symbol
-
త్యాగమయి చిత్తోర్ఘర్ పన్నా దాయి : ఆసక్తికర విశేషాలు
రాజస్థాన్, చిత్తోర్ఘర్... పేరు వినగానే మేవార్రాజుల ఘనచరిత్ర కళ్ల ముందు మెదులుతుంది. రాణి పద్మిని త్యాగం గుర్తు వస్తుంది. పద్మావత్ సినిమా తర్వాత చిత్తోర్ ఘర్ పేరు అనేక వివాదాలకు, విచిత్ర భాష్యాలకు నెలవైంది. సినిమాలో చూసిన చిత్తోర్ఘర్ కోటను స్వయంగా చూడడం కూడా అవసరమే. చిత్తోర్ఘర్ చరిత్రలో ఉన్న మహిళ రాణి పద్మినిది మాత్రమే కాదు. ఈ కోటలో చరిత్ర సృష్టించిన ముగ్గురు. భక్త మీరాబాయి, రాణి పద్మిని, పన్నాదాయి. భక్త మీరాబాయి... కృష్ణుడి భక్తురాలిగా సుపరిచతమే. ఇక పన్నా దాయి (Panna Dhai) మాత్రం సినిమాటిక్ అట్రాక్షన్ లేని పాత్రకావడంతో చరిత్రపుటల్లో అక్షరాలుగా మాత్రమే మిగిలిపోయింది. త్యాగమయి పన్నారాజపుత్ర రాజు రాణా సంగా భార్య రాణి కర్ణావతి దగ్గర దాదిగా పని చేసింది పన్నాదాయి. పిల్లల్ని పెంచే బాధ్యత ఆమెది. రెండవ ఉదయ్ సింగ్ చంటిబిడ్డగా ఉన్నప్పుడు కోట మీద దాడి జరిగింది. ఉదయ్ సింగ్ను కాపాడడానికి శత్రువుల దృష్టి మళ్లించడానికి ఊయలలో తన బిడ్డను పెట్టి ఉదయ్సింగ్ను భద్రంగా కోట నుంచి బయటకు పంపించింది. రాజ కుటుంబం పట్ల ఆమెకున్న ప్రేమకు, త్యాగానికి గుర్తుగా కోట లోపల ఆమె విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ కోటలో రాణా కుంభ కట్టిన విజయ్ స్తంభ్, రాణి పద్మిని ప్యాలెస్ ముఖ్యమైనవి. అల్లావుద్దీన్ ఖిల్జీ అద్దంలో రాణిని చూసిన ప్రదేశం ముఖ్యమైనది. పద్మిని తన ప్యాలెస్ మెట్ల మీద కూర్చుంటే, ఆమె ప్రతిబింబం... ప్యాలెస్ మెట్లకు అభిముఖంగా ఉన్న చిన్న బిల్డింగ్లోని అద్దంలో కనిపిస్తుంది. ఖిల్జీ ఆ ప్రతిబింబాన్ని చూసిన అద్దం ఇప్పటికీ ఉంది. జోవార్ గద్దెరాణి పద్మిని అందచందాలను విని ఆశ్చర్యపోయిన ఖిల్జీ ఆమె కోసమే దండెత్తి యుద్ధం చేశాడు. రాజ్యాన్ని ధ్వంసం చేశాక కూడా కోట స్వాధీనం కాకపోవడంతో రాణి పద్మినిని ఒకసారి చూసి వెళ్లిపోతానని కోరాడని, అప్పుడు మంత్రివర్గ ప్రముఖులు ఆమెను స్వయంగా చూపించకుండా అద్దంలో చూపించారని గైడ్లు చె΄్తారు. చూసి వెళ్లిపోతానన్న ఖిల్జీ ఆ తర్వాత మాటతప్పి కోటలోకి ఆహార పదార్థాలు అందకుండా దిగ్బంధించి కోటను స్వాధీనం చేసుకున్నాడు. అప్పుడు పద్మినితో పాటు నాలుగు వేల మంది మహిళలు నిప్పుల్లో దూకి ప్రాణత్యాగం(జోవార్) చేసిన ఆ స్థలాన్ని చూపించి ఈ వివరాలన్నీ చెబుతారు. కోట లోపల శివాలయం, జైనమందిరం ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఆలయాలు, ప్యాలెస్లు, గార్డెన్లు, జ్ఞాపక నిర్మాణాలు ఏవైనా సరే అందులో ఇమిడిన నైపుణ్యానికి తలవంచి నమస్కరించాల్సిందే. -
గడియారం గుర్తు: సుప్రీం కోర్టును ఆశ్రయించిన శరద్ పవార్
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్సీపీ పార్టీ చిహ్నం (గడియారం) గుర్తు కేటాయింపు విషయంలో ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆశ్రయించారు. ఈ మేరకు బుధవారం ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓటర్లలో గందరగోళాన్ని నివారించడానికి అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చిహ్నమైన ‘గడియారం’ గుర్తుకు బదులు గుర్తు కోసం దరఖాస్తు చేసుకోవాలని వాదిస్తూ.. శరద్ పవార్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో న్యాయబద్ధత, స్పష్టతను నిర్వహించటంలోని ప్రాముఖ్యతను పిటిషన్ పేర్కొన్నారు.ఎన్సీపీ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయిన అనంతంరం.. ఎన్సీపీ(ఎస్పీ) పార్టీకి భారత ఎన్నికల సంఘం తాత్కాలికంగా ‘మ్యాన్ బ్లోయింగ్ ఎ తుర్హా’(బాకా ఊదుతున్న వ్యక్తి) గుర్తును మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే తమకు గడియారం గుర్తుతో 25 ఏళ్ల అనుబంధంద ఉంది. గడియారం గుర్తును అజిత్ పవార్ వర్గం ఉపయోగించుకోవడానికి అనుమతిస్తే.. ఓటర్లను తప్పుదారి పట్టించినట్లు అవుతుందని ఎన్నికల నిష్పక్షపాతానికి విఘాతం కలిగుతుందని శరద్ పవార్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు.ఇక.. పార్లమెంట్ ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న ఓటరు గందరగోళాన్ని కూడా ఆయన పిటిషన్లో ప్రస్తావించారు. నియోజకవర్గాల పరిమాణం తక్కువగా ఉన్నందున రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గుర్తు సమస్య మరింత స్పష్టంగా కనిపించవచ్చని తెలిపారు.శరద్ పవార్ దాఖలుచేసిన పిటిషన్ అక్టోబరు 15న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. -
టీవీకే జెండాను ఆవిష్కరించిన హీరో విజయ్
చెన్నై: తమిళగ వెట్రి కళగం పార్టీ చీఫ్, స్టార్ హీరో విజయ్ ఆ పార్టీ పార్టీ జెండా, గుర్తును ఆవిష్కరించారు. ఇటీవల తమిళగ వెట్రి కళగం పార్టీని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం చెన్నైలో ఎరుపు, పసుపు రంగులో ఏనుగులతో ఉన్న పార్టీ జెండా, గుర్తును ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రంలో ఆయన తల్లిండ్రులు, మద్దతుదారులు, ఫ్యాన్స్ పాల్గొన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా విజయ్ కసరత్తు చేస్తున్నారు. త్వరలో తిరుచ్చిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.#WATCH | Chennai, Tamil Nadu: Actor and Tamilaga Vettri Kazhagam (TVK) chief Vijay unveils the party's flag and symbol today.(Source: ANI/TVK) pic.twitter.com/J2nk2aRmsR— ANI (@ANI) August 22, 2024 #WATCH | Chennai, Tamil Nadu: Actor and Tamilaga Vettri Kazhagam (TVK) chief Vijay takes pledge along with party workers and leaders at the party office in Chennai "We will always appreciate the fighters who fought and sacrificed their life for the liberation of our country… pic.twitter.com/amiti3rBC2— ANI (@ANI) August 22, 2024 -
కావాల్సిన సింబల్ను కోరలేరు
సాక్షి, హైదరాబాద్: ప్రజా ప్రాతినిధ్య చట్టం – 1951లో నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల్లో తమకు ఫలానా గుర్తే కావాలని ఎవరూ కోరలేరని హైకోర్టులో ఎన్నికల కమిషన్ వాదనలు వినిపించింది. దీంతో ‘చపాతీ రోలర్’గుర్తును ఎంపిక జాబితాలో చేర్చాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను పిటిషనర్ ఉపసంహరించుకున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల ఉండటంతో ఎన్నికల గుర్తు జాబితాలో ‘చపాతీ రోలర్’ను చేర్చాలని కోరుతూ హైకోర్టులో అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫారమ్స్ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది వాదన లు వినిపిస్తూ...గతంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్ని కల్లో పిటిషనర్ పార్టీ అభ్యర్థులు ‘చపాతీ రోలర్’ గుర్తుపై పోటీ చేశారన్నారు. మండల పరిషత్ ప్రాదే శిక నియోజకవర్గం, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియో జకవర్గం, పట్టణ స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ ఎన్నికల్లో అదే గుర్తు కేటాయించేలా ఈసీకి ఆదేశాలి వ్వాలని కోరారు.ఈసీ తరఫు న్యాయవాది జి. విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ.. ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951 ప్రకారం అలాంటి వెసులుబాటు లేనందున ఉన్న జాబితా నుంచే ఏదో ఒక గుర్తు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ క్రమంలో పిటిషన్ను ఉపసంహరించుకునే అవకాశం ఇవ్వాలని పిటిషనర్ న్యాయవాది కోరడంతో ధర్మాసనం అంగీకరించింది. -
చిహ్నం విషయంలో చర్చ జరగాలి!
ఐదు దశాబ్దాల పైగా అస్తిత్వం కోసం పోరాడిన తెలంగాణకు జనగీతం ఏది? పదేళ్ల క్రితం ‘మా రాష్ట్రం’ అని చెప్పుకునే అవకాశం తెలంగాణ ప్రజలకు దక్కింది. ఒక రాష్ట్రంగా చిహ్నం, విగ్రహం రూపుదిద్దుకున్నాయి. తెలంగాణ అవతరణ పదేళ్ల తరువాత, కాంగ్రెస్ పార్టీవారి ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని ‘తెలంగాణ రాష్ట్ర గీతం’గా ప్రకటించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాన్ని కూడా మార్చి కొత్త చిహ్నాన్ని రూపొందిస్తోంది. ఈ సందర్భంగా రకరకాల చర్చలు మొదలయ్యాయి.దేశానికి ఒక జాతీయ గీతం ఉన్నట్లే రాష్ట్రానికి ఓ రాష్ట్ర గీతం ఉండాలని కోరుకోవడం సహజమే. రాష్ట్రం ఏర్పడ్డ పదేళ్ల తరువాత ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే... దానిపై వాడి వేడి చర్చలు జరుగుతున్నాయి.జాతీయ గీతంలాగే రాష్ట్ర గీతం...జాతీయ గీతం ‘జన గణ మన’, జాతీయ గేయం ‘వందేమాతరం’... రెండింటినీ సమానంగా గౌరవించాలని మన రాజ్యాంగ సభ అధ్యక్షులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాజ్యంగ సభలో ప్రకటించారు. అప్పటి నుంచి భారతీయులు ఆ యా గీతాలను అత్యంత గౌరవంతో ఆలాపిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి జాతీయ పర్వదినాలను నిర్వహించే సమయంలో చిన్నా పెద్ద, అధికారి, అనధికారి అనే భేదం లేకుండా అందరూ గౌరవంగా నిలబడాలనేది ఒక నియమం. కనీసం జాతీయ గీతాలాపన సమయంలో మౌనంగా ఉండి తమ గౌరవాన్ని వ్యక్తం చేయాలి. అయితే అలా గౌరవించనివారూ ఉంటారు. అందుకు శిక్షలు ఉండవు. కాని, అవమానిస్తే మాత్రం నేరమే. రెండు జాతీయ గీతాలకూ, జాతీయ చిహ్నానికీ, జాతీయ పతాకానికీ సంబంధించి ఒక చట్టం కూడా చేసుకున్నాం.దేశ సౌభాగ్యాన్నీ, సంస్కృతీ వారసత్వాలూ, గొప్పదనాన్నీ ప్రతిబింబించే మన జాతీయ గీతాలను గర్వంగా భారతీయులమంతా ఎలా ఆలపిస్తున్నామో... అంతే గర్వంగా రాష్ట్రాల ప్రజలు తమ తమ రాష్ట్ర గీతాలను ఆలపించడం సహజం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పదేళ్లయినా ఇంతవరకూ రాష్ట్ర గీతం అంటూ ఏదీ లేకపోవడాన్ని కొందరు చర్చిస్తూ వచ్చారు. చరిత్ర, సంస్కృతి, వారసత్వాల పేర సాగిన ఉద్యమ ఫలితంగా ఏర్పడిన రాష్ట్రం కావడంతో ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం అందెశ్రీ రాసిన గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించడంతో చాలామంది స్వాగతించారు. ఎందుకంటే ఈ గీతం తెలంగాణలో ఉన్న పాత జిల్లాల అన్నింటి ప్రత్యేకతలనూ, వైశిష్ట్యాన్నీ అద్భుతంగా ఆవిష్కరించింది కనుక. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలందరినీ ఒక ఊపు ఊపింది కనుక. అలాగే దీని రచయిత అందెశ్రీ తెలంగాణ మట్టిమనిషి, ఉద్యమకారుడు. తన కలం, గళం ద్వారా ప్రజాబాహుళ్యంలోకి చొచ్చుకుపోయినవారు. అందుకే చాలామంది రాష్ట్ర గీత ప్రకటనను స్వాగతిస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వ కొత్త చిహ్నం..గత తెలంగాణ ప్రభుత్వం ఆమోదించి అమలులో పెట్టిన ప్రభుత్వ చిహ్నాన్ని పక్కన పెట్టి, ప్రస్తుత ప్రభుత్వం మరో నమూనాను రూపొందిస్తున్నది. ఇప్పటికే దానిపై సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి వంటి రాజకీయ పార్టీల నేతలతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. ఈ నమూనా చాలా బాగుందని కొందరూ, బాగులేదనీ మరికొందరూ అంటున్నారు.అసలు ఇప్పుడు రాష్ట్ర చిహ్నాన్ని మార్చడం, రాష్ట్ర గీతం అంటూ ఒక గీతాన్ని ప్రకటించడం అవసరమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. పోనీ వాటిని నిర్ణయించేటప్పుడు ప్రధాన ప్రతిపక్షాన్ని సంప్రదించాలి కదా? దాన్నీ ఈ ప్రక్రియలో భాగం చేయలేదనేది ప్రధానమైన విమర్శ. ఇది సమస్యల నుంచి ప్రజలను పక్కదారి పట్టించి ఏమార్చడానికే అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.విధానం, సంవిధానం? దేశానికి కానీ, రాష్ట్ర స్థాయిలో ప్రతి రాష్ట్రానికి కానీ ఒక ప్రత్యేక నిర్ణయ విధానం (పాలసీ) అంటూ ఒకటి ఉండాలి. ప్రజలందరికీ సంబంధించిన కొన్ని అంశాలపై నిర్ణయాలను కేవలం ‘మంత్రివర్గం’ తీసుకుంటే సరిపోదు. విస్తృతంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించాల్సి ఉంటుంది. సభలు, సదస్సులు, జిల్లా స్థాయి చర్చలు, సంప్రదింపులు జరపాలి. సోషల్ మీడియా, ఇంటర్నెట్ ద్వారా వివిధ వర్గాలవారి అభిప్రాయాలను సేకరించిన తర్వాతే కొన్ని నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవాలి. మంత్రివర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలూ, అసెంబ్లీ సమావేశాల్లో చేసిన చర్చలూ, నిర్ణయాలను అందరికీ అందుబాటులో ఉండేలా వైబ్సైట్లో పెట్టాలి. మొత్తంమీద రాష్ట్ర గీత ప్రకటన, ప్రభుత్వ చిహ్నం మార్పు వంటి అంశాల్లో అధికార పక్షం ఏకపక్షంగా వ్యవహరించడం అన్యాయం. – వ్యాసకర్త డీన్, స్కూల్ ఆఫ్ లా, మహీంద్రా యూనివర్సిటీఅభిప్రాయం: మాడభూషి శ్రీధర్ -
కొత్త సింబల్ పై రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
-
తెలంగాణ కొత్త చిహ్నంపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
-
TG: రాష్ట్ర చిహ్నం మార్పు.. చార్మినార్ ముందు కేటీఆర్ నిరసన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజముద్రలో మార్పులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ చార్మినార్ వద్ద కేటీఆర్ నిరసనలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతోనే వ్యవహరిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర చిహ్నం మారుస్తోందని దుయ్యబట్టారు. చార్మినార్ ముద్రను తీసేయడం హైదరాబాదీలను అవమానించడమే.. కాకతీయుల కళా తోరణాన్ని ఎలా తొలగిస్తారంటూ కేటీఆర్ ప్రశ్నించారు.మరోవైపు, రాష్ట్ర చిహ్నం నుంచి చార్మినార్ను తొలగించడంపై కేటీఆర్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. చార్మినార్ దశాబ్దాల తరబడి హైదరాబాద్కు ఐకాన్గా ప్రపంచంలోనే గుర్తింపు పొందింది. నగరం గురించి ఎవరైనా ఆలోచిస్తే వారు ప్రపంచ వారసత్వ హోదా పొందేందుకు అన్ని అర్హతలున్న చార్మినార్ గురించి ఆలోచించకుండా ఉండలేరని... కానీ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పనికిరాని కారణాలను సాకుగా చూపుతూ చార్మినార్ను రాష్ట్ర అధికారిక ముద్ర నుంచి తొలగించాలని భావిస్తోందని మండిపడ్డారు.World over, Charminar has been the icon/symbol of Hyderabad for centuriesWhen one thinks of Hyderabad, they cannot but think of Charminar which has all the qualities of a UNESCO world heritage site Now Congress Government wants to remove the iconic Charminar from the state… pic.twitter.com/SQVxQAI6lL— KTR (@KTRBRS) May 30, 2024 -
మూడు రంగులతో కాంగ్రెస్ మార్క్ రాజముద్ర
సాక్షి, హైదరాబాద్: అధికారంలో ఉండటంతో కాంగ్రెస్ తమ మార్క్ రాజ ముద్ర వేసుకునేందుకు సిద్ధమవుతోంది. అధికారిక గేయం ఎంపిక.. అధికారిక చిహ్నానికి మార్పులపై కసరత్తు చేస్తోంది. పలు రకాలు లోగోలు డిజైన్ చేయగా, రాజముద్రలో మూడు సింహాల జాతీయ చిహ్నం, వ్యవసాయం, తెలంగాణ వీరుల స్తూపానికి చోటు లభించినట్లు సమాచారం. ఆవిర్భావ దినోత్సవం రోజున లోగా ఆవిష్కరించనున్నారు. లోగో ఖారారుపై సీనియర్ నేతలతో సీఎం రేవంత్ చర్చిస్తున్నారు.. పార్టీ నేతలతో భేటీ తర్వాత ఇవాళ రాష్ట్ర చిహ్నాన్ని ఖారారు చేసే అవకాశం ఉంది.కాగా, దశాబ్ది ఉత్సవాల క్రమంలోనే.. రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాచరిక ఆనవాళ్లు లేకుండా చార్మినార్, కాకతీయ కళాతోరణం చిహ్నాలను అధికారిక లోగో నుంచి తొలగించే ప్రతిపాదనలపై బీఆర్ఎస్ తీవ్రంగా విరుచుకుపడుతోంది.తెలంగాణలో మార్పు కావాలని ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పిందని.. అధికారిక చిహ్నాలను మార్చడమే మీరు తెచ్చే మార్పా అని నిలదీస్తోంది. అయితే ఈ అంశాలపై బీజేపీ ఏమాత్రం స్పందించకపోవడం గమనార్హం. దశాబ్ది వేడుకలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టలేదు. కానీ దశాబ్ది వేడుకలకు సోనియాగాం«దీని ఏ హోదా ఉందని పిలుస్తారంటూ బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. -
గ్లాసుతో సైకిల్కు గుబులు
వరుస షాకులతో కొట్టుమిట్టాడుతున్న టీడీపీకి కావలిలో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రెబల్ అభ్యర్థిగా, ఇండిపెండెంట్గా బరిలో నిలిచిన పసుపులేటి సుధాకర్ పక్కలో బల్లెంలా తయారయ్యారు. పోటీలో ఆయన ఉండటంతో ఓట్లు భారీగా చీలుతాయనే ఆందోళనతో ఉన్న కావలి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డికి తాజా పరిణామం అశనిపాతంలా పరిణమించింది. సుధాకర్కు అనూహ్యంగా జనసేన గాజు గ్లాస్ గుర్తు లభించడంతో కావ్య శిబిరం ఒక్కసారిగా డీలాపడిపోయింది.కావలి: టీడీపీ రెబల్గా, స్వతంత్య్ర అభ్యర్థిగా కావలి నుంచి రంగంలోకి దిగిన పసుపులేటి సుధాకర్కు ఎన్నికల కమిషన్ గ్లాస్ గుర్తును కేటాయించడంతో టీడీపీ శిబిరంలో కలకలం రేగింది. ఈ పరిణామంతో ఓట్లు భారీగా చీలిపోతాయనే భయంతో కావ్య శిబిరం ఒక్కసారిగా కుదుపునకు గురైంది. బీసీల ప్రతినిధిగా రాజకీయాల్లోకి.. బీసీల ప్రతినిధిగా.. పీఎస్సార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కావలి రాజకీయాల్లో పసుపులేటి సుధాకర్ అడుగుపెట్టారు. 2019 ఎన్నికల్లో జనసేన తరఫున గ్లాస్ గుర్తుపై పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం బీజేపీలో చేరి కొంతకాలం రాష్ట్ర పదవిలో కొనసాగారు. ఈ క్రమంలో ఆయన్ను టీడీపీ అధినేత చంద్రబాబు పిలిపించుకొని కావలిలో పార్టీ కోసం పనిచేయాలని కోరారు. ఈ తరుణంలో బీజేపీకి రాజీనామా చేసి టీడీపీ కోసం పనిచేశారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో సుధాకర్ తన వర్గీయులతో నిరసన ప్రదర్శనలతో పాటు రాజమహేంద్రవరంలో ర్యాలీలను చేపట్టారు. దీంతో కావలి టీడీపీ టికెట్ సుధాకర్కేనని అందరూ భావించారు. అప్పటి వరకు కావలి ఇన్చార్జిగా ఉన్న మాలేపాటి సుబ్బానాయుడు సైతం సుధాకర్ అభ్యరి్థత్వాన్ని బలపర్చారు. రెబల్గా పోటీకి సై.. ఈ తరుణంలో కావ్య కృష్ణారెడ్డి ఆర్థిక బలంతో కావలి టికెట్ను దక్కించుకున్నారు. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు, కేడర్ తీవ్రంగా వ్యతిరేకించినా, ఆయనవైపే చంద్రబాబు మొగ్గు చూపారు. దీంతో కంగుతిన్న పసుపులేటి సుధాకర్ కావలిలో రెబల్గా పోటీ చేసేందుకు డిసైడయ్యారు. ట్రస్ట్ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలు, టీడీపీ, జనసేన కేడర్ అండగా నిలుస్తుందనే నమ్మకంతో సొంత మేనిఫెస్టోను రూపొందించుకొని బరిలోకి దిగారు. దీంతో టీడీపీ, జనసేన నేతలు, పవన్ కల్యాణ్ అభిమానులు సైతం పసుపులేటికి మద్దతు తెలిపి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో సుధాకర్కు గ్లాస్ గుర్తు కేటాయించడంతో ఆయన వర్గీయుల్లో హర్షం వ్యక్తమవుతోంది. భగ్గుమంటున్న కావ్య పసుపులేటి సుధాకర్కు గ్లాస్ గుర్తు కేటాయించడంతో కావ్య కృష్ణారెడ్డికి మైండ్ బ్లాౖకైంది. ప్రెస్మీట్ పెట్టి మరీ పసుపులేటిపై తిట్ల దండకం అందుకున్నారు. ఆయనపై ఎనిమిది కేసులున్నాయని, 420 అంటూ నోరుపారేసుకున్నారు. ప్రతాప్కుమార్రెడ్డి, పసుపులేటి సుధాకర్ ఇద్దరూ కలిసి తనపై పోటీకి దిగారని ఆరోపించారు. రామనారాయణరెడ్డికి గ్లాస్ గుర్తు ఆత్మకూరు: అదేంది.. రామనారాయణరెడ్డికి గ్లాసు గుర్తు కేటాయించారా.. ఈ మతలబేమిటబ్బాననే సందేహం కలగక మానదు. అయితే దీన్ని కేటాయించింది ఆత్మకూరు టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డికి కాదండోయ్. అక్కడే స్వతంత్ర అభ్యరి్థగా పోటీలో నిలిచిన ధనిరెడ్డి రామనారాయణరెడ్డికి గ్లాసు గుర్తు కేటాయించడంతో ఓట్లు ఎక్కడ చీలుతాయోననే ఆందోళన తమ్ముళ్లలో నెలకొంది. -
‘కోళ్లనే కాపాడలేనివాడు మమ్మల్నేం కాపాడతాడు?’
ఎన్నికల గుర్తు కారణంగా పార్టీ లేదా అభ్యర్థి ఓడిపోయారంటూ వచ్చే వార్తలను మనం ఎప్పుడో ఒకప్పుడు చూసేవుంటాం. ఎన్నికల గుర్తులు పార్టీలకు ప్రాణం లాంటివి. ఎన్నికల గుర్తును చూసి ఓటువేసేవారి సంఖ్య అధికంగానే ఉంటుందనే మాట వినిపిస్తుంటుంది. ఓటు వేసే సమయంలో గుర్తులు కనిపించకుంటే ఓటు వేయకుండానే వెనుదిరిగేవారు కూడా ఉన్నారట. అవి 1957 సాధారణ ఎన్నికలు.. పంజాబ్లో ఒక అభ్యర్థి తన ఎన్నికల చిహ్నంగా కోడిని ఎంచుకున్నాడు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆయన తన ఎన్నికల గుర్తు గురించి అందరికీ తెలియజేయాలనుకున్నాడు. ఇందుకోసం ఆయన ఆ ప్రాంతంలో వందల కోళ్లను వదిలాడు. అయితే ఎక్కడినుంచో వచ్చిన ఒక నక్కల గుంపు ఆ కోళ్లను వేటాడింది. కొన్ని కోళ్లు ఎలాగోలా నక్కల బారి నుంచి తప్పించుకున్నాయి. అయితే ఈ విషయం తెలుసుకున్న అక్కడి ఓటర్లు.. నక్కల బారి నుంచి ఎన్నికల గుర్తునే కాపాడుకోలేని అభ్యర్థి మమ్మల్ని ఎలా కాపాడతాడని ఎదురుతిరిగారట. 1957 లోక్సభ ఎన్నికల సమయంలోనూ ఇటువంటి విచిత్ర ఉదంతం చోటుచేసుకుందట. యూపీలోని ఓ పోలింగ్ బూత్కి వచ్చిన కొందరు పడవ నడిపేవారు ఓటు వేయకుండానే వెనుదిరిగారట. వారిని కారణం అడిగితే లోపల బ్యాలట్ పేపర్పై బోటు గుర్తు లేదని, అందుకే ఎవరికీ ఓటు వేయకుండా వెళ్లిపోతున్నామని చెప్పారట. -
‘గుర్తు’పెట్టుకోండి.. పన్నీర్సెల్వంకు ‘పనస’
వచ్చే లోక్సభ ఎన్నికల్లో రామనాథపురం నుంచి పోటీ చేస్తున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే బహిష్కృత నేత ఓ పన్నీర్సెల్వంకు ఎన్నికల అధికారులు 'పనస కాయ' గుర్తును కేటాయించారు. రామనాథపురంలోని జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన లాటరీ ద్వారా గుర్తును కేటాయించారు. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న పన్నీర్సెల్వం.. తిరువాడనైలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో పనసకాయతో ఫోజులిచ్చి గుర్తు కేటాయింపును అధికారికంగా ప్రకటించారు. రామనాథపురంలో అదే పేరుతో ఉన్న మరో నలుగురు అభ్యర్థులతో ఈ మాజీ సీఎం తలపడనున్నారు. పన్నీర్సెల్వం బీజేపీతో పొత్తు పెట్టుకుని, ఏఐఏడీఎంకే జెండాను, లెటర్హెడ్ను నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నించారు. అయితే మద్రాస్ హైకోర్టులో ఓడిపోయిన తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తమిళనాడులో 39 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఏప్రిల్ 19వ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. -
టూత్పేస్ట్, చెప్పులు, బెలూన్.. స్వతంత్రులకు 190 ఎంపికలు!
దేశంలో ఎన్నికలు జరిగే సందర్భంలో పోటీ చేస్తున్న అభ్యర్థుల కన్నా వారి గుర్తులకు అత్యంత ప్రాధాన్యత ఉండటాన్ని మనం చూస్తుంటాం. అభ్యర్థులు కూడా ప్రచారంలో తమ ఎన్నికల గుర్తును చూపించి, దానికి ఓటు వేయాలని ఓటర్లను కోరుతుంటారు. ఓటింగ్ సమయంలోనూ ఓటర్లు అభ్యర్థి పేరు కంటే వారి చిహ్నాన్ని గుర్తు పెట్టుకుంటారు. అన్ని పార్టీలకు ఎన్నికల గుర్తులు ఉంటాయి. ఆయా ఎన్నికల చిహ్నాలను ఏ రాష్ట్రంలోనూ ఏ ఇతర పార్టీకి లేదా స్వతంత్ర అభ్యర్థికి కేటాయించరు. ప్రాంతీయ పార్టీలకు కూడా వేర్వేరు ఎన్నికల గుర్తులు ఉంటాయి. స్వతంత్ర అభ్యర్థులు పంచాయతీ ఎన్నికలు మొదలుకొని అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లోనూ పోటీకి దిగుతుంటారు. అలాంటి అభ్యర్థులకు కేటాయించేందుకు ఎన్నికల సంఘం 190 గుర్తులను ఖరారు చేసింది. నామినేషన్లు సమర్పించేటప్పుడు స్వతంత్ర అభ్యర్థులు కమిషన్ అందించిన జాబితాలోని ఏదో ఒక ఎన్నికల గుర్తును ఎంచుకుని దానిని అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. దీని ఆధారంగా స్వతంత్ర అభ్యర్థికి ఎన్నికల గుర్తును కమిషన్ కేటాయిస్తుంది. దేశంలో ఆరు రాజకీయ పార్టీలు జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందాయి. వీటిలో ఆమ్ ఆద్మీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, నేషనల్ పీపుల్స్ పార్టీ ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. స్వతంత్ర అభ్యర్థుల కోసం ఎన్నికల సంఘం రూపొందించిన ఎన్నికల చిహ్నాలలో పురాతన కాలం నుండి ఆధునిక కాలం నాటి అంశాల వరకు ఉన్నాయి. వీటిలో ఆహారం, రవాణా, దినచర్యలో ఉపయోగించే వస్తువులు, పరికరాలు మొదలైనవి ఉన్నాయి. మొబైల్, మొబైల్ ఛార్జర్తో పాటు టెలిఫోన్ కూడా ఎన్నికల చిహ్నంగా ఉంది. స్లేట్, ల్యాప్టాప్ కూడా ఎన్నికల చిహ్నాల జాబితాలో ఉన్నాయి. -
‘హస్తం’, ‘చర్ఖా’ లేకున్నా ఇందిర ప్రభంజనం!
స్వతంత్ర భారతావనిలో జరిగిన ఐదవ సాధారణ ఎన్నికలు దేశంలో ఎన్నికల ప్రక్రియ రూపురేఖలను మార్చివేశాయి. 1971 లోక్సభ ఎన్నికల్లో ఇందిరా గాంధీ హవాను దేశమంతా చూసింది. ఆమె నేతృత్వంలోని పార్టీ లోక్సభలో మొత్తం 545 స్థానాలకు గానూ 352 సీట్లు గెలుచుకుంది. నాడు కాంగ్రెస్ (ఓ)కి 16 సీట్లు మాత్రమే దక్కాయి. ఈ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ రెండు ముక్కలైంది. ఇందిర కాంగ్రెస్ (ఐ) పేరుతో ఎన్నికల బరిలోకి దిగారు. కాంగ్రెస్లోని వృద్ధ నాయకులకు వ్యతిరేకంగా తన సత్తా చాటారు. 1951-1952లో స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. ఈ ఎన్నికల సంప్రదాయం 1960ల చివరి వరకు కొనసాగింది. అయితే పలు అసెంబ్లీ స్థానాల పదవీకాలం ఇంకా ముగియకపోవడంతో ఎన్నికల తేదీలను ఏడాది పాటు వాయిదా వేయడం వల్ల జాతీయ, రాష్ట్ర షెడ్యూళ్లను వేరు చేయాల్సి వచ్చింది. 1971లో లోక్సభ ఎన్నికలకు మార్చి 1-10 తేదీల మధ్య ఎన్నికలు జరిగాయి. 15,12,96,749 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సంఖ్య 1967 లోక్సభ ఎన్నికల కంటే 30 లక్షలు తక్కువ కావడం విశేషం. నాడు 518 స్థానాలకు గాను 2,784 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మారిన గుర్తుతో ఇందిర ఎన్నికల్లో పోటీ చేశారు. స్వాతంత్య్రానంతరం మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా (కాంగ్రెస్ ‘ఆర్), కాంగ్రెస్ (ఓ)) విడిపోయినప్పుడు జరిగిన మొదటి ఎన్నికలివి. ఇందిరా గాంధీ నేతృత్వంలోని పార్టీ ఎన్నికల గుర్తు ఆవు, పాలు తాగుతున్న దూడ. కాంగ్రెస్ (ఓ) ఎన్నికల గుర్తు చర్ఖా తిప్పుతున్న మహిళ. -
గాడిద బండి, వంకాయ్, వాష్ బేసిన్.. పాక్ ఎన్నికల్లో విచిత్ర గుర్తులు!
ఫిబ్రవరి 8న అంటే రేపు (గురువారం) పాకిస్తాన్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల బ్యాలెట్ పత్రాలను ఇప్పటికే ముద్రించి సిద్ధంగా ఉంచారు. ఇక్కడ విశేషమేమిటంటే ఎన్నికల సంఘం ఇచ్చిన ఎన్నికల గుర్తులు ఇంత విచిత్రంగా ఉన్నాయని తెలిస్తే ఎవరైనా పడీపడీ నవ్వుకుంటారు. అయితే ఇటువంటి ఎన్నికల గుర్తులపై పలువురు అభ్యర్థులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. పాక్ ఎన్నికలను ప్రపంచమంతా ఆసక్తికరంగా చూస్తోంది. ఈ ఎన్నికల్లో మూడుసార్లు ప్రధానిగా పనిచేసిన నవాజ్ షరీఫ్ తిరిగి ప్రధాని రేసులో ముందున్నారు. షాబాజ్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన బిలావల్ భుట్టో కూడా ప్రధాని పదవికి పోటీ పడుతున్నారు. కాగా ఎన్నికల కోసం కమిషన్ జారీ చేసిన విచిత్రమైన ఎన్నికల గుర్తులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. మొబైల్ ఫోన్ ఛార్జర్, సిమ్ కార్డ్, గాడిద బండి, వంకాయ్, బూట్లు, బాటిల్, వాష్ బేసిన్, నెయిల్ కట్టర్, స్క్రూ, స్పూన్, తవా, షటిల్ కాక్ ఇవన్నీ ఎన్నికల సంఘం.. అభ్యర్థులకు కేటాయించిన గుర్తులే.. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారు అమీర్ మొఘల్ వంకాయ్ ఎన్నికల గుర్తును పొందారు. ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగా తమకు అవమానకరమైన, విచిత్రమైన ఎన్నికల గుర్తులను కేటాయించిందని పలువురు అభ్యర్థులు ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) ఎన్నికల గుర్తును రద్దు చేసిన తర్వాత ఈ వివాదం మొదలైంది. పీటీఐ అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల్లో పోటీకి దిగారు. పాకిస్తాన్లో ఓటింగ్ కోసం 26 కోట్ల బ్యాలెట్ పేపర్లను ప్రింట్ చేశారు. పాక్లోని మొత్తం 22 కోట్ల జనాభాలో 12.69 కోట్ల మంది ఓటర్లు నూతన ప్రభుత్వాన్ని ఎన్నుకోనున్నారు. నవాజ్ షరీఫ్, బిలావల్ భుట్టో, ఇమ్రాన్ ఖాన్.. ఈ ముగ్గురూ పాక్ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. వీరికి చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్, పాకిస్తాన్ పార్టీ పీపుల్స్ పార్టీ అభ్యర్థుల మధ్యే గట్టి పోటీ ఉండనుంది. -
బ్యాట్ గుర్తు ఇమ్రాన్ పార్టీదే
పెషావర్: పాకిస్థాన్లో కీలకమైన జాతీయ ఎన్నికల ముందు మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ)కి భారీ ఊరట దొరికింది. పార్టీ ఎన్నికల చిహ్నమైన క్రికెట్ బ్యాట్ను దానికే తిరిగి కేటాయిస్తూ పెషావర్ హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. పీటీఐకి బ్యాట్ చిహ్నాన్ని రద్దు చేస్తూ దేశ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టేసింది. అది రాజ్యాంగ విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. -
గుర్తుంచుకునేలా..
సాక్షి మంచిర్యాల డెస్్క: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు గుర్తు ప్రధానమైనది. రిజిష్టర్డ్ పార్టీలకు ఎన్నికల సంఘం కామన్ సింబల్ను కేటాయిస్తుంది. ఇక స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉంటే ఈసీ సూచించిన గుర్తుల్లో ఒకటి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఎయిర్ కండిషనర్, అల్మారా, ఆపిల్, ఆటోరిక్షా, బేబీవాకర్, బెలూన్, బ్యాంగిల్స్, బ్యాట్, బ్యాట్స్మెన్, బ్యాటరీ టార్చ్, బెల్ట్, బెంచ్, బ్రష్, బకెట్, కేక్, కెమెరా, డీజిల్ పంప్, ఫుట్బాల్, గ్యాస్ స్టౌవ్, గిఫ్ట్ప్యాక్, గ్రామఫోన్, హార్మోనియమ్, హాకీ అండ్ బాల్, లేడీ ఫింగర్, లాప్టాప్, లెటర్ బాక్స్, లూడో, మిక్సీ, నెయిల్కట్టర్, పెన్డ్రైవ్, కుండ, టెలిఫోన్, టెలివిజన్, టూత్బ్రష్, టూత్పేస్ట్.. ఇలా ఏ అక్షర క్రమం నుంచి డబ్ల్యూ వరకు 193 రకాల వస్తువులను ఎన్నికల సంఘం గుర్తులుగా సూచించింది. స్వతంత్ర అభ్యర్థులకు గుర్తుల కేటాయింపులో ఈసీ కొన్ని విధానాలు అవలంభిస్తుంది. స్వతంత్ర అభ్యర్థులు మూడు గుర్తులను ప్రాధాన్యత క్రమంలో సూచించాల్సి ఉంటుంది. ఈ గుర్తులను మిగతా ఎవరూ ఎంపిక చేసుకోకుంటే వాటిలో ఒకటి కేటాయిస్తుంది. ఒకే గుర్తును ఎక్కువ మంది ఎంపిక చేసుకుంటే రిటర్నింగ్ అధికారి లాటరీ ద్వారా ఒకరికి కేటాయిస్తారు. జనసేనకు 32 స్థానాల్లో కామన్ సింబల్ జనసేన పార్టీ విజ్ఞప్తి మేరకు ఎన్నికల సంఘం తెలంగాణలోని 32 అసెంబ్లీ స్థానాల్లో కామన్ సింబల్ను కేటాయిస్తూ ఈ ఏడాది సెపె్టంబర్ 18న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. కానీ, పొత్తులో భాగంగా బీజేపీ కేటాయించిన ఎనిమిది స్థానాల్లో మాత్రమే జనసేన పోటీ చేస్తోంది. ఈ స్థానాల్లో ఏడు చోట్ల మాత్రమే అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు ఉంటుంది. జనసేన పార్టీ కోరిన 32 స్థానాల్లో తాండూర్ అసెంబ్లీ స్థానం లేకపోవడంతో ఎన్నికల సంఘం జాబితాలో లేదు. దీంతో ఇక్కడి అభ్యర్థి మరో గుర్తు ఎంచుకోవాల్సి ఉంటుంది. -
అభ్యర్థులు వారే.. గుర్తులు వేరే!
సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు..శాశ్వత శత్రువులు ఉండరంటారు. ఇది అక్షర సత్యం. నిండు శాసనసభలో అధ్యక్షా అనాలనే వారి చిరకాలవాంఛ తీర్చుకునేందుకు ఎన్ని ఎత్తుగడలైనా వేస్తారు..ఎన్నిసార్లయినా గోడ దూకుతారు. తాజాగా తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో జరుగుతోందిదే. గత ఎన్నికల్లో గెలిచిన మళ్లీ టికెట్ దక్కిందన్న ధీమాగా ఉన్న నేతలు ఒకవైపు ఉండగా, మరోవైపు ఓడినా పార్టీ కోసం పనిచేస్తున్నాం కాబట్టి మళ్లీ అదృష్టం వరిస్తుందనే ఆశలో కొందరు నేతలున్నారు. ఇక టికెట్లు దక్కవని మరికొందరు నేతలు పక్క పార్టీల వైపు చూపులు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొన్ని నియోజకవర్గాల్లో గత ఎన్నికల సమయంలో బండ బూతులు తిట్టిన పార్టీ నుంచే ఈసారి టికెట్ దక్కించుకున్న నేతలున్నారు. ఆయా సెగ్మెంట్లలో ప్రత్యర్థులు వాళ్లే, కానీ పార్టీలే మారాయి! కాకపోతే గతంలో పోటీ చేసిన గుర్తుతో కాకుండా మరో గుర్తుతో పోటీ చేయాల్సి వస్తుండటంతో.. ప్రచారంలో తమ పార్టీ గుర్తుకు కూడా అంతే ప్రాధాన్యం ఇస్తున్నారు. కాంగ్రెస్ టు కాంగ్రెస్ వయా బీజేపీ.. 2018లో మునుగోడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్తో పోటీ చేసి నెగ్గిన రాజగోపాల్రెడ్డి.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తాజాగా బీజేపీకి పార్టీని వీడి మళ్లీ కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు మునుగోడు హస్తం అభ్యర్థి ఈయనే. మాజీ ఎంపీ అయిన రమేష్ రాథోడ్ ఖానాపూర్ నుంచి, సోయం బాపురావు బోథ్ నుంచి గత ఎన్నికల్లో చేయి ఎత్తగా.. ఇప్పుడు కమలం తరఫున తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. 2014, 2018ల్లో వరుసగా రెండుసార్లు టీడీపీ టికెట్తో సత్తుపల్లి నుంచి గెలుపొందిన సండ్ర వెంకటవీరయ్య.. ఆ తర్వాత కారెక్కి అదే పార్టీ నుంచి బరిలో దిగారు. నాడు స్వతంత్రంగా, ప్రధాన పార్టీ నుంచి.. గతంలో వికారాబాద్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన చంద్రశేఖర్ తాజాగా హస్తం గుర్తుతో జహీరాబాద్ నుంచి, గతంలో బాల్కొండలో బీఎస్పీ టికెట్తో పోటీ చేసిన ముత్యాల సునీల్ కుమార్.. తాజాగా కాంగ్రెస్ నుంచి రంగంలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో నిర్మల్ నుంచి చేయి గుర్తుతో పోటీ చేసిన మహేశ్వర్ రెడ్డి ఇప్పుడు బీజేపీ టికెట్తో, 2018లో ఆర్మూర్ నుంచి, బీజేపీ టికెట్తో పోటీ చేసిన పొద్దుటూరి వినయ్కుమార్రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి, 2014, 2018ల్లో వరుసగా రెండుసార్లు నర్సాపూర్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సునీతా లక్ష్మారెడ్డి.. తాజాగా బీఆర్ఎస్ నుంచి పోటీలో దిగుతున్నారు. గ్రేటర్లో.. ♦ 2018లో కాంగ్రెస్ టికెట్తో మహేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సబిత.. ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి. ♦ ఎల్బీనగర్, తాండూరు నుంచి 2018లో కాంగ్రెస్ అభ్యర్థులుగా గెలిచిన సు«దీర్రెడ్డి, పైలెట్ రోహిత్రెడ్డి ఇప్పుడు కారులో ఉన్నారు. ♦ 2009 ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నుంచి స్వతంత్రంగా, 2014, 2018ల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కూన శ్రీశైలంగౌడ్.. తాజాగా బీజేపీ నుంచి దిగుతున్నారు. ♦ 2018లో మల్కాజ్గిరి అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచిన మైనంపల్లి.. ఈ సారి హస్తం గుర్తుతో రంగంలోకి దిగారు. ♦ 2018లో టీడీపీ టికెట్తో ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేసిన సామరంగారెడ్డి.. ఇప్పుడు బీజేపీ టికెట్తో ఎల్బీ నగర్ నుంచి పోటీకి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మర్రి శశిధర్ రెడ్డి.. ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ దాదాపు ఖరారైంది. ♦ 2014లో కాంగ్రెస్ టికెట్తో మహేశ్వరం నుంచి, 2018లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) టికెట్తో ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేసి ఓడిపోయిన మల్రెడ్డి .. తాజాగా మళ్లీ కాంగ్రెస్ టికెట్తో ఇబ్రహీంపట్నం నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరేగాకుండా గత ఎన్నికల్లో వేర్వేరు పార్టీల చిహ్నలపై గెలిచి/ఓడి... ఇప్పుడు మరో పార్టీ తరఫున బరిలో నిలిచిన వారు అనేకమంది ఉన్నారు. మునుపెన్నడూలేని రీతిలో రాష్ట్ర రాజకీయాల్లో వేర్వేరు కండువాలు మార్చుకున్నవారి సంఖ్య ఈసారే ఎక్కువగా ఉండడం గమనార్హం. -
కాంగ్రెస్, బీజేపీ నుంచి టికెట్ రాకపోయినా బరిలో..
సాక్షి, సిద్దిపేట: త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి బరిలో నిలవాలనుకుంటు న్న నేతలు టికెట్ రాకపోయినా పోటీ చేయాలనుకుంటున్నారు. దీంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. ఇండిపెండెంట్గా పోటీ చేయడమా.. లేదంటే ఇతర రాజకీయ పార్టీ తరపున బరిలో నిలవడమా అని ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రతి నియోజకవర్గం నుంచి ఇద్దరు ముగ్గురు నేతలు పోటా పోటీగా టికెట్ల కోసం ప్రయత్నిస్తు న్నారు. ఇండిపెండెంట్కు బదులు ఆలిండియా ఫార్వడ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) నుంచి అయితే ఎన్నికల గుర్తు సింహం కాబట్టి ప్రజల్లోకి వేగంగా వెళ్తుందని భావిస్తున్నారు. ఆశావహులు ఎక్కువే.. జిల్లాలో ఇప్పటికే అధికార బీఆర్ఎస్ అన్ని నియోజకవర్గాల నుంచి బరిలో నిలిచే వారి టికెట్లను ప్రకటించి అభ్యర్థులకు బీఫాంలు సైతం అందజేసింది. బీజేపీ ఇప్పటివరకు ఒక్క లిస్టు సైతం విడుదల చేయలేదు. కాంగ్రెస్ ఈనెల 15న విడుదల చేసిన మొదటి జాబితాలో గజ్వేల్ నుంచి మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డిని ప్రకటించింది. ఇంకా హు స్నాబాద్, దుబ్బాక, సిద్దిపేట, జనగామ ప్రకటించాల్సి ఉంది. హుస్నాబాద్ నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వర్గంగా ప్రవీణ్రెడ్డి కొనసాగుతుండగా, కాంగ్రెస్ జాతీయ నేతల ద్వారా ప్రభాకర్ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. దుబ్బాక నుంచి ఆపార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్రెడ్డి, శ్రవణ్కుమార్రెడ్డి, కత్తి కార్తీక టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. హుస్నాబాద్లో బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, రాష్ట్ర హౌజ్ఫెడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొమ్మ శ్రీరాంచక్రవర్తి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జన్నపురెడ్డి సురేందర్రెడ్డి ఇద్దరు పోటా పోటీగా ప్రయత్నిస్తున్నారు. ఇద్దరు నేతలు నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. -
కారును పోలిన గుర్తులు కేటాయించొద్దు.. ఢిల్లీ హైకోర్టుకు బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: కారును పోలిన గుర్తులను కేంద్ర ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్ నుంచి తొలగించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. కారును పోలిన రోడ్డు రోలర్లాంటి గుర్తుల వల్ల బీఆర్ఎస్కు ఎన్నికల్లో నష్టం కలుగుతుందని పిటిషన్లో పేర్కొంది. దీనిపైటిషన్పై ఢిల్లీ న్యాయస్థానం నేడు (గురువారం) విచారణ చేపట్టనుంది. కాగా కారును పోలిన గుర్తులను తొలగించాలని, వాటిని ఏ పార్టీకి కేటాయించవద్దని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ గతంలో పలుమార్లు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. బీఆర్ఎస్ విజ్ఞప్తి మేరకు 2011లో రోడ్డురోలర్ గుర్తును తొలంగించినప్పటికీ తిరిగి చేర్చటాన్ని అభ్యంతరపెడుతూ ఆ గుర్తును తొలగించాలని విజ్ఞప్తి చేసింది. స్వతంత్ర అభ్యర్థులు, ఎన్నికల సంఘం గుర్తింపు పొందని పార్టీలకు కేటాయించే ఎన్నికల గుర్తుల్లో కారు గుర్తును పోలిన వాటిని కేటాయించకూడదని కోరింది. కెమెరా, చపాతి రోలర్, రోడ్రోలర్, సోప్డిష్, టెలివిజన్, కుట్టుమిషన్, ఓడ, ఆటోరిక్షా, ట్రక్ వంటి గుర్తులు ఈవీఎంలలో కారు గుర్తును పోలినట్టు ఉన్నాయని, ఆ గుర్తులను రాబోయే ఎన్నికల్లో ఎవరికీ కేటాయించకూడదని ఎన్నికల సంఘాన్ని కోరింది. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో అభ్యర్థులకు ఆ గుర్తులను కేటాయించకూడదని, దీని వల్ల బీఆర్ఎస్కు నష్టం వాటిల్లుతున్నదని తెలిపింది. అయితే బీఆర్ఎస్ విజ్ఞప్తులపై కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటి వరకు స్పందించకపోవడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. చదవండి: ద–పొలిటికల్–‘పుష్ప’! సినిమాలూ, రాజకీయ గుర్తులు.. తగ్గేదేలే -
ఒక్క ఎమోజీ చాలు.. జైలుకు పంపడానికి..!
‘థంబ్స్ అప్’ ఎమోజీ సంతకం మాదిరిగా చెల్లుబాటవుతుందా? అది ఎదైనా ఒప్పందానికి మిమ్మల్ని బంధించగలదా? ఒక సీనియర్ ఉద్యోగి పని ప్రదేశంలో అతని జూనియర్కు హార్ట్ ఎమోజీని పంపితే అవి లైంగిక వేధింపుల కిందికి వస్తాయా? ఇదేవిధంగా తుపాకీ లేదా కత్తి ఎమోజీని ఎవరైనా పంపితే దానిని ప్రాణాలకు ముప్పుగా భావించాలా? యుఎస్ నుండి యూకే వరకూ.. న్యూజిలాండ్, ఫ్రాన్స్, భారతదేశంలోనూ భావోద్వేగాలు, కార్యకలాపాలను వ్యక్తీకరించడానికి ఉపయోగించే చిన్నపాటి ఇలస్ట్రేటెడ్ క్యారెక్టర్ల విభిన్న వివరణలు ఇప్పుడు ముప్పుగా పరిణమిస్తున్నాయి. కొన్ని దేశాలు ఎమోజీలను సాక్ష్యంగా ఉపయోగించుకోవడంతో న్యాయ పోరాటాలు కొనసాగుతున్నాయి. ఈ జాబితాలో తాజాగా కెనడాలోని కోర్టు తీర్పు చేరింది. ఈ దేశానికిచెందిన న్యాయమూర్తి 'థంబ్స్ అప్' ఎమోజీ సంతకం మాదిరిగా చెల్లుబాటు అవుతుందని తేల్చిచెప్పారు. ఒక కేసులో ఎమోజీని ఆధారంగా చేసుకుని ఒకరైతు 61,000 యూఎస్ డాలర్ల మొత్తాన్ని ప్రత్యర్థికి చెల్లించాలని ఆదేశించారు! ఈ కొత్త వాస్తవికతకు న్యాయస్థానాలు అనుగుణంగా ఉండాలని ఆయన తన తీర్పులో వాదించారు. సహజమైన పురోగతి ఎమోజీల విషయంలో భారతదేశంలో చట్టమేదీ లేనందున వాణిజ్య చర్చల సమయంలో వ్యక్తులు,వ్యాపార సంస్థలు జాగ్రత్తగా ఉండటం కీలకంగా మారిందని సుప్రీంకోర్టు న్యాయవాది కుశాంక్ సింధు అన్నారు. డిజిటల్ చర్చలలో మరింత ఆలోచనాత్మకంగా ఉండటం, ఒప్పందపు చర్చలలో ఎమోజీలను ఉపయోగిస్తున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండటం తెలివైన పని అని ఆయన హెచ్చరించారు. కమ్యూనికేషన్ విధానాలు అభివృద్ధి చెందుతున్న దశలో ఎమోజీలు కూడా న్యాయ వ్యవస్థలోకి ప్రవేశించడం సహజమైన పురోగతి అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘మిడిల్ ఫింగర్ ఎమోజీని తొలగించాలి’ థంబ్స్-అప్ ఎమోజీ కొన్ని దేశాల్లో అభ్యంతరకరంగా, అసభ్యంగా ఉందనే చర్చను లేవనెత్తగా, చైనాలో స్మైలీ ఫేస్ ఎమోజీని వ్యంగ్యంగా తీసుకుంటున్నారు. భారతదేశంలోని మధ్య వేలు ఎమోజీ అసభ్యకరంగా పరిగణిస్తున్నారు. దీనిపై ఢిల్లీకి చెందిన లాయర్ గుర్మీత్ సింగ్.. మొబైల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్కు లీగల్ నోటీసు పంపి, 15 రోజుల్లోగా "మిడిల్ ఫింగర్" ఎమోజీని తొలగించాలని కోరారు. మధ్య వేలును చూపడం చట్టవిరుద్ధం మాత్రమే కాదు, అశ్లీలమైన, అసభ్యకరమైన సూచిక. ఇది భారతదేశంలో నేరమని పేర్కొన్నారు. సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్ఫారమ్ల ప్రాబల్యం అపరిమితంగా ఉన్నప్పటికీ వ్యాపారం, అధికారిక కమ్యూనికేషన్లో వృత్తి నైపుణ్యాన్ని కొనసాగించడం చాలా అవసరమని ఏఐసీఐ సీఐపీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ ఇమేజ్ మేనేజ్మెంట్ వ్యవస్థాపకురాలు సోనియా దూబే దేవాన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇది కూడా చదవండి: వేలానికి 121 ఏళ్ల క్యాడ్బరీ చాక్లెట్.. నాటి తీయని వేడుకకు గుర్తుగా.. కాంట్రాక్ట్ ఫార్మేషన్ విషయంలో.. భారత న్యాయశాస్త్రంలో చట్టపరమైన సంబంధాలను నెలకొల్పే ఉద్దేశ్యంతో కాంట్రాక్ట్ ఏర్పాటుకు స్పష్టమైన ఆఫర్, స్పష్టమైన అంగీకారం అవసరం. ఇండియన్ కాంట్రాక్ట్ చట్టం, 1872 కాంట్రాక్ట్ ఫార్మేషన్లో ఎమోజీలు లేదా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ల వినియోగాన్ని ప్రస్తావించలేదు. అయితే మనదేశంలోని న్యాయస్థానాలు.. ఈ-మెయిల్లు, తక్షణ సందేశం వంటి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఏర్పడిన ఒప్పందాల చెల్లుబాటును గుర్తించాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో వాట్సాప్ సమన్లు చెల్లుబాటు అయ్యే మోడ్గా గుర్తించారు. ఈ నేపధ్యంలో వాణిజ్య చర్చల్లో పాల్గొనే వ్యక్తులు.. తాము ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాం? తమ వాట్సాప్ సంభాషణలు,ఈ-మెయిల్లతో సహా మౌఖిక, రాతపూర్వక కమ్యూనికేషన్లలో ఏమి పేర్కొనాలనే దానిపై జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యమని సుప్రీంకోర్టు న్యాయవాది కుశాంక్ సింధు తెలిపారు. ఎమోజీల వాడకంతో సంబంధం కలిగిన సంభావ్య చట్టపరమైన పరిణామాల గురించి పార్టీలు తప్పనిసరిగా తెలుసుకోవాలని, వివాదాలను నివారించడానికి, ఈ-ఎన్ఎఫ్ఓఆర్సి ఇ బిఐఎల్ఐటి వైని నిర్ధారించడానికి వారి ఉద్దేశాల స్పష్టతను గుర్తుంచుకోవాలని ఆయన తెలిపారు. మద్రాస్ హైకోర్టులో ఎమోజీ కేసు వాట్సాప్ గ్రూప్లో 'కన్నీళ్లతో నవ్వుతున్న ముఖం' అనే ఎమోజీని పోస్ట్ చేసినందుకు కొంతమంది వ్యక్తులపై ఫిర్యాదు వచ్చిన కేసును మద్రాస్ హైకోర్టు విచారించింది. 2018లో హైకోర్టు ఈ కేసులో.. ఎమోజీకి సంబంధించిన వివరణను గమనించినప్పుడు అనేక భావాలను తెలియజేయడానికి ఎమోజీలు పోస్ట్ చేస్తారని పేర్కొంది. ఏదైనా ఫన్నీ లేదా నవ్వు తెప్పించినప్పుడు ఈ ఎమోజీ ఉపయోగిస్తారు. ఎమోజీని ఉపయోగించడం వల్ల వేధింపులకు అవకాశం ఉండకపోవచ్చు, అయితే అది ఫిర్యాదుదారుని కించపరిచేలా ఉన్నందున అలాంటి చర్యను ఖండిస్తున్నట్లు హైకోర్టు ఒక హెచ్చరికతో ఆ ఫిర్యాదును తోసిపుచ్చింది. ఏది ఏమైనప్పటికీ పౌర, వాణిజ్య న్యాయ న్యాయశాస్త్రంలో ఎమోజీల ఉపయోగం వివరణ, ప్రభావం మారవచ్చని శశాంక్ పేర్కొన్నారు. ప్రాథమిక సాక్ష్యంగా న్యాయస్థానంలో.. సీనియర్ ఐపీఎస్ అధికారి శిఖా గోయెల్ ఈ అంశంపై స్పందిస్తూ కేవలం ఎమోజీలు మాత్రమే చట్టపరమైన చర్యలకు కారణం కాదని అన్నారు. ఎలక్ట్రానిక్ మెసేజ్లు, ఎమోజీల కంటెంట్లు ప్రాథమిక సాక్ష్యంగా న్యాయస్థానంలో అనుమతిపొందవు. అయితే అటువంటి ఎలక్ట్రానిక్ సందేశాలను సాక్ష్యంగా అంగీకరించనప్పటికీ.. విచారణ సమయంలో ప్రధాన సాక్ష్యం, క్రాస్ ఎగ్జామినేషన్ ద్వారా ఆ కంటెంట్లను నిరూపించాలన్నారు. ఐపీఎస్ అధికారి శిఖా గోయెల్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పోలీసు మహిళా భద్రతా విభాగానికి నేతృత్వం వహిస్తున్న అదనపు డీజీపీ ర్యాంక్ అధికారి. ఆమె ఈ విషయమై ఒక తీర్పును ఉటంకిస్తూ (అంబాలాల్ సారాభాయ్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ వెర్సెస్ కేఎస్ ఇన్ఫ్రాస్పేస్ ఎల్ఎల్పీ లిమిటెడ్తోపాటు మరో కేసులో.. ఇది జనవరి 6, 2020 నాటిది), వర్చువల్ వెర్బల్ కమ్యూనికేషన్లయిన వాట్సాప్ మెసేజ్లు సాక్ష్యాధారాల ద్వారా విచారణ జరిగే సమయంలో రుజువు చేయగల అంశం అని సుప్రీం కోర్టు పేర్కొంది. అయితే ఈ-మెయిల్లు, వాట్సాప్ సందేశాల ప్రకారం ఒక ఒప్పందం కుదిరిందా లేదా అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి స్పషంగా వాటిని అర్థం చేసుకోవాల్సి ఉంటుందని శిఖా గోయల్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: సరస్సును ఖాళీ చేయిస్తారట.. ఎందుకంటే నిర్ణయించదగిన సాక్ష్యం రూపంలో.. భారత న్యాయస్థానాలు, దర్యాప్తు అధికారులు.. వినియోగదారు ఉద్దేశాన్ని అర్థంచేసుకోవడానికి చెల్లుబాటు అయ్యే నిర్ణయాత్మక సాక్ష్యంగా ఎమోజీల వినియోగాన్ని అంగీకరించారు. ముఖ్యంగా లైంగిక వేధింపులు, ఇతర క్రిమినల్ కేసులలో ఇది ఉపయోగపడుతుందని అకార్డ్ జ్యూరిస్ న్యాయవాది, సహ వ్యవస్థాపకురాలు శ్రద్ధా గుప్తా అన్నారు. మన బహుళసాంస్కృతిక సమాజంలో ఎమోజీలపై ఏకరీతి వివరణ లేదని ఆమె పేర్కొన్నారు. ఇటువంటి వ్యాఖ్యానం వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటుంది. ఇది సంస్కృతి, ప్రాంతం, తరం, వృత్తి మొదలైనవాటిని అనుసరించి కూడా మారవచ్చని అన్నారు. ఉదాహరణకు ఒక డాక్యుమెంట్ను స్వీకరించినందుకు లేదా పత్రాన్ని పంపడంలో చేసిన ప్రయత్నాన్ని తెలియజేస్తూ 'థమ్స్ అప్'ని పంపవచ్చు. ఇది ఇండియా కాంట్రాక్ట్ చట్టం ప్రకారం అంగీకారంగా భావిస్తే కేసులు మరింతగా పెరుగుతాయన్నారు. ది లా ఛాంబర్స్లోని సీనియర్ అసోసియేట్ అయిన శ్రద్ధ అభిప్రాయపడ్డారు. ఎమోజీలపై వివరణాత్మక మార్గదర్శకత్వం క్రమబద్ధీకరించే వరకు, ఇటువంటి కమ్యూనికేషన్ మోడ్ను ద్వితీయ సాక్ష్యంగా మాత్రమే పరిగణించాలన్నారు. అపార్థాలకు ఆస్కారం లేకుండా.. ఎమోజీలను ఒక్కొక్కరు ఒక్కో విధంగా అర్థం చేసుకోవడం వలన అపార్థాలకు ఆస్కారం ఏర్పడుతుంది. అందుకు ఎమోజీలను వినియోగించే విషయంలో స్పష్టతను నిర్ధారించడం, గందరగోళాన్ని తగ్గించడం చేయాలని న్యాయ నిపుణురాలు సోనియా తెలిపారు. పరస్పర మర్యాదలను అర్థం చేసుకుని వ్యాపార, అధికారిక వ్యవహారాలలో సమర్థవంతమైన కమ్యూనికేషన్ను ఈ విధమైన రీతిలో ప్రోత్సహించవచ్చన్నారు. వ్యాపారం లేదా అధికారిక సంభాషణలో ఇతర వ్యక్తులతో ఈవిధంగా కమ్యూనికేట్ చేయడం మంచి పద్ధతి అని ఆమె పేర్కొన్నారు. ఎమోజి గందరగోళాన్ని నావిగేట్ చేయడానికి ఉండవలసిన ప్రాథమిక నియమం ఏమిటంటే.. ఎమోజీ వినియోగించే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. అనవసరమైన ఎమోజీలను ఉపయోగించకపోవడమే శ్రేయస్కరమని కూడా ఆమె సూచించారు. ఇది కూడా చదవండి: ‘పెళ్లిళ్లే నా ఆరోగ్య రహస్యం’.. ఐదో పెళ్లి చేసుకున్న 90 ఏళ్ల వరుని స్టేట్మెంట్ -
19 పార్టీలకు ‘స్థానిక’ ఎన్నికల్లో రిజర్వు గుర్తులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికలకు మొత్తం 19 రాజకీయ పార్టీలకు గుర్తులు కేటాయిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) శుక్రవారం నోటిఫికేషన్ జారీచేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల కొన్ని రాజకీయ పార్టీలను గుర్తింపు కలిగిన జాతీయ పార్టీల జాబితాల నుంచి తొలగించి, మరికొన్నింటిని చేర్చడంతోపాటు రాష్ట్రాల్లో గుర్తింపు కలిగిన జాబితాలో మార్పులు చేస్తూ నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. ఆ నోటిఫికేషన్కు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్.. గుర్తింపు కలిగిన జాతీయ, రాష్ట్ర పార్టీల వివరాలతో ఈ కొత్త నోటిఫికేషన్ను జారీచేసింది. రాష్ట్రంలో అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతో సహా కేంద్ర ఎన్నికల సంఘం వద్ద జాతీయ పార్టీల గుర్తింపు ఉన్న ఆమ్ ఆద్మీ, బీఎస్సీ, బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు ఆయా పార్టీల ఎన్నికల గుర్తులు కలిగి ఉంటాయని ఆ నోటిఫికేషన్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి కె.ఆర్.బి.హెచ్.ఎన్.చక్రవర్తి పేర్కొన్నారు. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ సహా వివిధ రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన మరో 11 రాజకీయ పార్టీలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీలుగా గుర్తిస్తూ, కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఆయా రాజకీయ పార్టీల గుర్తులనే అవి కలిగి ఉంటాయని వివరించారు. నిబంధనల ప్రకారం.. గత అసెంబ్లీ ఎన్నికల్లో నిర్ణీత ఓట్ల శాతం గానీ, అసెంబ్లీలో సీట్ల సంఖ్యను గానీ పొందలేక, కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ప్రత్యేక గుర్తును కలిగి ఉండే రిజిస్టర్డ్ పార్టీ జాబితాలో స్థానాన్ని కూడా కోల్పోయిన జనసేన పార్టీకి రాష్ట్ర ఎన్నికల కమిషన్ మాత్రం రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ విత్ రిజర్వుడ్ సింబల్ (ప్రత్యేక గుర్తింపు కలిగి ఉండే రిజిస్టర్డ్ పార్టీగా) గుర్తిస్తున్నట్టు ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ప్రత్యేక గుర్తును కలిగి ఉండే రిజిస్టర్డ్ పార్టీ జాబితాలో లేని పార్టీలకు సైతం రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుర్తుల కేటాయింపు నిబంధనలు 5 (ఏ) (బీ) ప్రకారం.. రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కడైనా 15 ఎంపీటీసీ స్థానాలు లేదా మూడు జెడ్పీటీసీ స్థానాలు లేదా 15 మున్సిపల్ వార్డు స్థానాలు లేదా 15 నగర కార్పొరేషన్ వార్డులు గెల్చుకున్న పార్టీలకు ప్రత్యేక ఎన్నికల గుర్తు కలిగి ఉండే రిజిస్టర్డ్ పార్టీగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుర్తిస్తుందని తెలిపారు. దీనికి తోడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుర్తుల కేటాయింపు నిబంధనలు 5 (ఏ) (బీ–1)ప్రకారం.. రాష్ట్ర అసెంబ్లీలో కనీస ఒక సభ్యుడు ఉన్న ప్రతి పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద ప్రత్యేక రిజర్వు సింబల్ను పొందే అర్హత ఉంటుందని పేర్కొన్నారు. ఇంకొక 94 రాజకీయ పార్టీలను కూడ రాష్ట్ర ఎన్నికల కమిషన్ రిజిస్టర్డ్ పార్టీలుగా గుర్తించినప్పటికీ, వాటికి మాత్రం ఎటువంటి రిజర్వు సింబల్ కేటాయించని పార్టీల జాబితాల్లో పేర్కొంది. -
ఈసీ, మోదీపై ఉద్ధవ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు..
ముంబై: మహారాష్ట్రలో మరోసారి రాజకీయం హీటెక్కింది. శివసేన అధికారిక విల్లు బాణం గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం.. షిండే వర్గానికే ఇవ్వడంతో మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం, ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే ‘విల్లుబాణం’ను చోరీచేశారంటూ మహా సీఎం షిండేను ఉద్దేశించి ఆరోపణలు చేశారు. వివరాల ప్రకారం.. ఉద్ధవ్ థాక్రే నివాసం మాతోశ్రీ వద్ద మద్దతుదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ థాక్రే మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్.. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోంది. కొందరి పక్షాన మద్దతుగా నిలుస్తోంది. ఎన్నికల సంఘం ఇంతకు ముందు ఎప్పుడూ చేయని విధంగా పనిచేస్తోంది. అయినా మనం చింతిచాల్సిన అవసరం లేదు. ఓపిక పట్టండి రానున్న రోజులున్నీ మనవే. రాబోయే ఎన్నికలకు సిద్ధంగా ఉండండి అని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో షిండే వర్గంపై నిప్పులు చెరిగారు. శివసేన గుర్తు విల్లు-బాణం’ను చోరీ చేశారు. ఈ క్రమంలో నిందితుడికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. మేము దీన్ని మండే కాగడాతో ఎదుర్కొంటాము అని కామెంట్స్ చేశారు. ఇక, ఉద్దవ్ థాక్రే ప్రసంగిస్తున్న సందర్బంగా మద్దతుదారులు మాతోశ్రీ వద్ద పెద్ద సంఖ్యలో గుమ్మిగూడారు. ఏక్నాథ్ షిండే వర్గానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గానికి కాగడా ఎన్నికల గుర్తుగా ఉన్న విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్లో మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఎన్నికల సంఘం.. ఈ గుర్తును కేటాయించింది. కాగా, పుణే జిల్లాలోని కస్బాపేట్, చించ్వాడ్ ఉప ఎన్నికల వరకు ఉద్ధవ్ వర్గానికి ఈ కాగడా గుర్తు ఉంటుందని ఈసీ పేర్కొంది. ఈ స్థానాలకు ఫిబ్రవరి 26వ తేదీన ఉప ఎన్నికలు జరుగనున్నాయి. మరోవైపు.. విల్లుబాణం గుర్తును తమకు కేటాయించడంపై సీఎం షిండే స్పందించారు. ఇది.. ప్రజాస్వామ్య విజయం అంటూ కామెంట్స్ చేశారు. ఉద్ధవ్ థాక్రే ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని వ్యాఖ్యలు చేశారు. -
గుర్తులపై కొత్త వివాదం.. అయోమయంలో ఉద్ధవ్, శిండే వర్గాలు
సాక్షి, ముంబై: శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి, ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండేకు ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తులు కొత్త వివాదానికి కారణమయ్యాయి. దీంతో ఇరువర్గాల అభ్యర్థుల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. ఉద్ధవ్ వర్గానికి కేటాయించిన కాగడ గుర్తుపై సమతా పార్టీ, శిండే వర్గానికి కేటాయించిన కత్తులు–డాలు గుర్తుపై సిక్కులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాటిని రద్దు చేయాలని ఎన్నికల సంఘానికి సిఫార్సు చేయడానికి సిద్ధమవుతున్నారు. దీంతో అంధేరీ ఉప ఎన్నిక వివాదాస్పదంగా మారే ప్రమాదం ఏర్పడింది. అభ్యర్థులకు కొత్త చిక్కులు... ఠాక్రే వర్గం తరఫున పోటీ చేస్తున్న రుతుజా లట్కే, బీజేపీ తరఫున పోటీచేస్తున్న మూర్జీ పటేల్ శుక్రవారం మధ్యాహ్నం నామినేషన్ వేశారు. శనివారం నుంచి ప్రచారం చేయడం ప్రారంభించారు. కాని గుర్తుల కేటాయింపుపై కొత్త వివాదం తెరమీదకు రావడంతో ఇరు పార్టీల అభ్యర్ధులు అయోమయ స్ధితిలో ఉన్నారు. నవంబర్ మూడో తేదీన తూర్పు అంధేరీ అసెంబ్లీ నియోజక వర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. అంతకు ముందు నుంచే శివసేన తమదేనంటూ ఉద్ధవ్ వర్గం, కాదు అసలైన వారసులం మేమేనని, మాకే మెజార్టీ ఉందని ఇటు శిండే వర్గం మధ్య వాగ్వాదం మొదలైన సంగతి తెలిసింది. చివరకు ఈ వివాదం సుప్రీం కోర్టుకు వెళ్లింది. కాని సుప్రీం కోర్టు ఈ వివాదం పరిష్కరించే బాధ్యతలు ఎన్నికల సంఘానికే కట్టబెట్టింది. దీంతో తదుపరి ఆదేశాలు జారీ అయ్యేంత వరకు శివసేన పేరు గాని, విల్లు–బాణం (ధనుశ్య–బాణ్) గుర్తుగాని ఎవరూ, ఎక్కడా వినియోగించరాదని ఎన్నికల సంఘం హెచ్చరించింది. అంతేగాకుండా మూడు గుర్తులు, మూడు పార్టీ పేర్లు మీరే సూచించాలని ఎన్నికల సంఘం పేర్కొంది. ఆ మేరకు ఉద్ధవ్, శిండే వర్గాలు మూడు పార్టీ గుర్తులు, మూడు పార్టీ పేర్ల చొప్పున సూచించడంతో అందులోంచి ఠాక్రే వర్గానికి కాగడ, శిండే వర్గానికి కత్తులు–డాలు (తల్వార్–డాల్) కేటాయించిన విషయం తెలిసిందే. కాని మత సామరస్యాలకు సంబంధించిన గుర్తులు కేటాయించరాదని ఎన్నికల సంఘానికి నియమాలున్నాయి. ఆ ప్రకారం శిండే వర్గానికి కేటాయించిన కత్తులు–డాలు గుర్తు సిక్కు సమాజానికి ప్రతీకగా ఉన్నాయి. అదేవిధంగా ఉద్ధవ్ వర్గానికి కేటాయించిన కాగడ (మషాల్) గుర్తు 1996 నుంచి తమ వద్దే ఉందని సమతా పార్టీ పేర్కొంది. దీంతో మా పార్టీ గుర్తును మరో పార్టీకి ఎలా కేటాయిస్తారంటూ రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. చదవండి: మనీష్ సిసోడియాను రేపు సీబీఐ అరెస్ట్ చేస్తుంది: ఆప్ సీనియర్ నేత మరోపక్క అప్పట్లో శిండే సూచించిన త్రిశూలం గుర్తు మత సామరస్యానికి సంబంధించినదంటూ కేటాయించలేదు. సిక్కులకు ప్రతీకగా ఉన్న కత్తులు–డాలు గుర్తు కూడా అదే కోవకు చెందినదంటూ, దీంతో ఆ గర్తును రద్దు చేయాలని సచ్ఖండ్ గురుద్వార్కు చెందిన మాజీ సభ్యుడు రంజీత్ కామ్టేకర్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అంతేగాకుండా కాగడ గుర్తు రద్దు చేయడమేగాకుండా దీనిపై స్పష్టమైన ఆదేశాలివ్వలంటూ సమతా పార్టీ ఢిల్లీలోని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. దీనిపై కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందనేది వేచిచూడాల్సిందే. మరోపక్క రంజీత్ కామ్టేకర్ రాసిన లేఖపై ఎన్నికల సంఘం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది కూడా ఆసక్తిగా మారింది. -
షిండే వర్గానికి ఎన్నికల గుర్తు కేటాయించిన ఈసీ
ముంబై: అంధేరీ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు శివసేన ఏకానాథ్ షిండే వర్గానికి 'రెండు కత్తులు-డాలు' గుర్తును కేటాయించింది ఎన్నికల సంఘం. ఈమేరకు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించించి. షిండే వర్గం పార్టీ పేరును 'బాలాసాబెబ్చీ శివసేన'గా ఈసీ సోమవారం ఫైనల్ చేసిన విషయం తెలిసిందే. అసలైన శివసేన తమదంటే తమదే అని ఉద్ధవ్ థాక్రే, ఏక్నాథ్ షిండే వర్గం వాదిస్తున్న నేపథ్యంలో శివసేన పార్టీ పేరు, ఆ పార్టీ ఎన్నికల గుర్తు విల్లు-బాణాన్ని ఈసీ తాత్కాలికంగా సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే నవంబర్ 3న జరిగే అంధేరీ ఉపఎన్నికల కోసం కొత్త పార్టీ పేరు, ఎన్నికల గుర్తుకు సంబంధించి షిండే, థాక్రే వర్గాలు ఈసీకి కొన్ని ప్రతిపాదలను పంపాయి. వీటిని పరిశీలించిన అధికారులు థాక్రే వర్గానికి 'శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే)' పేరు, కాగడా గుర్తును సోమవారం ఖరారు చేసింది. అలాగే షిండే వర్గానికి 'బాలాసాహెబ్ శివసేన' పేరును ఫైనల్ చేసింది. కానీ షిండే అడిగిన ఎన్నికల గుర్తులు కొన్ని ఇప్పటికే రిజిస్టర్ అయినందున ఎలాంటి గుర్తును కేటాయించలేదు. మళ్లీ కొత్త ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే షిండే వర్గం మంగళవారం సూర్యుడు, కత్తి-డాలు, రావిచెట్టు గుర్తుల్లో ఒకటి కేటాయించాలని ఈసీని మళ్లీ కోరింది. వీటిని పరిశీలించిన ఈసీ రెండు కత్తులు-డాలు గుర్తును ఫైనల్ చేసింది. శివసేన ఎవరిదో తేలేవరకు షిండే, థాక్రే వర్గాలకు ఈ పార్టీ పేర్లు, గుర్తులే ఉండనున్నాయి. చదవండి: ఇదేనా మీకు నేర్పింది? రిక్షా బోల్తాపడినా ఆగని కలెక్టర్ కాన్వాయ్ -
షిండే, ఠాక్రే వర్గాలకు ఈసీ షాక్!
న్యూఢిల్లీ:అంథేరీ ఈస్ట్ అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికలో శివసేన పేరు, ఎన్నికల గుర్తు ‘విల్లు, బాణం’ను ఏక్నాథ్ షిండే, ఉద్ధవ్ ఠాక్రేవర్గాలు ఉపయోగించుకోకుండా ఎన్నికల సంఘం(ఈసీ) నిషేధం విధించింది. పార్టీ పేరు, ఎన్నికల గుర్తు వాడుకోవద్దని రెండు వర్గాలను ఆదేశించింది. ఈ మేరకు శనివారం మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉప ఎన్నిక కోసం ఏవైనా మూడు నచ్చిన పేర్లను, అందుబాటులో ఉన్న గుర్తుల్లో కొన్నింటిని ఎంపిక చేసుకొని, సోమవారంలోగా తమకు తెలియజేయాలని సూచించింది. వాటిని రెండు వర్గాల అభ్యర్థులకు కేటాయిస్తామని పేర్కొంది. పార్టీ ఎన్నికల గుర్తును తమ అభ్యర్థికే కేటాయించాలని షిండే వర్గం కోరగా ఈసీ తిరస్కరించింది. శివసేన ఈ ఏడాది జూన్లో రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే. అసలు శివసేన తమనంటూ షిండే, ఠాక్రే వర్గాలు వాదిస్తున్నాయి. దీనిపై ఎన్నికల సంఘమే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. పార్టీపై హక్కును నిరూపించుకోవడానికి అక్టోబర్ 7లోగా ఆధారాలు సమర్పించాలని ఇరువర్గాలకు ఈసీ ఆదేశించింది. చదవండి: థరూర్.. ఓ విఫల ప్రయత్నం.! -
పెట్స్.. అదో స్టేటస్!
సాక్షి, హైదరాబాద్: నగరవాసుల స్టేటస్ సింబల్ మారింది. లగ్జరీ వాహనాలు, హై ఎండ్ గృహాలు, విదేశీ ఫర్నీచర్, లైఫ్ స్టయిల్ జాబితాలో విదేశీ పెంపుడు జంతువులు కూడా చేరిపోయాయి. సినీ ప్రముఖులు, బడా వ్యాపారులు తమ వ్యవసాయ క్షేత్రాలు, ఫామ్ హౌస్లు, లగ్జరీ విల్లాలలో విదేశీ పెంపుడు జంతువులను పెంచుకుంటున్నారు. తాజాగా క్యాసినోవాలా చికోటి ప్రవీణ్ వ్యవసాయ క్షేత్రంలో ఎగ్జోటిక్ పెట్స్ను అటవీ శాఖ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. విదేశాల్లోని అడవి జాతి పెంపుడు జంతువులను ఎగ్జోటిక్ పెట్స్ అంటారు. మన దేశంలో వీటి రవాణా వైల్డ్లైఫ్ యాక్ట్–1972 ప్రకారం చట్ట వ్యతిరేకం. అమెరికా, ఆ్రస్టేలియా, మెక్సికో వంటి విదేశాల నుంచి అక్రమ మార్గంలో దిగుమతి చేసుకొని, విక్రయిస్తుంటారు. ఇటీవల కోల్కత్తా నుంచి హైదరాబాద్కు కంగారులను అక్రమ రవాణా చేస్తున్న ఓ ముఠాను వెస్ట్ బెంగాల్లోని కుమార్గ్రామ్ పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్లో అధిక డిమాండే అక్రమ రవాణాకు కారణమని పోలీసుల విచారణలో తేలింది. అయితే ఇండియన్ బ్రీడ్ ఎగ్జోటిక్ పెట్స్ పెంపకానికి మన దేశంలో అనుమతి ఉంది. కానీ, ఆయా జంతువులను అటవీ శాఖ వద్ద నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నగరంలో ఈ తరహా వన్యప్రాణులు 150–200 రకాలుంటాయని అంచనా. నగరంలో 50కి పైగా ప్రైవేట్ జూలు.. ప్రస్తుతం నగరంలో 50కి పైగా ప్రైవేట్ జూలు ఉంటాయని బహుదూర్పల్లిలోని జూ అధికారి ఒకరు తెలిపారు. చేవెళ్ల, శంకర్పల్లి, కందుకూరు, శామీర్పేట, భువనగిరి వంటి పలు ప్రాంతాలలోని విశాలమైన ఫామ్ హౌస్లు, వ్యవసాయ క్షేత్రాలలో చిన్న పాటి జూలను ఏర్పాటు చేసి, వీటిని పెంచుతున్నారు. అలాగే పలువురు బడా డెవలపర్లు లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలలో పెట్ పార్క్లను సైతం ఏర్పాటు చేస్తున్నారు. క్యాసినో వాలాగా పేరొందిన చికోటి ప్రవీణ్కు కందుకూరు మండలం సాయిరెడ్డిగూడలో 12 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది. ఇందులో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కొండచిలువలు, ఊసరవెల్లి, మకావ్ చిలుకల వంటి వన్యప్రాణులున్నట్లు అధికారులు గుర్తించారు. అధ్యయనం చేశాకే పెంపకం.. ఎగ్జోటిక్ పెట్స్ జీవన విధానంపై అవగాహన ఉంటేనే పెంచుకోవాలి. లేకపోతే స్వల్పకాలంలోనే అనారోగ్యం పాలై చనిపోతాయని కూకట్పల్లిలోని ఎగ్జోటిక్ పెట్ విక్రయదారుడు, వెటర్నరీ స్టూడెంట్ యుగేష్ తెలిపారు. అవి ఏ జాతికి చెందినవి, ఎలాంటి వాతావరణంలో పెరుగుతాయి, వాటి ఆహారం, వాటికి వచ్చే రోగాలు తదితర అంశాలపై అధ్యయనం చేయాలని సూచించారు. సల్కాటా, ఆల్డాబ్రా టార్టాయిస్: ప్రారంభ ధర రూ.2.5 లక్షలు. ఇగ్వానా: ఆకుపచ్చ, నీలం, పసుపు రంగుల ఇగ్వానాల ప్రారంభ ధర రూ.15 వేలు. స్నో, థానోస్ రంగులవైతే రూ.2 లక్షల నుంచి రూ.7 లక్షల మధ్య ఉంటాయి. బాల్ పైథాన్: వీటిని రాయల్ పైథాన్స్ అని కూడా పిలుస్తారు. ధర రూ.35–40 వేలు. డెడ్ బియర్డ్ డ్రాగన్: తెల్ల గడ్డంలాగా ఉంటాయి. వీటిని వెనక్కి తిప్పినా ఎలాంటి చలనం ఉండదు. వీటి స్పర్శ చల్లగా, గట్టిగా ఉంటుంది. తెలుపు, గోధుమ, ఎరుపు రంగుల్లోని డ్రాగన్స్ ప్రారంభ ధర రూ.80 వేలు. కార్న్ స్నేక్: నార్త్ అమెరికాకు చెందిన ఈ కార్న్ స్నేక్స్ విషపూరితం కావు. జన్యురకం, రంగులను బట్టి వీటి ధరలు రూ.25–35 వేల మధ్య ఉంటాయి. మార్మోసెట్ కోతులు: సౌత్ అమెరికా, బ్రెజిల్, కొలంబియా దేశాలకు చెందిన ఈ కోతులు ఆలివ్ గ్రీన్, గోధుమ రంగుల్లో ఉంటాయి. వీటి ప్రారంభ ధర రూ.5 లక్షలు.. మీర్కట్: దక్షిణాఫ్రికాకు చెందిన మీర్కట్స్ గోధుమ, తెలుపు రంగులో ఉంటాయి. వీటి ప్రారంభ ధర రూ.1.5 లక్షలు. రామచిలుకలు: బ్లాక్పామ్ కాకాటూ, విక్టోరియా క్రౌన్, గోల్డెన్ కోనూర్, అమెరికన్ క్రౌ వంటి రంగురంగుల రామచిలుకలు ఉంటాయి. వీటి ప్రారంభ ధర రూ. 30 వేలు. యార్కి టెర్రియర్ డాగ్: అచ్చం బొమ్మలాగా నలుపు, గోధుమ రంగులలో ఈ కుక్క వీటి ప్రారంభ ధర రూ.85 వేలు. జోలో అనే రకం కుక్కలకు శరీరంపై వెంట్రుకలు ఉండకపోవటం వీటి స్పెషాలిటీ. గ్రే కలర్లో వీటి ధర రూ.లక్ష. (చదవండి: ‘ఫీజు’ లేట్.. మారని ఫేట్!) -
రష్యా యుద్ద ట్యాంకర్లపై ‘z’ గుర్తు.. వారి ప్రత్యేకత ఇదే..
Mysterious Z Symbol In Russia Military Vehicles మాస్కో: ఉక్రెయిన్పై రష్యా వార్ కొనసాగుతోంది. ఈ యుద్దంలో రష్యా అత్యాధునిక బాంబులను, క్షిపణులను ఉక్రెయిన్పై ప్రయోగిస్తోంది. రష్యా ధాటికి ఉక్రెయిన్లో పెద్ద పెద్ద భవనాలు సైతం కుప్పకూలిపోతున్నాయి. వార్ ధాటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు యుద్దం సందర్బంగా ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. రష్యాకు చెందిన పలు సైనిక వాహనాలు, యుద్ద ట్యాంకర్లపై ‘z’ గుర్తు ఉండటం హాట్ టాపిక్గా మారింది. ‘z’ గుర్తు స్పెషాలిటీ ఇదే.. ఈ ‘z’ గుర్తు ఉన్న వాహనాలను రోజ్గావార్డియా ట్రూప్స్ అని పిలుస్తుంటారు. వీటికి రష్యా జాతీయ భద్రతా దళం అనే మరో పేరు కూడా ఉంది. కాగా, ఈ రోజ్గా వార్డియా ట్రూప్స్ కేవలం రష్యా అధ్యక్షుడు పుతిన్ భద్రతా వ్యవహారాలనే మాత్రమే చూస్తుంటాయి. వీరందరూ ఎంతో నైపుణ్యంతో కూడిన ట్రైనింగ్ తీసుకొని యుద్దం రంగంలో ఎంతో చాకచక్యంగా విధులను నిర్వర్తిస్తారనని తెలుస్తోంది. ఏ ప్రదేశంలోనైనా చొరబడి, ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే శక్తి ఈ బలగాలకు ఉంటుందని పలువురు ప్రముఖులు అంటున్నారు. దీంతో యుద్ధంలో ఈ గుర్తు ఉన్న వాహనాలు కనిపించడంతో రష్యా ఆ ట్రూప్స్ను కూడా వార్లోకి దింపిందని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. Russian tanks marked with 'Z' zip down streets of Melitopol, Ukraine. #RussiaUkraineConflict #UkraineRussiaCrisis #WWIII pic.twitter.com/lVGV3I4ZpW — NewsReader (@NewsReaderYT) February 25, 2022 ఇదిలా ఉండగా ఈ గుర్తుపై మరో వాదన కూడా ఉంది. కేవలం యుద్దం జరుగుతున్న సమయంలో ఇదో రకమైన కమ్యూనికేషన్ సిగ్నల్ అని కొందరు అంటున్నారు. రష్యా ట్రూప్పై వారి దేశానికి చెందిన యుద్ద వాహనాలు కాల్పులు జరపకుంగా ఈజీగా గుర్తు పట్టేందుకే ఇలా గుర్తులు వాడుతారని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, బెలారస్లో రష్యాకు చెందిన మరికొన్ని యుద్ద వాహనాలపై ‘O’ గుర్తు కలిగిన వాహనాలు కూడా కనిపించినట్టు ఓ అంతర్జాతీయ మీడియా తన కథనంలో రాసుకొచ్చింది. -
ఈ విషయం తెలుసా..? టీఆర్ఎస్కు మూడు గుర్తులు
సాక్షి, కరీంనగర్: టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి, 20 ఏళ్లయింది. ఇన్నేళ్లలో ఆ పార్టీ మూడు గుర్తులతో ఎన్నికల బరిలోకి దిగింది. పార్టీ ఆవిర్భావం జరిగాక సిద్దిపేట ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పదవులకు సీఎం కేసీఆర్ రాజీనామా చేశారు. దీంతో సిద్దిపేట ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు బస్సు గుర్తు కేటాయించారు. వెనువెంటనే వచ్చిన స్థానిక సంస్థల(2001) ఎన్నికల్లో రైతు నాగలి గుర్తు, 2004లో జరిగిన అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో కారు గుర్తు కేటాయించారు. తదనంతరం కారు గుర్తే టీఆర్ఎస్కు సొంతమైంది. చదవండి: హుజురాబాద్ ఉప ఎన్నిక: కండువా కప్పుకుంటే ఎంతిస్తావ్? పోలింగ్కు ముందు నమూనా పోలింగ్ కరీంనగర్: పోలింగ్ ప్రారంభానికి ముందు ఏజెంట్ల సమక్షంలో నమూనా పోలింగ్ నిర్వహిస్తారు. సీయూ (కంట్రోల్ యూనిట్), బీయూ (బ్యాలెట్ యూనిట్), వీవీప్యాట్లకు కనెక్షన్లు ఇచ్చిన తర్వాత స్విచ్ ఆన్ చేస్తారు. డిస్ప్లేలో జీరో, స్టార్ట్ అని కనిపిస్తుంది. తర్వాత ఏజెంట్లను పోలింగ్ కేంద్రంలోనికి అనుమతిస్తారు. వారి ఎదుట బీయూ బటన్ నొక్కగానే వెలుగుతుంది. సీయూలో ఆకుపచ్చ లైట్ వెలుగుతుంది. అనంతరం ఏజెంట్ల ద్వారా పోటీ చేసే అభ్యర్థులతోపాటు నోటాకు ఓటు వేయమని చెబుతారు. వేసిన ఓట్లు ఎవరెవరికీ ఎన్ని వచ్చాయి? వేసిన ఓట్ల లెక్క సరిపోయిందా లేదా? అనే విషయాలను పరిశీలిస్తారు. తర్వాత అందరి ఆమోదంతో క్లియర్ బటన్ నొక్కి పోలింగ్ ప్రారంభిస్తారు. చదవండి: టీఎస్ఆర్టీసీ మరో ముందడుగు.. ప్రయాణికులకు సజ్జనార్ గుడ్న్యూస్ -
జనసేనకు ‘గాజు గ్లాసు’ ఇక లేనట్టే..
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో గుర్తింపు కలిగిన ప్రాంతీయ పార్టీల హోదాలో కేవలం మూడు పార్టీలకే రిజర్వుడ్ గుర్తులను కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 23న నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్సార్సీపీకి సీలింగ్ ఫ్యాన్ గుర్తు, టీడీపీకి సైకిల్ గుర్తు, టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తులు రిజర్వుడ్ గుర్తులుగా ఉంటాయని పేర్కొంది. జాతీయ పార్టీ హోదాలో బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, తృణమూల్ కాంగ్రెస్, బీఎస్పీ, ఎన్సీపీ, నేషనల్ పీపుల్స్ పార్టీలకు రిజర్వుడ్ గుర్తులుంటాయంది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్, ఎంఐఎంలతో పాటు వైఎస్సార్సీపీ, టీడీపీలకూ ఆయా రిజర్వుడ్ గుర్తులు కేటాయించింది. చదవండి: పరీక్ష రాయడానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం ఇదిలా ఉండగా గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి కేటాయించిన గాజు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా జారీచేసిన నోటిఫికేషన్లో ఫ్రీ సింబల్స్ కేటగిరిలో పేర్కొంది. అంటే.. సంబంధింత గుర్తును రిటర్నింగ్ అధికారులు నిబంధనల ప్రకారం తమ నియోజకవర్గంలో పోటీ చేసే వివిధ రిజిస్టర్డ్ పార్టీ అభ్యర్థులతో పాటు, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసే వారెవరికైనా కేటాయించే వీలుంటుంది. ఇటీవల తిరుపతి లోకసభ ఉప ఎన్నికల్లోనూ గాజు గ్లాస్ గుర్తును స్వతంత్ర అభ్యర్థికి కేటాయించిన విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుర్తు చేసింది. చదవండి: అంత్యక్రియలకు డబ్బుల్లేక దుప్పట్లో భార్య మృతదేహాన్ని.. -
‘చిహ్నం’గా సీతాకోక చిలుకలు
సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడు ఇటీవల రాష్ట్ర ప్రత్యేక సంస్కతి, ప్రకతి సంపదకు చిహ్నంగా సీతాకోక చిలుకను ఎంపిక చేసింది. స్థానికంగా తమిళ మారవన్గా, అంటే తమిళ యోధుడిగా వ్యవహరించే ఈ సీతాకోక చిలుకను ఇంగ్లీషులో ‘కనోపీ బటర్ ఫ్లై’గా పిలుస్తారు. ఇది ముదురు పసుపు రంగు రెక్కలు కలిగి వాటిపై నాలుగైదేసి నల్లటి చుక్కలు ఉంటాయి. ‘నింఫాలిడ్’ జాతికి చెందిన ఈ సీతాకోక చిలుకలు సాధారణంగా 60 మిల్లీమీటర్ల నుంచి 75 మిల్లీ మీటర్ల వరకు ఉంటాయి. రాష్ట్ర చిహ్నంగా ఈ సీతాకోక చిలుకను ఎంపిక చేసేందుకు రాష్ట్ర అధికార యంత్రాంగానికి కొన్నేళ్లు పట్టింది. తమిళ యోధుడిగా వ్యవహరిస్తున్నందున, పర్వత ప్రాంతాల్లో ఇవి విరివిగా ఉండడంతో ఈ రకం సీతాకోక చిలుకను ఎంపిక చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో అంతరించి పోతున్న 35 రకాల సీతాకోక చిలుకలను పరిరక్షించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. రాష్ట్ర చిహ్నంగా సీతాకోక చిలుకను ఎంపిక చేసుకున్న రాష్ట్రాల్లో తమిళనాడు ఐదవది. ఉత్తరాఖండ్ ‘కామన్ పీకాక్’గా వ్యవహరించే సీతాకోక చిలుకను ఎంపిక చేయగా (ఆకుపచ్చ రంగులో సిల్క్లాంటి రెక్కలు కలిగిన), కేరళ ‘మలబార్ పీకాక్ (మధ్యలో పాలపిట్ట రంగు, రెక్కల చివరన నలుపురంగు ఉండే)ను, కర్ణాటక ‘సదరన్ బర్డ్వింగ్స్ (మధ్యలో చీలి నాలుగు రెక్కలున్నట్లుగా రెండు రెక్కలుండే పలు రంగుల చిలుకలు)’ను, మహారాష్ట్ర ‘బ్లూ మార్మన్’ ముందు రెక్కలు ముదురు నీలి రంగులో ఉండి మధ్య భాగం తెలుపు, చివరి భాగంలో నీలి రంగుపై నలుపు చుక్కలు కలిగిన సీతాకోక చిలుకను ఎంపిక చేసుకున్నాయి. ఈ రాష్ట్రాలన్నీ కూడా కొండ ప్రాంతాలకు వన్నె తెచ్చే రంగు రంగుల సీతాకోక చిలుకల జాతులను కాపాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాయి. పర్యావరణ పరిస్థితులను సూచిస్తాయి కనుక సీతాకోక చిలుకలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజల మీదుందని పర్యావరణవేత్తలు తెలియజేస్తున్నారు. సూర్యుడి కాంతి, వేడి, గాలిలో తేమ, వర్షాలను అధికంగా ఇవి తట్టుకోలేవు. అలాంటి పరిస్థితుల్లో అవి వలసలు పోతాయి. అప్పుడు వాతావరణ పరిస్థితులను మనం స్పష్టంగా అంచనా వేయవచ్చు. -
రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు
సాక్షి, అమరావతి: ఇప్పటివరకు అమల్లో ఉన్న రాష్ట్ర అధికారిక చిహ్నంలో.. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రభుత్వం మార్పులు చేసింది. అమరావతి శిల్ప కళలోని ధమ్మ(ధర్మ) చక్రాన్ని స్పూర్తిగా తీసుకుని ఈ సరికొత్త చిహ్నాన్ని రూపొందించింది. అందమైన ఆకుల మధ్య త్రిరత్నాలు(బుద్ధుడు, ధర్మం, సంఘం), అత్యంత విలువైన రత్నాలు పొదిగించిన దండతో ధర్మచక్రాన్ని చిహ్నంలో ఏర్పాటు చేశారు. క్రీస్తు శకం ఒకటో శతాబ్దంలో ధాన్యకటకంలో చైత్యానికి విధుకుడు అనే చర్మకారుడు బహూకరించిన పున్నఘటక(పూర్ణఘటం)ను మూడు వృత్తాల్లో వరుసగా 48, 118, 148 ముత్యాలతో అలంకరించారు. ధర్మచక్రం మధ్యలో నాలుగు పీటల దండల మధ్య పున్నఘటకను ఏర్పాటు చేశారు. పున్నఘటక చిహ్నం కింద జాతీయ చిహ్నం(సారనాథ్లో దొరికిన అశోక స్థంభం) బొమ్మ ఉంది. ఇప్పటివరకు ఆంగ్లంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్న పదాన్ని తెలుగులో చిహ్నంలో అగ్ర భాగంలోనూ.. అదే పదాన్ని ఎడమ వైపున ఆంగ్లంలోనూ, కుడి వైపున హిందీలోనూ ఏర్పాటు చేశారు. దిగువ భాగాన సత్యమేవ జయతే అన్న పదాన్ని తెలుగులోకి మార్పు చేశారు. ఈ చిహ్నాన్ని మూడు రూపాల్లో ముద్రించుకోవచ్చు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర చిహ్నాన్ని ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులు, సీఎస్, ప్రభుత్వ కార్యదర్శులు, అడ్వొకేట్ జనరల్, శాఖల అధిపతులు, కలెక్టర్లు, సచివాలయంలోని మధ్యస్థాయి అధికారులు వినియోగించుకోవచ్చు. -
ఏపీ రాష్ట్ర చిహ్నాలు ఇవే..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర చిహ్నాలను ఖరారు చేసింది. వేప చెట్టును రాష్ట్ర వృక్షంగా, కృష్ణ జింకను రాష్ట్ర జంతువుగా, రామ చిలుకను రాష్ట్ర పక్షిగా, మల్లె పువ్వును రాష్ట్ర పుష్పంగా గుర్తిస్తూ అటవీ శాఖ పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రాష్ట్ర పక్షిగా పాలపిట్ట ఉండేది. దాని స్థానంలో రామ చిలుకను రాష్ట్ర పక్షిగా గుర్తిస్తున్నట్లు వెల్లడించారు. -
‘రెండాకుల’ లక్ష్యం
♦ మళ్లీ ఢిల్లీకి అన్నాడీఎంకే రాజకీయం ♦ చిహ్నం కైవసానికి కసరత్తు ♦ మంత్రులు, ఎంపీల బృందం తిష్ట ♦ ఈసీతో భేటీకి కుస్తీ ♦ కేంద్ర మంత్రులతో మంతనాలు ♦ మేల్కొన్న దినకరన్ శిబిరం ♦ తమను సంప్రదించాలని ముందుస్తుగా లేఖ ♦ కోర్టుకు సర్వ సభ్య సమావేశం వ్యవహారం రెండాకుల చిహ్నం కైవసం లక్ష్యంగా అన్నాడీఎంకే రాజకీయం మంగళవారం ఢిల్లీకి చేరింది. ఓపీఎస్–ఈపీఎస్ నేతృత్వంలో ఎన్నికల కమిషన్ వద్ద సమర్పించి ఉన్న ఫిర్యాదుల్ని వెనక్కు తీసుకునే ప్రయత్నాలు వేగవంతం అయ్యాయి. ఇందుకోసం మంత్రులు, ఎంపీల బృందం దేశ రాజధానిలో తిష్ట వేసింది. న్యాయనిపుణులతో ఓ వైపు, కేంద్ర మంత్రులతో మరో వైపు ఈ బృందం చర్చల్లో మునిగి ఉంది. ఇక, చిహ్నం కైవసం లక్ష్యంగా ఓపీఎస్–ఈపీఎస్ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేస్తూదినకరన్ మేల్కొన్నారు. తమను సంప్రదించకుండా, ఎలాంటి నిర్ణయం తీసుకునేందుకు వీలు లేదని ముందుగానే ఈసీని ఆశ్రయించారు. సాక్షి, చెన్నై : అన్నాడీఎంకేలో ఈపీఎస్(సీఎం పళని), ఓ పీఎస్(డిప్యూటీ సీఎం) విలీన పర్వం ముగిసినా, ఉప ప్రధాన కార్యదర్శిగా చెప్పుకుంటున్న దినకరన్ రూపంలో వివాదం రాజుకుంటోంది. దినకరన్ దూకుడు ఈపీఎస్, ఓపీఎస్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. పుదుచ్చేరిలో తిష్టవేసిన దినకరన్ మద్దతు ఎమ్మెల్యేలు రోజుకో హెచ్చరికలు, బెదిరింపులతో ఈపీఎస్కు షాక్ ఇచ్చే విధంగా దూసుకెళ్తున్నారు. మంగళవారం మీడియాతో దినకరన్ మద్దతు ఎమ్మెల్యే తంగతమిళ్ సెల్వన్, వెట్రివేల్ మాట్లాడుతూ, అందరి బండారాలు బయటపెట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమను కట్టడి చేయడం ఎవరితరం కాదు అని, చిన్నమ్మకు వ్యతిరేకంగా వ్యవహరించడం మానుకుంటే మందని హితవు పలికారు. ఎన్నికల కమిషన్ నుంచి ప్రమాణ పత్రాన్ని వెనక్కు తీసుకుంటే, కోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇక, బల పరీక్ష విషయంలో గవర్నర్ స్పందించని దృష్ట్యా, పుదుచ్చేరిలో ఉన్న దినకరన్ మద్దతు ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లి, రాష్ట్రపతిని కలిసేందుకు తగ్గ ప్రయత్నాల్లో పడ్డారు. దినకరన్ శిబిరం నుంచి బెదిరింపుల పర్వం పెరగడంతో, చిన్నమ్మకు చెక్ పెట్టే కార్యాచరణను ఈపీఎస్, ఓపీఎస్ వేగవంతం చేశారు. రెండాకుల చిహ్నం కైవసం చేసుకున్న పక్షంలో దినకరన్ మెడలు వంచినట్టే అని నిర్ధారణకు వచ్చి అందుకు తగ్గ ప్రయత్నాల్ని వేగవంతం చేశారు. చిహ్నం దక్కించుకోవడమే లక్ష్యం ఈపీఎస్, ఓపీఎస్ వేర్వేరుగా ఉన్న సమయంలో సమర్పించిన ఫిర్యాదుల మేరకు ఎన్నికల కమిషన్ వద్ద రెండు కేసులు విచారణలో ఉన్నాయి. అందులో ఒకటి రెండాకుల చిహ్నం, మరొకటి ప్రధాన కార్యదర్శి నియామకం వ్యవహారం. ఇందులో రెండాకుల చిహ్నం దక్కించుకున్న పక్షంలో, పార్టీ సర్వ సభ్య సమావేశం ఆధారంగా ప్రధాన కార్యదర్శి ఎవరన్నది తేల్చవచ్చునన్న ప్రస్తుతం ఆ ఇద్దరు నేతలు నిర్ణయానికి వచ్చారు. దీంతో ఎన్నికల కమిషన్ వద్ద సమర్పించిన ప్రమాణ పత్రాలు, ఫిర్యాదుల్ని వెనక్కు తీసుకునేందుకు ఢిల్లీ బాట పట్టారు. పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై సారథ్యంలో మంత్రులు జయకుమార్, తంగమణి, సీవీ షణ్ముగం, ఎంపీ మైత్రేయన్, మాజీ ఎంపీ మనోజ్ పాండియన్ ఉదయం నుంచి ఢిల్లీలో బిజీ అయ్యారు. న్యాయ నిపుణులతో ఉదయం నుంచి చర్చ సాగింది. తదుపరి కేంద్ర సహాయ మంత్రి నిర్మల సీతారామన్తో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. సాయంత్రం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ సాగింది. ఈ భేటీల గురించి తంబిదురై మీడియాతో మాట్లాడుతూ, మర్యాద పూర్వకమేనని సమాధానం ఇచ్చారు. అయితే, నిర్మల సీతారామన్ దర్శకత్వంలోనే రెండాకుల చిహ్నం కైవసం వ్యవహారంలో న్యాయపరంగా చర్చలు సాగుతున్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే, కేంద్ర ఎన్నికల కమిషన్ను తొలిరోజు ఈ బృందం కలవలేదు. ‘సర్వ సభ్యం’ సభ్యుల గురి అన్నాడీఎంకేలో ప్రధాన కార్యదర్శికి మద్దతుగా సభ్యుల్ని సమీకరించే పనిలో చిన్నమ్మ శశికళ కుటుంబం రంగంలోకి దిగడం గమనార్హం. ఓవైపు దినకరన్, మరో వైపు చిన్నమ్మ సోదరుడు దివాకరన్ ఎమ్మెల్యేలను లాగేందుకు ప్రయత్నాల్లో ఉంటే, ఇతర కుటుంబ సభ్యులు సర్వ సభ్య సమావేశ సభ్యుల్ని తమవైపునకు తిప్పుకునే ప్రయత్నాలను వేగవంతం చేసినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ఈ పరిస్థితుల్లో ఇన్నాళ్లు దినకరన్కు వెన్నంటి ఉన్న మాజీ మంత్రి దళవాయి సుందరం ఈపీఎస్తో భేటీకి నిర్ణయించడం ఆ శిబిరంలో కలవరాన్ని రేపుతోంది. అదే సమయంలో దినకరన్కు మున్ముందు ముచ్చెమటలు పట్టిస్తామని నగరాభివృద్ధి శాఖ మంత్రి ఎస్పీ వేలుమణి స్పందిస్తే, చిన్నమ్మ శశికళను ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించబోమని మరో మంత్రి వెల్లమండి నటరాజన్ స్పందించడం ఆలోచించ దగ్గ విషయం. మేల్కొన్న దినకరన్ ఈపీఎస్–ఓపీఎస్ బృందం ఢిల్లీకి చేరడంతో ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ మేల్కొన్నారు. ఆగమేఘాలపై పార్టీ కర్ణాటక విభాగం నేత పుహలేందిని ఢిల్లీకి పంపించారు. ఓపీఎస్, ఈపీఎస్ల విలీన వ్యవహారాలను ప్రస్తావిస్తూనే, అన్నాడీఎంకే వ్యవహారాల్లో తన ప్రమేయం ఉందని, చిన్నమ్మ శశికళ, తన పేరిట ఇప్పటికే ఈసీకి అనేక వినతిపత్రాలు, ప్రమాణ పత్రాలు సమర్పించారని వివరిస్తూ ఓ లేఖను పుహలేంది ఎన్నికల కమిషన్కు సమర్పించారు. దినకరన్ను సంప్రదించకుండా, రెండాకుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకునేందుకు వీలు లేదని సూచించారు. ప్రమాణ పత్రాలను వెనక్కు తీసుకునే విధంగా ఏదేని ప్రయత్నాలు సాగినా, అందుకు తగ్గ వివరణ దినకరన్ నుంచి తీసుకోవాల్సి ఉందని, చర్చించకుండా, ఎలాంటి ఆమోదాలు తెలిపేందుకు వీలు లేదని అందులో స్పష్టంచేశారు. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి విదేశాలకు వెళ్లడంతో, ఆయన రాకకోసం ఓపీఎస్–ఈపీఎస్ ఎదురు చూడాల్సిన పరిస్థితి. కోర్టుకు ‘సర్వ సభ్యం’ అన్నాడీఎంకే సర్వ సభ్యసమావేశం వ్యవహారం కోర్టుకు చేరింది. ఆదిత్యన్ రాంకుమార్ అనే వ్యక్తి మంగళవారం మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంలో పిటిషన్ వేశారు. అన్నాడీఎంకేలో సాగుతున్న పరిణామాలను గుర్తుచేస్తూ, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని ఆ పిటిషన్లో వివరించారు. ప్రస్తుతం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎవరన్న వివాదం బయలుదేరి ఉందని, ఇందుకోసం సర్వసభ్య సమావేశం జరగబోతోందని వివరించారు. ఈ సమావేశాన్ని రిటైర్డ్ న్యాయమూర్తి సమక్షంలో జరిపేలా కోర్టు నిర్ణయం తీసుకుంటే, శాంతిభద్రతలకు విఘాతం కల్గకుండా ఉంటుందని పేర్కొన్నారు. అన్నాడీఎంకేలో ఉన్న శిబిరాలను ఒక చోట చేర్చి, రిటైర్డ్ న్యాయమూర్తి సమక్షంలో ప్రధాన కార్యదర్శి ఎన్నిక జరిగే విధంగా> ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ను న్యాయమూర్తులు శశిథరన్, స్వామినాథన్ నేతృత్వంలోని బెంచ్ పరిశీలించింది. ఈ పిటిషన్ విచారణకు స్వీకరిస్తూ సంబంధిత శిబిరాలను ప్రతి వాదులుగా చేర్చాలని ఆదేశిస్తూ తదుపరి పిటిషన్ వాయిదా వేశారు. -
రెండాకుల కోసం..
► ఈసీకి ప్రమాణపత్రం సమర్పించిన పన్నీరు ► నేడు చిన్నమ్మ తరఫున దాఖలు ► జిల్లా కార్యదర్శులతో పళని సమాలోచన ►ఎంజీయార్ శత జయంతి ఏర్పాట్లు ► పన్నీరును ఒంటరి చేద్దాం... నేతల నినాదం రెండాకుల చిహ్నం వ్యవహారంపై మాజీ సీఎం పన్నీరు సెల్వం ఎన్నికల కమిషన్కు అదనపు ప్రమాణ పత్రం సమర్పించారు. సుమారు 20 లక్షల పేజీలతో కూడిన 1.5 లక్షల అంశాలతో ఈ ప్రమాణ పత్రంలో తమ వైపు వాదనను ఈసీ ముందు ఉంచారు. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ తరఫున మంగళవారం ప్రమాణ పత్రం దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. సాక్షి, చెన్నై: అమ్మ జయలలిత మరణంతో అన్నాడీఎంకేలో నెలకొన్న పరిణామాలను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్నాడీఎంకే తమదంటే తమదంటూ మాజీ సీఎం పన్నీరు సెల్వం, తాత్కాలిక ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ శిబిరాలు రచ్చకెక్కాయి. దీంతో రెండాకుల చిహ్నం సీజ్ చేయబడింది. చిన్నమ్మ జైలుకు వెళ్లడంతో వ్యవహారాల్ని తాత్కాలిక ఉపప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ పర్యవేక్షించారు. రెండాకుల కోసం ఈసీకి లంచం ఇవ్వడానికి ప్రయత్నించి ఆయన కూడా కటకటాల్లోకి వెళ్లారు. ప్రస్తుతం ఆ శిబిరం తరఫున సీఎంగా ఉన్న పళనిస్వామి పార్టీ బాధ్యతలను సైతం తనభుజాన వేసుకుని ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఇచ్చిన గడువు మేరకు అదనపు ప్రమాణ పత్రాల్ని రెండు శిబిరాలు దాఖలు చేయాల్సిన పరిస్థితి. చిన్నమ్మ శిబిరం కన్నా ముందుగానే పన్నీరు శిబిరం సోమవారం తన తరఫున ప్రమాణ పత్రాన్ని సమర్పించింది. లారీల్లో తమవద్ద ఉన్న ఆధారాలను ఢిల్లీకి తీసుకెళ్లి మరీ ఎన్నికల కమిషన్కు పన్నీరు శిబిరం సమర్పించింది. సుమారు 20 లక్షల పేజీలతో కూడిన 1.5 లక్షల అంశాలతో ఈ ప్రమాణ పత్రం దాఖలు చేయడం గమనార్హం. కార్యదర్శులతో పళని సమాలోచన: చిన్నమ్మ తరఫున ఈసీకి ప్రమాణ పత్రం సమర్పించాల్సిన అవశ్యం ఏర్పడడంతో జిల్లాల కార్యదర్శులతో సీఎం పళని స్వామి సోమవారం సాయంత్రం సమావేశం అయ్యారు. రాయపేటలోని అన్నాడీఎంకే కార్యాలయంలో ఈ సమావేశం గంటన్నర పాటుగా జరిగింది. సీనియర్ మంత్రులు, జిల్లాల కార్యదర్శులు అందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధాన కార్యదర్శి, ఉప ప్రధాన కార్యదర్శులు జైలులో ఉండడంతో వారి తరఫున సీఎం పళని స్వామి ప్రమాణ పత్రం సమర్పించేందుకు సిద్ధం అయ్యారు. మంగళవారం ఈ ప్రమాణ పత్రం ఈసీ వద్ద దాఖలు చేయనున్నారు. ఇందుకోసం పార్టీ కార్యాలయంలో సమావేశం సాగినా, పన్నీరును ఒంటరి చేయడం లక్ష్యంగా కొత్త నినాదాన్ని అందుకున్నట్టు సమాచారం. దివంగత నేత ఎంజీయార్ శత జయంతి ఉత్సవాల వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా మిన్నంటే రీతిలో ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా పళని స్వామి దృష్టికి ప్రభుత్వ న్యాయవాదుల నియామకం విషయంలో అన్నాడీఎంకే న్యాయవాద విభాగంలో బయల్దేరిన రచ్చ విషయాన్ని పలువురు కార్యదర్శులు తీసుకెళ్లి ఉన్నారు. ఈ విషయంగా చర్చించి నిర్ణయం తీసుకుందామని ఆయన దాట వేసినట్టు సమాచారం. పన్నీరును ఒంటరి చేద్దాం: ప్రధాని నరేంద్ర మోదీ అభయం తమకే ఉన్న దృష్ట్యా, మాజీ సీఎం పళనితో విలీనం ప్రయత్నాల్ని పక్కన పెట్టి, ఆయన్ను ఒంటరి చేద్దామన్న నినాదాన్ని పలువురు జిల్లాల కార్యదర్శులు ఈ సమావేశంలో అందుకున్నట్టు సమాచారం. తొలుత పళని స్వామి పన్నీరుకు మద్దతుగానే స్పందించినట్టు తెలిసింది. పన్నీరు వెంట జనం, కేడర్ ఉందని, ఆయన్ను లాక్కోవడం ద్వారా పార్టీకి లాభం అన్న వ్యాఖ్యలు చేసినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. అయితే మెజారిటీ శాతం కేడర్ ఆయన్ను ఒంటరి చేసిన పక్షంలో, అటు వైపుగా తొంగి చూసే వాళ్లు ఉండరన్న వ్యాఖ్యలు అందుకున్నట్టు తెలిసింది. దీంతో ముందు ఆ శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపిలు, మాజీలను ఇటు వైపుగా లాగేందుకు ప్రయత్నించాలని, ఆ తర్వాత ఒంటరి గురించి ఆలోచిద్దామంటూ పళని స్పందించినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే విలీనం వ్యవహారం ఇప్పట్లో చర్చ అనవసరం అని, తమంతత తాముగా వాళ్లే అన్నాడీఎంకేలోకి వచ్చే విధంగా అడుగులు వేద్దామంటూ సమావేశాన్ని ముగించి ఉన్నారు. ఈ సమావేశానంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి జయకుమార్ అన్ని విషయాలు చర్చించామన్నారు. ప్రమాణ పత్రం విషయంపై సంతకాలు తీసుకున్నామన్నారు. ఎమ్మెల్యేలదే తుది నిర్ణయం: తంబిదురై విలీనం కొలిక్కి వచ్చినా, సీఎం ఎవరన్న విషయాన్ని ఎమ్మెల్యేలు నిర్ధారిస్తారని పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై అన్నారు. ధర్మపురంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకేలోకి పన్నీరు శిబిరం వీలీనమైన పక్షంలో సీఎంగా ఎవరు ఉంటారని ప్రశ్నించగా, అది పార్టీ నిర్ణయిస్తుందన్నారు. ఇటీవల ఓ సంస్థ జరిపిన సర్వేలో అన్నాడీఎంకేలో సీఎం అయ్యే అర్హత పన్నీరు సెల్వంకు మాత్రమే ఉందని 37 శాతం మంది అంగీకారం తెలిపి ఉన్నారని ప్రశ్నించగా, ఎమ్మెల్యేల నిర్ణయం మేరకు తదుపరి నిర్ణయాలు ఉంటాయన్నారు. పన్నీరు సీఎం పగ్గాలు చేపట్టాలని ఆ శిబిరానికి చెందిన ఎమ్మెల్యే సెమ్మలై వ్యాఖ్యానిస్తున్నారే అని ప్రశ్నించగా, సీఎంగా ఎవరు ఉండాలి, పార్టీని ఎవరు నడిపించాలి అన్న విషయాలు ఎమ్మెల్యేలు, జిల్లాల కార్యదర్శులు, సర్వసభ్య సమావేశంలో తేల్చాల్సిన విషయంగా దాట వేశారు. సెమ్మెలై వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ, ముందుగా విలీనం సాగదని అని ముందుకు సాగారు. దినకరన్కు బెయిల్పై రేపు నిర్ణయం రెండాకుల చిహ్నం కోసం లంచం కేసులో అరెస్టైన టీటీవీ దినకరన్కు బెయిల్ లభించేనా అన్న ఎదురు చూపుల్లో చిన్నమ్మ శిబిరం వర్గాలు ఉన్నాయి. టీటీవీ మద్దతు దారులు పలువురు తీహార్ జైల్లో ఆయనతో ములాఖత్ అయినట్టు సమాచారం. టీటీవీ సన్నబడ్డా, మనోధైర్యంతో ఉన్నట్టు చెబుతున్నారు. ఆయనకు బెయిల్ లభించాలన్న ఆశాభావంతో ఎదురు చూస్తున్నారు. ఆయన కస్టడీని పొడిగిస్తూ కోర్టు ఆదేశించినా, బెయిల్ పిటిషన్పై బుధవారం నిర్ణయం ప్రకటించనుండడంతో ఎదురు చూపులు పెరిగాయి. -
చెప్పాల్సింది చెప్పేశా: రజనీకాంత్
చెన్నై: అభిమానులతో మూడురోజులపాటు భేటీ అనంతరం కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై ఊహాగానాలకు పుల్స్టాప్ పడటంలేదు. రాజకీయాల్లోకి రావాలనే కోరిక తనకు లేదని, ఒకవేళ దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వచ్చి అవినీతికి తావులేని స్వచ్ఛమైన పాలన అందిస్తానని రజనీకాంత్ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. సుదీర్ఘ విరామం తరువాత ఆయన చెన్నై కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో ఐదు రోజులపాటు జిల్లాల వారీగా అభిమానులను కలుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రజనీకాంత్ను రాజకీయాల్లోకి రావాలని అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు. అయితే తన పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తలపై రజనీకాంత్ స్పందిస్తూ... తాను చెప్పాల్సింది చెప్పేశానని, ఇంకా చెప్పడానికి ఏమీ లేదన్నారు. మరోవైపు అభిమానులతో భేటీ సందర్భంగా... ఈ సమావేశంలో వేదికపై అమర్చిన ఒక చిహ్నం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కొన్నేళ్ల క్రితం ‘బాబా’ చిత్రంలో రజనీకాంత్ తన కుడిచేతి వేళ్లను చిత్రంగా మడిచి చూపుతుంటారు. తెల్లని కలువపువ్వులో అదే తరహాలో చేతివేళ్లు చిహ్నంగా తీర్చిదిద్ది ఫ్లెక్సీలో అమర్చారు. ఈ సింబల్పై తాజాగా చర్చలు జోరందుకున్నాయి. రజనీకాంత్ బీజేపీకి దగ్గర అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అందుకే కమలం గుర్తుతో పాటు కుడిచేతి వేళ్లను మడిచి చూపుతున్న ముద్రను ఎంచుకున్నారని, అదే ఆయన పార్టీ సింబల్ అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రస్తుతం ఆ వేదికపై ఏర్పాటు చేసిన గుర్తుపై తమిళనాట జోరుగా చర్చ జరుగుతోంది. -
గుర్తు పట్టాలని!
► రెండాకుల చిహ్నం కోసం మూడు పార్టీల పట్టు ► దీప పేరవై పేరు మార్పు ► ఈసీకి పన్నీర్ వర్గం ప్రమాణపత్రాల సమర్పణ అన్నాడీఎంకేకు ఆయువు పట్టు రెండాకుల చిహ్నం. ఈ గుర్తుకోసం మూడు పార్టీలు పోరుబాట పట్టాయి. శశికళ వర్గం ఇప్పటికే ఎన్నికల కమిషన్ వద్ద తన వాదన వినిపించింది. ఇప్పుడు పార్టీ పేరు మార్పుతో దీప, ఈసీకి ప్రమాణపత్రాల సమర్పణతో పన్నీర్సెల్వం రెండాకుల గుర్తు దక్కించుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత గత ఏడాది కన్నుమూసిన కొద్దిరోజుల్లోనే రెండాకుల పార్టీ రెండుగా చీలిపోయింది. అన్నాడీఎంకేకు అసలైన వారసులం తామంటే తామని శశికళ, పన్నీర్సెల్వం వర్గాల ప్రకటించుకోగా ఎవ్వరూ కాదు పొమ్మంటూ ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అన్నాడీఎంకే, రెండాకుల చిహ్నంపై తాత్కాలికంగా నిషేధం విధించింది. ఈ పరిణామంతో విస్తుపోయిన ఇరువర్గాలు రెండు పార్టీలు పెట్టుకున్నాయి. శశికళ వర్గం తమ పార్టీకి ‘అన్నాడీంకే అమ్మ’ (టోపీ గుర్తు), పన్నీర్ వర్గం ‘అన్నాడీఎంకే పురట్చితలైవీ అమ్మ’ (రెండు దీపాల విద్యుత్ స్తంభం గుర్తు) అని నామకరణం చేసుకుని ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో తలపడ్డాయి. అయితే అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నం లేకుండా నెగ్గుకు రావడం కష్టమని కొద్దిరోజుల్లోనే ఇరు వర్గాలకూ తెలిసిపోయింది. అన్నాడీఎంకే అమ్మ అభ్యర్థి టీటీవీ దినకరన్ ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో రెండాకుల చిహ్నం లేని లోటును డబ్బుతో అధిగమించేందుకు ప్రయత్నించి అభాసుపాలు కావడంతోపాటు ఎన్నికల రద్దు కారకుడయ్యాడు. అంతేగాక రెండాకుల చిహ్నంను దొడ్డిదారిన దక్కించుకునేందుకు ఏకంగా ఎన్నికల కమిషన్కే రూ.50 కోట్ల ఎరవేసి జైలు పాలయ్యాడు. రెండాకుల కోసం మూడు పార్టీల పోరు ఇదిలా ఉండగా, ఎన్నికల కమిషన్ చేతిలో ఉన్న అన్నాడీఎంకేను, రెండాకుల చిహ్నాన్ని ఎలాగైనా దక్కించుకునే ప్రయత్నాలను మానివేసి పార్టీ క్యాడర్ బలం ద్వారా పొందాలని శశికళ వర్గం నిర్ణయించుకుంది. ప్రస్తుతం పార్టీ, మెజార్టీ ఎమ్మెల్యేల బలం ప్రభుత్వం తమ చేతుల్లో ఉందనే ధీమాతో ఎన్నికల కమిషన్కు ఇప్పటికే అనేక పత్రాలను సమర్పించిన శశికళ వర్గం నింపాదిగా వ్యవహరిస్తోంది. పన్నీర్ వర్గం ప్రమాణ పత్రాల సమర్పణ: ఇక పన్నీర్సెల్వం వర్గం సైతం ఎన్నికల కమిషన్నే నమ్ముకుంది. అమ్మ పార్టీకి అసలైన వారసులం అంటూ గతంలో 20 వేల పేజీలతో కూడిన ప్రమాణ పత్రాలను ఎన్నికల కమిషన్కు సమర్పించింది. ఇందుకు అదనంగా శుక్రవారం 12,600 పేజీలతో కూడిన ప్రమాణ పత్రాలను అందజేసింది. పన్నీర్సెల్వం నాయకత్వాన్ని తాము సమర్థిస్తున్నామంటూ పార్టీ నేతలు, సభ్యుల సంతకాలతో కూడిన ప్రమాణ పత్రాలు అందులో ఉన్నాయి. ఇరువర్గాల పత్రాలను ఎన్నికల కమిషన్ పరిశీలిస్తోంది. పేరు మార్చుకున్న దీప పేరవై: రెండాకుల చిహ్నం కోసం శశికళ, పన్నీర్సెల్వం వర్గాలు పోటీ పడుతుండగా జయలలిత అన్నకుమార్తె దీప సైతం రంగంలోకి దిగారు. అమ్మకు రక్తసంబంధీకులమేకాదు, రాజకీయ వారసురాలిని కూడా నేనే అంటూ ఎంజీఆర్ ‘అమ్మ దీప పేరవై’ పేరుతో జనం ముందుకు వచ్చారు. రెండాకుల చిహ్నం దక్కించుకోవడమే తన లక్ష్యమని ప్రకటించారు. ఆర్కేనగర్ ఎన్నికల్లో సైతం పేరవై పేరుతో పోటీచేసిన దీప... రెండాకుల చిహ్నం రేసులో ఉరికేందుకు తాజాగా తన పార్టీ పేరును మార్చారు. పేరవై ఉన్నతస్థాయి కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి రుమాన పాండియన్ అధ్యక్షతన నిర్వాహకులతో శుక్రవారం సమావేశమై పలు తీర్మానాలు చేశారు. ఎంజీఆర్ అమ్మ దీప పేరవైని రద్దు చేసి ‘అన్నాడీఎంకే దీప’ వర్గంగా మార్చడం తీర్మానాల్లో ప్రధానమైనది. -
బిగిసిన ఉచ్చు
► అరెస్టుకు చాన్స్ ► నేడు నిర్ణయం సాక్షి, చెన్నై :రెండాకుల చిహ్నం కోసం లంచం వ్యవహారం టీటీవీ దినకరన్ను చుట్టుముట్టింది. ఆయన్ను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.ఇందుకు అద్దం పట్టే రీతిలో ఆదివారం ఢిల్లీలో పరిణామాలు సాగాయి. చిహ్నం కోసం ఎన్నికల కమిషన్కు రూ. 50 కోట్లు ఎరగా వేసినట్టు అన్నాడీఎంకే (అమ్మ) బహిష్కృత ఉపప్రధాన కార్యదర్శి టీటీవి దినకరన్ ఆరోపణల్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. శనివారం ఏడెనిమిది గంటల పాటు టీటీవీని ఢిల్లీ పోలీసులు విచారించారు. ఆదివారం కూడా ఆయన వద్ద విచారణ సాగడంతో ఇక, ఉచ్చు మరింతగా బిగిసినట్టేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి. పలు కోణాల్లో టీటీవీని ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు విచారించారు. సెల్ఫోన్ నంబర్లు, సంభాషణల ఆధారంగా పలు రకాల ప్రశ్నలతో టీటీవీని ఉక్కిరి బిక్కిరి చేయడంతో పాటు పట్టుబడ్డ బ్రోకర్ ఇచ్చిన వివరాల ఆధారంగా మరి కొందరి పేర్లను వివరిస్తూ టీటీవీకి ప్రశ్నల్ని పోలీసులు సం««ధించారు. అనేక ప్రశ్నలకు తెలియదు, సంబంధం లేదు, చూడలేదు అన్న సమాధానాల్నే టీటీవీ ఇచ్చినట్టు సమాచారం. సోమవారం సాగే తుది విచారణ మేరకు టీటీవీని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఆయన్ను అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచి కటకటాల్లోకి నెట్టే అవకాశాలు ఉన్నట్టు ఢిల్లీ నుంచి వస్తున్న సమాచారాలు టీటీవీ మద్దతుదారుల్ని ఆందోళనలో పడేస్తున్నది. అయితే, ఆయన నిర్ధోషిగా చెన్నైకు వస్తారన్న నమ్మకాన్ని ఆయన మద్దతు ఎమ్మెల్యే ఒకరు వ్యక్తం చేస్తుండడం గమనార్హం. టీటీవీని ఇరకాటంలో పెట్టి, కేసు బలపడే విధంగా మరో పది మంది పేర్లను జాబితాలోకి ఢిల్లీ పోలీసులు ఎక్కించినట్టు తెలిసింది. ఇందులో టీటీవీ సన్నిహితులు ఇద్దరుతో పాటు, ఎన్నికల కార్యాలయంలో పనిచేసిన మాజీ ఉద్యోగులు, ప్రస్తుతం ఉన్న కింది స్థాయి సిబ్బంది కూడా ఉన్నట్టు సమాచారం. -
రెండాకులు దక్కేనా?
-
రెండాకులు దక్కేనా?
► అదనపు ఆధారాలు కోరిన ఎన్నికల కమిషన్ ► జూన్ 16 వరకు గడువు వైరివర్గాల పోరుతో తాత్కాలిక నిషేధానికి గురైన రెండాకుల చిహ్నం చివరికి ఎవరికైనా దక్కేనా ఎన్నికల కమిషన్ చేతుల్లో శాశ్వతంగా ఎండిపోయేనా అనే అనుమానాలు నెలకొన్నాయి. రెండాకుల చిహ్నం పొందడంలో ఎన్నికల కమిషన్ ఇచ్చిన రెండునెలల గడువు సద్వినియోగం చేసుకోకుంటే గతేమిటని ఎడపాడి, పన్నీర్సెల్వం వర్గాల్లో భయం ప్రారంభమైంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే పార్టీకి, రెండాకుల చిహ్నంకు రాష్ట్రంలో తిరుగులేని ఆదరణ ఉంది. రెండాకుల చిహ్నం చూడగానే ప్రజల కళ్ల ముందు ఎంజీఆర్, జయలలిత కదలాడుతారు. అంతే పూనకం వచ్చినట్లుగా బ్యాలెట్ పేపరు మీదున్న రెండాకుల గుర్తుపై ఓటు ముద్రవేస్తారు. ఏదో బలమైన తప్పుచేసినపుడు మాత్రమే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేను ఓడించారు, లేకుంటే శాశ్వతంగా అధికారంలో ఉండగల సత్తా ఆ పార్టీకి ఉందని ఒక డీఎంకే నేతనే అంగీకరించాడు. అమ్మ మరణం తరువాత ఆ పార్టీపై అజమాయిషీ కోసం శశికళ, పన్నీర్సెల్వం రాజకీయ పోరాటానికి దిగారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక చెల్లదనే వాదనతో జాతీయ ఎన్నికల కమిషన్కు చేసిన ఫిర్యాదు విచారణలో ఉండగానే ఆర్కేనగర్ ఎన్నికలు వచ్చాయి. శశికళ ఎంపిక విచారణను పక్కనపెట్టిన ఎన్నికల కమిషన్ రెండాకుల చిహ్నం ఏ వర్గానికి ఇవ్వాలనే అంశంపై దృష్టి పెట్టింది. చివరకు మధ్యే మార్గంగా అన్నాడీఎంకే పార్టీని, రెండాకుల చిహ్నాన్ని, ఇరువర్గాలూ వాడకుండా తాత్కాలికంగా నిషేధం విధించింది. ఈ పరిణామాన్ని ఊహించని శశికళ వర్గం కుదేలైపోయింది. టోపీ గుర్తుపై పోటీ చేయడం ద్వారా ప్రజల నుంచి నిరసన సెగలను ఎదుర్కొంది. రెండాకుల చిహ్నం స్థానంలో డబ్బును వెదజల్లడం ద్వారా గెలుపొందాలని దినకరన్ చేసిన ప్రయత్నం మొత్తం ఎన్నికల రద్దుకే దారితీసింది. ఇక లాభం లేదనుకున్న దినకరన్ రెండాకుల చిహ్నాన్ని దక్కించుకోవడం కోసం రూ.50 కోట్లు ఎరవేసేందుకు ప్రయత్నించి ఢిల్లీ పోలీసులకు చిక్కారు. పార్టీ, చిహ్నంపై ఎన్నికల కమిషన్ ఢిల్లీలో ఈనెల 17న విచారణకు సిద్ధమవుతున్న తరుణంలోనే దినకరన్ ఉదంతం బట్టబయలై విచారణ వాయిదాకు దారితీసింది. అన్నాడీఎంకే వ్యవహారం ఎన్నికల కమిషన్కు తలనొప్పిగా మారగా వీలయినంత త్వరగా ఈ శిరోభారాన్ని దించుకునేందుకు సిద్ధమైంది. చిహ్నం కోసం జూన్ 16వ తేదీలోగా అదనపు ఆధారాలను సమర్పించాల్సిందిగా అన్నాడీఎంకేలోని ఇరువర్గాలను ఎన్నికల కమిషన్ శుక్రవారం ఆదేశించింది. విలీనం ద్వారా రెండాకుల చిహ్నాన్ని దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్న ఎడపాడి, పన్నీర్వర్గాలకు ఆధారాలపై గడువు విధించడం ద్వారా ఎన్నికల కమిషన్ షాకిచ్చింది. ఇరువర్గాల నేతలు ఆధారాలతో ముందు కెళతారా, వీలీనానికి ప్రాధాన్యం ఇస్తారా లేకుంటే రెండాకుల చిహ్నాన్ని చేజార్చుకుంటారో వేచి చూడాల్సి ఉంది. -
రెండాకులు దక్కేనా?
► అదనపు ఆధారాలు కోరిన ఎన్నికల కమిషన్ ► జూన్ 16 వరకు గడువు వైరివర్గాల పోరుతో తాత్కాలిక నిషేధానికి గురైన రెండాకుల చిహ్నం చివరికి ఎవరికైనా దక్కేనా ఎన్నికల కమిషన్ చేతుల్లో శాశ్వతంగా ఎండిపోయేనా అనే అనుమానాలు నెలకొన్నాయి. రెండాకుల చిహ్నం పొందడంలో ఎన్నికల కమిషన్ ఇచ్చిన రెండునెలల గడువు సద్వినియోగం చేసుకోకుంటే గతేమిటని ఎడపాడి, పన్నీర్సెల్వం వర్గాల్లో భయం ప్రారంభమైంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే పార్టీకి, రెండాకుల చిహ్నంకు రాష్ట్రంలో తిరుగులేని ఆదరణ ఉంది. రెండాకుల చిహ్నం చూడగానే ప్రజల కళ్ల ముందు ఎంజీఆర్, జయలలిత కదలాడుతారు. అంతే పూనకం వచ్చినట్లుగా బ్యాలెట్ పేపరు మీదున్న రెండాకుల గుర్తుపై ఓటు ముద్రవేస్తారు. ఏదో బలమైన తప్పుచేసినపుడు మాత్రమే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేను ఓడించారు, లేకుంటే శాశ్వతంగా అధికారంలో ఉండగల సత్తా ఆ పార్టీకి ఉందని ఒక డీఎంకే నేతనే అంగీకరించాడు. అమ్మ మరణం తరువాత ఆ పార్టీపై అజమాయిషీ కోసం శశికళ, పన్నీర్సెల్వం రాజకీయ పోరాటానికి దిగారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక చెల్లదనే వాదనతో జాతీయ ఎన్నికల కమిషన్కు చేసిన ఫిర్యాదు విచారణలో ఉండగానే ఆర్కేనగర్ ఎన్నికలు వచ్చాయి. శశికళ ఎంపిక విచారణను పక్కనపెట్టిన ఎన్నికల కమిషన్ రెండాకుల చిహ్నం ఏ వర్గానికి ఇవ్వాలనే అంశంపై దృష్టి పెట్టింది. చివరకు మధ్యే మార్గంగా అన్నాడీఎంకే పార్టీని, రెండాకుల చిహ్నాన్ని, ఇరువర్గాలూ వాడకుండా తాత్కాలికంగా నిషేధం విధించింది. ఈ పరిణామాన్ని ఊహించని శశికళ వర్గం కుదేలైపోయింది. టోపీ గుర్తుపై పోటీ చేయడం ద్వారా ప్రజల నుంచి నిరసన సెగలను ఎదుర్కొంది. రెండాకుల చిహ్నం స్థానంలో డబ్బును వెదజల్లడం ద్వారా గెలుపొందాలని దినకరన్ చేసిన ప్రయత్నం మొత్తం ఎన్నికల రద్దుకే దారితీసింది. ఇక లాభం లేదనుకున్న దినకరన్ రెండాకుల చిహ్నాన్ని దక్కించుకోవడం కోసం రూ.50 కోట్లు ఎరవేసేందుకు ప్రయత్నించి ఢిల్లీ పోలీసులకు చిక్కారు. పార్టీ, చిహ్నంపై ఎన్నికల కమిషన్ ఢిల్లీలో ఈనెల 17న విచారణకు సిద్ధమవుతున్న తరుణంలోనే దినకరన్ ఉదంతం బట్టబయలై విచారణ వాయిదాకు దారితీసింది. అన్నాడీఎంకే వ్యవహారం ఎన్నికల కమిషన్కు తలనొప్పిగా మారగా వీలయినంత త్వరగా ఈ శిరోభారాన్ని దించుకునేందుకు సిద్ధమైంది. చిహ్నం కోసం జూన్ 16వ తేదీలోగా అదనపు ఆధారాలను సమర్పించాల్సిందిగా అన్నాడీఎంకేలోని ఇరువర్గాలను ఎన్నికల కమిషన్ శుక్రవారం ఆదేశించింది. విలీనం ద్వారా రెండాకుల చిహ్నాన్ని దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్న ఎడపాడి, పన్నీర్వర్గాలకు ఆధారాలపై గడువు విధించడం ద్వారా ఎన్నికల కమిషన్ షాకిచ్చింది. ఇరువర్గాల నేతలు ఆధారాలతో ముందు కెళతారా, వీలీనానికి ప్రాధాన్యం ఇస్తారా లేకుంటే రెండాకుల చిహ్నాన్ని చేజార్చుకుంటారో వేచి చూడాల్సి ఉంది. -
పన్నీర్సెల్వం వర్గంపై ఈసీకి ఫిర్యాదు
చెన్నై: ఆర్కే నగర్ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడటంతో రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే నిప్పు ఉప్పుగా ఉన్న పన్నీర్ సెల్వం, శశికళ వర్గం మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా పన్నీర్ సెల్వం వర్గంపై శశికళ గ్రూప్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎలక్ట్రిక్ పోల్ గుర్తును పన్నీర్ వర్గం దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆరోపణలు చేసింది. రెండు ఆకుల గుర్తుగా ప్రచారం చేస్తున్నారని గురువారం ఈసీకి ఫిర్యాదు చేసింది. సెల్వం వర్గంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఇందుకు సంబంధించి వీడియో పుటేజ్ను కూడా సమర్పించింది. కాగా జయలలిత మరణంతో ఆర్కేనగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. వచ్చేనెల 12న ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. బహుముఖ సమరంగా సాగుతున్న ఆర్కేనగర్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు తీవ్ర కుస్తీలే పడుతున్నారు. బరిలో 62మంది ఉన్నా, ప్రధాన సమరం మాత్రం డీఎంకే, అన్నాడీఎంకే అమ్మ, అన్నాడీఎంకే పురట్చితలైవి అమ్మ మధ్య సాగుతున్నదని చెప్పవచ్చు. డీఎంకే అభ్యర్థి మరుదు గణేష్, అన్నాడీఎంకే అమ్మ అభ్యర్థి దినకరన్, పురట్చితలైవి అమ్మ అభ్యర్థి మధుసూదనన్ ప్రచారంలో దూసుకు వెళుతున్నారు. మరోవైపు జయలలిత మేనకోడలు దీప మద్దతుదారులతో కలిసి ప్రజాకర్షణ ప్రచారంలో ఉన్నారు. -
గుర్తు పట్టాలని!
► చేజారకుండా శశి వర్గం జాగ్రత్తలు ► తమకే దక్కుతుందని పన్నీర్ ధీమా ► దీప సైతం ఎదురుచూపులు ► ఎన్నికల కమిషన్ నిర్ణయం కీలకం రాష్ట్రంలోని అనేక ద్రవిడ పార్టీల్లో ప్రధానమైన అన్నాడీఎంకేపై రసవత్తర చర్చ మొదలైంది. ఆర్కేనగర్ ఉప ఎన్నికలో రెండాకుల చిహ్నం ఏవర్గానికి దక్కేనో, మరెవరి వర్గం వైపు మొగ్గేనో అని ఆసక్తికరమైన విశ్లేషణలో పార్టీలు మునిగితేలుతున్నాయి. రెండాకుల గుర్తును నిలబెట్టుకునేందుకు శశికళ, సాధించుకునేందుకు పన్నీర్ పాటుపడుతుండగా, అనుకూల పవనాల కోసం జయ మేనకోడలు దీప కాచుకుని ఉన్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: 1972 అక్టోబరు 17వ తేదీన ఎంజీ రామచంద్రన్ స్థాపించిన ఈ పార్టీకి 1.50 కోట్ల సభ్యత్వంతో బలమైన క్యాడర్ ఉంది. ఎంజీఆర్ బొమ్మ, అమ్మ ఫొటోలు అన్ని ఎన్నికల్లో అతి ప్ర ధాన ఆకర్షణలు. వీటికి తోడు పార్టీ రెండాకుల చిహ్నం కనపడితేచాలు బ్యాలెట్ పేపర్పై ముద్రవేసే ఓటు బ్యాంక్ అన్నాడీఎంకేకు సొంతం. పార్టీకి ఆనేతలు ఎంత బలమో ప్రజల హృదయాల్లో నాటుకుపోయిన రెండాకుల చిహ్నం కూడా అంతేబలం. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం, శశికళ బాధ్యతల స్వీకరణ, పన్నీర్సెల్వం తిరుగుబాటు, జయకు అసలైన రాజకీయ వారసురాలిని తానేనంటూ ఆమె మేనకోడలు దీప గళమెత్తారు. దీంతో అన్నాడీఎంకే అనుచరులు మూడుగా చీలిపోయారు. సభ్యులు సైతం ఎవరికి నచ్చిన చోట వారు చేరిపోయారు. 1.50 కోట్ల పార్టీ సభ్యత్వం సైతం మూడు వర్గాలుగా మారిపోయింది. అన్నాడీఎంకేలోని మూడు వర్గాలూ అమ్మ బొమ్మ చూ పించే ఎన్నికల బరిలో దిగ డం తప్పనిసరి. అయితే వీటన్నికం టే గెలుపు గుర్రం ఎక్కించే రెండాకుల చిహ్నం ఇంకా ఎంతో ముఖ్యం. అమ్మ మెచ్చిన నేత అనే సెంటిమెంట్ బలాన్ని పన్నీర్సెల్వం కలిగి ఉన్నా, జయ మేనకోడలిగా అసలైన రాజకీయ వారసురాలు అనే ముద్ర దీప సొంతమైనా ఇవన్నీ బ్యాలెట్ పేపరులో ప్రతిబంబించవు. బ్యాలెట్ పేపరులో ఓటరుకు కనపడేది రెండాకుల చిహ్నం మాత్రమే. రెండాకుల చిహ్నం కనపడితే చాలు ఆవేశంతో ఊగిపోయినట్లుగా బ్యాలెట్పై ఓటరు తన రాజ ముద్రను వేసేస్తారని ఒక డీఎంకే నేతనే అంగీకరించాడు. ఓటర్లపై అంతటి ప్రభావం చూపగలిగిన సత్తా కలిగి ఉండటం వల్లే రెండాకుల చిహ్నం కోసం ముగ్గురూ పోటీపడుతున్నారు. ఐదేళ్ల సభ్యత్వం లేని కారణంగా ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక చెల్లదని పన్నీర్సెల్వం ప్రధాన ఎన్నికల కమిషన్ వద్ద సవాల్ చేసి ఉన్నారు. పన్నీర్ వాదనతో ఎన్నికల కమిషన్ ఏకీభవించినపక్షంలో శశికళ పదవీచ్యుతురాలు కాగలరు. తద్వారా పార్టీ పగ్గాలు, రెండాకుల గుర్తు తన చేతికి వస్తాయని పన్నీర్ ఆశిస్తున్నారు. అయితే సీఈసీ నిర్ణయం ప్రతికూలంగా మారినపక్షంలో పార్టీ చేజారిపోకుండా తన వర్గంలో ఉండే ఐదేళ్ల సభ్యత్వ సీనియారిటి కలిగి ఉన్న వ్యక్తిని శశికళ తన స్థానంలో నిలిపే అవకాశం ఉంది. తన రాజకీయ ప్రవేశ లక్ష్యం పార్టీని, రెండాకుల చిహ్నన్ని స్వాధీనం చేసుకోవడమేని దీప ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. రెండాకుల చిహ్నం దక్కించుకోవడంలో దీపకు ఇప్పట్లో సాధ్యం కాదు. అయితే రెండాకుల చిహ్నం శశికళకా, పన్నీరుకా ఎవరికి సొంతం అనే అంశంపై సీఈసీ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. శశికళ ఎంపిక చెల్లదని సీఈసీ ప్రకటించినట్లయితే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆమె చేసిన నియామకాలు, తీసుకున్న నిర్ణయాలన్నీ రద్దయిపోతాయి. ఎన్నికల పోలింగ్లోగా సీఈసీ తన నిర్ణయాన్ని ప్రకటించని పక్షంలో పరిస్థితి మరోరకంగా మారుతుంది. అన్నాడీఎంకే తరపున ఆర్కేనగర్లో పోటీచేసే అభ్యర్దులకు తగిన వ్యక్తి బీఫాంపై సంతకం చేసినపుడే రెండాకుల చిహ్నం కేటాయించబడుతుంది. సర్వసభ్య సమావేశం ద్వారా ఎంపికైన శశికళ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి మాత్రమే కాబట్టి బీఫాంపై ఆమె సంతకం చెల్లదని పన్నీర్ వర్గం వాదిస్తోంది. అంతేగాక శాశ్వత కార్యదర్శి హోదాలో జయ చేత నియమితులైన ప్రిసీడియం చైర్మన్ మదుసూధనన్ సంతకంతో బీఫారాలు జారీచేస్తామని కూడా పన్నీర్ అనుచరులు చెబుతున్నారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికపై మరో రెండు రోజుల్లో నామినేషన్లను స్వీకరించనున్న తరుణంలో రెండాకుల చిహ్నం వివాదం కీలకంగా మారింది. ఇంతటి గందరగోళ పరిస్థితుల్లో రెండాకుల చిహ్నం ఎవరికి దక్కుతుందో వేచి చూడాల్సిందే. -
ఎన్నికల గుర్తుకోసం ఎందుకంత పోరాటం?
సాక్షి, న్యూఢిల్లీ: సమాజ్వాది పార్టీని రెండుగా చీల్చిన తండ్రీ తనయులు ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్లు ఇప్పుడు ఎన్నికల కమిషన్ వద్ద పార్టీ గుర్తయిన ‘సైకిల్’ను సొంతం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. గుర్తునుచూసి ఓటేసే నిరక్షరాస్యులున్న భారత్ లాంటి దేశంలో గుర్తుకు ఎంతో ప్రాధాన్యత ఉన్న విషయం తెల్సిందే. దక్షిణ భారత దేశంలో పార్టీలు చీలిపోవడం, గుర్తు కోసం గొడవ పడడం, ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లడం, కోర్టులను ఆశ్రయించడం సాధారణమే. మామకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు తెలుగుదేశం గుర్తు ‘సైకిల్’ను దక్కించుకోవడం కోసం హైకోర్టు ఆశ్రయించాల్సి వచ్చింది. 1987లో ఎంజీఆర్ మరణించడంతో ఏఐడీఎంకే రెండు వర్గాలుగా చీలిపోవడంతో ఎంజీఆర్ భార్య జానకీ రామచంద్రన్, జయలలిత వర్గాలు రెండాకుల గుర్తు కోసం పోటీ పడ్డాయి. కరుణానిధి నాయకత్వంలోని డీఎంకె నుంచి వై. గోపాలస్వామి (వైకో)ని బహిష్కరించినప్పుడు ఆయన పార్టీని చీల్చి ఉదయిస్తున్న సూర్యుడి గుర్తును దక్కించుకునేందుకు ప్రయత్నించారు. ఎన్టీఆర్ను పడదోసినప్పుడు.. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీరామారావు నాయకత్వాన తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఎన్టీ రామారావు మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు నాయకత్వాన పార్టీలో అసమ్మతి రాజకీయాలు మొదలయ్యాయి. 1995లో జరిగిన కోపరేటివ్ ఎన్నికల్లో కొన్ని కోపరేటివ్ స్థానాలను తెలుగుదేశం కోల్పోయింది. దానికి చంద్రబాబు మద్దతుదారులే కారణమని భావించిన ఎన్టీఆర్ పార్టీ నుంచి ఎనిమిది ఎమ్మెల్యేలను బహిష్కరించారు. వారి బహిష్కరణను తక్షణమే ఎత్తివేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అందుకు ఎన్టీఆర్ అంగీకరించలేదు. వైస్రాయ్ హోటల్ కేంద్రంగా.. చంద్రబాబు పార్టీలో అసమ్మతి రాజకీయాలను తీవ్రతరం చేశారు. దీంతో ఎన్టీఆర్ 1995, ఆగస్టు 25వ తేదీన కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని రద్దుచేసి కొత్తగా ఎన్నికలకు వెళ్లాలని తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని అప్పటి రాష్ట్ర గవర్నర్ కష్ణకాంత్కు పంపించారు. అయితే ఆయన సకాలంలో స్పందించలేదు. ఇంతలో చంద్రబాబు తన మద్దతుదారులతో, తోటి కుటుంబ సభ్యులతో వైస్రాయ్ హోటల్లో మకాం వేసి మెజారిటీ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకున్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలు తనను నాయకుడిగా ఎన్నికున్నారని, అసెంబ్లీని రద్దు చేయకూడదంటూ పోటీ తీర్మానం ద్వారా గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు హైకోర్టును ఆశ్రయించి తమదే అసలైన తెలుగుదేశం పార్టీ అని, ఎన్నికల గుర్తు సైకిల్ తనకే దక్కాలంటూ న్యాయపోరాటం జరిపి దక్కించుకున్నారు. రెండాకుల గుర్తుకోసం గొడవ.. 1987లో ఎంజీ రామచంద్రన్ చనిపోయినప్పుడు ఆయన భార్య జానకి రామచంద్రన్, సన్నిహితురాలు జయలలిత మధ్య పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. జయలలిత మద్దతుదారులైన 33 మంది శాసన సభ్యులను జానకి రామచంద్రన్ బహిష్కరించడంతో ఆమె ప్రభుత్వం పడిపోయింది. పార్టీపై పట్టుకోసం ఇరువర్గాలు తమ పోరాటాన్ని సాగించాయి. 1989లో ఎన్నికల కోసం పార్టీ ఎన్నికల గుర్తు ‘రెండాకులు’తమకే కేటాయించాలంటూ ఇరువర్గాలు ఎన్నికల కమిషన్ను ఆశ్రయించాయి. ఎన్నికల కమిషన్ ఎవరికి ఆ గుర్తును కేటాయించ కుండా కొత్త గుర్తులు ఇచ్చింది. జానకి వర్గానికి జంట పావురాలు, జయలలిత వర్గానికి కోడిపుంజు గుర్తులు లభించాయి. ఎన్నికల్లో తన వర్గం తీవ్రంగా దెబ్బతినడంతో జానకి రామచంద్రన్ రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకున్నారు. ఆ తర్వాత జయలలిత నాయకత్వాన రెండు వర్గాలు కలసిపోయాయి. డీఎంకేలో కూడా ముసలం.. డీఎంకే నాయకుడు కరుణానిధి తన వారసుడిగా తన కుమారుడు స్టాలిన్ను ప్రోత్సహిస్తుండడంతో పార్టీ సీనియర్ నాయకుడు వై. గోపాలస్వామీ పార్టీలో ముసలం పుట్టించారు. పార్టీని చీల్చేందుకు ప్రయత్నించారు. ఎల్టీటీఈ సహకారంతో కరుణానిధిని చంపేందుకు కుట్రపన్నారన్న ఆరోపణలపై వైకోను 1993లో పార్టీ నుంచి బహిష్కరించారు. తొమ్మిది జిల్లా పార్టీ కార్యదర్శులు ఆయన వెంట వెళ్లారు. వైగో తన మద్దతుదారులతో ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లి పార్టీని, పార్టీ గుర్తును దక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ విషయం తెలిసి కరుణానిధి అత్యవసరంగా పార్టీ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కరాణానిధి నాయకత్వం పట్లనే విశ్వాసం వ్యక్తం చేస్తూ సర్వ సభ్య సమావేశం తీర్మానం చేసింది. పార్టీ కార్యవర్గ కమిటీ, వివిధ కమిటీల నుంచే కాకుండా శాసన సభ్యులు, పార్టీ పార్లమెంటరీ బోర్డు నుంచి కూడా ఇలాంటి తీర్మానాలు చేయించారు. ఇప్పుడు అలాంటి తీర్మానాలే అవసరం.. కరుణానిధి నాయకత్వం పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తూ పార్టీకి చెందిన వివిధ వేదికల వద్ద తీర్మానాలు చేయడం వల్ల పార్టీ పేరు, ఎన్నికల గుర్తు ఆయనేదంటూ అప్పటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్. గోపాల స్వామి నిర్ణయించారు. ఇప్పుడు సమాజ్వాది పార్టీలో కూడా ఇలాంటి సమస్యే ఏర్పడినందున అటు ములాయం సింగ్ యాదవ్గానీ ఇటు అఖిలేష్ యాదవ్ గానీ పార్టీకి చెందిన అని శాఖల వద్ద విశ్వాస తీర్మానం పొందడం మంచిది. ఇలాంటి తీర్మానాలు చేయించడం, వాటిని భద్రపర్చడం ములాయం సింగ్కు మొదటి నుంచే అలవాటే. మరి అఖిలేష్ యాదవ్కు అలాంటి ముందు జాగ్రత్త ఉందా అన్నది సందేహం. -
సామాన్యులకు 'అందని ద్రాక్ష'..!
-
సామాన్యులకు 'అందని ద్రాక్ష'..!
జపాన్ః మనకు అందని ఎత్తులో ఉన్న ఏ విషయానికైనా 'అందని ద్రాక్ష' సామెతను ఉదహరిస్తుంటాం. కానీ జపాన్ లోని ఓ దుకాణందారుడు నిజంగా సామాన్యులకు అందని ద్రాక్షనే తన దుకాణంలో ప్రదర్శనకు పెట్టాడు. ఓ అరుదైన జాతికి చెందిన ద్రాక్షపళ్ళ గుత్తిని ఏకంగా లక్షల రూపాయలు వెచ్చించి వేలంలో దక్కించుకోవడమే కాదు... వాటిని తన దుకాణంలో ప్రదర్శనకు ఉంచి వచ్చినవారికి రుచి చూపించి ఇప్పుడు జపాన్ లోనే వార్తల్లో వ్యక్తిగా మారాడు. పాశ్చాత్య ప్రపంచంలో అరుదైన వైన్ కు ఎటువంటి గుర్తింపు ఉంటుందో అలాగే జపాన్ లో అరుదైన, ప్రత్యేకత కలిగిన పళ్ళను కొనుగోలు చేయడం, వినియోగించడం వారి హోదాకు గుర్తుగా భావిస్తారు. అదే నేపథ్యంలో జపాన్ లోని ఓ కిరాణా దుకాణం యజమాని రూబీ రోమన్ జాతికి చెందిన ద్రాక్షపళ్ళ గుత్తిని సుమారు 8 లక్షల రూపాయలకు వేలంలో దక్కించుకున్నాడు. అది తనకు గౌరవంగా భావించడమే కాదు... అలా లక్షలు పోసి కొన్న ద్రాక్షను ప్రదర్శనకు పెట్టి, అందరికీ ఉచితంగా రుచి చూపించాడు. ఆస్పత్రులను సందర్శించేప్పుడు, వివాహాలు, వేడుకల సందర్భాల్లో నాణ్యత కలిగిన, అరుదైన, రుచికరమైన పళ్ళను అందించడం జపాన్ సంప్రదాయాల్లో ఒక భాగమే కాక, హోదాగా కూడా భావిస్తారు. అందుకే అక్కడ అటువంటి ఖరీదైన పళ్ళను అమ్మేందుకు ప్రత్యేక దుకాణాలు కూడ ఉంటాయి. ప్రత్యేక పద్ధతుల్లో పండించిన, ఉత్పత్తి చేసిన పళ్ళ జాతులను ఆ యా దుకాణాల్లో అందుబాటులో ఉంచుతారు. అటువంటి పళ్ళను కొని, ఇతరులకు బహుమతిగా ఇవ్వడం కొనుగోలుదారులు సైతం హోదాగా భావిస్తారు. ఈ సీజన్ లో ప్రత్యేకంగా పండించిన రూబీ రోమన్ జాతికి చెందిన 30 ద్రాక్ష పళ్ళను కొన్నవాళ్ళలో జపాన్ లోనే తకమారూ కొనీషీ మొదటివాడు. పింగ్ పాంగ్ బంతుల సైజులో ఉన్న ఆ ద్రాక్ష.. నిజంగా రూబీ రోమన్ రత్నాల్లా ఉన్నాయని తెగ సంబరపడిపోతున్నాడు. అందుకే తాను సుమారు 8 లక్షల రూపాయలను వెచ్చించానని, తన దుకాణంలో ప్రదర్శనకు ఉంచి, అందరికీ రుచి చూపిస్తున్నానని గర్వంగా చెప్తున్నాడు. జపాన్ సముద్ర తీరంలోని ఇషికవ ప్రాంతంలో ఈ రూబీ రోమన్ జాతిని ఫిజిమోరీ వెరైటీ విత్తనాలతో మొదటిసారి 1992 లో పండించారు. ఈ ద్రాక్ష ఒక్కోటి కనీస బరువు 20 గ్రాములు ఉండటంతోపాటు, రసంలో 18 శాతం చక్కెర పాళ్ళు కలిగి ఉంటుంది. ఈ అరుదైన జాతి ద్రాక్షను మొదటిసారి 2008 లో జపాన్ పండ్ల మార్కెట్లో వేలానికి పెట్టారు. అయితే అప్పట్లో నిజంగానే అందని ద్రాక్ష పుల్లన అన్నట్లుగా దాని ధర కూడ ప్రపంచంలోని ద్రాక్ష పళ్ళ మార్కెట్లలోనే అత్యధిక ధర పలికింది. అంతేకాదు అత్యంత అరుదైన, ఖరీదైన ద్రాక్షగా కొత్త రికార్డు సృష్టించింది. అయితే వేలంలో రూబీ రోమన్ ద్రాక్షను పొందటం నాకెంతో ఆనందంగా ఉందని, ప్రత్యేక గౌరవం లభించినట్లుగా ఉందని కొనిషీ చెప్తున్నాడు. తన దుకాణానికి వచ్చిన కొనుగోలుదారులు రుచి చూడటంతోపాటు, కొందరు ఇతర వ్యాపారులు శాంపిల్ గా కూడ ఈ ద్రాక్షను తీసుకెళ్ళారని చెప్తున్నాడు. ఒక్కోటి సుమారు 25 వేల రూపాయల ఖరీదు చేసే ఆ పళ్ళను కొనిషీ జనానికి ఎలా ఉచితంగా ఇచ్చాడో తెలియదు కానీ, అతడి దుకాణం దగ్గర శాంపిల్స్ కోసం, రుచికోసం జనం క్యూ కట్టడం మాత్రం పెద్ద ఈవెంట్ గా మారిపోయింది. పత్రికలు, మీడియా లో ప్రత్యేక వార్తా కథనం అయిపోయింది. కాగా మార్కెట్లోకి కొత్తగా వచ్చిన అరుదైన జాతి ద్రాక్షను అందరికీ పరిచయం చేసి, తన అమ్మకాలను పెంచుకొనేందుకు సదరు వ్యాపారి ఆ మార్గం ఎంచుకొన్నాడా అన్న అనుమానం కూడా కలుగుతోంది. -
గ్రేట్ డేన్ శునకాలకు భారీ డిమాండ్
-
క్రేజీ కప్పు సాసర్!
కుత్బుల్లా పూర్ నియోజక వర్గంలోని పలు డివిజన్లలలో రెబల్స్ గా ఉన్న అభ్యర్థులంతా ఇప్పుడు 'కప్పు సాసర్' గుర్తు కోసం పోటీ పడుతున్నారు. ఏ మాత్రం అవకాశం వచ్చినా కప్పు సాసర్ గుర్తు దక్కించుకోవాలని భావిస్తున్నారు. ఈ గుర్తు వస్తే ఇక గెలుపు మాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంతకూ దీని వెనుక కథాకమామీషు ఎంటంటే.. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూన శ్రీశైలం గౌడ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 24 వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. అప్పట్లో ఆయన గుర్తు కప్పు సాసర్. అప్పటి నుంచి కప్పుసాసర్ గుర్తుకు ఇక్కడ క్రేజ్ ఏర్పడింది. స్వతంత్రులుగా పోటీలో నిలుస్తున్న కార్పొరేటర్ అభ్యర్థులు కూడా కప్పుసాసర్ గుర్తు వస్తే ఇక తమదే విజయం అని భావిస్తున్నారు. మరి ఎవరికి ఈ లక్కు దక్కేనో చూడాలి. - కుత్బల్లాపూర్