Smart Pulse Survey
-
స్మార్ట్ చెక్!
ఒంగోలు టౌన్: స్మార్ట్ పల్స్ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం మరోమారు తెరపైకి తీసుకొచ్చింది. దాదాపు ఏడాదిన్నర క్రితం స్మార్ట్ పల్స్ సర్వే పేరుతో ప్రభుత్వం హడావుడి చేసింది. ప్రతి ఇంటికి సంబంధించిన సమగ్ర సమాచారం కోసమంటూ ఆరు నెలలకు పైగా సర్వే చేయించింది. ఆ సర్వే ప్రక్రియ పూర్తయి ప్రజ లు కూడా మర్చిపోతున్న తరుణంలో ప్రభుత్వం స్మార్ట్ సర్వేను చెక్ చేయాలని అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది. స్మార్ట్ పల్స్ సర్వేలో పేర్లు ఉంటేనే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయంటూ ప్రభుత్వం సరికొత్త పల్లవి అందుకొంది. ఈ నేపథ్యంలో జిల్లాలో గతంలో నిర్వహించిన స్మార్ట్ పల్స్ సర్వే డేటాను ఆధారం చేసుకొని ప్రజల వివరాలను తిరిగి చెక్ చేసేం దుకు యంత్రాంగం సన్నద్ధమైంది.స్మార్ట్ పల్స్ సర్వేలో వివరాలు పొందుపరచుకుంటేనే కార్మికులకు చంద్రన్న బీమా పథకం వర్తిస్తుం డటంతో అనేక మంది ఈ బీమాను కోల్పోతున్నారు. చంద్రన్న బీమా పొందే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో తిరిగి స్మార్ట్ పల్స్ సర్వే చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా యంత్రాంగం స్మార్ట్ పల్స్ సర్వేకు సిద్ధమవుతోంది. 4 లక్షల మంది వివరాలు పెండింగ్ 2016 జూన్లో స్మార్ట్ పల్స్ సర్వేను జిల్లాలో ప్రారంభించారు. 2011 జనాభా లెక్కల ప్రకా రం జిల్లాలో 33 లక్షల 97 వేల 448 మంది ఉన్నారు. ఇటీవల కాలంలో వివిధ రకాలుగా నిర్వహించిన సర్వేలో ఆ సంఖ్య మరికొంత పెరిగింది. ప్రస్తుతం జిల్లాలో 34 లక్షల 9 వేల 28 మంది జనాభా ఉన్నట్లు యంత్రాంగం లెక్క కట్టింది. ఆరు నెలల పాటు ఏకధాటిగా నిర్వహించిన స్మార్ట్ పల్స్ సర్వేలో మొత్తం 14 లక్షల 2 వేల 284 ఇళ్లను ఎన్యూమరేటర్లు సందర్శించారు. ఆ ఇళ్లల్లో నివాసం ఉంటున్న 30 లక్షల 5 వేల 658 మంది వివరాలను సేకరించగలిగారు. ఆ సమయంలోనే 4 లక్షల ఒక వెయ్యి 370 మంది వివరాలు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో ఎక్కువ శాతం పనుల కోసం ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు వలసలు వెళ్లిన వారు ఉన్నారు. అంతేగాకుండా ఆధార్లో తమ వివరాలు పొందుపరచుకోనివారు కూడా ఉన్నారు. అదే విధంగా కొంతమంది మరణించారు. ఈ నేపథ్యంలో స్మార్ట్ పల్స్ సర్వేలో నమోదుకాని వివరాలు తిరిగి నమోదు చేయాలంటూ గతేడాది సెప్టెంబర్లో హడావుడి చేసినా ప్రభుత్వానికి సంబం« దింంచిన మిగిలిన కార్యక్రమాల్లో జిల్లా యం త్రాంగం బిజీ కావడంతో పెండింగ్లో ఉన్న స్మార్ట్ పల్స్ సర్వే వివరాలు అటకెక్కాయి. సర్వే అంటేనే హడల్ స్మార్ట్ పల్స్ సర్వే పేరు వింటేనే ఎన్యూమరేటర్లు హడలిపోతున్నారు. ఈ సర్వేలో ఒక్కో కుటుంబానికి 50కి పైగా వివరాలు సేకరించాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఎన్యూమరేటర్లుగా అంగన్వాడీ కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు, బిల్ కలెక్టర్లను నియమించారు. వారితో పాటు ఆ సమయంలో ఉపాధ్యాయులుగా ఎంపికై పోస్టింగ్ల కోసం ఎదురు చూస్తున్న వారిని కూడా స్మార్ట్ పల్స్ సర్వేకు వినియోగించారు. ఒకవైపు రెగ్యులర్ విధులు నిర్వహిస్తూ ఇంకోవైపు స్మార్ట్ పల్స్ సర్వే చేపట్టాల్సి రావడంతో ఎన్యూమరేటర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఆరు నెలల పాటు తమతో అదనపు చాకిరీ చేయించుకొని సకాలంలో తమకు పారితోషికం చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేయడంతో ఎన్యూమరేటర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. జిల్లా యంత్రాంగం వారికి దశలవారీగా పారితోషికాన్ని చెల్లించి వారిలోని ఆవేశాన్ని కొంతమేర చల్లార్చింది. తాజాగా మరోమారు స్మార్ట్ పల్స్ సర్వే చేయాల్సి రావడంతో ఎన్యూమరేటర్లుగా గతంలో విధులు నిర్వర్తించిన వారికి బలవంతంగా తిరిగి బాధ్యతలు అప్పగించే యోచనలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. అంతర్గత ఆరా? తాజాగా నిర్వహించనున్న స్మార్ట్ పల్స్ చెక్ పేరుతో ప్రభుత్వ పథకాలపై ఆరా తీయనున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ రకాల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా అనేదానిపై అంతర్గతంగా ఆరా తీయనున్నట్లు తెలిసింది. సార్వత్రిక ఎన్నికలె వస్తుండటంతో ప్రజల నాడి తెలుసుకునేందుకు కూడా ఈ సర్వే ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
సర్వే ఆధారంగా సంక్షేమ పథకాలు అందించాలి
ఒంగోలు టౌన్: ప్రజాసాధికార సర్వే (స్మార్ట్ పల్స్ సర్వే) ఆధారంగా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని కలెక్టర్ వి.వినయ్చంద్ ఆదేశించారు. ఇటీవల రెండు రోజుల పాటు సీఎం నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఈ విషయమై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. సోమవారం స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా అధికారులతో పలు కార్యక్రమాల గురించి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీ, మహిళా శిశు సంక్షేమం, వ్యవసాయ, కార్మిక, పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్లు తదితర సంక్షేమ పథకాలకు ప్రజాసాధికార సర్వే వివరాలు అనుసంధానం చేయాలని సూచించారు. ప్రజాసాధికార సర్వేకు సంబంధించి ఎక్కడైనా పెండింగ్లో ఉంటే స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 15 రోజుల్లోపు నమోదు పూర్తి చేయాలని, దీనిపై జాయింట్ కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. వచ్చే మార్చి నాటికి జిల్లా కేంద్రం మొదలుకొని క్షేత్ర స్థాయి వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ–ఆఫీసు విధానం తప్పనిసరిగా అమలులోకి రావాలని ఆదేశించారు. ఇందుకు నోడల్ అధికారిగా జాయింట్ కలెక్టర్ వ్యవహరిస్తూ ప్రతివారం సమీక్షిస్తూ ఉండాలని పేర్కొన్నారు. రానున్న రెండు నెలల్లో నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున నైపుణ్యాభివృద్ధిలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి భారీగా జాబ్ మేళాలు నిర్వహించి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆదేశించారు. అన్ని గ్రామ పంచాయతీల్లో తారు రోడ్లు నిర్మించాలని చెప్పారు. గ్రామాల నుంచి ప్రధాన రహదారులకు రోడ్లు వేయాలని ఆదేశించారు. రానున్న రెండు నెలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర కార్పొరేషన్ల ద్వారా ఇచ్చే పాడి పశువులను స్థానికంగా కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేయాలన్నారు. ఆక్వా రంగంలో రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలన్నారు. చేనేత క్లస్టర్లు, ప్రయోగశాలలకు స్థలాలను జాయింట్ కలెక్టర్, ఆర్డీఓలు, తహసీల్దార్లతో కలిసి 15రోజుల్లోపు ఎంపిక చేయాలన్నారు. గురుకుల పాఠశాలలు, కాపు, ఉర్దూ, బీసీ, క్రిస్టియన్, మైనార్టీ భవనాలకు స్థలాలు గుర్తించాలని ఆదేశించారు. జిల్లాలో ఖాళీగా ఉన్న రేషన్ దుకాణాల డీలర్లను భర్తీ చేయకుంటే చార్జ్మెమో జారీ చేస్తానని హెచ్చరించారు. జన్మభూమి–మాఊరులో వచ్చిన అర్జీలన్నింటినీ నెలాఖరులోగా పరిష్కరించాలని సూచించారు. గణతంత్ర వేడుకలు నిర్వహించాలి స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్స్లో ఈ నెల 26న గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ వినయ్చంద్ ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర సంక్షేమ శాఖల ద్వారా ఆరువేల మందికి తగ్గకుండా యూనిట్లు ఇచ్చేందుకు మెగా రుణమేళా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. స్వాతంత్య్ర సమరయోధులను మర్యాద పూర్వకంగా ఆహ్వానించాలన్నారు. ఈ నెల 25వ తేదీ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా జరపాలన్నారు. ఈ నెల 27వ తేదీన దేశంలోనే తొలిసారిగా చీరాలలో మహిళల అక్రమ రవాణాపై జరగనున్న అవగాహన సదస్సులో సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, పలువురు న్యాయమూర్తులు పాల్గొంటారని పేర్కొన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్–2 మార్కండేయులు, డీఆర్ఓ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి పాల్గొన్నారు. -
ఒక్క రూపాయిస్తే ఒట్టు..!
► స్మార్ట్ పల్స్ సర్వే సిబ్బందికి అందని రెమ్యునరేషన్ ►సర్వే పూర్తయి ఐదునెలలైనా పట్టించుకోని ప్రభుత్వం ►జిల్లాలో ఐదువేల మంది ఎదురుచూపు ఒంగోలు టౌన్: స్మార్ట్ పల్స్ సర్వే. గతేడాదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నోట ఎక్కువగా వచ్చిన మాట. జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రతి సందర్భంలోనూ స్మార్ట్ పల్స్ సర్వే గురించి ప్రస్తావిస్తూ జిల్లా అధికారులు మొదలుకుని క్షేత్ర స్థాయి సిబ్బంది వరకు పరుగులు పెట్టించారు. ప్రభుత్వ ఉద్యోగులకే అదనంగా పల్స్ సర్వే బాధ్యతలు అప్పగించడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో వారంతా సర్వే కోసం ఇంటింటికీ తిరిగారు. ఊపిరాడనీయకుండా వారితో సర్వే చేయించిన ప్రభుత్వం.. ఆ తరువాత వారికి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ గురించి పట్టించుకోలేదు. సర్వే పూర్తయి ఐదు నెలలు అవుతున్నా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా వారికి ఇవ్వలేదు. సర్వేలో తమను తరిమినట్లుగా పనిచేయించిన ప్రభుత్వం.. తమ కష్టానికి తగినట్లుగా రెమ్యునరేషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని ఎన్యుమరేటర్లు, అసిస్టెంట్ ఎన్యుమరేటర్లు ప్రశ్నిస్తున్నారు. పల్స్ సర్వేకు సంబంధించి తమకు ఎప్పుడు రెమ్యునరేషన్ ఇస్తారంటూ వారితో దగ్గరుండి సర్వే చేయించిన సూపర్వైజర్లను ప్రశ్నిస్తున్నారు. వారికి సమాధానం చెప్పుకోలేక అనేకమంది సూపర్వైజర్లు సతమతమవుతున్నారు . ఒక్కో రికార్డుకు ఒక్కో రేటు... స్మార్ట్ పల్స్ సర్వేలో పాల్గొన్న సిబ్బందికి ఒక్కో రికార్డుకు ఒక్కో రేటును ప్రభుత్వం నిర్ణయించింది. ఒక వ్యక్తికిç సంబంధించిన పూర్తి వివరాలను ఒక రికార్డు కింద నిర్ణయించి ఆ వివరాలను సేకరించిన ఎన్యుమరేటర్కు రూ.4, అసిస్టెంట్ ఎన్యుమరేటర్కు రూ.3, సూపర్వైజర్కు రూ.2 చొప్పున ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో 2,400 మంది ఎన్యుమరేటర్లు, 2,400 మంది అసిస్టెంట్ ఎన్యుమరేటర్లు ఈ ప్రక్రియ చేపట్టారు. వారి పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సకాలంలో సర్సే పూర్తి చేయించేందుకు వీలుగా దాదాపు 280 మంది సూపర్వైజర్లను నియమించారు. 2016 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 36,11,518 మంది ఉన్నారు. 90 శాతానికిపైగా స్మార్ట్ పల్స్ సర్వేలో వివరాలు సేకరించారు. మిగిలిన వారిలో కొంతమంది వలసలు వెళ్లడం, ఇంకొంతమంది చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో స్మార్ట్ పల్స్ సర్వే ప్రక్రియ పూర్తయినప్పటికీ రెమ్యునరేషన్ ఎప్పుడు ఇస్తారా అని సర్వేలో పాల్గొన్న సిబ్బంది ఎదురుచూసూ్తనే ఉన్నారు. చుక్కలు చూపించిన ప్రభుత్వం... స్మార్ట్ పల్స్ సర్వే పేరుతో అందులో పాల్గొన్న సిబ్బందికి ప్రభుత్వం చుక్కలు చూపించింది. జిల్లాలోని ప్రతి ఒక్కరికీ దాదాపుగా ఆధార్ కార్డులు ఉన్నాయి. ఆధార్ నంబర్ కొడితే సంబంధిత వ్యక్తికి సంబంధించిన సమగ్ర సమాచారమంతా క్షణాల్లో ప్రత్యక్షమవుతోంది. అయితే స్మార్ట్ పల్స్ సర్వే పేరుతో దాదాపు అరవై రకాల అంశాలను అందులో పొందుపరిచి తిరిగి ఎన్యుమరేటర్లు, అసిసెంట్ ఎన్యుమరేటర్లతో సర్వే చేయించింది. దానికితోడు స్మార్ట్ పల్స్ సర్వే ప్రారంభమైన తరువాత రోజుల వ్యవధిలో సాఫ్ట్వేర్ మారుస్తూ ప్రభుత్వం వారిని ముప్పతిప్పలు పెట్టింది. ఒకే వ్యక్తికి సంబంధించి అనేకమార్లు సర్వే చేయించింది. దీంతో అనేకమంది ఎన్యుమరేటర్లు, అసిస్టెంట్ ఎన్యుమరేటర్లు అదనపు విధుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. కానీ, ప్రభుత్వ ఆదేశాలు తప్పకుండా పాటించాలి్సందేనంటూ ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సర్వేలో సిబ్బంది తలమునకలయ్యారు. సర్వే నిర్వహించే సమయంలో ప్రజలు కూడా వారికి పూర్తి స్థాయిలో సహకరించకపోవడంతో అనేక మంది తీవ్ర అసహనానికి గురయ్యారు. ప్రభుత్వం తమకు సంబంధించిన అన్నిరకాల వివరాలు సేకరిస్తున్న నేపథ్యంలో భవిష్యత్లో తమను ఏమైనా ఇబ్బందికి గురిచేస్తుందేమోనని అనేక మంది భయపడి వాస్తవ వివరాలు కూడా చెప్పలేదు. సిబ్బంది వచ్చే సమయంలో మరికొంతమంది ఇళ్లలో అందుబాటులో లేకుండా పోయారు. స్మార్ట్ పల్స్ సర్వే నమోదు శాతం తక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ తప్పనిసరిగా తమ వివరాలు నమోదు చేయించుకోకుంటే భవిష్యత్లో ప్రభుత్వ పథకాలను పొందే అర్హత కోల్పోతారంటూ ప్రకటనలు రావడంతో ఎట్టకేలకు ప్రజలు ముందుకు వచ్చి తమ వివరాలను తెలియజేశారు. రూ.1.70 కోట్లు విడుదల : జిల్లాలో నిర్వహించిన స్మార్ట్ పల్స్ సర్వేకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల కోటీ 70 లక్షల రూపాయలు విడుదల చేసింది. దశలవారీగా నిధులు విడుదల చేయడం వల్ల కొంత గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం పూర్తి స్థాయిలో నిధులు విడుదల కావడంతో సిబ్బందికి రెమ్యునరేషన్ అందించేందుకు వారి బ్యాంకు ఖాతా నంబర్లను తీసుకుంటున్నాం. త్వరితగతిన వారికి రెమ్యునరేషన్ అందిస్తాం. – నోడల్ అధికారి ఉదయభాస్కర్ -
సర్వేల భారతం!
ఒంగోలు టౌన్: సర్వేల దెబ్బకు సిబ్బందే కాదు.. ప్రజలు కూడా బిత్తరపోతున్నారు. స్మార్ట్ పల్స్ సర్వే, ఓటర్ల సర్వేకు తోడు ఇప్పుడు ఉద్యోగ, నిరుద్యోగులకు సంబంధించిన సర్వే కూత మోగనుంది. ఎంపిక చేసిన 32 మండలాల్లో ఆదివారం నుంచి సర్వే ప్రక్రియ సాగనుంది. తహసీల్దార్ కార్యాలయాల్లోని సహాయ గణాంకాధికారుల ఆధ్వర్యంలో ముఖ్య ప్రణాళిక విభాగం అధికారులు పర్యవేక్షిస్తారు. గణన ఇలా.. ప్రతి గ్రామంలో 300 గృహాల్లో సర్వే చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో కుటుంబంలో ఎంతమంది సభ్యులున్నారు, వారిలో 15 సంవత్సరాలకు పైబడినవారు ఎంతమంది, అందులో ఉద్యోగులు, నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారనే వివరాలు సేకరించనున్నారు. కార్మికుల్లో అయితే స్కిల్డ్ ఎంతమంది, అన్ స్కిల్డ్ ఎంతమంది అనే వివరాలను కూడా సేకరించనున్నారు. జనవరి నాటికి సర్వే ప్రక్రియను పూర్తిచేసి సంబంధిత వివరాలను ఛండీగడ్లోని లేబర్ బ్యూరోకు నివేదిస్తారు. దీనిని ఆధారం చేసుకొని జిల్లాల వారీగా ఎంతమంది నిరుద్యోగులున్నారు, వారిలో నైపుణ్యం కలిగినవారు ఎంత మంది ఉన్నారు, ఏరకమైన ఉపాధి కల్పించాలన్న దానిపై చర్చించి నిరుద్యోగ సమస్యను నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మండలాలివే.. ఒంగోలు, పుల్లలచెరువు, పీసీపల్లి, దొనకొండ, సింగరాయకొండ, మార్టూరు, అద్దంకి, పొదిలి, జే పంగులూరు, మార్కాపురం, నాగులుప్పలపాడు, మర్రిపూడి, కొమరోలు, చినగంజాం, చీరాల, వేటపాలెం, కందుకూరు, కంభం, లింగసముద్రం, ఇంకొల్లు, పెద్దారవీడు, తర్లుపాడు, దర్శి, చీమకుర్తి, జరుగుమల్లి, సంతనూతలపాడు, గిద్దలూరు, యర్రగొండపాలెం, వలేటివారిపాలెం, బల్లికురవ, ఉలవపాడు, కనిగిరి మండలాలను సర్వే కోసం ఎంపిక చేశారు. పకడ్బందీగా నిర్వహించాలి: డిప్యూటీ డైరెక్టర్ జిల్లాలో ఉద్యోగ, నిరుద్యోగులకు సంబంధించిన సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ప్రణాళిక విభాగం డిప్యూటీ డైరెక్టర్ జి. భరత్కుమార్ ఆదేశించారు. సర్వేకు సంబంధించి ఎంపిక చేసిన మండలాల సహాయ గణాంకాధికారులతో శనివారం స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో సమావేశం నిర్వహించారు. ఈ సర్వే ద్వారా జిల్లాలో ఎంతమంది ఉద్యోగులున్నారు? ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో తెలుస్తుంది. అలాగే ఉపాధి కల్పించే విషయమై ప్రత్యేక చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. డిప్యూటీ ఎస్ఓ సీహెచ్ ఆదిశేషు, ప్రణాళిక విభాగం ఏడీ ఉమాదేవి, ఎస్ఓ రఘు పాల్గొన్నారు. -
ముగింపునకు వచ్చిన ప్రజాసాధికార సర్వే
కర్నూలు(అగ్రికల్చర్): దాదాపు ఆరు నెలలుగా సాగుతున్న ప్రజాసాధికార సర్వే ముగింపు దశకు వచ్చింది. సర్వే పరిధిలోకి రాని వారి గురించి తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు కారణాలు వివరిస్తున్నారు. జనాభా లెక్కల(2011) ప్రకారం జిల్లాలో 40,33,180 మంది ఉన్నారు. అయితే 35,46,235 మందిని సర్వే చేశారు. సర్వేకు 4,86,945 మంది దూరంగా ఉన్నారు. వీరిని సర్వే చేయకపోవడానికి తహసీల్దార్లు, మున్సిపల్ కమీషనర్లు కారణాలు తెలుపుతున్నారు. 25072 మంది మరణించినట్లు, 1,99,716 మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్లు.. 33456 మంది మహిళలు వివాహాలు చేసుకొని అత్తింటికి వెళ్లినట్లు.. ప్రజాసాధికార సర్వేకు 6959 మంది ఇష్టం చూపనటున్ల.. 21,713 ఇళ్లకు తాళం వేసి నట్లు.. 14,258 మందికి ఆధార్ నంబర్లు లేవని స్పష్టం చేస్తున్నారు. అలాగే 12,460 మందికి సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. ఇంకా 173041 మందికి సంబందించిన వివరాలు రాలేదు. -
12 నాటికి 22 వేల మంది వివరాలు సేకరించాలి
వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ ఆదేశం ఒంగోలు టౌన్ : స్మార్ట్ పల్స్ సర్వేకు సంబంధించి జిల్లాలో పెండింగ్లో ఉన్న 22 వేల మంది వివరాలు ఈ నెల 12వ తేదీ నాటికి సేకరించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్లాల్ ఆదేశించారు. రెవెన్యూ డివిజనల్ అధికారులు, మునిసిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో గురువారం స్థానిక సీపీఓ వీడియో కాన్ఫరెన్స హాలు నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో చిన్న పిల్లల వివరాలు స్మార్ట్ పల్స్ సర్వేలో నమోదు కావడం లేదని తన దృష్టికి వచ్చిందన్నారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారుల్లో కొంతమంది వివరాలు స్మార్ట్ పల్స్ సర్వేలో నమోదు కానట్లు తెలిసిందని చెప్పారు. ఆధార్ నంబర్లు లేని కారణంగా మరి కొంతమంది వివరాలు నమోదు కాలేదన్నారు. ఆధార్ కార్డులు లేని వారి కోసం గ్రామాల వారీగా మేళాలు నిర్వహించి యుద్ధప్రాతిపదికన వాటిని అందించాలని ఆదేశించారు. ఆధార్ నంబర్లు పొందిన వెంటనే వారి వివరాలు స్మార్ట్ పల్స్ సర్వేలో నమోదు చేయాలని సూచించారు. అదేవిధంగా చనిపోయినవారి వివరాలు సర్వే నుంచి తొలగించాలని ఆదేశించారు. గ్రామాలు, వార్డుల వారీగా స్మార్ట్ పల్స్ సర్వేకు సంబంధించిన జాబితాలను క్రాస్ చెక్ చేసుకోవాలని సూచించారు. జిల్లాలో వందశాతం స్మార్ట్ పల్స్ సర్వే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్మార్ట్ పల్స్ సర్వే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని జారుుంట్ కలెక్టర్ హరిజవహర్లాల్ హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్సలో ఇన్చార్జి జిల్లా రెవెన్యూ అధికారి భక్తవత్సలరెడ్డి, స్మార్ట్ పల్స్ సర్వే జిల్లా నోడల్ అధికారి ఉదయభాస్కర్, ఒంగోలు ఆర్డీఓ శ్రీనివాసరావు, ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ ప్రమీల పాల్గొన్నారు. -
ప్రజాసాధికార సర్వేను నేటితో ముగించండి
కర్నూలు(అగ్రికల్చర్): ప్రజాసాధికార సర్వేను ఎట్టి పరిస్థితుల్లోను నేటితో(30వ తేదీ) ముగించాలని రాష్ట్ర భూ పరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ అనిల్చంద్ర పునీత తెలిపారు. మంగళవారం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీఎల్ఏ మాట్లాడుతూ.. ప్రజా సాధికార సర్వేలోకి రాని వారు ఏఏ కారణాలతో దూరంగా ఉన్నారో రాతపూర్వకంగా తెలపాలన్నారు. ఎన్యూమరేటర్ల నుంచి తహశీల్దార్లు, తహసీల్దార్ల నుంచి జిల్లా కలెక్టర్లు సర్వే పరిధిలోకి రాని వారి పూర్తి సమాచారం సేకరించాలన్నారు. సర్టిఫికెట్లు తీసుకోవడంతో సర్వే ముగిసినట్లు అవుతుందన్నారు. సర్వే విభాగానికి సంబంధించి ఎఫ్ఎంబీల డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇందులో తగిన నాణ్యత ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. తహసీల్దార్ కార్యాలయ భవనాల నిర్మాణాలకు నిధులు విడుదల చేశామని.. వీటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కర్నూలు నుంచి జేసీ హరికిరణ్ మాట్లాడుతూ... భూసేకరణకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో అప్పిలేట్ అథారిటీని ఏర్పాటు చేయాలని, అప్పుడే రైతులు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. సీసీఎల్ఏ స్పందిస్తూ అప్పిలేట్ అథారిటీ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఆర్ఓ గంగాధర్గౌడు, సర్వే ఏడీ చిన్నయ్య, సెక్షన్ సూపరింటెండెంట్లు ఈరన్న, భాగ్యలక్ష్మి, రామాంజనమ్మ, ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. -
స్మార్ట్ పల్స్ సర్వే పూర్తి చేయాలి
కలెక్టర్ ముత్యాలరాజు నెల్లూరు(అర్బన్): ఈ నెలాఖరు నాటికి జిల్లాలో స్మార్ట్ పల్స్ సర్వేను పూర్తి చేయాలని కలెక్టర్ ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు. సర్వేకి సంబంధించిన విషయాలపై ఆయన కలెక్టర్ బంగ్లాలో అధికారులతో సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 2011 జనాభ లెక్కల ప్రకారం జిల్లాలో 29.52 లక్షల మందికి సర్వే చేయాల్సి ఉండగా 23.86లక్షల మందికి సంబంధించి సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు. నెల్లూరు కార్పొరేషన్లో 5.84 లక్షలమందికి గాను 3.34 లక్షల మందికి సర్వే పూర్తి చేశామన్నారు. రూరల్లో 90 శాతం అర్బన్లో 60శాతం సర్వే పూర్తి చేశామన్నారు. ఎన్యూమరేటర్లు సర్వే కోసం వచ్చినప్పుడు ఆధార్, రేషన్ కార్డు, ఆస్తిపన్ను, ఓటరు కార్డు, కరెంటు బిల్లు, డ్రైవింగ్ లైసెన్సు, వాహన రిజిస్ట్రేషన్, గ్యాసు, పట్టాదారుపాసు పుస్తకాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఎన్యూమరేటర్లు రాని పక్షంలో టోల్ ఫ్రీ 1800 425 2499కు ఫోన్ చేయాలని సూచించారు. సర్వే పూర్తయితే సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. -
మూడు రోజుల్లో ‘సర్వే’ పూర్తిచేయాలి
300మంది రెవెన్యూ సిబ్బందితో స్పెషల్ టీం ఏర్పాటు పల్స్సర్వేపై కలెక్టర్ అసహనం నెల్లూరు, సిటీ: నగర పాలక సంస్థ పరిధిలో జరుగుతున్న ప్రజాసాధికారిక సర్వే పై కలెక్టర్ మత్యాలరాజు అసహనం వ్యక్తం చేశారు. మూడు రోజుల్లో సర్వేను పూర్తిచేయాలని, అధనంగా 46మండలాల నుంచి 300 మంది స్పెషల్ టీంలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం పల్స్సర్వే అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్కలెక్టర్ ఇంతియాజ్, ఆత్మకూరు ఆర్డీఓ వెంకటేశ్వరరావు, కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముత్యాలరాజు మాట్లాడుతూ ఇప్పటి వరకు 4లక్షల మందికి సర్వే చేపట్టడం జరిగిందని, మరో 3లక్షలు మంది సర్వేలో నమోదు చేయాల్సి ఉందన్నారు. అందుకుగాను స్పెషల్ టీంను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కమిషనర్ వెంకటేశ్వర్లును ఎక్కడికి వెళ్లకుండా అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో పల్స్సర్వే అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
స్మార్ట్ పల్స్ సర్వే పూర్తి చేయండి
నెల్లూరు(పొగతోట): స్మార్ట్ పల్స్ సర్వే త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సీసీఎల్ఏ అనిల్చంద్రపునేఠ జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం విజయవాడ నుంచి జిల్లా అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సీసీఎల్ఏ మాట్లాడారు. వంద శాతం సర్వే పూర్తి చేసి వివరాలు అప్లోడ్ చేయాలన్నారు. ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకోవాలని తెలిపారు. ఈ కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ మహమ్మద్ఇంతియాజ్, డీఆర్ఓ మార్కండేయులు, ఆత్మకూరు ఆర్డీఓ ఎంవీ రమణ పాల్గొన్నారు. -
స్మార్ట్ పల్స్ సర్వేను పూర్తి చేయండి
నెల్లూరు(పొగతోట): స్మార్ట్ పల్స్ సర్వేను నిర్దేశించిన సమయంలో పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సీసీఎల్ఏ అనిల్చంద్రపునేట జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం విజయవాడ నుంచి జిల్లా అ«ధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. పేర్లు నమోదు చేసుకోని ప్రజలకు అవగాహన కలిగేలా ప్రచారం నిర్వహించాలన్నారు. ఇప్పటి వరకు 72 శాతం మాత్రమే సర్వే పూర్తి అయిందన్నారు. గ్రామాల్లో లేని వారి పేర్లు నమోదు చేసుకుని, వారి కోసం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రత్యేక ప్రాంతాల్లో ఎన్యూమరేటర్లను అందుబాటులో ఉంచి పేర్లు నమోదు చేయాలని తెలిపారు. ఈ కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ ఏ మహమ్మద్ఇంతియాజ్, డీఆర్ఓ మార్కండేయులు, ఆత్మకూరు ఆర్డీఓ ఎంవీ రమణ పాల్గొన్నారు. -
31లోపు సర్వే పూర్తి చేయండి
జేసీ ఇంతియాజ్ నెల్లూరు(పొగతోట): ప్రజా సాధికార సర్వే (స్మార్ట్ పల్స్ సర్వే)ను ఈ నెల 31వ తేదీలోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. ప్రజలందరూ 31వ తేదీలోపు తమ పేర్లను సర్వేలో నమోదు చేయించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్మార్ట్ పల్స్ సర్వేలో పేర్లు నమోదు చేయించుకున్నందు వలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సమగ్రంగా పొందవచ్చునని తెలిపారు. 31వ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోని వారి కోసం ప్రత్యేక ప్రాంతాలను ఏర్పాటు చేస్తామన్నారు. నవంబర్ 1, 2 తేదీల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెంటర్లలో వారు పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. పేర్లు నమోదు కాని వారు కేంద్రాలకు వచ్చి కుటుంబ సభ్యుల వివరాలు అందజేయాలని తెలిపారు. అంతకుముందు ప్రజా సాధికార సర్వే, భూ సమస్యలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ తదితర అంశాలపై సీసీఎల్ఏ అనిల్చంద్రపునేట జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. -
వేగవంతంగా స్మార్ట్ పల్స్ సర్వే
జేసీ ఇంతియాజ్ నెల్లూరు(పొగతోట): స్మార్ట్ పల్స్ సర్వేను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశించారు. కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులు, సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి నెలాఖరులోపు సర్వేను పూర్తి చేయాలని సూచించారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో 2.6 లక్షల మందికి సంబంధించిన సర్వేను పూర్తి చేయాల్సి ఉందని, సర్వేపై నిత్యం సీఎం టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి సమాచారాన్ని తెలుసుకుంటున్నారన్నారు. సర్వేను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సర్వేలో ఈకేవైసీ సమాచారాన్ని సేకరించాలని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 95 శాతం సర్వే పూర్తయిందని, పట్టణ ప్రాంతాల్లో వంద శాతం పూర్తి చేయాలని సూచించారు. సర్వే పూర్తయ్యేంత వరకే సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లను రిలీవ్ చేశామని, సంబంధిత శాఖ అధికారులు దృష్టిలో ఉంచుకొని సిబ్బందిని ఒత్తిడి పెట్టవద్దని తెలిపారు. కార్పొరేషన్ కమిషనర్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల వివరాలు ఆన్లైన్లో.. పోలింగ్ కేంద్రాల వివరాలను ఆన్లైన్లో పొందుపర్చేలా చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. గోల్డెన్ జూబ్లీ హాల్లో తహశీల్దార్లు, డీటీలు, కంప్యూటర్ ఆపరేటర్లకు నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. పోలింగ్ కేంద్రానికి వెళ్లే దారి, కేంద్రంలో సిబ్బంది ఉండే తీరు, పోలింగ్ ప్రక్రియ, తదితర వివరాలను మ్యాప్ల ద్వారా ఆన్లైన్లో పొందుపర్చాలని సూచించారు. ఫొటోలతో ఓటర్ల జాబితాలను నియోజకవర్గాల వారీగా సిద్ధం చేయాలన్నారు. జాబితాలను సిద్ధం చేసి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచురించాలని తెలిపారు. అనంతరం పోలింగ్ కేంద్రాల మ్యాప్ల అప్లోడింగ్పై శిక్షణ ఇచ్చారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయ ప్రాజెక్ట్ మేనేజర్ చిరంజీవి, వివిధ మండలాల తహశీల్దార్లు, డీటీలు, కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు. -
స్మార్ట్ సర్వే త్వరితగతిన పూర్తిచేయాలి
నెల్లూరు (పొగతోట) : ప్రజాసాధికర సర్వే (స్మార్ట్ పల్స్ సర్వే)ను త్వరితగతిన పూర్తిచేఽయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం విజయవాడ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో సర్వే జాప్యం జరుగుతోందన్నారు. నెల్లూరు జిల్లాలో గత నెలలో మూడుశాతం మాత్రమే సర్వే జరిగిందన్నారు. నీరు–చెట్టు, వనం–మనం, ప్రకృతి పిలుస్తోంది తదితర కార్యక్రమాలను పటిష్టంగా అమలుజేయాలని సూచించారు. దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని కొనసాగించాలన్నారు. కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు గుంటూరు కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఏ మహమ్మద్ ఇంతియాజ్, కార్పొరేషన్ కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
పల్స్ సర్వే నెలాఖరులోపు పూర్తి చేయండి
నెల్లూరు(పొగతోట): స్మార్ట్ పల్స్ సర్వే(ప్రజా సాధికార సర్వే) ఈ నెలాఖరులోపు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం విజయవాడ నుంచి జిల్లా అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సీఎం మాట్లాడారు. సర్వేలో ప్రజల ఫింగర్ ఫ్రింట్స్ సేకరించాలన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సర్వే సక్రమంగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్న లబ్ధిదారుల వివరాలు సర్వేలో నమోదు చేయాలన్నారు. చంద్రన్న బీమా పథకం పక్కగా అమలు చేయాలన్నారు. కలెక్టర్ ముత్యాలరాజు మాట్లాడుతూ జిల్లాలో 46 మండలాలు ఉన్నాయని, 32 మండలాల్లో వంద శాతం సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు. కాన్ఫరెన్స్లో విక్రమ సింహపురి వైస్ చాన్స్లర్ వీరయ్య, జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్, ఆర్డీఓలు పాల్గొన్నారు. అధికారులతో జేసీ సమావేశం ప్రజా సాధికార సర్వే పై వివిధ శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ తన చాంబర్లో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ నెల 24వ తేదీలోపు సర్వే వంద శాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో సీపీఓ పీబీకే మూర్తి, గూడూరు సబ్ కలెక్టర్ వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు. -
ప్రజాసాధికార సర్వేపై జేసీ అసంతృప్తి
అనంతపురం న్యూసిటీ : జిల్లాలో ప్రజాసాధికార సర్వే 50 శాతం మాత్రమే పూర్తి చేయడంపై జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 10లోపు పూర్తిచేయాలని రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో అధికారులతో ఆయన మాట్లాడారు. సర్వేలో తప్పులు సరిచేసిన వారిలో కదిరి మొదటి స్థానంలో, అనంతపురం చివరి స్థానంలో ఉందన్నారు. చంద్రన్న బీమా 87 శాతం పూర్తి అయ్యిందన్నారు. బీమా చేయడంలో ధర్మవరం మొదటి స్థానంలో ఉందన్నారు. జిల్లాలోని 126 గ్రా మాలను ఓడీఎఫ్గా ప్రకటించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. -
పల్స్ సర్వేపై లెక్క తేల్చండి!
ఒంగోలు టౌన్: ‘జిల్లాలో స్మార్ట్ పల్స్ సర్వేకు సంబంధించి ఐదు లక్షల జనాభా లెక్కలు తేలడం లేదు. ఒక్క ఒంగోలు నగరం, ఒంగోలు రూరల్æ ప్రాంతంలోనే 94 వేల మంది లెక్కతేలాల్సి ఉంది. వీరంతా ఎక్కడ తప్పిపోయారో గుర్తించండి. ఈనెల 15వ తేదీలోపు స్మార్ట్ పల్స్ సర్వే పూర్తి చేయాలి’ అని జిల్లా కలెక్టర్ సుజాతశర్మ ఆదేశించారు. సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు నియోజకవర్గ సమన్వయ అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, మునిసిపల్ కమిషనర్లు,మండల అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 70 శాతం మాత్రమే స్మార్ట్ పల్స్ సర్వే పూర్తయిందని అసంతృ ప్తి వ్యక్తం చేశారు. సీఎస్పురం, దోర్నాలతో కలుపుకొని మొత్తం 20 మండలాల్లో 60 నుంచి 70శాతం వెనుకబడి ఉన్నాయన్నా రు. కొన్ని ఇళ్లు పూర్తి స్థాయిలో సర్వే చేయలేదని, కొంతమంది సభ్యులనే సర్వే చేసినట్లు తెలుస్తోందన్నారు. సర్వేలో వెనుకబడిన 20 మండలాలకు చెందిన అధికారులు, నియోజకవర్గ సమన్వయ అధికారులకు ఈనెల 4వ తేదీ ప్రత్యేక సమావేశం నిర్వహించి సమస్యలు లోతుగా విశ్లేషించి పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్లాల్కు సూచించారు. సమన్వయంతో సమస్య పరిష్కరించండి.. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉన్న జనాభా కంటే సర్వే తక్కువ చేయడానికి వీలులేదని కలెక్టర్ స్పష్టం చేశారు. కొన్ని ఇళ్లు మూతవేయడం వల్ల సర్వే చేయలేకపోయి ఉండవచ్చని, అంతా కలిసి సమన్వయంతో లెక్కల తేడాను పరిష్కరించాలని ఆదేశించారు. 2011 తరువాత జన్మించిన పిల్లల వివరాలు కూడా సర్వే ద్వారా నమోదు చేయాల్సి ఉందన్నారు. అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రా లు, వసతి గృహాల్లోని పిల్లల వివరాలు సర్వేలో నమోదు కావాలని ఆదేశించారు. 2011తరువాత కొత్తగా ఏర్పాటైన మురికివాడలు, కాలనీలకు వెళ్లి సర్వే నమోదు చేయాలన్నారు. ప్రతిరోజూ సర్వేపై సమీక్షించాలని, ఈనెల 6,10,13తేదీల్లో ప్రత్యేకంగా సర్వేపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పురోగతి సమీక్షించనున్నట్లు స్పష్టం చేశారు. గృహ నిర్మాణం వేగవంతం చేయాలి.. ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణం కింద నియోజకవర్గానికి 1250 గృహాలు మంజూరు చేయాల్సి ఉందని కలెక్టర్ వెల్లడించారు. ఇప్పటివరకు 6,372 మంది లబ్ధిదారులను గుర్తించామన్నారు. ఎస్టీ, ఎస్టీ, మైనార్టీ రిజర్వేషన్ను పాటిస్తూ మిగిలిన ప్రతిపాదనలను జన్మభూమి కమిటీల ద్వారా గ్రామసభలు నిర్వహించి పంపాలని సూచించారు. గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇందుకోసం నియోజకవర్గం, డివిజన్ల వారీగా సమగ్ర డేటా సేకరించాలన్నారు. జిల్లాలో 5వేల ఎకరాల్లో మొక్కలు నాటాల్సి ఉండగా, ఇప్పటివరకు 1207 ఎకరాల్లో గుంతలు తవ్వి 527 ఎకరాల్లో నాటడం జరిగిందన్నారు. ఈనెల 15వ తేదీలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. గుంతలు తవ్విన వాటికి వెంటనే బిల్లులు చెల్లించాలని, ఎలాంటి జాప్యం చేయరాదని స్పష్టం చేశారు. జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల్లో వేటపాలెం, బల్లికురవ మండలాలు చాలా వెనుకబడి ఉన్నాయని, ప్రత్యేక శ్రద్ధ వహించి పురోగతి సాధించాలని ఆదేశించారు. ఈనెల 10వ తేదీ మరలా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని, ఆలోపు మంచి ప్రగతి కనబరచాలన్నారు. జిల్లాలో బోరు బావుల్లో రీ చార్జింVŠ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్లాల్, జాయింట్ కలెక్టర్–2 ఐ ప్రకాష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
154 మంది ఎన్యూమరేటర్ల షోకాజ్ నోటీసులు
కర్నూలు(అగ్రికల్చర్): ప్రజాసాధికార సర్వే పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న పలువురు ఎన్యూమరేటర్లకు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కర్నూలు జిల్లా సర్వేలో రాష్ట్రంలోనే వెనుకబడి ఉండటంతో కలెక్టర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వివిధ జిల్లాల్లో 80 శాతంపైగా సర్వే పూర్తయింది. జిల్లాలో మాత్రం 60 శాతం మాత్రమే ఉంది. దీంతో తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్ల నుంచి సర్వేను నిర్లక్ష్యం చేస్తున్న ఎన్యూమరేటర్ల వివరాలను తీసుకున్నారు. ఏకంగా 154 మంది ఎన్యూమరేటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీరిలో పలువురు సర్వేకు గైర్హాజర్ కాగా మరికొందరు తూతూ మంత్రంగా సర్వేకు హాజరువుతున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమం అయిన ప్రజా సాధికార సర్వేను నిర్లక్ష్యం చేస్తున్నందుకు ఎందుకు చర్యలు తీసుకోరాదో తెలుపాలని షోకాజ్ నోటీసులు ఇచ్చారు. తొలుత నంద్యాల మున్సిపాలిటీలో 18 మందికి, ఆత్మకూరు నగరపంచాయతీలో 6 మంది, వివిధ మండలాల్లో 13 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తాజాగా కర్నూలు నగరపాలక సంస్థలో 31 మంది షోకాజ్ నోటీసులు ఇచ్చారు. కర్నూలు రెవెన్యూ డివిజన్లో 40 మందికి, నంద్యాల డివిజన్లో 8 మంది, ఆదోని రెవెన్యూ డివిజన్లో 38 మందికి షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
ఎన్యూమరేటర్లపై దాడి
నెల్లూరు(పొగతోట): ప్రజా సాధికార సర్వే నిర్వహిస్తున్న ఎన్యూమరేటర్లపై నెల్లూరు బాలాజీనగర్ ప్రజలు కొందరు దాడి చేశారని, దీంతో సర్వే నిలిపివేశామని బాధితులు శుక్రవారం జేసీ ఇంతియాజ్ను కలిశారు. ఈ సందర్భంగా ఏపీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు సీహెచ్వీఆర్సీ శేఖర్రావు మాట్లాడుతూ ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన లేని కారణంగా ఎన్యూమరేటర్లు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారను. బాలజీనగర్లో సర్వేకు వెళ్లిన ఎన్యూమరేటర్లు ఐడీ పత్రాలు చూపించండని, కులం చెప్పమని స్థానికులను అడిగితే మీకేందుకు చెప్పాలని ప్రజలు సిబ్బందిని ఎదురు ప్రశ్నిస్తున్నారన్నారు. దీంతో సర్వే చేయడానికి ఎన్యూమరేటర్ల భయపడుతున్నారన్నారు. సర్వేపై ప్రజల్లో ఉన్న అపోహలను పొగోట్టేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు. ఆటోలో ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటామని జేసీ ఎన్యూమరేటర్లకు తెలిపారు. సర్వే నిలిపివేయకుండా కొనసాగించాలని ఎన్యూమరేటర్లకు సూచించారు. -
స్మార్ట్ పల్స్ సర్వే 60 శాతం పూర్తి
జేసీ ఇంతియాజ్ నెల్లూరు(పొగతోట): ప్రజా సాధికార సర్వే(స్మార్ట్ పల్స్ సర్వే) ఇప్పటి వరకు జిల్లాలో 60 శాతం పూర్తయిందని జేసీ ఇంతియాజ్ పేర్కొన్నారు. శుక్రవారం తన చాంబర్లో స్మార్ట్ పల్స్ సర్వేపై వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. జిల్లాలో 30 లక్షలకు పైగా జనాభా ఉన్నారన్నారు. 1976 మంది ఎన్యూమరేటర్ల ద్వారా ఇప్పటి వరకు 16.59 లక్షల జనాభాకు సంబంధించి సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు. సర్వేపై ఆటోల ద్వారా ప్రచారం కల్పించి ఈ నెలఖారుకు వంద శాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సర్వే వలన ప్రజలకు ఎటువంటి నష్టం జరగదన్నారు. -
పల్స్ సర్వేపై అసంతృప్తి
సమస్యలు పరిష్కరించడంలేదని బాయ్కాట్ నెల్లూరు సిటీ : పల్స్ సర్వేలో ఎదురవుతున్న పలు ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ఫలితం లేదని, సర్వే ఎన్యూమరేటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. నెల్లూరులోని కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఎన్యూమరేటర్లతో మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ చిరంజీవి, రెవెన్యూ ఆఫీసర్ గిరిజలు సమావేశం నిర్వహించారు. కొందరు ఎన్యూమరేటర్లు ఫీల్డ్లో ఎదురవుతున్న సమస్యలను వారికి చెప్పారు. అధికారులు జేసీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. దీంతో ఎన్యూమనేటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికే తాము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, సమస్యలను పరిష్కరించడంలేదని మండిపడ్డారు. సర్వేకి వెళ్లిన సమయంలో సంబంధిత కుటుంబసభ్యులు అందుబాటులో లేకపోవడం, పత్రాలు సరిగా లేకపోవడంతో ఆలస్యమవుతుందన్నారు. అయితే ఉన్నతాధికారులు మాత్రం ఏ మాత్రం పట్టించుకోకుండా ఒత్తిళ్లు చేయడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. అనంతరం సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. -
స్మార్ట్ సర్వేలో జిల్లాకు ప్రథమస్థానం
తణుకు టౌన్ : స్మార్ట్ పల్స్ సర్వేలో రాష్ట్రం మొత్తంలో జిల్లా ప్రథమస్థానంలో నిలుస్తుందని జిల్లా జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు చెప్పారు. మంగళవారం తణుకు తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాసాధికారిత సర్వే సమీక్ష సమావేశంలో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకూ 85 శాతం పూర్తి చేసినట్టు తెలిపారు. ఈ నెలాఖరు నాటికి సర్వేను పూర్తి చేస్తున్నట్టు లె లిపారు. సర్వే సిబ్బంది దర్శించిన గృహాల నుంచి ఇంటి నివాసితుల బయోమెట్రిక్ వివరాలను సేకరిస్తున్నట్టు తెలిపారు. కుటుంబంలో అందుబాటులో ఉన్న వారి వివరాలు సేకరించి, అనంతరం అందుబాటులో లేని వారి వివరాలను కూడా సేకరిస్తామన్నారు. జిలాల్లో మొత్తం 40 లక్షల జనాభా నుంచి 26 లక్షల నుంచి బయోమెట్రిక్ వివరాలు తీసుకున్నట్టు తెలిపారు. జిల్లాలో 2 లక్షల రేషన్ కార్డులకు గ్యాస్ కనెక్షన్లు అందించాల్సిందిగా గుర్తించినట్టు చెప్పారు. వాటిలో రేషన్ షాపుల ద్వారా కిరోసిన్ తీసుకునే వారిని బట్టి షాపుల నుంచి వారికి దరఖాస్తులను అందజేసినట్టు తెలిపారు. -
సాధికార సర్వే 40 శాతం పూర్తి
జేసీ ఇంతియాజ్ అహ్మద్ మనుబోలు: జిల్లాలో సాధికార సర్వే ఇప్పటి వరకు 40 శాతమే పూర్తయిందని జేసీ ఇంతయాజ్ అహ్మద్ తెలిపారు. ఆదివారం మనుబోలు దళితవాడలో జరుతున్న స్మార్ట్ పల్స్ సర్వేను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ జూలై 12 నుంచి జిల్లాలో సర్వే నిర్వహిస్తున్నామన్నారు. మొదట్లో చాలా ఇబ్బందులు తలెత్తినప్పటికీ ప్రస్తుతం అన్ని సర్ధుకున్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా పల్స్ సర్వేలో 2,198 మంది ఎన్యూమరేటర్లు పని చేస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు 28 వేల కుటుంబాలను సర్వే చేసినట్లు తెలిపారు. ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా సర్వేకు ప్రజలు పూర్తిగా సహకరించాలని కోరారు. రోజుకు 30 కుటుంబాలను సర్వే చేస్తున్న పంచాయతీ కార్యదర్శి గరుడయ్య, వీఆర్వో నాగార్జునరెడ్డిలను అభినందించారు. చెట్ల పంపకంతోనే కాలుష్య నివారణ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి చెట్లు పెంచడం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చని జేసీ ఇంతయాజ్ అహ్మద్ అన్నారు. కుడితిపల్లిలో వనం–మనం కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ నానాటికి పెరిగిపోతున్న కాలుష్యాన్ని నివారించేందుకు అందరూ మొక్కలు నాటాలన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ హేమలత, ఆర్ఐ కవిత ఉన్నారు. -
స్మార్ట్ సర్వేలో 10.52 లక్షల మంది వివరాల సేకరణ
ఏలూరు (మెట్రో) : జిల్లాలో ప్రజాసాధికార సర్వే ద్వారా 10.52 లక్షల మంది ప్రజల వివరాలను సేకరించామని జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు రాష్ట్ర సీసీఎల్ అనిల్చంద్ర పునీత్కు తెలిపారు. ప్రజాసాధికారత సర్వే, ప్రభుత్వ ఫైల్స్ పరిష్కారం, భూమి కన్వర్షన్ ఛార్జీల వసూళ్లు, ఎల్ఈసీ కార్డుల జారీ తదితర అంశాలపై రాష్ట్ర భూపరిపాలన శాఖ కమిషనర్ అనిల్ చంద్రపునీత్ శుక్రవారం జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ కోటేశ్వరరావు మాట్లాడుతూ స్మార్ట్ సర్వేలో జిల్లా రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిచిందన్నారు. -
సాంకేతిక సమస్యలు అధిగమించాం
స్మార్ట్ పల్స్ సర్వే జిల్లా ప్రత్యేకాధికారి శ్రీధర్ చంద్రశేఖరపురం(కొడవలూరు): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సాధికార సర్వే ప్రాధమిక దశలో సాంకేతిక సమస్యలు వెన్నాడిన మాట వాస్తవమేనని, అయితే ఆ సమస్యలను అధికమించినట్లు సర్వే జిల్లా ప్రత్యేకాధికారి బి.శ్రీధర్ స్పష్టం చేశారు. చంద్రశేఖరపురంలో జరుగుతున్న ప్రజా సాధికార సర్వేను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సర్వేకు తొలుత రాష్ట్రమంతా ఒకే సర్వర్ ఉండడం, సిబ్బందికి తగు శిక్షణ లేకపోవడం వల్ల సర్వే మందగించిందన్నారు. అయితే ఈ సమస్యలు ప్రభుత్వం దృష్టికిపోవడంతో జిల్లాకు ఒక సర్వర్ వంతున ఆధునిక పరిజ్ఞానం కలిగిన సర్వర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీంతో ప్రాధమిక దశలో తలెత్తిన సమస్యలకు కళ్లెం పడి సర్వే ఊపందుకుందని చెప్పారు. సర్వే పూర్తయితే ప్రభుత్వ పాలన సులభతరమవుతుందని చెప్పారు. తొలుత కుటుంబ పూర్తి వివరాలు నమోదయ్యే దాకా సేవ్ కాకపోవడం సమస్యగా ఉండేదని, ఇపుడు ఆ సమస్యను కూడా అధికమించడం జరిగిందన్నారు. సర్వే వల్ల కార్యాలయాల్లో సిబ్బంది అందుబాటులో లేక పాలన స్తంభిస్తుండడం వాస్తవమేనని, కానీ ఒక నెలపాటు ఆ సమస్యను ఎదుర్కోకతప్పదన్నారు. ఆయన వెంట ఆర్డీఓ వెంకటేశ్వర్లు, తహసీల్ధారు రామకృష్ణ, ఏఎస్ఓ శ్రీనివాసులు, వీఆర్వో ఉలవపాటి వెంకటేశ్వర్లు, వీఆర్ఏలు ఉన్నారు. -
నత్తే నయం..
దొరకని పల్స్ ముందుకు సాగని ప్రజా సాధికార సర్వే జిల్లాలో ప్రజా సాధికార సర్వే (స్మార్ట్ పల్స్ సర్వే) నత్తనడకన సాగుతోంది. సర్వేను వేగవంతంగా పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతున్నా అవి సత్ఫలితాలను ఇవ్వడంలేదు. సర్వర్, ట్యాబ్ల సమస్యలతో సర్వే వేగవంతంగా ముందుకు సాగడంలేదు. సర్వర్ మొరాయించడంతో సిబ్బంది ఆది నుంచి అవస్థలుపడుతున్నారు. నెల్లూరు(పొగతోట): జిల్లాలో ప్రజా సాధికార సర్వే ప్రారంభించి 10 రోజులు దాటుతున్నా ఇప్పటి వరకు 30 వేల మంది వివరాలు కుడా అప్లోడ్ చేయకపోవడం గమనార్హం. ప్రారంభంలో రెండు రోజులు సర్వర్ పని చేయలేదు. సర్వర్ సమస్యను పరిష్కరిస్తే ట్యాబ్ల నుంచి సమాచారం అప్లోడ్ కాకా మరో రెండు రోజులు ఇబ్బందులుపడ్డారు. ఈ రోజుకు కూడా పల్స్ సర్వే సమస్యలతో నిదానంగా సాగుతుంది. ఈ నెల 31వ తేదీలోపు మొదటి విడత సర్వే పూర్తి చేయాల్సి ఉంది. జిల్లాలో 940 పంచాయతీలు జిల్లాలో 940 పంచాయతీలున్నాయి. సుమారు 30 లక్షల మంది జనాభా ఉన్నారు. 8.60 లక్షల కుటుంబాలకు సంబంధించిన వివరాలు సేకరించాల్సి ఉంది. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతంలో 6500, అర్బన్లో 1200 కుటుంబాలకు సంబంధించిన వివరాలు మాత్రమే సేకరించారు. ప్రజలకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజా సాధికార సర్వే నిర్వహించి ప్రజల పూర్తి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ నెల 8వ తేదీ నుంచి జిల్లాలో స్మార్ట్ పల్స్ సర్వే ప్రారంభించారు. సర్వే చేసేందుకు 1452 మంది ఎన్యూమరేటర్లు, 1452 మంది అసిస్టెంట్లను నియమించారు. సర్వేను పర్యవేక్షించేందుకు 400 మంది సూపర్వైజర్లను నియమించారు. ఎన్యూమరేటర్లు క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వివరాలు సేకరించి ట్యాబ్లలో అప్డేట్ చేయడం ప్రాంభించారు. ట్యాబ్లలో తప్పులొస్తున్నాయి ప్రజల నుంచి వివరాలు సేకరించి ట్యాబ్లలో అప్డేట్ చేస్తున్నప్పుడు కొన్ని చోట్ల పురుషుడికి బదులు స్త్రీగా నమోదవుతోంది. ద్విచక్ర వాహనం ఉందని ట్యాబ్లో నమోదు చేస్తే లేదని చూపిస్తోంది. పేర్లు, అడ్రసు నమోదులో తప్పులు వస్తున్నాయి. రేషన్కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు ఉన్నాయని నమోదు చేస్తే లేనట్లు నమోదవుతున్నాయి. వాటిని సరి చేయడానికి జిల్లా యంత్రాంగానికి రెండు రోజుల సమయం పట్టింది. ట్యాబ్లు సక్రమంగా పని చేయక ఎన్యూమరేటర్లు ఇబ్బందులుపడుతున్నారు. కొన్ని చోట్ల కుటుంబంలో సభ్యులందరూ అందుబాటులో లేకపోవడంతో సర్వే ముందుకు సాగడంలేదు. ట్యాబలలో నూతన యాప్ అప్గ్రేడ్ కావడంలేదు. గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ సక్రమంగా అందక సిబ్బంది అగచాట్లు పడుతున్నారు. జిల్లాలో అనుకున్న సమయానికి మొదటి విడత సర్వే పూర్తయ్యే విషయం అనుమానంగా ఉంది. ప్రస్తుతం జరుగుతున్నట్లు సర్వే కొనసాగితే పూర్తి కావడానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుందని అధికారులే చెబుతున్నారు. సర్వర్ లోపాలను సవరించాం: మహమ్మద్ ఇంతియాజ్, జేసీ ప్రజా సాధికార సర్వే వేగవంతంగా నిర్దేశించిన సమయంలోపు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాం. సర్వర్ లోపాలను సవరించాం. నూతన సర్వర్ ఏర్పాటు చేశాం. ట్యాబుల్లో పేర్లు మార్పు తదితర సమస్యలు పరిష్కరించాం. సర్వే వేగవంతంగా పూర్తి చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. -
పల్స్ సర్వే ఫ్లాప్
-
గందరగోళంగా పల్స్ సర్వే
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ పల్స్ సర్వే (ప్రజాసాధికారిక సర్వే) గందరగోళంగా మారింది. యాప్ డౌన్లోడ్కాక, సర్వర్ పనిచేయక సర్వే నత్తనడకన సాగుతోంది. అసలు సర్వే ఎందుకుచేస్తున్నారో ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన లేదు. సర్వే సందర్భంగా అడుగుతున్న అంశాలను బట్టి పథకాల్లో కోత విధించేందుకే అని చాలామంది భావిస్తున్నారు. ► చాలాచోట్ల డౌన్లోడ్ కాని యాప్ ► నత్తనడకన సాగుతున్న సర్వే ► పనులు మానుకొని ఇళ్ల వద్ద ఎదురుచూస్తున్న ప్రజలు ► పథకాల్లో కోత విధిస్తారని ప్రచారం చేజర్ల : ప్రజాసాధికారిక సర్వేను ప్రభుత్వం ఈనెల ఈ నెల 8వతేదీన ప్రారంభించింది. ఎన్యూమరేటర్లు ప్రజలకు సంబంధించి పలు అంశాల సమాచారాన్ని ఒకేచోట పొందుపర్చడమే దీని ప్రధాన లక్ష్యం. బ్యాంకు లావాదేవీలు, గృహోకపరణాలైన టీవీ, ఫ్రిజ్, గ్యాస్, సొంతిల్లు, గ్యాస్ సబ్సిడీ, విద్యార్హత వివరాలు ఇలా వివిధ రకాల సమాచారాన్ని సర్వేలో సేకరిస్తారు. దీనికోసం జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున యంత్రాగాన్ని ఏర్పాటుచేసింది. 47 మంది ఇన్చార్జ్ అధికారులు, 51 మంది మాస్టర్ ట్రైనర్లు, 176 మంది సూపర్వైజర్లు, 1,487 మంది ఎన్యూమరేటర్లు 1,487 మంది అసిస్టెంట్లు సర్వే చేసేందుకు నియమించబడ్డారు. ప్రారంభించిన తొలిరోజు నుంచే సాంకేతిక సమస్యలు తలెత్తడంతో సర్వేకు అంతరాయం ఏర్పడుతోంది. యాప్ డౌన్లోడ్ కాక సిబ్బంది ఎంతో ఇబ్బందిపడ్డారు. మొదట 2.1 సాఫ్ట్వేర్ వర్షన్ డౌన్లోడ్ చేయగా అది పనిచేయకపోవడంతో తర్వాత 2.2, 2.3, 2.3.1 ప్రస్తుతం. 2.4.1 వర్షన్లో ప్రయత్నిస్తున్నా యాప్ డౌన్లోడ్ కావడం లేదు. ఒక్కో వ్యక్తిని సర్వేచేసేందుకు ఎన్యూమరేటర్లకు ఇచ్చేది కేవలం రూ.2 మాత్రమే. దీంతో వారు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఎందుకో..? సర్వే ఎందుకోసం..? ప్రజలందరిలో మెదులుతున్న ప్రశ్న ఇది. సమాచారాన్ని సేకరించడమని చెబుతున్నా ఇందులో మర్మం దాగుందని రాజకీయపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇందుకు తగ్గట్లుగానే సర్వేసాగుతోంది. బైక్ ఉందా? లేదా? ఆదాయం ఎంత? ఎవరెవరు ఉద్యోగం చేస్తున్నారు? ఇలా పలు వివరాలు సేకరిస్తుండటంతో ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పథకాల్లో కోత విధించేందుకే సర్వే అనే ప్రచారం ఉంది. పనిపోయే.. గ్రామాల్లో సర్వే పేదలను ఇబ్బందిపెడుతోంది. క్షేత్రస్థాయి సిబ్బంది ఈ రోజు ఫలానా ఊరికి వస్తాం.. అందుబాటులో ఉండండని ప్రజలకు చెబుతున్నారు. అయితే సాంకేతిక సమస్య కారణంగా ఒక్కో ఇంట్లోనే గంటలకొద్ది సమయం పడుతుండటంతో ఎక్కువమందిని సర్వే చేయలేకపోతున్నారు. దీంతో కూలి పనులకు వెళ్తేగానీ పూటగడవని పరిస్థితి దారుణంగా ఉంది. రెండు రోజుల క్రితం ఓ మండలంలోని గ్రామంలో సర్వే ప్రారంభించగా ఒక్క ఇంటి వివరాలు సేకరించేందుకే మధ్యాహ్నమైంది. దీంతో పక్కరోజు సర్వే చేస్తామని అధికారులు చెప్పగా మీవల్ల పనులు పోయాయని కొంతమంది అసంతృప్తి వ్యక్తంచేశారు. మెరుగైన సాఫ్ట్వేర్ అందుబాటులోకి తెస్తున్నాం స్మార్ట్పల్స్ సర్వే విషయంలో తలెత్తిన సాంకేతిక సమస్యను రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. మరో రెండు రోజుల్లో ఎటువంటి ఆటంకాలు లేని మెరుగైన సాఫ్ట్వేర్ అందుబాటులోకి తెస్తాం. సమస్యను పరిష్కరిస్తాం. -ఇంతియాజ్ అహ్మద్, జాయింట్ కలెక్టర్ -
అందని ‘పల్స్’
► ముందుకు కదలని స్మార్ట్పల్స్ సర్వే ► ఒకరోజు సిగ్నల్, ఇంకోరోజు నెట్, మరోరోజు వెర్షన్ సమస్య ► ఒక్కో ఇంటికి రెండు గంటలకుపైగా సమయం ► తలలు పట్టుకుంటున్న ఎన్యుమరేటర్లు ► నిర్ణీత గడువులోగా మొదటి విడత పూర్తి అనుమానమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ పల్స్ సర్వేకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఒకరోజు సిగ్నల్ సమస్య, ఇంకోరోజు ముందుకు కదలని నెట్, మరోరోజూ వెర్షన్ మార్పు...ఇలా రకరకాల సమస్యలతో సర్వే నత్తనడకను తలపిస్తోంది. ఒక్కో ఇంటిని అరగంటలోపు సర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు, సాంకేతిక సమస్యల కారణంగా రెండు గంటలకు పైగా పడుతోంది. దాంతో ఎన్యుమరేటర్లు తలలు పట్టుకుంటున్నారు. ఒంగోలు టౌన్: జిల్లాలో స్మార్ట్ పల్స్ సర్వే నత్తనడకన సాగుతోంది. వారం రోజుల పాటు నిర్వహించిన ఈ సర్వేలో అతికష్టం మీద రెండువేల గృహాలను పూర్తి చేశారు. ఈ లెక్కలను చూసి దిమ్మతిరిగిన యంత్రాంగానికి రాష్ట్రవ్యాప్తంగా పోల్చుకుంటే ప్రకాశం జిల్లా మొదటి స్థానంలో ఉందంటూ తేలడంతో నవ్వాలో ఏడవాలో అర్థంకాని అయోమయ పరిస్థితిలో జిల్లా యంత్రాంగం ఉంది. జిల్లాలో 8లక్షల 60 వేల 4643 కుటుంబాలు ఉన్నాయి. రెండు విడతల్లో ఆ కుటుంబాలకు సంబంధించిన సమగ్ర సమాచారం సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అందులో భాగంగా ఈనెల 8 నుంచి 30వ తేదీ వరకు మొదటి విడత, ఆగస్టు 6 నుంచి 14వ తేదీ వరకు రెండో విడత సర్వే చేపట్టాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ సర్వే కోసం 2312 ఎన్యుమరేటర్ బ్లాకులుగా గుర్తించింది. అందులో గ్రామీణ ప్రాంతాల్లో 1932, పట్టణ ప్రాంతాల్లో 285, నగర పంచాయతీల్లో 95 బ్లాక్లుగా విభజించింది. ప్రతి ఎన్యుమరేటర్కు ట్యాబ్, బయోమెట్రిక్ డివైస్ అందిస్తున్నట్లు జిల్లా యంత్రాంగం ముందుగా ప్రకటించింది. ట్యాబ్లు తగినంతగా లేకపోవడంతో ఇతర శాఖల్లో అమలు చేస్తున్న ట్యాబ్లను హడావుడిగా తెప్పించి సర్వే చేపట్టారు. సర్వర్ డౌన్ : సర్వే ప్రారంభించిన రోజు నుంచి నెట్ సమస్య, సర్వర్లు డౌన్ కావడం పరిపాటిగా మారింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సర్వే నిర్వహిస్తున్నట్లు పదేపదే ప్రకటించినా అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో ఘోరంగా విఫలమైంది. సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొస్తూనే ఉండటం జిల్లా యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. ఒక్కో ఎన్యుమరేటర్ రోజుకు 14 ఇళ్లు సర్వే చేయాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది. అయితే సాంకేతిక సమస్యలతో రెండిళ్లు దాటి ముందుకు కదల్లేని పరిస్థితి నెలకొంది. దానికితోడు సర్వేకు సంబంధించి 80 రకాల ప్రశ్నలకు సమాధానాలను సేకరించాల్సి రావడంతో అధిక సమయం తీసుకుంటోంది. ఒక ఇంటిలోని కుటుంబ సభ్యుల వివరాలన్నీ సేకరించడంతోపాటు వారికి సంబంధించిన ఐరిష్ లేదా తంబ్ తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశాలు రావడంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. స్మార్ట్ పల్స్ సర్వేకు సంబంధించి చంద్రన్న బీమా పథకం కూడా ఎన్యుమరేటర్లకు తలనొప్పిగా మారింది. అసంఘటిత కార్మికులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ పథకం ద్వారా ఎలాంటి ఉపయోగం కలుగుతుందన్న విషయాన్ని ఎన్యుమరేటర్లు సమగ్రంగా చెప్పలేకపోవడం కూడా ఆలస్యానికి కారణమవుతోంది. ఇదిలా ఉంటే స్మార్ట్ పల్స్ సర్వేకు సంబంధించి ఏ రోజు ఏ ప్రాంతంలో నిర్వహిస్తున్నారన్న విషయాన్ని ముందుగా ప్రకటించకపోవడం ఆలస్యానికి మరింత కారణమవుతోంది. పైగా సర్వే అంశాల వల్ల తాము నష్టపోతామన్న భయం కూడా అనేక మందిని పట్టి పీడిస్తోంది. ఒకవైపు ప్రభుత్వ పథకాలు సమగ్రంగా అందించేందుకు స్మార్ట్ పల్స్ సర్వే నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించినప్పటికీ, అందుకు విరుద్ధంగా తమకు అందుతున్న పథకాలకు ఎక్కడ పంగనామం పెడతారోనన్న భయం ప్రజలను పట్టిపీడిస్తోంది. జిల్లాలో అడుగుపెట్టని స్పెషల్ ఆఫీసర్ స్మార్ట్ పల్స్ సర్వేకు సంబంధించి అన్ని జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం నియమించింది. అందులో భాగంగా గతంలో జిల్లా కలెక్టర్గా వ్యవహరించిన కరికాల వళవన్ను ప్రకాశంకు కేటాయించింది. అయితే స్మార్ట్ పల్స్ సర్వే ప్రారంభమై వారం రోజులు దాటినా ఇంతవరకు స్పెషల్ ఆఫీసర్ జిల్లాలో అడుగుపెట్టలేదు. ప్రతిచోట ఏదో ఒక సమస్య వస్తుండటం, దానిని పరిష్కరించేసరికి సంబంధిత అధికారులకు తలబొప్పి కడుతున్న తరుణంలో స్పెషల్ ఆఫీసర్ రాకవల్ల పెద్దగా ప్రయోజనాలు కనిపించడం లేదు. -
‘సర్వే’శ్వరా..చదువులెలా..
తిరుపతి : తిరుపతి మున్సిపల్ స్కూళ్లల్లో విద్యాబోధన అటకెక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్కూళ్లల్లో పాఠాలు బోధించే ఉపాధ్యాయులను మున్సిపల్ అధికారులు స్మార్ట్ పల్స్ సర్వేకు కేటాయించారు. 50 మంది ఉపాధ్యాయులను ఇందుకు కేటాయించడంతో ఆయా స్కూళ్లల్లో తరగతులు జరగడం కష్టమైంది. విద్యాబోధన అగమ్యగోచరంగా మారిందని ప్రధానోపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. మున్సిపల్ అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయం విద్యార్థుల ఉజ్వల భవితవ్యంపై ప్రభావం చూపనుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం రాష్ట్రమంతా మూడు రోజుల కిందట ప్రజా సాధికార సర్వేను ప్రారంభించింది. అన్ని పట్టణాల్లోనూ ఈ సర్వే ప్రారంభమైంది. రాష్ట్రంలోని తిరుపతి, కర్నూలు, విశాఖపట్నం వంటి కార్పొరేషన్లతో పాటు మార్కాపురం, కందుకూరు, తెనాలి, వంటి మొత్తం 12 మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల పరిధిలో మున్సిపల్ టీచర్లను కూడా ఇందుకోసం కేటాయించారు. మున్సిపల్ కార్యాలయాల్లో పనిచేసే జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, ఇతరత్రా అధికారులందరితో పాటు మున్సిపల్ స్కూల్స్లో పనిచేసే ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ టీచర్లకు కూడా సర్వే డ్యూటీలు వేశారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో 50 మందికి ఈ డ్యూటీలు పడ్డాయి. ఒక్కొక్కరికీ ఆరేసి బ్లాకులు కేటాయించారు. విధుల్లో ఉన్న ఉద్యోగికి పూర్తి సమాచారం సేకరించడానికి ఒక్కో ఇంటికి గంట సమయం పడుతోంది. రోజుకు పది ఇళ్లు సర్వే చేయడం గగనమవుతోంది. ఈ లెక్కన చూస్తే కేటాయించిన బ్లాకులన్నీ పూర్తి చేయడానికి ఒక్కో టీచర్కి సుమారు 60 రోజులకు పైనే పట్టేట్లుంది. 50 ఉపాధ్యాయులు 60 రోజుల పాటు స్కూళ్లకు పోకుండా ఉంటే పిల్లలకు పాఠాలు చెప్పేదెవరు, సిలబస్ పూర్తయ్యేదెప్పుడన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. సైన్స్, గణితం, ఇంగ్లిష్ వంటి సబ్జెక్టులు చెప్పే ఉపాధ్యాలను, కొత్తగా ఉద్యోగాల్లో చేరిన నూతన ఉపాధ్యాయులను కూడా మున్సిపల్ అధికారులు సర్వేకు కేటాయించారు. మున్పిపల్ పరిధిలో ఉన్న 30 ప్రాధమిక, 5 యూపీ, 9 ఉన్నత పాఠశాల్లో సుమారు 20 నుంచి 30 పిరియడ్లు జరగడం లేదని సమాచారం. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మున్సిపల్ టీచర్లను మినహాయించాలి... స్మార్ట్ పల్స్ సర్వే విధుల నుంచి మున్సిపల్ టీచర్లను మినహాయించాలి. తిరుపతిలో ఎక్కువ మొత్తంలో బ్లాకులు ఉండటం వల్ల ఒక్కోక్కరికీ ఆరేసి బ్లాకులు కేటాయించారనీ, బ్లాకు 300 ఇళ్ల చొప్పున 1800 ఇళ్ల నుంచి వివరాలున సేకరించడం కష్టం. ఇందుకు రెండు నెలల సమయం అవసరం. ఇదే జరిగితే విద్యార్థులు బాగా నష్టపోతారు. ఎన్, ప్రసాద్, మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ నగర అధ్యక్షుడు, తిరుపతి మున్సిపల్ డెరైక్టర్ను కలిశాం... విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ టీచర్లను సర్వే నుంచి మినహాయించాలని కోరేందుకు మున్సిపల్ డెరైక్టర్ను కలవబోతున్నాం. అన్ని మున్సిపాల్టీల్లోనూ మున్సిపల్ టీచర్లను మినహాంచగా, కేవలం తిరుపతిలో మాత్రమే అధికారులు కొనసాగిస్తున్నారు. ఎస్. రామకృష్ణ, మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు. -
శోధన.. రంధ్రాన్వేషణ
♦ ఇంటింటా సమగ్ర సమాచార సేకరణ ♦ జిల్లాలో స్మార్ట్పల్స్ సర్వే ప్రారంభం ♦ 80 ప్రశ్నలతో వ్యక్తిగత వివరాల సేకరణ.. ♦ తొలిరోజు మందకొడిగా సాగిన ప్రక్రియ ♦ ప్రోటోకాల్ పేరుతో గంటల కొద్దీ జాప్యం ♦ ట్రయల్న్గ్రా పేర్కొన్న అధికారులు ఒంగోలు/ పుల్లలచెరువు : ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో శుక్రవారం స్మార్టు పల్స్ సర్వే (ప్రజాసాధికారిక సమాచార సేకరణ) ప్రారంభమైంది. ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించేందుకు సిబ్బంది సమాయత్తమయ్యూరు. తొలిరోజు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నివాసం నుంచి సర్వే ప్రారంభమైంది. అక్కడ సర్వే సజావుగా సాగినప్పటికీ అనంతరం సమస్యలు ప్రారంభం అయ్యాయి. సర్వర్లు మొరారుుంచడంతో ప్రక్రియలో తీవ్ర జాప్యం జరిగింది. సర్వే సిబ్బంది ఒక్కొక్కరు రోజుకు 14 కుటుంబాలను అప్డేట్ చేయాల్సి ఉంది. అంటే ఒక్కో కుటుంబానికి కనీసంగా అరగంట సమయం పడుతుంది. దీని ప్రకారం సిబ్బందికి 7గంటలు సమయం తప్పనిసరి. రాష్ట్రవ్యాప్తంగా సిబ్బంది అంతా ట్యాబ్లలో పని ప్రారంభించడంతోనే సర్వర్లు మొరాయించాయి. దీంతో సిబ్బంది గంటలకొద్దీ ఎదురుచూసినా ఉపయోగం లేకుండా పోయింది. మొరాయించిన సర్వర్లు, మరో వైపు ట్యాబ్లకు చార్జింగ్ సమస్యలు, చీరాల, కందుకూరు ప్రాంతంలో నెట్ వర్క్ సమస్యలు వెరసి 15 శాతం కూడా చేయలేకపోయారు. వీఐపీలకు సంబంధించి స్మార్ట్ పల్స్ సర్వేచేశామని, ఇది ట్రయల్ రన్ అంటూ అధికారులు చెప్పుకొచ్చారు. వివరాలు ఆన్ లైన్లో నిక్లిప్తం.. మొత్తం 30 రోజుల పాటు జరగనున్న ఈ సర్వేలో 80 ప్రశ్నలతో సమగ్ర సమాచారాన్ని సేకరిస్తారు. ఎన్యూమరేటర్లు, సహాయకులను ఇప్పటికే నియమించారు. స్మార్టు పల్స్ సర్వేలో కీలకపాత్ర పోషించే ఎన్యూమరేర్లుకు సమగ్ర సమాచార సేకరణ చేసేందుకు ప్రత్యేకంగా ట్యాబ్ల పంపిణీ చేశారు. ఒక్కో ఎన్యూమరేటర్ రోజుకు కనీసం 14 కుటుంబాలకు చెందిన వివరాలను ట్యాబ్ల సహాయంతో ఆన్లైన్లో నమోదు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. వివరాలను ఎప్పటికప్పడు ఆన్లైన్లో పొందుపరిచేలా ఓ వెబ్సైట్ తయారు చేశారు. దీనిని జీపీఎస్ సిస్టం ద్వారా అనుసంధానం చేస్తారు. ప్రతి ఇంట్లో ఉండే వస్తువులతో పాటు వాహనాలు, విద్యుత్తుబిల్లులు చెల్లింపు, స్థిర చరాస్తుల వివరాలను ఆధికారులు సేకరించబోతున్నారు. కుటుంబ వివరాలు ఎలా నింపాలో నమూన గణాంక సర్వే ఇప్పటికే పూర్తి చేయగా అయా కుటుంబాల సాంఘిక, ఆర్థిక, వ్యక్తిగత సమాచారాన్ని 80 ప్రశ్నలతో నమోదు చేస్తారు. చూపించాల్సిన కార్డులు, ధ్రువపత్రాలు.. స్మార్టు పల్స్ సర్వే కోసం వచ్చే సిబ్బందికి కుటుంబసభ్యులకు సంబంధించిన ఆధార్కార్డు, రేషన్కార్డు, ఓటరుగుర్తింపు కార్డు, ఆదాయపు పన్ను ఐడీ, విద్యుత్ బిల్లు, డ్రైవింగ్ లెసైన్స్, వాహన రిజస్టేషన్, పట్టాదారు పాస్ పుస్తకం లేదా భూమి ఖాతా నంబర్, ఎల్పీజీ వినియోగదారుని పుస్తకం, బ్యాంక్ పాస్బుక్, వికలాంగ సదరం ధ్రువీకరణ పత్రం, నీటిపన్ను రసీదు, కుల ధ్రువీకరణ పత్రం(ఎస్సీ, ఎస్టీ, బీసీలకు), ఆదాయపత్రం, కిసాన్కార్డు, పింఛను ధ్రువీకరణ పత్రం, ఉపాధికార్డు, జనన ధ్రువీకరణ పత్రం, ఉపకార వేతన గుర్తింపు పత్రం చూపించాలని శుక్రవారం పుల్లలచెరువు మండలంలో నిర్వహించిన సర్వేలో పాల్గొన్న యర్రగొండపాలెం నియోజకవర్గ ప్రత్యేకాధికారి కొండయ్య తెలిపారు. పథకాల వివరాలు తెసుకునేందుకే: కలెక్టర్ ఎమ్మెల్యే ఇంటి వద్ద స్మార్ట్ పల్స్ సర్వే కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్ సుజాతశర్మ మీడియాతో మాట్లాడారు. ప్రజాసాధికార సర్వేకు 2312 ఎన్యూమరేషన్ బ్లాకులను, మండల స్థాయి సర్వే బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సర్వే మానిటర్ చేసేందుకు జిల్లా స్థాయి కమిటీ నియోజకవర్గ సమన్వయ అధికారులను, జిల్లాస్థాయి సాంకేతిక బృందాలను, మండల స్థాయి, మున్సిపల్ పరిధిలో కమిటీలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సర్వేద్వారా వ్యక్తిగతంగా సభ్యుల సామాజిక, ఆర్థిక, విద్య స్థితిగతులు తెలుసుకుంటామన్నారు. ప్రభుత్వం పథకాల ద్వారా లబ్దిదారులు ప్రయోజనం, ఇంకా వారికి అందాల్సిన సంక్షేమ ఫలాలు వివరాలు తెలుసుకోనున్నట్టు చె ప్పారు. ఈ సర్వే ఈ నెలాఖరు వరకు, తిరిగి ఆగస్టు 6 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ ఆధార్ వల్ల ప్రజలకు అనేక ఉపయోగాలు ఉన్నాయని, కనుక సర్వే బృందాలు అడిగిన సమాచారం అందజేయాలన్నారు. ఈ సందర్భంగా సర్వే బృందం ఇట్టా చినరామయ్య కుటుంబ సభ్యులను టాబ్, ఐరిష్ ద్వారా వివరాలు ఆన్లైన్ ద్వారా నమోదు చేశారు. సర్వే బృందంలో సూపర్వైజర్ అమ్మిరెడ్డి, మాస్టర్ ట్రైనీలు విశ్వనాథ్, బాలరాజు, ఎన్యూమరేటర్ సాయిరాఘవ పాల్గొన్నారు. జేసీ డాక్టర్ ఎం.హరిజవహర్లాల్, ఒంగోలు ఆర్డీవో కమ్మ శ్రీనివాసరావు, ఎస్ఎస్ఏ పీవో ఎం.వి.సుధాకర్, మున్సిపల్ కమిషనర్ ఎస్.వెంకటకృష్ణ, తహసీల్దారు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
సాధికార సర్వేపై చేతులెత్తేశారు!
90 శాతం పనిచేయని ఆన్లైన్ నెట్వర్క్ 2జీ సిమ్ కార్డులను 3జీకి మార్చని వైనం వ్యక్తిగత వివరాలు చెప్పడానికి ప్రజల విముఖత సర్వే తమవల్ల కాదంటున్న ప్రభుత్వ ఉద్యోగులు కర్ణుడి చావుకు ఎన్నో కారణాలు అన్నట్లు జిల్లాలో ప్రారంభమైన ప్రజా సాధికార సర్వే (స్మార్ట్ పల్స్ సర్వే)పై అధికారులు చేతులెత్తేశారు. ప్రజలు వివరాలు చెప్పడానికి విముఖత చూపిస్తున్నారు. అసలు వివరాలను నమోదు చేయడానికి ఆన్లైన్ నెట్వర్క్ సరిగా రావడంలేదు. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలానే ఉన్నాయి. అంతిమంగా సాధికార సర్వే మూన్నాళ్ల ముచ్చటగా తయారవుతోంది. చిత్తూరు (అర్బన్): జిల్లాలో మూడు రోజుల క్రితమే సాధికార సర్వే ప్రారంభించారు. రాష్ట్రంలోనే చిత్తూరులోనే సర్వేను తొలిసారిగా ప్రారంభించి రికార్డు సృష్టిస్తే.. అంతే వేగంగా అది తమ వల్ల కాదని అధికారులు, సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. ప్రతి కుటుంబంలోని వ్యక్తుల వివరాలను నమోదు చేయడానికి ఈనెలాఖరు వరకు తొలి విడత, వచ్చేనెల 6 నుంచి 15 వరకు రెండో విడతగా సర్వే చేయడానికి తేదీలు ఖరారు చేశారు. అయితే ఆది నుంచీ సర్వేపై సరైన అవగాహన కల్పించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. వివరాలను నమోదు చేయడానికి 3 వేల మంది సిబ్బందిని నియమించి వారికి ఉన్నతాధికారులు ట్యాబ్లు, బయోమెట్రిక్ పరికరాలను అందచేశారు. జిల్లాలోని నివాసాలు, కుటుంబాల సంఖ్య ఆధారంగా 2,745 బ్లాకులుగా విభజించారు. ఒక్కో బ్లాకులో 400 నుంచి 500 కుటుంబాలు ఉంటాయి. అయితే సర్వేకు నియమించిన అధికారులు, సిబ్బందిలో సగం మందికి పైగా ట్యాబ్లను ఎలా ఉపయోగించాలో తెలియడంలేదు. దీనికి తోడు 90 శాతం ట్యాబ్లకు గత మూడు రోజుల నుంచి నెట్వర్క్ రావడంలేదు. ఇక చిత్తూరు నగరంలో అయితే నిరక్షరాస్యులైన చెత్త ఊడ్చే పారిశుధ్య కార్మికుల చేతికి ట్యాబ్లు ఇచ్చి పంపడమే నిదర్శనం. పల్లెల్లో సర్వేకు వెళుతున్న 30 శాతం మంది వీఆర్వోలకు ట్యాబ్ను ఉపయోగించడం తెలియడంలేదు. దీంతో ఉద్యోగులు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. చేయాల్సిన పనులు వదిలేసి ఏజెన్సీల ద్వారా చేయించుకోవాల్సిన సర్వే పనులను తమకు అంటగట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. అన్నీ అడ్డకుంలే.. సర్వే సక్రమంగా సాగకపోవడానికి సాంకేతిక కారణాలే ప్రధానంగా కనిపిస్తున్నాయి. కుటుంబంలోని ప్రతివ్యక్తి ఫోటోను ట్యాబ్లో తీసి దాన్ని జియో ట్యాగింగ్ చేయాలి. దీనికి తప్పనిసరిగా 3జీ నెట్వర్క్ కావాలి. కానీ 70 శాతం ట్యాబ్ల్లో 2జీ నెట్వర్క్ ఉండటం వల్ల ఒక్కో కుటుంబానికి గంటల సమయం పడుతోంది. అయినా సరే నెట్వర్క్ కనెక్టుకావడంలేదు. 3జీ సిమ్కార్డులు అడుగుతుంటే పట్టిం చుకునే దిక్కులేదు. మరోవైపు ప్రజల ఆధార్కార్డు, పేర్లు, బ్యాంకు ఖాతాలు అడగడం వరకు బాగానే ఉన్నా.. ఇంట్లో ద్విచక్రవాహ నం, టీవీ, ఫ్రిడ్జ్, కారు, సెల్ఫోన్ లాంటి వివరాలను సైతం నమోదు చేయాల్సి ఉండటం తో ప్రజలు ఈ వివరాలను చెప్పడానికి విముఖత చూపిస్తున్నారు. అన్ని వివరాలను చెప్పే స్తే భవిష్యత్తులో సంక్షేమ పథకాలు ఎక్కడ తమకు అందవోనంటూ ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు సర్వే చేసే ఎన్యుమరేట ర్లకు శిక్షణ ఇవ్వడం కూడా తూతూ మంత్రం గానే సాగింది. ఎక్కడా ట్యాబ్ను అందరి ముందు తెరచి చూపిస్తూ వివరాలను నమో దు చేయడంపై శిక్షణ ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారు. ఈ అవాంతరాలను అధిగమించి జిల్లాలో సాధికార సర్వే నిర్ణీత గడువులోపు పారదర్శకంగా చేయడం అసాధ్యమని అధికారులు, సిబ్బంది పెదవి విరుస్తున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలచేత చేయించుకోవాల్సిన సర్వేని ఉద్యోగులకు చేత చేయిస్తున్నారంటూ గుర్రుగా ఉన్నారు. -
ఏపీలో ప్రారంభమైన ప్రజాసాధికార సర్వే
-
అంత ‘స్మార్ట్’ కాదు..!
శ్రీకాకుళం/శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ పల్స్ సర్వేకు ఆదిలోనే అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఈ సర్వే ఎలా చేయాలో నిర్ధరించుకోవడానికి నిర్వహించిన ట్రయల్ రన్ అట్టర్ ఫ్లాపైంది. యాప్ సరిగ్గా పనిచేయకపోవడం, వివరాలు తెలిపేందుకు ప్రజలకు అవగాహన కల్పించకపోవడంతో సర్వే సందిగ్ధంలో పడింది. ఈ సర్వే బుధవారం నుంచే ప్రారంభం కానుండడం విశేషం. జిల్లాలోని 38 మండలాలను, 5 మున్సిపాలిటీలను, శ్రీకాకుళం నగరపాలక సంస్థను జనాభా ప్రాతిపదికన బ్లాక్లుగా విభజించారు. వీటిలో ఉన్న కుటుంబాల వివరాలు సేకరించేందుకు ఎన్యూమరేటర్లతో కూడిన బృందాలను ఏర్పాటు చేశారు. ఎస్పీఎస్ యాప్ ద్వారా వివరాలు సేకరించే పద్ధతిని జిల్లాలోని కొందరు అధికారులకు మాస్టర్ ట్రైనర్స్తో శిక్షణ ఇప్పించారు. వీరి ద్వారా జిల్లాలోని ప్రతి మండలంలో ఇద్దరు ఉద్యోగులు, పురపాలక సంఘాల్లోని నలుగురు ఉద్యోగులకు మాస్టర్ ట్రైనీస్గా శిక్షణ ఇచ్చారు. వీరి ద్వారా అన్ని మండలాల్లోని ఎన్యూమరేటర్లు శిక్షణ పొందుతున్నారు. ప్రభుత్వం వివిధ డిపార్టుమెంట్లకు అందజేసిన ట్యాబ్లకు బయోమెట్రిక్ పరికరం అమర్చి వాటి ద్వా రా సర్వే వివరాలు సేకరించనున్నారు. ట్రయల్ రన్లోనే అవాంతరాలు పూర్తిగా ఆన్లైన్ పద్ధతిలో నడిచే ఈ యాప్ను ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు రాష్ట్రంలోని కొన్ని ఎంపిక చేసిన రె వెన్యూ డివిజన్లోని ఓ పట్టణం, ఓ గ్రామంలో గత బుధ, గురు వారాల్లో ఎన్యూమరేటర్లు పర్యటించారు. సిగ్నల్ లేక అసలు యాప్ ఓపెన్ కాలేదని ఆయా ప్రాంతాల్లో సర్వే జరిపిన ఎన్యూమరేటర్లు చెబుతున్నారు. యాప్ పూర్తిగా పనిచేయాలంటే 3జీ సిగ్నల్ తప్పనిసరి. కానీ ప్రభుత్వం అందించిన ట్యాబ్లలో 2జీ సిమ్లే ఉండటంతో ఇబ్బందులు ఎదురైనట్లు సమాచారం. అలాగే ప్రతి కుటుంబానికి సుమారు హౌస్హోల్డ్, వ్యక్తిగత, ఇతర వివరాల కింద సు మారు 77 కాలమ్స్ను టచ్ ప్యాడ్ ద్వారా డేటాను ఎంటర్ చేయడానికి గంట సమయం పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో సిగ్నల్స్ లేక యాప్ పనిచేయకపోతే, మరికొన్ని ప్రాంతాల్లో యాప్ ద్వారా వివరాలు సేకరిస్తుంటే సర్వర్ బిజీ అయి ఎర్రర్ మెసేజ్ వస్తున్నట్లు ట్రయల్ రన్ చేసిన ఎన్యూమరేటర్లు అంటున్నారు. ప్రచారం శూన్యం... సర్వేకు సంబంధించి ప్రచారం కల్పించకపోవడం వల్ల వివరాలు చెబితే ఏం జరుగుతుందో, చెప్పకపోతే ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితి ప్రజల్లో ఏర్పడింది. సమాచారంతోపాటు 20 రకాల ధ్రువపత్రాలను అడుగుతుండడంతో అవేవీ తమ వద్ద లేవని, తమ వివరాలు నమోదు చేయనవసరం లేదని ప్రజల నుంచి సమాధానం వచ్చే పరిస్థితి ఉంటోంది. ఇల్లు ఎంత స్థలంలో కట్టారు, ఎన్ని గదులున్నాయి, ఏసీలు, వాషింగ్ మిషన్లు ఉన్నాయా, విద్యార్హత, ప్రైవేటు, ప్రభుత్వ సంస్థ నుంచి పొందినదా, సబ్సిడీ లోన్, పింఛన్లు, గ్యాస్ కనెక్షన్ నంబర్ వంటి వివరాలు సేకరించడంపై కూడా ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందువలన సర్వేకు ప్రజల సహకారంపై స ర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
ఇక స్మార్ట్ పల్స్ సర్వే
► కొత్త పథకాలన్నిటికీ ఇదే ప్రామాణికం ► రెండు విడతలుగా నిర్వహణ ► జిల్లా కలెక్టర్ విజయమోహన్ కర్నూలు(అగ్రికల్చర్): సోషియో ఎకనమిక్ సర్వే (స్మార్ట్ పల్స్ సర్వే) జిల్లాలో రెండు విడతలుగా జరుగుతుందని, ఈ సర్వే రానున్న రోజుల్లో అన్ని పథకాల అమలుకు ప్రామాణికమవుతుందని జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ తెలిపారు. స్మార్ట్ పల్స్ సర్వేపై గురువారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సదస్సు నిర్వహించారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్న ఈ సదస్సుకు కలెక్టర్ హాజరై స్మార్ట్పల్స్ సర్వే విధివిధానాలు వివరించారు. ఆధార్లో ఉన్న పేరే అన్నిటిలో రావాల్సి ఉందని తెలిపారు. మొదటి విడత సర్వే ఈనెల 20 నుంచి 30 వరకు, రెండవ విడత సర్వే జులై 6 నుంచి 31 వరకు జరుగుతుందని తెలిపారు. సర్వే నిమిత్తం బ్లాక్లను నిర్ధారించే బాధ్యత తహసీల్దార్లదేనని, ప్రతి బ్లాక్లో 430 నుంచి 460 ఇళ్లు ఉండే విధంగా చూడాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలన్నిటిలోనూ సర్వే నిర్వహించాలని, ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించాలని సూచించారు. ప్రతి 10 బ్లాక్లకు ఒక సూపర్వైజర్ను నియమించాలన్నారు. ట్యాబ్లతో సర్వే ఈ సర్వేలో కాగితం ఉపయోగించే అవకాశం లేదని జాయింట్ కలెక్టర్ సి.హరికిరణ్ తెలిపారు. ట్యాబ్లను ఉపయోగించి ఆన్లైన్లోనే సర్వే వివరాలు నమోదు చేయాలన్నారు. నెట్వర్క్ కనెక్టివిటీ లేకపోతే ఆఫ్లైన్లో నమోదు చేసుకుని తర్వాత ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. రోజుకు 8 గంటలు 14 ఇళ్లు మాత్రమే సర్వే నిర్వహించాలన్నారు. ఇది వరకు ఉన్న పింఛన్లు, రేషన్ కార్డులకు ఈ సర్వేతో ఎలాంటి ఇబ్బంది ఉండదని, కొత్త పథకాల కోసమే ఈ సర్వే ప్రామాణికమవుతుందని తెలిపారు. సర్వే వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో డీఆర్వో గంగాధర్గౌడ్, డీపీఓ శోభస్వరూపరాణి, డీఆర్డీఏ పీడీ రామకృష్ణ, ఆర్డీఓలు రఘుబాబు, ఓబులేసు, సుధాకర్రెడ్డి పాల్గొన్నారు.