slippers
-
చర్మకారులకు పాద‘రక్ష’!
రాయదుర్గం: పురాతన పద్ధతుల్లో చెప్పులు కుడుతూ ఎదుగూ బొదుగూ లేకుండా బతుకుతున్న చర్మకారుల జీవితాలకు కొత్త ‘కళ’ను అద్దుతోంది ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ). ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్డీడీఐ)తో కలిసి చర్మకారులకు ఆధునిక పద్ధతులపై శిక్షణ ఇచ్చి సొంతంగా తయారీ యూనిట్లు నెలకొల్పుకునేందుకు చేయూతనందిస్తోంది. ఆధునిక డిజైనింగ్పై శిక్షణ చర్మకార వృత్తిని కొనసాగిస్తున్నవారితోపాటు వృత్తిని వదిలేసినా దానిపై ఆసక్తిగల వారిని కొందరిని ఎంపిక చేసి గత డిసెంబర్ 9 నుంచి ఈ జనవరి 3వ తేదీ వరకు మూడు విడతలలో 25 రోజుల పాటు రాయదుర్గంలోని ఎఫ్డీడీఐలో శిక్షణ ఇచ్చారు. ఆధునిక కాలానికి తగినట్లుగా చెప్పులు, షూల డిజైనింగ్.. వాటిని నాణ్యతతో తయారు చేయటంపై మెళకువలు నేర్పారు. ఎఫ్డీడీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నరసింహుగారి తేజ్లోహిత్రెడ్డి ఆధ్వర్యంలో ఎఫ్డీడీఐ ఫ్యాకల్టీ అబ్దుల్ రహమాన్, చంద్రమణి, కన్వర్సింగ్, ఇళయరాజా పర్యవేక్షణలో ఈ శిక్షణ కొనసాగింది. షూ తయారీలో శుద్ధి చేసిన చర్మాన్ని కటింగ్ చేసే ప్యాటర్న్, బాటమ్ ఫిట్టింగ్, అప్పర్ మేకింగ్, స్టిచ్చింగ్ వంటి అంశాలలో అవగాహన కల్పించారు. శిక్షణ పూర్తయిన తర్వాత వారు తయారు చేసిన ఉత్పత్తులతో ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. లిడ్క్యాప్కు పూర్వవైభవం తేవాలి ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు తరచూ నిర్వహిస్తూ చేతి వృత్తి కళాకారులను ప్రోత్సహించాలని ఇక్కడ శిక్షణ పొందినవారు కోరుతున్నారు. శిక్షణ పొందినవారు సొంతంగా యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం సబ్సిడీపై రుణ సౌకర్యం, ఆధునిక యంత్రాలు అందించాలని విన్నవించారు. అలాగే లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (లిడ్క్యాప్)కు పూర్వవైభవం తీసుకొస్తే చర్మకారులకు మరింత మేలు జరుగుతుందని పేర్కొంటున్నారు. ప్రత్యేక కోర్సులతో శిక్షణఎఫ్డీడీఐ హైదరాబాద్ క్యాంపస్లో నిష్ణాతులైన ఫ్యాకల్టీతో చర్మకారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. ప్రత్యేక కోర్సులను నిర్వహించి వీరికి శిక్షణ అందించాం. భవిష్యత్తులో కూడా మరిన్ని శిక్షణా కార్యక్రమాలు చేపట్టేందుకు ఫ్యాకల్టీ సిద్ధంగా ఉన్నారు. – డాక్టర్ నరసింహుగారి తేజ్ లోహిత్రెడ్డి, ఎఫ్డీడీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నేను టూరిజమ్లో పీజీ చేసి పర్యాటక శాఖలో గైడ్గా పనిచేసే లైసెన్స్ పొందాను. అయితే వంశపారంపర్యంగా వచ్చిన చర్మకార వృత్తిలో కొనసాగాలనుకున్న నాకు.. ఎఫ్డీడీఐలో శిక్షణ తీసుకునే అవకాశం వచ్చింది. ప్రభుత్వం రుణసౌకర్యం కల్పిస్తే సొంతంగా యూనిట్ పెట్టి నేను ఎదగటంతోపాటు కొంతమందికి ఉపాధి కల్పిoచాలన్నదే నా లక్ష్యం. –క్రాంతి, శిక్షణ తీసుకున్న చర్మకార కళాకారుడు, సికింద్రాబాద్మాదాపూర్లో పాత చెప్పులు కుడుతూ, చెప్పులు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించేవాణ్ణి. ఎఫ్డీడీఐ శిక్షణతో షూ కూడా తయారు చేయడం నేర్చుకున్నాను. అంతేకాదు ఏదో సాధించాలనే పట్టుదల వచ్చింది. ఇక్కడ శిక్షణ పొందిన మరికొందరితో కలిసి ఒక తయారీ యూనిట్ ఏర్పాటు చేసి ఉపాధి పొందడంతోపాటు నలుగురికి ఉపాధి కల్పిoచాలని ఉంది. –పవన్కుమార్, చర్మకారుడు, మాదాపూర్20 ఏళ్లుగా చర్మకార పనిచేస్తున్నా. సాధారణ చెప్పుల తయారీ, మరమ్మతులు, పాలిష్ వంటివి మాత్రమే చేయగలిగేవాణ్ణి. ఎఫ్డీడీఐలో శిక్షణ పొందాక రకరకాల డిజైన్లలో షూస్ తయారీతో పాటు కటింగ్, స్టిచ్చింగ్ చేసే స్థాయికి ఎదిగాను. ఇప్పటి తరంవారికి కూడా నచ్చేలా షూలు తయారు చేయగలననే నమ్మకం వచి్చంది. ప్రభుత్వం రుణం, యంత్రాలు అందిస్తే సొంతంగా యూనిట్ ఏర్పాటు చేసుకుంటా. ఇలాంటి శిక్షణ అందరికీ ఇస్తే మా కులవృత్తి కనుమరుగు కాకుండా ఉంటుంది. –తుకారామ్, చర్మకారుడు, ఈసీఐఎల్ -
చెప్పులు వేసుకుని రావద్దన్న డాక్టర్పై దాడి.. వీడియో వైరల్
భావ్నగర్: గుజరాత్లోని ఓ ఆసుపత్రిలో వైద్యుడిపై రోగి కుటుంబ సభ్యులు తమ ప్రతాపాన్ని చూపించారు. ఎమర్జెన్సీ వార్డులోకి ప్రవేశించే ముందు చెప్పులు తీసేయమని కోరినందుకు ఆ వైద్యుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. భావ్నగర్లోని సిహోర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తలకు గాయమైన మహిళకు వైద్యులు చికిత్స అందిస్తుండగా, ఆమె కుటుంబ సభ్యులు పరామర్శించడానికి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని అత్యవసర గదిలోని సీసీటీవీలో ఈ మొత్తం ఘటన అంతా రికార్డు అయింది. ఆ వీడియోలో మంచంపై ఉన్న మహిళ పక్కన కొంతమంది పురుషులు నిలబడి ఉండగా, డాక్టర్ జైదీప్సిన్హ్ గోహిల్ గదిలోకి వచ్చారు. వైద్యుడు వారిని చెప్పులను తీసివేయమని కోరాడు.ఇదీ చదవండి: 50 ఏళ్ల మిస్టరీకి చెక్..కొత్త బ్లడ్ గ్రూప్ని కనిపెట్టిన శాస్త్రవేత్తలు..!దీంతో రోగి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో డాక్టర్పై దాడి చేశారు. ఆయనను కిందపడేసి మరీ కొట్టడం సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. మంచంపై పడుకున్న మహిళ, నర్సింగ్ సిబ్బంది నిలువరించడానికి ప్రయత్నించినప్పటికీ నిందితులు వైద్యుడిని కొడుతూనే ఉన్నారు. ఈ ఘర్షణలో గదిలోని మందులు, ఇతర పరికరాలు దెబ్బతిన్నాయి. నిందితులు హిరేన్ దంగర్, భవదీప్ దంగర్, కౌశిక్ కువాడియాలను పోలీసులు అరెస్ట్ చేశారు.Young Doctor assaulted at Sihor hospital in #Bhavnagar district;Altercation erupts over removing shoes. A verbal altercation turned violent when relatives of a female patient were instructed to remove their footwear before entering the emergency ward."#MedTwitter @JPNadda pic.twitter.com/b91PU6eECD— Indian Doctor🇮🇳 (@Indian__doctor) September 16, 2024 -
ఔనా..! స్లిప్పర్స్కు లక్ష!
మీరు విన్నది నిజమే! మన రెగ్యులర్గా ఉపయోగించే స్లిప్పర్స్ సౌదీలో అక్షరాలా లక్షకు పైమాటే! కువైట్, చుట్టుపక్కల న్యూస్ పంచుకునే ఓ ఇన్స్టాగ్రామ్ ఖాతాదారు ఒక స్టోర్లో రికార్డ్ చేసిన వీడియోను షేర్ చేసింది. ‘అత్యాధునికమైనవి’గా ‘చెప్పు’ కుంటున్న ఈ స్ల్లిప్పర్స్ ధర 4,590 సౌదీ రియాల్స్ పలుకుతోంది. ఇది మన రూ΄ాయలలో లక్షా రెండువేలకు పైగానే! ఎరుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ రంగులతో సహా వివిధ రంగులలో ఉన్న స్లిప్పర్స్ జతలను ఓ ఉద్యోగి గ్లాస్ కేస్లోంచి తీసి వీడియో రికార్డ్ చేస్తున్న వ్యక్తికి చూపించాడు. ఈ వీడియో చూసిన నెటిజనులు... ‘ఇవి మా కుటుంబం వాడే బాత్రూమ్ చెప్పులు’ అని, ‘ఇండియాలో వీటిని టాయిలెట్ ΄ాదరక్షలుగా ఉపయోగిస్తారనీ కామెంట్ చేస్తున్నారు. -
చెప్పుల దండతో ఎన్నికల ప్రచారానికి..
దేశంలో లోక్సభ ఎన్నికల వేడి అంతకంతకూ పెరుగుతోంది. ఎన్నికల్లో గెలుపొందేందుకు అభ్యర్థులు వినూత్న ప్రచారాలు సాగిస్తున్నారు. యూపీలోని అలీగఢ్లో ఓ అభ్యర్థి చేస్తున్న ప్రచారతీరును చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఎవరి మెడలోనైనా చెప్పుల దండను వేశారంటే వారిని అవమానించారని అర్థం. ఇటువంటి ఉదంతాలు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. అయితే అలీగఢ్లో స్వతంత్ర అభ్యర్థి పండిట్ కేశవ్ దేవ్ గౌతమ్ చెప్పుల దండ వేసుకుని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పూల దండకు బదులు చెప్పుల దండ వేసుకుని ఓట్లు అడగటాన్ని చూసి, స్థానికులంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన పండిట్ కేశవ్ దేవ్కు ఎన్నికల సంఘం చెప్పు గుర్తును కేటాయించింది. ఈ నేపధ్యంలో కేశవ్ తన మెడలో ఏడు చెప్పులతో కూడిన దండతో ప్రచారం సాగిస్తున్నాడు. అవినీతిని అరికడతానంటూ అందరికీ చెబుతున్నాడు. పండిట్ కేశవ్ దేవ్ సమాచారం హక్కు(ఆర్టీఐ) కార్యకర్త. ఆయన భారతీయ హిందూ రాష్ట్ర సేన, అవినీతి నిరోధక సేన అనే సంస్థలను కూడా నడుపుతున్నారు. కేశవ్ గతంలో రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిని ఎదుర్కొన్నారు. అలీఘర్ లోక్సభ స్థానానికి రెండో దశలో అంటే ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియగా, మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. మార్చి 28 నుంచి ఏప్రిల్ 4 వరకు మొత్తం 21 మంది నామినేషన్లు దాఖలు చేశారు. #WATCH | Aligarh, UP: Independent candidate from Aligarh Pandit Keshav Dev has been allotted 'slippers' as the election symbol. After which, he was seen carrying out the election campaign wearing a garland of 7 slippers around his neck. (08.04) pic.twitter.com/V0Hm8JYRmC — ANI (@ANI) April 8, 2024 -
అమానవీయం: చికెన్ ఇవ్వలేదని.. చెప్పులతో దళితునిపై దాడి..
లక్నో: ఉత్తరప్రదేశ్లో అమానవీయ ఘటన జరిగింది. చికెన్ ఉచితంగా ఇవ్వలేదని ఓ దళిత వ్యక్తిపై దాడి చేశారు కొందరు యువకులు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుజన్ అహిర్వార్ అనే వ్యక్తి బైక్పై చికెన్ను విక్రయిస్తుంటాడు. ఒక ఊరి నుంచి మరో ఊరిలోకి వెళ్లే క్రమంలో మార్గమధ్యలో అతన్ని అడ్డగించారు నిందితులు. తమకు చికెన్ అవ్వాలని అడిగారు. డబ్బులు ఇవ్వాలని అభ్యర్థించిన బాధితున్ని.. యువకులు చెప్పులతో చితకబాదారు. ఈ ఘటనను ఓ వ్యక్తి ఫోన్లో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. ఇది కాస్త వైరల్గా మారింది. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదీ చదవండి: సినిమాలో పెట్టుబడి.. కుటుంబం మొత్తం మర్డర్ కేసులో -
గ్రామ సర్పంచ్ వింత నిబంధన.. అతిక్రమిస్తే ఐదు చెప్పు దెబ్బలు..
భోపాల్: మధ్యప్రదేశ్లో ఓ గ్రామ సర్పంచ్ వింత నిబంధన వివాదాస్పదంగా మారింది. గ్రామంలో పశువులు యధేచ్చగా సంచరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలిపాడు. ఆయా పశువుల యజమానికి ఐదు చెప్పు దెబ్బల దండన విధిస్తామని హెచ్చరించాడు. అంతే కాకుండా రూ.500 జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించాడు. ఈ నిబంధనపై గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు. అధికారులకు ఫిర్యాదు చేశారు. షాహదోల్ జిల్లా నగ్నాదుయ్ గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామంలో రోడ్లపై పశువులను యధేచ్చగా వదిలేస్తున్నారని గమనించిన సర్పంచ్.. వాటి యజమానుల బాధ్యతారాహిత్యంపై మండిపడ్డాడు. పలుమార్లు హెచ్చరించినా ప్రయోజనం లేకపోవడంతో ఇక చెప్పు దెబ్బలతో దండన విధిస్తామని దండోరా వేయించాడు. గ్రామ పంచాయతీ అధికారులు ఇంటింటికీ వెళ్లి నిబంధనలను వివరించారు. ఈ వీడియోను గ్రామస్థులు అధికారులకు చూపించి, ఫిర్యాదు చేశారు. ఇదేం వింత నిబంధన, వెంటనే తొలగించాలని అధికారులకు మొరపెట్టుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఇదీ చదవండి: ఉచితంగా టమాటాలు.. ఆటోవాలా సరికొత్త ఆఫర్.. కానీ.. -
వెంబడించి వేధించడంతో..పోకిరిని చెప్పుతో..
కాలేజీ నుంచి హాస్టల్కి వెళ్తున్న విద్యార్థిని ఓ వ్యక్తి వెంటపడి వేధించడం ప్రారంభించాడు. ఓపిక నశించిన ఆ అమ్మాయి ఆ వ్యక్తిని చెప్పుతో ఎడాపెడా వాయించింది. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో కాలేజీ విద్యార్థిని హాస్టల్ నుంచి కాలేజికి వెళ్తుండగా ఓ యువకుడు ఆమె వెంటపడి వేధించడం ప్రారంభించాడు. దీంతో ఆమె కేకలు వేసి చుట్టుపక్కల వాళ్లను అప్రమత్తం చేసింది. దీంతో స్థానికులు ఆ యువకుడిని పట్టుకున్నారు. ఆ తర్వాత ఆమె అందరి ముందే అతడి చెంప చెల్లుమనిపించింది. తన కాలికి ఉన్న చెప్పుతో అతడి ముఖంపై ఎడాపెడా వాయించి తన కోపం తీర్చుకుంది. ఇక ఆ యువకుడు చేసేదేం లేక చూస్తు కూర్చున్నాడు. తనను వదిలేయమని ప్రాథేయపడ్డాడు. అయితే స్థానికులు అతన్ని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని నజీర్గా గుర్తించారు పోలీసులు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అవుతుండటంతో ఈ ఘటన వెలుగు చూసింది. (చదవండి: అదుపుతప్పి..వాహనాలపైకి దూసుకెళ్లి..) -
అల్లుడు బైక్ అడిగినందుకు చెప్పుదెబ్బలతో సాగనంపిన మామ
-
అలియా చెప్పులు మోసిన రణ్బీర్..నెటిజన్స్ ఫైర్
బాలీవుడ్ క్యూట్ కపుల్లో రణబీర్ కపూర్, అలియా భట్ జంట ఒకటి. ఈ జంట ఏ పని చేసినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. అయితే సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ని, కామెంట్స్ని పట్టించుకోకుండా చాలా అన్యోన్యంగా ఉంటారు. సినిమాల వరకే స్టార్స్లా ప్రవర్తిస్తారు కానీ.. నిజ జీవితంలో భార్యభర్తలుగా అందరిలాగే ఉంటారు. తాజాగా ఈ జంట, ముఖ్యంగా రణ్బీర్ ట్రోల్స్కి గురవుతున్నారు. దానికి కారణంగా రణబీర్.. అలియా చెప్పులను మోయడమే. భార్య చెప్పులను భర్త మోస్తే తప్పేంటని అనుకుంటున్నారా?... అయితే పూర్తి కథనం చదవండి. గత గురువారం (ఏప్రిల్ 21) ఫిల్మ్ మేకర్ ఆదిత్య చోప్రా తల్లి పమేలా చోప్రా కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ వార్త తెలియగానే బాలీవుడ్ ప్రముఖులంతా ఆదిత్య చోప్రా కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. ఆయన ఇంటికి వెళ్లి ఓదార్చారు. ఇక రణ్బీర్, అలియాభట్ జంట కూడా కాస్త ఆలస్యంగా ఆదిత్య చోప్రా ఇంటికి వెళ్లారు. ఇంట్లోకి వెళ్లే క్రమంలో అలియా తన చెప్పులను గుమ్మం ముందు విడిచి వెళ్లింది. వెనకే వచ్చిన రణ్బీర్ ఆ చెప్పులను చేతులతో పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్లి పెట్టాడు. (చదవండి: నగ్న వీడియో షేర్ చేసిన నిత్యా శెట్టి.. నెటిజన్స్ ఫైర్) ఇంతవరకు బాగానే ఉన్నా.. అసలు ట్రోలింగ్కు కారణం ఏంటంటే.. రణ్బీర్ ఆ చెప్పులను ఇంట్లో ఉన్న చిన్న గుడి ముందు పెట్టడమే. భార్య చెప్పులు మోయడం తప్పుకాదు.. కానీ వాటిని గుడిముందు పెట్టడం ఏంటి? అలియా ఆలోచించే ఆ చెప్పులను మెట్ల ముందు వదిలింది. కానీ రణ్బీర్ మాత్రం తెలివితక్కువ పని చేశాడు. పైగా అతను చెప్పులతో లోపలికి వెళ్లాడు’ అని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. రణ్బీర్ కపూర్-అలియా 2022 ఏప్రిల్ 14న వివాహం చేసుకున్నారు.పెళ్లైన రెండు నెలలకే ప్రెగ్నెన్సీని వెల్లడించింది. గతేడాది నవంబర్లో ఈ జంట ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
Video: ‘తప్పతాగి వేధింపులు.. నడిరోడ్డుపై చెప్పుతో దంచికొట్టింది’
బెంగళూరు: రోడ్లు, బస్సులు, రైళ్లల్లో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. చిన్న పిల్లలు, యువతులు మహిళలు అనే తేడా లేకుండా పిచ్చి చేష్టలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటకలో చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే ఓ మహిళ మందుబాబును ఊరికే వదలకుండా అందరి ముందే బడిత పూజ చేసింది. ధార్వాడ్ జిల్లాలో ఫుల్గా తాగిన ఓ వ్యక్తి రోడ్డు మీద వెళ్తున్న మహిళలను అడ్డగించి వారిని అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడు. అంతేగాక వారి ఫోన్ నెంబర్లు అడుగుతూ వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఆగ్రహించిన ఓ మహిళ అతడిని పట్టుకొని ఏకంగా చెప్పుతో కొట్టింది. నడి రోడ్డుపై కూర్చొబెట్టి అతడి తల, ముఖంపై దాడి చేసింది. అందరూ చూస్తుండగానే అతడి ముఖాన్ని పచ్చడి చేసింది. చట్టు పక్కల ఉన్నవారు సైతం ఆమెకు మద్దతుగా నిలిచారు. మహిళ పిచ్చి పిచ్చిగా కొడుతున్నా.. సదరు వ్యక్తి కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దీనిని స్థానికులు తమ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ దృశ్యాలు వైరల్గా మారాయి. A man in an inebriated state was misbehaving with women in #Dharward. He was going on asking mobile phone numbers of women. He was beaten with slippers. Incident happened at Subhas road. pic.twitter.com/9WlGplQvjL — Imran Khan (@KeypadGuerilla) December 30, 2022 -
వైరల్.. చెప్పులతో చితక్కొట్టుకున్న అంకుల్స్.. నీ అవ్వ తగ్గేదేలే!
సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు కొన్ని వందల వీడియోలు దర్శనమిస్తున్నాయి. ఇందులో ఫన్నీ, సందేశాత్మకం, డ్యాన్స్, జంతువులు.. ఇలా చాలా రకాలైనవి ట్రెండింగ్గా నిలుస్తుంటాయి. ఎప్పుడు, ఏ వీడియో వైరల్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. తాజాగా ఇద్దరు వ్యక్తులు ఓ బిల్డింగ్ సమీపంలో కొట్టుకుంటున్న వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. ఇందులో ఒకరు వృద్ధుడిలా కనిపిస్తుంటే మరొకరు మధ్య వయసు ఉన్నారు. ఇద్దరి మధ్య గొడవ ఎలా మొదలైందో తెలియదు కానీ బద్ద శత్రువుల కంటే దారుణంగా తగువులాడుకున్నారు. ఒకరిని మించి ఒకరు ఇష్టం వచ్చినట్లు తిట్టుకుంటూ చితకొట్టుకున్నారు. ఇంతలో ముసలాయన తన చెప్పు తీసి ఎదుటి వ్యక్తిని కొట్టేందుకు ప్రయత్నింస్తుండగా మరో వ్యక్తి సైతం చెప్పుతో దాడి చేశాడు. ఇలా కాసేపు వీరిద్దరూ చెప్పులతో ముఖాలను వాయించుకున్నారు.ఎవరూ తగ్గకుండా సాగిన వీరి పోరాటం చివరికి హింసాత్మకంగా మారింది. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియరాలేదు కానీ నెట్టింట్లో వైరల్గా మారింది. చదవండి: Viral Video: అదృష్టం బాగుండి బతికిపోయాడు.. లేకుంటే ఎంత ఘోరం జరిగుండేది -
మెడికల్ చెకప్కి వెళ్లిన ఛటర్జీకి అవమానం!... ముఖం మీదే చెప్పులు విసిరి.....
న్యూఢిల్లీ: బెంగాల్ మాజీ మంత్రి పార్థ చటర్జీని టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్రేట్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన సన్నిహితురాలు, నటి అర్పిత ముఖర్జీ నివాసంలో కూడా సోదాలు నిర్వహించిన అధికారులు ఇప్పటివరకు సుమారు రూ.50కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు ఈడీ కస్టడీలోనే ఉన్నారు. ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు పార్థ ఛటర్జీని అతని సన్నిహితురాలు అర్పితా ముఖర్జీని మెడికల్ చెకప్ కోసం జోకాలోని ఈఎస్ఐ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఐతే అక్కడ ఛటర్జీకీ ఊహించని అవమానం ఎదురైంది. ఐఎస్ఒఐ ఆస్పత్రి వెలుపల ఒక మహిళ ఛటర్జీ ముఖం పైనే చెప్పులు విసిరి ఘోరంగా అవమానించింది. ఆ తర్వార సదరు మహిళ మాట్లాడుతూ...తాను మందులు కొనుక్కోవడానకి ఆస్పత్రికి వచ్చినట్లు తెలిపింది. ఫ్లాట్లు, ఏసీ కార్లు కొనుక్కునేందుకు అతను పేదలను దోచుకుంటున్నాడని విమర్శించింది. ఇలాంటి వాళ్లను కాళ్లుచేతులు కట్టి వీధుల్లోకి ఈడ్చుకెళ్లాలంటూ.. తిట్టిపోసింది. అంతేకాదు ఆ చెప్పుల ఇక తాను ధరించను అంటూ ఛటర్జీ మండిపడింది. మరోవైపు తృణమాల్ కాంగ్రెస్ ఛటర్జీని సస్సెండ్ చేయడమే కాకుండా బెంగాల్ మంత్రివర్గం నుంచి తొలగించింది. (చదవండి: Partha Chatterjee: మమత కేబినెట్లో కీలక మార్పులు.. ఒక్కరికి ఒకే పదవి!) -
Kirru Cheppulu: ట్రెండ్ మారింది.. కిర్రు చెప్పుల ‘సోగ్గాడు’
కొనకనమిట్ల(ప్రకాశం జిల్లా): పెద్దల కాలంలో కిర్రు చెప్పులు రకరకాల రంగుల్లో తయారు చేయించి వేసుకొని వీధుల్లో తిరుగుతుంటే కిర్ కిర్ మంటూ వచ్చే శబ్దం అదో హోదాగా భావించేవారు. ముఖ్యంగా వివాహ వేడుకలు, అమ్మవారి కొలుపులు, ఉత్సవాల సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఇలాంటి చెప్పులు వాడేవారు. ప్రస్తుతం ట్రెండ్ మారింది. ప్రజలు వాడే పాదరక్షల విషయంలో పెను మార్పులు చేటు చేసుకున్నాయి. చదవండి: నంద్యాలలో నిత్య పెళ్లి కూతురు.. ఒకరికి తెలియకుండా మరొకరిని.. ఇలా.. కానీ నేటికి అలనాటి కిర్రు చెప్పులపై మోజు తీరని కొందరు పల్లెవాసులు వాటిని వాడుతుండటం విశేషం. మండలంలోని కాట్రగుంట గ్రామంలో ఎల్లమ్మ కొలుపుల వేడుకల్లో రెట్టపల్లి గ్రామానికి చెందిన నాలి పెద్దన్న కిర్రు చెప్పులతో వచ్చి అందరిని ఆకట్టుకున్నాడు. రూ.3 వేలు ఖర్చుపెట్టి చెప్పులు తయారు చేయించానని సాక్షితో ముచ్చటించారు. -
సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న గొర్రెల కాపరి..
సాక్షి ముంబై: సాతారా జిల్లాకి చెందిన 60 ఏళ్ల వృద్ధుడైన ఓ గొర్రెల కాపరి చెప్పులు ఇప్పుడు వార్తల్లోకెక్కాయి. ఈయన కాళ్లకు వేసుకునే చెప్పులు ఎనిమిది కిలోల బరువుతోపాటు నాగుపాము పడగ రూపంలోని ప్రత్యేక డిజైన్లో, బంగారు రంగులో ఉండటంతో ఈ చెప్పులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇలా అనేక ప్రత్యేకతలతో ఉన్న ఈ చెప్పులు రూ. 31 వేల విలువ ఉంటాయని ఆయన అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పాదరక్షలు హల్చల్ చేస్తున్నాయి. సాతారా జిల్లా మాణ్ తాలూకాలోని జాంభుళణీ గ్రామంలో వృత్తి రీత్యా గొర్రెల కాపరి అయిన కెరాప్పా కోకరే ఈ చెప్పులు తయారు చేయించుకున్నారు. పొలాల్లో, కాలిబాటల్లో అత్యధిక సమయం గడిపే ఆయన వేషధారణ సైతం ప్రత్యేకంగా ఉంది. ధోతీ, చొక్కా, నెత్తిపై పసుపు రంగులో ఉండే పంచెతో కట్టిన తలపాగా (పగిడి)తోపాటు గ్రామీణ వస్త్రధారణతో ఆయన అందరినీ ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఈ పరిసరాల్లో జరిగే ‘గాజీ’ నృత్య ప్రదర్శనలో కెరప్పా కోకరే ఈ చెప్పలు వేసుకుని చిందులు వేసి అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఈ చెప్పులను ఆయన ప్రత్యేకంగా ఆక్లూజ్లో తయారు చేయించుకున్నారు. కెరప్పా కొకరే ధరించే ఈ చెప్పులలో 100 ఎల్ఈడీ లైట్లు, గోండాలు, 100 గజ్జెలు, నట్బోల్టులు, గాజు బిళ్లలు, బ్యాటరీ తదితరాలున్నాయి. చదవండి: ('ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హత్యకు కుట్ర') ముఖ్యంగా బంగారు రంగులో ఉండే ఈ చెప్పులు, ఉదయం, రాత్రి సమయాల్లో వైవిధ్యంగా కనిపిస్తూ అందరినీ ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చెప్పుల కారణంగా కోకరే కెరప్పా తన గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చర్చల్లోకెక్కారు. అదేవిధంగా సోషల్ మీడియాలోనూ హల్చల్ చేస్తున్నారు. 15 ఏళ్ల వయసు నుంచే కోకరే కొరప్పాకు చెప్పులతోపాటు ప్రత్యేక వేషధారణ అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన 60 ఏళ్ల వయసులో కూడా చెప్పులు, వేషధారణ అంతా ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటారు. స్వగ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో జరిగే కార్యక్రమాలలో ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ముఖ్యంగా గాజి నృత్య ప్రదర్శనలో తనదైన నృత్యరీతిలో అందరినీ ఆకట్టుకుంటారు. ముఖ్యంగా ఇప్పుడు ఎనిమిది కిలోల బరువుతో, రూ. 31 వేల విలువైన ప్రత్యేక పాదరక్షలతో ఓ సెలబ్రిటీ అయిపోయారు. -
మొసలిని చెప్పుతో తరిమి కొట్టిన మహిళ.. వైరల్ వీడియో
నీటిలో, నేల మీద జీవించే జీవుల్లో మొసలి ఒకటి. మొసలికి నీటిలో అమితమైన బలం ఉంటుంది. పెద్ద ఎనుగును కూడా ఈడ్చి పడేస్తుంది. అందుకే నీటిలో ఉండే వేటాడి ఆహారం తింటుంది. నేల మీద మొసలి జీవించలగలదు కానీ బలం అంతగా ఉండదు. అయితే నదిలో ఉన్న మొసలి ఒడ్డున ఉన్న కుక్క పిల్లను తినేయాలని చూస్తుంది. ఇంతలో ఓ మహిళ తన చెప్పు తీసి మొసలిని బెదిరించేసరికి తోకముడిచి వెనక్కి వెళ్లిపోతుంది. దీనికి సంబంధించిన వీడియోను ఫ్రెడ్ షుల్ట్ అనే ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేయడంతో నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. చదవండి: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. నిజంగా ఈ వీడియోలో ఉన్నది ఎర్ర తేళ్లేనా? ఈ వీడియోలో ఓ మహిళ తన పెంపుడు కుక్కతో నద వద్ద నిలబడి ఉంది. ఈ నదిలో చాలా మొసళ్లు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. కా గా మహిళ కుక్క అక్కడక్కడే తిరుగుతూ ఉండగా దాన్ని చూసిన మొసలి వేగంగా ఒడ్డు వద్దకు వస్తుంది. అలా వస్తున్న మొసలిని చూసిన మహిళ ఇసుమంత కూడా భయపడకుండా దాన్ని అలాగే చూస్తూ నిల్చుంటుంది. ఆ మొసలి దగ్గరి దాక వచ్చాక మహిళ తన కాలుకు ఉన్న చెప్పును చూపించి బెదిరిస్తుంది. దీంతో ఆ మొసలి భయపడిందో ఏమో గానీ వెంటనే అక్కడి నుంచి వెనక్కి తిరిగి నీళ్లలోకి వెళ్లిపోయింది. చదవండి: రేయ్! రేయ్!.. తప్పుకోండిరా బాబు... మీదకు వచ్చేస్తోంది..!! Everyone knows what it means when mom takes the shoe off. 😏😂🐊🥿 pic.twitter.com/CXD94m6PVz — Fred Schultz (@fred035schultz) November 9, 2021 అన్నట్టు ఇది ఆస్ట్రేలియాలోని ఉత్తర ప్రాంతమైన. కాకాడు నేషనల్ పార్కులో జరిగింది. ఈ వీడియోలోని మహిళ చేసిన ఫన్ నెటిజన్లను ఆకర్షిస్తుంది. దీంతో ట్విట్టర్లో మీమ్స్ సృష్టిస్తున్నారు. ఎలాంటి సమస్యకైనా చెప్పు ఉంటే చాలు... పరిష్కారం దొరుకుతుంది. డేరింగ్ లేడి. భర్త ఆలస్యంగా ఇంటికి రావడం, పిల్లలు నటించడం, కుక్కను బెదిరించడం ఇలా ప్రతి దానిలో చెప్పునే ఉపయోగిస్తాం’. అంటూ రకరకాల మీమ్స్ వేస్తున్నారు. -
ఉమా భారతి: అధికారులున్నది చెప్పులు మోయడానికే!
భోపాల్: ప్రభుత్వాధికారులున్నది నాయకుల చెప్పులు మోయడానికేనంటూ కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.‘అధికారుల గురించి మీకేమీ తెలియదు. వారున్నది మా స్లిప్పర్లు మోయడానికే’ అని ఉమ వ్యాఖ్యానించిన వీడియో ఒకటి వైరల్గా మారింది. తన వ్యాఖ్యలపై ఆ తర్వాత ఉమా స్పందించారు. ఓబీసీ నేతలతో పిచ్చాపాటీ మాటల్లో ఈ వ్యాఖ్యలు చేశానని , నిజానికి తాను అధికారులను వెనుకేసుకొచ్చానని సమర్ధించుకున్నారు. నిజాయతీ ఉన్న అధికారులు బలమైన నాయకులకు మద్దతుగా ఉంటారన్నారు. అయితే తన భావన మంచిదైనా, వాడిన భాష బాగోనందున విచారిస్తున్నానని వివరించారు. -
‘చెప్పు’కుంటే.. కష్టాలే..
ప్రతి సంవత్సరం జూన్, జూలైలో చెప్పులకు గిరాకీ ఎక్కువగా ఉండేది.. స్కూలు పిల్లలు షూస్ కోసం.. వర్షాకాలం కావడంతో వాటర్ ప్రూఫ్ స్లిప్పర్లకు డిమాండ్ ఉండేది.. కరోనా కారణంగా స్కూళ్లు లేవు. లక్షల సంఖ్యలో ప్రజలు ఊళ్లకు వెళ్లారు. దీంతో రోడ్ల పక్కన చెప్పుల దుకాణాలు నడుపుకునేచిరువ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. ముప్పే.. ఆటాడు‘కుంటే’.. బ్యాట్, బాల్ పట్టి.. వికెట్లు పెట్టి.. ఓ పట్టుపట్టి చాలా రోజులైంది.. అందమైన మైదానంపిలుస్తుంటే క్రికెట్ ఆడాల్సిందే అని మనసులో ఉందా.. కాస్త ఆగాల్సిందే.. అది మైదానం అనుకుని వెళ్తే మునగాల్సిందే.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారంలోనిఉషా ముళ్లపూడి ఆస్పత్రి వెనుకవైపు ఉంది ఈ కుంట. నిత్యం జల్లులు కురుస్తుండటంతో నీటిపై నాచు పేరుకుపోయి ఇలా అందంగా కనిపిస్తోంది. -
వ్యర్థాలతో పాదరక్షలు
పాదాలకు అందమైన నాణ్యమైన ఫ్యాషనబుల్ చెప్పులు, షూస్ను అందరూ ఇష్టపడతారు. అందుకే డబ్బు కాస్త ఎక్కువైనా ఖర్చుకు వెనకాడరు. రాజస్థాన్కు చెందిన మేఘా రావత్ వాడి పడేసిన వస్తువులతో అందమైన చెప్పులను తయారుచేస్తోంది. . ఫ్యాషనబుల్గా ఉండేవి, నాణ్యమైన, సరసమైన ధరలలో లభించే పాదరక్షల తయారీని ప్రారంభించడమే కాకుండా వాటికో బ్రాండ్ను క్రియేట్ చేసింది మేఘారావత్. ఇవి పూర్తిగా రీసైక్లింగ్ వస్తువులతో తయారు చేసినవి. వనరుల విలువ తెలుసుకున్నప్పుడు మేఘా రావత్ చాలా చిన్నది. 28 ఏళ్ల మేఘా రాజస్థాన్లోని శ్రీ గంగానగర్లో పెరిగారు. ‘నా చిన్నతనంలో నీళ్లు, కరెంట్ సరఫరా సరిగా ఉండేది కాదు. నా తమ్ముడు, నేను స్కూల్ నుంచి వచ్చాక ఇంటి పనులకు నీళ్ల కోసం దగ్గరలోని కాలువకు వెళ్లి తెచ్చుకునేవాళ్లం. వాడి పడేసిన సీసాలను దీపానికి ఉపయోగించేది అమ్మ’ అని గుర్తు చేసుకుంటుంది మేఘ. తండ్రి ఆర్మీలో ఉద్యోగి. తల్లి స్థానిక పాఠశాలలో టీచర్. తక్కువ వస్తువులతో ఎలా జీవించాలో నేర్పేది తల్లి. అవసరమైన వాటిని మాత్రమే కొనుగోలు చేయడం అలవాటు చేసింది. వాడిన వస్తువులను తిరిగి ఉపయోగించడం సాధ్యమైనంతవరకు ప్రయత్నించేవారు. ‘మా అమ్మ తన పాత చీరలతో నాకు గౌన్లు కుట్టేది. అవి చిరిగాక దిండు కవర్లుగా, టేబుల్ క్లాత్గా, దుమ్ము దులపడానికి ఉపయోగించే డస్టర్లుగా వాటిని చూసేదాన్ని’ అని మేఘా తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటుంది. స్క్రాప్తో స్ట్రాప్స్ మేఘా 2014లో కురుక్షేత్రలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. పై చదువుల కోసం తను ఉంటున్న పట్టణం నుండి నగరానికి వెళ్ళినప్పుడు, అక్కడ చాలామంది ఏవీ ఆలోచించకుండా వస్తువులను కొనడం గమనించేది. ‘వాటిని వాళ్లు ఎంతోకాలం వాడరు. కొంత కాలానికి వాటిని నిర్లక్ష్యంగా పడేస్తారు. వాటన్నిటి అసలు ఖర్చు మాత్రమే కాదు, ప్రకృతికి జరిగే నష్టాన్ని కూడా అదే టైమ్లో అంచనా వేసుకునేదాన్ని’ అని చెబుతారు మేఘా. ఆ ఆలోచనతోనే మేఘా 2015లో రీ సైక్లింగ్ మెటీరియల్తో ఫుట్వేర్ను డిజైన్ చేయడం కనుక్కుంది. దానికి ‘కురియో’ అని నామకరణం చేసింది. దీనికి ముందు మేఘా ముంబయ్లోని ఒక ఐటి సంస్థ, ఎక్స్పోర్ట్ కంపెనీలలో పనిచేసింది. అక్కడ తనకా ఉద్యోగం సంతృప్తిని ఇవ్వడం లేదని అర్థమయ్యాక పర్యావరణ స్పృహ కలిగిన పాదరక్షలను తయారు చేయడం మొదలుపెట్టింది. వీటి తయారీలో నైపుణ్యం కలిగిన 200 మంది చేతివృత్తులవారిని, మహిళలను ఎన్జీవోల సాయంతో నియమించుకుంది. టైర్లతో చెప్పుల అడుగు భాగం ‘చిన్నప్పటి నుండి సొంతంగా రకరకాల వస్తువులను తయారు చేయడం సరదాగా చేసేదాన్ని. మా అమ్మ టైలరింగ్ పనిచేస్తుంటే నేను పాత పేపర్లతో కటింగ్ నేర్చుకునేదాన్ని. క్లాత్ ముక్కలతో రకరకాల బొమ్మలను తయారుచేసేదాన్ని. రీ సైకిల్ ద్వారా కొత్తవస్తువును తయారు చేసినప్పుడల్లా చాలా ఆనందించేదాన్ని. అదే ఈ చెప్పుల తయారీకి పురికొల్పింది. సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించడంతో బాధ్యత పెరిగింది. ఏ పని చేసినా పర్యావరణ స్పృహతో చేయాలనే ఆలోచన కలిగింది’ అంటుంది మేఘా. కురియో బ్రాండ్ ద్వారా పాదరక్షలు, కేశాలంకరణ వస్తువులు, బ్రోచెర్స్, ఫోల్డర్లు, ఫ్రిజ్ మాగ్నెట్స్, పర్సులు, కోస్టర్స్ వంటి ఉత్పత్తులను తయారుచేస్తుంది మేఘా. వీటిలో బాగా పేరొందినవి కొల్హాపురీ చెప్పులు. అలాగే కవర్ బూట్లు. పాదరక్షలకు ఉపయోగించే పట్టీలు పూర్తిగా చేనేత దారుల నుండి సేకరించిన బట్టతో, టైలరింగ్ యూనిట్ల నుండి సేకరించిన వ్యర్థ వస్త్ర పదార్థాలను ఉపయోగిస్తారు. దానికి తోడు పాదరక్షల అడుగు భాగానికి రీసైకిల్ టైర్లను వాడుతారు. వ్యర్థాల కోసం నెట్వర్క్ ‘కొని వాడిన నాణ్యమైన బట్టలను దేశంలోని వివిధ మూలల నుండి సేకరిస్తాం. ఇవి సహజమైన రంగులు, చేతితో నేసిన క్లాత్స్ అయి ఉంటాయి. వాటిలో ‘ఖాదీ, అజ్రఖ్, కలాంకారి, ఇండీ ఫాబ్రిక్స్ మొదలైనవి. దీనికి స్థానిక చేతివృత్తులు, చేనేత కార్మికులూ సహకరిస్తారు. ఇప్పటివరకు ఎదుర్కొంటున్న సవాళ్లు ఏమైనా ఉన్నాయా అంటే రీసైక్లింగ్ పదార్థాల కోసం నెట్వర్క్ను ఏర్పాటు చేయడమే. ఇందుకు సమయం, అనుభవం చాలా అవసరం ఉంటుంది..’ అని వివరిస్తుంది మేఘా. కాలుష్యకారకాలలో అతిపెద్దది ఫ్యాషన్ ప్రపంచం. మేఘా చేసే రీ సైక్లింగ్ ఉత్పత్తులు కాలుష్యాన్ని తగ్గించడానికి దోహదం చేస్తున్నాయి. ఈ రీ సైక్లింగ్ తయారీ ఉత్పత్తులు ప్రజలకు మరింత అందుబాటులోకి రాగలిగితే పర్యావరణ నష్టాన్ని బాగా తగ్గించవచ్చు. -
వివాహేతర సంబంధం.. దేహశుద్ధి చేసిన భార్య
సాక్షి, హైదరాబాద్: మరో మహిళతో ప్రేమాయణం సాగిస్తూ.. బిడ్డను, తనను నిర్లక్ష్యం చేసిన భర్తను రెడ్హ్యాండెడ్గా పట్టుకుని చెప్పులతో కొట్టిందో భార్య. వివరాలు.. మంచిర్యాల జిల్లా కొత్తకమ్ముగూడెం గ్రామానికి చెందిన లక్ష్మణ్కు.. సౌజన్య అనే మహిళతో 2010లో వివాహం అయ్యింది. వీరికి ఓ కుమారుడు. ఈ క్రమంలో కొద్ది కాలం క్రితం లక్ష్మణ్కు కరీంనగర్ జిల్లా వెంకట్రావు పేటకు చెందిన అనూష అనే మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. కాగా అనూషకు కూడా 2013లో కోలా రవికాంత్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వారికి ఓ బాబు కూడా ఉన్నాడు. ప్రస్తుతం అనూష, భర్త రవికాంత్ను వదిలిపెట్టి.. లక్ష్మణ్తో కలిసి కూకట్పల్లిలోని ప్రగతి నగర్లో నివాసం ఉంటుంది. ఈ క్రమంలో లక్ష్మణ్, అనూషల సంబంధం గురించి సౌజన్యకు తెలిసి నిలదీసింది. లక్ష్మణ్, అనూష కలిసి దిగిన ఫోటోలను పెద్దమనుషుల ముందు పెట్టి నిలదీయగా.. అవి గతంలో దిగిన ఫోటోలని.. ప్రసుత్తం తమ ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదన్నాడు లక్ష్మణ్. కొద్ది రోజుల పాటు బుద్ధిగానే ఉన్న లక్ష్మణ్.. తిరిగి అనూషతో తన సంబంధాన్ని కొనసాగించడం ప్రాంరభించాడు. ఈ క్రమంలో సౌజన్య గురువారం లక్ష్మణ్, అనూషలను రెడ్హ్యాండెడ్గా పట్టుకుని.. చెప్పుతీసుకుని చితకబాదింది. -
చెప్పుల్లో దాచాడు.. చిక్కుల్లో పడ్డాడు
తిరువనంతపురం : సుమారు ఏడు లక్షల రూపాయల విలువ చేసే గంజాయిని తరలించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని కన్నూరు అంతర్జాతీయ విమాన్రాశయ అధికారులు అరెస్ట్ చేశారు. వివరాలు.. కన్నూరు జిల్లా థాయథేరు ప్రాంతానికి చెందిన అజయ్ వలియబల్లథ్ అనే వ్యక్తి దోహా ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో అతను తన చెప్పుల్లో గంజాయి దాచి రహస్యంగా తరలించే ప్రయత్నం చేశాడు. కానీ అధికారులకు అనుమానం వచ్చి చెక్ చేయడంతో రూ. 7 లక్షల విలువ చేసే గంజాయి బయటపడింది. అజయ్ని అరెస్ట్ చేసిన పోలీసులు తదుపరి చర్యల కోసం అతన్ని మాదకద్రవ్యాల నియంత్రణ విభాగానికి అప్పగించారు. -
చెన్నైలో చెప్పులు లేకుండా తిరుగుతున్న నటుడు
కర్ణాటక, యశవంతపుర: ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటున్న నటుడు హుచ్చ వెంకట్ కాళ్లకు చెప్పులు లేకుండా చెన్నై వీధుల్లో తిరుగుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. సినిమాల్లో పంచింగ్ డైలాగులు వేసే హుచ్చ వెంకట్ చెన్నై వీధుల్లో అలా తిరగడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కొద్దిరోజుల క్రితం ‘దురహంకారి హుచ్చ వెంకట్’ అనే సినిమా ప్రోమోను విడుదల చేశారు. సినిమాను తీస్తున్నట్లు మాధ్యమాలకు విడుదల చేశారు. చెన్నై చిత్రాలు ఈ సినిమా షూటింగ్లో భాగమా, లేదా అనేది తెలియాల్సి ఉంది. -
పాదరక్షల్లో విదేశీ కరెన్సీ
అన్నానగర్: చెన్నై నుంచి గురువారం దుబాయ్కి పాదరక్షల్లో దాచిపెట్టి అక్రమంగా తరలించడానికి యత్నించిన విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. చెన్నై మీనంబాక్కం విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళ్లే విమానంలో నగదు అక్రమంగా తరలిస్తున్నట్లు విమానాశ్రయ అధికారులకు గురువారం రహస్య సమాచారం అందింది. అనంతరం అధికారులు విమానాశ్రయంలో నిఘా ఉంచారు. ఆ సమయంలో దుబాయ్కి వెళ్లడానికి చెన్నైకి చెందిన 35 ఏళ్ల యువకుడు వచ్చాడు. అతన్ని అనుమానంతో అధికారులు నిలిపి విచారణ చేశారు. పొంతన లేని సమాధానాలు తెలపడంతో అతని లగేజీలను పరిశీలించగా ఏమీ లభించలేదు. అనంతరం ప్రత్యేక గదికి తీసుకువెళ్లి తనిఖీ చేయగా అతను ధరించిన పాదరక్షల్లో రూ.13.50లక్షల అమెరికన్ డాలర్లు ఉన్నట్లు గుర్తించారు. అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని యువకుడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. మదురై విమానాశ్రయంలో కరెన్సీ పట్టివేత:యువకుడు అరెస్టు మదురై విమానాశ్రయంలో గురువారం రూ.43.50 లక్షల విలువైన ఇండియన్, విదేశీ కరెన్సీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించి యువకుడిని అరెస్టు చేశారు. వివరాలు.. మదురై నుంచి సింగపూర్కు వెళ్లే విమానంలో హవాలా నగదు అక్రమంగా తరలిస్తున్నట్లుగా గురువారం మదురై విమానాశ్రయ సహాయ కమిషనర్ వెంకటేష్బాబుకి సమాచారం అందింది. వెంటనే విమానాశ్రయ అధికారులు విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికులను పరిశీలన చేశారు. అప్పుడు పెద్ద సూట్కేసుతో వచ్చిన ఓ యువకుడిని అనుమానంతో విచారించారు. అతను తూత్తుకుడి నారాయణన్ వీధికి చెందిన పార్వతినాథన్ (29) అని తెలిసింది. అతని సూట్కేసులో కట్టలు కట్టలుగా రూ.45.50 లక్షల ఇండియన్, విదేశీ కరెన్సీ ఉన్నట్లు గుర్తించారు. అధికారులు నగదుని స్వాధీనం చేసుకుని పార్వతినాథన్ను అరెస్టు చేశారు. -
వావ్.. బాటిల్ని ఇలా కూడా వాడొచ్చా?!
చాలా సార్లు మనం పనికి రాని చెత్తగా భావించి పడేసిన వస్తువులే అద్భుతమైన కళాఖండాలుగా రూపుదిద్దుకోవడం చూస్తూనే ఉంటాం. మనకు పనికి రాని వస్తువు మరొకరికి ‘పని’ చూపించడం నిజంగానే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇదేం బ్రహ్మ విద్య కాదు. ఇలాంటి ఆవిష్కరణలు మనం కూడా చేయగలం. కాకపోతే దానికి కావల్సిందల్లా కాస్తంతా సృజనాత్మకత. ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాకు రూపమే ఇక్కడ ఫోటోలో ఉన్న చెప్పులు. వీటిని తయారు చేసిన వస్తువులు చూస్తే నిజంగానే మతి పోతుంది. మనం తాగి పారేసే ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను ఇలా చెప్పులుగా మార్చిన వైనానికి ఫిదా అవుతున్నారు నెటిజన్లు. న్యూజిలాండ్కు చెందిన ఓ మహిళ ఖాళీ బాటిళ్లకు ప్లాస్టిక్ స్ట్రాప్స్ జత చేసింది. ఇంకేముంది.. నిమిషాల్లో పనికి రాని బాటిళ్లు కాస్తా పాదరక్షలుగా మారాయి. ఇలా తయారు చేసిన తన ఈ కొత్త జాండల్స్(సాండల్స్ కాదు)ని అమ్మకానికి పెట్టింది. ధర కూడా చాలా చీప్ కేవలం రూ. 1400 అంటే ఫేస్బుక్లో అమ్మకానికి పెట్టింది. వీటిని చూసిన నెటిజన్ల సదరు మహిళ ఐడియాను మెచ్చుకోవడమే కాక ‘వీటిని కేవలం నీటిలో నడిచేందుకే వాడాలి’, ‘ఇవి కాస్తా జారి పోయేలా ఉన్నాయి.. కార్ టైర్తో చేసినవి ఐతే బాగుంటాయం’టూ కామెంట్ చేస్తున్నారు. -
వెరైటీ ప్రచారం: ఒక చేత చెప్పులు.. మరో చేత రాజీనామా
సాక్షి, జగిత్యాల : రాష్ట్రంలో నామినేషన్ల పర్వం ముగిసి.. ప్రచార హోరు పుంజుకుంటుంది. ఈ క్రమంలో జిల్లాకు చెందిన ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి ఇంటింటికి వెళ్లి చెప్పులు పంచుతూ.. వెరైటీ ప్రచారం నిర్వహిస్తూ ఆకట్టుకుంటున్నారు. వివరాలు.. జిల్లాలోని కొరుట్ల నియోజవర్గం నుంచి ఆకుల హన్మంతు అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హన్మంతు ఇంటింటికి తిరుగుతూ తనను గెలిపించాల్సిందిగా ఓటర్లకు మనవి చేశారు. ఎన్నికల్లో విజయం సాధిస్తే తాను ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తానన్నారు. ఒక వేళ మాట తప్పితే పబ్లిక్గా తనను చెప్పు తీసుకుని కొట్టండంటూ ఓటర్లకు చెప్పులను కూడా పంచారు. హామీలను నెరవేర్చకపోతే తనను పదవి నుంచి తొలగించవచ్చంటూ..ముందే సిద్ధం చేసి పెట్టుకున్న రాజీనామా పత్రాన్ని కూడా జనాలకు చూపిస్తున్నారు. ఈ విషయం గురించి హన్మంతు మాట్లాడుతూ.. సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకే తాను ఇలా ప్రచారం చేస్తున్నానంటూ తెలిపారు. అయితే కోరుట్ల నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పోటీచేస్తున్నారు. ఇప్పటికే మూడు సార్లు విజయం సాధించిన విద్యాసాగర్ రావు వరుసగా నాల్గోసారి విజయం సాధించాలని ఉవ్విళూరుతుండగా.. అధికార పార్టీ అభ్యర్థి మీద విజయం సాధించాలని హన్మంతు కృషి చేస్తున్నారు. -
దొంగ మెడలో చెప్పుల దండ
బరంపురం (ఒరిస్సా) : గంజాం జిల్లా పురుషోత్తంపురంలో దొంగను పట్టుకొని గ్రామస్తులు చితక బాది దొంగ మెడలో చెప్పుల దండవేసి గ్రామమంతా ఊరేగించారు. పోలీసులు అందించిన సమాచా రం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పురుషోత్తం పురం పోలీస్స్టేషన్ పరిధిలోని రణజూలి గ్రామంలో మంగళవారం రాత్రి ఒక ఇంటిలో చోరీకి యత్నిస్తూ గ్రామస్తులకు ఓ దొంగ చిక్కా డు. దీంతో గ్రామస్తులు దొంగను చితకబాది పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దొంగను అరెస్ట్ చేశారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చిరు ఉపాయం.. తొలగిస్తుంది అపాయం
ముత్తారం: ఎంతటి అపాయాన్ని అయినా చిన్నపాటి ఉపాయంతో తొలగించుకోవచ్చునని, ఉపాయం ఉంటే ఊళ్లు ఏలచ్చని కవులు చెప్పినట్లు..విద్యుత్ స్తంభాలు ఎక్కే క్రమంలో జరిగే అపాయాలను చిరు ఉపాయంతో తప్పిస్తున్నాడు తాత్కాలిక విద్యుత్ హెల్పర్గా పనిచేస్తున్న వ్యక్తి. పూర్తి వివరాల్లోకి వెళితే రామగిరి మండలం నాగేపల్లి గ్రామ పంచాయతీ విద్యుత్ హెల్పర్గా పనిచేస్తున్న కుమార్ విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ఇప్పటి వరకు నిచ్చెన ఉపయోగించేవాడు. విద్యుత్ స్తంభం పై భాగానికి వెళ్లాలంటే కాళ్లతోనే ఎక్కాల్సిన పరిస్థితి. దీంతో పలుమార్లు జారిపడి ప్రమాదాల బారిన పడిన ఘటనలు ఉన్నాయి. ప్రమాదాల నివారణ కోసం దీర్ఘంగా ఆలోచన చేశాడు. ఈ క్రమంలో విద్యుత్ స్తంభం దొడ్డుకు సరిపడా ఇనుప రాడ్లతో క్లిప్స్ తయారు చేయించి, వాటిని చెప్పులకు బిగించాడు. కాళ్లకు చెప్పులు తొడుక్కొని ఇనుప రాడ్లు, క్లిప్పుల మధ్య విద్యుత్ స్తంభం ఉండడం వల్ల జారిపోకుండా ఉండి సునాయసంగా స్తంభాన్ని ఎక్కుస్తున్నాడు. ఉపాయం చిన్నదే అయిన్పటికీ ఎన్నో అపాయాల నుంచి కాపాడుతోందని కుమార్ చెప్తున్నాడు. కుమార్ పనితనాన్ని అందరూ శభాష్ అంటూ అభినందిస్తున్నారు. -
‘నడక’యాతన
కోవెలకుంట్ల: చదువు కోసం ఇతర ఊళ్లకు రోజూ నడిచి వెళ్తున్న విద్యార్థుల బాధలు అన్నీ ఇన్నీ కావు. కాళ్లకు చెప్పులు లేకుండా.. ఒట్టికాళ్లతో ముళ్లబాటల గుండా రోజూ కొన్ని కిలోమీటర్ల మేర నడిచి వెళ్తున్నారు. ఇప్పుడు ఎండలు మండుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఈ నెల 12 నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు. ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు ఉంటున్నాయి. పాఠశాల ముగిశాక విద్యార్థులు మండుటెండలోనే ఒట్టికాళ్లతో నడుచుకుంటూ ఇళ్లకు చేరాల్సిన పరిస్థితి. దీంతో కాళ్లు బొబ్బలెక్కుతున్నాయి. మట్టిరోడ్లపై ముళ్లు గుచ్చుకుంటున్నాయి. వీరి అవస్థలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. జిల్లాలో 2,283 ప్రాథమిక, 932 ప్రాథమికోన్నత, 898 ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 6,41,530 మంది చదువుతున్నారు. పలు గ్రామాల్లో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు లేవు. పక్కనున్న గ్రామాలకు వెళ్లాలి. జిల్లాలో మొత్తం 1,435 గ్రామాలున్నాయి. వీటిలో 646 గ్రామాలకు ఆర్టీసీ బస్సుల్లేవు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ప్రాతినిథ్యం వహిస్తున్న పత్తికొండ నియోజకవర్గంలోనే దాదాపు 110 గ్రామాలకు బస్సులు వెళ్లడం లేదు. జిల్లాలో 70 గ్రామాలకు రోడ్డు సౌకర్యమున్నా..బస్సులు తిప్పకపోవడం గమనార్హం. చాలా గ్రామాల విద్యార్థులకు పాఠశాల సమయానికి కనీసం ఆటోలు కూడా ఉండడం లేదు. దీంతో కాలినడకన, సైకిళ్లపై వెళ్తున్నారు. కంకర తేలిన రోడ్లు, ముళ్లతో నిండిన దారుల గుండా భుజానికి బరువైన పుస్తకాల సంచి, చేతిలో నీళ్ల బాటిల్తో వెళ్లి రావాలంటే నరకం కన్పిస్తోంది. కాలికి ముళ్లు గుచ్చుకున్నా, రాయికొట్టుకున్నా బాధను భరిస్తూనే సమయానికి పాఠశాలకు చేరుకోవాలి. లేదంటే ఉపాధ్యాయులతో దెబ్బలు తినాల్సి వస్తుందని విద్యార్థులు భయపడుతూ వెళ్తున్నారు. కొద్దోగొప్పో ఆర్థిక స్తోమత ఉన్న వారి∙పిల్లలు కాళ్లకు చెప్పులు, సైకిళ్లపై స్కూళ్లకు వెళుతుండగా.. నిరుపేద పిల్లల పరిస్థితి మాత్రం దయనీయంగా ఉంది. ప్రభుత్వం గ్రామీణ ప్రాంత తొమ్మిదో తరగతి బాలికలకు మాత్రమే సైకిళ్లు అందజేసింది. మిగిలిన తరగతుల విద్యార్థినులతో పాటు బాలురకు ఇవ్వకపోవడంతో వారు కాలినడకన వెళ్లక తప్పడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన సైకిళ్లు కూడా నాసిరకంగా ఉండటంతో చాలా వరకు మూలన పడేశారు. ♦ కోవెలకుంట్ల మండలం భీమునిపాడులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉంది. ఈ పాఠశాలకు రెండున్నర కి.మీ దూరంలోని కంపమల్ల గ్రామానికి చెందిన విద్యార్థులు రోజూ పొలాల రస్తాలో కాలినడకన వెళ్లాల్సి వస్తోంది. ఇదే మండలం గుళ్లదూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పొట్టిపాడు గ్రామ విద్యార్థులు ఆయకట్టు దారి గుండా వెళ్తున్నారు. ♦ కోవెలకుంట్ల పట్టణంలో మూడు ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటికి పలు గ్రామాల నుంచి విద్యార్థులు వస్తుంటారు. పాఠశాల సమయానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో వెలగటూరు, బిజనవేముల, అమడాల గ్రామాల విద్యార్థులు నడుచుకుంటూ వస్తున్నారు. ♦ రేవనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు లింగాలకు చెందిన విద్యార్థులు గుండుపాపల నుంచి నడుచుకుంటూ రాక తప్పడం లేదు. ♦ కొలిమిగుండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మీర్జాపురం, నాయినిపల్లె నుంచి విద్యార్థులు నడిచి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అంకిరెడ్డిపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలకు రావాలంటే బందార్లపల్లె, తుమ్మలపెంట గ్రామాల విద్యార్థులదీ ఇదే పరిస్థితి. ♦ అబ్దులాపురం హైస్కూల్కు ఉమ్మాయిపల్లె, కోరుమానుపల్లె నుంచి విద్యార్థులు నడిచి వెళ్తున్నారు. ♦ అవుకు మండలంలోని సుంకేసుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చనుగొండ్ల, కాశీపురం గ్రామాల నుంచి కాలినడకన వస్తున్నారు. ♦ చెన్నంపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు శివవరం గ్రామానికి చెందిన విద్యార్థులు , సంజామల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ముచ్చలపురి, ఎగ్గోని, కొత్తపేట గ్రామాల విద్యార్థులు కాలినడకన వచ్చి చదువుకోవాల్సి వస్తోంది. మట్టిరోడ్డుపై అవస్థలు ఊళ్లో ఉన్నత పాఠశాల లేదు. పక్క గ్రామమైన గుళ్లదూర్తికి వెళ్తున్నాం. నాతో పాటు 20 మందిమి అక్కడికి వెళ్లి చదువుకుంటున్నాం. గ్రామం నుంచి బస్సు సౌకర్యం లేకపోవడంతో పొలాల దారి గుండా రెండున్నర కిలోమీటర్లు నడిచి వెళ్లాలి. ఐదుగురు విద్యార్థులకు సైకిళ్లు ఉన్నప్పటికీ మట్టిరోడ్డు కావడంతో కొన్నిచోట్ల వాటిని తోసుకుంటూ వెళ్లాలి.-విజయ్, 8వ తరగతి, పొట్టిపాడు -
నడచి వచ్చే పాదరక్షలు ఇవిగో!
సాక్షి, న్యూఢిల్లీ : సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు వస్తున్న విషయం తెల్సిందే. వాటికంటే ముందుగా సెల్ఫ్ డ్రైవింగ్ పాద రక్షకులు వచ్చినట్లున్నాయి. జపాన్లోని టోక్యో నగరానికి వెళితే ‘ప్రో పైలట్ పార్క్ ర్యోకన్’ అనే క్లాసికల్ హోటల్ కనిపిస్తోంది. అందులోకి వెల్లిన వినియోగదారులకు పాదరక్షలు వాటింతట అవే నడిచి వచ్చి స్వాగతం చెబుతాయి. వారు ఆ హోటల్లో ఎక్కడికెళ్లాలంటే అక్కడికి తీసుకెళతాయి. వారు ఆ పాదరక్షలను ఎక్కడ వదిలేసినా మళ్లీ గుమ్మం వద్దకు వచ్చి ఒకదాని పక్కన ఒకటి వరుసలో ఒదిగిపోతాయి. పాతాళభైరవి తెలుగు సినిమాలోలాగా ఆ పాదరక్షలు మహత్తు కలిగిన మాయా పాదరక్షలేమీ కావు. సాధారణ పాదరక్షలే. అయితే, వాటికి అడుగున రెండు చిన్నటి చక్రాలు, సెన్సర్లు, ఓ మోటారు ఉంటుంది. అందుకనే అవి వాటంతట అవి నడుచుకుంటూ లేదా నడుపుకుంటూ పోగలవు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలో ఉపయోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్నే ఈ పాదరక్షల్లో ఉపయోగించారు. ఆ హోటల్లో ఒక్క పాదరక్షలే కాదు. వినియోగదారులు కూర్చునే కుషన్లు, కుర్చీలు, టెలివిజన్ రిమోట్లు అన్నీ వాటంతట అవే నడిచి వస్తాయి. వెళతాయి. ప్రముఖ కార్ల కంపెనీ ‘నిస్సాన్’ తన కంపెనీ కార్ల ప్రచారం కోసం టోక్యో హోటల్లో వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇలా ఉపయోగించింది. -
నడచి వచ్చే పాదరక్షలు ఇవిగో!
-
చెప్పుల్లో కెమెరా పెట్టి...
-
అమాయకుడిపై ప్రతాపం.. రంగంలోకి ఉన్నతాధికారులు!
-
అమాయకుడిపై ప్రతాపం.. రంగంలోకి ఉన్నతాధికారులు!
నలంద : గ్రామ సర్పంచ్ అయి ఉండి తోటి గ్రామస్తుడిని దారుణంగా అవమానిస్తూ శిక్షించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీస్ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. సర్పంచ్ సహా ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. అసలు వివాదం ఏంటంటే.. బిహార్లోని నలంద జిల్లా అజాద్పూర్లో మహేష్ ఠాకూర్ అనే వ్యక్తి గత బుధవారం గ్రామ సర్పంచ్ దయానంద్ మాంఝీ సన్నిహితుడు సురేంద్ర యాదవ్ ఇంటికి వెళ్లాడు. ఎంత పిలిచినా ఎవరూ బయటకు రాకపోవడంతో ఠాకూర్ ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. తన ఇంట్లోకి వస్తావా నీకెంత ధైర్యమంటూ సురేంద్ర ఈ విషయాన్ని సర్పంచ్ కు చెప్పాడు. ఇంట్లో ఒంటరి మహిళ ఉన్న సమయంలో ఇంట్లోకి ఎవరు అనమతిస్తే లోపలికి వెళ్లాడో ఠాకూర్ చెప్పాలని సర్పంచ్ ముందు సురేంద్ర రెచ్చిపోయాడు. వాస్తవానికి ఆ సమయంలో ఇంట్లో చాలామంది ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. సురేంద్రతో సహా సర్పంచ్ సహా కుటుంబసభ్యులు ఠాకూర్ మీద మండిపడ్డారు. సురేంద్ర పురమాయించడంతో.. సర్పంచ్ విధించిన శిక్ష మేరకు తొలుత కొందరు మహిళలు ఠాకూర్ను 25 చెప్పు దెబ్బలు కొట్టారు. ఆపై ఇంటి ముందు ఉమ్మేసి ఆ మట్టిని, చెప్పులను నాకాలని హింసించి మరీ బాధితుడి చేత ఆ పని చేయించారు. విషయం వైరల్ కావడంతో నలంద డీఎం ఎస్ఎం త్యాగరాజన్ స్పందిస్తూ.. ఎనిమిది మందిపై కేసు నమోదు చేశామని, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం, సాధ్యమైనంత త్వరగా నిందితులను అరెస్ట్ చేస్తామని నలంద ఎస్పీ సుధీర్ కే పొరికా వెల్లడించారు. -
మహిళలతో చెప్పు దెబ్బలు.. అంతటితో ఆగకుండా!
నలంద : సాటి మనిషిని గౌరవించకపోగా వారిని చులకనగా చూడటం నేటికీ చూస్తూనే ఉంటాం. అయితే సాధారణ వ్యక్తులు ఇలా చేస్తేనే మనం తీవ్రంగా వ్యతిరేకించి వారికి హితబోధ చేస్తాం. కానీ బిహార్లో ఓ ప్రజాప్రతినిధే సాటి గ్రామస్తుడి పట్ల హీనంగా ప్రవర్తించి తీవ్ర విమర్శలపాలయ్యారు. నలంద జిల్లాలోని ఓ గ్రామంలో దాదాపు యాభైఏళ్లు పైబడిన వ్యక్తి ఏదో పనిమీద గ్రామ సర్పంచ్ ఇంటికి వెళ్లాడు. ఎంత పిలిచినా ఎవరూ బయటకు రాకపోవడంతో ఆ వ్యక్తి సర్పంచ్ ఇంట్లోకి ప్రవేశించాడు. ఇక అది మొదలు సర్పంచ్ సహా కుటుంబసభ్యులు అతడిమీద అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఆ వ్యక్తిని దారుణమైన శిక్ష వేశారు. తలుపు తట్టకుండా లోనికి వస్తావా ఎంతధైర్యం అంటూ బయటకు వెళ్లగొట్టారు. అంతటితో ఆటకుండా కొందరు మహిళలతో చెప్పులతో కొట్టించి దాడిచేశారు. చివరగా ఇంటిముందు ఉన్న మట్టిని, చెప్పులను నాలుకతో నాకాలని హింసించి పంతంతో ఆ వ్యక్తి ఆ పని చేయించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఈ విషయంపై సర్పంచ్ తీరును తప్పుపడుతూ విమర్శలు గుప్పించారు. -
బంగారం ఎక్కడ దాచారంటే..
న్యూఢిల్లీ: బంగారం అక్రమ రవాణాలో అక్రమార్కుల తీరు నిఘా అధికారులను సైతం నివ్వెర పరుస్తోంది. బేబీ డైపర్స్ నుంచి శరీర అవయవాలు దాకా దేన్నీ వదలకుండా పసిడి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఢిల్లీ విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహిస్తున్న కస్టమ్స్ అధికారులకు ఇలాంటి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఇందిరాగాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ వింత చెప్పు అధికారులను ఆకర్షించింది. అనుమానంతో ఆరాతీస్తే సుమారు రూ. 27 లక్షల విలువైన బంగారం పట్టుబడింది. ఇండియన్ పాస్ పోర్ట్ తో ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ఇద్దరు ప్రయాణికులనుంచి బుధవారం దీన్ని స్వాధీనం చేసుకున్నారు. సాధారణంగా కనిపించే స్లిప్పర్స్ లో భారీగా బంగారం పట్టుబడటం అక్రమార్కుల అనుసరిస్తున్న విధానానికి అద్దం పట్టింది. అయినా....చివరికి నిఘా కన్నుకు చిక్కక తప్పలేదు. బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి చేరుకున్న వీరినుంచి 938 గ్రాముల ఈ బంగారాన్నిఅధికారులు సీజ్ చేశారు. 118 చిన్న చిన్న ముక్కలుగా చెప్పుల్లోదాచి పెట్టిన ఈ బంగారం మార్కెట్ విలువ రూ.26.96లక్షలని అధికారులు తెలిపారు. కస్టమ్స్ చట్టం 1962 110 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేశామని చెప్పారు. ఈ కేసులో ఇరువురిని అనుమానితులుగా అదుపులోకి విచారిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన డీమానిటైజేషన్ తరువాత బంగారం అక్రమ రవాణా బాగా పెరిగింది. అనేక రెట్లు పెరిగి పోయిందని అధికారులు చెబుతున్నారు. ఈ వారంలోనే దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడినుంచి అట్టపెట్టెల్లో నల్లని ఇన్సులేట్ టేప్ తో అతికించిన గోల్డ్ ఫాయిల్స్ ను అధికారులు స్వాదీనం చేసుకున్నారు. 700 గ్రాములున్న దీని విలువ రూ.18.5 లక్షలు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి 2012-2013 కాలంలో 6.6 కిలోల బంగారం స్వాధీనం చేసుకోగా, 2013-2014 లో ఇది 384 కేజీలు పెరిగింది. 2014, 15 సంవత్సరాల్లో 574 కిలోలుగా ఉంది. అయితే 2016 లో మాత్రం 220 కిలోలకు పైగానే అధికారులకు చిక్కింది. దీని విలువ సుమారు రూ 60 కోట్లు. -
పాదరక్షల భారీ క్యూ
జమ్మికుంట(కరీంనగర్): నోట్ల కష్టాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని కేడీసీసీ బ్యాంకు వద్ద గురువారం వేకువజాము నుంచే ఖాతాదారులు భారీగా చేరుకొని క్యూలో నిల్చున్నారు. బ్యాంకు తెరిచేలోగా కాసేపు నీడన విశ్రాంతి తీసుకోవాలనుకున్న ఖాతాదారులు క్యూలో నిల్చోవడానికి బదులు చెప్పులను పెట్టారు. ఒకరి తర్వాత ఒకరు అందరూ నీడన చేరడంతో భారీగా చెప్పుల క్యూ ఏర్పడింది. -
చెప్పుల వివాదంలో చెయ్యి నరికేశాడు..
ఫిరంగిపురం: చెప్పుల విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య నెలకొన్న వివాదం పెద్దల మధ్య ఘర్షణకు దారితీసిన సంఘటన మంగళవారం 113 తాళ్ళూరు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని కటారి పుల్లయ్య కుమారుడు సాయి, డేగల గోవిందు కుమారుడు సాయి ఇద్దరు స్నేహితులు. కొద్ది రోజుల క్రితం పుల్లయ్య కుమారుడు కొనుగోలు చేసిన చెప్పులు అతడికి సరిపోకపోవడంతో గోవిందు కుమారుడు ఆ డబ్బు తాను ఇస్తానని, ఆ చెప్పులు తనకు ఇవ్వమని చెప్పి తీసుకున్నాడు. రోజులు గడుస్తున్నా చెప్పుల తాలూకూ డబ్బు ఇవ్వక పోవడంతో ఈనెల 10న స్నేహితులిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ విషయం తెలిసి మరుసటి రోజు ఇరు కుటుంబాల పెద్దలు ఘర్షణకు పాల్పడ్డారు. పథకం ప్రకారం కత్తిని వెంట తెచ్చుకున్న గోవిందు దుర్భాషలాడుతూ పుల్లయ్యపై విచక్షణారహితంగా దాడికి పాల్పడి కుడి చేతి మణికట్టు పై భాగంలో నరికాడు. స్థానికులు 108 వాహనంలో పుల్లయ్యను జీజీహెచ్కు తరలించారు. పరీక్షించిన వైద్యులు రక్తం అధికంగా పోవడంతో అపస్మారక స్థితిలో వున్నాడని తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఫిర్యాదు అందితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని వివరించారు. -
నటి వింద్యపై చెప్పులతో దాడి
టీనగర్: తిరువారూరు సమీపాన నటి వింద్య ఎన్నికల ప్రచారం చేస్తుండగా అన్నాడీఎంకే కార్యకర్తలు చెప్పులు విసరడంతో సంచలనం ఏర్పడింది. తిరువారూరు జిల్లా, నన్నిలం నియోజకవర్గంలో రెండవ సారిగా పోటీ చేస్తున్న మంత్రి కామరాజ్కు మద్దతుగా వలంగైమాన్, కుడవాసన్, నన్నిలం ప్రాంతాలలో నటి వింద్య బుధవారం రాత్రి ప్రచారం చేశారు. నన్నిలం బస్టాండు సమీపాన జరిగిన ప్రచార సభలో అక్కడ అన్నాడీఎంకే వర్గాలు గుమికూడాయి. ఆ సమయంలో రాత్రి 9.55 గంటలకు అక్కడికి వచ్చిన వింద్య సమయం మించిపోవడంతో తాను మాట్లాడలేనని, క్షమించాలని కోరుతూ తన ప్రసంగాన్ని ఆపారు. దీంతో ఆగ్రహించిన కార్యకర్తలు కొందరు వింద్యను ఏకపదజాలంతో మాట్లాడారు. కొందరు ఆమెపై పాదరక్షలు విసిరారు. దీంతో అన్నాడీఎంకే వర్గాల మధ్యే ఘర్షణ ఏర్పడింది. దీన్ని అక్కడున్న వీడియో, ఫోటోగ్రాఫర్లు చిత్రీకరించేందుకు ప్రయత్నించగా విద్యుత్ సరఫరా నిలిపివే శారు. దీంతో నటి వింద్య అక్కడి నుంచి దిగాలుగా వెళ్లిపోయింది. -
మనోబాలాపై చెప్పుల వర్షం
చెన్నై: అన్నాడీఎంకే తరఫున ఆర్కేనగర్ నియోజక వర్గంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన నటుడు మనోబాలాకు చేదు అనుభవం ఎదురైంది. అతనిపై ప్రజలు చెప్పులు విసిరి కోపాన్ని ప్రదర్శించారు. సోమవారం ఓపెన్జీపులో మనోబాలా వాషర్మెన్పేటలో ప్రచారం చేస్తున్న సమయంలో మేడపై నుంచి చెప్పులను విసిరేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. మనోబాలా ప్రసంగాన్ని ఆపేసి చెప్పులు వేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్కేనగర్ నియోజన వర్గం నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే చీఫ్ జయలలిత పోటీ చేస్తున్నారు. -
కన్హయ్యపై చెప్పులు, షూలతో దాడి
నాగ్పూర్: నాగ్ పూర్ ర్యాలీ రసాభాసగా మారింది. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 వ జయంతి సందర్భంగా జేఎన్యూ విద్యార్థి యూనియన్ ప్రెసిడెంట్ కన్హయ్య కుమార్ నిర్వహించిన ర్యాలీలో చెప్పులు, బూట్లు గాల్లోకి లేచాయి. కుప్పలుగా కొందరు వ్యక్తులు కన్హయ్య కుమార్ పై చెప్పులు, షూలతో దాడి చేశారు. నాగ్ పూర్ లో నిర్వహించిన బహిరంగ సభలో వేదిక వద్దకు తొలుత కన్హయ్య వచ్చాడు. అలా వచ్చాడో లేదో వెంటనే ఒక్కసారిగా చెప్పులు, షూలు అతడిపైకి కొందరు వ్యక్తులు విసిరారు. కన్హయ్య కుమార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చెప్పులు విసరడం ద్వారా ఎలాంటి దేశభక్తిని చూపించాలని అనుకుంటున్నారని కన్హయ్య కుమార్ ఈ సందర్భంగా వారిని ప్రశ్నించాడు. అంతకుముందు నాగ్ పూర్ లోకి ప్రవేశించగానే కన్హయ్య కుమార్ కారుపై బజరంగ్ దళ్ కు చెందిన కొందరు వ్యక్తులు దాడి చేసిన విషయం తెలిసిందే. -
ఇంత కుప్పలో నాకు నప్పే చెప్పులెక్కడ?
రాజమండ్రి: గోదావరి పుష్కరాల 12 రోజులూ కోట్లమంది స్నానమాచరించి, ఆ పుణ్యఫలం దక్కిందన్న తృప్తితో తిరిగి వెళ్లారు. పుష్కరాలు ముగిసి అయిదు రోజులైనా రాజమండ్రిలోని ఘాట్ల వద్ద ఇప్పటికీ అనేకులు నదిలో మునిగి తేలుతూనే ఉన్నారు. వారి లక్ష్యం పుణ్యఫలం మాత్రం కాదు..స్నానాల సందర్భంగా భక్తులు గోదారమ్మకు సమర్పించిన నాణేలు, వెండి, బంగారు ప్రతిమల వేట. అందుకోసం అయిస్కాంతాలు, చేటలు, ఇతర సాధనాలతో రేవుల్లో దేవుతూనే ఉన్నారు. మరికొందరు బడుగు జీవులు మాత్రం పుష్కర రద్దీలో భక్తలు విడిచిన వేలాది చెప్పుల్లో తమకు సరిపోయే 'జోడు' కోసం వెతుక్కుంటున్నారు. వీఐపీ ఘాట్, గౌతమి ఘాట్ల వద్ద భక్తులు విడిచి వెళ్లిన చెప్పులను పారిశుద్ధ్య సిబ్బంది ...ఇస్కాన్ ప్రాంతంలో గుట్టగా వేశారు. పట్టువదలని విక్రమార్కుడిలా ఆ గుట్టను గాలించిన ఓ బాలుడు చివరకి అనుకున్నది సాధించాడు. కొందరికి ఎంతసేపు వెతికినా నిరాశే మిగులుతోంది. -
రంగు ‘చెప్పు’కోండి చూద్దాం!
ఈ తరం అమ్మాయిలు డ్రెస్కు మ్యాచింగ్ చెప్పులు లేనిదే బయట కాలు పెట్టరు. అలాంటి వారి కోసమే ఇషూ డిజైనర్స్ అనే సంస్థ రంగులు మారే పాదరక్షలను తయారు చేసింది. చెప్పు అడుగు భాగంలో ఉన్న బ్లూటూత్ రిసీవర్ ద్వారా చెప్పు కుడి, ఎడమ వైపున ఉన్న స్ట్రిప్పై రంగులు మారుతుంది. ఈ ప్రక్రియను స్మార్ట్ ఫోన్ ద్వారా సంకేతాలు ఇవ్వడం వల్ల మనకు ఇష్టం వచ్చిన రంగులను సెలక్ట్ చేసుకోవచ్చు. డిసెంబర్లో విడుదల కానున్న వీటి ధర రూ. 15,600. -
చెప్పులు చెప్పే మర్మం ఏమిటి?
స్వప్నలిపి చెప్పులే కదా అని తేలిగ్గా తీసుకోవడానికి లేదు. కలలో కనిపించే ‘చెప్పులు’ కూడా ఎన్నో అర్థాలు చెబుతాయి. ఒకవిధంగా చెప్పాలంటే జీవితం పట్ల మన దృక్పథానికి, నమ్మక అపనమ్మకాలకు ఇవి అద్దం పడతాయి. చెప్పులు పాత పాడి, మరీ పాతబడి... నడవడానికి ఇబ్బంది పడడం అనే దృశ్యం తరచుగా కలలోకి వస్తే మీ వృత్తిలోనో, మీరు ఎంచుకున్న మార్గంలోనో ఆటంకాలు ఎదురవుతున్నట్లు. ఇక తరచుగా చెప్పులు మార్చడానికి కూడా ఒక అర్థం ఉంది. మనం ఏర్పర్చుకున్న అభిప్రాయాల్లో స్థిమితం కోల్పోవడాన్ని సూచిస్తుంది. చాలామందికి ఎక్కువగా వచ్చే కల... చెప్పులు పోవడం! ఒక దేవాలయంలోకి వెళ్లివస్తాం. బయట విడిచిన చెప్పులు కనిపించవు. ఏదో విందుకు హాజరవుతాం. బయట అందరి చెప్పులు ఉంటాయి... మన చెప్పులు కనిపించవు... ఇలా చాలా సందర్భాల్లో మన చెప్పులు మిస్ అవుతూ ఉంటాయి. ఇలా మాయం కావడం వెనుక ఏదైనా అర్థం ఉందా? ఉందనే అంటున్నాయి రకరకాల స్వప్నవిశ్లేషణలు. ముఖ్యకారణం చెప్పుకోవాల్సి వస్తే మనలోని ‘అతి జాగ్రత్త’ను, దాని గురించే చేసే పదేపదే ఆలోచన పరంపరకు ఇది అద్దం పడుతుంది. ఆత్మవిశ్వాసం కోల్పోవడం, లేని ప్రమాదాన్ని ఊహించుకునే సందర్భాల్లో కూడా ఇలాంటి కలలు వస్తుంటాయి. -
చెప్పులు విప్పితేనే భోజనం
వైవిధ్యం చెప్పులు ఎక్కడ విప్పుతాం? గుడి, మసీదు, ప్రార్థనా మందిరాలు.. కొన్ని సందర్భాల్లో దుస్తులు, నగల దుకాణాల ముందు.. ఇలా అన్నిచోట్లా తిరిగి ఇంటికి చేరుకున్నాక, ఇంటి గుమ్మం ముందు విప్పుతాం. అయితే, భోజనం కోసం హోటల్ లోపలకు వెళ్లడానికి చెప్పులు వదలడం ఎక్కడైనా చూశారా? వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా.. ఇలాంటి హోటల్ మన భాగ్యనగరంలోనే ఉంది. నగరంలోని పెద్దపెద్ద స్టార్ హోటళ్లు, బడా రెస్టారెంట్లలో ఎక్కడా కనిపించని సంప్రదాయం పూటకూళ్ల ఇంటిని తలపించే ఆ చిన్న హోటల్లో కనిపిస్తుంది. పట్టుమని పది అడుగుల పొడవు, ఐదడుగుల వెడల్పయినా లేని ఆ చిరు హోటల్లోకి అడుగు పెట్టాలంటే, పాదరక్షలను బయటే విడిచిపెట్టక తప్పదు. ఈ నిబంధన కేవలం భోజనానికి మాత్రమే పరిమితం కాదు. అక్కడ టిఫిన్ చేయాలన్నా, స్నాక్స్ తినాలన్నా ఈ నిబంధనను పాటించి తీరాల్సిందే. పాదరక్షల నిషేధాన్ని నిక్కచ్చిగా పాటిస్తున్న ఆ హోటల్.. సుల్తాన్బజార్లోని కందస్వామి లేన్లో ఉన్న ‘జై జలరాం హోటల్’. ఇంటి భోజనాన్ని తలపించే తృప్తికరమైన రుచులను వడ్డించడం ఈ హోటల్ ప్రత్యేకత అని చెబుతారు హోటల్ యజమానులు భావన్ రాజా, హర్ష రాజా దంపతులు. కింద కూర్చునే.. భావన్ది మహారాష్ట్రలోని అమరావతి. తన తాతల కాలంనాటి నుంచి అంటే దాదాపు 150 ఏళ్లుగా అక్కడ హోటల్ను నడుపుతున్నారు. భావన్ కొంతకాలం డిజిటల్ స్క్రీన్, ఫ్లెక్సీ, సైన్బోర్డ్, గ్లో యాడ్స్ బిజినెస్ కూడా చేశారు. అది తృప్తికరంగా సాగకపోవడంతో వదిలేశారు. అత్తగారిల్లు హైదరాబాద్కు మకాం మార్చారు. సొంత ఊరిలో హోటల్ నడిపిన అనుభవం ఉండటంతో.. కందస్వామి లేన్లో రెండేళ్ల క్రితం అద్దె ఇంటిలో హోటల్ ఏర్పాటు చేశారు. ఏడాది కిందటి వరకు అక్కడ హోటల్ ఉందంటే ఎవరూ నమ్మేవారు కాదు. ఎందుకంటారా..? కనీసం హోటల్ అని తెలిపే బోర్డు లేకపోవడం, అది కూడా మొదటి అంతస్తులో అద్దెకుంటున్న ఇంట్లో ఉండడం. పైగా అక్కడ ఎంచక్కా కస్టమర్లను కింద కూర్చోబెట్టి పంక్తి భోజనంలా వడ్డించేవారు. ఈ తరహా సంప్రదాయం నచ్చిన వాళ్లంతా భోజనం చేయడానికి క్యూ కట్టేవారు. సంప్రదాయుం ముఖ్యం.. ఏడాది కిందట షట్టర్ అద్దెకు తీసుకుని హోటల్ను కిందికి మార్చారు. ప్రస్తుతం కుర్చీల్లో కూర్చోబెట్టి భోజనం వడ్డిస్తున్నా, కస్టవుర్లు పాదరక్షలను విడిచి రావాలన్న నిబంధనను మాత్రం వీడలేదు. చెప్పులు విప్పి తినమంటే చాలా మందికి చిరాకే. ఇది నచ్చక.. వచ్చిన క స్టమర్లు వెనుదిరగక మానరు. ఫలితంగా హోటల్ ఆర్థికంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. దీన్ని గ్రహించే పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు పాదరక్షలతో ప్రవేశంపై నిషేధాన్ని పాటించడం లేదు. కాని భావన్ అలాకాదు. గిరాకీ ఎంత ముఖ్యమో, సంప్రదాయం కూడా అంతే ముఖ్యం అంటారు. ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం. తినేటప్పుడు చెప్పులు విప్పాలన్న నియమం కొందరికి నచ్చదు. అలాంటి కస్టమర్లు తినకుండా వెళ్లిపోతుంటారు. కొన్ని రోజులకు ఆలోచించుకుని తిరిగి వస్తుంటారు. సంప్రదాయం అని మాత్రమే కాదు, చెప్పులు విప్పి, కాళ్లు చేతులు కడుక్కుని శుభ్రంగా భోజనం ముందు కూర్చుంటే క్రిమికీటకాలు దరిచేరవు. ఫలితంగా ఆరోగ్యంగా ఉండొచ్చు’ అని భావన్ అంటున్నారు. - మహి -
సిబ్బందితో చెప్పులు మోయించిన ఆలయ ఈవో
-
మంత్రి అహ్మదుల్లాకు సమైక్యాంధ్ర సెగ