Red Sea
-
రెడ్ సీ ఫిలిం ఇంటర్నేషనల్ ఫెస్టివల్: కరీనా ఫ్యాషన్ లుక్స్ (ఫోటోలు)
-
ఎర్ర సముద్రంలో బోటు ప్రమాదం
-
చమురు ట్యాంకర్కు మంటలు
ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారుల దాడులకు గురైన ‘సోయూనియన్’ అనే 900 అడుగుల భారీ చమురు ట్యాంకర్ ఇది. ఆగస్ట్ 21వ తేదీన ట్యాంకర్కు అంటుకున్న మంటలు ఇప్పటికీ చల్లారలేదు. ఇందులోని 10 లక్షల బ్యారెళ్ల ముడి చమురు లీకైతే మునుపెన్నడూ లేనంతగా సముద్ర పర్యావరణానికి హాని కలుగుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అందుకే, సాధ్యమైనంత మేర ట్యాంకర్లోని చమురును తరలించే అత్యంత క్లిష్టమైన ప్రక్రియను మొదలుపెట్టనున్నారు. గ్రీస్కు చెందిన ఈ నౌక యాజమాన్యం ఈ విషయంలో సౌదీ అరేబియా సాయం కోరింది. అప్పటి వరకు మరిన్ని దాడులు జరగకుండా గ్రీస్, ఫ్రాన్సు నౌకలు ‘సోయూనియన్’కు కాపలాగా ఉన్నాయి. -
Houthi Rebels: చైనా ఆయిల్ నౌకపై ‘హౌతీ’ల దాడి
వాషింగ్టన్: ఎర్ర సముద్రంలో వాణిజ్యనౌకలపై హౌతీలు దాడులు పెంచారు. తాజాగా శనివారం(మార్చ్ 23) యెమెన్ తీరానికి సమీపంలో చైనాకు చెందిన ఆయిల్ ట్యాంకర్ నౌక ఎంవీ హంగ్ పూ పై హౌతీలు బాలిస్టిక్ మిసైళ్లతో దాడి చేశారు. ఈ విషయాన్ని అమెరికా రక్షణ శాఖ ముఖ్య కార్యాలయం సెంట్రల్ కమాండ్(సెంట్ కామ్) ఆదివారం(మార్చ్ 24) ఎక్స్(ట్విటర్)లో ధృవీకరించింది. పనామా ఫ్లాగ్తో నడుస్తున్న ఈ నౌకను చైనా యాజమాన్యం నిర్వహిస్తోంది. MARCH 23 RED SEA UPDATE From 2:50 to 4:30 a.m. (Sanaa time) March 23, the Iranian-backed Houthis launched four anti-ship ballistic missiles (ASBM) into the Red Sea in the vicinity of M/V Huang Pu, a Panamanian-flagged, Chinese-owned, Chinese-operated oil tanker. At 4:25 p.m.… pic.twitter.com/n1RwYdW87E — U.S. Central Command (@CENTCOM) March 24, 2024 ఆయిల్ ట్యాంకర్ నౌక భారత్లోని మంగళూరు పోర్టుకు రావాల్సి ఉంది. ఈ దాడిలో నౌకలోని సిబ్బంది ఎవరూ గాయపడలేదు. నౌకలో మంటలు చెలరేగినప్పటికీ 30 నిమిషాల్లో వాటిని ఆర్పివేశారు. అనంతరం నౌక మళ్లీ ప్రయాణం ప్రారంభించింది. చైనా, భారత్ నౌకలపై ఎలాంటి దాడులు చేయబోమని చెప్పిన హౌతీలు తాజా దాడితో మాట తప్పారు. కాగా ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలో పాలస్తీనాకు మద్దతుగా హౌతీ మిలిటెంట్లు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై గత కొంతకాలంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దాడుల కారణంగా ఆసియా నుంచి అమెరికా, యూరప్ వెళ్లే నౌకలకు దూరం పెరిగి ఖర్చు మోపెడవుతోంది. యెమెన్లోని హౌతీల స్థావరాలపై అమెరికా, బ్రిటన్లు ఎప్పటికప్పుడు దాడులు చేస్తన్నాయి. ఇదీ చదవండి.. ఉక్రెయిన్పై రష్యా మిసైళ్ల వర్షం.. అందుకు ప్రతీకారమే ! -
Red Sea: ‘హౌతీ’ల డ్రోన్ను పేల్చేసిన అమెరికా
వాషింగ్టన్: ఎర్ర సముద్రంలో హౌతీ రెబెల్స్ ప్రయోగించిన డ్రోన్ను కూల్చివేసినట్లు అమెరికా తెలిపింది. హౌతీల డ్రోన్ వల్ల నౌకలకు ఎలాంటి నష్టం జరగలేదని వెల్లడించింది. ఈ మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. యెమెన్లో హౌతీల స్థావరాలపై జరిపిన దాడుల్లో హౌతీలకు చెందిన ఒక అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికిల్(యూఏవీ)ని ధ్వంసం చేసినట్లు తెలిపింది. హౌతీల దగ్గరున్న పరికరాలన్నీ ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలకు ముప్పుగా పరిణమించాయని పేర్కొంది. పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో పాలస్తీనాకు మద్దతుగా ఎర్ర సముద్రం నుంచి వెళుతున్న హౌతీలు నౌకలపై గత కొంతకాలంగా దాడులకు పాల్పడుతున్నారు. హౌతీల దాడుల వల్ల ఆసియా నుంచి యూరప్ అమెరికా వెళ్లే దక్షిణాఫ్రికా నుంచి చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. దీంతో అమెరికా, బ్రిటన్లు యెమెన్లోని హౌతీల స్థావరాలపై దాడులు చేస్తున్నాయి. ఇదీ చదవండి.. అమెరికాలో బుర్రిపాలెం విద్యార్థి అనుమానాస్పద మృతి -
హౌతీ రెబల్స్.. సంక్షోభంలో సముద్ర రవాణా!
భారత్ నుంచి నుంచి యూరప్, ఆఫ్రికా దేశాలతోపాటు ఉత్తర అమెరికా దేశాలకు సరకు చేయడానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం ప్రధానపాత్ర పోషిస్తాయి. సదరు దేశాల నుంచి సరుకులు, ముడి పదార్థాలు మనదేశానికి రావాలన్నా అదే మార్గం. ఇటీవల కాలంలో ఎర్ర సముద్రంలో చోటుచేసుకుంటున్న అనిశ్చిత పరిస్థితులతో అంతర్జాతీయ వాణిజ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ఈ ప్రాంతంపై రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం ఉంది. దీనికి తోడు సోమాలియా, తదితర దేశాలకు చెందిన సముద్ర దొంగల తాకిడి పెరిగింది. ఇప్పుడు అదనంగా యెమెన్కు చెందిన హౌతీ రెబెల్స్ అంతర్జాతీయ సరకు రవాణా నౌకలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. దీంతో దేశీయంలో సరుకు, ముడివస్తువులు రవాణా చేస్తున్న కంపెనీలకు నష్టం వాటిల్లుతుంది. ఏ కంపెనీలపై ప్రభావం అంటే.. స్పెషాలిటీ పైపులు, ట్యూబుల ఉత్పత్తిలో నిమగ్నమై ఉన్న ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ ఆదాయాలు ఈ మూడో త్రైమాసికంలో అంచనాలకు అనుగుణంగా పెరగలేదు. ఈ సంస్థ ఆదాయాల్లో 85 శాతం వరకూ ఎగుమతులే ఉండటం గమనార్హం. ఎర్ర సముద్రంలో చోటుచేసుకుంటున్న ఉదంతాలతో అంతర్జాతీయ సరకు రవాణా సమస్యాత్మకంగా మారినట్లు, అందువల్ల ఆదాయ అంచనాలను అందుకోలేకపోయినట్లు ఈ సంస్థ యాజమాన్యం ఆర్థిక ఫలితాలు వెల్లడించిన తర్వాత మదుపరులకు వివరించింది. ప్రస్తుత త్రైమాసికంలోనూ కొంత ఇబ్బంది తప్పకపోవచ్చని, అయినప్పటికీ తగిన పరిష్కారాల కోసం అన్వేషిస్తున్నట్లు స్పష్టం చేసింది. అంతర్జాతీయ వాణిజ్యంలో ఖర్చులు కూడా పెరిగినట్లు వెల్లడించింది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న పోకర్ణ ఇంజినీర్డ్ స్టోన్ లిమిటెడ్ కూడా దాదాపు ఇదే విధమైన పరిస్థితులను ఎదుర్కొంది. నౌకల రాకపోకలు నిలిచిపోతున్నాయని, దీనివల్ల ఇతర దేశాలకు సరకు పంపించటం కష్టంగా మారిందని సంస్థ సీఈఓ పరస్ కుమార్ జైన్ త్రైమాసిక ఫలితాల ప్రకటన అనంతరం కాన్ఫరెన్స్ కాల్లో మదుపరులకు వివరించారు. అంతేగాక అటు వినియోగదార్లకు, ఇటు తమకు ఖర్చులు పెరిగినట్లు పేర్కొన్నారు. ఐరోపా దేశాల నుంచి ఈ సంస్థ కొన్ని ముడిపదార్థాలు కూడా తెచ్చుకుంటుంది. దీనివల్ల ప్రస్తుత పరిస్థితుల్లో తమపై రవాణా ఛార్జీల భారం అధికంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. మరో రెండు, మూడు నెలల పాటు ఇవే పరిస్థితులు ఉంటాయని అంచనా వేస్తున్నట్లు, దానికి తగ్గట్లుగా తాము సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: ఒక్కో వ్యక్తికి వందల్లో సిమ్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు..! ఎగుమతులు, దిగుమతులు అధికంగా ఉన్న పలు ఇతర కంపెనీలు సైతం ఇదే విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానిక పరిశ్రమ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి తగిన మద్దతు అవసరమని ఆ వర్గాలు కోరుతున్నాయి. -
Red Sea: ‘హౌతీ’ రెబల్స్కు అమెరికా షాక్
వాషింగ్టన్: ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్నహౌతీ గ్రూపు మిలిటెంట్లకు అమెరికా, బ్రిటన్ సంయుక్త దళాలు షాక్ ఇచ్చాయి. హౌతీలకు చెందిన డజన్ల కొద్దీ డ్రోన్లను శనివారం రాత్రి కూల్చివేసినట్లు అమెరికా మిలిటరీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘హౌతీలకు చెందిన 28 దాకా అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికిల్స్(యూఏవీ)ను ఎర్ర సముద్రంలో తాజాగా కూల్చివేశాం. హౌతీల దాడిలో అమెరికా సంయుక్త దళాల నౌకలతో పాటు వాణిజ్య నౌకలకు ఎలాంటి నష్టం జరగలేదు’ అని అమెరికా సెంట్రల్ కమాండ్(సెంట్ కామ్) వెల్లడించింది. శనివారం ఉదయం అమెరికా డెస్ట్రాయర్ నౌకలు, వాణిజ్య కార్గో నౌకల మీద 37 డడ్రౌన్లతో పెద్ద ఎత్తున హౌతీలు దాడికి దిగాయి. దీనికి ప్రతిగా రంగంలోకి దిగిన అమెరికా సంయుక్త దళాలు హౌతీల డ్రోన్లను కూల్చివేశాయి. కాగా, ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధంలో పాలస్తీనాకు మద్దతుగా హౌతీలు ఎర్ర సముద్రంలోని గల్ఫ్ ఆఫ్ ఎడెన్ వద్ద అమెరికా, ఇజజ్రాయెల్లకు చెందిన వాణిజ్య నౌకలపై డ్రోన్లు, మిసైళ్లతో దాడులు చేస్తున్నారు. ఈ దాడులు గత ఏడాది నవంబర్ నుంచి మొదలయ్యాయి. వీటిని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సంయుక్త దళాలు తిప్పికొడుతున్నాయి. ఇదీ చదవండి.. కెనడాలో ట్రూడో వ్యతిరేక పవనాలు -
ఎర్రసముద్రంలో హౌతీ దాడులు.. ఇద్దరి మృతి
దుబాయ్: గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ మారణకాండకు తీవ్రంగా తప్పుబడుతూ అందుకు ప్రతిగా ఎర్రసముద్రంలో వాణిజ్యనౌకలను లక్ష్యంగా చేసుకున్న హౌతీ తిరుగుబాటుదారులు తమ దాడులను ఉధృతం చేశారు. దీంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. హౌతీ దాడుల్లో మరణాలు సంభవించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఎర్ర సముద్ర పరిధిలోని గల్ఫ్ ఆఫ్ ఆడెన్ వద్ద ఈ ఘటన జరిగింది. బుధవారం గ్రీస్ దేశానికి చెందిన బార్బడోస్ జెండాతో వెళ్తున్న వాణిజ్యనౌక ‘ట్రూ కాని్ఫడెన్స్’పై హౌతీలు మిస్సైల్ దాడి జరపగా నౌకలోని ఇద్దరు సిబ్బంది చనిపోయారు. ఇతర సిబ్బంది పారిపోయారు. నౌకను వదిలేశామని, అది తమ అదీనంలో లేదని చెప్పారు. తమ యుద్ధనౌకలపైకి హౌతీ రెబెల్స్ నౌక మిస్సైళ్లు, డ్రోన్లను ప్రయోగించడంతో అమెరికా విధ్వంసక నౌకలు రెచి్చపోయాయి. హౌతీలు ఉంటున్న యెమెన్ భూభాగంపై దాడి చేసి హౌతీ క్షిపణులు, డ్రోన్లను ధ్వంసంచేసింది. హౌతీల దాడుల్లో మరణాలు నమోదవడంతో ఆసియా, మధ్యప్రాచ్యం, ఐరోపాల మధ్య సముద్ర రవాణా రంగంలో సంక్షోభం మరింత ముదిరింది. హౌతీలపై అమెరికా దాడులపై ఇరాన్ మండిపడింది. అమెరికా ఇంధన సంస్థ షెవ్రాన్ కార్ప్కు చేరాల్సిన కువైట్ చమురును తోడేస్తామని హెచ్చరించింది. రూ.414 కోట్ల విలువైన ఆ చమురును తీసుకెళ్తున్న నౌకను ఇరాన్ గతేడాది హైజాక్ చేసి తమ వద్దే ఉంచుకుంది. -
హౌతీల క్షిపణి దాడి.. నౌక మునక
దుబాయ్: హౌతీ మిలిటెంట్ల క్షిపణి దాడిలో దెబ్బతిన్న మొట్టమొదటి వాణిజ్య నౌక ఎర్ర సముద్రంలో మునిగిపోయింది. గాజాలో హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ సైన్యం సాగిస్తున్న దాడులకు నిరసనగా యెమెన్కు చెందిన హౌతీ మిలిటెంట్లు ఎర్ర సముద్రంలోని వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 18వ తేదీన బాబ్ ఎల్ మండెల్ సింధుశాఖ వద్ద రుబీమర్ అనే నౌకపైకి హౌతీలు క్షిపణులను ప్రయోగించారు. దీంతో, ఆ నౌక దెబ్బతినడంతో అందులోని సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఆ నౌక నుంచి ఇంధన లీకవుతూ క్రమేపీ మునిగిపోతూ వచి్చంది. శనివారం మధ్యాహా్ననికి రుబీమర్ పూర్తిగా నీట మునిగినట్లు యెమెన్ అధికారులు ధ్రువీకరించారు. -
India exports: రెడ్ సీ సవాళ్లున్నా.. ఎగుమతులు రయ్!
న్యూఢిల్లీ: ఎర్ర సముద్రం ప్రాంతంలో అలాగే అంతర్జాతీయంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితులను జనవరిలో భారత్ వస్తు ఎగుమతులు అధిగమించాయి. 2023 జనవరిలో పోలి్చతే 2024 జనవరిలో భారత్ ఎగుమతులు 3.12 శాతం పెరిగాయి. విలువలో 36.92 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక రెండు నెలల క్షీణత అనంతరం జనవరిలో వస్తు దిగుమతులు 3 శాతం పెరిగి 54.41 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 17.49 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గడచిన తొమ్మిది నెలల్లో ఇంత తక్కువ స్థాయి వాణిజ్యలోటు ఇదే తొలిసారి. ఎర్ర సముద్రం సంక్షోభం ఎగుమతిదారులపై ప్రభావం చూపుతోంది. వారు తమ వస్తువులను యూరప్– ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలకు రవాణా చేయడానికి – ఆఫ్రికాను చుడుతూ కేప్ ఆఫ్ గాడ్ హోప్ మార్గాన్ని ఎంచుకోవాల్సి వస్తోంది. దీనితో రవాణా వ్యయం తడిసి మోపెడవుతోంది. సరకు రవాణాలో 14 రోజుల ఆలస్యంతోపాటు బీమా వ్యయాలు కూడా పెరిగాయి. యెమెన్కు చెందిన హౌతీ మిలిటెంట్ల దాడుల కారణంగా ఎర్ర సముద్రం– మధ్యధరా సముద్రాన్ని హిందూ మహాసముద్రానికి కలిపే కీలకమైన షిప్పింగ్ మార్గం బాబ్–ఎల్–మండేబ్ జలసంధి చుట్టూ పరిస్థితి తీవ్రరూపం దాలి్చంది. ముఖ్యాంశాలు... ► సమీక్షా నెల జనవరిలో క్రూడ్ ఆయిల్ దిగుమతులు 4.33 శాతం పెరిగి 16.56 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ► పసిడి దిగుమతులు ఏకంగా 174 శాతం పెరిగి 1.9 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 10 నెలల్లో క్షీణత కాగా, ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి వరకూ 10 నెలల కాలంలో ఎగుమతుల విలువ 4.89% క్షీణించి 353.92 బిలియన్ డాలర్లకు పడ్డాయి. దిగుమతులు కూడా 6.71% పడిపోయి 561.12 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరసి వాణిజ్యలోటు 207.2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. మొత్తం దిగుమతుల విలువలో క్రూడ్ ఆయిల్ విలువ 15.91% పడిపోయి 146.75 బిలియన్ డాలర్లుగా నమోదైంది. పసిడి దిగుమతులు 301.7% పెరిగి 38 బిలియన్ డాలర్లకు చేరాయి. సేవలు..ఓకే ఇదిలాఉండగా, భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో మెజారిటీ వాటా కలిగిన సేవల రంగం జనవరిలో 32.8 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిపింది. 2023లో ఈ విలువ 28 బిలియన్ డాలర్లు. ఇక ఏప్రిల్ నుంచి జనవరి మధ్య ఈ విలువ 267.5 బిలియన్ డాలర్ల నుంచి 284.45 బిలియన్ డాలర్లకు ఎగసింది. -
Houthi Attacks: వెనక్కు తగ్గని హౌతీలు
సనా: యెమెన్లోని తమ స్థావరాలపై అమెరికా, బ్రిటన్ చేస్తున్న వైమానిక దాడులు, గస్తీలకు హౌతీ తిరుగుబాటుదారులు బెదరడం లేదు. తాజాగా ఎర్ర సముద్రంలో అమెరికా, బ్రిటన్కు చెందిన రెండు నౌకలపై విజయవంతంగా దాడి చేసినట్లు హౌతీలు ప్రకటించారు. హౌతీ ప్రతినిధి యాహ్య సారె మాట్లాడుతూ ‘అమెరికా నౌక ‘స్టార్ నాసియా’పై తొలి బ్రిటీష్ నౌక ‘మార్నింగ్ టైడ్’పై దాడి చేశాం’ అని వెల్లడించారు. బ్రిటన్ నౌకపై దాడిని ఆ దేశ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ వింగ్ ఆంబ్రే ధ్రృవీకరించింది. యెమెన్లో హౌతీ మిలిటెంట్ల ఆధీనంలోని హుడేడా పోర్టు నుంచి జరిపిన క్షిపణి దాడిలో మార్నింగ్ టైడ్ నౌక స్వల్పంగా దెబ్బతిన్నట్లు పేర్కొంది. అయితే నౌకలో సిబ్బంది ఎవరూ గాయపడలేదని వెల్లడించింది. బార్బడోస్ జెండాతో వస్తున్న ఈ నౌక బాబ్ ఎల్ మండెప్ జలసంధి దాటగానే స్పీడ్ పెంచినప్పటికీ హౌతీల దాడికి చిక్కిందని బ్రిటన్ తెలిపింది. నౌకపై యాంటీ షిప్ మిసైల్తో దాడి జరిగినట్లు సమాచారం. ఈ నౌక బ్రిటన్లోని ఫురాడినో కంపెనీకి చెందినదిగా గుర్తించారు. తమ నౌక ప్రస్తుతం ప్రయాణం కొనసాగిస్తోందని కంపెనీ పేర్కొంది. కాగా, ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్న హౌతీల ఆగడాలకు చెక్ పెట్టేందుకు అమెరికా, బ్రిటన్ ఇటీవల మిలిటెంట్ల స్థావరాలపై దాడులు తీవ్రం చేసిన విషయం తెలిసిందే. యెమెన్లోని హౌతీ మిలిటెంట్ల స్థావరాలపై అమెరికా, బ్రిటన్ సేనలు గత వారం బాంబులతో విరుచుకుపడ్డాయి. మిలిటెంట్లకు చెందిన పలు స్థావరాల్లో నౌకలపై దాడికి సిద్ధంగా ఉన్న క్షిపణులు ఈ దాడుల్లో ధ్వంసమయ్యాయి. ఇదీచదవండి.. పాక్ ఎన్నికల కోసం 54 వేల చెట్ల నరికివేత -
యెమెన్లో హౌతీల స్థావరాలపై అమెరికా దాడులు
వాషింగ్టన్: ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారుల దాడులపై అమెరికా కూటమి కన్నెర్ర చేసింది. యెమెన్లో డజన్ల కొద్ది హౌతీ స్థావరాలపై అమెరికా, యూకే దాడులు జరిపాయి. దాదాపు 13 ప్రదేశాల్లో 36 స్థావరాలపై దాడులు చేసినట్లు తెలుస్తోంది. హౌతీల ఆయుధ సామాగ్రిని లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా కూటమి స్పష్టం చేసింది. జనవరి 28న జోర్డాన్లో ముగ్గురు అమెరికా సైనికులను దుండగులు హత్య చేశారు. దీనికి వ్యతిరేకంగా ఇరాక్, సిరియాలో ఇరాన్-సంబంధిత లక్ష్యాలపై అమెరికా దాడులు చేసింది. ఈ దాడులు జరిపిన ఒక రోజు తర్వాత యెమెన్లో మళ్లీ ఉమ్మడి వైమానిక దాడులు జరిగాయి. "అంతర్జాతీయ వాణిజ్య షిప్పింగ్తో పాటు ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణించే నౌకలపై హౌతీల నిరంతర దాడులకు ప్రతిస్పందనగా యెమెన్లోని 13 ప్రదేశాలలో 36 హుతీ స్థావరాలపై దాడి చేశాం" అని యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్ సహా ఇతర దేశాల కూటమి స్పష్టం చేసింది. హౌతీల ఆయుధాల నిల్వలపై, క్షిపణి వ్యవస్థలు, లాంచర్లు, వాయు రక్షణ వ్యవస్థలు, రాడార్లతో ఉన్న స్థావరాలపై దాడులు జరిగాయి. ఎర్ర సముద్రంలో నౌకలపై ప్రయోగించడానికి సిద్ధమైన ఆరు హౌతీ యాంటీ షిప్ క్షిపణులపై అమెరికా సంయుక్త దళాలు విడివిడిగా దాడులు చేశాయని సెంట్రల్ కమాండ్ (CENTCOM) తెలిపింది. హమాస్పై ఇజ్రాయెల్ దాడికి వ్యతిరేకంగా హౌతీలు ఎర్ర సముద్రంలో అంతర్జాతీయ నౌకలపై దాడులు చేస్తున్నారు. మొదట ఇజ్రాయెల్ నౌకలపై దాడులు చేస్తామని ప్రకటించిన హౌతీలు.. ఇతర దేశాల నౌకలపై కూడా దాడులు ప్రారంభించాయి. దీంతో అమెరికా సహా 12 దేశాలు ఏకమై ఎర్ర సముద్రంలో హౌతీల దాడులకు అడ్డుకట్టవేస్తున్నాయి. ఇదీ చదవండి: ఇరాక్, సిరియాల్లోని లక్ష్యాలపై అమెరికా దాడులు -
బ్రిటిష్ నౌకపై హౌతీల దాడి
జెరూసలేం: యెమెన్లో హౌతీ తిరుగుబాటుదారులు మళ్లీ రెచి్చపోయారు. బ్రిటిష్ చమురు ట్యాంకర్తోపాటు మొట్టమొదటిసారిగా అమెరికా యుద్ధ నౌక యూఎస్ఎస్ కారీ్నపైకి క్షిపణులను ప్రయోగించారు. బ్రిటిష్ చమురు నౌక మంటల్లో చిక్కుకోగా, అందులోని 22 మంది భారతీయ సిబ్బందిని కాపాడేందుకు భారత నావికా దళం ఐఎన్ఎస్ విశాఖపట్నం అక్కడికి హుటాహుటిన తరలి వెళ్లింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి ఎర్ర సముద్రంలోని ఏడెన్ సింధులో చోటుచేసుకుంది. బ్రిటిష్ చమురు నౌక ఎంవీ మర్లిన్ లువాండా లక్ష్యంగా హౌతీలు ప్రయోగించిన క్షిపణితో నౌకలో అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. విపత్తు సమాచారం అందుకున్న భారత నేవీకి చెందిన డె్రస్టాయర్ ఐఎన్ఎస్ విశాఖపట్నం అక్కడికి చేరుకుంది. నౌకలో మంటలను ఆర్పి, సిబ్బందిని కాపాడేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. నౌకలోని సిబ్బందిలో 22 మంది భారతీయులతోపాటు ఒక బంగ్లాదేశీ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఘటనలో ఎవరికీ ఎటువంటి హాని కలగలేదని సమాచారం. ఇలా ఉండగా, ఏడెన్ సింధు శాఖలో పయనించే చమురు నౌకలే లక్ష్యంగా హౌతీ తిరుగుబాటుదారుల దాడులు పెరిగిన నేపథ్యంలో అమెరికాకు చెందిన యుద్ధ నౌక యూఎస్ఎస్ కార్నీని మోహరించింది. ఈ నౌకపైకి శుక్రవారం హౌతీలు మొట్టమొదటిసారిగా క్షిపణిని ప్రయోగించారు. దీనిని మధ్యలోనే కూల్చివేసినట్లు అమెరికా నేవీ ప్రకటించింది. -
Houthi Rebels: నౌకలపై దాడులు.. హౌతీల కీలక ప్రకటన
సనా : ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడుల తీవ్రతను పెంచే ఉద్దేశం లేదని, కేవలం ఇజ్రాయెల్తో సంబంధమున్న నౌకలే తమ లక్ష్యమని యెమెన్కు చెందిన హౌతీ రెబెల్స్ గ్రూపు ప్రకటించింది. అదే సమయంలో అమెరికా, బ్రిటన్లు తమపై చేస్తున్న దాడులకు స్పందిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు హౌతీల అధికార ప్రతినిధి మహ్మద్ అబ్దుల్సలామ్ ఓ వార్తా సంస్థకు ఈ విషయాలు వెల్లడించాడు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)ని తాము లక్ష్యంగా చేసుకోమని చెప్పారు. ‘మేం కొన్ని రూల్స్ పెట్టుకున్నాం. ఒక్క చుక్క రక్తం చిందవద్దని, ఎలాంటి ఆస్తి నష్టం జరగకూడదని నిర్ణయించుకున్నాం. ఒక్క ఇజ్రాయెల్పైనే మా ఒత్తిడి. మిగిలిన ఏ దేశంపైనా ఒత్తిడి పెట్టడం మా ఉద్దేశం కాదు’అని సలామ్ స్పష్టం చేశాడు. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించిన తర్వాత పాలస్తీనాకు మద్దతుగా ఎర్ర సుముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీలు డ్రోన్లు, మిసైళ్లతో దాడులకు దిగారు. తాజాగా అమెరికా, బ్రిటన్లు సంయుక్తంగా యెమెన్లోని హౌతీల స్థావరాలపై వైమానిక దాడులు చేశాయి. ఈ నేపథ్యంలో హౌతీలు తాము ఎవరిపైనా దాడులు చేయబోమని ప్రకటించడం గమనార్హం. ఇదీచదవండి.. రష్యాలో పెద్ద ఎత్తున ఆందోళనలు.. కారణమిదే -
హౌతీలపై భూతల దాడులకు యెమెన్ పిలుపు
యెమెన్, సనా: ఎర్రసముద్రంలో హౌతీ తిరుగుబాటుదారుల దాడులు నానాటికీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హౌతీలపై తిరుగుబాటుకు యెమెన్ పిలుపునిస్తోంది. అయితే.. హౌతీలపై భూతల దాడులు చేయడానికి తమ సైన్యానికి తోడుగా ఇతర దేశాల సైన్యం సహకారం అవసరమని యెమెన్ అధ్యక్ష మండలి డిప్యూటీ నాయకుడు అన్నారు. ఎడెన్ పోర్టు సమీపంలో అమెరికా నౌకపై హౌతీలు దాడి జరిపిన అనంతరం ఆయన ఈ మేరకు మాట్లాడారు. ఎడెన్ పోర్టు ప్రాంతంలో అమెరికా నౌకపై క్షిపణులతో దాడి చేశామని హౌతీ తిరుగుబాటుదారులు శుక్రవారం ఉదయం ప్రకటించారు. అయితే.. ఈ దాడిలో తమ నౌకకు ఎలాంటి నష్టం జరగలేదని, ఎలాంటి ప్రాణ నష్టం కూడా సంభవించలేదని అమెరికా స్పష్టం చేసింది. హౌతీల యాంటీ షిప్ క్షిపణిపై అమెరికా దాడులు జరిపిన మరుసటి రోజే ఎడెన్ పోర్టు ప్రాంతంలో హౌతీలు రెచ్చిపోయారు. 'హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా, యూకే వైమానిక దాడులతో పాటు భూతల యుద్ధానికి మాకు విదేశీ సహాయం అవసరం. ఎర్ర సముద్రంలో అంతర్జాతీయ నావిగేషన్ను సురక్షితంగా ఉంచడానికి అంతర్జాతీయ, ప్రాంతీయ కూటమి అవసరం" అని యెమెన్ డిప్యూటీ ప్రెసిడెంట్ కౌన్సిల్ లీడర్ ఐదారుస్ అల్-జుబైది అన్నారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా ఇరాన్ మద్దతుతో హౌతీ తిరుగుబాటుదారులు ఎర్రసముద్రంలో ఇజ్రాయెల్ నౌకలపై దాడులు ప్రారంభించారు. ఇజ్రాయెల్కు వెళ్లే నౌలపైనే కాకుండా ఇతర దేశాల నౌకలపై కూడా హౌతీల దాడులు విస్తరించాయి. దీంతో అమెరికా సహా మిత్రపక్షాలు ఏకమై ఎర్రసముద్రంలో హౌతీల దాడుల నుంచి నౌకలను రక్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇదీ చదవండి: Pakistan Strikes On Iran: ఇరాన్పై పాక్ ప్రతీకార దాడి -
ఎర్ర సముద్ర ఘటనలపై ఆందోళన వ్యక్తం చేసిన భారత్
న్యూఢిల్లీ : ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల భద్రతపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అది చాలా ముఖ్యమైన నౌకామార్గం అయినందున ఎర్ర సముద్రంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని విదేశాంగ శాఖ ప్రతినిధి రన్ధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ విషయమై గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘మాకు వాణిజ్య స్వేచ్ఛ, రవాణా స్వేచ్ఛ రెండూ ముఖ్యమే. ఎర్ర సముద్రంలో జరుగుతున్న ఘటనలు కేవలం మమ్మల్నే కాదు. ప్రపంచంలోని చాలా దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి’అని జైస్వాల్ అన్నారు. డ్రోన్ దాడి కారణంగా గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో చిక్కుకున్న భారత్కు చెందిన వాణిజ్య నౌకలోని సిబ్బందిని భారత నేవీకి చెందిన ఐఎన్ఎస్ విశాఖపట్నం బుధవారం రాత్రి కాపాడింది. ఈ నేపథ్యంలో ఎర్ర సముద్ర ఘటనలపై భారత్ స్పందించడం గమనార్హం. గాజాపై ఇజ్రాయెల్ దాడికి నిరసనగా గత కొద్ది రోజులుగా ఎర్ర సముద్రం నుంచి వెళుతున్న వాణిజ్య నౌకలపై హౌతీ మిలిటెంట్లు డ్రోన్లు, మిసైళ్లతో దాడి చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆసియా నుంచి యూరప్, ఆసియా వెళ్లే వాణిజ్య నౌకలు ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కంపెనీలకు షిప్పింగ్ ఖర్చు ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇదీచదవండి.. ట్రంప్ చేతిపై ఎర్రమచ్చలేంటి.. ఫ్యాన్స్లో జోరుగా చర్చ -
ఎగుమతిదార్లకు అప్పు ఇవ్వాలంటూ సూచన.. ఎందుకంటే..
ఎర్ర సముద్ర సంక్షోభం నేపథ్యంలో సరుకు రవాణా వ్యయాలపరంగా సమస్యలు ఎదుర్కొంటున్న ఎగుమతిదార్ల అవసరాలను పర్యవేక్షించాలని ఆర్థిక శాఖల విభాగానికి (డీఎఫ్ఎస్) వాణిజ్య శాఖ సూచించింది. వారికి రుణలభ్యతపై దృష్టి పెట్టాలని పేర్కొంది. వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బర్త్వాల్ నేతృత్వంలో బుధవారం జరిగిన అంతర్–మంత్రిత్వ శాఖల సమావేశంలో ఎగుమతిదారుల సమస్యలను చర్చించారు. డీఎఫ్ఎస్, షిప్పింగ్, విదేశీ వ్యవహారాలు, రక్షణ శాఖల అధికారులు ఇందులో పాల్గొన్నారు. అరేబియా మహాసముద్రంలో నిఘాను మరింత పటిష్టం చేసినట్లు రక్షణ శాఖ తెలిపిందని ఈ సందర్భంగా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇదీ చదవండి: బుల్లెట్ రైలు ప్రాజెక్టు దక్కించుకున్న కంపెనీ ఇదే.. ఎర్ర సముద్రం గుండా ప్రయాణించే నౌకలపై హౌతీ మిలిటెంట్ల దాడుల కారణంగా వేరే మార్గాన్ని ఎంచుకోవాల్సి వస్తుండటం వల్ల ఎగుమతిదారులకు వ్యయాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు అన్ని వివరాలను సేకరిస్తున్నామని, త్వరలోనే అంతర్–మంత్రిత్వ శాఖల గ్రూప్ మరోసారి సమావేశమవుతుందని అధికారి పేర్కొన్నారు. -
ఎవరీ ఎర్రసముద్రపు హౌతీలు!
ఎర్రసముద్రం కొంతకాలంగా అల్లకల్లోలంగా మారింది. ఇరాన్ దన్నుతో హౌతీ ఉగ్రవాద ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఆ మార్గం గుండా ప్రయాణిస్తున్న అంతర్జాతీయ సరుకు రవాణా నౌకలపై విచ్చలవిడి దాడులతో బెంబేలెత్తిస్తున్నాయి. యెమన్లో అత్యధిక భాగాన్ని నియంత్రిస్తున్న ఈ ఉగ్రవాద ముఠా సముద్ర దాడులు అంతర్జాతీయ సమాజానికి పెను సవాలుగా మారాయి. ఒకవిధంగా అంతర్జాతీయ వర్తకమే తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఇంతకూ ఎవరీ హౌతీలు? వీళ్లెందుకిలా ఉన్నట్టుండి సముద్ర సవాళ్లకు దిగినట్టు...? – సాక్షి, నేషనల్ డెస్క్ గత అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదులు మెరుపుదాడికి దిగి కనీవినీ ఎరగని రీతిలో బీభత్సం సృష్టించడం తెలిసిందే. అందుకు ప్రతీకారంగా హమాస్ నిర్మూలనే లక్ష్యంగా పాలస్తీనాపై పూర్తిస్థాయి యుద్ధానికి ఇజ్రాయెల్ తెర తీసింది. హమాస్కు దన్నుగా హౌతీల ఆగడాలు అప్పటినుంచే పెచ్చరిల్లాయి. ఇజ్రాయెల్ వైపు ప్రయాణిస్తున్న ప్రతి నౌకనూ లక్ష్యం చేసుకుంటామని హౌతీలు హెచ్చరించారు. కానీ వాస్తవానికి ఇజ్రాయెల్తో ఏ సంబంధమూ లేని నౌకలను కూడా వదిలిపెట్టడం లేదు. కొద్ది రోజులుగానైతే కనిపించిన నౌక మీదల్లా విచ్చలవిడిగా దాడులకు దిగుతూ కల్లోలం సృష్టిస్తున్నారు. సమీపంలోని నౌకలపై డ్రోన్లు, సుదూరాల్లో ఉన్నవాటిపై ఏకంగా బాలిస్టిక్ మిసైళ్లు ప్రయోగిస్తూ గుబులు రేపుతున్నారు. గత నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఎర్రసముద్రంపై నౌకలపై హౌతీల దాడులు ఏకంగా 500 శాతం పెరిగిపోయాయి! వీటికి ఇరాన్ సహకారం కూడా పుష్కలంగా ఉందని అమెరికా ఆరోపిస్తోంది. మిత్ర రాజ్యాలతో కలిసి హౌతీల స్థావరాలపై కొద్ది రోజులుగా అమెరికా పెద్దపెట్టున క్షిపణి దాడులకు దిగుతోంది. యెమన్ సాయుధ ముఠా..! హౌతీలు యెమన్కు చెందిన సాయుధ ముఠా. 1990ల్లో నాటి దేశాధ్యక్షుడు అలీ అబ్దుల్లా సలే అవినీతిని ఎదిరించేందుకంటూ పుట్టుకొచ్చారు. అక్కడి షియా ముస్లిం మైనారిటీల్లో జైదీలనే ఉప తెగకు చెందినవారు. వీరి ఉద్యమ వ్యవస్థాపక నేత హుసేన్ అల్ హౌతీ పేరిట ఆ పేరు వచ్చింది. ఈ ముఠాను తొలుత అన్సర్ అల్లా (దేవ పక్షపాతులు)గా పిలిచేవారు... హౌతీలను అణచేసేందుకు సౌదీ అరేబియా సాయంతో సలే 2003లో విఫలయత్నం చేశాడు. యెమెన్ ప్రభుత్వంపై 2014 నుంచీ వీళ్లు తీవ్ర స్థాయిలో పోరాడుతున్నారు. ఫలితంగా పదేళ్లుగా దేశం అంతర్యుద్ధంతో అట్టుడికిపోతోంది. సౌదీ, యూఏఈ, ఇతర అరబ్ దేశాలన్నీ యెమన్ ప్రభుత్వానికి దన్నుగా ఉన్నా హౌతీలు ఎదిరించి నిలుస్తున్నారు. ఈ పోరాటంలో ఇప్పటికే ఏకంగా 3.5 లక్షల మంది దాకా బలైనట్టు అంచనా! అల్లర్లకు తాళలేక అర కోటి మందికి పైగా పొట్ట చేత పట్టుకుని యెమన్ నుంచి వలస బాట పట్టారని ఐరాస పేర్కొంది. అమెరికా, ఇజ్రాయెల్, పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా ఇరాన్, పాలస్తీనా, హెబ్జొల్లా గ్రూపు తదితరాలతో కలిసి ‘ప్రతిఘటన శక్తులు’గా హౌతీలు తమను తాము చెప్పుకుంటారు. వీరికి లెబనాన్కు చెందిన హెబ్జొల్లా గ్రూపు అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అది వీరికి 2014 నుంచీ ఆయుధాలను, పూర్తిస్థాయి సాయుధ శిక్షణను అందిస్తూ వస్తోంది. ఇరాన్ కూడా హౌతీలకు పూర్తిగా దన్నుగా నిలుస్తోందని చెబుతారు. ముఖ్యంగా వారికి బాలిస్టిక్ మిసైళ్లను సమకూర్చింది ఇరానేనని అమెరికా రక్షణ శాఖ వర్గాలు అనుమానిస్తున్నాయి. 2019లో తమ చమురు క్షేత్రాలపై దాడులకు హౌతీలు వాడిన డ్రోన్లు, క్షిపణులను కూడా ఇరానే అందజేసిందని సౌదీ ఆరోపిస్తూ ఉంటుంది. గాజాపై యుద్ధం మొదలు పెట్టినప్పటి నుంచీ ఇజ్రాయెల్పై హౌతీలు పదేపదే బాలిస్టిక్ మిసైళ్లు, డ్రోన్లతో దాడులు చేస్తూనే ఉన్నారు. హౌతీల చెరలోనే యెమన్ నిజానికి రాజధాని సనాతో పాటు యెమన్ అత్యధిక భాగం హౌతీల వశంలోనే ఉంది. ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడమే గాక వారు సొంత కరెన్సీని కూడా ముద్రిస్తున్నారు! ఇక యెమన్లోని ఎర్రసముద్ర తీర ప్రాంతం మొత్తాన్నీ హౌతీలే నియంత్రిస్తున్నారు. ఇప్పుడదే ఆ మార్గం గుండా అంతర్జాతీయ సరుకు రవాణాకు పెను సవాలుగా మారింది. 2010 నాటికే ఈ ముఠాకు కనీసం లక్ష పై చిలుకు సాయుధ బలమున్నట్టు ఐరాస అంచనా వేసింది. పెను ప్రభావం... ఆసియా, యూరప్ మధ్య సముద్ర రవాణాకు ఎర్రసముద్రమే అత్యంత దగ్గరి దారి. అంతేగాక అంతర్జాతీయ సముద్ర వర్తకంలో కనీసం 15 శాతానికి పైగా ఎర్రసముద్రం మీదుగా మద్యధరా సముద్రం, సూయ జ్ కాల్వ గుండానే సాగుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ హౌతీల మతిలేని దాడుల ప్రభావం అంతర్జాతీయ వర్తకంపై భారీగా పడుతోంది... ఎర్రసముద్రం గుండా ప్రయాణించే నౌకలకు బీమా ప్రీమియాన్ని కంపెనీలు పది రెట్లకు పైగా పెంచాయి! మెడిటెరేనియన్ షిపింగ్ కంపెనీ, మార్క్స్, హపాగ్–లాయిడ్, బ్రిటిష్ పెట్రోలియం వంటి పలు కంపెనీలు ప్రత్యామ్నాయ సముద్ర మార్గాలను ఎంచుకుంటున్నాయి. దాంతో అంతర్జాతీయ సరుకు రవాణా వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతోంది. అటు దాడులు, ఇటు బీమా వ్యయాలకు దడిచి పెద్ద రవాణా కంపెనీలన్నీ ఎర్రసముద్రం మార్గానికి ఓ నమస్కారం అంటున్నాయి. వెరసి ఇదంతా రవాణా వ్యయాలు బాగా పెరిగేందుకు కారణమవుతోంది. అంతర్జాతీయంగా చమురుతో పాటు నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగేలా కన్పిస్తున్నాయి. -
ఎర్ర సముద్రంలో అలజడి.. టెస్లాకు గట్టి దెబ్బ!
గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని నిరసిస్తూ ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు. హౌతీల ఆగడాలకు అడ్డుకట్టవేయడానికి అమెరికా సహా 12 మిత్ర దేశాలు ఏకమయ్యాయి. ఎర్రసముద్రంలో గస్తీ నిర్వహిస్తున్నాయి. వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి. ఎర్ర సముద్రంలో హౌతీలు సృష్టిస్తున్న అలజడుల దెబ్బ అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా (Tesla)కు గట్టిగా తగిలింది. తన బెర్లిన్ ఫ్యాక్టరీలో జనవరి 29 నుంచి ఫిబ్రవరి 11 వరకు చాలా కార్ల ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టెస్లా ప్రకటించినట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. ఎర్ర సముద్రంలోని నౌకలపై జరుగుతున్న దాడుల ప్రభావం సరకు రవాణాపై తీవ్రంగా పడింది. దీంతో కంపెనీకి విడిభాగాల సరఫరా తగ్గిపోయింది. ఫలితంగా ఉత్పత్తిని నిలిపేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇరాన్-మద్దతుగల హౌతీ మిలిటెంట్లు గాజాలోని హమాస్కు సంఘీభావంగా ఎర్ర సముద్రంలో నౌకలు లక్ష్యంగా చేస్తున్న దాడులకు పర్యవసానంగా తగిలిన గట్టి దెబ్బగా దీన్ని భావిస్తున్నారు. ఎర్ర సముద్రంలో జరుగుతున్న సాయుధ దాడుల కారణంగా కేప్ ఆఫ్ గూడ్ హోప్ ద్వారా యూరప్, ఆసియా మధ్య రవాణా మార్గాలలో మార్పులు జరగడం తమ బెర్లిన్ ఫ్యాక్టరీలో ఉత్పత్తిపై ప్రభావం చూపుతున్నట్లు టెస్లా ఒక ప్రకటనలో తెలిపినట్లు రాయిటర్స్ పేర్కొంది. ఉత్పత్తి నిలిపోవడానికి నిర్దిష్ట కారణాలను వెల్లడించనప్పటికీ ఫిబ్రవరి 12న పూర్తి ఉత్పత్తిని పునఃప్రారంభించనున్నట్లు టెస్లా పేర్కొంది. ఎర్ర సముద్రంలో అలజడి కారణంగా ఇతర వాహన తయారీదారులు ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవచ్చని ఆటో పరిశ్రమ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టెస్లాతోపాటు చైనీస్ ఆటోమొబైల్ కంపెనీ గీలీ, అతిపెద్ద ఫర్నీచర్ కంపెనీ ఐకియా సహా అనేక కంపెనీలు డెలివరీ ఆలస్యం గురించి ఇప్పటికే హెచ్చరించాయి. -
Houthis Warning: అమెరికా, బ్రిటన్ మూల్యం చెల్లించుకోవాల్సిందే
టెహ్రాన్: తమపై దాడులు చేసిన అమెరికా, బ్రిటన్లకు యెమెన్కు చెందిన హౌతీ గ్రూపు మిలిటెంట్లు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దాడులకు పాల్పడ్డ అమెరికా, యూరప్లు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. హౌతీల డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ అల్ ఎజ్జీ మాట్లాడుతూ ‘యెమెన్పై హౌతీలు లక్ష్యంగా అమెరికా,బ్రిటన్లు భారీ దాడులు చేశాయి. ఇందుకు వారు తీవ్ర పరిణామలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని అన్నారు. హౌతీ గ్రూపు మరో సీనియర్ మెంబర్ మాట్లాడుతూ ఎర్ర సముద్రంలో ఇప్పటికే అమెరికా, బ్రిటన్లకు చెందిన వార్ షిప్పులపై ప్రతీకార దాడులు ప్రారంభించినట్లు తెలిపాడు. మరోవైపు హౌతీ గ్రూపు లక్ష్యంగా అమెరికా, బ్రిటన్లు జరిపిన దాడులు క్రూరమైనవని ఇరాన్ అభివర్ణించింది. ఈ దాడులను ఖండిస్తున్నట్లు ప్రకటించింది. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా యెమన్కు చెందిన హౌతీ గ్రూపు ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై డ్రోన్లు, మిసైళ్లతో గత కొంత కాలంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గురువారం అమెరికా, బ్రిటన్లకు చెందిన బలగాలు సంయుక్తంగా హౌతీలు లక్ష్యంగా యెమెన్లోని పలు చోట్ల వైమానిక దాడులు చేశాయి. ఇదీచదవండి.. హౌతీ పైరేట్లు.. చైనా మిత్రులా ? -
Red Sea: హౌతీ పైరేట్లు... చైనా మిత్రులా?
టెహ్రాన్: ఎర్ర సముద్రంలో హౌతీ మిలిటెంట్ల దాడులు తప్పించుకోవడానికి వాణిజ్య నౌకలు కొత్త టెక్నిక్ను వాడుతున్నట్లు తెలుస్తోంది. చైనాతో సంబంధాలున్నట్లుగా సంకేతాలిస్తూ నౌకలు హౌతీల దాడుల నుంచి తప్పించుకుంటున్నాయి. నౌకలో అందరూ చైనా సిబ్బంది ఉన్నట్లు లేదంటే నౌక చైనాకు వెళుతోందని సంకేతాలిస్తే హౌతీలు దాడి చేయకుండా విడిచి పెడుతుండడంతో వాణిజ్య నౌకలు ఈ టెక్నిక్ను వాడుతుండటం విశేషం. ఎలాంటి ఆటంకాలు లేకుండా తాజాగా ఎర్ర సముద్రాన్ని దాటిన ఐదు వాణిజ్య నౌకలు ఇదే టెక్నిక్ను వాడాయని సమాచారం. నిజానికి గాజాపై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్తో లింకులున్న దేశాలకు చెందిన నౌకలపై మాత్రమే దాడి చేస్తామని ప్రటించిన హౌతీలు ఇజ్రాయెల్తో ఎలాంటి లింకులేని దేశాల వాణిజ్య నౌకలపైనా దాడులకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం హౌతీలపై అమెరికా, బ్రిటన్లకు చెందిన బలగాలు వైమానిక దాడులకు దిగాయి. ఈ దాడులు ఇక ముందు కూడా కొనసాగుతాయని అమెరికా హెచ్చరించింది. ఆసియా నుంచి అమెరికా, యూరప్లకు వెళ్లేందుకు కీలక మార్గంగా ఉన్న ఎర్ర సముద్రంలో హౌతీలు దాడులకు దిగుతుండడంతో నౌకలు ఆఫ్రికా చుట్టూ తిరిగి గమ్యస్థానాలకు వెళుతున్నాయి. ఇదీచదవండి..హౌతీలపై అమెరికా మిత్ర పక్షాల దాడులు -
అమెరికా హెచ్చరించినా.. వెనక్కి తగ్గని హౌతీలు
న్యూయార్క్: ఎర్ర సముద్రంలో దాడులు నిలిపివేయాలని అమెరికా మిత్రపక్షాలు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ హౌతీ ఉగ్రవాదులు వెనక్కి తగ్గడం లేదు. అమెరికా హెచ్చరికలను ఏ మాత్రం లెక్కచేయకుండా దాడులను మరింత పెంచే దుస్సాహసం చేస్తున్నారు. తాజాగా అమెరికా నావికాదళం, వాణిజ్య నౌకలకు సమీప దూరంలో డ్రోన్ దాడులకు పాల్పడ్డారు. హౌతీలు సాయుధ మానవ రహిత ఉపరితల నౌక(USV)ను ప్రయోగించారని అమెరికా పేర్కొంది. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీల దాడులు ప్రారంభమైనప్పటి నుంచి మానవరహిత ఉపరితల నౌకను ప్రయోగించడం ఇదే మొదటిసారని అమెరికా నేవీ ఆపరేషన్స్ హెడ్ వైస్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ తెలిపారు. యూఎస్వీలు హౌతీల సముద్ర యుద్ధాల్లో కీలకమైన భాగమని క్షిపణి నిపుణుడు ఫాబియన్ హింజ్ తెలిపారు. సౌదీ సంకీర్ణ దళాలకు వ్యతిరేకంగా గతంలో జరిగిన యుద్ధాల్లో వాటిని ఉపయోగించారని చెప్పారు. తరచుగా సూసైడ్ డ్రోన్ పడవలను ఎక్కువగా ఉపయోగింస్తారని వెల్లడించారు. ఇరాన్లో తయారైన కంప్యూటరైజ్డ్ గైడెన్స్ సిస్టమ్స్లతో అమర్చబడి ఉంటాయని తెలిపారు. ఎర్ర సముద్రంలో హౌతీల దాడుల వెనక ఇరాన్ ఉందని యుఎస్ డిప్యూటీ రాయబారి క్రిస్టోఫర్ లూ అన్నారు. హౌతీలకు బాలిస్టిక్ క్షిపణులతో సహా అధునాతన ఆయుధ సరఫరా చేస్తోందని ఆరోపించారు. ఇరాన్తో అమెరికా ఘర్షణ కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని నిరసిస్తూ ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు. గత డిసెంబర్ నుంచి ఇప్పటివరకు 23 దాడులకు పాల్పడ్డారు. హౌతీల ఆగడాలకు అడ్డుకట్టవేయడానికి అమెరికా సహా 12 మిత్ర దేశాలు ఏకమయ్యాయి. ఎర్రసముద్రంలో గస్తీ నిర్వహిస్తున్నాయి. వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి. హౌతీల దాడులు నిలిపివేయకపోతే సైనిక చర్యను ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా మిత్ర దేశాలు గురువారం హెచ్చరికలు జారీ చేశాయి. ఈ హెచ్చరికలు చేసిన కొన్ని గంటల తర్వాతే హౌతీలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటం గమనార్హం. ఇదీ చదవండి: సైనిక చర్యకు దిగుతాం.. హౌతీలకు అమెరికా వార్నింగ్ -
సైనిక చర్యకు దిగుతాం.. హౌతీలకు అమెరికా వార్నింగ్
న్యూయార్క్: హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో ఓడలపై దాడులను నిలిపివేయాలని అమెరికా సహా 12 మిత్రదేశాలు పిలుపునిచ్చాయి. లేనిపక్షంలో సైనిక చర్యను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశాయి. ఇదే చివరిసారి మరోసారి హెచ్చరికలు ఊహించకూడదని పేర్కొంటూ ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధానికి వ్యతిరేకంగా హౌతీ ఉగ్రవాదులు ఎర్ర సముద్రంలో డిసెంబర్ 19 నుంచి ఇప్పటివరకు 23 దాడులకు పాల్పడ్డారు. "చట్టవిరుద్ధమైన దాడులను తక్షణమే ముగించాలి. నిర్బంధించిన ఓడలు, సిబ్బందిని తక్షణమే విడుదల చేయాలని పిలుపునిస్తున్నాం. హౌతీలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే చర్యలకు పాల్పడుతున్నారు. జలమార్గాలలో వాణిజ్య ప్రయాణాలపై బెదిరింపులకు పాల్పడితే తర్వాత జరిగే పరిణామాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది." అని అమెరికా మిత్రదేశాలు హెచ్చరించాయి. ఎర్రసముద్రంలో ఓడలపై హౌతీ తిరుగుబాటుదారుల దాడులతో అంతర్జాతీయ సహనం దెబ్బతింటుందని అమెరికా మిత్రదేశాలు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. ఈ ప్రకటనపై అమెరికా, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, బెల్జియం, కెనడా, డెన్మార్క్, జర్మనీ, ఇటలీ, జపాన్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, సింగపూర్, యునైటెడ్ కింగ్డమ్ సంతకాలు చేశాయి. ఇజ్రాయెల్పై అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదుల దాడితో యుద్ధం ప్రారంభం అయింది. హమాస్ ఉగ్రవాదులను అంతం చేసే దిశగా ఇజ్రాయెల్ ముందుకు వెళుతోంది. గాజాపై భీకర యుద్ధం చేస్తోంది. ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో హమాస్ వైపు 22 వేలకు పైగా మంది మరణించారు. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని నిరసిస్తూ యెమెన్ ఆధారిత హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో ఓడలపై దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్కు సంబంధం ఉన్న ప్రతి నౌకపై దాడి చేస్తున్నారు. ఇదీ చదవండి: 73కు చేరిన ‘జపాన్’ మరణాల సంఖ్య -
ఎరుపెక్కిన సముద్ర వర్తకం
సమీపకాలంలో భారత్కు అత్యంత ఆందోళనకర పరిణామం ఇది. బలవత్తరమైన శక్తిగా ఎదగడానికి సముద్ర వర్తకం ముఖ్యమైన వేళ... వాణిజ్య నౌకలపై వరుస దాడులు నిరంతర అప్రమత్తత అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. వేర్వేరు వాణిజ్య నౌకలపై అరేబియా సముద్రంలో ఇటీవల జరిగిన దాడులతో, భారత నౌకాదళం మూడు క్షిపణి విధ్వంసక నౌకలను మోహరించాల్సి వచ్చింది. వాటిని వివిధ ప్రాంతాల్లో గస్తీకి నిలిపి, ముష్కరుల దొంగదాడులకు మన నేవీ చెక్ పెట్టే పనిలో పడింది. వారం రోజుల్లో... భారతీయ సిబ్బందితో కూడిన రెండు వాణిజ్య నౌకలు మన దేశానికి వస్తూ, దాడికి గురవడం మన సముద్ర వర్తకం భద్రతపై ప్రశ్నలు రేపింది. పోర్బందర్కు 217 నాటికల్ మైళ్ళ దూరం నుంచి 21 మంది భారతీయ సిబ్బందితో కూడిన ఎమ్వీ చెమ్ ప్లూటోపై డిసెంబర్ 23న డ్రోన్ దాడి జరిగింది. అప్రమత్తమైన భారత నౌకాదళం, భారత తటరక్షక దళం సదరు వర్తక నౌకకు రక్షణగా నిలిచాయి. తర్వాత కొద్ది గంటలకే... పాతిక మంది భారతీయ సిబ్బందితో కూడిన వాణిజ్య క్రూడాయిల్ ట్యాంకర్ ఎమ్వీ సాయిబాబాపై ఎర్రసముద్రం దక్షిణ ప్రాంతంలో డ్రోన్ దాడి జరిగింది. దీంతో,నౌకాదళం గస్తీ పెంచింది. దాడులు జరిపిన ముష్కరులు సముద్ర గర్భంలో దాగివున్నా సరే, వెతికి పట్టుకొని, కఠిన చర్యలు తీసుకుంటామంటూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. లెక్కలు తీస్తే... నవంబర్ 19 నుంచి ఇప్పటికి ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై 30 డ్రోన్ దాడులు, సముద్రపు దొంగల దాడులు జరిగాయి. అంటే, దాదాపు రోజుకో దాడి. ఈ 30 దాడుల్లో సగం ప్రపంచంలోనే అతి రద్దీగా ఉండే సముద్ర వర్తక మార్గంలో ఎర్ర సముద్రంలో జరిగినవే. ఇది ఆందోళనకరం. తాజాగా ఎమ్వీ చెమ్ ప్లూటోపై జరిగిన దాడి తాలూకు శిథిలాలను సేకరించి, దాడి తీరుతెన్ను లను కనిపెట్టే ప్రయత్నం సాగుతోంది. దాడి మరో నౌకపై నుంచి చేశారా, లేక తీర ప్రాంతం నుంచి జరిగిందా లాంటి అంశాలను నిర్ధారణ చేసే పనిలో ఇండియన్ నేవీ నిమగ్నమైంది. ఒకపక్క గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధంతో ఉద్రిక్తతలు పెరగగా, అదే సమయంలో వాణిజ్య నౌకలపై ఇలా డ్రోన్ దాడులు జరగడం యాదృచ్ఛికమేమీ కాదు. అక్కడి యుద్ధం తాలూకు ప్రభావం ఇక్కడకు విస్తరించింది. యెమెన్లో అధిక ప్రాంతాలను తమ నియంత్రణలో పెట్టుకున్న హౌథీ రెబల్స్ నవంబర్ మధ్య నుంచి ఎర్ర సముద్రంలో వెళుతున్న నౌకలపై డ్రోన్లు, క్షిపణులు ప్రయోగిస్తున్నారు. గాజా లోని హమాస్కు సంఘీభావంగా రెబల్స్ ఈ దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్తో స్పష్టమైన సంబంధం లేని నౌకలపైనా ఈ దాడులు సాగడం గమనార్హం. వీరికి ఇరాన్ అండదండలున్నట్టు కథనం. దాడులకు బాధ్యత తమదేనంటూ ఈ యెమనీ రెబల్స్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ఎమ్వీ సాయిబాబాపై హౌథీలు దాడి జరిపారనీ, ఎమ్వీ చెమ్ప్లూటోపై ఇరాన్ నుంచి డ్రోన్ను ప్రయో గించారనీ అమెరికా కేంద్ర కమాండ్ సమాచారం. దాడులకు ఎర్ర సముద్రాన్ని ఎంచుకోవడంలో ముష్కరులకు పెద్ద వ్యూహం ఉంది. ప్రపంచ నౌకా రవాణాలో 30 శాతం, వ్యాపారంలో 12 శాతం, సముద్రజలాలపై పెట్రోలియమ్ వాణిజ్యంలో 10 శాతం మధ్యధరా ప్రాంతాన్ని హిందూ మహాసముద్రంతో కలిపే ఎర్ర సముద్రం మీదుగానే జరుగుతాయి. దాడుల వల్ల నౌకలు రూటు మార్చి, ఒకప్పటిలా గుడ్హోప్ అగ్రం చుట్టూ తిరిగిరావాలి. దూరం, దరిమిలా ప్రయాణకాలం పెరిగే ఈ సుదీర్ఘయానం వల్ల చమురు, దిగుమతుల ధరలు గణనీయంగా పెరుగుతాయి. పశ్చిమాసియా నుంచి వచ్చే చమురు మరింత ప్రియమవుతుంది. చమురు సరఫరాలకు ప్రధానంగా ఆ ప్రాంతంపై ఆధారపడే భారత్కు ఇది దెబ్బ. ఇజ్రాయెల్ – హమాస్ పోరు ప్రారంభమైనప్పటి నుంచి ముడి చమురు ధరలు అంతకంతకూ పెరగడమే అందుకు నిదర్శనం. అమెరికా, ఇజ్రాయెల్లను సైద్ధాంతికంగా వ్యతిరేకించే హౌథీల దాడుల దెబ్బకు ఎర్ర సముద్రం ఇప్పుడు యుద్ధ క్షేత్రమైపోయింది. గాజాకు మానవతా సాయం అందేవరకు ప్రపంచ సరఫరా వ్యవస్థలకు అవరోధాలు కల్పించాలన్న వారి ఆలోచన ఫలిస్తోంది. దీన్ని ప్రతిఘటించి, ముష్కరుల దాడుల నుంచి రక్షణ కోసం అమెరికా గత వారం ‘ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్’ పేర బహుళ దేశీయ నౌకా దళాన్ని ప్రారంభించింది. అయితే, అగ్రరాజ్య సారథ్యంలోని ఈ బలగంలో పలు దేశాలు చేరలేదు. సూయజ్ కాలువ ద్వారా వర్తకం తగ్గినందు వల్ల భారీగా నష్టపోయే ఈజిప్ట్ ఇంతవరకు హౌథీల దుశ్చర్యలను ఖండించలేదు. చివరకు యెమెనీ గ్రూపుతో శాంతి ప్రక్రియ చర్చలు సాగిస్తున్న సౌదీ అరేబియా సైతం అమెరికా సారథ్య నౌకాబలగాన్ని సమర్థించలేదు. ఉత్తరాన హిమాలయాలు, పశ్చిమాన శత్రుత్వం వహించే పాకిస్తాన్ ఉన్నందున, మిగిలిన దిక్కుల్లో వాణిజ్యానికి సంబంధించి ఆచరణలో భారత్ ద్వీపదేశమే. అందుకే, మనకు సముద్ర వర్తకం కీలకం. మన దేశ వాణిజ్య పరిమాణంలో 98 శాతం, విలువలో 68 శాతం సముద్ర మార్గాల్లోనే సాగుతాయి. దానికి తగ్గట్టే హిందూ మహాసముద్ర ప్రాంతానికి కావలి పాత్రను భారత్ పోషిస్తోంది. వాణిజ్యం పెరగాలంటే, మిత్రదేశాలతో కలసి ఈ సముద్ర మార్గాలను సురక్షితంగా ఉంచాలి. ఆ పనే భారత్ చేస్తోంది. అయితే, ఇజ్రాయెల్ – గాజా యుద్ధంలో సమదూరం పాటిస్తూ వచ్చిన మనకు తాజా పరిస్థితులు కొత్త బరువ నెత్తిన పెట్టాయి. సోమాలీ సముద్ర దొంగల్ని నిరోధించేందుకు ఈ సరికే గస్తీ సాగిస్తున్న భారత్, ఇకపై వాణిజ్య నౌకల్ని భద్రంగా ఎర్ర సముద్రం దాటించే పని తప్పదు. ఒకవేళ దాడులు సాగితే, అది మరో యుద్ధభేరి అవుతుంది. అందుకే, ఈ సమస్యలన్నిటికీ అసలు పరిష్కారం గాజాలో యుద్ధానికి తెర పడడం, శాంతి నెలకొనడమే! -
ఆగిపోతున్న సరకు రవాణా..!
అంతర్జాతీయ వాణిజ్యానికి జీవనాడి లాంటి సూయెజ్ కాలువలో 2021లో అతిపెద్ద కంటైనర్ నౌకల్లో ఒకటైన ఎవర్ గివెన్ చిక్కుకున్న విషయం తెలిసిందే. జపాన్కు చెందిన షూయీ కిసెన్ కేకే సంస్థకు చెందిన ఈ నౌకను అష్టకష్టాలతో ఎలాగోలా బయటకు తీసుకొచ్చిన ఉదంతం ఉంది. ఈ ఘటన వల్ల ప్రపంచ వాణిజ్యంపై చాలా ప్రభావం పడింది. వేల టన్నుల్లోని సరకు రవాణా నిలిచిపోయింది. అయితే సూయెజ్ కాలువకు ఆనుకుని ఉన్న ఎర్ర సముద్రం ప్రపంచ నౌకా రవాణాకు కీలక మార్గం. ఈజిప్టులోని సూయెజ్ కాలువ మీదుగా ఈ మార్గాన్ని షిప్పింగ్ కంపెనీలు రవాణాకు ఉపయోగించుకుంటాయి. మధ్యదరా సముద్రం మీదుగా రవాణాకు ఇది అత్యంత దగ్గరి మార్గం. ఆఫ్రికా చుట్టూ తిరిగి రాకుండా దక్షిణ, తూర్పు ఆసియాలకు ఇది ఎంతో అనుకూలమైన మార్గం. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం నేపథ్యంలో ఇప్పుడీ మార్గం ప్రమాదంలో పడింది. యెమెన్ కేంద్రంగా హౌతీ రెబల్స్ సరకు రవాణా చేసే నౌకలపై దాడులకు దిగుతుండటంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. హౌతీ దాడులతో షిప్పింగ్ కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. ఆఫ్రికాలోని బిజోటీ పక్కనే ఉన్న బాబ్ ఎల్-మండెబ్ మార్గంలో నౌకల రవాణా నిలిపేయనున్నట్లు ప్రకటించాయి. ఇది 10శాతం అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం చూపనుంది. ఎర్ర సముద్రం మీదుగా 35 శాతం రవాణాను ఆపేశాయి. మార్స్క్, ఎంఎస్సీ, హపాగ్ లాయిడ్ కంపెనీలు ఇప్పటికే రవాణాను నిలిపేశాయి. ప్రపంచ వ్యాప్తంగా వార్షిక షిప్పింగ్ వ్యాపారం 14 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. అది ప్రపంచ జీడీపీలో 16శాతం. అన్ని రవాణా వ్యవస్థల కంటే షిప్పింగ్ చౌకగా ఉంటుంది. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం ప్రారంభమయ్యాక నౌకా రవాణా వ్యయం పెరిగింది. 40 అడుగుల కంటైయినర్ ధర 5 శాతం పెరిగింది. ఏడాదికి 19,000 నౌకలు సూయెజ్ కాలువ మీదుగా ప్రయాణిస్తాయి. దీనివల్ల 30 రోజుల సమయం కలిసి వస్తుంది. అదే ఆఫ్రికా చుట్టూ తిరిగి వస్తే అధిక రవాణా వ్యయంతోపాటు సమయం వృథా అవుతుంది. దాంతోపాటు ప్రధానంగా సముద్ర దొంగల భయం ఎక్కువగా ఉంటుంది. ఆసియా దేశాలు, ఈజిప్టు, ఈశాన్య ఐరోపాకు భారత్ నుంచి నౌకల ద్వారా సరకు రవాణా అవుతోంది. దీనికి ఎర్ర సముద్ర మార్గాన్ని వినియోగించుకుంటోంది. దీంతోపాటు అంతర్జాతీయ నౌకల్లో సిబ్బందిగా భారతీయులే అధికంగా ఉంటారు. మొత్తం సిబ్బందిలో 12 శాతం భారతీయులే. సముద్రపు దొంగల నుంచి ఇప్పటికే వారు ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. తాజాగా యుద్ధం నేపథ్యంలో వారికి హౌతీ రెబల్స్ ప్రమాదకరంగా మారారు. ఎర్ర సముద్రం మీదుగా సుదీర్ఘకాలం సరకు రవాణాకు అంతరాయం కలిగితే ఐరోపాలో ధరలు పెరుగుతాయి. సూయెజ్ కాలువ ద్వారా జరిగే సరకు రవాణాలో చమురు ఐదో వంతు ఉంటుంది. రెండు వైపులా రోజుకు దాదాపు 9 కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా అవుతుంది. దీనికి ఆటంకం కలిగితే 2024లో చమురు ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదీ చదవండి: విమానం కంటే స్పీడ్గా వెళ్లే రైలు.. కథ కంచికే.. హౌతీ తెగకు చెందిన వారి హక్కుల పరిరక్షణ పేరుతో జైదీ షియాలు హౌతీ గ్రూపును ఏర్పాటు చేశారు. పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్ పెత్తనాన్ని ఈ గ్రూపు వ్యతిరేకిస్తుంటుంది. పశ్చిమ యెమెన్ను కేంద్రంగా చేసుకుని ఈ గ్రూప్ తన కార్యకలాపాలు సాగిస్తోంది. ఇరాన్తోపాటు ఈ ప్రాంతంలోని ఇస్లామిక్ గ్రూపులు హౌతీ రెబల్స్కు మద్దతుగా నిలుస్తున్నాయి. ఎర్ర సముద్ర ముఖద్వారంగా ఉన్న బాబ్ ఎల్-మండెబ్పై హౌతీ రెబల్స్కు ఆధిపత్యం ఉంది. ప్రస్తుతం ఈ గ్రూపునకు అబ్దుల్-మాలిక్ అల్ హౌతీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. -
ఎర్రసముద్రంలో అలజడి.. మరో రెండు నౌకలపై డ్రోన్ దాడి
ఎర్రసముద్రంలో మరో రెండు నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేశారు. 25 మంది భారతీయులు ఉన్న ఆయిల్ ట్యాంకర్పై డ్రోన్దాడి చేశారని భారత నౌకాదళం తెలిపింది. అయితే.. ఇండియన్ జెండా లేని నౌకపైనే దాడి జరిగినట్లు స్పష్టం చేసింది. గాబన్ జెండాతో ప్రయాణిస్తున్న నౌకపై దాడి చేశారని వెల్లడించింది. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని పేర్కొంది. మరోవైపు నార్వేజియన్ జెండా కలిగిన మరో ఆయిల్ ట్యాంకర్పై కూడా హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేశారు. అయితే.. భారత జెండా కలిగిన నౌకపై హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేశారని అమెరికా ఇంటెలిజెన్స్ పొరపాటున ఇంతకుముందు తెలిపింది. కానీ అలాంటిదేమీ లేదని తర్వాత భారత నౌకాదళం తెలిపింది. ఆయిల్ ట్యాంకర్ ఎంవీ సాయిబాబాపై దాడి జరిగినట్లు స్పష్టం చేసింది. మరోవైపు నార్వేజియన్ జెండా కలిగిన మరో ఆయిల్ ట్యాంకర్పై కూడా హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేశారు. అలాగే, అమెరికా యుద్ధ నౌక యూఎస్ఎస్ లబూన్ పై కూడా డ్రోన్ దాడులకు ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆ డ్రోన్ల్ను యుద్ధనౌక కూల్చివేసిందని అమెరికా సెంట్కామ్ వెల్లడించింది. ఈ ఘటనల తర్వాత అక్టోబర్ 17 తర్వాత వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల సంఖ్య 15కు చేరినట్లు పేర్కొంది. ఓవైపు గుజరాత్ సమీపంలో ఇజ్రాయెల్కు చెందిన నౌకపై ఇరాన్ దాడి చేసినట్లు అమెరికా పేర్కొంది. ఈ ఘటనతో అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యెమెన్లో కేంద్రీకృతమైన ఇరాన్ మద్దతుగల హౌతీలు.. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధానికి ప్రతిస్పందనగా ఎర్ర సముద్రంలో దాడులకు పాల్పడుతున్నారు. బాబ్ అల్-మందాబ్ జలసంధి గుండా వెళుతున్న నౌకలపై దాడులతో అంతర్జాతీయ వాణిజ్యానికి అంతరాయం కలిగిస్తున్నారు. ఇదీ చదవండి: డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే.. -
Huthi Attacks: ఇరాన్పై అమెరికా సంచలన ఆరోపణలు
వాషింగ్టన్:ఇరాన్పై అమెరికా మళ్లీ కన్నెర్ర చేసింది. ఆ దేశంపై సంచలన ఆరోపణలు చేసింది. ఎర్రసముద్రంలో వాణజ్య నౌకల మీద హౌతీ మిలిటెంట్ల దాడి వెనుక ఇరాన్ హస్తం ఉందన్న విషయం స్పష్టమవుతోందని ఆరోపించింది. నౌకల మీద దాడి చేసేందుకుగాను హౌతీ తిరుగుబాటుదారులకు అవసరమైన డ్రోన్లు, మిసైళ్లు, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఇరాన్ అందిస్తోందని అమెరికా తెలిపింది. ‘ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల మీద జరుగుతున్న దాడి వెనుక ఇరాన్ ప్రముఖ పాత్ర వహిస్తోందని మాకు తెలుసు. అక్కడ అనిశ్చితి రేపేందుకు ఇరాన్ ఎప్పటినుంచో హౌతీ రెబెల్స్కు సహకరిస్తోంది. స్పష్టమైన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా ఈ ఆరోపణలు చేస్తున్నాం’ అని అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి అడ్రియెన్ వాట్సన్ మీడియాకు తెలిపారు. పాలస్తీనాకు మద్దతుగా యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ఎర్రసముద్రంలోని కీలక షిప్పింగ్ లైన్స్లో ప్రయాణిస్తున్న అమెరికాకు చెందిన వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. నౌకలపై హౌతీ దాడులను అడ్డుకునేందుకుగాను 10 దేశాలతో కలిసి అమెరికా ఇటీవలే ఒక కూటమిని ఏర్పాటు చేసింది. ఇదీచదవండి..విన్ డీజిల్పై లైంగిక వేధింపుల కేసు -
వ్యవసాయ ఎగుమతులకు ఆంక్షల దెబ్బ
న్యూఢిల్లీ: గోధుమలు, బాస్మతియేతర బియ్యం, చక్కెర ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించిన నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వ్యవసాయ ఎగుమతులపై 4–5 బిలియన్ డాలర్ల మేర ప్రతికూల ప్రభావం పడొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. అయితే, బాస్మతి, పండ్లు..కూరగాయలు, మాంసం..డెయిరీ మొదలైన వాటి ఎగుమతులు పెరుగుతుండటంతో కనీసం గత ఆర్థిక సంవత్సరం స్థాయినైనా నిలబెట్టుకోగలమని ప్రభుత్వం ఆశిస్తోంది. కానీ, ఎర్ర సముద్రంలో హౌతీ రెబెల్స్ దాడుల కారణంగా బాస్మతి బియ్యం ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఒకవేళ యూరోపియన్ యూనియన్, ఆఫ్రికా మార్కెట్లకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సి వస్తే వ్యయాల భారం 15–20 శాతం మేర పెరగొచ్చని సంబంధిత వర్గాలు తెలి పాయి. ‘‘పరిమితుల వల్ల వ్యవసాయ ఎగుమ తులపై 4–5 బిలియన్ డాలర్ల మేర ప్రభావం పడినా, మొత్తం మీద చూస్తే ఎగుమతులు గతేడాది స్థాయి లో ఉండొచ్చని అంచనా వేస్తున్నాం’’ అని పేర్కొన్నాయి. 2022–23లో వ్యవసాయ ఎగుమతులు 53.15 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. బాస్మతి టాప్.. భారత్ నుంచి ఎగుమతయ్యే వ్యవసాయోత్పత్తుల్లో బాస్మతి బియ్యం అగ్రస్థానంలో ఉంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ వరకు ఈ ప్రీమియం వెరైటీ ఎగుమతులు 3 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో బాస్మతి బియ్యం ఎగుమతులు 15–20 శాతం అధికంగా ఉండొచ్చని ప్రభు త్వం అంచనా వేస్తోంది. మరోవైపు, ఎర్ర సముద్రంలో హౌతీ రెబెల్స్ దాడుల కారణంగా బాస్మతి ఎగుమతులపై ఆందోళన నెలకొంది. దీంతో ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న రిసు్కలపై చర్చించేందుకు కేంద్ర వాణిజ్య శాఖ విభాగం వారితో సమావేశమైంది. ఇప్పటివరకైతే దాడులపరంగా ఎలాంటి ప్రభావమూ లేదని, ఒకవేళ రిసు్కలు అలాగే కొనసాగిన పక్షంలో యూరోపియన్ యూనియన్, ఆఫ్రికా మార్కెట్లకు చేరుకోవడానికి వారు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేíÙంచాల్సి వస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘‘దీనితో వారి వ్యయాలు 15– 20% పెరగవచ్చు. అది ధరల్లోనూ ప్రతిఫలించే అవకాశం ఉంది’’ అని వివరించాయి. బాస్మతి బియ్యం ప్రీమియం ఉత్పత్తి కావడంతో ధర కొంత పెరిగినా డిమాండ్లో మార్పేమి ఉండకపోవచ్చని తెలిపాయి. -
Red Sea Film Festival 2023: కత్రినా కైఫ్.. అద్బుతమైన ఫోటోలు
-
ఎర్ర సముద్రంలో అమెరికా యుద్ధ నౌకపై దాడి
దుబాయ్: ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న తమ యుద్ధ నౌక యూఎస్ఎస్ కార్నీ సహా పలు వాణిజ్య నౌకలపై ఆదివారం దాడులు జరిగినట్లు అమెరికా పేర్కొంది. దాడికి కారణమెవరనే విషయం పెంటగాన్ తెలపలేదు. ఉదయం 10 గంటల సమయంలో యెమెన్ రాజధాని సనాలో మొదలైన ఈ దాడులు సుమారు 5 గంటలపాటు కొనసాగినట్లు ఓ అధికారి చెప్పారు. ఎర్ర సముద్రంలో అనుమానాస్పద డ్రోన్ దాడి, పేలుళ్లు సంభవించినట్లు అంతకుముందు బ్రిటిష్ మిలటరీ తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణించే ఓడలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ మద్దతున్న యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు ఇటీవలి కాలంలో దాడులకు తెగబడుతున్నారు. తాజా ఘటనలపై హౌతీలు స్పందించలేదు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం వేళ మధ్యప్రాచ్యంలో ఈ దాడులు ఆ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలకు అద్దం పడుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. -
భారత్కు రావాల్సిన కార్గో షిప్ హైజాక్!
టెల్ అవీవ్: తుర్కియే నుంచి భారత్ రావాల్సిన కార్గో షిప్ ఎర్ర సముద్రంలో హైజాక్కు గురైంది. యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు ఈ ఘటనకు పాల్పడ్డారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇరాన్ ఆధారిత ఉగ్రవాదంగా పేర్కొన్న ఇజ్రాయెల్.. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత తీవ్ర పరిణామాలకు దారితీసే చర్యగా తెలిపింది. వివిధ దేశాలకు చెందిన 25 మంది సిబ్బంది కూడా ఓడలో ఉన్నారని వెల్లడించింది. బ్రిటీష్ యాజమాన్యంలోని జపాన్ నిర్వహిస్తున్న కార్గో షిప్ను హౌతీ తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. షిప్లో ఇజ్రాయెల్ పౌరులెవ్వరూ లేరని స్పష్టం చేశారు. ఇది ఇరాన్ ఆధారిత ఉగ్రవాదంగా పేర్కొన్న నెతన్యాహు.. అంతర్జాతీయ స్వేచ్ఛకు వ్యతిరేకంగా ఇరాన్ చర్యలను ఆయన ఎండగట్టారు. The hijacking of a cargo ship by the Houthis near Yemen in the southern Red Sea is a very grave incident of global consequence. The ship departed Turkey on its way to India, staffed by civilians of various nationalities, not including Israelis. It is not an Israeli ship. — Israel Defense Forces (@IDF) November 19, 2023 షిప్ హైజాక్కు బాధ్యత వహిస్తున్నట్లు హౌతీ ఉగ్రవాదులు స్పష్టం చేశారు. ఇజ్రాయెల్కు చెందిన ఓటను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. షిప్ను యెమెన్ పోర్టుకు తీసుకువచ్చినట్లు చెప్పారు. దీనిని ఇజ్రాయెల్ ఖండించింది. అది తమ ఓడ కాదని వెల్లడించింది. బ్రిటీష్ యాజమాన్యంలోని ఓడగా స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆ ఓడ జపాన్ నిర్వహణలో ఉందని వెల్లడించింది. అందులో ఉన్న 25 మంది సిబ్బంది ఉక్రెయిన్, బల్గేరియా, ఫిలిప్పీన్స్, మెక్సికోకు చెందినవారని పేర్కొంది. ఇజ్రాయెల్పై దాడులను ఉదృతం చేస్తామని హౌతీ తిరుగుబాటుదారులు గతవారం ప్రకటించారు. ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ ఆధారిత ఓడలన్నింటిని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ఇజ్రాయెల్ జెండాలు కలిగిన షిప్లను హైజాక్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఇజ్రాయెల్ ఓడల్లో ఇతర పౌరులు పనిచేయకూడదని కూడా హౌతీ హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. హమాస్ అంతమే ధ్యేయంగా పాలస్తీనాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. అయితే.. పాలస్తీనాకు మద్దతుగా ఇరాన్ ఆధారిత హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్పై దాడులకు పాల్పడుతున్నారు. ఇదీ చదవండి: Napoleon Bonaparte: రికార్డు ధరకు నెపోలియన్ టోపీ -
దుబాయ్లో అదరిపోయే సూపర్ లగ్జరీ రిసార్ట్, మతిపోయే ఫీచర్లు, ఫోటోలు
-
నీటిలోని చేపను నీరే కబళిస్తే?.. దీని వెనకున్న మిస్టరీ ఏంటి!
చిన్న చేపను పెద్ద చేప.. పెద్ద చేపను సొర చేప మింగడం కామనే.. కానీ నీటిలోని చేపను నీరే కబళిస్తే? చేపలు సహా అక్కడి జలచరాలనే ‘మింగేస్తే’? విచిత్రంగా అనిపిస్తున్నా ఇది నిజమేనని శాస్త్రవేత్తలు తాజాగా నిర్ధారించారు. దీని వెనకున్న మిస్టరీని బయటపెట్టారు. అదేమిటంటే... ఈజిప్ట్, సౌదీ అరేబియా మధ్యన ఉన్న ఎర్ర సముద్రానికి ఉత్తరాన ఉన్న గల్ఫ్ ఆఫ్ అకాబాలో శాస్త్రవేత్తలు అరుదైన ‘డెత్ పూల్’ను గుర్తించారు. యూనివర్సిటీ ఆఫ్ మయామీకి చెందిన పలువురు శాస్త్రవేత్తలు రిమోట్ ద్వారా నడిచే అండర్వాటర్ వెహికల్ ద్వారా సముద్ర గర్భాన్ని పరిశీలించే క్రమంలో 1,770 మీటర్ల లోతున దీన్ని కనుగొన్నారు. సుమారు 100 అడుగుల పొడవున ఈ మడుగు ఉంది. సాంకేతికంగా బ్రైన్పూల్స్ అని పిలిచే ఈ నీటిలో లవణత అత్యంత ఎక్కువగా ఉంటుందని, ఫలితంగా అందులో ఆక్సిజన్ శాతం ఏమాత్రం ఉండదని పేర్కొన్నారు. చదవండి: ఆ చేప చిక్కడమే విషాదం ... హఠాత్తుగా మీదకు దూకి... అందువల్ల చేపలు సహా మరే జలచరాలైనా ఈ మడుగులోకి ప్రవేశించగానే మరణిస్తాయని శాస్త్రవేత్తల బృందానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ శామ్ పుర్కిస్ తెలిపారు. కానీ విచిత్రంగా ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ సూక్ష్మజీవులు ఈ మడుగులో జీవిస్తున్నాయని... ఈ నీటిలోకి వచ్చి మరణించే జలచరాలను ఆహారంగా తీసుకుంటున్నాయని వివరించారు. భూమిపై లక్షల ఏళ్ల కిందట సముద్రాలు ఎలా ఏర్పడ్డాయనే విషయంలో చేపట్టబోయే భావి పరిశోధనలకు తాజా పరిణామం దోహదపడుతుందని చెప్పారు. భూమిపై జీవం మనుగడకు ఉన్న పరిమితులు ఏమిటో అర్థం చేసుకోనిదే ఇతర గ్రహాలపై జీవం ఉనికిని అంచనా వేయడం కష్టమని అభిప్రాయపడ్డారు. ఈ పరిశోధన వివరాలను ప్రముఖ జర్నల్ ‘నేచర్’ ప్రచురించింది. -
హౌతీ రెబల్స్ చెరలో ఎమిరేట్స్ నౌక
దుబాయ్: తమకు మద్దతిచ్చిన ఇరాన్ సైనిక జనరల్ ఖాసిమ్ సులేమానీని అమెరికా హతమార్చినందుకు ఆగ్రహంగా ఉన్న యెమెన్ హౌతీ రెబల్స్ ఎర్ర సముద్రంలో కలకలం రేపారు. ఎర్ర సముద్రం మీదుగా వెళ్తున్న యూఏఈకి చెందిన వాణిజ్య నౌకను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. అంతర్జాతీయ వాణిజ్య, ఇంధన సరకు నౌకల రాకపోకలకు కీలకమైన మార్గంలో ‘వాబీ’ షిప్ను సోమవారం సీజ్ చేసి హౌతీ రెబల్స్ ఉద్రిక్తత పెంచారు. మరోవైపు, ఇజ్రాయెల్కు చెందిన వార్తా పత్రిక ‘జెరూసలేం పోస్ట్’కు చెందిన వెబ్సైట్ హ్యాకింగ్కు గురైంది. -
చచ్చేదాకా బతికేస్తాయి.. వీటి వయసు వందలు, వేల ఏళ్లు!
భూమ్మీద ప్రతి జీవికి ఏదో ఒక సమయంలో మరణం తప్పదు. ముసలితనం వచ్చేసి, శరీరం ఉడిగిపోయి చనిపోవడమో... ఏదో ప్రమాదం, రోగం వంటి కారణాలతో అర్ధాంతరంగా ప్రాణాలు పోవడమో జరగొచ్చు. ఇందులో ప్రమాదం, రోగాలు వంటివేవీ లేకుండా.. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఒక జీవి ఎంతకాలం బతకగలుగుతుందన్న దానిని దాని ఆయుష్షుగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు మనుషుల ఆయుష్షు గరిష్టంగా 130–150 సంవత్సరాలు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంతకుమించి బతికారనిగానీ, బతుకుతారని గానీ చెప్పేందుకు ఆధారాల్లేవు. తాబేళ్లు వంటి జీవులు 250 ఏళ్ల వరకు జీవిస్తాయని గుర్తించారు. కానీ ఎలాంటి ప్రమాదం, రోగాలు వంటివి లేకుంటే.. చావు అనేదే లేకుండా వేలకు వేల ఏళ్లు బతికుండే జీవులు ఉన్నాయి. – సాక్షి సెంట్రల్ డెస్క్ పెద్ద జీవి.. మళ్లీ పిండంగా మారి.. ఇది సముద్రంలో జీవించి ‘టుర్రిటోప్సిస్ డోహ్రిని’ రకం జెల్లీఫిష్. ఉండేది అర సెంటీమీటరే. పారదర్శక శరీరం, సన్నగా వెంట్రుకల్లా ఉండే టెంటకిల్స్తో అందంగా కనిపిస్తాయి. అయితే ఈ రకం జెల్లీఫిష్లకు వయసు పెరగడం అంటూ ఉండదని, సహజంగా వీటికి చావు లేనట్టేనని అమెరికన్ శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు. సాధారణంగా ఏ ప్రాణి అయినా దశలు దశలుగా ఎదుగుతూ పూర్తిస్థాయి జీవిగా మారుతుంది. కానీ ఈ జెల్లీఫిష్ ఏదైనా గాయం కావడమో, ఇంకేదైనా సమస్య రావడమో జరిగితే.. తిరిగి పూర్వరూపమైన ‘పాలిప్స్’గా (ఉదాహరణకు పిండం అనుకోవచ్చు) మారిపోతుంది. తర్వాత మళ్లీ జెల్లీఫిష్గా ఉత్పత్తి అయి ఎదుగుతుంది. ఎప్పటికీ ఇలా జరుగుతూనే ఉంటుందని, సాంకేతికంగా దానికి సహజ మరణం లేనట్టేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ చేపలో, ఇతర సముద్ర జీవులో వీటిని గుటుక్కుమని మింగేస్తాయి. మరో చిత్రమైన విషయం ఏమిటంటే.. ఈ జెల్లీఫిష్లకు మెదడు, గుండె ఉండవట. ప్రతి కణం.. ఎప్పటికప్పుడు రిఫ్రెష్ ఈ ఫొటోలో కనిపిస్తున్న మరో సముద్ర జీవి పేరు హైడ్రా. ఒక సెంటీమీటర్ వరకు పెరుగుతుంది. చూడటానికి జెల్లీఫిష్లా కనిపించే ఈ జీవి కూడా దాదాపు చావులేనిదే. దీని శరీరం చాలా వరకు మూలకణాలు (స్టెమ్సెల్స్)తో నిర్మితమై ఉంటుందట. మూలకణాలకు శరీరంలో ఏ అవయవంగా, ఏ కణాజాలంగా అయినా మారే సామర్థ్యం ఉంటుంది. దనివల్ల హైడ్రాకు గాయాలైనా, ఏ భాగం దెబ్బతిన్నా తిరిగి పునరుత్పత్తి అవుతాయి. అందువల్ల ఈ జీవులకు వృద్ధాప్య ఛాయలే కనబడవు. కానీ చేపలు, ఇతర సముద్ర జీవుల తినేయడం, రోగాలు వంటివాటితో హైడ్రాల పని ముగిసిపోతుంది. మానవ పిండం కూడా తొలిదశలో మూలకణాల సమాహారమే. ఆ కణాలే విభజన చెందుతూ.. వివిధ అవయవాలు, ఎముకలు, కండరాలుగా మారుతాయి. పూర్తిస్థాయి మనుషుల్లో ఎముక మజ్జలో మాత్రమే మూలకణాలు ఉంటాయి. వాటిని వివిధ అవయవాలుగా అభివృద్ధి చేసే దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు కూడా చేస్తున్నారు. వీటి వయసు వందలు, వేల ఏళ్లు.. ఇవి అంటార్కిటికా మహాసముద్రం అడుగున జీవించే ‘గ్లాస్ స్పాంజ్’లు. అత్యంత శీతల పరిస్థితుల్లో, అత్యంత మెల్లగా పెరిగే ఈ జీవులు 10–15 వేల ఏళ్లపాటు జీవిస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి నార్త్ అట్లాంటిక్ సముద్రంలో ఉండే ‘ఓసియన్ క్వాహోగ్’ రకం ఆల్చిప్పలు. అమెరికా నేషనల్ మ్యూజియం శాస్త్రవేత్తలు 2006లో ఈ రకం ఆల్చిప్పపై పరిశోధన చేసి.. దాని వయసు 507 ఏళ్లు అని గుర్తించారు. 1499వ సంవత్సరంలో అది పుట్టి ఉంటుందని అంచనా వేశారు. ఇది గ్రీన్ల్యాండ్ షార్క్. ఆర్కిటిక్, అట్లాంటిక్ మహాసముద్రాల్లోని లోతైన ప్రాంతాల్లో జీవిస్తుంది. ఎనిమిది మీటర్ల పొడవు పెరిగే ఈ షార్క్లు 250 ఏళ్లకుపైనే జీవిస్తాయని తొలుత భావించేవారు. అయితే 2016లో వలకు చిక్కిన ఓ గ్రీన్ల్యాండ్ షార్క్ను పరిశీలించిన శాస్త్రవేత్తలు.. దాని వయసు 392 ఏళ్లు అని తేల్చారు. తాబేళ్లు.. లెక్క తక్కువే.. మనకు స్కూళ్లు, కాలేజీల్లో పాఠాల్లో, ఇతర పుస్తకాల్లో.. భూమ్మీద ఎక్కువకాలం బతికే జంతువు తాబేలు అని చెప్తుంటారు. రెండు వందల ఏళ్లకుపైగా జీవిస్తాయని అంటుంటారు. కానీ వాస్తవంగా.. ఎక్కువకాలం బతికే జీవుల్లో తాబేలు ఓ లెక్కలోకే రాదని శాస్త్రవేత్తలు తేల్చారు. తాబేళ్లలో అన్నింటికన్నా జియాంట్ గలపాగోస్ రకం తాబేళ్లు ఎక్కువ కాలం బతుకుతాయి. వీటిలో ఇప్పటివరకు అధికారికంగా గుర్తించిన అత్యధిక వయసు 192 ఏళ్లు మాత్రమే. అయితే ఈ తాబేళ్లు ఎలాంటి ఆహారం, నీళ్లు లేకున్నా ఏడాదిపాటు బతకగలవని.. వాటి శరీరంలో ఈ మేరకు నిల్వ ఏర్పాట్లు ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎరుపు, తెలుపు రంగులతో పెయింట్ వేసినట్టు అందంగా ఉండే చేపలు కొయి కార్ప్స్. అక్వేరియంలలో పెంచుకునే ఈ చేపలు సాధారణంగా 40 ఏళ్లు జీవిస్తాయని చెప్తారు. కానీ 1977లో జపాన్ తీరంలో పట్టుకున్న ఒక కొయికార్ప్స్పై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు దాని వయసు 226 ఏళ్లు అని గుర్తించారు. గుండ్రంగా ఉండి, శరీరం చుట్టూ ముళ్లలాంటి నిర్మాణాలు ఉండే సముద్ర జీవి ‘రెడ్సీ ఉర్చిన్’. పసిఫిక్ మహాసముద్రంలో బతికే ఇవి కనీసం 200 ఏళ్లపాటు బతుకుతాయట. తొండలా ఉండే ఈ జీవి పేరు ‘ట్వటరా’. న్యూజిలాండ్లో మాత్రమే కనిపించే ఇవి. వందేళ్ల వరకు బతుకుతాయని శాస్త్రవేత్తలు తేల్చారు. చిత్రమైన విషయం ఏమిటంటే.. వీటికి తలపై మధ్యభాగంలో మూడో కన్ను ఉంటుంది. వృద్ధాప్యం ఎందుకొస్తుంది? జీవుల కణాల్లోని క్రోమోజోమ్లపై జన్యువులు, క్రోమోజోమ్ల అంచుల్లో సన్నని పోగుల్లాంటి టెలోమెర్లు ఉంటాయి. మన వయసు పెరిగిన కొద్దీ, శరీర కణాలు విభజన చెందినకొద్దీ జన్యుపదార్థం దెబ్బతినడం, టెలోమెర్ల పరిమాణం తగ్గిపోవడం జరుగుతూ ఉంటాయి. ఒకస్థాయి దాటిన తర్వాత కణాలకు పునరుత్పత్తి చెందే సామర్థ్యం తగ్గిపోతుంది. దీనితో శరీరం, అవయవాలు బలహీనమై వృద్ధాప్యం వస్తుంది. ఇది సహజ మరణానికి దారితీస్తుంది. ఆయా జీవుల్లో జన్యువుల సామర్థ్యం, ఇతర అంశాల ఆధారంగా వాటి ఆయుష్షు ఆధారపడి ఉంటుంది. ఎక్కువ కాలం బతకడానికి కారణాలేమిటి? ►వయసు పెరిగినకొద్దీ జన్యుపదార్థం దెబ్బతింటున్నా.. దానిని తిరిగి మరమ్మతు చేసుకునే సామర్థ్యం కొన్నిరకాల జీవుల్లో ఉంటుంది. వాటిలోని కొన్ని ప్రత్యేకమైన జన్యువులే దీనికి తోడ్పడుతుంటాయి. ►కొన్ని ప్రాణులు అవి జీవించే వాతావరణానికి తగినట్టుగా శరీరంలో మార్పులు చేసుకుంటాయి. కణాజాలాలను పునరుత్పత్తి చేసుకుంటాయి. ఈ క్రమంలో వాటి జీవితకాలం పెరుగుతుంటుంది. ►కొన్నిరకాల షార్కులు, ఎండ్రకాయలు, ఇతర జంతువుల్లో ‘టెలోమెరేస్’ అనే ప్రత్యేకమై ప్రొటీన్ విడుదలవుతుంది. అది కణాల్లో టెలోమెర్లు పొడవు పెరగడానికి తోడ్పడి.. వాటి జీవితకాలం పెరుగుతుంది. ►అత్యంత మెల్లగా ఎదిగే జీవుల్లో చాలా వరకు ఎక్కువకాలం బతుకుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటిల్లో తరచూ కణాల విభజన జరగాల్సిన అవసరం లేకపోవడమే దానికి కారణమని చెప్తున్నారు. -
ఎర్ర సముద్రంలో ఇరాన్ నౌకపై దాడి
దుబాయ్: ఎర్ర సముద్రంలోని యెమెన్ తీరం వద్ద లంగరేసి ఉన్న ఇరాన్ రివల్యూషనరీ గార్డ్కు చెందిన ఓ నౌకపై మంగళవారం దాడి జరిగింది. ప్రభుత్వ ఆధీనంలోని ఇరాన్ షిప్పింగ్ లైన్స్కు ఎంవీ సవిజ్ అనే నౌకపై దాడి జరిగినట్లు ధ్రువీకరించిన ఇరాన్.. ఇందుకు ఇజ్రాయెల్పైనే అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ ఘటనలో ప్రాణనష్టం సంభవించ లేదని కూడా వెల్లడించింది. ఈ నౌకపై దాడికి పాల్పడినట్లు ఇజ్రాయెల్ తమకు సమాచారం అందించినట్లు అమెరికా ఉన్నతాధికారి ఒకరు తమకు తెలిపినట్లు న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో వెల్లడించింది. ఎంవీ సవిజ్ వాణిజ్య నౌక అని చెబుతున్నప్పటికీ దీనిద్వారా యెమెన్లోని హౌతి తిరుగుబాటుదారులకు ఇరాన్ ఆయుదాలు సరఫరా చేస్తోందని సౌదీ అరేబియా ఆరోపిస్తోంది. ఇరాన్ నౌకపై దాడిపై స్పందించేందుకు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి బెన్నీ గంట్జ్ నిరాకరించారు. ఇరాన్తోపాటు ఇరాన్ మిత్రదేశాలు తమ భద్రతకు ప్రమాదకారులని, ఇటువంటి వాటి నుంచి స్వీయ రక్షణకు చర్యలు తీసుకుంటుందని వ్యాఖ్యానిం చారు. సవిజ్ నౌక వెలుపల అమర్చిన లింపెట్ మందుపాతరతోనే పేలుడు సంభవించిందని ప్రభుత్వ అనుకూల తస్నిమ్ వార్తా సంస్థ తెలిపింది. దీంతో నౌకకు భారీ నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. చదవండి: తెలివైన జింకలు.. రౌండప్ చేశాయంటే కష్టమే! -
‘ఎవర్ గివెన్’ చెప్పే గుణపాఠం
చరిత్రలో ఎన్నో ఉత్కంఠభరిత ఘట్టాలకు మౌన సాక్షిగా వున్న సూయిజ్ కెనాల్ మరోసారి వార్తల్లో కెక్కింది. మంగళవారం వేకువజామున హఠాత్తుగా విరుచుకుపడిన ఇసుక తుపానులో సరుకులతో వెళ్తున్న భారీ నౌక ‘ఎవర్ గివెన్’ చిక్కుకుంది. గత రెండురోజులుగా ఆ నౌక అంగుళం కూడా అటూ ఇటూ కదులుతున్న జాడ లేదు. పర్యవసానంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరువంటి మహా నగరాల్లో మనం తరచుగా చూసే నరకప్రాయమైన ట్రాఫిక్ జామ్లను తలదన్నే రీతిలో ఇప్పుడు సూయిజ్ కెనాల్ వుంది. ‘ఎవర్ గివెన్’ మొరాయించిన సమయానికి కెనాల్లో ప్రవేశించివున్న దాదాపు 200 నౌకలు చిక్కుకుపోయాయి. ఎర్ర సముద్రాన్నీ, మధ్యధరా సముద్రాన్ని అనుసంధానించి తూర్పు, పడమరలను ఏకం చేసి, ఖండాంతర వాణిజ్యంతో ఎవరూ అందుకోలేనంత ఎత్తులో వుండాలని కలగని 1859లో ఈ కాలువ నిర్మాణానికి శ్రీకారంచుట్టారు. వాస్తవానికి ఇది అప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన ఆలోచన కాదు. ప్రాచీన ఈజిప్టు రాచరిక వ్యవస్థలు క్రీస్తుపూర్వమే దీన్ని కలగన్నాయి. నెపోలియన్ సైతం ఈ కెనాల్ నిర్మిస్తే బ్రిటన్ని దారికి తేవొచ్చని, దానిపై పైచేయి సాధించవచ్చని ఆలోచించాడు. కానీ చివరకు ఫ్రాన్స్ ఏలుబడిలోని ఈజిప్టుకే కాలం కలిసొచ్చింది. ఒక ఫ్రాన్స్ దౌత్యవేత్త చొరవతో ఏర్పాటైన కంపెనీ 99 ఏళ్ల లీజు ప్రాతిపదికన దాదాపు 194 కిలోమీటర్ల పొడవైన ఈ కాలువను నిర్మించింది. దీనివల్ల కలిగే లాభాన్ని గుర్తించి బ్రిటన్ ఇందులో 40 శాతం వాటాను పోరుపెట్టి సాధించుకుంది. ప్రపంచంలో ఇంకా పనామా కెనాల్, వోల్గా డాన్ కెనాల్, గ్రాండ్ కెనాల్ వంటివి వున్నాయి. కానీ సూయిజ్ ప్రధాన సముద్ర మార్గాలను అనుసంధానించే మెరుగైన కెనాల్. పర్యావరణవేత్తలు కావొచ్చు, నౌకాయాన రంగ నిపుణులు కావొచ్చు... రాకాసి నౌకా నిర్మాణం జోలికిపోవద్దని చాన్నాళ్లుగా వేడుకుంటున్నారు. అనుకోని ప్రమాదాలు ఎదురైతే భారీ నౌకలతో చేటు తప్పదని ప్రాణ నష్టంతోపాటు సముద్ర జలాలు కాలుష్యమయమై పర్యావరణానికి హాని కలుగుతుందని చెబుతున్నారు. కానీ పెద్ద మొత్తంలో సరుకు పంపిణీ చేయటానికి, భారీగా ఆదాయం రాబట్టడానికి భారీ నౌకలే మేలని కంపెనీలు భావిస్తున్నాయి. అందుకే వారి హెచ్చ రికలను ఎవరూ పట్టించుకుంటున్న దాఖలా లేదు. ఇప్పుడు ‘ఎవర్ గివెన్’ అడ్డం తిరిగిన వైనం వారి హితవచనాలను మరోసారి గుర్తుకుతెస్తోంది. 2,20,000 టన్నుల సరుకును మోసుకుపోగల సామర్థ్యం దానికుంది. అయితే ఆ నౌక పూర్తిగా కుంగిపోయే స్థితి ఏర్పడకపోవటం ఒక రకంగా అదృష్టమే. ప్రపంచ వాణిజ్యం గత రెండున్నర దశాబ్దాల్లో వందల రెట్లు విస్తరించింది. ఒకప్పుడు ఆహారం, సరుకులు, చమురు, ఖనిజాలు వంటివే ప్రధానంగా రవాణా కాగా, ఇంటర్నెట్ అందు బాటులోకి రావటంతో విశ్వవ్యాప్త వస్తు సేవలు విపరీతంగా పెరిగాయి. విమానయానం ఎంత వేగంతో కూడినదైనా, విమానాల ద్వారా సరుకు రవాణా ఎంతగా విస్తరించినా వాణిజ్యంలో ఈనాటికీ 90 శాతం వాటా సముద్ర మార్గాలదే. ఇందులో సూయిజ్ కెనాల్ ద్వారా సాగే వాణిజ్యం దాదాపు 15 శాతం. పశ్చిమాసియా నుంచి యూరప్, అమెరికాలకు... రష్యా నుంచి ఆసియా దేశాలకు ముడి చమురు రవాణా సాగుతున్నదీ ఇటునుంచే. అందుకే ఈ దిగ్బంధం సాధ్యమైనంత త్వరగా పరిష్కారం కాకపోతే ప్రపంచవ్యాప్తంగా సరుకు పంపిణీలో అస్తవ్యస్థ పరిస్థితులు తలెత్తవచ్చన్న ఆందోళన వుంది. ఆసియా, ఆఫ్రికా ఖండాలను విడదీసే ఈ కెనాల్... యూరప్కు రాకపోకలు సాగించే నౌకలు దక్షిణ అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల మీదుగా వెళ్లాల్సిన అవసరం లేకుండా చేస్తోంది. అందువల్ల దాదాపు ఏడువేల కిలోమీటర్ల దూరం తగ్గుతోంది. వారం రోజుల సమయాన్ని ఆదా చేస్తోంది. రోజూ సగటున 50 నౌకలకు వరకూ ప్రయాణించే సూయిజ్ కాల్వ ఈజిప్టు ఖజానాకు డాలర్ల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం ఆ దేశం ఏటా దాదాపు 1,500 కోట్ల డాలర్ల ఆదాయాన్ని పొందుతోంది. సూయిజ్ కెనాల్ను మరింత విస్తరించటానికి ఆ దేశం ఇప్పటికే పనులు ప్రారంభించింది. అదంతా మరో రెండేళ్లలో పూర్తయితే ఈజిప్టు ఆదాయం మూడింతలు పెరుగుతుంది. అంతర్జాతీయ నావికా సంస్థ(ఐఎంఓ) విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం నౌకాయానం వల్ల ఏటా వాతావరణంలోకి వేయి మెట్రిక్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతోంది. ఇది ప్రపంచ వార్షిక ఉద్గారాల్లో 3.1 శాతం. 2050నాటికి ఉద్గారాలను కనీసం 50 శాతం తగ్గించుకోవాలని ఐఎంఓ కోరుతోంది. భారీ నౌకల వల్ల పొంచివుండే ఇతరత్రా ప్రమాదాల సంగతలావుంచి వాటి ఇంధన సామర్థ్యం తక్కువని ఐఎంఓ చెబుతోంది. కనీసం కొత్త సాంకేతికతలను పెంచుకుని, మెరుగైన డిజైన్లతో నౌకల్ని నిర్మిస్తే, వాటి వేగాన్ని నియంత్రణలోవుంచితే కర్బన ఉద్గారాల బెడదను గణనీయంగా తగ్గించుకోవచ్చన్నది దాని సూచన. నౌకల వేగాన్ని సగటున పదిశాతం తగ్గిస్తే కర్బన ఉద్గారాలను నియంత్రించటం వీలవుతుందని సూచిస్తోంది. నౌకల వేగంపై నిరంతరం నిఘా వుంచుతూ అవి ఎక్కడ సంచరిస్తున్నాయో, వాటి వేగం, దిశ ఎలావున్నాయో తెలుసుకునే సాంకే తికతలు అందుబాటులోకొచ్చాయి. వాటిని అమర్చుకోవటాన్ని తప్పనిసరి కూడా చేశారు. 150 ఏళ్లక్రితం అందుబాటులోకొచ్చి, ప్రపంచ వాణిజ్యంలో కీలకపాత్ర పోషించే సూయిజ్ కెనాల్లో చోటుచేసుకున్న తాజా ఉదంతం నౌకా యానంలో ఇమిడివుండే సమస్యలను మరోసారి అందరి దృష్టికీ తెచ్చింది. -
సూయజ్ కాలువ బంద్.. ఇంధన ధరలు పెరుగుతాయా!
కైరో: ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే సముద్ర వాణిజ్య మార్గాలలో సూయజ్ కాలువ ఒకటి. ఎర్ర సముద్రాన్ని, మధ్యధరా సముద్రాన్ని కలుపుతూ ఈజిప్ట్ భూ భాగంలో సుయాజ్ కాలువను నిర్మించిన విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుతం కొద్దిరోజులపాటు ఈ మార్గం గుండా రాకపోకలు నిలిచిపోనున్నాయి. దీనికి కారణం, మంగళవారం కాలువలో ఒక భారీ షిప్ చిక్కుకుంది. 400 మీటర్ల పొడవు.. 59 మీటర్ల వెడల్పు ఉన్న ఎవర్ గ్రీన్ కంపెనీ కంటైనర్ షిప్ కాలువకు అడ్డుగా నిలిచింది. ఈ షిప్ ఇసుకలో కూరుకపోయి ఉండవచ్చునని నిపుణులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం గుండా వెళ్లే సుమారు 100 షిప్ల రవాణాకు ఆటంకం ఏర్పడనుంది. కాగా 193 కిలోమీటర్ల పొడవైన సూయజ్ కాలువ ద్వారా, మధ్య ప్రాచ్యం నుంచి యూరప్, ఉత్తర అమెరికాకు ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలు సాగుతాయి. ఇక ప్రపంచ వాణిజ్యంలో ప్రతి ఏటా సుమారు 12 శాతం ఈ కాలువ ద్వారానే వ్యాపారం జరుగుతుంది. అంతేకాకుండా 8 శాతం సహజవాయువు ఈ కాలువ ద్వారా వివిధ దేశాలకు రవాణా జరగుతోంది. ప్రతిరోజూ పది లక్షల బ్యారెల్స్ ఆయిల్ సరఫరా అవుతోంది. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం షిప్ కారణంగా ఈ మార్గం గుండా రాకపోకలు నిలిచిపోవడంతో, ఆయా దేశాల్లో ఇంధన ధరలు పెరగవచ్చని వాణిజ్య నిపుణులు భావిస్తోన్నారు. ఈ షిప్ను మళ్లీ సరైన మార్గంలోకి తెచ్చేందుకు ప్రత్యేకమైన పడవలను ఏర్పాటు చేశారు. ఇక్కడ పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేందుకు కొన్ని రోజులు పట్టవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. దీంతో ఆసియా-యూరప్ల మధ్య వాణిజ్యంపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది. చదవండి: గాల్లో తేలుతున్న భారీ నౌకలు -
ఎర్రసముద్రంలో కుప్పకూలిన అమెరికా చాపర్
ఎర్ర సముద్రంలో అమెరికాకు చెందిన నేవీ హెలికాప్టర్ ఒకటి కుప్పకూలింది. అందులో ఉన్న ఐదుగురు సిబ్బంది ఆచూకీ తెలియడంలేదని సిన్హువా వార్తాసంస్థ తెలిపింది. ప్రస్తుతం బహ్రైన్లో ఉన్న అమెరికా నౌకాదళంలోని ఐదో ఫ్లీట్కు చెందిన ఎంహెచ్-60ఎస్ హెలికాప్టర్ ఆపరేషన్ సందర్భంగా ఎర్ర సముద్రంలో కుప్పకూలినట్లు ఆ దళం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ హెలికాప్టర్ కింగత్వాక్ రకానికి చెందినది. అందులో ఉన్న ఐదుగురు సిబ్బంది ఆచూకీ ఇంతవరకు తెలియడంలేదని, అయితే ప్రమాదానికి కారణం మాత్రం విద్రోహచర్య కాకపోవచ్చని నౌకాదళం తన ప్రకటనలో వెల్లడించింది. రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని, దర్యప్తు కూడా ప్రారంభం అయ్యిందని తెలిపింది.