soon
-
డెంగ్యూకు టీకా.. బీహార్లో తుది ట్రయల్స్
పాట్నా: డెంగ్యూ వ్యాధి నుంచి ప్రజలకు త్వరలో విముక్తి లభించనుంది. బీహార్లోని పట్నాలో డెంగ్యూ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఆరుగురికి డెంగ్యూ వ్యాక్సిన్ వేశారు. త్వరలో 500 మందికి ఈ వ్యాక్సిన్ను ఇవ్వనున్నారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిని రెండేళ్లపాటు శాస్త్రవేత్తల బృందం పరిశీలించనుంది.ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్కు చెందిన పాట్నాలోని రాజేంద్ర మెమోరియల్ మెడికల్ సైన్సెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ క్లినికల్ ట్రయల్ నిర్వహిస్తోంది. దేశంలోనే పూర్తిగా తయారవుతున్న ఈ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్ సెప్టెంబర్ 26న ప్రారంభమైందని ఆర్ఎంఆర్ఐఎంఎస్ అధికారి ఒకరు తెలిపారు. ఐసీఎంఆర్, పనాసియా బయోటెక్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ వ్యాక్సిన్ను తయారు చేసేందుకు కృషి చేస్తున్నాయి.వ్యాక్సిన్ పరీక్షల కోసం 10 వేల మందికి ముందుగా వ్యాక్సిన్ వేసి, వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించనున్నారు. డెంగ్యూ వ్యాక్సిన్ను పరీక్షించేందుకు దేశవ్యాప్తంగా 19 కేంద్రాలను ఎంపిక చేశారు. వాటిలో ఆర్ఎంఆర్ఐఎంఎస్ ఒకటి. ఒక్కో కేంద్రంలో సుమారు 500 మందికి ట్రయల్ వ్యాక్సిన్ వేయనున్నారు. కాగా బీహార్లో డెంగ్యూ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ ఏడాది 4,416 కేసులు నమోదయ్యాయి. 12 మంది డెంగ్యూ బాధితులు మృతిచెందారు. ఒక్క పట్నాలోనే 2,184 కేసులు నమోదయ్యాయి. ఇది కూడా చదవండి: బ్రెజిల్లో తుపాను బీభత్సం.. ఏడుగురు మృతి -
ఢిల్లీ రోడ్లపైకి ఉబెర్ ఏసీ బస్సులు
దేశరాజధాని ఢిల్లీలో త్వరలో ఉబెర్ బస్సులు తిరగనున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం ప్రయాణికుల కోసం ఒక వినూత్న పథకాన్ని అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీని కింద ఆగస్టు నుండి ఢిల్లీవాసులు ప్రైవేట్ కంపెనీలకు చెందిన ఎయిర్ కండిషన్డ్ బస్సుల్లో సీట్లు బుక్ చేసుకునే అవకాశం ఏర్పడనుంది.గత ఏడాది ఢిల్లీ ప్రభుత్వం నోటిఫై చేసిన ‘ఢిల్లీ మోటార్ వెహికల్ లైసెన్సింగ్ అగ్రిగేటర్ (ప్రీమియం బస్సులు) పథకం’ కింద లగ్జరీ బస్సు సర్వీసులను ప్రారంభించనుంది. నగరంలో ప్రైవేట్ వాహనాల వినియోగాన్ని తగ్గించడం, కాలుష్యాన్ని అరికట్టడం ఈ పథకంలోని ప్రధాన లక్ష్యం. ఈ పథకం కింద ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో రెండు అగ్రిగేటర్లు.. ఉబెర్, అవేగ్ బస్సులను నడపడానికి లైసెన్స్లను మంజూరు చేసింది. ఈ బస్సులు ఏఏ మార్గాల్లో సేవలను ప్రారంభించాలనేది ఖరారు చేస్తున్నట్లు రవాణా శాఖ అధికారి తెలిపారు.త్వరలో డిల్లీ రోడ్లపై తిరిగే ఈ ప్రీమియం బస్సులు తొమ్మిది మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యాన్ని కలిగివుంటాయి. ఈ బస్సులలో వైఫై సదుపాయం ఉంటుంది. అలాగే జీపీఎస్, సీసీటీవీ కూడా ఉంటుంది. ఈ నెలాఖరు లేదా ఆగస్టు మొదటి వారంలోగా ఈ బస్సులు ఢిల్లీ రోడ్లపై తిరగనున్నాయని సమాచారం. -
సీతారాముల స్వస్థలాలు ‘అమృత్ భారత్’తో అనుసంధానం!
శ్రీరాముని జన్మభూమి అయోధ్యతో సీతామాత పుట్టిన ప్రాంతమైన సీతామర్హి(బీహార్) అనుసంధానం కానుంది. ఈ రెండు ప్రాంతాలను కలిపేలా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రాకపోకలు సాగించనుంది. ఈ ప్రత్యేక రైలు మొదటి పరుగును అతి త్వరలో అందుకోనుంది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో శ్రీరామ్ విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని మోదీ డిసెంబర్ 30న రానున్నారు. ఈ సందర్భంగా మోదీ.. అయోధ్య జంక్షన్లో కొత్తగా నిర్మించిన భవనాన్ని ప్రారంభించడమే కాకుండా, అయోధ్య నుంచి ఢిల్లీకి నడిచే రెండు రైళ్లను ప్రారంభించనున్నారు. అంతే కాదు వందే భారత్ ఎక్స్ప్రెస్, అమృత్ భారత్ రైలును కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఢిల్లీ- దర్భంగాల మధ్య నడవనుంది. మొదటి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు సంబంధించిన రెగ్యులర్ సర్వీస్ ఢిల్లీ- దర్భంగా మధ్య ఉంటుంది. ఈ రైలు దూర ప్రయాణికులకు ఎంతో ఉపయుక్తం. మరో అమృత్ భారత్ రైలు బీహార్లోని సితామర్హి (జానకీ మాత జన్మస్థలం)-రక్సాల్ మీదుగా అయోధ్య గుండా ఢిల్లీకి చేరనుందని సమాచారం అమృత్ భారత్ రైలు నాన్-ఏసీ రైలుగా ఉండబోతున్నదని తెలుస్తోంది. అంటే దీనిలో స్లీపర్, జనరల్ కోచ్లు మాత్రమే ఉంటాయి. ఇందులో మొత్తం 22 బోగీలు ఉండనున్నాయి. దేశంలోని వివిధ నగరాలను కలుపుతూ రాత్రిపూట రైలు సర్వీసులుగా నడపాలని భారతీయ రైల్వే యోచిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో పని చేయడానికి వచ్చే వలస బీహారీలను దృష్టిలో ఉంచుకుని ఈ రైలు ప్రవేశపెట్టనున్నారని రైల్వే అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: మళ్లీ మాస్క్ తప్పనిసరి.. ఆదేశాలు జారీ! -
వైవిధ్యమైన కథ
నటుడు సుమన్ ప్రధాన పాత్రలో మునిప్రసాద్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సిర్నాపల్లి సంస్థాన్’. మనోహర్, శ్రీనివాస్, జ్యోతీసింగ్, శృతీ పాండే హీరోహీరోయిన్లుగా నటించారు. కృష్ణకాంతి క్రియేషన్స్లో మంచాల రమేశ్ యాదవ్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. మంచాల రమేశ్ యాదవ్ మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన చిత్రం ‘సిర్నాపల్లి సంస్థాన్’. మునిప్రసాద్ చక్కగా తీశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వేల్ మురుగన్, సంగీతం: ఏలేందర్. -
పుతిన్తో త్వరలో కిమ్ జోంగ్ ఉన్ భేటీ!
సియోల్: ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ రష్యా అధినేత పుతిన్తో సమావేశం కాబోతున్నారా? ఇందుకోసం త్వరలోనే రష్యాకు బయలుదేరి వెళ్తారా? నిజమేనని అమెరికా అధికార వర్గాలు చెబుతున్నాయి. అమెరికాకు బద్ధ వ్యతిరేకి అయిన కిమ్ జోంగ్ ఉన్ ఇటీవలి కాలంలో పుతిన్కు స్నేహ హస్తం అందిస్తున్నారు. ఇద్దరు నేతలు ముఖాముఖి భేటీ అవుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఉక్రెయిన్పై యుద్ధం సాగిస్తున్న రష్యా వద్ద ఆయుధ నిల్వలు వేగంగా నిండుకుంటున్నాయి. అందుకే ఉత్తర కొరియా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయాలని రష్యా నిర్ణయించినట్లు సమాచారం. పుతిన్, కిమ్ సమావేశంలో ఇదే అంశంపై చర్చించే అవకాశం ఉంది. రష్యాకు అందించే సహాయానికి బదులుగా ఆహారం, అత్యాధునిక ఆయుధ టెక్నాలజీని తమకు అందజేయాలని పుతిన్ నుంచి కిమ్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరువురు నేతలు చివరిసారిగా 2019 ఏప్రిల్లో కలుసుకున్నారు. -
France: బుర్ఖా నిషేధంపై రగడ
ప్యారిస్: ఫ్రాన్స్ స్కూళ్లలో ముస్లిం విద్యార్థులు ధరించే బుర్ఖా(అబయ)లను నిషేధించనున్నారు. పాఠశాలల్లో అనుసరించాల్సిన లౌకిక చట్టాలకు విరుద్ధంగా ఈ వస్త్రధారణ ఉందని ఆ దేశ విద్యా మంత్రి గాబ్రియేల్ అట్టల్ తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ నిషేధాజ్ఞలను అమలులోకి తీసుకువస్తామని చెప్పారు. ఈ మేరకు స్కూళ్ల ఉన్నతాధికారులకు విధి విధానాలను తెలియజేస్తామని చెప్పారు. 'లౌకికవాదం మొదట పాఠశాలలోనే తెలుసుకోవాల్సిన విధానం. బుర్ఖా(అబయ)లు మతపరమైన గుర్తును కలిగి ఉన్నాయి. దీనివల్ల ఫ్రాన్స్ పాఠశాల చట్టాలకు భంగం వాటిల్లుతుంది. తరగతి గదిలోకి ప్రవేశించగానే వేషధారణతో మతం ఎంటో చెప్పేలా ఉండకూడదు.' అని గాబ్రియేల్ అట్టల్ తెలిపారు. 2004 పాఠశాల చట్టం ప్రకారం స్కూళ్లలో మతపరమైన సంజ్ఞలను తెలిపే ఎలాంటి దుస్తులను ధరించకూడదని పేర్కొనడాన్ని ఆయన గుర్తు చేశారు. పాఠశాలల్లో బుర్ఖా(అబయ) ధరించే సాంప్రదాయం క్రమంగా పేరుగుతున్న నేపథ్యంలో స్కూళ్లలో ఉద్రిక్త పరిస్థితులు ఎదురవుతున్నాయని యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం తీసుకురానున్న కొత్త నిబంధనలకు ఉపాధ్యాయ సంఘాలు ఆహ్వానిస్తున్నాయి. పాఠశాలల్లో ఇస్లామిక్ బుర్ఖా(అబయ)లను నిషేధించాలనే వాదనలు ఫ్రాన్స్లో కొద్దిరోజులుగా తెరమీదకొచ్చాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోంది. అయితే.. వామపక్షవాదులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. పౌరహక్కులకు భంగం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు ముస్లిం సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మతపరమైన గుర్తులంటే కేవలం వేషధారణ మాత్రమే కాదని అంటున్నాయి. ఇతర వస్తువులు కూడా మతపరమైన గుర్తులను సూచిస్తాయని చెబుతున్నాయి. కానీ ప్రతిపక్ష రైట్ వింగ్ రిపబ్లికన్ పార్టీ అధినేత ఎరిక్ సియోట్టో ప్రభుత్వ విధానాలకు స్వాగతం పలికారు. ఇదీ చదవండి: ప్రిగోజిన్ మృతి చెందాడా..? రష్యా జన్యు పరీక్షల్లో ఏం తేలింది..? -
'ఆపరేషన్ హస్త'.. పొలిటికల్ వార్..
బెంగళూరు: కర్ణాటకలో రాజకీయ పరిణామాలు ఈ మధ్య ఆసక్తికరంగా మారుతున్నాయి. గతంలో కాంగ్రెస్ను వదిలి బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలు మళ్లీ సొంత పార్టీవైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. దీనికే 'ఆపరేషన్ హస్త' పేరుతో భారీగా ప్రచారం జరుగుతోంది. ఇందుకు తగ్గట్లుగా బీజేపీ ఎమ్మెల్యేలు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్లను కలుస్తున్నారు. యశ్వంతాపూర్ నియోజక వర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సోమశేఖర్ ఇటీవల సీఎం సిద్ధరామయ్యను కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిసినట్లు చెబుతున్నప్పటికీ.. అసలు విషయం పార్టీ మార్పేనని రాజకీయ వర్గాల సమాచారం. ఇటీవలే సీఎం సిద్ధరామయ్యను తమ రాజకీయ గురువుగా పేర్కొంటూ సోమశేఖర్ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఇటీవల జేడీఎస్ నాయకుడు ఆయనూర్ మంజునాథ్ కూడా డిప్యూటీ సీఎం శివకుమార్ను కలిశారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ.. చాలా మంది కాంగ్రెస్లో చేరనున్నట్లు చెప్పారు. ఇందుకు గల కారణాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. ఈ సందర్భంగా కాంగ్రెస్ చేపట్టనున్న ఆపరేషన్ హస్త వెలుగులోకి వచ్చింది. బీజేపీ నాయకులను కాంగ్రెస్లోకి తీసుకురావడమే దీని ప్రధాన ధ్యేయం. ఆపరేషన్ హస్త అనేది ఆపరేషన్ లోటస్కు వ్యతిరేకంగా జరుగుతున్న చర్యగా పరిగణించవచ్చు. 2019లో ఆపరేషన్ లోటస్లో భాగంగా 17 మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరారు. దీంతో అప్పట్లో బీజేపీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రాగలిగింది. బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్లనున్నారనే సమాచారం ఉన్న నేపథ్యంలో కమల దళం తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. మాజీ మఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తమ ఎమ్మెల్యేలతో రెండు రోజుల క్రితం సమావేశమయ్యారు. తమ సభ్యులు ఎవరూ ఫిరాయింపుకు సిద్ధంగా లేరని అన్నారు. తాము ఐక్యంగానే ఉన్నామని చెప్పారు. ఈ పరిణామాల అనంతరం బీజేపీ జనరల్ సెక్రటరీ సీటీ రవి స్పందించాడు. కాంగ్రెస్ ఆపరేషన్పై మండిపడ్డారు. కాంగ్రెస్ చర్యలకు ఎలా అడ్డుకట్ట వేయాలో తమకు తెలుసని అన్నారు. దీనిపై శివకుమార్ కూడా స్పందించారు. గతంలో రాష్ట్రంలో జరిగిన ఫిరాయింపులు గుర్తుకు లేవా? అని ప్రశ్నించారు. తమ పార్టీలో చేరమని ఎవరినీ పిలవట్లేదని అన్నారు. ఇదీ చదవండి: చంద్రయాన్-3పై ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు -
పేరు మార్చుకోనున్న కేరళ!
తిరువనంతపురం: కేరళ రాష్ట్రం అధికారికంగా పేరు మార్చుకోనున్నట్లు సీఎం పినరయ్ విజయన్ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టగా.. అది ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఆ తీర్మానం ప్రకారం ప్రస్తుతం ఉన్న కేరళ పేరును 'కేరళమ్'గా మారుస్తారు. అసెంబ్లీ మద్దతు లభించడంతో ఈ బిల్లును కేంద్ర ఆమోదానికి పంపనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన తీర్మానాన్ని ఆమోదించాల్సిందిగా సీఎం పినరయ్ విజయన్ కేంద్రాన్ని కోరారు. ఇంగ్లీష్తో సహా అన్ని భాషల్లో రాష్ట్ర పేరను కేరళమ్గా మార్చాలని అన్నారు. సభ్యులు తీర్మాణాన్ని అసెంబ్లీ స్పీకర్ ఏఎన్ శంషీర్ కూడా ఆమోదించారు. కేరళ రాష్ట్ర పేరును మలయాళంలో కేరళమ్ అనే అంటారు. కానీ, మిగిలిన అన్ని భాషల్లో కేరళగానే పిలుస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చేనాటికి మలయాళ భాష మాట్లాడే వారందర్ని కలిపి ఒక రాష్ట్రంగా పరిగణించారు. కానీ రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో రాష్ట్రం పేరును కేరళగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ పేరును రాష్ట్ర సర్కార్ మార్చాలని నిర్ణయించింది. ఇదీ చదవండి: మరో వివాదంలో రాహుల్ గాంధీ -
ఒక స్త్రీ జీవితం ఆధారంగా కేరాఫ్ దెయ్యం...
ఒకప్పడు గ్రామాల్లో మాతంగులుగా జీవించిన వారిలో ఒక స్త్రీ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘భయం.. కేరాఫ్ దెయ్యం’. మాతంగిగా రమ్య, మాంత్రికుడిగా నటుడు–దర్శకుడు రవిబాబు, తాంత్రికుడిగా నటుడు సత్యప్రకాష్ ముఖ్యపాత్రలు చేశారు. సీవీఎస్ఎం వెంకట రవీందర్ నాథ్ దర్శకత్వంలో పెదారికట్ల చేనెబోయిన్న నరసమ్మ, వెంకటేశ్వర్లు నిర్మించారు. ‘‘హారర్, థ్రిల్లర్ అంశాలు జోడించి ఈ చిత్రాన్ని రూపొందించాం. ఇటీవల జరిపిన రెండో షెడ్యూల్లో రవిబాబుపై సీన్స్ తీశాం. కన్నడ, తెలుగు భాషల్లో నిర్మించిన ఈ చిత్రం విడుదల తేదీని త్వరలో తెలియజేస్తాం’’ అని దర్శక–నిర్మాతలు అన్నారు. -
మెటా కీలక నిర్ణయం వర్క్ ఫర్మ్ హోమ్..!
-
త్వరలో హిండెన్బర్గ్ మరో బాంబ్..
వివాదస్పద నివేదికతో అదానీ గ్రూప్ను దెబ్బ కొట్టిన అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ సంస్థ హిండెన్బర్గ్ మరో బాంబ్ పేల్చేందుకు సిద్ధమైంది. కార్పొరేట్ మోసాలు, అక్రమాలను బహిర్గతం చేస్తూ మరో ‘పెద్ద’ నివేదికను త్వరలో విడుదల చేస్తామని ట్విటర్ ద్వారా హిండెన్బర్గ్ తెలియజేసింది. అయితే ఈసారి హిండెన్ బర్గ్ ఎవరిని లక్ష్యం చేసుకుందోనన్న ఆందోళన మార్కెట్ వర్గాల్లో మొదలయింది. ఏమిటీ హిండెన్బర్గ్ రీసెర్చ్? ఈక్విటీ, క్రెడిట్, డెరివేటివ్లను విశ్లేషించే ఫోరెన్సిక్ ఆర్థిక పరిశోధన సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్. ఈ సంస్థను 2017లో నాథన్ ఆండర్సన్ స్థాపించారు. పెద్ద పెద్ద కంపెనీల్లో జరిగే అకౌంటింగ్ అక్రమాలు, దుర్వినియోగం, బహిర్గతం చేయని లావాదేవీలను ఈ సంస్థ శోధించి బయటపెడుతుంది. ఇందుకోసం కంపెనీ తన సొంత మూలధనాన్ని ఖర్చు పెడుతుంది. హిండెన్బర్గ్ వెబ్సైట్ పేర్కొన్న దాని ప్రకారం.. 2017 నుంచి ఇప్పటివరకు 16 కంపెనీల్లో అవకతవకలను గుర్తించి బయటపెట్టింది. అదానీ గ్రూప్పై ఆరోపణలతో కుదుపు ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. అదానీ గ్రూప్ అక్రమాలకు పాల్పడిదంటూ గత జనవరి 24న హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ను వెలువరించింది. దాన్ని మరుసటి రోజున ట్విటర్లో షేర్ చేసింది. మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్లతో సహా అదానీ గ్రూప్తో సంబంధం ఉన్న అనేక మందితో మాట్లాడి, వేలాది డాక్యుమెంట్లను పరిశీలించి ఈ నివేదిక వెలువరించినట్లు హిండెన్బర్గ్ పేర్కొంది. అయితే హిండెన్ బర్గ్ నివేదిక పట్ల చాలా అనుమానాలున్నాయి. కేవలం తాను షార్ట్ సెల్లింగ్ చేసేందుకు గాను, అంటే తనకు ప్రయోజనం కల్పించుకునేందుకు హిండెన్ బర్గ్ ఆరోపణలు గుప్పించిందని పలువురు విమర్శించారు. దీనిపై సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యవహారం మీద సమగ్ర దర్యాప్తు చేసి నిజాలు నిగ్గు తేల్చాలంటూ SEBI సెబీని సుప్రీంకోర్టు ఆదేశించింది. (చదవండి : హిండెన్ బర్గ్ పై హరీష్ సాల్వే వ్యాఖ్యలు) ఇదీ చదవండి: ఈ కంపెనీ ఉద్యోగులు ఎంత అదృష్టవంతులో..! ఐదేళ్ల జీతం బోనస్ ఈ నివేదిక వెలువడిన ఐదు వారాల్లోనే అదానీ గ్రూప్ మార్కెట్ విలువ 150 బిలియన్ డాలర్లకుపైగా తుడిచిపెట్టుకుపోయింది. దేశంలోనే అత్యంత ధనవంతుడుగా ఉన్న గౌతమ్ అదానీ వెనుకబడిపోయాడు. అదానీ గ్రూప్ కూడా ఊహించని విధంగా పూర్తిగా సబ్స్క్రైబ్ చేసిన రూ.20,000 కోట్ల ఎఫ్పీవోను ఉపసంహరించుకుంది. అయితే హిండెన్బర్గ్ ఆరోపణలను అదానీ గ్రూప్ కొట్టిపారేసింది. -
తెలంగాణ సచివాలయానికి ముహూర్తం ఖరారు
-
త్వరలో నటుడు నరేష్, పవిత్రల పెళ్లి
-
ఈ నెలాఖరులో ఢిల్లీలో సీఎం కేసీఆర్ జాతీయ మీడియా సమావేశం
-
త్వరలో తెరుచుకోనున్న రియల్ KGF గేట్లు
-
ఏపీ పాఠశాలల్లో సెమిస్టరు విధానం
-
శ్రీ సత్యసాయి జిల్లాలో అతి పెద్ద ఫ్యాక్టరీ నిర్మాణం
-
చిరు, బాలయ్య మల్టీస్టారర్..?
-
పెళ్ళికి సిద్ధమైన కీర్తి సురేష్..!
-
ట్విట్టర్ లో రంగు రంగుల టిక్స్..!
-
మొబైల్ ఫోన్స్ ఛార్జింగ్ కష్టాలకు చెక్..
-
డిజిటల్ కరెన్సీ: ఆర్బీఐ కీలక ప్రకటన
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిజిటల్ రూపాయికి సంబంధించి శుక్రవారం కీలక ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే పైలట్ ప్రాజెక్ట్ కింద ఆర్బీఐ ఆధ్వర్యంలోని డిజిటల్ రూపాయిని లాంచ్ చేయనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) కాన్సెప్ట్ నోట్ను విడుదల చేసింది. పరిమిత వినియోగం నిమిత్తం పైలట్ ప్రాతిపదికన ఈ-రూపాయిని త్వరలో ప్రారంభించనున్నామని శుక్రవారం విడుదల చేసిన కాన్సెప్ట్ పేపర్లో ఆర్బీఐ తెలిపింది. ఆర్థిక వ్యవస్థకు కనిష్టంగా లేదా అంతరాయం కలగని విధంగా ఈ-రూపాయి వినియోగాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పింది. పైలట్ ప్రాజెక్టు ఫలితాలను ఇ-రూపాయి తుది డిజైన్లో పొందుపరుస్తామని ఆర్బీఐ కాన్సెప్ట్ పేపర్ జారీ సందర్భంగా ప్రకటించింది. ప్రయివేట్ క్రిప్టోకరెన్సీలతో ఎలాంటి రిస్క్ లేకుండా, రిస్క్ ఫ్రీ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ మనీని పౌరులకు అందించడం తన బాధ్యత అని వ్యాఖ్యానించింది. అలాగే ఇ-రూపాయి నిర్దిష్ట లక్షణాలు,ప్రయోజనాల గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు కమ్యూనికేట్ చేస్తూనే ఉంటామని ఆర్బీఐ పేర్కొంది కాగా ఆర్బీఐ కొంతకాలంగా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ సాధకబాధకాలను పరిశీలిస్తోంది. దశల వారీగా డిజిటల్ కరెన్సీని అమల్లోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీలకు ఆదరణ పెరుగుతున్ననేపథ్యంలో కేంద్ర బ్యాంకు డిజిటల్ కరెన్సీ వైపు మొగ్గు చూపింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే డిజిటల్ కరెన్సీని లాంచ్ చేస్తామని ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం తెలిపిన సంగతి విదితమే. Issuance of Concept Note on Central Bank Digital Currencyhttps://t.co/JmEkN7rPyA — ReserveBankOfIndia (@RBI) October 7, 2022 -
అక్టోబర్ 1 నుంచి దేశ వ్యాప్తంగా 5G సేవలు
-
త్వరలో పెళ్లి చేసుకోనున్న కేఎల్ రాహుల్-అతియా శెట్టి !
KL Rahul And Athiya Shetty Getting Married Soon: మొన్నటిదాకా బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణ్బీర్ కపూర్-అలియా భట్ పెళ్లి ముచ్చట బీటౌన్లో జోరుగా సాగింది. ఎట్టకేలకు ఏప్రిల్ 14న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తాజాగా మరో జంట పెళ్లికి భాజాలు మోగనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి కుమార్తె, హీరోయిన్ అతియా శెట్టి, టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారని సమాచారం. చాలా కాలంగా రిలేషన్షిప్లో ఉన్న ఈ జంట ఈ ఏడాది శీతకాలం సీజన్లో పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ వెబ్సైట్ కథనం ప్రకారం వారు దక్షిణ భారత వివాహ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. 'ఇప్పటికే ఈ పెళ్లికి సన్నహాలు ప్రారంభమయ్యాయి. అతియా శెట్టి, కేఎల్ రాహుల్ వివాహం వారి ఇరువురి పేరెంట్స్కు ఎంతో ఇష్టం. 2022 ఏడాది పూర్తయ్యేలోపు వారు పెళ్లి చేసుకోవచ్చు.' అని శెట్టి కుటుంబ సన్నిహితులు చెప్పినట్లు ఆ వెబ్సైట్ వెలువరించింది. సౌత్ ఇండియాకు చెందిన సునీల్ శెట్టి ముల్కిలోని మంగళూరుకు చెందిన తుళు మాట్లాడే కుటుంబంలో జన్మించాడు. కేఎల్ రాహుల్ కూడా మంగళూరుకు చెందినవాడే. అందుకే అతియా శెట్టి, కేఎల్ రాహుల్ వివాహాన్ని సౌత్ ఇండియన్ వెడ్డింగ్ స్టైల్లో నిర్వహించనున్నట్లు సమాచారం. చదవండి: హ్యాపీ బర్త్డే మై లవ్.. శుభాకాంక్షలు వదినా.. వైరల్ View this post on Instagram A post shared by Athiya Shetty (@athiyashetty) చదవండి: అంకుల్ ఓకే అన్న తర్వాత ఇంకేంటి రాహుల్.. వెళ్లు అక్కడ నిలబడు! -
త్వరలో కాళేశ్వరం పర్యవేక్షణకు సీఎం!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న మిడ్మానేరు నుంచి దిగువ కొండ పోచమ్మ సాగర్ వరకు నీటిని తరలించే పనుల పర్యవేక్షణ నిమిత్తం సీఎం కేసీఆర్ త్వరలోనే సిరిసిల్ల జిల్లాలో పర్యటించే అవకాశముంది. పర్యటనలో భాగంగా ప్యాకేజీ–10 మోటార్లను ప్రారంభించడంతోపాటు మిడ్మానేరు ఎగువ, దిగువ ప్రాంతాల్లో ఏరియల్ వ్యూ చేస్తారని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. దీనిపై గురువారం సీఎం నీటి పారుదల ఈఎన్సీలతో చర్చించినట్లుగా తెలిసింది. -
వైద్య శాఖలో త్వరలో ఉద్యోగాల భర్తీ
కరీంనగర్: వైద్య శాఖలో ఖాళీగా ఉన్న 12 వేల ఉద్యోగాలను త్వరలో భర్తీ చేస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఆదివారం ఆయన కరీంనగర్ జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రతీ నియోజకవర్గంలో మూడు, నాలుగు చొప్పు న 700 పైగా గురుకుల పాఠశాలలు ఏర్పా టు చేసి పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అంది స్తున్నామన్నారు. పేద ప్రజలు వ్యాధులబారిన పడినప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి అప్పుల పాలు కాకుండా ప్రభుత్వ ఆస్పత్రులను పెంచుతున్నామని, ఉన్న ఆస్పత్రుల్లో కార్పొరేట్స్థాయి వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అన్ని ఆస్పత్రుల్లో వంద శాతం డాక్టర్లు, సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జీవితంలో అనుకోకుండా వచ్చేవి వైద్య ఖర్చులని మంత్రి అన్నారు. అనుకోని వైద్య ఖర్చుల నుంచి పేదవారిని రక్షించేలా ప్రభుత్వం ఉచిత వైద్య సేవల సెంటర్లను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ప్రజలకు నిరంతరం సేవలందించేది వైద్య శాఖ అని, మెరుగైన వైద్యంతోనే ప్రజలకు ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగించేలా సేవలందిస్తామని చెప్పారు. త్వరలో కరీంనగర్లో కొత్త ఆస్పత్రి నిర్మిస్తామన్నారు. -
త్వరలోనే రూ.20 నోటు, మరి పాతది?
సాక్షి, న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో కొత్త నోటును చలామణిలోకి తీసుకురానుంది. మహాత్మాగాంధీ కొత్త సిరీస్లో కొత్త 20 రూపాయల నోటును త్వరలోనే చలామణిలోకి తేనుంది. అదనపు భద్రతా ప్రమాణాలతో రూ. 20నోటును చలామణిలోకి తీసుకురానున్నట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. మహాత్మాగాంధీ కొత్త సిరీస్ కింద కొత్త నోట్లను తీసుకొచ్చినప్పటికీ, రద్దు చేసిన రూ.1000, రూ. 500 నోట్లు మినహా మిగిలిన పాత నోట్లన్నీ చలామణీలోనే ఉంటాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆర్బీఐ డేటా ప్రకారం.. 2016, మార్చి 31 నాటికి 492 కోట్ల రూ. 20నోట్లు చలామణీలో ఉన్నాయి. 2018 మార్చి నాటికి ఈ సంఖ్య 1000కోట్లకు చేరినట్లు ఆర్బీఐ అంచనా. దేశంలో మొత్తం చలామణిలో ఉన్న కరెన్సీలో 9.8శాతం రూ. 20 కరెన్సీ నోట్లు ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. కాగా 2016 నవంబరు 8న పెద్ద నోట్ల రద్దు (రూ. 1000, రూ. 500) తర్వాత ఆర్బీఐ అనేక కొత్త నోట్లను విడుదల చేసింది. రూ. 2000, రూ. 500, రూ. 200, రూ. 100, రూ. 50, రూ. 10 విలువ గల కొత్త కరెన్సీ నోట్లను చలామణిలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తీసుకొచ్చిన మిగతా కొత్త నోట్ల మాదిరిగానే రూ.20 నోటుకూ పాత నోట్ల కంటే కాస్త చిన్న సైజులో, డిజైన్ కూడా పాతవాటి కంటే భిన్నగా ఉండనుందని సమాచారం. -
కొత్త 100 రూపాయల నాణెం త్వరలో
సాక్షి, న్యూఢిల్లీ: కొత్త వందరూపాయల నాణెం త్వరలో చలామణి లోకి రాబోతోంది. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ముఖచిత్రంతో కొత్త 100 రూపాయల నాణెంను త్వరలో ప్రారంభించనున్నట్లు ఆర్థిక శాఖ అధికారిక ప్రకటన వెల్లడించింది. ఈ నాణెం 35 గ్రాముల బరువు ఉంటుంది. నాణెం వెనుక వైపు వాజ్పేయ్ ముఖచిత్రం వుంటుంది. అలాగే ఈ చిత్రానికి దిగువన దేవనాగరి లిపి, ఆంగ్లం భాషలో శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి, 1924- 2018 అని ముద్రించి ఉంటుంది. మరొకవైపు నాలుగు సింహాల అశోకుని స్థూపం బొమ్మ , సత్యమేవ జయతే(దేవనాగరి లిపి, ఆంగ్లంలో) , ఒకవైపు భారత్, మరోవైపు ఇండియా అని, దీనికిందనే 100 ముద్రించి ఉంటుందని చెప్పింది. -
కింది స్థాయి ఉద్యోగులకు గుడ్ న్యూస్?
సాక్షి, న్యూఢిల్లీ: ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న కనీస వేతన పెంపు కల సాకారం కానుందా. దాదాపు 48 లక్షల ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయా? తాజా నివేదికల ప్రకారం త్వరలోనే కనీస వేతనంపై నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పార్లమెంటులో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 7 వ వేతన కమిషన్ సిఫార్సులను ప్రకటించిన పద్దెనిమిది నెలల తర్వాత, మోదీ సర్కార్ కనీస వేతన పెంపును ఒక రియాలిటీగా మార్చేందుకు కృషి చేస్తోంది. కనీస వేతన పెంపును గ్రేడ్1 నుంచి గ్రేడ్ 5వరకు కింది స్థాయి ఉద్యోగులకు ఉపయోగడేలా నిర్ణయం తీసుకోనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనాన్ని పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ ఆర్థిక శాఖకార్యాలయ సీనియర్ అధికారి తెలిపారు. 6వ పే కమిషన్ ఫిట్మెంట్ ఫార్ములా 3.00 టెమ్స్ పెంచాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. దీని ప్రకారం ఎంట్రీ లెవల్లో కనీస వేతనం ఏడువేలనుంచి రూ.18వేలకు పెరగనుంది. క్లాస్1 అధికారుల ప్రారంభ వేతనం రూ.56వేలుగా ఉంటుంది. సెక్రటరీ లాంటి అత్యున్నత స్థాయి అధికారుల ప్రారంభ వేతనం రూ. 90 వేలనుంచి రూ. 2.5 లక్షలకు పెరుగుతుంది. కాగా కనీస వేతనంలో(ఫిట్మెంట్ ఫార్ములా 3.68 రెట్లు) 26 వేల రూపాయల పెంపును ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. -
18వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్
జగిత్యాల: రాష్ట్రంలో18 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. జిల్లా కేంద్రమైన జగిత్యాలలో పోలీస్ హెడ్క్వార్టర్స్ నిర్మాణ పనులను పరిశీలించేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లలో ఒకే రకమైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు, అధికారుల భాగస్వామ్యంతో మెరుగైన సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఏడాదిలోగా కొత్త పోలీస్ స్టేషన్ భవన సముదాయాలు అందుబాటులోకి తెస్తామన్నారు. -
రైల్వే ప్రయాణీకులపై ఆ చార్జీల బాదుడు: ప్రతీ ఏడాది
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులపై త్వరలో చార్జీల భారం పడనుంది. రైల్వే స్టేషనల్లో ప్రయాణికుల సామానులను, బ్యాగులకు ఉంచుకునేందుకు అందుబాటులో ఉన్న క్లాక్ రూమ్స్, లాకర్ చార్జీలను పెంచాలని రైల్వే బోర్డు సన్నద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ చార్జీల పెంపుపై డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం క్లాక్రూమ్, లాకర్ సేవలను ఆధునికీకరించడంతోపాటు కంప్యూటరైజ్డ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు త్వరలో బిడ్లను ఆహ్వానించనుది. ఇలా బిడ్లను దక్కించుకున్న వారు ప్రతి ఏడాది ఈ రేట్లను పెంచడానికి వీరికి అనుమతినివ్వనుంది. అధిక పర్యాటక కేంద్రాలు, డిమాండ్ బాగా ఉన్న కొన్ని స్టేషన్లలో ఈ ఛార్జీ ఎంత వసూలు చేయాలనేది సంబంధిత అధికారి నిర్ణయిస్తారని సీనియర్ రైల్వే అధికారి ఒకరు చెప్పారు. తాజా నిర్ణయం ప్రకారం రైల్వే ప్రయాణికులు 24గంటల వరకు లాకర్ను వినియోగించుకుంటే ఇకపై రూ. 20 వసూలు చేయనుంది. ఇప్పటి వరకు లాకర్ను 24 గంటలపాటు వాడుకుంటే రూ.15 వసూలు చేస్తోంది. అదనంగా మరో 24 గంటలు వాడుకుంటే వినియోగదారుడు రూ.30 చార్జ్ చెల్లించాలి. ఇక క్లాక్ రూమ్ రెంట్ ను 24 గంటలకు రూ.15గా నిర్ణయించారు. 2000వ సంవత్సరంలో ఇది ఏడు రూపాయలు ఉండగా అదనంగా మరో 24 గంటలు వాడుకుంటే 20 వసూలు చేసేవారు. అయితే 2013లో వీటిని సవరించి తొలి 24 గంటలకు రూ. 10 తర్వాతి 24 గంటలకు రూ.15లుగా వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
భారీ స్ర్కీన్, డ్యుయల్ సెల్ఫీ కెమెరా స్మార్ట్ఫోన్.. త్వరలో
ప్రముఖ మొబైల్ సంస్థ హెచ్టీసీ 2018 సంవత్సరంలో తొలి స్మార్ట్ఫోన్త్వరలోనే లాంచ్ చేయనుంది. తాజా నివేదికల ప్రకారంయ ఐ బ్రాండ్లో హెచ్టీసీ యు11ఐ పేరుతో జనవరి 15న విడదల చేయనుంది. అమెరికా మార్కెట్తో పాటు ఇతర మార్కెట్లలో కూడా ఒకేసారి ప్రవేశపెడుతుందా?లేదా అనేదానికి ఇంకా క్లారిటి లేదు. భారీ స్క్రీన్, డ్యుయల్ సెల్ఫీ కెమెరాలతో లాంచ్ చేయనున్న ఈ డివైస్ను మిడ్ సెగ్మెంట్ బడ్జెట్ ధరలోనే (రూ.32వేలు) కస్టమర్లకుఅందుబాటులో ఉంచనుందని తెలుస్తోంది. బ్లాక్, రెడ్, సిల్వర్ రంగుల్లో లభ్యం కానున్న ఈ స్మార్ట్ఫోన్ ఇతర ఫీచర్లపై అంచనాలు ఇలా ఉన్నాయి. హెచ్టీసీ యు11ఐ ఫీచర్లు 6 అంగుళాల ఫుల్హెచ్డీ డిస్ప్లే, సూపర్ ఎల్సీడీ3 1080 x 2160 పిక్సెల్ రిజల్యూషన్ స్నాప్ డ్రాగన్ 652 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ నౌగట్ 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ డ్యూయల్ సెల్ఫీ కెమెరా 3,930ఎంఏహెచ్ బ్యాటరీ HTC U11 EYEs (Harmony): 6" FHD+ (1080 x 2160) Super LCD3, SD652 octa core, 4GB/64GB (+microSD), USB-C, 3930mAh, IP67, Android Nougat, Edge Sense. Black, silver, and red. Launches 1/15. pic.twitter.com/Ng0ateH3XR — Evan Blass (@evleaks) January 12, 2018 -
జియో కస్టమర్లకు దసరా సంబరాలు
ముంబై: సంచలన రిలయన్స్ జియో 4 జీ ఫీచర్ ఫోన్ నవరాత్రికి కస్టమర్లను మురిపించనుంది. జియో వినియోగదారులు తన మొదటి ఫీచర్ఫోన్తో ఈ ఏడాది దసరా సంబరాలను జరుపుకునేలా ప్లాన్ చేసింది. ప్రీ బుకింగ్ చేసుకున్న 60 లక్షల మందికి సెప్టెంబర్ 21 నుంచి డెలివరీ చేయనున్నట్లు రిలయన్స్ జియో పేర్కొన్న సంగతి తెలిసిందే. అలాగే మరోగుడ్ న్యూస్ ఏమిటంటే. త్వరలోనే కొత్త ప్రీ బుకింగ్లను కూడా ప్రారంభించనుందని తెలుస్తోంది. జియో ఫోన్ కోసం ఆగస్టు 24 న ముందస్తు బుకింగ్ మొదలుకాగా కేవలం మూడు గంల్లోనే సుమారు 60 లక్షల యూనిట్ల జయో ఫీచర్ ఫోన్లు బుక్ అయ్యాయి. దీంతో బుకింగ్ను తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే వినియోగదారుల రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయని, బుకింగ్ ప్రక్రియ పునఃప్రారంభించనుందని, ఈ సమాచారాన్ని కస్టమర్లకు అందించనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే ప్రాధాన్యత ఆధారంగా వీటిని అందించనుంది. కాగా జూలై 21, 2017 న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏజీఎం రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. -
అదిరిపోయే ఫీచర్స్తో 'జెన్ఫోన్ ఏఆర్'
'జెన్ఫోన్ ఏఆర్' పేరుతో మొబైల్ సంస్థ అసుస్ ఓ సరికొత్త స్మార్ట్ఫోన్ను త్వరలో విడుదల చేయనుంది. గూగుల్ టాంగో / డేడ్రీమ్ ఫీచర్స్తో స్మార్ట్ఫోన్ లాంచింగ్పై ఇటీవల ఫేస్బుక్, ట్విట్వర్ ద్వారా ఒక టీజర్ ను రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో ఖచ్చితమైన తేదీ ఇప్పటికీ తెలియకపోయినా త్వరలోనే మార్కెట్ లో దీన్ని ప్రవేశపెట్టబోతోందని తెలుస్తోంది. వినియోగదారులు వీఆర్ కంటెంట్ను ఆస్వాదించేలా జెన్ యుఐ వీఆర్ 360 దీని అదనపు ప్రత్యేకతగా ఉండనుందనే అంచనాలు నెలకొన్నాయి. వర్చువల్ రియాల్టీ, అగ్మెంటెడ్ రియాల్టీ ఫీచర్లు గూగుల్ డే డ్రీమ్, టాంగో ప్లాట్ ఫాం సపోర్ట్తో లాంచ్ కానున్న మొట్టమొదటి స్మార్ట్ఫోన్ ఇదే కానుంది. అయితే అదరగొట్టే స్పెషల్ఫీచర్స్ తో లాంచ కానున్న ఆ స్మార్ట్ఫోన్ ధర ఎంత అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే. అసుస్ జెన్ఫోన్ ఏఆర్ ఫీచర్లు 5.7 ఇంచ్ క్వాడ్ హెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ప్లే 2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 7.0 నూగట్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్ 2.3 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ స్నాప్డ్రాగన్ 821 ప్రాసెసర్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇన్బిల్ట్ స్టోరేజ్, 23 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం -
వాన్నా క్రై షాకింగ్: బ్యాంకింగ్ వ్యవస్థపై దాడి
న్యూఢిల్లీ: 'వానా క్రై రాన్సమ్వేర్' ప్రకంకపనలు త్వరలోనే భారత బ్యాంకింగ్ వ్యవస్థను తాకనున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాన్సమ్ వేర్ సైబర్ ఎటాక్ ప్రభావం తగ్గుముఖం పడుతున్నప్పటికీ దీని బారిన పడుతున్న సంఖ్య మరింత వేగంగా పెరిగే అవకాశం ఉందని ఐటీ నిపుణులు వినియోగదారులను హెచ్చరిస్తున్నారు. ఆ సంస్థల సంఖ్య వేగంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. దీంతో వివిధ సంస్థలు, బ్యాంకులకు సైబర్ నిపుణులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. వానా క్రై ప్రభావం చాలా రాష్ట్రాలపై పడిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఎక్కడ దాడి జరిగింది అనేది చెక్ చేయడంలేదని సైబర్ సెక్యూరిటీ నిపుణుడు శుభ మంగళ ఏఎన్ఐ కి చెప్పారు. దాడుల తరువాతి ప్రకంకపనలు బ్యాంకింగ్ రంగంలో ప్రారంభంకానున్నాయనే అనుమానాలు వ్యక్తం చేశారు. మరో కొన్నిగంటల్లోనే బ్యాంకులు ప్రభావితమవుతాయని చెబుతున్నారు. ఈ మేరకు బ్యాంకులకు సమాచారం అందించామన్నారు. ఎందుకంటే వానాక్రై బారిన పడుతున్న విండోస్ ఆపరేటింగ్ సిస్టంతోనే ఏటీఏం నిర్వహరణ జరుగుతోందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే సంస్థలు, వ్యాపారాలు మరియు ఇతర రంగాల వారికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడానికి, వ్యవస్థలను నవీకరించడానికి హెచ్చరించినట్టు తెలిపారు. మరోవైపు ఆన్లైన్ బ్యాంకింగ్, ఏటీఏం ట్రాన్సాక్షన్స్ చేయొద్దంటూ ఇప్పటికే సోషల్మీడియాలో హెచ్చరికలు, వార్తలు విపరీతంగా షేర్ అవుతున్నాయి. రానున్న రెండు మూడు రోజుల్లో ఏటీఎంలు మూతపడే అవకాశం ఉందన్నఅంచనాలు భారీగా నెలకొన్నాయి. కాగా 'వానా క్రై రాన్సమ్వేర్' ద్వారా కంప్యూటర్లను హ్యాక్ చేసింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 150కిపైగా దేశాల్లో వేల సైబర్ దాడులు జరిగినట్లు కాస్పర్స్కై ల్యాబ్ తన బ్లాగ్లో పేర్కొంది. ముఖ్యంగా మన దేశంలో పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ లాంటి రాష్ట్రాలు ప్రభావితమయ్యాయి. అయితే ద్చరిత్రలోనే అతిపెద్దదిగా భావిస్తున్న ఈ సైబర్ దాడిలో నేరగాళ్లు ద్రవ్య ప్రయోజనాలను పొందలేదని ఐబీ నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. -
హై సెక్యూరిటీ ఫీచర్స్తో కొత్త రూ.10 నోట్లు
న్యూఢిల్లీ: కొత్త పది రూపాయల నోటును జారీ చేయనున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. త్వరలోనే ఈ నోట్లు అందుబాటులోకి రానున్నట్టు గురువారం వెల్లడించింది. అధిక భద్రతా లక్షణాలతో ఈ కొత్త 10 నోట్లను జారీ చేయనున్నట్టు తెలిపింది. అలాగే పాత పది రూపాయల నోట్లు కూడా చలామణిలో ఉంటాయని స్పష్టం చేసింది. మహాత్మా గాంధీ సీరిస్-2005లో రెండు నంబర్ ప్యానెల్స్పై ‘ఎల్’ (ఇన్ సైట్) లెటర్ తోపాటు, ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్పటేల్ సంతకంతో వీటిని లాంచ్ చేయనున్నట్టు తెలిపింది. ఎడమ నుంచి కుడికి మొదటి మూడు ఆల్ఫా-న్యూమరిక్ అక్షరాలు (ఉపసర్గ) ఆరోహణ క్రమంలో పాత పరిమాణంలోనే ఉండనున్నట్టు ఆర్బిఐ పేర్కొంది. గతంలో బ్యాంకు జారీ చేసిన రూ.10 విలువ కలిగిన అన్ని బ్యాంకు నోట్లు కూడా చట్టబద్ధంగా చెల్లుబాటులోఉంటాయని వివరణ ఇచ్చింది. -
ఏజెన్సీ ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీకి చర్యలు
బుట్టాయగూడెం (పోలవరం) : జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత ప్రభుత్వాస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని డీఎంహెచ్వో కె.కోటీశ్వరి చెప్పారు. బుధవారం బుట్టాయగూడెం మండలంలోని కేఆర్ పురం ఐటీడీఏలో జిల్లా మలేరియా కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. శుక్రవారం నులిపురుగుల నివారణకు పంపిణీ చేసే మాత్రల నిల్వలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెంలో ప్రభుత్వ ఆస్పత్రి మంజూరైం దని, సిబ్బందిని నియమించాల్సి ఉందన్నారు. అదేవిధంగా వేలేరుపాడులోని ప్రభుత్వ ఆస్పత్రిలో స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఐటీడీఏ పీవో ఎస్.షణ్మోహన్ ఆదేశాలు జారీ చేశారని ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫార్మసిస్ట్, ఎల్టీ పోస్టుల భర్తీకి కూడా కృషి చేస్తున్నామన్నారు. గిరిజన గ్రామాల్లో మలేరియా వ్యాప్తి చెందకుండా మలాథియాన్ స్ప్రేయింగ్ చేయిస్తున్నామని చెప్పారు. అన్ని పీహెచ్సీల్లో టైఫాయిడ్కు సంబంధించిన పరీక్షలు జరిపే విధంగా ఏర్పాటు చేశామన్నారు. మాతాశిశు ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో కొత్తగా ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 17 కేంద్రాలను సిద్ధం చేశామని, మరో 14 కేంద్రాలు సిద్ధం చేస్తున్నామన్నారు. డీ వార్మింగ్ డేను పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా 6 లక్షల 400 మంది పిల్లలకు మాత్రలు అందిస్తామని చెప్పారు. డెప్యూటీ డీఎంహెచ్వో వంశీలాల్ రాథోడ్ పాల్గొన్నారు. -
త్వరలో కొత్త రూ. 100 నోట్లు
-
త్వరలో కొత్త రూ. 100 నోట్లు
ముంబై: త్వరలోనే కొత్త రూ. 100 నోట్లను చలామణీలోకి తేనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. గవర్నర్ ఉర్జిత్ ఆర్ పటేల్ సంతకంతో విడుదల చేసే ఈ నోట్లు మహాత్మా గాంధీ సిరీస్ – 2005 తరహాలోనే ఉంటాయని, రెండు నంబర్ ప్యానెల్స్లో ఇన్సెట్ లెటర్ ‘ఖ’ ఉంటుందని పేర్కొంది. కొత్త వంద నోటు వెనుకవైపున ముద్రణ సంవత్సరం ’2017’ ఉంటుంది. పాత రూ. 100 నోట్లు ఇకపై కూడా చలామణీలోనే ఉంటాయని ఆర్బీఐ వివరించింది. -
త్వరలో అమ్మా అన్నాడీఎంకే!
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో మరో ద్రవిడ పార్టీ పురుడు పోసుకోనుంది. అన్నాడీఎంకే పగ్గాలను శశికళకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ’అమ్మా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం’ పేరున పార్టీ ఆవిర్భవించనున్నట్లు సమాచారం. ఈ పార్టీకి ఓ సీనియర్ మంత్రి తెరవెనుక ఉండి సారథ్యం వహించనున్నట్లు తెలుస్తోంది. పోయస్గార్డెన్ను ఖాళీ చేయనున్న శశికళ.. పార్టీలో తనకు అనుకూలమైన వాతావరణం పెరిగి పగ్గాలు చేతికి రావాలంటే పోయస్గార్డెన్ ఇంటిని ఖాళీ చేయడం మంచిదని శశికళ భావిస్తున్నారు. ‘ఈ బంగ్లాను స్మారక మండపంగా మార్చేందుకు నేను సిద్ధం. అందుకే ఖాళీ చేయబోతున్నా. జయ మేనకోడలు దీపకు చెందిన ఆస్తులేమైనా ఉంటే అప్పగిస్తా’ అని సన్నిహితులతో శశికళ అన్నట్లు సమాచారం. మరోపక్క అన్నాడీఎంకేను ఆంగ్ల దినపత్రిక ‘ది హిందూ’ మొదట్నుంచీ విభేధిస్తోంది. ఈ నేపథ్యంలో హిందూ మాజీ ఎడిటర్ ఎన్ రామ్ మంగళవారం పోయస్గార్డెన్ వెళ్లి శశికళతో భేటీ అవడం చర్చనీయాంశమైంది. -
పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలి
మిర్చి రైతులను ఆదుకోవాలి అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జెడ్పీసెంటర్ : జిల్లాలో మిర్చి రైతులకు నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సోమవారం టీటీడీసీలో వరద నివారణ ప్రత్యేకాధికారి అహ్మద్నదీం, జిల్లా కలెక్టర్ డీఎస్ లోకేష్కుమార్తో కలిసి వరద నివారణ చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మిర్చి విత్తనాలను రైతులు లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారని, తీరా వేశాక అవి మొలకెత్తలేదని, వాటిని సరఫరా చేసిన షాపులు, ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మిర్చి వేసిన రైతులు తీవ్ర ఆందో ఉన్నారని ఏ షాపులో కొనుగోలు చేశారో వారిపై చర్యలు తీసుకోవాలని, జిల్లా ఎస్పీని సంప్రదించి కేసులు నమోదు చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో గోదావరి వరదల ఇబ్బంది లేదని, అయినప్పటికీ అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేసేందుకు ఇరిగేష¯ŒS మంత్రిని కోరినట్లు చెప్పారు. మండల వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటలను కాపాడుకునేందుకు అవసరమైన సలహా లు అందించాలని చెప్పారు. వర్షాలు ముగిసిన తరువాత వ్యాధులు ప్రబలకుండా అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని, వైద్య ఆరోగ్యశాఖ బఫర్స్టాక్ ఆయా ప్రాంతాల్లో నిల్వ ఉంచాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ లోకేష్కుమార్ మాట్లాడుతూ పంచాయతీరాజ్, ఆర్అండ్బీ శాఖలకు రూ.3.85 లక్షలు మంజూరు చేసినా మరమ్మతు పనులు మొదలు కాలేదన్నారు. అనంతరం వరద నివారణ చర్యలు పరిశీలించేందుకు ప్రభుత్వం నియమించిన జిల్లా ప్రత్యేకాధికారి, కార్మిక శాఖ కమిషనర్ అహ్మద్నదీం మాట్లాడుతూ జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల ఎలాంటి ప్రమాదం లేదన్నారు. పాలేరు రిజర్వాయర్ నీటి మట్టం 21.8 అడుగులు, మున్నేరు ఉధృతి 10 అడుగులు ఉందన్నారు. వర్షాల వల్ల జిల్లాలో 4,500 చెరువుల్లో 500 చెరువులు పొంగిపోర్లుతున్నాయని, మరో 1,500 చెరువుల్లో 75 శాతం మేర నీరు వచ్చి చేరిందని పేర్కొన్నారు. -
నలుగురు ఎస్సైలకు పదోన్నతి
నిజామాబాద్ క్రైం: జిల్లాలో సీనియర్ ఎస్సైలు నలుగురికి సీఐలుగా పదోన్నతులు రానున్నాయి. టూటౌన్ ఎస్సై బోస్ కిరణ్, 5వ టౌన్ ఎస్సై సైదయ్య, వీఆర్లో ఉన్న ముజుబుర్ ఉర్ రహమాన్, ప్రతాప్లింగంలకు పదోన్నతి రానుంది. దీనికి సంబంధించి రెండ్రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశముందని సమాచారం. వాస్తవానికి నెల క్రితమే వెలువడాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఈలోగా గణేశ్ ఉత్సవాలు రావటంతో నిలిచిపోయిన ఉత్తర్వులు రెండ్రోజుల్లో వెలువడనున్నట్లు తెలిసింది. నిలిచిపోయిన ఎస్సైల బదిలీలు.. మరోవైపు, జిల్లాలో ఎస్సైల బదిలీలు నిలిచిపోయాయి. నెల క్రితం ఎస్సైలను బదిలీ చేస్తూ ఉత్వర్వులు వెలువడిన సంగతి తెలిసిందే. ఏకంగా 11 మందిని వీఆర్కి బదిలీ చేయడం అప్పట్లో కలకలం రేపింది. అయితే, సదరు ఎస్సైలు ప్రజాప్రతినిధులను కలిసి బదిలీలను నిలిపి వేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఘటనపై ఆగ్రహంతో ఇన్చార్జి డీఐజీ ఇటీవల బోధన్లో పర్యటించిన సమయంలో.. ఆరోపణలు వచ్చిన నలుగురు ఎస్సైలపై చర్యలకు ఉపక్రమించారు. కొత్త జిల్లా ఏర్పాటు నేపథ్యంలో పోలీస్ శాఖలో కూడా విభజన ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో సిబ్బంది విభజన పూర్తయ్యాకే ఎస్సైల బదిలీలు ఉంటాయని పోలీస్ వర్గాలు తెలిపాయి. -
త్వరలో తహసీల్దార్ల బదిలీలు !
క్లీన్చిట్ ఉన్నవారికి మంచి స్థానాలు... అధికారుల పనితీరుపై సమాచార సేకరణ పూర్తి మరిపెడ ఏసీబీ కేసు నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు హన్మకొండ అర్బన్ : జిల్లాలో భారీగా తహసీల్దార్ల బదిలీలు జరుగనున్నట్లు సమాచారం. ఒకరిద్దరు కాదు.. ఏకంగా అన్ని రెవెన్యూ డివి జన్ల పరిధిల్లోనూ మార్పులు జరిగే అవకాశాలున్నాయి. ఈసారి బదిలీల్లో రాజకీయ జోక్యం లే కుండా పూర్తిగా శాఖాపరంగానే చేపట్టాలని ఉ న్నతాధికారులు నిర్ణయించినట్టు సమాచారం. మరిపెడ కేసు నేపథ్యంలో.. వారం కిత్రం మరిపెడ తహసీల్దార్, ఆర్ఐ అవినీతి ఆరోపణలతో ఏసీబీకి పట్టుబడిన నేపథ్యంలో తహసీల్దార్ల వ్యవహారంలో ఉన్నతాధికారులు సమగ్ర సమాచారం సేకరించి నట్లు విశ్వసనీయ సమాచారం. ఆరోపణలు ఉన్నవారిపై ఈసారి కఠువుగా వ్యవహ రిస్తారనే ప్రచా రం సాగుతోంది. అలాంటి వారికి ప్రస్తుత బదిలీల్లో ప్రాధాన్యత లేని పోస్టింగ్లకు పంపిస్తారని తెలుస్తోంది. వీటితోపాటు కరీంనగర్ జిల్లాకు బదిలీ అయిన హన్మకొండ తహసీల్దార్ రాజ్కుమార్ తనను రిలీవ్ చేయాలని అధికారులను కోరుతుండటంతో హన్మకొండకు కూ డా అన్ని విధాలా యోగ్యుల కోసం అధికారు లు అన్వేషిస్తున్నారని సమాచారం. అయితే ఇప్పటికే ఈ పోస్టు కోసం ఒకరిద్దరు తహసీల్దార్లు ప్రయత్నాలు చేస్తున్నారు. బదిలీల విషయంలో రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నా.. పనితీ రుకే పెద్దపీట వేయాలని ఉన్నతాధికారులు యోచించి జాబితా సిద్ధం చేస్తున్నట్లు తెలి సింది. మొత్తంగా తహసీల్దార్లలో మాత్రం బది లీ గుబులు పట్టుకుంది. తమ పనితీరుపై అధికారుల వద్ద ఏ విధమైన సమాచారం ఉందో ఆనే ఆందోళన మొదలైంది. బదిలీల జాబితా ఎంతమందితో ఉంటుంది... తమపేర్లు ఉన్నా యా...? అన్న విషయాలు ఆరా తీసే పనిలో చాలామంది బిజీగాఉన్నారు. ఉన్నతాధికారుల వద్ద ఉన్న జాతకాల ఆధారంగా కొద్ది రోజుల్లో పోస్టింగ్లు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
డీఎ అమలు దిశగా తెలంగాణ సర్కారు
-
ఇక 3డీ అద్దాల అవసరం లేదు!
న్యూయార్క్ః థియేటర్లలో 3డీ సినిమాలు చూడాలంటే తప్పనిసరిగా కళ్ళకు ప్రత్యేకమైన గ్లాసెస్ పెట్టుకోవాలన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇకపై అలాంటి అవసరం లేదంటున్నారు మసాచుసెట్స్.. వైజ్ మ్యాన్ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు. కంటికి ఎలాంటి 3డీ గ్లాసెస్ పెట్టుకోకుండానే త్రీడీ సినిమాలు చూసే అవకాశం దగ్గరలోనే ఉందంటున్నారు. అమెరికా కు చెందిన మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇజ్రాయెల్ లోని వైజ్ మ్యాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులు 3డీ అద్దాలు పెట్టుకోకుండానే థియేటర్లలో 3డీ సినిమాలు చూడొచ్చని చెప్తున్నారు. 'సినిమా 3డీ' పేరున్న ఆప్టిక్ లెన్స్ ను స్ర్కీన్ పై అమర్చడంతో సినిమా హాల్లోని ఏ సీట్లో కూర్చున్నా.. 3డీ అనుభూతి కలుగుతుందని తమ తాజా పరిశోధనల్లో కనుగొన్నారు. ఇప్పటికే గ్లాసెస్ లెస్ 3డీ టెక్నాలజీ అందుబాటులో ఉన్నా... అది హాల్లో ఆటూ ఇటూ తిరిగుతూ చూసే అవకాశం ఉండదని, సీట్ల అమరిక ఆధారంగా సింగిల్ యూజర్లను దృష్టిలో పెట్టుకొని దాన్ని రూపొందించారని ఎంఐటీ కంప్యూటర్ సైన్స్ అండ్ అర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ల్యాబ్ కు చెందిన ప్రొఫెసర్ వోసియెక్ మాటుసిక్ అంటున్నారు. అయితే కొత్త సినిమా 3డీ స్పెషల్ ఆప్టిక్ సిస్టమ్ లో థియేటర్లోని ఏ ప్రాంతంనుంచీ, ఏ యాంగిల్ లోనైనా 3డీ సినిమాను అద్దాల్లేకుండా చూడొచ్చని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ కొత్త గ్లాసెస్ లెస్ 3డీ సిస్టమ్ అభివృద్ధి దశలో ఉందని, థియేటర్లలో ఈ కొత్త విధానం అందుబాటులోకి రావాలంటే మరికొంత సమయం పడుతుందని పరిశోధకులు చెప్తున్నారు. కాలిఫోర్నియాలోని అనాహైమ్ లో జరిగబోయే 'సిగ్ గ్రాఫ్' కంప్యూటర్ గ్రాఫిక్స్ కాన్ఫరెన్స్ లో తాము అభివృద్ధి చేసిన పరిశోధనలను ప్రవేశపెట్టనున్నట్లు వారు తెలిపారు. -
ఎంజీఎంలో త్వరలో ఆన్లైన్ సేవలు
ఆదర్శంగా జిల్లాలోని రెండు సీహెచ్సీ, ఐదు పీహెచ్సీలు మంత్రి లక్ష్మారెడ్డికి వివరించిన కలెక్టర్ ఎంజీఎం : నాలుగు జిల్లాలకు ధర్మాస్పత్రిగా పేరుగాంచిన ఎంజీఎంకు వచ్చే రోగుల వివరాలను నమోదు చేయడంతో పాటు ప్రతీ రికార్డు అందుబాటులో ఉండేలా వైద్యసేవలను కంప్యూటరీకరించేందుకు త్వరలో ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తెస్తున్నామ ని కలెక్టర్ వాకాటి కరుణ మంత్రి లక్ష్మారెడ్డికి వి వరించారు. ఎంజీఎంతో పాటు సీకేఎం ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను ఆమె బుధవారం మంత్రి దృష్టికి తెచ్చారు. ఎంజీఎం ఆస్పత్రికి నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ఫర్ హాస్పిటల్(ఎన్బీఏహెచ్) ర్యాంకు సాధించేలా సేవలు మెరుగుపర్చేలా కృషి చేస్తున్నామని చెప్పారు. 1200 పడకల ఆస్పత్రిలో మెకానిజం లాండ్రీ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఎంజీఎంకు వచ్చే రోగుల సంఖ్య ను తగ్గించేందుకు జిల్లావ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేయడమే లక్ష్యంగా రిలయన్స్ పౌండేషన్ ప్రతినిధుల సహాయం తో జిల్లాలో రెండు సీహెచ్సీలు, ఐదు పీహెచ్సీలను మోడల్ ఆస్పత్రులుగా తీర్చిదిద్దేలా ప్ర ణాళిక సిద్ధం చేశామని వివరించారు. అక్కడి సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చామన్నారు. 104లో జీపీఆర్ఎస్ సిస్టమ్.. జిల్లాలో 104 వాహనాల పరిస్థితి అధ్వానంగా మారిందని, ఈ వాహనాలను సక్రమంగా విని యోగించుకుంటే గ్రామాల్లో పేదలకు మెరుగైన సేవలందించవచ్చని కలెక్టర్ మంత్రికి వివరించారు. 104ల్లో జీపీఆర్ఎస్ సిస్టమ్ను అందుబాటులో తెస్తే.. అవి రోజూ ఏయే గ్రా మాల్లో సేవలందిస్తున్నాయో తెలుసుకోవచ్చ న్నారు. సీకేఎం ఆస్పత్రిలో అదనపు భవన ని ర్మాణం అవసరమని, అక్కడ సిబ్బంది పోస్టు లు భర్తీ చేయాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, ఎంజీఎం, సీకేఎంల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎంజీఎం పిడియాట్రిక్ విభాగంలోని నవజాత శిశు సంరక్షణ కేంద్రంతో పాటు నూతనంగా నిర్మిస్తున్న మాతశిశు కేంద్ర భవనాన్ని మంత్రి పరి శీలించారు. పలువురు పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి చికిత్స ఎలా అందుతుందో ఆరా తీశారు. కార్యక్రమంలో వీసీ కరుణాకర్రెడ్డి, సీకేఎం సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు -
డ్రాట్ బీరు వచ్చేస్తోంది
-
త్వరలో బ్యాంకుల్లా పోస్టాఫీసులు!
న్యూఢిల్లీః త్వరలో బ్యాంకింగ్ సేవలు మరింత విస్తరించనున్నాయి. ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ) పేరున దగ్గరలోని పోస్టాఫీసులే బ్యాంకులుగా పనిచేసే విధానాన్ని 2017 మార్చి నాటికి అమల్లోకి తెచ్చేందుకు కేంద్ర కేబినెట్ ప్రతిపాదనను తెచ్చింది. దీంతో 2019 నాటికల్లా మొత్తం దేశంలోని 50 జిల్లా కేంద్రాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ప్రస్తుం మారుమూల ప్రాంతాల్లో ఉన్న 139,000 పోస్టాఫీసులతో కలిపి భారతదేశంలో 154,000 పోస్టాఫీసులు ఉన్నాయి. వీటిలో ముందుగా జిల్లా ప్రధాన కేంద్రాల్లో ఉండే సుమారు 650 కార్యాలయాల్లో పోస్టల్ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చి, వాటిని మారుమూల ప్రాంతాలతో అనుసంధానం చేస్తారు. వచ్చే ఏడాది మార్చి నాటికల్లో పోస్టల్ డిపార్ట్ మెంట్ లో పేమెంట్ బ్యాంకులను అందుబాటులోకి తెస్తామని, ప్రపంచంలోనే పోస్టల్ సేవలను అందించడంలో మన దేశం ఇంచుమించుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కన్నా అతి పెద్ద నెట్వర్క్ ను కలిగి ఉందని టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుత ప్రతిపాదనను అమల్లోకి తెచ్చేందుకు 400 కోట్ల రూపాయల ఈక్విటీలు, 400 కోట్ల రూపాయల గవర్నమెంట్ గ్రాంటులతో మొత్తం 800 కోట్ల రూపాయలను వినియోగించనున్నట్లు టెలికాం మంత్రి తెలిపారు. ఇందుకోసం మారుమూల ప్రాంతాల్లో పనిచేసే సుమారు 1.7 లక్షల మంది పోస్ట్ మ్యాన్ లకు అవసరాన్ని బట్టి స్మార్ట్ ఫోన్లను, టాబ్లెట్ లను అందిస్తామని, దీంతో ప్రజలు తమ బ్యాంక్ అకౌంట్లను సులభంగా చేరుకోగల్గుతారన్నారు. అంతేకాక ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ కలిగిన 5000 ఏటీఎం లను కూడ దేశవ్యాప్తంగా ప్రారంభించేందుకు శాఖ యోచిస్తున్నట్లు తెలిపారు. -
ముంగిట్లోకే పవిత్ర గంగాజలం!
న్యూఢిల్లీః కాశీ వెళ్ళి గంగలో స్నానం చేయడం అంటే జీవితం ధన్యం అయినట్లేనని ఎంతోమంది హిందువులు నమ్ముతారు. ఆ పుణ్య తీర్థ స్నానం జీవితంలో ఒక్కసారైనా చేయాలని ఆశిస్తారు. ఆ నదీ జలాలతో స్నానమాచరించాలనే కోరిక ఉన్నా, అవకాశం లేని వారికోసం ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులోకి తేనుంది. గంగా జలాన్ని పోస్టు ద్వారా ఏకంగా మీ ముంగిట్లోకి తెచ్చే ప్రత్యేక సౌకర్యాన్ని ఈ కామర్స్ సహాయంతో అందించనుంది. పవిత్ర గంగాజలం పోస్టుద్వారా నేరుగా ఇంటికే వచ్చే అవకాశం దగ్గర్లోనే ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న పోస్టల్ శాఖను వినియోగించుకొని ఈ కామర్స్ సైట్లతో అనుసంధానమై ఈ ప్రత్యేక సదుపాయాన్నిభక్తులకు ప్రభుత్వం త్వరలో అందుబాటులోకి తేనుంది. పోస్టల్ నెట్ వర్క్ ద్వారా గంగాజలం పొందే అవకాశాన్ని కల్పించమంటూ తమకు ఎన్నో విన్నపాలు అందాయని, అందుకే హరిద్వార్, రిషికేశ్ ల వద్దనుంచి శుద్ధి చేసిన గంగాజలాన్ని ఇంటింటికి చేర్చే సదుపాయం కల్పించనున్నట్లు కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఆన్ లైన్ లో కొనుగోలు చేయడం ద్వారా గంగాజలాన్ని ఇంటికి పంపిచే ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రత్యేక ప్రతిపాదనతో పోస్టల్ శాఖకు ఎనభై శాతం ఆదాయం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్ళ పాలనలో సాధించిన విజయాలను వెల్లడించిన సందర్భంలో మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ఉత్తరాలతోపాటు చీరలు, ఆభరణాలు వంటి ఎన్నో వస్తువులతో కూడి పార్శిళ్ళను అందిస్తున్న పోస్ట్ మ్యాన్ లు గంగాజలం ఎందుకు అందించకూడదు అన్నారు. స్పీడ్ పోస్ట్ రెవెన్యూ డిపార్ట్ మెంట్ 2013-14 సంవత్సరాల్లో 1,372 కోట్ల ఆదాయాన్ని చవి చూసిందని, అలాగే 2015-16 అది 1600 కోట్లకు పెరిగిందని మంత్రి వెల్లడించారు. అదే సంవత్సరాల్లో ఈ కామర్స్ ద్వారా క్యాష్ ఆన్ డెలివరీ కలెక్షన్లు 100 కోట్లనుంచి 1300 కోట్లకు పెరిగాయని తెలిపారు. -
ఆవుల కోసం ఓ పన్ను వడ్డింపు!
ఛండీగడ్: పంజాబ్ ప్రభుత్వం ఆవుల సంరక్షణకు త్వరలోనే ఓ పన్ను (కౌ లెవీ సెస్) విధించనుంది. వాహనాల కొనుగోలు, విద్యుత్, ఇతర సేవలపై ఈ పన్ను విధించాలని నిర్ణయించినట్లు స్థానిక సంస్థల శాఖ మంత్రి అనిల్ జోషి తెలిపారు. నాలుగు చక్రాల వాహనాలపై వెయ్యి రూపాయలు, ద్విచక్ర వాహనాలపై రూ. 500 చొప్పున పన్ను విధించాలని నిర్ణయించారు. ఆయిల్ ట్యాంకర్లపై రూ.100, విద్యుత్ వినియోగదారులపై ఒక యూనిట్కు అదనంగా 2 పైసలు, విదేశీ మద్యంపైన రూ.10, స్థానిక మద్యంపై రూ.5 పన్నుగా విధించాలని నిర్ణయించినట్టు మంత్రి వెల్లడించారు. ఇందుకోసం మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో కూడా తీర్మానాలు ఆమోదించారు. ఈపన్ను ఈనెల 25 నుంచి అమలులోకి రానుందని ఆయన చెప్పారు. ప్రభుత్వం కౌ లెవీ సెస్ కోసం 2014 లోనే ఎన్ఫోర్స్మెంట్ శాఖకు ప్రతిపాదనలు పంపగా ఇప్పుడు ఆమోదం లభించింది. పంజాబ్ లోని భటిండా మున్సిపల్ కార్పొరేషన్ 2009లోనే ప్రయోగాత్మకంగా ఈ పన్నును విధించింది. స్థానిక సంస్థల నిర్ణయం వల్ల ఏడాదికి రూ.100 కోట్ల ఆదాయం సమకూరనుందని, రాష్ట్రంలో 2.69 లక్షల ఆవులు 472 షెల్టర్లలలో ఉన్నట్టు గోసేవా కమిషన్ చైర్మన్ కీమ్తి భగత్ తెలిపారు. పంజాబ్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ప్రకారం పశుసంపదను కాపాడటం స్థానిక సంస్థల బాధ్యత. -
సప్తశృంగేరీ భక్తులకు ట్రాలీ సదుపాయం!
నాసిక్ః పన్నెండేళ్ళకోసారి కుంభమేళాతో దేశంలోని భక్తుల దృష్టిని ఆకర్షించే నాసికా త్రయంబకం దగ్గరలోని సప్త శృగేరీ దేవి భక్తులకు త్వరలో కొత్త సదుపాయం అందుబాటులోకి రానుంది. సప్తశృంగి అమ్మవారిని నదీమార్గంలోనూ, కాలినడకన దర్శించే భక్తులు... ఇకపై ప్రత్యేక ట్రాలీలలో ప్రయాణించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ట్రాలీ ప్రాజెక్టు పూర్తి చేసి మరో రెండు నెలల్లో భక్తులకు అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు చెప్తున్నారు. కొండపై కొలువైన సప్తశృంగి ఆలయాన్ని దర్శించే భక్తులకు ట్రాలీ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని ఎత్తైన కొండపైకి భక్తులు చేరడాన్ని సులభతరం చేసేందుకు ట్రాలీ ప్రాజెక్టును ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. సుయోగ్ గుర్బాక్సానీ ఫునిక్యులర్ రోప్వేస్ సంస్థ ప్రారంభించిన ఈ ప్రాజెక్టుకు సుమారు 85 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. ఈ ప్రత్యేక సదుపాయం ప్రారంభించినట్లైతే భక్తులు ఇక 500 మెట్లను కాలి నడకన ఎక్కాల్సిన అవసరం ఉండదని, కేవలం మూడు నిమిషాల్లో కొండపైకి చేరుకో గల్గుతారని ప్రాజెక్ట్ మేనేజర్ రాజీవ్ లుంబా తెలిపారు. భక్తులను తరలించేందుకు రెండు ట్రాలీలను ఏర్పాటు చేస్తున్నామని, అలాగే వికలాంగులు, వృద్ధులకోసం ప్రత్యేక సేవలను అందించనున్నట్లు ఆయన తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసే రోప్ వే సౌకర్యంలోని ఒక్కో ట్రాలీలో ట్రిప్పుకు 60 మంది వరకూ ప్రయాణించవచ్చని, రెండు ట్రాలీలు కలిసి గంటకు సుమారు 12 వందల మంది భక్తులను కొండపై ఆలయానికి చేరవేయగల్గుతాయని అధికారులు చెప్తున్నారు. అంతేకాక ట్రాలీల్లో ఏసీ సౌకర్యం కూడ ఉన్నట్లు తెలిపారు. నాసిక్ కు దగ్గరలోని కల్వాన్ తాలూకా నండూరి గ్రామంలో సప్తశృంగి ఆలయం ఉంది. ఈ ప్రసిద్ధ ఆలయాన్ని నవరాత్రుల సమయంలో లక్షలకొద్దీ భక్తులు సందర్శిస్తుంటారు. మహరాష్ట్ర ప్రభుత్వం, సప్తశృంగీ దేవి నివాసిని ట్రస్ట్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ నిర్వహణకు నిర్ణయించినట్లు ప్రాజెక్ట్ అధికారి లుంబా తెలిపారు. -
వచ్చే నెలలో ఇర్ఫాన్ పెళ్లి!
బరోడా: భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ త్వరలోనే పెళ్లి కొడుకు కానున్నాడు. ‘ఫిబ్రవరిలో నా పెళ్లి జరగనున్న మాట వాస్తవం. ఇతర వివరాలు తర్వాత చెబుతాను’ అని ఇర్ఫాన్ వివాహ విషయాన్ని ధ్రువీకరించాడు. ఫిబ్రవరి నెల మొదటి లేదా రెండో వారంలో అతడి పెళ్లి వేడుక ఉంటుందని, ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయని కుటుంబ సన్నిహితులు చెప్పారు. ఇది పెద్దలు కుదిర్చిన సంబంధమని, అమ్మాయి పేరు సఫా అని వారు వెల్లడించారు. -
సోనాలికా 250 హెచ్పీ ట్రాక్టర్ త్వరలో!
♦ ఆగస్టు తర్వాతి నుంచి అమ్మకాల జోష్ ♦ గతేడాది స్థాయిలోనే దేశీ మార్కెట్ ♦ కంపెనీ సేల్స్ డెరైక్టర్ రానా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్రాక్టర్ల తయారీలో ఉన్న సోనాలికా 250 హెచ్పీ సామర్థ్యం గల మోడల్ను అభివృద్ధి చేస్తోంది. ఈ ఏడాదే దీనిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే అంతర్జాతీయ మార్కెట్ కోసం ఈ మోడల్ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం కంపెనీ 20-120 హెచ్పీ విభాగంలో ట్రాక్టర్లను దేశీయంగా విక్రయిస్తోంది. మరింత అధిక సామర్థ్యమున్న మోడళ్లను భారత్లో ప్రవేశపెడతామని సోనాలికా ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ సేల్స్, మార్కెటింగ్ డెరైక్టర్ డి.ఎల్.రానా శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా మోడళ్లకు రూపకల్పన చేస్తున్నట్టు చెప్పారు. 2015-16లో కొత్తగా 3 ట్రాక్టర్లను ప్రవేశపెట్టామన్నారు. మార్చికల్లా మరో 2 రానున్నాయని వివరించారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి.. దేశీయంగా ట్రాక్టర్ల మార్కెట్లో 2013-14లో 6.34 లక్షల యూనిట్లు నమోదయ్యాయి. 2014-15 వచ్చేసరికి ఈ సంఖ్య 5.50 లక్షలకు పడిపోయింది. 2015-16 సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ కాలంలో 3.89 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడం వంటి కారణాలతో రైతులు కొత్త ట్రాక్టర్ల కొనుగోలుకు దూరంగా ఉన్నారని కంపెనీ తెలిపింది. మొత్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2014-15 స్థాయిలోనే ఉంటుందని సోనాలికా అంచనా వేస్తోంది. ఆగస్టు తర్వాతి నుంచి తిరిగి అమ్మకాలు పుంజుకుంటాయని భావిస్తున్నామని రానా చెప్పారు. సోనాలికా 2014-15లో దేశవ్యాప్తంగా 66 వేల యూనిట్లను అమ్మింది. 15 శాతం వాటా లక్ష్యం.. ట్రాక్టర్ల తయారీలో దేశంలో మూడో స్థానంలో ఉన్న సోనాలికా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో 6.5 శాతం వాటా కలిగి ఉంది. ఈ రాష్ట్రాల్లో 2017 మార్చినాటికి 15 శాతం వాటా లక్ష్యంగా చేసుకుంది. పరిశోధన, అభివృద్ధికి ఏటా రూ.25 కోట్లు వెచ్చిస్తోంది. రూ.500 కోట్లతో 2 లక్షల యూనిట్ల వార్షిక సామర్థ్యంతో కంపెనీ కొత్తగా పంజాబ్లో ఏర్పాటు చేస్తున్న ప్లాంటులో ఉత్పత్తి మరో 3 నెలల్లో ప్రారంభం కానుందని సీనియర్ జీఎం ఎన్వీఎల్ఎన్ స్వామి తెలిపారు. నాలుగేళ్ల క్రితం దేశీయ మార్కెట్లో 8 శాతంగా ఉన్న సోనాలికా వాటా ప్రస్తుతం 12 శాతానికి ఎగబాకింది. -
త్వరలో రాహుల్ రైతు పాదయాత్ర
న్యూఢిల్లీ: దేశంలో కొనసాగుతున్న రైతుల ఆత్మహత్యల పరంపర నేపథ్యంలో కర్షకుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ త్వరలో కిసాన్ పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలుగా ఇటీవలి కాలంలో వార్తల్లో నిలిచిన మహారాష్ట్రలోని విదర్భ లేదా తెలంగాణలోని మెదక్గానీ మరేదైనా జిల్లా నుంచి ఈ యాత్రను రాహుల్ ప్రారంభించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, పంజాబ్, తెలంగాణలలోని వివిధ జిల్లాల్లో రాహుల్ పాదయాత్ర చేపట్టనున్నారు. యూపీలోని బుందేల్ఖండ్, తూర్పు యూపీలో పర్యటించనున్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో బుందేల్ఖండ్కు ప్రత్యేక ప్యాకేజీ అందేలా రాహుల్ చొరవ చూపడం తెలిసిందే. రాహుల్ కిసాన్ పాదయాత్ర గురించి ఏఐసీసీ సమాచార విభాగం ఇన్చార్జి రణ్దీప్ సుర్జేవాలాను మీడియా సంప్రదించగా రానున్న కొన్ని రోజుల్లోనే ఈ యాత్ర ఉంటుందని...రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరిగిన అన్ని రాష్ట్రాలనూ రాహుల్ సందర్శిస్తారని చెప్పారు. ఈ యాత్రకు సంబంధించిన వివరాలు ఖరారు కావాల్సి ఉందన్నారు. మే రెండో వారంలో రాహుల్ రాక: రాహుల్ వచ్చేనెల రెండోవారంలో తెలంగాణకు రానున్నారు. ఇటీవలి వడగళ్ల వాన, ఈదురు గాలులకు తెలంగాణ జిల్లాల్లో పెద్ద ఎత్తున పంట, ఆస్తినష్టం వాటిల్లిన నేపథ్యంలో పంట పొలాలను పరిశీలించడంతోపాటు బాధిత రైతులను పరామర్శించేందుకు రాహుల్ వస్తున్నట్లు ఏఐసీసీ నుంచి టీపీసీసీకి సమాచారం అందింది. -
త్వరలో వర్సిటీ ఉద్యోగులకు పీఆర్సీ
హైదరాబాద్: తెలంగాణ లోని విశ్వవిద్యాలయాల బోధనేతర ఉద్యోగులను రాష్ట్ర ఉద్యోగులుగా పరిగణిస్తూ రాష్ట్ర ప్రభుత్వం త్వ రలో పదో పీఆర్సీని అమ లు చేయనున్నట్లు టి.వర్సిటీల బోధనేతర ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కంచి మనోహర్, కార్యద ర్శి మహిపాల్రెడ్డి తెలి పారు.