పాఠశాలలు తగిన ఏర్పాట్లు చేయాలి. స్కూళ్లు సొంతంగానే నిబంధనలు, ప్రోటోకాల్స్ తయారు చేసుకోవాలి. తరగతి గదుల్లో విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా సీటింగ్ ఏర్పాట్లు ఉండాలి. విద్యార్థులు, ఉపాధ్యాయులు మాస్కులు తప్పని సరిగా ధరించాలి. విద్యార్థులు, టీచర్లు, పేరెంట్స్, కమ్యూనిటీ సభ్యులు, హాస్టల్ సిబ్బంది శానిటైజ్ పద్ధతులు పాటించాలి. అన్ని తరగతుల విద్యా క్యాలెండర్కు మార్పులు చేయాలి. పాఠశాల ప్రాంగణంలో డాక్టర్, నర్సు, ఆరోగ్య సిబ్బంది అన్ని వేళలా అందుబాటులో ఉండేలా చూడాలి. విద్యార్థులు, స్కూలు సిబ్బందికి సిక్ లీవ్, హాజరులో వెసులుబాటు కల్పించాలి. స్కూళ్లు తెరిచిన రెండు నుంచి మూడు వారాల వరకు విద్యార్థులకు హోం వర్క్ ఇవ్వకూడదు. ఐసీటీ వినియోగం, ఆన్లైన్ విద్యను తప్పనిసరిగా కొనసాగించాలి. తల్లిదండ్రుల అనుమతితోనే విద్యార్థులు పాఠశాలకు హాజరుకావాలి. భౌతికంగా కన్నా ఆన్లైన్ విద్యను ఎంచుకునే అవకాశం విద్యార్థులకు ఇవ్వాలి. విద్యార్థుల హాజరులో ఈ మేరకు సౌలభ్యం కల్పించాలి. -
నో పాలిటిక్స్; అన్ని జాగ్రత్తలతో నీట్-జేఈఈ
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో నీట్, జేఈఈ పరీక్షల నిర్వహణపై ఆందోళన అవసరం లేదని, అన్ని జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహిస్తామని కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ స్పష్టం చేశారు. విద్యార్ధుల భద్రత, కెరీర్ తమకు ప్రధానమని, ఈ పరీక్షల కోసం జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పలు మార్గదర్శకాలు, నిర్దిష్ట విధానాలను జారీ చేసిందని చెప్పారు. మే-జూన్ నుంచి ఈ పరీక్షలు రెండుసార్లు వాయిదాపడ్డాయని, పెద్దసంఖ్యలో విద్యార్ధులు, తల్లితండ్రులు పరీక్షల నిర్వహణకు సానుకూలంగా స్పందించారని, మెయిల్స్ ఇతర మార్గాల ద్వారా తమ సమ్మతి తెలిపారని మంత్రి రమేష్ పోఖ్రియాల్ పేర్కొన్నారు. విద్యార్ధుల సౌకర్యానికి అనుగుణంగా పరీక్షా కేంద్రాలను ఎన్టీఏ ఏర్పాటు చేసిందని చెప్పారు. 99 శాతం విద్యార్ధులు వారు ఎన్నుకున్న కేంద్రంలోనే పరీక్షకు హాజరవుతారని, ఎలాంటి ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఈ అంశంపై రాజకీయాలకు తావులేదని అన్నారు. అన్ని వాదనలు విన్నమీదట సుప్రీంకోర్టు సైతం విద్యార్ధుల విద్యా సంవత్సరాన్ని మనం వృధా చేయరాదని స్పష్టం చేసిందని గుర్తుచేశారు. ఇక ఈ పరీక్షలకు హాజరవుతున్న 8.58 లక్షల విద్యార్ధుల్లో 7.50 లక్షల మంది విద్యార్ధులు తమ జేఈఈ అడ్మిట్ కార్డులను డౌన్లౌడ్ చేసుకోగా, నీట్ పరీక్షలకు హాజరయ్యే 15.97 లక్షల మంది విద్యార్ధుల్లో 10 లక్షల మంది విద్యార్ధులు అడ్మిట్ కార్డులను ఇప్పటివరకూ డౌన్లోడ్ చేసుకున్నారు. నీట్-జేఈఈ పరీక్షలకు ఎన్టీఏ జారీ చేసిన మార్గదర్శకాల అమలు చేస్తూ విద్యార్ధు భద్రతకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి రమేష్ పోఖ్రియాల్ స్పష్టం చేశారు. ఎన్టీఏ అధికారులు, రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం పలు భేటీలు జరుగుతున్నాయని వివరించారు. విద్యా శాఖ కార్యదర్శి సైతం రాష్ట్రాల విద్యాశాఖాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. ఇక జేఈఈ మెయిన్, నీట్ పరీక్షలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సామాజిక కార్యకర్త గ్రెటా థన్బెర్గ్ నుంచి బాలీవుడ్ నటుడు సోనూ సూద్ వరకూ పలువురు ప్రముఖులు కరోనా విజృంభిస్తున్న సమయంలో నీట్ పరీక్షల నిర్వహణను వ్యతిరేకిస్తూ ట్వీట్ చేస్తున్నారు. చదవండి : జేఈఈ, నీట్లపై గళమెత్తిన గ్రెటా థన్బెర్గ్ -
ఏడాదిలో రెండు సార్లు బోర్డు పరీక్షలు
న్యూఢిల్లీ : కొత్త జాతీయ విద్యా విధానానికి (ఎన్ఈపీ–2020) కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇది గత 34 సంవత్సరాల నాటి జాతీయ విద్యా విధానం స్థానంలో రూపుదిద్దుకుంది. ఇందులో పాఠశాల విద్య నుంచి ఎంఫిల్ వరకు విద్యా విధానంలో సమూల మార్పులు చేశారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే విధంగా విధివిధానాలను మార్చారు. ఈ మార్పుల్లో అతి ముఖ్యమైనది పరీక్షలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థులకు రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించడం. దీనిపై విద్యాశాఖ మంత్రి రమేశ్ నిశాంక్ పోఖ్రియాల్ మాట్లాడుతూ.. 10వ తరగతి, 12వ తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షలు సులభతరం చేసేందుకు సంవత్సరానికి రెండు సార్లు పరీక్షలు నిర్వహించేందుకు అనుమతులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. సంపూర్ణ అభ్యాసం విద్యార్థి సామర్థ్యాలను అంచనా వేయడం ప్రధానం కాబట్టి రెండుసార్లు పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థి పోటీపడే సామర్థ్యాలను పరీక్షించడమే తాజా పరీక్షల ఉద్దేశం అంతేకానీ బట్టీపట్టి పరీక్షల్లో నెగ్గేలా నూతన పరీక్ష విధానం ఉండదని వివరించారు. (పాఠశాల, ఉన్నత విద్యలో భారీ సంస్కరణలు) విద్యార్థులపై ఫైనల్ పరీక్షల భారాన్ని తగ్గించేందుకు ఏడాదికి రెండు సార్లు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఫైనల్ పరీక్షల అత్యున్నత విద్యను అందించడం, భారత్ను నాలెడ్జ్ సూపర్ పవర్ గా తయారు చేయడం వంటి లక్ష్యాలతో ఈ నూతన విధానాన్ని రూపొందించారు. కొత్త జాతీయ విద్యా విధానంలో 18 సంవత్సరాల వరకు ఉచిత విద్యను అందించడం, అలాగే పూర్వ ప్రాథమిక విద్యపై దృష్టిపెడుతూ 10+2 విద్య స్థానంలో 5+3+3+4 సంవత్సరాల విద్యను తీసుకురానున్నారు. (సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పరీక్షలు రద్దు) -
విద్యార్థులంతా స్వదేశంలోనే చదువుకునేలా ఏర్పాట్లు
న్యూఢిల్లీ: దేశంలోనే అధిక సంఖ్యలో విద్యార్థులకు చదువుకునే అవకాశాలు కల్పించేందుకు, కోవిడ్–19 కారణంగా విదేశాల నుంచి తిరిగివచ్చే విద్యార్థులకు సైతం ఇక్కడ చదువు కొనసాగించే అవకాశం కల్పించే లక్ష్యంతో రూపొందించే కార్యక్రమానికి మార్గదర్శకాలను తయారుచేయడం కోసం మానవ వనరుల శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఛైర్మన్ సారథ్యంలోని ఈ కమిటీ, ప్రతిష్టాత్మక విద్యాలయాల్లో మరింత మందిని చేర్చుకునే అవకాశాలపై సైతం సిఫారసులు చేయనుంది. ఈ కమిటీ 15 రోజుల్లోగా తన రిపోర్టు అందించాల్సి ఉంది. విదేశాల్లో చదువుకోవాలనుకున్న అనేక మంది విద్యార్థులు కోవిడ్ –19 కారణంగా యిప్పుడు భారత్లోనే చదువుకోవాలని భావిస్తున్నారు. అమెరికా నుంచి భారత్కి తిరిగి వచ్చే విద్యార్థుల సంఖ్య సైతం పెరుగుతోంది’’అని ‘‘స్టే ఇన్ ఇండియా అండ్ స్టడీ ఇన్ ఇండియా’’కార్యక్రమంలో హెచ్చార్డీ మంత్రి రమేష్ పోక్రియాల్ నిశాంక్ చెప్పారు. గత ఏడాది 7.5 లక్షల మంది విద్యార్థులు తమ చదువుకోసం విదేశాలకు వెళ్ళారని ఆయన చెప్పారు. ‘‘ఈ ప్రతిభావంతులైన విద్యార్థులందర్నీ మన దేశంలోనే చదువు కొనసాగించేలా చర్యలు చేపట్టాలి’’అలాగే ప్రభుత్వం ప్రణాళికలో పేర్కొన్నట్లు ప్రముఖ విద్యాలయాలన్నింటిలోనూ 2024 కల్లా సీట్ల సామర్థ్యాన్ని 50 శాతం పెంచాలనీ, 2024కి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను 50కి పెంచాలని మంత్రి నిశాంక్ అన్నారు. -
అత్యంత చౌకైన కరోనా టెస్టింగ్ కిట్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత చౌకైన కరోనా టెస్టింగ్ కిట్ ‘కరోష్యూర్’ను తాము దేశీయంగానే అభివృద్ధి చేశామని ఐఐటీ–ఢిల్లీ వెల్లడించింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ బుధవారం దీన్ని ఆవిష్కరించారు. మేక్ ఇన్ ఇండియా దిశగా ఇది ఒక గొప్ప ముందడుగు అని ప్రశంసించారు. ఈ కిట్ ధర కేవలం రూ.399. ఆర్ఎన్ఏ ఐసోలేషన్, ల్యాబ్ చార్జీలు కూడా కలిపితే మొత్తం ధర రూ.650 అవుతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని కిట్లతో పోలిస్తే ఇదే తక్కువ ధర. 3 గంటల్లో ఫలితం తెలుసుకోవచ్చు. చదవండి:( ఒకేరోజు 3.2 లక్షల కోవిడ్ పరీక్షలు) -
రాజకీయం చేయొద్దు.. అందుకే ఈ చర్య..
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) ఈ విద్యా సంవత్సరానికి గాను సిలబస్ నుంచి తొలగించిన పాఠ్యాంశాలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ స్పందించారు. ఈ విషయాన్ని తప్పుగా చిత్రీకరించడం ద్వారా సంచలనం సృష్టించేందుకు అజ్ఞానంతో చేస్తున్న వ్యాఖ్యలని గురువారం ట్విటర్లో పేర్కొన్నారు. ‘సమాఖ్యవాదం, జాతీయవాదం, స్థానిక ప్రభుత్వాలు వంటి పాఠ్యాంశాలను ఒక సబ్జెక్టుకు సంబంధించి సిలబస్ నుంచి తొలగించడం వాస్తవమే. నిపుణులు, విద్యార్థుల తల్లిదండ్రుల సూచనల మేరకే ఈ చర్య చేపట్టాం. అయితే, ఇది ఈ ఒక్క సబ్జెక్టుకే పరిమితం కాదు. బయాలజీలో న్యూట్రిషన్, డైజెషన్ వంటి వాటిని, ఫిజిక్స్లో రేడియేషన్, రిఫ్రిజిరేటర్, హీట్ ఇంజిన్ వంటి అంశాలను, ఆర్థిక శాస్త్రంలో చెల్లింపుల లోటు వంటి అంశాలను ఈ ఏడాదికి మాత్రమే తొలగించాం. వీటిపైనా ప్రతిపక్షాలు స్పందించాలి’అని ఆయన కోరారు. ‘విద్యారంగ పవిత్రతను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీనిని రాజకీయం చేయొద్దు’ అని ఆయన ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. దేశంలో కోవిడ్–19తో తలెత్తిన అసాధారణ పరిస్థితుల దృష్ట్యా విద్యార్థులపై భారాన్ని తగ్గించేందుకు 30 శాతం వరకు పాఠ్యాంశాలను సీబీఎస్ఈ సిలబస్ నుంచి తగ్గించనున్నట్లు ప్రకటించడం, ఈ అంశంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఒక ప్రత్యేక సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలోకి తేవడానికే ప్రజాస్వామ్యం, బహుళత్వం వంటి అంశాలను కేంద్రప్రభుత్వం విద్యార్థుల సిలబస్ నుంచి తొలగించిందని పేర్కొన్నాయి. (సిలబస్ నుంచి పౌరసత్వం, నోట్లరద్దు కట్) -
30% తగ్గనున్న సీబీఎస్ఈ సిలబస్
న్యూఢిల్లీ: కోవిడ్–19 కారణంగా సకాలంలో స్కూళ్లు తెరుచుకోకపోవడంతో నష్టపోయిన విద్యా సంవత్సరాన్ని భర్తీ చేసేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) కీలక నిర్ణయం తీసుకుంది. 2020–21 విద్యా సంవత్సరంలో 9 నుంచి12వ తరగతి వరకు సిలబస్ను 30 శాతం మేర తగ్గించింది. ‘దేశంలో నెలకొన్న అసాధారణ పరిస్థితుల దృష్ట్యా 9 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులపై భారం తగ్గించి, కరిక్యులమ్ రివైజ్ చేయాలని సీబీఎస్ఈని కోరాం’అని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ తెలిపారు. దీనిపై గత వారం సూచనలు కోరగా విద్యావేత్తలు పెద్ద సంఖ్యలో స్పందించారన్నారు. వీరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, 30 శాతం మేర సిలబస్ను హేతుబద్ధీకరించినట్లు తెలిపారు. ఈమేరకు మార్పులను సీబీఎస్ఈ పరిపాలక మండలి కూడా ఆమోదించిందన్నారు. తగ్గించిన సిలబస్ పాఠ్యాంశాలను కూడా విద్యార్థులకు బోధించాల్సి ఉంటుందని పాఠశాలలకు, ఉపాధ్యాయులకు సూచించామన్నారు. అయితే, ఇంటర్నల్స్, వార్షిక పరీక్షల్లో తగ్గించిన సిలబస్లోని అంశాలపై ప్రశ్నలుండవని వివరించారు. 1 నుంచి 8వ తరగతి విద్యార్థుల కోసం ఎన్సీఈఆర్టీ ఇప్పటికే ప్రత్యామ్నాయ కేలండర్ను రూపొందించి, ప్రకటించిందన్నారు. -
విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పిన సీబీఎస్ఈ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు నమోదైన కొన్ని రోజులకే పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. తరువాత దేశంలో కరోనా విజృంభించడంతో లాక్డౌన్ ఎత్తివేసినప్పటికీ స్కూళ్లు మాత్రం తెరవలేదు. ఈ క్రమంలోనే అన్ని తరగతుల పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ ఏడాది పాఠశాలలు తెరవడం కష్టంగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు విద్యార్థులపై భారం పడకుండా సిలబస్ తగ్గిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సీబీఎస్ఈ కూడా 9 నుంచి 12 వ తరగతి వరకు 30 శాతం సిలబస్ తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. (ఫేస్బుక్తో జతకట్టిన సీబీఎస్ఈ) ఇది 2020-21 విద్యా సంవత్సరానికి వర్తిస్తుందని కేంద్ర మానవనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ మంగళవారం ప్రకటించారు. కరోనా పరిస్థితుల కారణంగా విద్యార్థులు నష్టపోయిన కాలం ఈ నిర్ణయం ద్వారా భర్తీ అవుతుందని ఆయన తెలిపారు. అయితే కుదించిన సిలబస్ను కూడా టీచర్లు విద్యార్థులు చెప్పాలని, అయితే వాటిని పరీక్షలు ఇవ్వబోమని తెలిపారు. సిలబస్ కుదింపు విషయంలో కీలక పాఠ్యాంశాల జోలికి వెళ్లబోవడంలేదని ఆయన స్పష్టం చేశారు. సిలబస్ కుదింపునకు సంబంధించి మానవవనరుల శాఖకు ఇప్పటి వరకు 1500 పైగా నిపుణులు సలహాలు ఇచ్చారు. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా విద్యార్ధుల సిలబస్ 30 శాతం తగ్గించాలని ప్రభుత్వానికి సూచించారు. (సీబీఎస్ఈ రద్దయిన పరీక్షలకు.. ప్రతిభ ఆధారంగా మార్కులు) -
ఫేస్బుక్తో జతకట్టిన సీబీఎస్ఈ
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్తో జత కట్టింది. విద్యార్థులకు, అధ్యాపకులకు ‘డిజిటల్ సేఫ్టీ, ఆన్లైన్ వెల్బీయింగ్, అగ్మెంటెడ్ రియాలిటీ’ వంటి వాటిని నేర్పించడానికి ఈ భాగస్వామ్యం ఏర్పడినట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ నిశాంక్ పోఖ్రియాల్ ఆదివారం వెల్లడించారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు, అధ్యాపకులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. కనీసం 10 వేల మంది ఇందులో భాగస్వాములవుతారని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. -
జేఈఈ, నీట్ వాయిదా
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్, నీట్, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా తీవ్రత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (హెచ్చార్డీ) మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ప్రకటించారు. ఈ నెలలో జేఈఈ మెయిన్, నీట్, వచ్చే నెలలో జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు జరగాల్సి ఉండగా, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాల్సిందిగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) డైరెక్టర్ జనరల్, నిపుణులతో గురువారం ఓ కమిటీ ఏర్పాటు చేశారు. శుక్రవారం ఈ కమిటీ తన నివేదిక సమర్పించింది. కమిటీ నివేదిక ప్రకారం విద్యార్థుల భద్రతను పరిగణనలోకి తీసుకొని పరీక్షలను వాయిదా వేసినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ నెల 18 నుంచి 23 వరకు జరగాల్సిన జేఈఈ మెయిన్ పరీక్షలను సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఈనెల 26న జరగాల్సిన నీట్ను సెప్టెంబర్ 13న నిర్వహిస్తామని తెలిపారు. అలాగే వచ్చే నెల 23న నిర్వహించాల్సిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను సెప్టెంబర్ 27న నిర్వహిస్తామని వివరించారు. రద్దుకు అవకాశం లేనందునే.. వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశ పరీక్ష ద్వారా మాత్రమే ప్రవేశాలు చేపట్టాలని 2005లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు కేంద్రం పరీక్షలను వాయిదా వేసింది. కానీ రద్దు చేయలేదు. పోటీ అధికంగా ఉన్నప్పుడు ప్రవేశ పరీక్ష లేకుండా క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మార్కుల ఆధారంగా వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టడానికి వీల్లేదని, ప్రవేశ పరీక్ష మార్కుల ఆధారంగానే ప్రవేశాలు చేపట్టాలని సుప్రీం కోర్టు పేర్కొంది. ఆ ప్రకారమే కేంద్రం పరీక్షల నిర్వహణ వైపే మొగ్గు చూపింది. జాతీయ ప్రవేశాలు ఆలస్యమే.. ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో ప్రవేశాలు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే ఇతర జాతీయ స్థాయి సంస్థల్లో (జీఎఫ్టీఐ) ప్రవేశాలకు జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్ ఏటా నిర్వహిస్తుంటుంది. ఈసారి కూడా అలాగే నిర్వహించనుంది. అయితే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష సెప్టెంబర్ 27న జరిగితే ఫలితాలను ఆ తర్వాతి నాలుగైదు రోజులకు వెల్లడించే అవకాశం ఉంటుంది. అంటే అక్టోబర్లో ప్రవేశాల కౌన్సెలింగ్ చేపట్టే అవకాశం ఉంటుంది. ఏడెనిమిది దశల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ను అక్టోబర్లో పూర్తి చేసినా నవంబర్లో తరగతులు ప్రారంభం అవుతాయి. అయితే అప్పటికీ కరోనా అదుపులోకి రాకపోతే రెగ్యులర్ తరగతులు నిర్వహించే పరిస్థితి ఉండదు. అందుకే ఐదు ఐఐటీల డైరెక్టర్లతో కూడిన కమిటీ ఐఐటీల స్టాండింగ్ కౌన్సిల్కు ఇటీవల ఓ నివేదిక అందజేసింది. అందులో డిసెంబర్ నుంచి తరగతులు ప్రారంభించేలా సిఫారసు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా ఆదుపులోకి వస్తే నవంబర్లో తరగతులు ప్రారంభం అవుతాయి. లేదంటే డిసెంబర్లోనే తరగతులు ప్రారంభం అయ్యే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోనూ ఆగస్టులో సెట్స్! ఈ నెలలో జరగాల్సిన ఎంసెట్ సహా ఇతర సెట్స్ను ఇటీవల వాయిదా వేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ పరీక్షలను నిర్వహించేందుకు సెట్ కమిటీలు అన్ని ఏర్పాట్లు చేశాయి. కోర్టులో పిల్ పడటంతో ప్రభుత్వం పరీక్షల నిర్వహణపై వెనక్కి తగ్గి వాయిదా వేసింది. మళ్లీ పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది చెప్పలేదు. దీంతో రాష్ట్రంలో ఇక ప్రవేశ పరీక్షలు ఉండవని, ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా ప్రవేశాలు చేపడతారని కొంత మంది విద్యార్థులు భావించారు. అయితే తాజాగా కేంద్రం జాతీయ స్థాయి పరీ„క్షలను రద్దు చేయకుండా వాయిదా మాత్రమే వేసింది. దీంతో దీంతో రాష్ట్రంలోనూ ప్రవేశ పరీక్షలు ఉంటాయన్న విషయం అర్థం అవుతోంది. ఆగస్టు రెండో వారంలో రాష్ట్ర సెట్స్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఏపీలో ఈనెల 27 నుంచి ఎంసెట్ ఉన్నందునా ఏపీ ప్రభుత్వం వాటిని చేపట్టి నిర్వహిస్తే అదే పద్ధతిలో రాష్ట్రంలో ఎంసెట్ సహా ఇతర సెట్స్ నిర్వహణ సులభతరం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. అదే జరిగితే ఆగస్టు రెండో వారంలో రాష్ట్ర ఎంసెట్ జరగనుంది. సెప్టెంబర్లో ప్రవేశాలు.. రాష్ట్రంలో ఆగస్టులో ఎంసెట్, ఇతర సెట్స్ చేపట్టి పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. అవసరమైతే కోర్టులో పిటిషన్ వేసి పరీక్షల నిర్వహణకు చర్యలు చేపడతామని, ఏర్పాట్లపై అనుమానాలు ఉంటే కోర్టు అబ్జర్వర్ను కూడా నియమించి చూసుకునేలా కోర్టుకు విన్నవిస్తామని పేర్కొంటున్నారు. తద్వారా ఆగస్టులో పరీక్షలు నిర్వహించి ఆగస్టు చివరికల్లా ఫలితాలను వెల్లడించాలని భావిస్తున్నారు. ఇక సెప్టెంబర్లో ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించి, అప్పటి పరిస్థితులను బట్టి ప్రత్యక్ష బోధన లేదా ఆన్లైన్ తరగతులు నిర్వహించే దానిపై నిర్ణయం తీసుకుంటామని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. సర్టిఫికెట్లు ఆపకుండా ప్రత్యేక చర్యలు ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ వంటి జాతీయ స్థాయి సంస్థల్లో రాష్ట్రం నుంచి సీట్లు లభించే విద్యార్థులు 5 నుంచి 8 వేలలోపు ఉంటారు. వారి కోసం రాష్ట్ర స్థాయిలో మొత్తం 80 వేల ప్రవేశాల ప్రక్రియను ఆపే పరిస్థితి వద్దని ఈసారి ఉన్నత విద్యా శాఖ ఆలోచనలు చేస్తోంది. అందుకే ఆగస్టులో పరీక్షలు నిర్వహించి సెప్టెంబర్లో ప్రవేశాలు చేపట్టేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఒకవేళ రాష్ట్ర కాలేజీల్లో సీట్లు లభించి చేరిన విద్యార్థుల్లో ఎవరికైనా జాతీయ స్థాయి కాలేజీల్లో జోసా కౌన్సెలింగ్ ద్వారా వారు వెళ్లిపోయేలా తగిన చర్యలు చేపడతామని అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్ర కాలేజీల్లో చేరిన విద్యార్థుల సర్టిఫికెట్లను ఆపకుండా, జాతీయ స్థాయి కాలేజీలకు వెళ్లేలా తగిన ఏర్పాట్లు చేస్తామని చెబుతున్నారు. -
జేఈఈ, నీట్ పరీక్షలపై నిర్ణయం అప్పుడే!
సాక్షి, న్యూఢిల్లీ: జూలైలో జరగాల్సిన జేఈఈ , నీట్ పరీక్షలను రద్దు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ గురువారం తెలిపారు. పరిస్థితిని సమీక్షించి, వారి సిఫారసులను రేపటిలోగా సమర్పించాలని ఎన్టీఏ, ఇతర నిపుణులతో కూడిన కమిషన్ను కోరినట్లు హెచ్ఆర్డీ మంత్రి గురువారం ట్విట్టర్లో పేర్కొన్నారు. (జూలై 26న నీట్) జేఈఈ పరీక్ష జూలై 19-23 మధ్య జరగాల్సి ఉండగా, నీట్ పరీక్ష జూలై 26 న జరగాల్సి ఉంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరుగుతాయా లేదా అనే అంశంపై మొత్తం 30 లక్షల మంది విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఇతర సంబంధిత వ్యక్తులు ట్విట్టర్లో #RIPNTA అనే హ్యాష్ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు. 24 గంటల్లో 314800 కంటే ఎక్కువమంది దీనిని రీట్వీట్ చేశారు. దీంతో ఇది టాప్ ట్రెండింగ్ లిస్ట్లో నిలిచింది . దీనిపై స్పందించిన హెచ్ఆర్డీ మంత్రి "మీ సమస్యలను నేను అర్థం చేసుకున్నాను, వీలైనంత త్వరగా సమస్యకు పరిష్కారం కనుగొనటానికి మేము ప్రయత్నిస్తున్నాం" అని ఒక ప్రకటనలో తెలిపారు.ఇదిలా ఉండగా భారతదేశంలో 19 కేసులు 6 లక్షలు దాటాయి. (ఆన్లైన్ క్లాసులు: హెచ్ఆర్డీ కీలక ప్రకటన) -
ప్రపంచానికి సంజీవని యోగా
ప్రధాని నరేంద్ర మోదీ 2014 సెప్టెంబర్ 27న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన సందర్భంగా చూపిన చొరవతో, ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని 2014 డిసెంబర్ 11న ఆ సంస్థ తీర్మానించింది. ఈ తీర్మానం అద్భుతం అనిపించుకోవడానికి కారణం దానికిగల సార్వత్రిక స్వభావం. పైగా యోగాకు ఇప్పుడు యావత్ ప్రపంచ ఆమోదం కూడా లభించింది. ఈ తీర్మానంతో, భౌగోళికంగా విడిపోయి ఉన్న ప్రపం చం.. యోగాతో ఐక్యతవైపు మళ్లిందన్నది వాస్తవం. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 177కుపైగా దేశాలు మద్దతు పలుకగా, మరో 175 దేశాలు తీర్మానాన్ని సమర్థించడమే ఇందుకు నిదర్శనం. అంతేకాకుండా ఇప్పటిదాకా ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం చేసిన ఏ తీర్మానానికి కూడా ఇంత అత్యధిక సంఖ్యలో సమర్థన లభించకపోవడం విశేషంగా భావించాలి. పైగా ఐక్యరాజ్యసమితిలో ఒక దేశం ప్రతిపాదన ప్రవేశపెట్టి, దాన్ని 90 రోజుల్లోగా సాకారం చేసుకోగలగడం కూడా సర్వసభ్య సమావేశాల చరిత్రలో ఇదే తొలిసారి కావడం మరీ విశేషం. ముఖ్యంగా ‘5,000 ఏళ్ల చరిత్ర కలిగిన మన ప్రాచీన వారసత్వానికి వాస్తవమైన గుర్తింపును ఆపాదించే యోగా’కు అంతర్జాతీయంగా ప్రాచుర్యం కలిగించే దిశగా దేశంలో ఇన్ని దశాబ్దాలుగా ఎన్నడూ ప్రయత్నమే జరగలేదు. అలాంటి పరిస్థితిలో ప్రధానిగా నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు చేపట్టాక కేవలం ఆరు నెలల్లోనే ఈ అద్భుతం సాధించారు. ఆరోగ్యం–శ్రేయస్సు దిశగా మానవాళి ఆకాంక్షకు యోగా ఒక ప్రతీక అని ఆయన చక్కగా వివరించారు. పైగా పైసా ఖర్చులేని ఆరోగ్యధీ(బీ)మా లభిస్తుందని చాటారు. ప్రపంచం అనారోగ్యం నుంచి ఆరోగ్యంవైపు వెళ్లేందుకు యోగా మార్గం చూపించిందన్నారు. ‘‘యోగా ఒక మతం కాదు... శ్రేయస్సు. అది యవ్వనోత్సాహంతో కూడిన మనస్సు,శరీరం, ఆత్మల నిరంతర అనుసంధాన శాస్త్రం’’. మానవాళి శాంతిసామరస్యాలను ప్రతిబింబించే సందేశాన్ని ప్రపంచానికి యోగా అందిస్తుంది. ఇది ‘ఆత్మనుంచి ఆత్మవైపు, ఆత్మద్వారా పయనం.’ ‘‘పతంజలి యోగ సూత్రం’’ పేరిట పతంజలి మహర్షి రూపొందించిన గ్రంథం జగత్ప్రసిద్ధం. అలాగే భగవద్గీత, ఉపనిషత్తుల వంటి ప్రసిద్ధ హిందూ గ్రంథాల నుంచి యోగా–యోగాభ్యాసాల సారాంశాన్ని అనువదించిన ఘనత శ్రీ అరబిందోకు దక్కింది. ఇక బి.ఎస్.అయ్యంగార్, మహర్షి పరమహంస యోగానంద వంటివారు ఈ యోగా జ్ఞానా న్ని ప్రపంచవ్యాప్తం చేసి గౌరవాదరాలు పొందారు. ఆ మేరకు వారు ముఖ్యమైన ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారానే గాక తమ క్రమశిక్షణ, ప్రేరణాత్మకమైన జీవనశైలి ద్వారా ప్రపంచమంతటా యోగాను విస్తృతంగా వ్యాప్తి చేశారు. పాశ్చాత్య దేశాలలో యోగా ఘనతను, ప్రాముఖ్యాన్ని గొప్పగా చాటిన భారతీయులలో స్వామి వివేకానంద అగ్రగణ్యుడుగా ఘనత పొందారు. పాశ్చాత్య ప్రపంచానికి వేదాం తం, యోగా వంటి భారతీయ తత్వశాస్త్రాలను పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించింది ఆయ నే. భారతీయ తత్వశాస్త్రం, ఆధ్యాత్మికతపై ఆయన వాగ్ధాటి షికాగోలో ఇప్పటికీ ప్రతిధ్వనిస్తోంది. ప్రపంచీకరణవల్ల విశేషంగా విజయవంతమైన అంశాల్లో యోగా కూడా ఒకటిగా గుర్తింపు పొందింది. ఇది మానవాళి చైతన్యం, శ్రేయస్సుకు సంబంధించి అత్యంత విస్తృతంగా నిర్వహించుకునే వేడుకగా మారింది. ప్రాంతాలు, మతాలతో నిమిత్తం లేకుండా ప్రపంచవ్యాప్తంగా యోగా ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. నేడు ఆరోగ్యం–ఆనందం కీలకాంశాలుగా భిన్నధోరణులు గల ప్రపంచాన్ని ఒక్కతాటి పైకి చేరుస్తున్న అత్యంత విజయవంతమైన సంధానకర్త ఇదే. భిన్న ధ్రువాల ప్రపంచంలో కుటుంబం, సమాజం, దేశాలను ఐక్యం చేయగల బలమైన శక్తి యోగా. పాశ్చాత్య దేశాల్లో చాలా ఎక్కువగా వినియోగంలో ఉన్న అనుబంధ ఆరోగ్య విధానంగా యోగా వెలుగొందుతోంది. అంతేకాకుండా యోగాతో తమ జీవితాలకు సమకూరే లబ్ధి గురించి కూడా ప్రపం చం నేడు తెలుసుకుంటోంది. యోగాతోపాటు ధ్యానం చేయడంవల్ల వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేయవచ్చని, అనేక వ్యాధుల బారినుంచి రక్షణ లభిస్తుందని అమెరికా జాతీయ వైద్య గ్రంథాలయం ప్రచురించిన నివేదిక పేర్కొనడం ఇందుకు నిదర్శనం. యోగాభ్యాసంతో వ్యక్తుల మానసిక వికాసంతోపాటు జీవితకాలం కూడా పెరుగుతుంది. యోగా భౌతికంగా ఆరోగ్యం బాగుపడటానికేగాక భావోద్వేగపరమైన, మానసిక శ్రేయస్సుకూ దోహ దం చేస్తుంది. ఇది మీ జీవిత కాలానికి మరిన్ని సంవత్సరాలను జోడించడమేగాక ఆ సంవత్సరాలకు జీవాన్ని కూడా జోడిస్తుంది. శరీరంలో రోగనిరోధక కణాల ప్రసరణను ప్రోత్సహించే పరమాణు మార్పులకు యోగా సాధన దోహదం చేస్తుందని పరిశోధనల ఫలితాలు పేర్కొంటున్నాయి. యోగా మనోభారాన్ని తగ్గించడంలో కూడా తోడ్పడుతుంది. ఆరోగ్యం, వ్యాయామ విద్యలో యోగా విడదీయలేని అంతర్భాగంగా ఉంది. ఆరోగ్యానికి సంబంధించి నేటి ప్రపంచం సమగ్ర విధానాన్ని అనుసరిస్తున్న నేపథ్యంలో యోగా కేవలం బోధనాత్మక విద్యలోనే కాకుండా ‘అనుభవపూర్వక అభ్యాసం’లో కూడా భాగమవుతోంది. యోగాను ఒక అధికారిక క్రీడగా అమెరికా నమోదు చేసింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఒలింపిక్స్లో పోటీపడే ఒక క్రీడగా కూడా యోగా మారగలదనే చర్చ కూడా సాగుతోంది. కోవిడ్–19 మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో నేడు హాలీవుడ్ నుంచి హరిద్వార్ వరకూ.. సామాన్యుల నుంచి మాన్యులదాకా అందరూ యోగాభ్యాసం వల్ల కలిగే ప్రయోజనాలను శ్రద్ధగా గమనించారు. నేను స్వయంగా హిమాలయ రాష్ట్రమైన ఉత్తరాఖండ్ వాసిని. ఈ ప్రాంతం యోగా, ఆయుర్వేదాలకు పుట్టినిల్లు. వైరస్ మహమ్మారి సంక్షోభం నుంచి బయటపడే మార్గం కోసం సకల ప్రపంచం ఇప్పుడు మనవైపు చూస్తోంది. నాలుగు గోడల మధ్య బందీ అయిన ప్రపంచానికి రోగనిరోధక శక్తిని పెంచడంలో, జీవన సమతౌల్యం నిలబెట్టుకోవడంలో యోగా అత్యంత సమర్థ ఆరోగ్య సాధనంగా ఆవిర్భవించింది. సాధారణంగా అయితే, మనం గతంలోలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించుకునేవారం. కానీ, ఇప్పుడు కోవిడ్–19 కారణంగా సామాజిక దూరం పాటిస్తూ మన కుటుంబంతో, పరిమితమైన ప్రదేశాల్లో ఈ వేడుక చేసుకోవాల్సి వస్తోంది. గత ఐదేళ్లుగా మనం సాధించిన యోగా దినోత్సవ స్ఫూర్తి కోవిడ్–19 వల్ల భగ్నం కారాదని అన్ని దేశాలకు, మొత్తంగా అంతర్జాతీయ సమాజానికి నా వినతి. కోవిడ్–19వల్ల పడిన మానసిక ప్రభావాన్ని ఉపశమింపజేయడానికి యోగా, ధ్యానమే ఉత్తమ చికిత్సగా పలు నివేదికలు, పరిశీలన అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. మన శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేయగల వివిధ ‘ప్రాణాయామ’ పద్ధతులు యోగాలో ఉన్నాయి. ఆ మేరకు కరోనా వైరస్ ప్రభావాలను ‘ప్రాణాయామం’ ఎలా ఎదుర్కొనగలదన్న అంశంపై అధ్యయనాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. సమాజం... సహజ నిరోధం... సమైక్యతలకు యోగా ఏకైక సాధనమన్నది నూటికి నూరుపాళ్లూ వాస్తవం. యోగా, ఆయుర్వేదం, ఆధ్యాత్మికం యుగయుగాలుగా అంతర్జాతీయ సమాజానికి మనమిస్తున్న సందేశం. ఇది నాటికీ.. నేటికీ.. ఎన్నటికీ సాపేక్షమేనన్నది వాస్తవం. అంతేకాదు... నిస్సందేహంగా ప్రపంచ శాంతిసామరస్యాలకు యోగా ప్రవేశ ద్వారం. రమేష్ పోఖ్రియాల్ వ్యాసకర్త కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి -
సిలబస్ కుదింపు
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో సకాలం లో విద్యా సంవత్సరం ప్రారంభించలేని ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నత విద్యలో సిలబస్, పని దినాలను కుదించేందుకు ఎంహెచ్ఆర్డీ చర్యలు చేపట్టింది. ఇందుకోసం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేష్ పోఖ్రియాల్ ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ప్రజలు, విద్యార్థులు, విద్యావేత్తల భాగస్వామ్యంతోనే సిలబస్ కుదింపు, పని దినాల తగ్గింపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. దీనికోసం ‘సిలబస్ ఫర్ స్టూడెంట్స్–2020’ పేర అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఎంహెచ్ఆర్డీ ట్విట్టర్ ఖాతాకు లేదా తన ట్విట్టర్ ఖాతాకు అభిప్రాయాలను పంపించాలన్నారు. ఫేస్బుక్ ద్వారా కూడా విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు అభిప్రాయాలను పంపించాలని సూచిం చారు. మంత్రి చేపట్టిన ఈ కార్యాచరణకు అనుగుణంగా సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కసరత్తు ప్రారంభించింది. -
ఐఐటీ–మద్రాస్ నెంబర్ 1
సాక్షి, న్యూఢిల్లీః 2020 సంవత్సరానికి గాను ఉన్నత విద్యా సంస్థలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంహెచ్ఆర్డీ) ర్యాంకులను ప్రకటించింది. ఇండియా ర్యాంకింగ్స్–2020ను ఆ శాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ నిశాంక్ గురువారం ఇక్కడ విడుదల చేశారు. మొత్తం పది కేటగిరీల్లో ఈ ర్యాంకులను ప్రకటించారు. దేశంలో ఉన్నత విద్యా సంస్థలకు ర్యాంకులు ప్రకటించడం ఇది వరుసగా ఐదోసారి. కొత్తగా ఈసారి ర్యాంకుల కేటగిరీల్లో దంత వైద్య విభాగం కూడా చేర్చారు. ఓవరాల్గా, అలాగే ఇంజినీరింగ్ విభాగంలో ఐఐటీ–మద్రాస్ తొలి స్థానంలో నిలిచింది. ఈ కేటగిరీలో ఐఐటీ–హైదరాబాద్కు ఎనిమిదో స్థానం దక్కింది. యూనివర్శిటీల విభాగంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు తొలిస్థానంలో నిలిచింది. ఇదే విభాగంలో యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ ఆరోస్థానంలో నిలిచింది. మేనేజ్మెంట్ కేటగిరీలో ఐఐఎం–అహ్మదాబద్, వైద్య విభాగంలో ఎయిమ్స్ తొలిస్థానంలో నిలిచాయి. కళాశాలల విభాగంలో మిరండా కాలే జ్ వరసగా మూడో ఏడాది తొలిస్థానంలో నిలిచింది. లా విభాగంలో హైదరాబాద్ నల్సార్ మూడో ర్యాంకు సాధించగా, ఫార్మసీ కేటగిరీలో హైదరాబాద్ నైపర్ ఐదో స్థానంలో నిలిచింది. (అత్యధిక కేసులున్నా అదుపులోనే వైరస్!) కార్యక్రమంలో కేంద్ర మంత్రి రమేష్ పొఖ్రియాల్ మాట్లాడుతూ ర్యాంకులు ప్రకటించడం వల్ల విద్యార్థులకు విద్యా సంస్థల ఎంపిక సులువవుతుందని అభిప్రాయపడ్డారు. అలాగే ఉన్నత విద్యా సంస్థల మధ్య పోటీతత్వం పెరుగుతుందని వివరించారు. టీచింగ్, లెర్నింగ్ అండ్ రీసోర్సెస్(టీఎల్ఆర్), రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్(ఆర్పీ), గ్రాడ్యుయేషన్ ఔట్కమ్స్(జీవో), ఔట్రీచ్ అండ్ ఇంక్లూజివిటీ(ఓఐ), పర్సెప్షన్(పీఆర్) వంటి పారామీటర్ల ఆధారంగా మార్కులు కేటాయించి ర్యాంకులు ప్రకటించారు. మొత్తం 3771 విద్యా సంస్థలు ఓవరాల్ ర్యాంకుల కోసం ప్రతిపాదనలు పంపాయి. అలాగే కేటగిరీ వారీగా కూడా ప్రతిపాదనలు పంపాయి. 294 విశ్వవిద్యాలయాలు, 1071 ఇంజినీరింగ్ ఇనిస్టిట్యూషన్స్, 630 మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూషన్స్, 334 ఫార్మసీ ఇనిస్టిట్యూషన్స్, 97 న్యాయ విద్యా సంస్తలు, 118 వైద్య విద్య సంస్థలు, 48 ఆర్కిటెక్చర్ సంస్థలు, 1,659 డిగ్రీ కళాశాలలు ర్యాంకుల కోసం ప్రతిపాదనలు పంపాయి. 100 ఓవరాల్ ర్యాంకులు, ఇంజినీరింగ్ విభాగంలో 200 ర్యాంకులు, యూనివర్శిటీలు, కళాశాలల విభాగంలో 100 చొప్పున, మేనేజ్మెంట్, ఫార్మసీ విభాగాల్లో 75 చొప్పున, వైద్య విద్యలో 40 ర్యాంకులు, ఆర్కిటెక్చర్, న్యాయ విద్యలో 20 ర్యాంకులు, దంత వైద్య విద్యలో 30 ర్యాంకులు ప్రకటించారు. (అందుబాటు ధరలో కరోనా టెస్టింగ్ కిట్) టాప్–10 ఇండియా ర్యాంకులు (ఓవరాల్ కేటగిరీ) ఇనిస్టిట్యూట్ పేరు ర్యాంకు ఐఐటీ–మద్రాస్ 1 ఐఐఎస్సీ–బెంగళూరు 2 ఐఐటీ–ఢిల్లీ 3 ఐఐటీ–బాంబే 4 ఐఐటీ–ఖరగ్పూర్ 5 ఐఐటీ–కాన్పూర్ 6 ఐఐటీ–గౌహతి 7 జేఎన్యూ–ఢిల్లీ 8 ఐఐటీ–రూర్కీ 9 బనారస్ హిందూ వర్శిటీ 10 యూనివర్శిటీ కేటగిరీలో టాప్–10 ర్యాంకులు ఇనిస్టిట్యూట్ ర్యాంకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్–బెంగళూరు 1 జేఎన్యూ, న్యూఢిల్లీ 2 బనారస్ హిందూ యూనివర్శిటీ, వారణాసి 3 అమృత విశ్వ విద్యాపీఠం, కోయంబత్తూరు 4 జాదవ్పూర్ యూనివర్శిటీ, కోల్కతా 5 యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ 6 కలకత్తా యూనివర్శిటీ, కోల్కతా 7 మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, మణిపాల్ 8 సావిత్రిబాయి ఫూలే పూణే యూనివర్శిటీ, పూణే 9 జామియామిలియాఇస్లామియా, న్యూఢిల్లీ 10 ఇంజినీరింగ్ కేటగిరీ ఇనిస్టిట్యూట్ ర్యాంకు ఐఐటీ–మద్రాస్ 1 ఐఐటీ–ఢిల్లీ 2 ఐఐటీ–బాంబే 3 ఐఐటీ–కాన్పూర్ 4 ఐఐటీ–ఖరగ్పూర్ 5 ఐఐటీ–రూర్కీ 6 ఐఐటీ–గౌహతి 7 ఐఐటీ–హైదరాబాద్ 8 ఐఐటీ–తిరుచిరాపల్లి 9 ఐఐటీ–ఇండోర్ 10 మేనేజ్మెంట్ కేటగిరీ ఇనిస్టిట్యూట్ ర్యాంకు ఐఐఎం–అహ్మదాబాద్ 1 ఐఐఎం–బెంగళూరు 2 ఐఐఎం–కలకత్తా 3 ఐఐఎం–లక్నో 4 ఐఐటీ–ఖరగ్పూర్ 5 ఐఐఎం–కోజికోడ్ 6 ఐఐఎం–ఇండోర్ 7 ఐఐటీ–ఢిల్లీ 8 ఎక్స్ఎల్ఆర్ఐ 9 మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్(గురుగ్రామ్) 10 కళాశాలల కేటగిరీ ఇనిస్టిట్యూట్ ర్యాంకు మిరండా హౌజ్ 1 లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ విమెన్, ఢిల్లీ 2 హిందూ కాలేజ్, ఢిల్లీ 3 సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్, ఢిల్లీ 4 ప్రెసిడెన్సీ కాలేజ్, చెన్నై 5 లయోలా కాలేజ్, చెన్నై 6 సెయింట్ జేవియర్స్ కాలేజ్, కోల్కతా 7 రామకృష్ణ మిషన్ విద్యామందిర, హౌరా 8 హన్స్రాజ్ కాలేజ్, ఢిల్లీ 9 పీఎస్జీఆర్ కృష్ణమ్మల్ ఫర్ విమెన్, కోయంబత్తూర్ 10 ఫార్మసీ కేటగిరీ ఇనిస్టిట్యూట్ ర్యాంకు జామియా హమ్దర్ద్, న్యూఢిల్లీ 1 పంజాబ్ యూనివర్శిటీ, చంఢీగఢ్ 2 నైపర్, మోహలీ 3 ఐసీటీ, ముంబై 4 నైపర్, హైదరాబాద్ 5 బిట్స్, పిలానీ 6 మణిపాల్ కాలేజ్ ఆఫ్ ఫార్మా సైన్సైస్, ఉడిపి 7 నైపర్, అహ్మదాబాద్ 8 జేఎస్ఎస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఊటీ 9 జేఎస్ఎస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, మైసూర్ 10 మెడికల్ కేటగిరీ ఇనిస్టిట్యూట్ ర్యాంకు ఎయిమ్స్, న్యూఢిల్లీ 1 పీజీఐఎంఈఆర్, చంఢీగఢ్ 2 క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, వెల్లూర్ 3 ఆర్కిటెక్చర్ కేటగిరీ ఇనిస్టిట్యూట్ ర్యాంకు ఐఐటీ, ఖరగ్పూర్ 1 ఐఐటీ, రూర్కీ 2 ఎన్ఐటీ, కాలికట్ 3 న్యాయ విద్య కేటగిరీ ఇనిస్టిట్యూట్ ర్యాంకు నేషనల్ లా స్కూల్, బెంగళూరు 1 నేషనల్ లా యూనివర్శిటీ, న్యూఢిల్లీ 2 నల్సార్ యూనివర్శిటీ ఆఫ్ లా, హైదరాబాద్ 3 దంత విద్య కేటగిరీ ఇనిస్టిట్యూట్ ర్యాంకు మౌలానా ఆజాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, ఢిల్లీ 1 మణిపాల్ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, ఉడిపి 2 డాక్టర్ డీవై పాటిల్ విద్యాపీఠం, పూణే 3 -
టాప్లో నిలిచిన ఐఐటీ మద్రాస్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ 2020 ఏడాదికి గాను నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్(ఎన్ఐఆర్ఎఫ్) జాబితాను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న విశ్వ విద్యాలయాలు, కళాశాలలకు సంబంధించిన ర్యాంకులను వెల్లడించింది. ఈ జాబితాలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీ మద్రాస్) మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ మేరకు మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ గురువారం ట్విటర్లో వెబ్కాస్ట్ ద్వారా ఆన్లైన్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి సంజయ్ ధోత్రే, ఏఐసీటీఐ చైర్మన్ అనిల్ సహస్రబుధే, యూజీసీ చైర్మన్ డీపీ సింగ్ పాల్గొన్నారు. (ప్రధాని హత్య.. 34 ఏళ్ల తర్వాత కేసు క్లోజ్ ) ఉన్నత విద్యా సంస్థల జాబితాలో ఐఐఎస్సీ బెంగళూరు రెండో స్థానంలో నిలవగా, ఐఐటీ ఢిల్లీ మూడో స్థానాన్నిదక్కించుకుంది. ఐఐటీ బొంబాయి, ఐఐటీ ఖరగ్పూర్, ఐఐటీ కాన్పూర్ నాలుగు, అయిదు, ఆరవ స్థానంలో ఉన్నాయి. ఏడవ స్థానంలో జేఎన్యూ, ఎమిమిదవ స్థానంలో న్యూఢిల్లీ, తొమ్మిదవ స్థానంలో ఐఐటీ గువాహటి, పదవ స్థానంలో బనారస్ హిందూ విశ్వ విద్యాలయం వారణాసి నిలిచాయి. కాగా కాలేజీలకు, వర్సిటీలకు జాతీయ స్థాయిలో సొంత ర్యాంకింగ్ వ్యవస్థ ఉండాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ గతంలో నిర్ణయించింది. ఇందులో భాగంగా నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్(ఎన్ఐఆర్ఎఫ్) పేరుతో 2016 నుంచి తొమ్మిది విభాగాల్లో ర్యాంకులను కేటాయిస్తోంది. (అద్భుతమైన ఎంఐ నోట్బుక్స్ లాంచ్) నేషనల్యూ ఇన్నిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 6 యూనివర్సిటీలు చోటు దక్కించుకున్నాయి. వాటిలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 15 స్థానం, ఐఐటీ హైదరాబాద్ 17వ స్థానం,ఆంధ్రా యూనివర్సిటీ 36వ స్థానం ఎన్ఐటీ 46వ స్థానం, ఉస్మానియా యూనివర్సిటీ 53 స్థానం, కేఎల్ ఎడ్యూకేషన్ ఫౌండేషన్ యూనివర్సిటీ 70 వ స్థానంలో ఉన్నాయి. -
ఆగస్టు 15 తర్వాతే స్కూల్స్ ఓపెన్
న్యూఢిల్లీ : పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలు ఈ సంవత్సరం ఆగస్ట్ 15 తరువాతే తెరుచుకుంటాయని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా సుమారు 33 కోట్ల మంది విద్యార్థులు విద్యాసంస్థల పునః ప్రారంభం కోసం ఎదురు చూస్తున్నారు. 8వ తరగతి వరకు పిల్లలు పాఠశాలలకు రానవసరం లేకుండా, ఆ పై క్లాసుల పిల్లలకు 30% హాజరు సరిపోయేలా నిబంధనలను మార్చనున్నారని, జూలై లో కాలేజీలు, స్కూళ్లు ప్రారంభమవుతాయని మే నెల చివర్లో పలు వార్తలు వినిపించాయి. అయితే, అదే సమయంలో కరోనా విజృంభించడంతో ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. విద్యా సంస్థలను పునః ప్రారంభించడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రకటించిం ది. ఇలా విద్యా సంస్థల పునః ప్రారంభం విషయంలో గందరగోళం కొనసాగుతుండటంతో మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ఒక ఇంటర్వ్యూలో స్పష్టతనిచ్చారు. ‘ఆగస్టు 15 తరువాత పాఠశాలలు, ఇతర విద్యా సంస్థలు మళ్లీ తెరుచుకుంటాయి. ఇప్పటివరకు జరిగిన, ఇక జరగనున్న అన్ని పరీక్షల ఫలితాలు ఆగస్టు 15లోపు వెల్లడయ్యేలా చర్యలు తీసుకుంటాం’ అని అన్నారు. కాగా, కాలేజీలు, పాఠశాలలు ప్రారంభమైన తరువాత విద్యార్థులు, సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యూజీసీ, ఎన్సీఈఆర్టీ మార్గదర్శకాలను రూపొందిస్తున్నాయి. -
సీబీఎస్ఈ పరీక్షలకు 15 వేల కేంద్రాలు
న్యూఢిల్లీ: పెండింగ్లో ఉన్న సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షలను దేశవ్యాప్తంగా 15 వేల కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ వెల్లడించారు. కోవిడ్–19 కారణంగా వాయిదా పడిన ఈ పరీక్షలు జూలై 1 నుంచి 15 వరకు జరగనున్నాయి. గతంలో నిర్ణయించినట్టు మూడువేల కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా సామాజిక దూరాన్ని పాటించేందుకూ, విద్యార్థులు ఎక్కువ దూరం ప్రయాణించే అవసరం లేకుండా ఉండేందుకూ, అత్యధిక పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసినట్టు మంత్రి చెప్పారు. హోంశాఖ నిబంధనల ప్రకారం కోవిడ్–19 కంటైన్మెంట్ ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించరు. అలాగే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు రవాణా సదుపాయాలను కల్పించే బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది. 12వ తరగతి పరీక్షలు దేశవ్యాప్తంగాను, ఈశాన్య ఢిల్లీలో వాయిదా పడిన 10వ తరగతి పరీక్షలు ఇప్పుడు జరుగుతాయి. -
విద్యార్థులను ఇంటికి పంపాం : కేంద్రమంత్రి
ఢిల్లీ : లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న జవహార్ నవోదయ విద్యాలయాల్లో ఉండిపోయిన 3,169 మంది విద్యార్థులను సురక్షితంగా ఇంటికి పంపినట్లు కేంద్ర మానవ వనరుల శాఖ గురువారం వెల్లడించింది. నవోదయ విద్యాలయ సమితి కింద అంతర్భాగమైన జవహార్ నవోదయ విద్యాలయాలను లాక్డౌన్ కారణంగా మార్చి 21 నుంచే మూసివేశారు. దీంతో కొంతమంది ఇళ్లకు వెళ్లిపోగా, 3వేలకు పైగానే స్పెషల్ క్లాసెస్ పేరిట అక్కడే ఉండిపోయారు. వీరిలో ఎక్కువగా 13 నుంచి 15 సంవత్సరాల వయసు వాళ్లు ఉన్నారు. (విద్యార్థులను ఇంటికి పంపాం : కేంద్రమంత్రి ) లాక్డౌన్ 4.0 అమలవుతున్న నేపథ్యంలో ప్రయాణాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దేశంలోని దాదాపు 173 ప్రాంతాల్లోని జవహార్ నవోదయ విద్యాలయాల్లో చిక్కుకుపోయిన 3,169 మంది విద్యార్థులను వాళ్ల ఇంటికి సురక్షితంగా పంపించినట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ వెల్లడించారు. కరోనావ్యాప్తి దృష్ట్యా మార్చి 24న దేశవ్యాప్తంగా కేంద్రం లాక్డౌన్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలుత 21 రోజుల లాక్డౌన్ అని ప్రకటించినప్పటికీ ఇప్పటికీ కొనసాగుతుంది. అయితే లాక్డౌన్ 4.0 లో భారీ సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో పలువురు వారి స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఇక భారత్లో కరోనా కారణంగా ఇప్పటివరకు 3,435 మంది చనిపోగా, కేసుల సంఖ్య 1,12,359 కి పెరిగింది. గత 24 గంటల్లోనే 5,609 కేసులు నమోదవగా,132 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. (పది వేల మంది ఆరోగ్య కార్యకర్తలకు కరోనా! ) -
జేఈఈ(మెయిన్స్) అప్లికేషన్స్ రీఓపెన్
సాక్షి, న్యూఢిల్లీ: ది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్స్ 2020 కోసం ఆన్లైన్ అప్లికేషన్స్ని రీఓపెన్ చేసింది. ఇప్పటి వరకు అప్లై చేయని వారు, అప్లికేషన్ పూర్తిచేయని వారు ఆ ప్రక్రియ మొదలు పెట్టొచ్చు. మే 19 నుంచి ఆప్లికేషన్లులు jeemain.nta.nic.in లో అందుబాటులోకి రానున్నాయి. మే 24 సాయంత్రం 5 గంటల వరకు ఆప్లికేషన్లు ఆన్లైన్లో పెట్టుకోవచ్చు. ఫీజు మే24 రాత్రి 11:50 గంటల వరకు చెల్లించవచ్చు. (టిక్టాక్కు షాకివ్వనున్న మ్యూజిక్ కంపెనీలు!) 📢Announcement Dear JEE (MAIN) 2020 applicants, after several requests received from you, I have advised @DG_NTA to allow you to make corrections for one last time in the particulars & choice of centre cities in the online application form. pic.twitter.com/WnVBG3Unuu — Dr Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) May 19, 2020 ఈ విషయం గురించి మానవవనరుల శాఖ మంత్రి రమేష్ పొక్రియాల్ ట్వీట్ చేస్తూ ‘జేఈఈ (మెయిన్స్) 2020 అభ్యర్థులరా, మీ నుంచి చాలా విజ్ఞప్తులు రావడంతో, అప్లికేషన్లో అభ్యర్థులకు సంబంధించిన వివరాలు మార్చుకోవడానికి, పరీక్షా కేంద్రాలు మరల ఎంపిక చేసుకోవడాని వీలు కల్పించాలని ఎన్టీఏ డీజీని ఆదేశించాం’ అని పేర్కొన్నారు. ఎవరైతే విదేశాల్లో చదవానలను కొని కరోనా కారణంగా ఆగిపోయారో వారికి భారత్లో చదవడానికి ఇదొక మంచి అవకాశం అని తెలిపారు. అప్లికేషన్ పత్రాలు సమర్పించడానికి వారికి ఒక అవకాశం ఇవ్వాలని ఎన్టీఏ డీజేని కోరినట్లు చెప్పారు. తొందరగా అప్లికేషన్లను సమర్పించండి. మే 24 వరకు సమయం ఉంది అని పొక్రియాల్ ట్వీట్ చేశారు. (వ్యాక్సిన్ లేకుండానే కరోనా కట్టడి.. ప్రయోగం సక్సెస్!) 📢Students who dropped the idea to study abroad, here is your chance to pursue your studies in India. I have advised @DG_NTA to give one more opportunity to students to submit new/complete online application form for JEE (Main) 2020. Hurry! Forms available till 24th May. pic.twitter.com/hSwXQ9GBjX — Dr Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) May 19, 2020 -
ఇప్పట్లో స్కూళ్లు లేనట్లే! కాలేజీలకు మాత్రం..
న్యూఢిల్లీ : భారత్లో కరోనా విజృంభిస్తన్న నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలు ఇప్పట్లో తెరిచే అవకాశం లేనట్లు కనిపిస్తుందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. శుక్రవారం వివిధ పాఠశాలల ఉపాధ్యాయులతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన మంత్రి..పరిస్థితి అదుపులోకి వచ్చాకే పాఠశాలలు పునఃప్రారంచాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. లాక్డౌన్ తర్వాత అనుసరించాల్సిన విధానాలపై ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆన్లైచెన్ డిజిటల్ లెర్నింగ్ ద్వారా పాఠాలు బోధించడం అలవాటు చేసుకోవాల్సిందిగా ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు నష్టపోకుండా సిలబస్ను పూర్తిచేసేలా ప్రణాళిక రూపోందించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. (లాక్డౌన్లో ఆన్లైన్ బోధన! ) యూజిసి మార్గదర్శకాల అనుగుణంగా సెప్టెంబర్ 1నుంచి విశ్వవిద్యాలయాల్లో తరగతులు తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు 82 వేలకు చేరువలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్కూళ్లు ఇప్పుడే తెరవడం మంచిది కాదని భావిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా పరిస్థితి సాధారణం అయ్యాకే 50 వాతం మంది విద్యార్థులతో ప్రాథమికంగా పాఠశాలలు ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి 16 నుంచి దేశ వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు మూసివేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా అన్ని రకాల పరీక్షలు రద్దుచేశారు. (ఫెయిలైన వారికి సీబీఎస్ఈ మరో చాన్స్ ) -
లాక్డౌన్లో ఆన్లైన్ బోధన!
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో వచ్చే జూన్లో పాఠశాలలు ప్రారంభించడం అసాధ్యమని, అలాగని విద్యార్థులను ఖాళీగా ఉంచడం సరికాదని రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల యాజ మాన్యాలు పేర్కొన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్లైన్ విద్యే ఉత్తమమైన ప్రత్యామ్నాయ మార్గమని అంటున్నాయి. అందుకే కొత్త విద్యా సంవత్సరం నష్టపోకుండా ఆన్లైన్ విద్యను తప్పనిసరి చేయాలని, తద్వారా జూన్లో అకడమిక్ ఇయర్ను ప్రారంభించవచ్చని వెల్లడించాయి. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) మంత్రి రమేశ్ పోఖ్రియాల్కు ఓ నివేదికను అందజేశాయి. మరోవైపు లాక్డౌన్ తర్వాత భౌతిక దూరం పాటించేలా షిఫ్ట్ పద్ధతిలో పాఠశాలలను నిర్వహించడం మేలని కేంద్ర మంత్రి వివరించినట్లు ఓ ప్రైవేటు విద్యా సంస్థ చైర్మన్ వెల్లడించారు. ఆ నివేదికలోని ప్రధానాంశాలు.. (చదవండి: వైరస్పై యుద్ధం.. ఇలా చేద్దాం) ఆన్లైన్ విద్యా బోధనతో ప్రయోజనాలు.. సాంకేతిక పరిజ్ఞానంపై కొంత అవగాహన కలిగిన వారు దీనిని అనుసరించడం సులభం. వినే అలవాటు ఎక్కువగా ఉన్న వారికి దీంతో ఉపయోగకరమే. టెక్నాలజీ ఫీచర్స్, యూట్యూబ్, పీపీటీ, ఆన్లైన్ బోధన, డిజిటల్ పాఠాలు, రికార్డ్ చేసిన టెలివిజన్, రేడియో పాఠాలను అందించవచ్చు. ఆన్లైన్ ఇంటరాక్షన్, ప్రశ్నలు అడగటం, సందేహాలను నివృత్తి చేయడం, పాఠ్యాంశాన్ని వివరించవచ్చు. అభ్యాసం, వర్క్షీట్లు, ప్రాజెక్ట్స్, హోంవర్క్ ఇవ్వొచ్చు. టెక్నాలజీ ద్వారా మొత్తం ప్రక్రియను వర్చువల్ క్లాస్రూమ్గా మార్చవచ్చు. ప్రతికూలతలేంటంటే.. టీచర్, విద్యార్థి మధ్య భావోద్వేగ, వ్యక్తిగత అనుసంధానం పోతుంది. అభ్యసన ఇంట్రెస్టింగ్గా ఉండకపోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో టెక్నాలజీ సమస్యలు, ఇంటర్నెట్ సమస్యలు ఇబ్బందికరంగా మారవచ్చు. ఎక్కువ మంది విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించినా ఇంటరాక్షన్ కొంత ఇబ్బందికరం కావచ్చు. అయినా అనుమతించాలి. ఆన్లైన్ విద్యలో కొన్ని ప్రతికూలతలున్నా ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్లైన్ బోధనకు సిద్ధంగా ఉన్న పాఠశాలలను జూన్ నుంచి తరగతులను నిర్వహించేందుకు అనుమతించాలి. ఇప్పటికే జాతీయ ఉపాధ్యాయ విద్యా శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ), రాష్ట్ర ఉపాధ్యాయ విద్యా శిక్షణ మండలి (ఎస్జీఈఆర్టీ) ఆన్లైన్ కంటెంట్ను, డిజిటల్ పాఠాలను రూపొందించాయి. ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రైవేటు స్కూళ్లు వీటిని ఉపయోగించుకుంటే సరిపోతుంది. ఇందుకు ప్రభుత్వం రంగంలో డీడీ జ్ఞాన్, డీడీ నేషనల్, డీడీ సప్తగిరి, డీడీ యాదగిరి, టీ–శాట్ వంటి టెలివిజన్ చానెళ్లు ఉన్నాయి. అయితే టీచర్లు ఎక్కువగా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాదు స్వచ్ఛందంగానే బోధించడం, నేర్చుకోవడం ఉంటుంది. అదే గ్రామీణ ప్రాంతాల్లోని సాధారణ ప్రైవేటు పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలల తరహాలోనే టీవీ చానెల్స్, లోకల్ కేబుల్ టీవీ చానెల్స్, మొబైల్స్, టాబ్స్ ద్వారా బోధన అందించవచ్చు. అలాగే పట్టణ ప్రాంతాల్లో మొబైల్స్, ట్యాబ్స్తోపాటు వర్చువల్ క్లాస్రూమ్స్, గూగుల్ మీట్, క్లాస్రూమ్, మైక్రోసాఫ్ట్ టీం, స్కైప్ వంటి యాప్ల ద్వారా, కంప్యూటర్, డెస్క్టాప్ ద్వారా కూడా బోధన నిర్వహించవచ్చు. ఆన్లైన్ బోధన కోసం ప్రత్యేక కార్యాచరణ అవసరం.. సాంకేతిక వినియోగం, ఆన్లైన్లో పాఠాల బోధనపై టీచర్లకు శిక్షణ ఇవ్వాలి. ఆన్లైన్లో బోధనకు అవసరమైన పాఠ్య ప్రణాళికలు సిద్ధం చేయాలి. డెమో సెషన్స్ నిర్వహించాలి. ఆన్లైన్ పాఠాలు, డిజిటల్ పాఠాలపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. వర్క్షీట్స్, అసెస్మెంట్ టూల్స్ సిద్ధం చేయాలి. ఆన్లైన్లో హోంవర్క్ ఇవ్వడం, వాటిని ఆన్లైన్లో పరిశీలించాలి. టీచర్లు, పిల్లలు, తల్లిదండ్రుల నుంచి రోజువారీగా అభిప్రాయాన్ని తీసుకోవాలి. వీటిన్నింటిపై కనీసంగా జూలై 31వ వరకు సిద్ధం కావాలి. లాక్డౌన్ ఎత్తేశాక 50 శాతం పిల్లలతోనే.. లాక్డౌన్ ఎత్తేశాక భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలి. 50 శాతం పిల్లలతోనే పాఠశాలలను కొనసాగించాలి. అధ్యాపకులను కూడా అలాగే విభజించాలి. కరోనా విస్తరించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్లు ధరించడం, శానిటైజర్తో తరచూ చేతులు శుభ్రం చేసుకునేలా చర్యలు చేపట్టాలి. 50 ఎస్ఎఫ్టీ కలిగిన ప్రతి తరగతి గదిలో 20 మందికి మించకుండా చూడాలి. విద్యార్థులను రెండు సెక్షన్లుగా విభజించాలి. తరగతుల విభజన చేసి రెండు షిప్ట్లలో పాఠశాలను కొనసాగించాలి. ఈ క్రమంలో కొన్ని సమస్యలున్నా క్రమంగా వాటిని అధిగమించవచ్చు. లేదంటే మూడ్రోజులు తరగతి గదిలో బోధన, మూడ్రోజులు ఆన్లైన్ బోధన చేపట్టేలా చర్యలు తీసుకోవాలి. చేపట్టాల్సిన భద్రతా చర్యలు.. పాఠశాలల్లో, రవాణా సమయంలో భౌతిక దూరం పాటించేలా చూడాలి. ప్రతి రెండు గంటలకోసారి పాఠశాల తరగతి గదులు, వాష్రూమ్లు, కారిడార్లు, ల్యాబ్లు, లైబ్రరీ, తలుపులు, కిటికీలను కెమికల్స్తో శానిటైజ్ చేయాలి. మాస్క్లు ధరించడం, చేతులకు గ్లౌజులు వేసుకోవడం, హ్యాండ్ శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి. మొబైల్ వైద్య సేవలను అందించాలి. తీవ్రమైన దగ్గు, తుమ్ములు లేదా జ్వరం వచ్చినప్పుడు తక్షణ పరీక్షల కోసం ఏర్పాట్లు చేయాలి. విద్యార్థులకు పోషకాలతో కూడిన భోజనం అందించాలి. పాఠశాలల్లో కోవిడ్ సూపర్వైజర్ను నియమించాలి. సర్టిఫైడ్ కౌన్సెలర్లను నియమించాలి. (చదవండి: స్వల్ప లక్షణాలుంటే హోం ఐసోలేషన్) -
టీచర్ల ఇళ్లలోనే జవాబు పత్రాల మూల్యాంకనం
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డు పరీక్షల జవాబు పత్రాలను ఉపాధ్యాయులు తమ ఇళ్లలోనే మూల్యాంకనం చేయవచ్చని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ శనివారం చెప్పారు. ఈ జవాబు పత్రాలను టీచర్లకు అందజేయడానికి 3 వేల పాఠశాలలను గుర్తించామని తెలిపారు. ఇప్పటికే నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన 1.5 కోట్ల ఆన్సర్ షీట్లను టీచర్లకు అందజేస్తామన్నారు. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే మూల్యాంకనాన్ని 50 రోజుల్లోగా పూర్తి చేస్తామన్నారు. సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు జూలై 1 నుంచి 15వ తేదీ వరకు జరగనున్నాయి. -
జూలై 1 నుంచి సీబీఎస్ఈ పరీక్షలు
న్యూఢిల్లీ: లాక్డౌన్ కారణంగా వాయిదాపడిన సీబీఎస్ఈ 10, 12వ తరగతుల పరీక్షలను జూలై 1 నుంచి 15 వరకు నిర్వహించనున్నట్టు కేంద్ర మానవ వనరుల శాఖామంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ ప్రకటించారు. ఇంజనీరింగ్ ఎంట్రన్స్, జూలై 18 నుంచి 23 వరకు జరగనున్న జేఈఈ మెయిన్స్, జూలై 26న జరగనున్న నీట్ కన్నా ముందుగానే సీబీఎస్ఈ వాయిదాపడిన పరీక్షలను నిర్వహించాలన్న లక్ష్యంతో ఈ తేదీలను నిర్ణయించారు. లాక్డౌన్తో వాయిదా పడిన 12వ తరగతి పరీక్షలు దేశవ్యాప్తంగా నిర్వహించాల్సి ఉండగా, అల్లర్ల కారణంగా ఈశాన్య ఢిల్లీలో వాయిదా పడిన 10వ తరగతి పరీక్షలను ఇప్పుడు నిర్వహిస్తామని తెలిపారు. షెడ్యూల్ వచ్చేవారం ప్రకటిస్తామన్నారు. జవాబు పత్రాల మూల్యాంకనం ఉపాధ్యాయుల ఇళ్ళనుంచి జరిపే అవకాశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఐఐటీ, జేఈఈ అడ్వాన్స్డ్ మెరిట్ లిస్ట్ ప్రకటించడానికి ముందే, ఆగష్టు చివరికి 12వ తరగతి రిజల్ట్సును ప్రకటించేందుకు యత్నిస్తున్నట్టు వెల్లడించారు. -
ఆగస్టు 23న జేఈఈ–అడ్వాన్స్డ్ పరీక్ష
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) అడ్వాన్స్డ్ పరీక్షను ఆగస్టు 23వ తేదీన నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు. మే 17న జరగాల్సిన ఈ పరీక్ష లాక్డౌన్ వల్ల వాయిదా పడింది. జేఈఈ–మెయిన్స్ పరీక్షలను జూలై 18 నుంచి 23 వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జేఈఈ మెయిన్స్ పరీక్షలు పూర్తయ్యాక 10–15 రోజుల్లో ఫలితాలను వెల్లడించనున్నారు. టాప్ మార్కులు సాధించిన 2.5 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కల్పించనున్నారు. ఆ దరఖాస్తులకు నాలుగైదు రోజుల సమయం ఇస్తారు. ఆగస్టు 23న పరీక్ష నిర్వహించి వీలైనంత త్వరగా ఫలితాలను వెల్లడించనున్నారు. ఆ తరువాత జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించనుంది. సెప్టెంబరు 1వ తేదీ నుంచి ఇంజనీరింగ్ తరగతులను ప్రారంభించేలా ఇటీవల ఏఐసీటీఈ అకడమిక్ షెడ్యూల్ ప్రకటించింది. ‘పీఎం రీసెర్చ్ ఫెలోషిప్ స్కీమ్’లో సవరణలు దేశంలో పరిశోధనలను మరింతగా ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి రీసెర్చ్ ఫెలోషిప్ స్కీమ్లో పలు సవరణలు చేసినట్లు రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ వెల్లడించారు. ఈ ఫెలోషిప్ పొందడానికి అవసరమైన నిర్దేశిత గేట్ స్కోర్ తగ్గించినట్లు పేర్కొన్నారు. దీన్ని 750 నుంచి 650కి తగ్గినట్లు స్పష్టం చేశారు. అలాగే లేటరల్ ఎంట్రీ అనే వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపారు. పీఎంఆర్ఎఫ్ అనుమతి పొందిన విద్యాసంస్థల్లో పీహెచ్డీ చేస్తున్న అభ్యర్థులు ఈ ఫెలోషిప్ కోసం లేటరల్ ఎంట్రీ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. -
సీబీఎస్ఈ సిలబస్ కుదింపు!
సాక్షి, అమరావతి: వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సిలబస్ను కుదించే దిశగా అడుగులు పడుతున్నాయి. కోవిడ్–19, లాక్డౌన్ కారణంగా విద్యాసంస్థలు మూతపడటంతో 2019–20 విద్యా సంవత్సరం క్యాలెండర్ అమలు అస్తవ్యస్తంగా మారింది. వివిధ రాష్ట్రాల్లో సీబీఎస్ఈ సిలబస్ అమలు చేస్తున్న పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షలు ముగియకపోవడం, 12వ తరగతి (ఇంటర్మీడియెట్ ) పరీక్షలు నిర్వహించలేకపోవడంతో ఈ ప్రభావం వచ్చే విద్యా సంవత్సరంపై పడుతోంది. ఈ దృష్ట్యా కొత్త విద్యా సంవత్సరంలో తరగతుల నిర్వహణ ఆలస్యం కానుందని.. దీనికి అనుగుణంగా సిలబస్ను కొంతమేర కుదించే యోచనలో ఉన్నామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ వెల్లడించారు. విద్యార్థులతో నిర్వహిస్తున్న ఆన్లైన్ ఇంటరాక్షన్ కార్యక్రమం రెండో రోజైన బుధవారం ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. జూలైలో వార్షిక పరీక్షలు! ► ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి వార్షిక పరీక్షలు జూలైలో పెట్టే అవకాశముంది. దీనివల్ల 2020–21 విద్యా సంవత్సరాన్ని సకాలంలో ప్రారంభించే అవకాశం లేదు. ► వచ్చే విద్యా సంవత్సరం సెప్టెంబర్ నుంచి ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు. కొత్త విద్యా సంవత్సరంలో తక్కువ రోజులు ఉండటంతో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. ► విద్యార్థులు ఏ మేరకు కాలాన్ని నష్టపోతున్నారనేది పరిగణనలోకి తీసుకుని సిలబస్ను కుదిస్తారు. దీనిపై సీబీఎస్ఈ కోర్సు కమిటీ అధ్యయనం చేస్తోంది. ► జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలను కూడా దృష్టిలో పెట్టుకుని సిలబస్ కుదింపు అంశాలు ఉంటాయని కేంద్రమంత్రి పోఖ్రియాల్ స్పష్టం చేశారు. తగిన సమయం ఇచ్చాకే పది పరీక్షలు విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒంగోలు: లాక్డౌన్ ఎత్తేశాక విద్యార్థులకు తగిన సమయం ఇచ్చాకే పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. పరీక్షలకు సంబంధించి అవాస్తవ ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. ఒంగోలులో బుధవారం మత్య్సకార భరోసా కార్యక్రమానికి హాజరైన ఆయనను ఫ్యాప్టో నేతలు జీఎస్ఆర్ సాయి, రఘుబాబు, పీవీ సుబ్బారావు కలిశారు. ఈ సందర్భంగా కోవిడ్ విధుల్లో ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలని వారు కోరగా ఆ మేరకు మంత్రి హామీ ఇచ్చారు. -
సెప్టెంబర్ 1నుంచి ఇంజనీరింగ్ క్లాసులు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సాంకేతిక విద్యా కాలేజీల్లో తరగతులు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యేలా అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) షెడ్యూల్ను సవరించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆగస్టు ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభించాల్సి ఉన్నా కరోనా నేపథ్యంలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తరగతులను ప్రారంభిస్తామని స్పష్టం చేసింది. నెల రోజులు ఆలస్యంగా విద్యా సంవత్సరం ప్రారంభించేలా చర్యలు చేపట్టింది. ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరే పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించే ల్యాటరల్ ఎంట్రీ కూడా సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచే తరగతులు ప్రారంభించాలని పేర్కొంది. జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్ తదితర పరీక్షల షెడ్యూల్ను మంగళవారం ఢిల్లీలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) మంత్రి రమేశ్ పోఖ్రియాల్ విడుదల చేశారు. ఏప్రిల్ 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్ పరీక్షలను కరోనా కారణంగా కేంద్రం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కాగా మంగళవారం తాజా షెడ్యూల్ను కేంద్ర మంత్రి జారీ చేశారు. జూలై 18, 20, 21, 22, 23 తేదీల్లో జేఈఈ మెయిన్ ఆన్లైన్ పరీక్షలను నిర్వహిస్తామని వెల్లడించారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను ఆగస్టులో నిర్వహిస్తామని, తేదీని తర్వాత ప్రకటిస్తామని వివరించారు. ఈ నేపథ్యంలోనే ఏఐసీటీఈ సాంకేతిక విద్యా కాలేజీల గుర్తింపు, యూనివర్సిటీలు ఇవ్వాల్సిన అఫిలియేషన్ (అనుబంధ గుర్తింపు), కౌన్సెలింగ్ నిర్వహణ, తరతగతుల ప్రారంభానికి సంబంధించిన పూర్తి వివరాలతో షెడ్యూల్ను జారీ చేసింది. చదవండి: జూలై 26న నీట్ అప్రూవల్స్ డౌన్లోడ్ చేసుకోండి.. కోర్సుల్లో ఎలాంటి మార్పులు లేకుండా అప్రూవల్స్ కోసం దరఖాస్తు చేసుకున్న కాలేజీలకు తమ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదం మేరకు ఏప్రిల్ 30న అనుమతులు జారీ చేసినట్లు ఏఐసీటీఈ మెంబర్ కన్వీనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఆయా యాజమాన్యాలు తమ వెబ్సైట్ నుంచి అప్రూవల్ లేఖలను డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది. కమిటీ నిర్ణయం మేరకు ఈ తాజా షెడ్యూల్ను జారీ చేసినట్లు వెల్లడించారు. కొత్త కోర్సులకు అప్రూవల్ కోసం దరఖాస్తు చేసుకున్న కాలేజీలకు అప్రూవల్స్ ఇచ్చేందుకు జూన్ 15వ తేదీ వరకు గడువు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరినట్లు వెల్లడించింది. యాజమాన్యాలు ఆన్లైన్ మీటింగ్, ఆన్లైన్ స్క్రూటినీ, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం మైక్రో సాఫ్ట్ టీం సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించింది. మేనేజ్మెంట్ కోర్సులకు వేరుగా.. మేనేజ్మెంట్ కోర్సులకు మాత్రం ఏఐసీటీఈ వేరుగా షెడ్యూల్ను ప్రకటించింది. పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ (పీజీడీఎం), పీజీసీఎం కోర్సులకు మాత్రం ఆగస్టు ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభించాలని.. 2021 జూలై 31 వరకు విద్యా సంవత్సరాన్ని పూర్తి చేయాలని పేర్కొంది. పాత విద్యార్థులకు జూలై 1 నుంచే ప్రారంభించాలని తెలిపింది. ఈ కోర్సుల ప్రవేశాలను ప్రతి ఏటా జూన్ 30కే పూర్తి చేయాల్సి ఉన్నా ఈసారి మాత్రం జూలై 31 వరకు గడువు ఇచ్చింది. సాంకేతిక విద్యా సంస్థలకు యూజీసీ మార్గదర్శకాలే.. యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలు, సాంకేతిక విద్యా సంస్థల్లో విద్యా కార్యక్రమాలు, పరీక్షలకు సంబంధించి ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) జారీ చేసిన మార్గదర్శకాలు అమలు చేయాలని ఏఐసీటీఈ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా సాంకేతిక విద్యా సంస్థలకు అవే మార్గదర్శకాలు వర్తిస్తాయని పేర్కొంది. ఫైనల్ సెమిస్టర్, ఇతర సెమిస్టర్ విద్యార్థుల పరీక్షల విషయంలో వాటి ప్రకారమే ముందుకు సాగాలని సూచించింది. ఈ మేరకు ఏఐసీటీఈ మెంబర్ సెక్రటరీ రాజీవ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో డిటెన్షన్ను ఎత్తేసి, ఆయా విద్యార్థులను పైసెమిస్టర్కు ప్రమోట్ చేయనున్నారు. ఈసారి ఫెయిల్ అనేది.. నిర్ణీత 50 శాతం సబ్జెక్టులు పాస్ కాకుండా అదే సెమిస్టర్లో ఆగిపోవడం అనేది ఉండదు. ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాల విద్యార్థులకు ప్రమోషన్ ఇవ్వనున్నారు. అయితే వారికి జూలై 15 నుంచి 30 మధ్య పరీక్షలు నిర్వహించాలని, ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులకు జూలై 1 నుంచి 15లోగా పరీక్షలు నిర్వహించాలని యూజీసీ స్పష్టం చేసింది. రాష్ట్రంలో వీటి అమలుకు త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. -
జేఈఈ, నీట్ తేదీలు ప్రకటించిన ప్రభుత్వం
ఢిల్లీ : లాక్డౌన్ కారణంగా వాయిదాపడ్డ ఐఐటీ, జేఈఈ, నీట్ పరీక్షా తేదీల వివరాలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ మంగళవారం పరీక్షా తేదీలను వెల్లడించారు. జులై 18-23 వరకు జేఈఈ మెయిన్స్, ఆగస్టులో జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఇక జులై 26న నీట్ పరీక్షలు జరుగుతాయని ప్రకటించారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉన్న కారణంగా వివిధ పరీక్షా తేదీలు వాయిదాపడ్డాయి. అయితే పెండింగ్లో ఉన్న పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఇటీవల సీబీఎస్ఈ ప్రకటించగా, 12వ తరగతి పరీక్షలు నిర్వహిస్తారా లేదా అన్న దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ఇదే అంశానికి సంబంధించి త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని రమేష్ పోఖ్రియాల్ అన్నారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పరీక్ష 15 లక్షల మంది, జేఈఈ–మెయిన్స్ రాసేందుకు 9 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారని వెల్లడించారు. -
జేఈఈ, నీట్ పరీక్షలపై ప్రకటన రేపు
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆదివారం శుభవార్త వినిపించింది. లాక్డౌన్ వల్ల వాయిదా పడిన జేఈఈ–మెయిన్స్, నీట్ పరీక్షల నిర్వహణపై మే 5వ తేదీన కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ ప్రకటన చేస్తారని, అదేరోజు కొందరు విద్యార్థులతో ఆన్లైన్ ద్వారా మాట్లాడుతారని పేర్కొంది. ఈ ఏడాది నీట్ పరీక్ష రాసేందుకు 15 లక్షల మంది, జేఈఈ–మెయిన్స్ రాసేందుకు 9 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఇప్పటికే పరీక్షా కేంద్రాన్ని ఎంపిక చేసుకున్నవారు దాన్ని మార్చుకోవచ్చు. -
వేసవి సెలవుల్లోనూ ‘మధ్యాహ్న భోజనం’
న్యూఢిల్లీ: వేసవి సెలవుల్లో కూడా విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగిస్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ నిశాంక్ మంగళవారం స్పష్టం చేశారు. అందుకు రూ.2,600 కోట్లు అదనంగా కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీబీఎస్ఈ 10, 12 తరగతుల విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ప్రారంభించాలని సూచించారు. లాక్డౌన్ సమయంలో విద్యార్థులకు పౌష్టికాహారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. మధ్యాహ్న భోజనంతో 11.34 లక్షల పాఠశాలల్లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి చదువుతున్న 11.5 కోట్ల మంది చిన్నారులు ప్రయోజనం పొందుతారని తెలిపారు. -
‘అప్పుడే పదో తరగతి పరీక్షల నిర్వహణ’
సాక్షి, అమరావతి : లాక్డౌన్ ముగిసిన అనంతరం రెండు వారాల తర్వాత రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణ చేపడతామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. ఆన్లైన్, డిజిటల్ తరగతుల నిర్వహణ మరింత పెరగాలని కేంద్ర మంత్రి సూచించారు. విద్యా సంవత్సరంలోనే కాకుండా వేసవిలో కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. (కరోనా టెస్టులు: దేశంలోనే ప్రథమ స్థానం..) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన మేరకు ‘జగనన్న గోరుముద్ద’ పేరుతో మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు చేశామని మంత్రి ఆదిమూలపు సురేష్ కేంద్రమంత్రికి తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఆంధ్రప్రదేశ్లో 9,10 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం వర్తింపజేశామని మంత్రి తెలిపారు. ఈ మేరకు వారికి సహాయ సహకారాలు అందించాలని కేంద్రమంత్రిని కోరారు. రాష్ట్రానికి మరిన్ని కేజీబీవీ, మోడల్ స్కూళ్లను మంజూరు చేయాలని కోరారు. రాష్ట్రంలో రేడియో, దూరదర్శన్ ద్వారా డిజిటల్, ఆన్ లైన్ క్లాస్లను అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. మౌలిక వసతులను బలోపేతం చేయాలని మానవ వనరుల అభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి ధోత్రే సంజయ్ శ్యాంరావును కోరారు. (హిట్ మీ ఛాలెంజ్.. నెటిజన్ల మండిపాటు ) రాబోయే విద్యాసంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ త్వరలోనే విడుదల చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. లాక్డౌన్ ముగిసిన అనంతరం రెండు వారాల తర్వాత పదో తరగతి పరీక్షల నిర్వహణ చేపట్టనున్నట్లు, త్వరలోనే పదో తరగతికి పరీక్షల సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయననున్నట్లు తెలిపారు. భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్లు ధరించి పరీక్షలు నిర్వహించే అంశంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. సమగ్రశిక్ష విధానంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.1529 కోట్ల నిధుల్లో రూ.923 కోట్లు వచ్చాయని, మిగిలిన రూ.606 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సాంకేతిక విద్యావిధానంలో భాగంగా దూరదర్శన్ ద్వారా విద్యామృతం, ఆల్ ఇండియా రేడియో ద్వారా విద్యాకలశం పేరుతో విద్యార్థులకు ఆన్ లైన్ విద్యను అందిస్తున్నామని మంత్రి సురేష్ తెలిపారు. (‘ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్న మొసలి’) -
ఫీజుల పెంపుపై పునరాలోచించండి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రైవేట్ స్కూళ్లు తమ వార్షిక ఫీజుల పెంపుపై, మూడు నెలలకోసారి ఫీజులు వసూలు చేయడంపై పునరాలోచన చేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ శుక్రవారం కోరారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఫీజుల పెంపుపై తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. కొన్ని రాష్ట్రాలు పాఠశాల ఫీజుల పెంపుపై ఇప్పటికే కొన్ని సానుకూల చర్యలు చేపట్టాయనీ, ఇతరులు కూడా ఇదే మార్గం అనుసరిస్తారని ఆశిస్తున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. కరోనా పోరాటంలో అన్ని పాఠశాలలు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఇలా ఉండగా.. లాక్డౌన్ సమయంలో అనుమతి లేకుండా ప్రైవేట్ స్కూళ్లు ఫీజులు పెంచరాదని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. స్కూళ్లు మళ్లీ తెరుచుకునేంత వరకూ ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా చెప్పారు. ఫీజులు చెల్లించాలంటూ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకురావొద్దని రాజస్తాన్, పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు ఆదేశించాయి. అందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోండి: సీబీఎస్ఈ దేశవ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఉపాధ్యాయుల వేతనాలు, స్కూలు ఫీజుల చెల్లింపులపై అందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) శుక్రవారం కోరింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఫీజుల అంశంపై తగిన పరిష్కారం కనుగొనాలని రాష్ట్రాలను కోరినట్లు సీబీఎస్ఈ కార్యదర్శి అనురాగ్ త్రిపాఠీ తెలిపారు. -
స్కూలు పిల్లలకు ఎన్సీఈఆర్టీ క్యాలెండర్
న్యూఢిల్లీ: లాక్ డౌన్లో ఒకటినుంచి 12 తరగతుల విద్యార్థులు సమయం సద్వినియోగం చేసుకునేలా జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్సీఈఆర్టీ) ప్రత్యేక క్యాలెండర్ విడుదల చేసింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ గురువారం ఈ క్యాలెండర్ విడుదల చేశారు. టెక్నలాజికల్ టూల్స్, సోషల్ మీడియా టూల్స్ ఉపయోగించుకొని మరింత పరిజ్ఞానాన్ని పిల్లలకు అందించే విధంగా ఇందులోని కోర్సులు ఉన్నాయని రమేశ్చెప్పారు. ఇందులో అధ్యాపకులు బోధించే విషయాలను విద్యార్థులు చూసి నేర్చుకోవచ్చని తెలిపారు. టెక్నాలజీ అందుబాటులో లేని విద్యార్థుల కోసం ఫోన్ కాల్ ద్వారా బోధించే విధానం కూడా ఇందులో ఉన్నట్లు వెల్లడించారు. 1 నుంచి 12 తరగతుల వరకు ఉన్న అన్ని విషయాలు ఇందులో ఉంటాయని, అయితే విద్యార్థులు వరుస క్రమంలోనే గాక, తమకు ఆసక్తి ఉన్న అంశాలను ఎన్నుకొని మరీ చూసి నేర్చుకోవచ్చని తెలిపారు. అందులో ఉన్న వరుస క్రమం తప్పనిసరి కాదని అన్నారు. లాక్ డౌన్ లో విద్యార్థులను సమయం వృధా కానివ్వకుండా, ఇది ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. దీనివల్ల స్కూళ్లు కూడా లబ్ధి పొందుతాయని చెప్పారు. -
మరో 5 ఐఐఐటీలకు జాతీయ ప్రాధాన్య హోదా
న్యూఢిల్లీ: జాతీయ ప్రాధాన్య సంస్థ (ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్) హోదాను మరో ఐదు ఐఐఐటీలకు కల్పిస్తూ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లును లోక్సభ ఆమోదించింది. ఐదు ఐఐఐటీలను పీపీపీ (పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్) చట్టం–2017 కిందకు తీసుకొచ్చే ఉద్దేశంతో ఇండి యన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) చట్టం (సవరణ) బిల్లు–2020ను తీసు కొచ్చారు. ఇప్పటికే ఈ జాబితాలో 15 ఐఐఐటీలు ఉన్నాయి. సూరత్, భోపాల్, భాగల్పూర్, అగర్తలా, రాయ్చూర్లతో ఉన్న ఐఐఐటీలకు తాజాగా జాతీయ ప్రాధాన్య హోదా ఇచ్చారు. దీంతో ఈ సంస్థల్లో బీటెక్, ఎంటెక్, పీహెచ్డీ డిగ్రీలను అందించే వెసులుబాటు కలుగుతుంది. ఐటీ రంగంలో నూతన పరిశోధనలు చేసేందుకు అవసరమైన విద్యార్థులు చేరే అవకాశం ఉంటుంది. ఇలాంటి విద్యాసంస్థల్లో 100 శాతం ప్లేస్మెంట్లు కల్పించిన రికార్డు ఉందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేశ్ పోక్రియాల్ లోక్సభలో పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో నాణ్యత పెరుగుతోందని, దేశం పరిశోధనలు, అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని చెప్పారు. -
లక్షకు పైగా ఫ్యాకల్టీ ఉద్యోగాలు ఖాళీ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో నీతి అయోగ్ ఎంపిక చేసిన మూడు ఆశావహ జిల్లాల్లో క్రమేపీ పెరుగుదల కనిపిస్తున్నట్లు ప్రణాళికా శాఖ సహాయ మంత్రి ఇందర్జిత్ సింగ్ రావు తెలిపారు.రాజ్యసభలో గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా జవాబిచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విశాఖపట్నం, విజయనగరం, వైఎస్సార్ కడప జిల్లాలను ఆశావహ జిల్లాలుగా ఎంపిక చేసినట్లు చెప్పారు. విజయనగరం, కడప జిల్లాలను వెనుకబాటుతనం ప్రాతిపదికన ఎంపిక చేయగా, విశాఖపట్నంను వామపక్ష తీవ్రవాదానికి గురైన జిల్లాగా పరిగణించి ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆశావహ జిల్లాల కార్యక్రమం కింద ఆరోగ్యం, పోషకాహారం, పాఠశాల విద్య, వ్యవసాయం, నీటి వనరుల యాజమాన్యం, నైపుణ్యాభివృద్ధి, మౌలిక వసతుల సదుపాయం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఎంపిక చేసిన మూడు ఆశావహ జిల్లాల్లో విశాఖ జిల్లా ఈ ఏడాది జనవరి నాటికి విద్యా రంగంలో గణనీయమైన ప్రగతిని సాధించి మొదటి ర్యాంక్ సాధించినట్లు తెలిపారు. ఈ జిల్లాలకు అదనంగా 3 కోట్ల రూపాయల కేటాయింపు జరుగుతుందని మంత్రి అన్నారు. లక్షకు పైగా ఫ్యాకల్టీ ఉద్యోగాలు ఖాళీ దేశంలోని వివిధ రాష్ట్రాలలో గల ఉన్నత విద్యా సంస్థలలో లక్షకు పైగా ఫ్యాకల్టీ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ (నిషాంక్) గురువారం రాజ్యసభకు తెలిపారు. ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ.. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఉన్నత విద్యా సంస్థలలో మొత్తం 38459 అధ్యాపకుల ఉద్యోగాలు మంజూరు అయ్యాయినట్లు వెల్లడించారు. అందులో ఈ ఏడాది జూన్ నాటికి 13399 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వీటిలో 12272 ఉద్యోగాల భర్తీకి గత జూన్లో నోటిఫికేషన్ జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. ఉద్యోగాల ఖాళీలు ఏర్పడటం వాటిని భర్తీ చేయడం అన్నది నిరంతర ప్రక్రియని, ఖాళీగా ఉన్న అధ్యాపకుల ఉద్యోగాలు భర్తీ చేయవలసిందిగా కోరుతూ యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్.. ఉన్నత విద్యా సంస్థలకు ఈ ఏడాదిలోనే నాలుగు సార్లు ఆదేశాలిచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. -
కేంద్ర మంత్రిని నిర్బంధించిన విద్యార్థులు!
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ) మరోసారి విద్యార్థుల ఆందోళనలతో దద్దరిల్లింది. హాస్టల్ ఫీజులు పెంచడం, నిబంధనలు కఠినతరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున జేఎన్యూ విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. జేఎన్యూ స్నాతకోత్సవానికి కేంద్ర మానవవరులశాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ హాజరవ్వడంతో ఆయనకు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళనబాట పట్టారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులు జేఎన్యూ గేట్ను నిర్బంధించి.. కేంద్ర మంత్రి రమేశ్ను యూనివర్సిటీ ప్రాంగణ బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. విద్యార్థులు పెద్దసంఖ్యలో ఉండటంతో వారిని నియంత్రించడం పోలీసులకు కూడా కష్టసాధ్యంగా మారినట్టు తెలుస్తోంది. తమ డిమాండ్లు నెరవేరే వరకు మంత్రిని బయటకు వెళ్లనివ్వమని విద్యార్థులు పట్టుబడుతున్నారు. విద్యార్థులు జేఎన్యూ గేట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండటంతో స్నాతకోత్సవ ప్రాంగణంలోనే మంత్రిని నిర్బంధించినట్టు అయింది. హాస్టల్ మ్యానువల్ విద్యార్థులకు చుక్కలు చూపిస్తోందని, దీనిని మార్చాల్సిందేనని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.