Telangana Jagruthi
-
కేబీఆర్ పార్క్ వద్ద భారత జాగృతి భోగి వేడుకలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పొద్దుపొద్దున్నే ముగ్గులతో ఆడపడుచులు, భోగి మంటలతో ఆడిపాడుతున్నారు అంతా. ఇక కేబీఆర్ పార్క్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో భోగి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భారత్ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. భోగి మంట వేసి.. బసవన్నలకు పూజ చేసి, హరిదాసు అక్షయ పాత్రలో బియ్యం సమర్పించారు. Telangana | BRS MLC K Kavitha participated in the Bhogi celebrations organised by Bharat Jagruthi at KBR park in Hyderabad. pic.twitter.com/n31mFG4Sxy — ANI (@ANI) January 14, 2023 -
న్యూజిలాండ్ లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు
తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలను చాటే బతుకమ్మ ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు సాగే ఉత్సవాలు ఖండాంతరాలు దాటాయి.న్యూజిలాండ్ ఆక్లాండ్ సిటీలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు జ్యోతి నేతృత్వంలో తొలి రోజు జరిపే ఎంగిలిపూల బతుకమ్మ ఉత్సవాలు అంబురాన్నంటాయి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ ఆడుతూ..పాడుతూ ఆక్లాండ్ల్లో సంబురాలు హోరెత్తాయి. అయితే ఈ ఏడాది కరోనా కరణంగా ఇంటి వద్దనే బతుకమ్మ ఉత్సవాల్ని జరుపుతున్నట్లు జ్యోతి తెలిపారు. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన వేడుకలు 9 రోజులు రోజుకో రీతిలో సాగి సద్దుల బతుకమ్మతో పరిసమాప్తమవుతాయని అన్నారు. -
'అల్లిపూల వెన్నెల' బతుకమ్మ సాంగ్ వచ్చేసింది..
Allipoola Vennela Bathukamma Song: తెలంగాణ ఆడపడుచులు ఏడాదంతా ఎదురుచూసే పండుగ 'బతుకమ్మ'. పూలనే దైవంగా కొలిచే ఈ పండుగ ఒకప్పుడు పల్లెల్లో మాత్రమే కనిపించేది. కానీ ఈ వేడుకలు ఇప్పుడు పట్టణాల్లోనే కాదు విదేశాలకు సైతం పాకింది. తొమ్మిదిరోజుల పాటు జరుపుకునే ఈపండగ కోసం ఏయేటికాయేడు కొత్తకొత్త పాటలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఈ ఏడాది బతుకమ్మ సంబరాల్లో భాగంగా తెలంగాణ జాగృతి రూపొందించిన బతుకమ్మ పాట ‘అల్లిపూల వెన్నెల’ పాటను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్లోని తన నివాసంలో దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్తో కలిసి రిలీజ్ చేసింది. ఐదు నిమిషాల నిడివి ఉన్న ఈ బతుకమ్మ పాటకు ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వం వహించిన ఈ పాటకు మిట్టపల్లి సురేందర్ లిరిక్స్ అందించారు. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఈ బతుకమ్మ పాట చిత్రీకరణ జరగడం విశేషం. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు! A festival of life. A celebration of togetherness. Bringing you a glimpse of the beauty of Bathukamma through "#AllipoolaVennela" along with Telangana Jagruthihttps://t.co/rJarGvmwGs — A.R.Rahman #99Songs 😷 (@arrahman) October 5, 2021 -
‘క్షమాపణ చెప్పినా హైపర్ ఆదిని వదలం.. బుద్ధి చెప్తాం’
సాక్షి, హైదరాబాద్: ఓ టీవీలో ప్రసారమైన షోలో జబర్దస్త్ నటుడు హైపర్ ఆది తెలంగాణ సంస్కృతిపై చేసిన అనుచిత వ్యాఖ్యల వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. తాజాగా హైపర్ ఆది ఆ వ్యాఖ్యలకు క్షమాపణ తెలిపారు. అయితే ఆయన క్షమాపణలు చెప్పినా కూడా తాము వదిలేది లేదని తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఆది క్షమాపణలు చెప్పిన అనంతరం ఆ సంస్థ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నవీన్ గౌడ్ స్పందించారు. హైపర్ ఆదిని బాధపెట్టడం.. క్షమాపణ చెప్పడం సరైన విధానం కాదు అని తెలిపారు. సంస్కృతిని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ తాము ఆరోపణలు చేస్తున్నట్లు హైపర్ ఆది అనడం సిగ్గుచేటు అని నవీన్ గౌడ్ తెలిపారు. ఇప్పటికీ కూడా పశ్చాత్తాప పడకుండా కేవలం తప్పించుకునే ధోరణిలో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం ఈ వ్యాఖ్యలను గమనిస్తున్నారని చెప్పారు. సరైన సమయంలో సరైన రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఎక్కడ కూడా మేము తగ్గేది లేదని.. కచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఏదో అతని పర్సనల్ పేజీలో వీడియో పెట్టుకొని చేతులు దులుపుకునే ధోరణి సహించేది లేదు అని పేర్కొన్నారు. చదవండి: తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన హైపర్ ఆది చదవండి: నేను తెలంగాణ సంస్కృతిని కించపరచలేదు: హైపర్ ఆది -
తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన హైపర్ ఆది
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ, గౌరమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జబర్దస్త్ నటుడు హైపర్ ఆది క్షమాపణలు చెప్పాడు. ఆంధ్ర, తెలంగాణ అనే భేదాభిప్రాయాలు తమ షోలో ఎప్పుడు ఉండవు... అందరం కలిసికట్టుగా పని చేసుకుంటూ ఉంటామని వివరణ ఇచ్చారు. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోలో చేసిన స్కిట్పై తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని ఎల్బీనగర్లో కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం దీనిపై ఫోన్కాల్లో ఆ ప్రతినిధులకు వివరణ ఇచ్చారు. అయితే బేషరతుగా క్షమాపణలు చెప్పేదాక తాము వదిలిపెట్టమని.. కావాల్సి వస్తే న్యాయపరంగా వెళ్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే హైపర్ ఆది క్షమాపణలు చెబుతూ రాత్రి వీడియో విడుదల చేశారు. ఆ షోలో చేసిన స్కిట్పై కొన్ని ఆరోపణలు వచ్చాయి.. అవి తాము కావాలని చేసినవి కావు అని హైపర్ ఆది తెలిపారు. అన్ని ప్రాంతాల వారి ప్రేమ, అభిమానంతోనే తాము వారికి వినోదం పంచుతున్నట్లు చెప్పారు. ఇటీవల షోలో జరిగిన దానికి అందరి తరఫున క్షమాపణ కోరుతున్నట్లు ప్రకటించాడు. చదవండి: హైపర్ ఆదిపై పోలీసులకు ఫిర్యాదు చదవండి: నేను తెలంగాణ సంస్కృతిని కించపరచలేదు: హైపర్ ఆది -
విలేజ్ లెర్నింగ్ సర్కిళ్లకు కంప్యూటర్లు
సాక్షి, హైదరాబాద్: కరోనా సంక్షోభంలోనూ రాష్ట్రం లోని గిరిజన, దళిత, పేద విద్యార్థులు ఆన్లైన్లో తమ చదువును కొనసాగించేందుకు మాజీ ఎంపీ కవిత అండగా నిలిచారు. తెలంగాణ గురుకుల విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులతో ఏర్పడిన ‘విలేజ్ లెర్నింగ్ సర్కిల్స్’కు తెలంగాణ జాగృతి ద్వారా శనివారం 50 కంప్యూటర్లు, 500 కుర్చీలు విరాళమిచ్చారు. పేద విద్యార్థులు కంప్యూటర్లు, ట్యాబ్లు కొనుగోలు చేసే పరిస్థితి లేక చదువుకు దూరం కావద్దన్న ఉద్దేశంతోనే విలేజ్ లెర్నింగ్ సర్కిళ్లకు కంప్యూటర్లు అందజేసినట్లు కవిత వెల్లడించారు. తెలంగాణ జాగృతి ద్వారా భవిష్యత్తులోనూ పేద విద్యార్థులకు సహకారం అందిస్తామని ప్రకటించారు. మాజీ ఎంపీ కవిత సహకారాన్ని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి ప్రవీణ్కుమార్ అభినందించారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షుడు మేడే విద్యాసాగర్ పాల్గొన్నారు. -
మహిళా లేఖనం
అందం, సంబరం, పువ్వులు, ప్రకృతి, పర్యావరణం, జలవనరులు ఇవన్నీ బతుకమ్మ పండుగలో భాగమని తెలుసు. అయితే ఈ మహిళా కళాకారులు వాటితో పాటు అసమానతలు, లింగ వివక్ష, ఆధ్యాత్మిక ఉత్తేజం.. ఇలా ఎన్నో అంశాలను బతుకమ్మ కోణం నుంచి స్పృశించారు. అందుకే పండుగ వెళ్లిపోయినా.. వారు గీసిన వర్ణాలన్నీ నేటికీ బతుకు ఉత్సవాన్ని ప్రతిఫలిస్తూనే ఉన్నాయి. – ఓ మధు, సాక్షి, సిటీ బ్యూరో బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా ‘తెలంగాణ జాగృతి’ ఆధ్వర్యంలో హైద్రాబాద్ నెహ్రూ గ్యాలరీలో మూడు రోజుల పాటు జరిగిన బతుకమ్మ ఆర్ట్ క్యాంప్లో 20–82 ఏళ్ల మధ్య వయసున్న యాభై మంది మహిళా ఆర్టిస్టులు ఒకే వేదిక మీద అక్కడికక్కడ చిత్రాలు గీశారు. తెలంగాణలో ఇంత పెద్దఎత్తున బతుకమ్మపై ‘ఆర్ట్క్యాంప్’ జరగడం ఇదే తొలిసారి. తెలంగాణ జాగృతి, తెలంగాణ ఆర్టిస్ట్ ఫోరం సహకారాలతో జరిగిన ఈ ఆర్ట్ క్యాంపును ప్రముఖ చిత్రకారులు రమణారెడ్డి సమన్వయం చేయగా, అనిత క్యూరేటర్గా వ్యవహరించారు. విశేషం ఏమిటంటే.. ఈ క్యాంప్లో చిత్రకారిణుల కుంచె నుంచి రూపుదిద్దుకున్న బతుకమ్మ చిత్రాలు చూడముచ్చటగా ఉండటమే కాదు, ఆలోచనలకు పదును పెట్టేలా ఉన్నాయి. బతుకమ్మ ప్రకృతి పండుగ. చిన్నప్పుడు రకరకాల పువ్వులు తీసుకువచ్చి రంగులు అద్ది తొమ్మిది రోజుల బతుకమ్మను తయారు చేసే వాళ్లం. ప్రకృతితో ఈ విధమైన బంధాన్ని పిల్లలు మిస్ కాకూడదు. ఇలాంటి ఆర్ట్ క్యాంప్ వల్ల కళతోపాటు సంప్రదాయాన్ని గురించిన అవగాహన, పండుగ పట్ల అభిరుచి మరింత పెరుగుతాయని అంటారు పద్మారెడ్డి. ఆమెతోపాటు, ఆర్ట్క్యాంప్లో పాల్గొన్న మిగతా కళాకారిణులు తమ మనోభావాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. సమానత్వం కోసం నాటి భూస్వాముల ఆగడాలు భరించలేక ఆత్మహత్య చేసుకున్న స్త్రీలను గుర్తు చేసుకుంటూ, మిగిలిన ఆడవాళ్లు పూలను పేర్చి ‘బతుకు అమ్మా..’ అంటూ తమ సానుభూతిని వ్యక్తం చెయ్యడంతో బతుకమ్మ ఉత్సవం మొదలయ్యిందన్న ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. స్త్రీ, పురుషులిద్దరూ సమానమే అని చెప్తున్నా స్త్రీలకు పరిస్థితులింకా దుర్భరంగానే ఉన్నాయి. అందుకే నా చిత్రంలో స్త్రీ, పురుష చిహ్నాలను తీసుకుని స్త్రీ చిహ్నాన్ని హైలైట్ చేశాను. అసమానత్వానికి గుర్తుగా స్త్రీ చిహ్నానికి పూర్తి ఎరుపు రంగుని వెయ్యలేదు. ఆ చిహ్నంలోనే బతుకమ్మను చూపించాను. ఇక చిత్రంలో ఆదిశక్తి ఆయుధాలు కూడా చూడవచ్చు. రాక్షసులను చంపలేమని దేవుళ్లే వెనక్కి తగ్గినప్పుడు, ఆదిశక్తి దుష్ట సంహారం చేసింది. – రజని, బిఎఫ్ఏ, థర్డ్ ఇయర్ గౌరమ్మ కోసం బతుకమ్మ స్త్రీల పండుగ. అందుకే లేస్, బట్టలు, పువ్వులతో ఈ పెయింటింగ్ వేశాను. దీంట్లో తొమ్మిది మంది స్త్రీల ముఖాలు, తొమ్మిది రోజుల బతుకమ్మను ప్రతిబింబిస్తాయి. మధ్యలో బతుకమ్మ సమయంలో పూజించే గౌరమ్మను పెట్టాను. – రూపారాణి ఉపాసన కోసం మనలో ఉన్న కుండలి శక్తిని ప్రతిబింబించేలా నా చిత్రంలో చక్రాలు వేశాను. శక్తికి ప్రతిరూపాలు మనుషులు. శక్తి ఉపాసన ద్వారా కుండలిని శక్తి మరింత జాగృతమవుతుంది. తొమ్మిది రోజులు బతుకమ్మ చేసే వారు కొత్త ఉత్సాహంతో ఉండటాన్ని గమనించవచ్చు. ఏడాదిలో ఒకసారైనా ఇలాంటి ఆరాధన చేస్తే ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకోవచ్చు. ఇదే ఈ చిత్రం ద్వారా చెప్పాను – సౌజన్య కష్టసుఖాల కోసం భావోద్వేగాలు ఏమీ ముఖంలో కనిపించని; సంతోషం, బాధను కలిపి సెలబ్రేట్ చేసుకుంటున్న నేటి స్త్రీని పసుపు, కుంకుమ రంగులతో నా చిత్రంలో చూపించాను. – వేకువ, ఎంఎఫ్ఏ, స్టూడెంట్ కలవడం కోసం ఆంధ్రాకి దగ్గరగా ఉండే భద్రాచలం ప్రాంతం వాళ్లకి బతుకమ్మ అంటే ఏందో తెల్వదు. నేను ఇప్పటి వరకు ఆడలేదు కూడా. టీవీల్లోనే మొదటిసారి చూసిన. అందుకే నా పెయింటింగ్లో టీవీ పెట్టాను. అది పండుగో లేక సంతోషంగా ఆడుకునే ఆటో అప్పుడు నాకు తెలియదు. ఈ క్యాంప్లో ఇంతమంది సీనియర్ కళాకారిణిలతో కలిసి బతుకమ్మ చిత్రాలు వెయ్యటం హ్యాపీగా ఉండటమే కాదు, బతుకమ్మ ఆడినట్లే అనిపిస్తుంది. – సమ్మక్క, ఎంఎఫ్ఏ స్టూడెంట్ ఆసిడ్ బాధితుల కోసం నా బిఎఫ్ఏ 2010లో పూర్తయింది. పీడిత మహిళకు సంబంధించిన అంశాలపై ఆర్ట్ వర్క్ చేస్తుంటాను. ముఖ్యంగా ఆసిడ్ విక్టిమ్స్ మీద పనిచేస్తాను. ‘అందం ఆత్మకు సంబంధించింది’ అనే ఆలోచనతో చిత్రాలు రూపొందిస్తుంటాను. బాధితులైన స్త్రీలనే నేపథ్యంగా తీసుకున్నాను. వారిని అందరితో సమానంగా పండుగలో భాగం చెయ్యాలని, వివక్షలేని వాతావరణం వారికి కల్పించాలని నా చిత్రం ద్వారా చూపించే ప్రయత్నం చేశాను. – వినీల నీటి కోసం సిటీ మ్యాప్లో నీటి చారలను, నీటి ప్రాంతాలను, అందులో తేలుతున్న బతుకమ్మలను చిత్రంగా మలిచారు సీనియర్ ఆర్టిస్ట్ పద్మారెడ్డి. ‘‘నగరంలో మరింత నీరు ఉంటే, నీలిరంగు మరింతగా వాడే దాన్ని’’ అని నవ్వుతూ అంటారు సీనియర్ ఆర్టిస్ట్. – పద్మారెడ్డి -
సాంస్కృతిక ఆయుధంగా బతుకమ్మ: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : ప్రకృతితో ముడిపడిన బతుకమ్మ పండుగను స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో సాంస్కృతిక ఆయుధంగా, విడదీయలేని ఉద్యమరూపంగా మార్చిన ఘనత తెలంగాణ జాగృతికే దక్కుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తి చేయడంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కృషిని కొనియాడుతూ జాగృతి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ట్విట్టర్లో బుధవారం కేటీఆర్ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులు ట్యాంక్బండ్పై బతుకమ్మను నిషేధించిన సందర్భంలో హైకోర్టుకు వెళ్లి మరీ తెలంగాణ జాగృతి అనుమతి సాధించి వేడుకలు నిర్వహించిందని గుర్తు చేశారు. తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను దశాబ్ద కాలంగా జాగృతి ప్రజల్లోకి తీసుకెళ్లిన విధానం అద్భుతమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. మలిదశ ఉద్యమంలో మహిళలను భాగస్వాములుగా చేసింది తెలంగాణ జాగృతేనని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మెచ్చుకున్నారు. -
తన నివాసంలో బతుకమ్మ ఆడిన కవిత
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవిత తన నివాసంలో బతుకమ్మ ఆడారు. తన ఇంటి ఆవరణలో బతుకమ్మకు పూజలు చేసిన ఆమె...అనంతరం ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’ అంటూ ఆడారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోను ఆమె తన ట్విటర్లో షేర్ చేశారు. కాగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎంగిలి పూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు 300కి పైగా ప్రాంతాల్లో బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. బతుకమ్మ సంబురాలపై నిన్న సమీక్ష నిర్వహించిన ఆమె...ముంబైతో పాటు అమెరికా, యూకే, యూరప్, ఆస్ట్రేలియా, ఖతార్, ఒమాన్లతో పాటు 12 దేశాల్లో బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తామని వెల్లడించారు. కాగా తెలంగాణకే ప్రత్యేకమైన పూలపండుగ వైభవంగా మొదలైంది. తొమ్మిది రోజులపాటు సాగే.. బతుకమ్మ సంబురం ఎంగిలిపూలతో శనివారం ప్రారంభమైంది. -
‘జాగృతి’ బతుకమ్మ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: ప్రకృతి పూల పండుగ బతుకమ్మను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎంగిలి పూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు 300కి పైగా ప్రాంతాల్లో బతుకమ్మ వేడుకలు నిర్వ హించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించే బతుకమ్మ సంబురాలపై శనివారం ఆయా జిల్లా బాధ్యులతో సమీక్ష నిర్వహించారు. ముంబైతో పాటు అమెరికా, యూకే, యూరప్, ఆస్ట్రేలియా, ఖతార్, ఒమాన్లతో పాటు 12 దేశాల్లో బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తామని వెల్లడించారు. జాగృతి బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 30న రవీంద్రభారతిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు 316 మంది కవయిత్రుల కవితా పఠనం ఉంటుందన్నారు. అక్టోబర్ 2 నుంచి 4వ తేదీ వరకు వరుసగా మూడు రోజుల పాటు హైదరాబాద్లోని జేఎన్యూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో 50 మంది మహిళా ఆర్టిస్టులతో ఆర్ట్ వర్క్ షాప్ ఏర్పాటు చేశామని తెలిపారు. బతుకమ్మ పండుగ సందర్భంగా తెలుగు సాహితీ రంగంలో అతిపెద్ద కవయిత్రుల కవితా సంకలనం ‘పూల సింగిడి’ని వెలువరిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాల వారీగా బతుకమ్మ సంబురాలు నిర్వహించే పట్టణాలు, మండల కేంద్రాల జాబితాను కవిత ఈ సందర్భంగా విడుదల చేశారు. -
28 నుంచి ‘జాగృతి’ బతుకమ్మ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రపంచం నలుమూలలా పూల జాతర అనే నినాదంతో ప్రతీ ఏటా నిర్వహిస్తున్న బతుకమ్మ సంబురాలను ఈ నెల 28 నుంచి అక్టోబర్ ఆరో తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో ‘బతుకమ్మ సంబురాలు’పోస్టర్ను కవిత ఆవిష్కరించారు. క్షేత్ర స్థాయిలో బతుకమ్మ సంబురాలతో పాటు ఈ ఏడాది 300 మంది కవయిత్రులతో ‘మహాకవి సమ్మేళనం’నిర్వహణతో పాటు, ఆర్ట్ వర్క్షాపు, ఇతర కార్యక్రమాల నిర్వహణకు తెలంగాణ జాగృతి ప్రణాళిక సిద్ధం చేసింది. హైదరాబాద్, ముంబైతో పాటు పలు దేశాల్లో తెలంగాణ జాగృతి శాఖలు బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తాయని కవిత వెల్లడించారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూకే, కువైట్ తదితర దేశాల్లో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉత్సవాలు నిర్వహించేందుకు తెలంగాణ జాగృతి సన్నాహాలు చేస్తోంది. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నాయకులు డాక్టర్ ప్రీతిరెడ్డి, మంచాల వరలక్ష్మి, నవీన్ ఆచారి, రాజీవ్ సాగర్, కొరబోయిన విజయ్, విక్రాంత్రెడ్డితో పాటు వివిధ జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు. -
అవయవదానంతో మరొకరికి ప్రాణం!
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ పుట్టిన రోజున తెలంగాణ జాగృతి మరో బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏడాదిలో 50 వేల మందితో అవయవదాన ప్రతిజ్ఞలు చేయించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆదివారం నెక్లెస్రోడ్లోని పీపుల్స్ప్లాజాలో జరిగిన అవయవదాన ప్రతిజ్ఞ సదస్సులో ప్రకటించింది. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ తొలి సంతకాలు చేసి తమ అవయవాలను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీతో నిరుపేదలకు ఉచిత వైద్యం అందజేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇటీవలే అవయవదానాన్ని కూడా అందులో చేర్చిందని చెప్పారు. అవయవదానంలో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో ఉందన్నారు. సమాజం, తోటి మనుషుల ప్రాణాలపై తెలంగాణ వాసులకుండే గౌరవం, కరుణలను మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఏడాదిలో 50 వేల అవయవదాన ప్రతిజ్ఞల కోసం తెలంగాణ జాగృతి నడుం బిగించిందని తెలిపారు. విస్తృత ప్రచారం అవసరం.. అవయవదానం గురించి ఎవరికీ అవగాహన లేని సమయంలోనే నగరంలో గ్లోబల్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మొట్టమొదటి అవయవదాన మార్పిడి శస్త్ర చికిత్స చేసి నూతన ఒరవడిని సృష్టించారని కవిత చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ దేశంలోనే అవయవ దానంలో మొదటి స్థానంలో ఉండటం గర్వంగా ఉందన్నారు. అవయవదానంపై ఉన్న అపోహలను తొలగిస్తూ.. చనిపోయిన తర్వాత కూడా చిరంజీవులుగా ఎలా బతకవచ్చన్న అంశాన్ని సాధారణ జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని జాగృతి బృందాలకు కవిత సూచించింది. పేదవారిలో అవయవ మార్పిడి శస్త్రచికిత్సను ప్రోత్సహించేందుకు నిమ్స్ వంటి ఆరోగ్య సంస్థల్లో అవయవదానం, అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చడం జరిగిందని వివరించారు. అంతేగాకుండా అవయవ మార్పిడి తర్వాత తలెత్తే సమస్యలకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరించే విధంగా చర్యలు తీసుకుంటోందన్నారు. ఇప్పటివరకు నిమ్స్లో చేసిన అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతమయ్యాయని, అందుకోసం కృషి చేసిన డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. జీవన్దాన్తో ఒప్పందం.. అవయవదానంపై ప్రభుత్వ నిమ్స్ సంస్థ ఏర్పాటు చేసిన జీవన్దాన్ (అవయవదాన కేంద్రం)కు తెలంగాణ జాగృతికి మధ్య కుది రిన ఒప్పంద పత్రాలపై ఎంపీ కవిత, జీవన్దాన్ చైర్మన్ రమేశ్రెడ్డిలు సంతకం చేశారు. కార్యక్రమంలో 800 మందికిపైగా అవయవదానానికి అంగీకరిస్తూ సంతకాలు చేశారు. ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్యాదవ్, ముఠా గోపాల్, క్రాంతికిరణ్, ఎమ్మెల్సీ జనార్దన్రెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, సీనియర్ జర్నలిస్టు కట్టా శేఖర్రెడ్డిలతో పాటు పలు స్వచ్ఛంద, యువజన, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొని ప్రతిజ్ఞను చేశారు. అంతకుముందు పుల్వామా దాడిలో మరణించిన జవాన్ల మృ తికి సంతాపసూచకంగా మౌనం పాటించారు. సమావేశం ముగింపులో స్కౌట్స్ అండ్ గైడ్స్ నిర్వహించిన బ్యాండ్ ఆకట్టుకుంది. ఇది శుభ పరిణామం.. అవయవాల పనితీరు తగ్గిపోయిన పరిస్థితుల్లో అవయవ మార్పిడియే చివరి అవకాశం. జీవన్దాన్ ద్వారా 2012 నుంచి ప్రారంభమైన అవయదానాలు అంచెలంచెలుగా పెరుగుతూ వస్తున్నాయి. 2015లో బ్రెయిన్డెడ్ ద్వారా 104 డొనేషన్లు రాగా 2017లో ఈ సంఖ్య 150కి పెరిగింది. 2018లో 164 వరకు పెరిగి అత్యధిక స్థానంలో ఉన్న తమిళనాడు కంటే ముందుకు వెళ్ళాం. రాష్ట్రవ్యాప్తంగా అవయవదానంపై అవగాహన సదస్సులు విస్తృతంగా చేపట్టడం శుభపరిణామం. డాక్టర్ మనోహర్, నిమ్స్ డైరెక్టర్ ప్రభుత్వ సాయం అందితే మరింత సక్సెస్ 1989లోనే అవయవదానం చేస్తానని సంతకం చేశాను. అవయవదానం ద్వారా 8 మందికి ప్రాణం పొసిన వాళ్ళమవుతాం. ఇప్పుడున్న నూతన సాంకేతికతతో బోన్, కార్టిలేజ్, స్కిన్ అన్నీ ఉపయోగపడుతాయి. రాష్ట్ర ప్రభుత్వం జీవన్దాన్ కార్యక్రమం ప్రారంభించాక అవయవదానంపై అవగాహన పెరిగింది. అవయవదానం చేసిన కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఏదైనా సాయం అందేలా చేస్తే కార్యక్రమం మరింత విజయవంతమవుతుంది. డాక్టర్ కె.రవీంద్రనాథ్, చైర్మన్, గ్లెనిగల్స్ గ్లోబల్ హాస్పిటల్స్ అవగాహన పెంచాల్సిన అవసరముంది.. దేశంలో అవయవదానంపై అవగాహన చాలా తక్కువ. స్పెయిన్లో 20 లక్షల మందికి 70 మంది అవయవదానం చేస్తే, అమెరికాలో ఆ సంఖ్య 40గా ఉంటే మనదేశంలో 20 లక్షల మందికి ఒక్కరు మాత్రమే అవయవదానం చేస్తున్నారు. అవయవదానంపై 80 శాతం మందిలో అవగాహన లేదు. మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డాక్టర్ గురువారెడ్డి, సన్ షైన్ హాస్పిటల్స్ చైర్మన్ -
యువ జాగృతి
-
బబతా, పూర్ణలకు యూత్ అచీవర్ అవార్డులు
-
బబతా, పూర్ణలకు యూత్ అచీవర్ అవార్డులు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హెచ్ఐసీసీలో జరిగిన తెలంగాణ జాగృతి అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సు ముగిసింది. ముగింపు కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరయ్యారు. గవర్నర్ చేతుల మీదుగా యూత్ అచీవర్ అవార్డులను రెజ్లర్ బబితా ఫొగట్ , మాలావత్ పూర్ణ, లైఫ్ టైం అవార్డును వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ అందుకున్నారు. వసుదైక కుటుంబం అనేది మన మార్గం కావాలని గవర్నర్ నరసింహన్ అన్నారు. జాగృతి అంటే చైతన్యమని... ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు అభినందనలు తెలిపారు. రెండు రోజుల పాటు జరిగిన సమ్మిట్కు 110 దేశాల నుంచి 550 మంది ప్రతినిధులు, 40 మంది వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెలగోపిచంద్, మలావత్ పూర్ణ, రెజ్లర్ బబితా పోగట్ హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా యువత ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలపై వక్తలు చర్చించారు. రెండేళ్లకొకసారి ఇంటర్నేషన్ సమ్మిట్ ఏర్పాటు చేసి యువత ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి పరిష్కరించేలా ముందడుగు వేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. -
యువ దీప్తి.. మహాత్మ స్ఫూర్తి
-
యువతను విస్మరిస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: ‘మన దేశం యంగ్ ఇండియా అని గర్వంగా చెప్పుకుంటున్నప్పటికీ.. భారత్లో యువత సమస్యలను అర్థం చేసుకోవడంలో ఎంపీ లు, విధాన రూపకర్తలు విఫలమయ్యారు. ఈ పరిస్థి తి మారి యువత రాజకీయాల్లో మరింత చురుగ్గా పాల్గొనాల్సిన సమయం ఆసన్నమైంది’ అని తెలం గాణ జాగృతి అంతర్జాతీయ యువ సదస్సు (టీజేఐ వైసీ)లో వక్తలు అభిప్రాయపడ్డారు. హైటెక్సిటీ నోవాటెల్ హోటల్లో శనివారం ‘వాక్ ద టాక్ ఆన్ యూత్ డెవలప్మెంట్’ పేరుతో జరిగిన చర్చాగోష్టిలో.. నిజామాబాద్ ఎంపీ, జాగృతి అధ్యక్షురాలు కవిత (టీఆర్ఎస్), హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం), అసోం ఎంపీ గౌరవ్ గొగోయ్లతోపాటు బ్రిటన్లోని లేబర్ పార్టీ ఎంపీ సీమా మల్హోత్రా పాల్గొన్నారు. భారత్లో మధ్యవయస్కు లు, అంతకన్నా పెద్ద వయసున్న వారే ఎక్కువ సంఖ్యలో పార్లమెంటుకు ఎంపికవుతున్నందునే.. యువత సమస్యలను అర్థం చేసుకోవడం లేదని సీని యర్ జర్నలిస్టు శేఖర్ గుప్తా అన్నారు. దీన్ని ఒవైసీ సమర్థిస్తూ.. పార్లమెంటులో ఎంపీల వయసుకు సబంధించిన గణాంకాలను వెల్లడించారు. ప్రస్తుత లోక్సభలో ఎంపీల సగటు వయసు 55ఏళ్లుగా ఉందని.. 40ఏళ్లు, అంతకంటే తక్కువ వయసున్న వారు 13% కంటే తక్కువగా ఉన్నారని ఒవైసీ వివరించారు. నిరుద్యోగ సమస్య పెరిగిపోతుండటం, గత కొన్నేళ్లలోనే ఐటీ రంగంలో లక్షల ఉద్యోగాలు తగ్గిపోవడం వంటివన్నీ దేశ పార్లమెంటరీ వ్యవస్థలో లోపాన్ని ఎత్తిచూపుతున్నాయన్నారు. ఈ పరిస్థితి మారి యువతకు రాజకీయరంగంలో మరిన్ని అవకాశాలు కల్పించాలని ఒవైసీ ఆకాంక్షించారు. బ్రిటన్ ఎంపీ సీమా మల్హోత్రా మాట్లాడుతూ.. యూకేలో యువత సమస్యలు భారత్తో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటాయని వ్యాఖ్యానించారు. మానసిక సమస్యలు, ఆత్మహత్యలపై అక్కడ జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందని.. ప్రభుత్వాలు కూడా ఈ అంశాలపై దృష్టిపెట్టి పరిష్కారిస్తున్నాయని వివరించారు. దేశమంతా ఒక్కటేనని గుర్తిస్తే.. జనాభా నియంత్రణ పథకాలు సమర్థవంతంగా అమలుచేసిన దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర నిధుల్లో వాటా తక్కువగా ఉండటంపై కవిత మాట్లాడారు. ఈ విషయంలో దేశమంతా ఒక్కటేనని అందరూ గుర్తించాలని.. రాష్ట్రాలకు కేంద్ర నిధుల పంపిణీ విధానంలో మార్పులు చేయడం ద్వారా ఈ సమస్య ను అధిగమించవచ్చని ఆమె పేర్కొన్నారు. పేదరి కం, ఉపాధి కల్పన వంటి చాలా అంశాలు అన్ని రాష్ట్రాల్లోనూ దాదాపు ఒకే తీరుగా ఉంటాయని.. ఈ అంశాలకు సంబంధించి జనాభా ప్రాతిపదికన నిధు ల పంపిణీ చేయడం తప్పేమీ కాదన్నారు. అయితే.. మిగిలిన అంశాల్లో మెరుగైన పనితీరు కనబరిచే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించారు. యువతను రాజకీయాల్లోకి ప్రోత్సహించేందుకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరంపైనా చర్చ జరగాలని ఆమె పేర్కొన్నారు. అసోం ఎంపీ గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ.. దేశంలో ఆర్థిక సరళీకరణలకు పాతికేళ్లు దాటినా.. ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి మాత్రం రెండు దశాబ్దాలు వెనుకబడే ఉందన్నారు. ఇందుకు కారణాలేమైనా.. దీని ప్రభావం మాత్రం యువతపై స్పష్టంగా కనబడుతోందన్నారు. తండ్రు లు రాజకీయాల్లో ఉండటం తమకు కొంతవరకు కలి సొచ్చినా.. దీర్ఘకాలం ఈ రంగంలో కొనసాగేందుకు మాత్రం కష్టపడాల్సిందేనని గౌరవ్, అసదుద్దీన్, కవిత స్పష్టం చేశారు. కశ్మీర్ భారత్లో అంతర్భాగమే: ఒవైసీ ఎవరెన్ని చెప్పినా కశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని ఒవైసీ పేర్కొన్నారు. కశ్మీర్ ప్రజలు, యువకులు భారతీయులే అనడంలో సందేహించాల్సిన అవసరం లేదన్నారు. అయితే.. కశ్మీర్ సమస్య పరిష్కరించేందుకు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు చిత్తశుద్ధితో పనిచేయడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ‘కశ్మీర్ లోయలో సాధారణ పరిస్థితులు నెలకొనాలంటూ అందరూ ప్రకటనలు చేస్తారు. తీరా పరిస్థితులు చక్కబడగానే కశ్మీర్లో చేయాల్సిన అభివృద్ధిని మరిచి పోతున్నారు’అంటూ కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు చేశారు. ఈ వివాదంపై కేంద్రానికి ఓ స్థిరమైన విధానం లేదని.. నాలుగున్నరేళ్లలో కశ్మీరీ పండిట్ల కోసం గానీ.. అక్కడి యువత కోసం గానీ.. మోదీ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఒవైసీ ఆరోపించారు. ప్రభుత్వాలు తమను పట్టించుకోవడం లేదనే అభిప్రాయం అక్కడి యువతలో ఉందన్నారు. అయితే కశ్మీర్ సమస్య సినిమాల్లాగా యుద్ధం చేసి పరిష్కరించేది కాదని.. ఇరువర్గాల్లో ఒకరు రాజనీతిజ్ఞతతో వ్యవహరించాలని అన్నారు. -
యువతతోనే అద్భుతాలు
సాక్షి, హైదరాబాద్: సరైనమార్గనిర్దేశనం ద్వారా యువతతో అద్భుతాలు సృష్టించొచ్చని గాంధేయవాది, పద్మభూషణ్ అన్నా హజారే సూచించారు. ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం, దేశమే మీకుటుంబం అన్న భావనతో యువత పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అలా నమ్మి ఆచరిస్తున్న ఫలితంగానే ఒకప్పుడు కరువు కాటకాలకు నిలయమైన రాలేగావ్ సిద్ధీ ఈ రోజు పచ్చదనంతో కళకళలాడుతోందని చెప్పారు. తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో శనివారం హైదరాబాద్లో ప్రారంభమైన ‘తెలంగాణ జాగృతి అంతర్జాతీయ యువ నేతృత్వ సదస్సు’కు అన్నా హజారే ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సదస్సుకు 110 దేశాల నుంచి 550 మంది యువ ప్రతినిధులు హాజరు కాగా, సుస్థిరాభివృద్ధికి, సృజనాత్మకతలకు గాంధేయ మార్గం అన్న ఇతివృత్తంపై ఈ సదస్సులో చర్చోపచర్చలు ఉంటాయి. సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా హజారే మాట్లాడుతూ.. యువత గ్రామాలకు సేవ చేయడం మొదలుపెడితే మనదేశం అమెరికా, రష్యాలను అధిగమించి ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంటుందన్నారు. ఏదో సాధించాలన్న తపన యువతలో ఉన్నప్పటికీ తగిన మార్గనిర్దేశనం లేకపోవడంతో కొంతమంది పెడదారి పడుతున్నారన్నారు. ఒక లక్ష్యంతో ప్రణాళికబద్ధంగా కృషి చేసి యువత తమ ఆకాంక్షలను నెరవేర్చుకోవాలని పిలుపునిచ్చారు. గాంధీ రచనలతో మార్పు.. యువకుడిగా ఉన్నప్పుడు ఈ జీవితం ఎందుకు? అన్న ప్రశ్న తనకూ వచ్చిందని..పాతికేళ్ల వయసులో ఢిల్లీ రైల్వే స్టేషన్లో గాంధీజీ రచనలతో ఏర్పడిన పరిచయం తన జీవితాన్ని మార్చేసిందని హజారే గుర్తు చేసుకున్నారు. మానవ జీవిత పరమార్థం సేవేనని నిర్ణయించుకుని స్వగ్రామమైన రాలేగావ్సిద్ధీతో కొత్త ప్రస్థానం మొదలుపెట్టానని వివరించారు. తిండికి గతిలేని స్థితి నుంచి రోజుకు 150 ట్రక్కుల కూరగాయలు ఎగుమతి చేసే స్థితికి రాలేగావ్సిద్ధీ చేరుకుందన్నారు. ప్రకృతిని కాపాడుకుంటూనే రాలేగావ్సిద్ధీని అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలని..అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని నాశనం చేయడం తగదని హితవు పలికారు. పెళ్లి విషయంలో తనను అనుకరించాల్సిన అవసరం లేదని అన్నా హజారే చలోక్తి విసిరారు. ‘‘పెళ్లి చేసుకోండి. పిల్లల్ని కనండి. అలాగని అదే మీ కుటుంబం అనుకోవద్ద’’ని చెప్పారు. అభివృద్ధి, అవినీతి రెండు ఒకే నాణేనికి రెండు పార్శా్వలని, అవినీతి అంతానికి తాను చేసిన ఉద్యమం ఫలితంగా సమాచార హక్కు చట్టం వచ్చిందని గుర్తు చేశారు. యువతకు తగిన విధానాలు అవసరం: కవిత యువతకు, సమాజ శ్రేయస్సుకు, సమస్యల పరిష్కారానికి మనదేశంతో పాటుగా ఇతర దేశాల్లోనూ తగిన విధానాలు లేవని ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో పేదరికం, ఆకలి నిర్మూలన, వాతావరణ పరిరక్షణ, స్వచ్ఛమైన గాలి వంటివి అనేకం ఉన్నాయన్నారు. ఈ సమస్యలన్నీ మనుషులుగా మనం సృష్టించినవేనన్నారు. ప్రతీరోజూ 22 వేల మం ది పిల్లలు బాల్యంలోనే తనువు చాలిస్తుండటం, 80 కోట్ల మంది ఆకలితో నిద్రపోతుండటం, గాలి కాలుష్యం తనను ఎంతో కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. యువశక్తి సాయంతో ఈ సమస్యలకు పరిష్కారాలు కనుక్కునేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యువత ఈ సమస్యలను సరి కొత్త దృక్కోణంతో చూడగలదని.. అదే స్థాయి లో పరిష్కారాలు కూడా చూపగలదన్నారు. సుస్థిర అభివృద్ధికి నమూనాగా నిలిచి న రాలేగావ్సిద్ధీని నేటికీ వందలాది మంది సందర్శిస్తున్నారంటే అది అన్నా హజారే కృషి ఫలితమేనన్నా రు. తమ హక్కులను సాధించుకునేందుకు.. సమస్యల పరిష్కారానికి ప్రపంచవ్యాప్తంగా యువత ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ దిశగా వేసిన తొలి అడుగుగా యువ నేతృత్వ సదస్సును పరిగణించాలన్నారు. -
మహాత్ముని దారిలో మహోన్నత ప్రపంచం
దేశంలోనే మొట్టమొదటిసారి.. అదీ తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో యు.ఎన్. ఉమన్, యు.ఎన్. గ్లోబల్ కాంపాక్ట్, తెలంగాణ జాగృతి .. ఈ మూడూ కలిసి ‘యూత్ లీడర్షిప్ కాన్ఫరెన్స్’ నిర్వహించబోతున్నాయి. సందర్భంగా ‘తెలంగాణ జాగృతి’ వ్యవస్థాపకురాలు, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవితతో సాక్షి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. గాంధీమార్గంలో అభివృద్ధి మహాత్మాగాంధీ 150వ వ జయంతి సంవత్సరం ఇది. ‘ది గాంధీ పాత్ టు సస్టేనబుల్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్’ (గాంధీ మార్గం నుంచి అభివృద్ధి నిరంతరత, వినూత్నతల వైపు) పేరుతో జనవరి 19, 20 తేదీల్లో హైదరాబాద్లో జరిగే సదస్సులో పాల్గొనడం కోసం 135 దేశాలలోని గాంధేయ అభివృద్ధి వాదులైన రెండు వేల మందికి పైగా యువతీ యువకులు సదస్సుకు హాజరవుతున్నారు. వివిధ అంశాలలో కృషి చేస్తున్న, ప్రపంచ అభివృద్ధిలో తమ పాత్ర ఉండాలనుకుంటున్న వారే వాళ్లంతా. ఇప్పుడు మన దేశం ఉన్న స్థాయి నుంచి ఇంకా పైకెదిగేలా యువతను భాగస్వాములను చేయడం ఈ సదస్సు ఉద్దేశాలలో ఒకటి కాగా, ఇంకొకటి.. అభివృద్ధిని అడ్డుకునే ధోరణులను నిరోధించడమెలాగో యువతకు అవగాహన కల్పించడం. దాని కోసమే ‘యు.ఎన్. ఉమన్’, ‘యు.ఎన్. గ్లోబల్ కాంపాక్ట్’, ‘తెలంగాణ జాగృతి’ కలిసి ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి. సదస్సు కోసం ఈ మూడు సంస్థల్ని సమన్వయం చేస్తున్న కవిత.. ఆ వివరాలను వెల్లడించారు. యువతులకు ప్రాముఖ్యం యూత్ అన్నప్పుడు యువకులు మాత్రమే కాదు, యువతుల్నీ పరిగణనలోకి తీసుకోవాలి. ఎందుకంటే వాళ్లే రేపటి మాతృమూర్తులు. మొత్తం తరానికే మార్గదర్శకులు. ఐక్యరాజ్యసమితి సభ్యదేశాల్లో అభివృద్ధి నిరంతరత లక్ష్యాల కింద ఎంపిక చేసిన పదిహేడు అంశాల్లో ఎందులో సరిగా పని సక్రమంగా జరగకపోయినా ప్రభావం పడేది ముందుగా మహిళలమీదే. అందుకే యువతీయువకులిద్దరూ సమాన స్థాయిలో పనిచేయాలి. వీళ్లంతా హాజరయ్యే ఈ సదస్సులో.. ప్రపంచ దేశాల సమస్యలపై జరుగుతున్న అధ్యయనాలు, ప్రపంచం దృష్టి పెట్టిన దుర్బల పరిస్థితులు, సాగుతున్న పరిశోధనల గురించి ఈ సదస్సులో చర్చిస్తారు. ఇక్కడ అనుభవాలు, పరిష్కారాల మార్పిడి జరుగుతుంది. ప్రయోజనకరమైన సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటాం. మన దగ్గర ప్రారంభమై, విజయవంతమైన స్వయం సహాయక బృందాల నమూనాను ఈ రోజు ఎన్నో దేశాలు స్వీకరించి అమల్లో పెట్టాయి. సత్ఫలితాలను ఇస్తున్న ఆలోచనల్ని షేర్ చేసుకోడానికి ఇలాంటి సదస్సులు తోడ్పడతాయి. సదస్సులో సమాలోచనలు ఇలాంటి సదస్సులో జరిగే చర్చలు యవతలో చైతన్యం కలిగిస్తాయి. ప్రపంచ దేశాల సమస్యలు; సాంఘిక, ఆర్థిక, రాజకీయ, పారిశ్రామిక, పర్యావరణ పరిస్థితులను పరిచయం చేస్తాయి. అందుకు వీలుగా సదస్సులో సమాంతర సమాలోచనల వేదికల్ని ఏర్పాటు చేస్తున్నాం. ఎవరికి ఏ అంశంలో ఆసక్తి ఉంటే వాళ్లు ఆ అంశంలో పాల్గొనవచ్చు. పర్యావరణం, పరిశ్రమలు, ఆరోగ్యం వంటి రంగాలలో జరుగుతున్న పరిణామాలపై ప్రసంగాలు ఉంటాయి. విదేశాల నుంచి ముప్పై మంది వక్తలు, అయిదు వందల మంది అధికార ప్రతినిధులు కాక మన దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి, హైదరాబాద్ నుంచీ సదస్సుకు తమ పేర్లను నమోదు చేసుకున్నవారున్నారు. పదిహేడు అంశాల లక్ష్యం గాంధేయ మార్గంలో ప్రజాస్వామ్య విలువలతో యువతరం యు.ఎన్. నిర్దేశించిన పదిహేడు అంశాల పట్ల శ్రద్ధ చూపిస్తే 2030 కల్లా లక్ష్యాన్ని సాధించడం తేలిక అవుతుంది అనేది సదస్సు ప్రధానాంశం. ఎట్లా సాధించాలి, సాధనలో నా పాత్ర ఎలా ఉండాలి అని యువతకు మర్గాన్ని నిర్దేశించడానికి ఈ సదస్సు ఉపయోగపడ్తుంది. రెండేళ్లకొకసారి ఇలాంటి సదస్సు నిర్వహించాలనే మౌలిక నియమాన్ని కూడా పెట్టుకున్నాం. ఈసారి తెలంగాణ జాగృతి ఈ సదస్సుకు ఆతిథ్యం ఇస్తోంది. మన కోసం మన ‘జాగృతి’ సదస్సుతో నిమిత్తం లేకుండా.. మొదటి నుంచీ మేం చేస్తుందంతా యువత కోసమే. నైపుణ్యాల అభివృద్ధి మీద దృష్టిపెట్టాం. అరవై శాతం పైగా అమ్మాయిలు, నలభై శాతం వరకు అబ్బాయిలకు ఉద్యోగావకాశాల లభ్యతకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో శిక్షణ ఇప్పిస్తున్నాం. ఇప్పటి వరకు పద్దెనిమిది వేల మంది యువతకు శిక్షణ ఇప్పించాం. అందులో దాదాపు పన్నెండు నుంచి పదిహేను వేల మంది యువతకు వరకు ఉద్యోగాలిప్పించాం. వీళ్లలో చాలామంది అమ్మాయిలే. తెలంగాణ అంతటా పదిహేను జాగృతి శిక్షణా కేంద్రాలు ఉన్నాయి. ప్రతి రోజూ శిక్షణా తరగతులు జరుగుతూనే ఉంటాయి. విధానపరమైన నిర్ణయాలను మనం ప్రభావితం చేయాలంటే ఒక రాజకీయపరమైన అధికారం ఉండడం అవసరం. అలా ఉన్నప్పుడే మన రాష్ట్రం కోసం జరిగే అభివృద్ధి విధానాలను నేరుగా రూపొందించగలం. ఆ పాత్రను పోషించగలం. ఒక ఎంపీగా నాది అదొక పాత్ర. రెండోది.. ప్రజాజీవితంలో ప్రత్యక్షంగా యువతపై దృష్టి సారించి వాళ్లకోసం నిరంతరంగా పని చేయాలి. జాగృతి వ్యవస్థాపకురాలిగా అది నా ఇంకో పాత్ర అది. మరో బాధ్యత ‘అక్కా’ ప్రాజెక్ట్ ప్రస్తుతం మన దగ్గర యువతులు ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆరోగ్య సమస్య రక్త హీనత. దాన్ని తీసుకున్నాం. ఏడవ తరగతి నుంచి పదవ తరగతి చదివే ఆడపిల్లల ఆరోగ్యాన్ని పరీక్షించాం. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే ఇరవై ఐదువేల పై చిలుకు యువతులకు ఆరోగ్య పరీక్షలు జరిపించాం. దురదృష్టవశాత్తు డెబ్బై శాతం కంటే ఎక్కువ మందికి రక్తహీనత ఉన్నట్లు తేలింది. వీళ్లు ఆరోగ్యవంతులయ్యే వరకు కనిపెట్టుకుని ఉండడం మా లక్ష్యం. అంటే ఆరోగ్యవంతమైన తల్లి అయ్యేదాకా వాళ్ల ఆరోగ్యం మీద శ్రద్ధ చూపుతాం. ఈ డెబ్బయ్ శాతం మందికి సంబంధించి వివరాలు సేకరించి ప్రతి యేడూ పరీక్షిస్తుంటాం. ‘అక్కా’ అనే పేరుతో మొదలైన ఏడేళ్ల ప్రాజెక్ట్ ఇది. ‘అక్కా’ అనేది ఒక కాన్సెప్ట్. రక్తహీనత ఉన్న ప్రతి పది మంది అమ్మాయిలకూ ఒక ఆరోగ్యవంతురాలైన అమ్మాయిని ఎంపిక చేసి లీడర్గా ఉంచుతాం. ఆ అమ్మాయి క్రమం తప్పకుండా ఆ పదిమందిని పర్యవేక్షిస్తుంటుంది. వాళ్ల ఆహార అలవాట్లను పరిశీలిస్తూ, అవసరమైన సలహాలిస్తూ ఆరోగ్యవంతులయ్యేలా సహకరిస్తుంటుంది. ఒక ఫ్రెండ్లా, ఆత్మబంధువులా వ్యవహరిస్తుందన్నమాట. ఈ ప్రాజెక్ట్ను ‘యు.ఎన్. ఉమన్’ సహకారంతో చేస్తున్నాం. ఇలా ఏ సమస్యను చేపట్టినా అర్థం పరమార్థం ఉంటుంది. అయితే యువతతోనే ప్రధానంగానే పనిచేస్తున్నాం’’ అని వివరించారు కవిత. జాగృతి ఫెలోషిప్ అవార్డ్స్ ఈ ఏడాది నుంచి ‘జాగృతి ఫెలోషిప్ అవార్డు’ ఇవ్వబోతున్నాం. ఫెలోషిప్ ప్రొగ్రాం తీసుకున్న వారిలో తొమ్మిది నుంచి పదిమందిని ఎన్నుకుని వారికి జాగృతి చేపట్టిన పద్దెనిమిది ప్రాజెక్టులను వారికి ప్రత్యక్షంగా చూపిస్తున్నాం. వారిలో ఈసారి తొమ్మిదిమందిని సెలెక్ట్ చేశాం. వాళ్లు గత పది రోజులుగా హైదరాబాద్లోనే ఉండి అన్ని ప్రాజెక్టులకు తిరుగుతున్నారు. వాళ్లకు మళ్లీ శిక్షణ ఇచ్చి, ఫెలోషిప్ అవార్డ్కు ఎంపిక చేస్తున్నాం. అలా నెమ్మదిగా జాతీయ, అంతర్జాతీయ యవనికలోకి ప్రవేశిస్తున్నాం. ఆసక్తి ఉన్న వాళ్లు జాగృతి ఫెలోషిప్కి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్త గుర్తింపు కావాలనుకునే, అభివృద్ధిలో పాలుపంచుకోవాలనే ఆసక్తి ఉండే యువతీయువకులు ఈ సదస్సుకి హాజరుకావచ్చు. – కవిత -
జర్మనీలో ఘనంగా ‘జాగృతి’ బతుకమ్మ వేడుకలు
బెర్లిన్: జర్మనీలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. జర్మనీ రాజధాని బెర్లిన్లో తెలంగాణ జాగృతి జర్మనీ శాఖ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా బతుకమ్మ సంబరాలు జరిగాయి. మహిళలు, పిల్లలు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ఆటపాటలు, కోలాటాలతో ఆ ప్రాంతం అంతా సందడిగా మారింది. తెలంగాణ సంతతికి చెందిన వారే కాకుండా జర్మనీయులు కూడా పాల్గొని, బతుకమ్మను పేర్చి, తెలంగాణ సంస్కృతిని ఆస్వాదించడం కార్యక్రమంలో గొప్ప విషయం. అనంతరం తెలంగాణ వంటకాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జాగృతి సభ్యులు డాక్టర్ స్వర్ణకార చేరుకతోట, ఇంద్రకరణ్ రెడ్డి చరాబ్ది, వెంకటరమన బోయినపల్లి, అనూష కోండూరి, విజయ భాస్కర్ గగల, తదితరులకు తెలంగాణ యూరప్ అధ్యక్షులు దాన్నంనేని సంపత్ కృతజ్ఞతలు తెలిపారు. -
బతుకమ్మ వేడుకలకు తెలంగాణ జాగృతి దూరం
-
రోటరీ క్లబ్తో తెలంగాణ జాగృతి యూకే భాగస్వామ్యం
సాక్షి, లండన్ : తెలంగాణ జాగృతి యూకే విభాగం మరో మైలు రాయిని సాధించింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత కలలను, ఆశయాలను సాకారం చేసేలా కేవలం సాంస్కృతిక, కళా రంగాలలోనే కాకుండా సేవ రంగంలోనూ దూసుకుపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా చారిత్రాత్మక సేవ సంస్థ అయిన రోటరీ క్లబ్తో తెలంగాణ జాగృతి యూకే విభాగం భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈ సందర్బంగా బాసిల్డాన్లో తెలంగాణ జాగృతి యూకే విభాగం, రోటరీ క్లబ్తో పరస్పర సహకారాన్ని కోరుకుంటూ అనుబంధ పత్రాన్ని విడుదల చేశారు. తమ సేవ కార్యక్రమాలను ప్రవాస తెలంగాణ, తెలుగు వారికే కాకుండా బ్రిటన్లో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు విస్తృతం చేయడానికి రోటరీ క్లబ్ సంస్థతో అనుబంధం పత్రం చేసుకున్నామని జాగృతి యూకే అధ్యక్షులు సుమన్ బలమూరి తెలిపారు. రోటరీ క్లబ్ సభ్యుల సహకారం మరువ లేనిదని, మున్ముందు వారి భాగస్వామ్యంతో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తామని సుమన్ పేర్కొన్నారు. జాగృతి కార్యక్రమాలను ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం చేయడం మంచి ఆలోచనని జాగృతి వ్యవస్థావప అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకి రోటరీ క్లబ్ సభ్యులు అభినందనలు తెలిపారు. ఇటీవలే తెలంగాణ జాగృతి యూకే విభాగం యూకే ప్రభుత్వ ఎన్హెచ్ఎస్(నేషనల్ హెల్త్ సర్వీస్)తో భాగస్వామ్యం ఏర్పరచుకున్న విషయం తెలిసిందే. రోటరీ క్లబ్ ముఖ్య బృందంతో పాటు, సుమన్ బలమూరి, ఉపాధ్యక్షుడు వంశీ తులసి, కార్య వర్గ సభ్యులు సలాం యూసఫ్, వంశీ సముద్రాల, వెంకట్ బాలగోని ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
అంజలికి అండ
సాక్షి, హైదరాబాద్: ఏ ఆధారం లేక నిస్సహాయ స్థితిలో రోడ్డునపడి బిచ్చమెత్తుకుంటున్న దివ్యాంగురాలు అంజలికి అండ లభించింది. ఆమె ఉపాధికి, పిల్లల భవితవ్యానికి భరోసా దొరికింది. నగరంలో బిచ్చగాళ్ల దుస్థితి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ రాక నేపథ్యంలో యాచకుల తరలింపు, ఈ క్రమంలో అంజలి దైన్యస్థితి తదితర పరిణామాలపై ‘సాక్షి’దినపత్రిక శుక్రవారం ప్రచురించిన ‘ఇవాంకా రావొద్దు’ప్రత్యేక కథనంతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చలించిపోయారు. అంజలిని అన్ని విధాలా ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఆమె ఇద్దరు కూతుళ్లు సిరి, కీర్తి పేరిట ఒక్కొక్కరికీ రూ.50 వేల చొప్పున బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఎంపీ ఆదేశాల మేరకు తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షుడు రాజీవ్ సాగర్, గ్రేటర్ కన్వీనర్ ప్రశాంత్, రైల్వే పోలీస్ డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తదితరులు శుక్రవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద అంజలిని కలిశారు. అంజలిని పరామర్శించిన ఆమె దయనీయమైన పరిస్థితులను గురించి అడిగి తెలుసుకున్నారు. తనను ఆదుకునేందుకు వచ్చిన జాగృతి నేతలను చూడగానే అంజలి కన్నీరుమున్నీరుగా విలపించింది. తన బాధలను, కష్టాలను వారికి ఏకరువు పెట్టింది. పిల్లలను చదివించేందుకు తాను పడుతున్న ఇబ్బందులను వారికి వివరించింది. కొద్దిరోజుల వరకు బిచ్చమెత్తుకున్న డబ్బులతో పిల్లల్ని పోషించానని, ఇప్పుడు బిచ్చగాళ్ల తరలింపుతో ఆ అవకాశం కూడా లేకుండాపోయిందని తెలియజేసింది. బరువు చూసుకునే మెషీన్ తెచ్చిపెట్టుకున్నప్పటికీ ఎలాంటి ఆదాయం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అంజలి వివరాలన్నీ తెలుసుకున్న రాజీవ్సాగర్ ఇక నుంచి భయపడవద్దని, ఎంపీ కవిత ఆమెకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేస్తారని చెప్పారు. ఎంపీ ఆదేశాల మేరకే తాము అంజలిని కలిసేందుకు వచ్చినట్లు చెప్పారు. ఈ మేరకు రూ.లక్ష చెక్కును కూడా అందజేశారు. త్వరలో ఆ డబ్బును ఆమె ఇద్దరు కూతుళ్లు సిరి, కీర్తి పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేయనున్నట్లు పేర్కొన్నారు. అంజలి ఉపాధికి కిరాణా దుకాణం.. పదో తరగతి వరకు చదువుకున్నప్పటికీ ఎలాంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేని అంజలికి జీడిమెట్లలోని తన నివాసానికి దగ్గర్లో ఆమె కోరుకున్న విధంగా కిరాణా షాపు పెట్టించి ఇవ్వనున్నట్లు రాజీవ్ తెలిపారు. ఎంపీ కవిత చేతుల మీదుగానే ఆ షాపును ఆమెకు అప్పగిస్తామన్నారు. ఆమె ఇద్దరు కూతుళ్లను ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చేర్పించనున్నట్లు తెలిపారు. ఆమెకు ఏ బాధ, ఇబ్బంది కలిగినా తమను ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని ఫోన్ నంబర్లు అందజేశారు. జాగృతి ప్రతినిధులతో పాటు పలువురు ప్రయాణికులు, ఇతరులు అంజలి దీనస్థితి పట్ల చలించిపోయారు. తమకు తోచిన విధంగా ఆర్థిక సహాయం అందజేశారు. కాగా, ‘సాక్షి’వల్లే తనకు ఇంత ఆర్థిక సాయం లభించిందని, సాక్షి రుణాన్ని తాను ఎప్పటికీ తీర్చుకోలేనని ఈ సందర్భంగా అంజలి పేర్కొంది. -
బహ్రెయిన్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
బహ్రెయిన్: తెలంగాణ జాగృతి బహ్రెయిన్ శాఖ ఆధ్వర్యంలో మహా బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ ఆడపడుచుల అతిపెద్ద పండుగగా పేరొందిన బతుకమ్మను కొలుచుకొంటూ వేల సంఖ్యలో మహిళలు, హాజరయ్యారు. ఈసందర్భంగా మహిళలు, పిల్లలు బతుకమ్మ కోలాటం, ఆటపాటలతో అలరించారు. రకరకాల పువ్వులతో పేర్చుకొని తెచ్చిన బతుకమ్మలు అందరిని ఎంతో ఆకర్షించాయి. ఈ సందర్బంగా గల్ఫ్ దేశాల జాగృతి అధ్యక్షులు సిహెచ్. హరిప్రసాద్ మాట్లాడుతూ.. తాము తెలంగాణ సంస్కృతిని ఖండాంతరాల్లో చాటిచెప్పేందుకు ఈ బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి కృషి చేస్తున్న తన కమిటీ సభ్యులందరినీ ఆయన అభినందించారు. ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించడం చాలా గర్వంగా ఉందని అందుకు సహకరించిన సభ్యులకు హరిప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను బహ్రెయిన్లో విస్తరింప చేయడానికి తమవంతు కృషి చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో గల్ఫ్ దేశాల జాగృతి అధ్యక్షులు సిహెచ్. హరిప్రసాద్, బహ్రెయిన్ జాగృతి అధ్యక్షులు బరుకుంట్ల బాబురావు, ఉపాధ్యక్షులు మామిడాల ప్రభాకర్, ప్రధాన కార్యదర్శులు విజయ వర్ధన్, శ్రీనివాస్, సభ్యులు రవి, సుమన్, రాము, విజయసిందె, మహేష్, రాజేష్లు పాల్గొన్నారు. -
బతుకమ్మ విజయవంతానికి సహకారం
-
బతుకమ్మ విజయవంతానికి సహకారం
నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే బతుకమ్మ పండుగ విజయవంతానికి తమ సంస్థ సహకారం అందిస్తుందని, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ నెల 26న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే మహా బతుకమ్మ వేడుకను విజయవంతం చేసేందుకు తెలంగాణ జాగృతి కార్యకర్తలు కృషి చేస్తారని చెప్పారు. మహా బతుకమ్మలో పాల్గొనేందుకు మహిళలు వేలాదిగా తరలిరావాలని కవిత పిలుపునిచ్చారు.ఈ మేరకు ఆమె శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పూలపండుగ పరిమళాలను, విశిష్టతను ప్రపంచానికి తెలియజేసేందుకు తెలంగాణకే పరిమితం అయిన బతుకమ్మ పండుగను ఖండాంతరాలకు వ్యాపింపచేయడంలో తెలంగాణ జాగృతి విశేష కృషి చేసిందన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుండి ప్రభుత్వం బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోందని, తెలంగాణ జాగృతి కూడా ఈ సంబరాల్లో పాలుపంచుకుని విజయవంతం చేస్తోం దన్నారు. సాంస్కృతిక శాఖ ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో నిర్వహించే బతుకమ్మ సంబురాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ జాగృతి కార్యకర్తలు విజయవంతం చేస్తారని వివరించారు. -
జాగృతి రాష్ట్ర కార్యవర్గం ఎంపిక
కమిటీని ప్రకటించిన ఎంపీ కవిత సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జాగృతి యువజన సమాఖ్య పూర్తిస్థాయి రాష్ట్ర కార్యవర్గాన్ని జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత బుధవారం ప్రకటించారు. రాష్ట్ర కార్యదర్శులుగా టి.పూర్ణచందర్రావు, జి.సంతోష్, టి. రోహిత్, ఎన్. సాయికృష్ణ, ఎ.సోనియా, నల్లవెల్లి కపిల్రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా టి.రమేశ్, పీఆర్ఓగా ఎం. వంశీకృష్ణ ఎంపికయ్యారు. ఈ సమాఖ్య రాష్ట్ర కన్వీనర్గా కె. విజయ్ కుమార్, రాష్ట్ర కో–కన్వీనర్లుగా జలంధర్యాదవ్, వంగల శ్రీనివాస్, బక్కతట్ల వెంకట్, ఎజాజ్ హైదర్ ఇప్పటికే బాధ్యతలు వ్యవహరిస్తున్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో యువకులను భాగస్వాములు చేసే విధంగా ఈ సమాఖ్య పని చేయాలని కవిత వారికి సూచించారు. -
ఎంపీ కవితకు నారీ ప్రతిభా పురస్కారం
యువత, మహిళా సాధికారతకు చేస్తున్న కృషికి గుర్తింపుగానే... సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక నారీ ప్రతిభా పురస్కారాన్ని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అందుకున్నారు. యువత, మహిళా సాధికారత కోసం కృషి చేసినందుకుగాను ఆమెను కేంద్ర మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్(ఎంఎస్ఎంఈ) మంత్రిత్వశాఖ, విమెన్ ఎంటర్ప్రెన్యూర్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ పురస్కారానికి ఎంపిక చేశాయి. కవితకు విమెన్ ఎంటర్ప్రెన్యూర్ అసోసియేషన్ ఇండియా చైర్పర్సన్ డాక్టర్ టి.వసంతలక్ష్మి గురువారం హైదరాబాద్లో అవార్డుతోపాటు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి ఆమె హాజరుకాలేకపోవడంతో ఎంఎస్ఎంఈ మంత్రి కల్రాజ్ మిశ్రా ఆదేశాలతో వసంత లక్ష్మి హైదరాబాద్కు వచ్చి ఈ అవార్డును అందజేశారు. మొదటిసారి ప్రవేశపెట్టిన నారీ ప్రతిభా పురస్కార్–2017ను ఎంపీ కవితతోపాటు వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన కల్పకం ఏచూరి, ఆషా ప్రకాశ, స్మృతి నాగపాల్, ప్రియా భార్గవ, షిర్లే అబ్రహం అందుకున్నారు. వీరితోపాటు తెలంగాణ ‘షీ’టీమ్స్ బాధ్యతలు చూస్తున్న ఐపీఎస్ అధికారి స్వాతి లక్రా కూడా అవార్డు అందుకున్నారు. తెలంగాణ జాగృతి ద్వారా మహిళల అభ్యున్నతికి విశేష కృషి చేస్తున్నారని వసంత లక్ష్మి ఎంపీ కవితను ప్రశంసించారు. నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తూ ఉద్యోగ, ఉపాధి కల్పనకు తోడ్పడుతున్నారన్నారు. సమాజాన్ని చైతన్యపరుస్తూనే యువత స్వశక్తితో ఎదిగేలా చేసి సమాజాన్ని చైతన్యపర్చడంలో ఐకాన్గా నిలిచారని కొనియాడారు. కార్యక్రమంలో జాగృతి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ సీఏవో డాక్టర్ జగన్మోహన్రావు, సీఈవో అబ్దుల్ బాసిత్, జాగృతి రాష్ట్ర ప్రధానకార్యదర్శి నవీన్ ఆచారి పాల్గొన్నారు. -
లండన్ లో ఘనంగా తెలంగాణ జాగృతి ఇఫ్తార్ విందు
లండన్: తెలంగాణ జాగృతి యునైటెడ్ కింగ్డమ్ తొలిసారిగా లండన్ లోని ఈస్ట్ హంలో ఘనంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. లండన్ నలుమూలల నుంచి ముస్లిం సోదరులు కుటుంబ సమేతంగా ఇఫ్తార్ విందు లో పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఎంతో నిష్ఠతో ఆచరించే రోజ విరమించే సాయంకాల సమయాన ఇఫ్తార్ విందును జాగృతి సభ్యులతో కలిసి జరుపుకున్నారు. జాగృతి యూకే ముస్లిం మైనారిటీ ఇంచార్జి సలాం యూసఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర నిర్వహాధికారిగా కేంద్రంలో పనిచేస్తున్న శ్రీరామచంద్ర తేజావత్ తన కుటుంబ సమేతంగా హాజరయ్యారు. శ్రీరామచంద్ర తేజావత్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఖండాంతరాలలో కూడా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్బంగా జాగృతి యొక్క ఆవిర్భావం, అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కృషి గురుంచి రామచంద్ర గుర్తు చేశారు. మరో అతిథి, అక్కడి కౌన్సిలర్ పాల్ సథిరిసన్ కూడా పాల్గొని పరమత సహనంతో జాగృతి చేస్తున్న ఈ కార్యక్రమం తనకెంతో నచ్చిందన్నారు. జాగృతి యూకే అధ్యక్షుడు సుమన్ బలమూరి మాట్లాడుతూ.. నూతన కార్యవర్గంతో ఇది రెండో కార్యక్రమమని, ఎంతో విజయవంతంగా టీం యొక్క సమిష్టి కృషితో ముందుకు వెళ్తున్నాం అన్నారు. భవిష్యత్తులో చక్కటి కార్యక్రమాలతో, సంక్షేమ పనులతో పెద్ద ఎత్తున లండన్ తో పాటు ఇతర నగరాల్లో కూడా విస్తరిస్తామని చెప్పారు. మైనార్టీ ఇంచార్జి సలాం యూసఫ్ ముస్లిం సోదరులకు అభివాదం తెలుపుతూ తన ప్రసంగంలో తెలంగాణ అంటే బతుకమ్మ, బోనాలతో పాటు రంజాన్ కూడా విశిష్టమని పేర్కొన్నారు. పవిత్ర మాసంలో చేసే ఈ విందుని జాగృతి తరుఫున ముస్లిం సోదరులతో కలిసి చేసుకోవడం చాలా సంతృప్తిగా తెలంగాణలో ఉన్న భావన కలిగిందన్నారు. ముస్లిం సోదరుల ప్రార్థనలతో, ఆలింగినాలతో అందరు కుటుంబ సమేతంగా సంతోషంగా ఈ వేడుకని జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి యూరప్ అధ్యక్షుడు సంపత్ ధన్నామనేని, జాగృతి యూకే ఉపాధ్యక్షుడు పావని గణేష్, సుష్మ జువ్వాడి, శ్రవణ్ రెడ్డి, కార్యదర్శి సంతోష్ ఆకులతో పాటు ఇతర జాగృతి యూకే కమిటీ సభ్యులు సునీల్ మెహరీర్, సలాం యూసఫ్, వంశీ మునిగంటి, లండన్ గణేష్, రఘు జక్కుల, రమేష్ పాల్తేపు, గణేష్ మల్యాల, వెంకట్ బాలగోని, వంశీ తులసి, వంశీ సముద్రాల, ప్రణీత్ కుమార్ కందుకూరి, లక్ష్మి నర్సింహా రెడ్డి, రాంచందర్ రాపోలు, మానస టేకుమట్ల, విద్య బాలగోని, శ్రావణి బలమూరి, మాధవి రెడ్డి, దీపికా, దీప్తి సముద్రాల, అలీన స్ట్రాట్, రాధికా మునిగంటి తదితరులు పాల్గొన్నారు. -
‘జాగృతి’ కొత్త కార్యవర్గం ఏర్పాటు
అధ్యక్షురాలిగా కొనసాగనున్న కవిత సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జాగృతి రాష్ట్ర కమిటీ సహా అనుబంధ కమిటీలకు కొత్త కార్యవర్గాలు ఏర్పాటయ్యాయి. వివరాలను కమిటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత ఆదివారం ప్రకటించారు. రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలిగా కవిత కొనసాగనున్నారు. ప్రధాన కార్యదర్శిగా రంగు నవీన్ ఆచారి, ఉపాధ్యక్షులుగా రాజీవ్ సాగర్, ఎ. శ్రీధర్, ఎం.వరలక్ష్మి, విజయభాస్కర్, జి. మోహన్రెడ్డి నియమితులయ్యారు. అధికార ప్రతినిధిగా డి.కుమారస్వామి, కోశాధికారి, పీఆర్వోగా కె.సంతోష్కుమార్, రాష్ట్ర కార్యదర్శులుగా టి.తిరుపతిరావు, జవహర్, చెన్నయ్య, వేణుగోపాలస్వామి, నలమాస శ్రీకాంత్గౌడ్, విజయేందర్, డి.వెంకటరమణ, అనంతరావు, విక్రాంత్రెడ్డి, భిక్షపతిస్వామి, కృష్ణారెడ్డి, నరాల సుధాకర్, నంది శ్రీనివాస్, రజిత కుసుమ, సురేశ్ కండం, శ్రీనివాసులు, రోహిత్రావు.ఎస్ నియమితులయ్యారు. అనుబంధ విభాగాల కన్వీనర్లు.. మహిళా విభాగం: చెన్నమనేని ప్రభావతి, యువజన విభాగం: కోరబోయిన విజయ్, విద్యార్థి విభాగం: పసుల చరణ్, సాహిత్య విభాగం: కంచనపల్లి, ఆరోగ్య విభాగం: ప్రీతిరెడ్డి, కల్చరల్: కోదారి శ్రీను, ఐటీ విభాగం: దాసరి శ్రీనివాస్, వికలాంగుల విభాగం: అంజన్రెడ్డి, న్యాయ విభాగం: తిరుపతివర్మ, రైతు విభా గం: కేఎల్ఎన్ రావు, కోకన్వీన ర్లుగా నళిని నారాయణ (మహిళా విభాగం), ఎన్.జలంధర్ యాదవ్, వంగల శ్రీనివాస్ (యూత్), సాజ న్ సిద్ధంశెట్టి (విద్యార్థి), వేముగంటి మురళీ కృష్ణ(సాహిత్యం), సుజిత్ (సాంస్కృతిక), సాగర్ (ఐటి), సోమేశ్వర్ రావు (లీగల్) జిల్లా కన్వీనర్లు.. ఆదిలాబాద్–ఆర్. శ్రీనివాస్, మంచిర్యాల– ప్రేమ్రావు, నిర్మల్–లక్ష్మణ్చారి, ఆసిఫాబా ద్–చంద్రశేఖర్, కరీంనగర్–జె.శ్రీనివాస్, జగిత్యాల–అమర్దీప్గౌడ్, పెద్దపల్లి– సం గ్రాంసింగ్, సిరిసిల్ల–నాగేందర్రావు, నిజా మాబాద్–లక్ష్మినారాయణ, కామారెడ్డి– అనంత రాములు, వరంగల్ అర్బన్–యార బాలకృష్ణ, వరంగల్ రూరల్–నళిని నారా యణ, భూపాలపల్లి–వి.జ్యోతి, జనగా మ–మురళి, మహబూబాబాద్– కమలాక ర్, ఖమ్మం–జి.సుందర్, కొత్తగూడెం– మల్లీ శ్వరి, మెదక్–మల్లిక, సంగారెడ్డి– ఉదయ్ భాస్కర్, సిద్దిపేట–ఎజాజ్ అహ్మద్, మహబూబ్నగర్–వెంకట్రాంమూర్తి, వన పర్తి–చీర్ల సత్యం, నాగర్కర్నూల్–పావని, గద్వాల–వెంగల్రెడ్డి, నల్లగొండ–బోనగిరి దేవెందర్, సూర్యాపేట్–ఉపేందర్రావు, భువనగిరి–వేణు, మేడ్చల్–ఈగ సంతోష్, రంగారెడ్డి–సేనాపతి అర్చన, హైదరాబాద్– అనంతుల ప్రశాంత్. -
లండన్లో ఎంపీ కవిత జన్మదిన వేడుకలు
లండన్ : నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను ఆదివారం ఖండాంతరాల్లో ఘనంగా నిర్వహించారు. లండన్లో తెలంగాణ జాగృతి యునైటెడ్ కింగ్డమ్ ఆధ్వర్యంలో, ఆస్ట్రేలియాలోని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి మెల్బోర్న్లోని రెడ్క్రాస్ బ్లడ్బ్యాంక్ కేంద్రంలో సామూహిక రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం కవిత పేరిట పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియాలో నాయకులు అనిల్రావు, రాజేశ్, మాదవ్, సత్యంరావు, అమర్రావు, సునిల్రెడ్డి, ప్రకాశ్, వెంకట్, ఉదయ్, డాక్టర్ అర్జున్, హేమంత్, రవిశంకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘సీరో’తో ‘తెలంగాణ జాగృతి’ ఒప్పందం
సాక్షి, హైదరాబాద్: సిడ్నీ - సీరో లెర్నింగ్ సంస్థతో తెలంగాణ జాగృతి నైపుణ్య అభివృద్ధి సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. శుక్రవారం ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, సీరో లెర్నింగ్ సంస్థ గ్లోబల్ ఆపరేషన్స డెరైక్టర్ ఆశిశ్ ఆర్ కట్టా అవగాహన పత్రాలపై సంతకాలు చేశారు. క్వీన్స లాండ్ కేం ద్రంగా పనిచేస్తున్న సీరో సంస్థ ఆస్ట్రేలియా, లావోస్, సింగపూర్, పీఎన్జీలలో ఒకేషనల్ ఎడ్యుకేషన్లో నాణ్యమైన శిక్షణ అందిస్తోంది. తెలంగాణ జాగృతి రాష్ట్ర వ్యా ప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో శిక్షణ కేంద్రాలను నిర్వహిస్తోంది. సీరోతో ఒప్పందం వల్ల జాగృతి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లలో చేరిన నిరుద్యోగులకు శిక్షణ అందుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కవితకు ఘన స్వాగతం సిడ్నీలో జరిగే బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్లిన నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు టీఆర్ఎస్ ఎన్నారైలు, తెలంగాణ జాగృతి ఆస్ట్రేలియా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో సీరో సంస్థ ప్రతినిధి శ్రీకర్ రెడ్డి, తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు కొండపల్లి సంతోశ్కుమార్, కోరబోరుున విజయ్కుమార్ పాల్గొన్నారు. -
‘గిన్నీస్లో ఎక్కేలా బతుకమ్మ వేడుక’
-
‘గిన్నీస్లో ఎక్కేలా బతుకమ్మ వేడుక’
హైదరాబాద్ : బతుకమ్మ వేడుక గిన్నీస్ బుక్లో ఎక్కే విధంగా నిర్వహిస్తామని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆమె బుధవారమిక్కడ మాట్లాడుతూ 30వేల మందితో బతుకమ్మ వేడుకను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణలో 1100 చోట్ల, 9 దేశాల్లో బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తామని చెప్పారు. కాగా తెలంగాణ జాగృతి యాప్ను ఎంపీ కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టెక్నాలజీ ద్వారా అభివృద్ధి సాధ్యపడుతుందన్ని, తెలంగాణ జాగృతి యాప్ను లాంచ్ చేయడం గర్వంగా ఉందన్నారు. యాప్ ద్వారా తమ సంస్థ గ్రాస్ రూట్ లెవల్లో పని చేయగలుగుతుందన్నారు. ఇక వరద విషయాన్ని విపక్షాలు రాజకీయం చేయడం తగదని ఎంపీ కవిత పేర్కొన్నారు. రెండు, మూడు కాలనీల్లో నీళ్లొస్తే హైదరాబాద్ ఇమేజ్ ను దెబ్బతీయాలని కొంతమంది దుష్ప్రచారం చేశారన్నారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తెలంగాణలో కూడా పర్యటించి ఉంటే బాగుండేదని ఆమె అన్నారు. కాగా ఈ నెల 30న యూఏఈలో బతుకమ్మ ఉత్సవాలకు కవిత హాజరు కానున్నారు. -
రేపు ట్రెయినర్లకు ఇంటర్వ్యూలు
వీరన్నపేట (మహబూబ్నగర్) : నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చే ట్రెయినర్లకు ఈనెల 15న ఇంటర్వూ్యలు నిర్వహించనున్నట్టు తెలంగాణ జాగృతి సంస్థ జిల్లా అధ్యక్షుడు వెంకట్రామమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఆరోజు జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ హాస్పిటల్ పక్కన, లక్ష్మి గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. పూర్తి వివరాలకు సెల్ నం.8686793145ను సంప్రదించాలని ఆయన కోరారు. -
గవర్నర్ నరసింహన్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యా వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందని, చదువుల తల్లి సరస్వతిని లక్ష్మిగా మారుస్తున్నారని ఆయన శుక్రవారమిక్కడ అన్నారు. తెలంగాణ ఏర్పడి రెండేళ్లు గడిచిందని, ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ స్పీడ్ పెంచాలని నరసింహన్ సూచించారు. ప్రజాప్రతినిధులు ఒకసారి విద్యా వ్యవస్థపై దృష్టి సారించాలన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్య వ్యాపారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ విద్యా వ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. విద్యలో స్కిల్ డెవలప్మెంట్ భాగంగా ఉండాలని చెప్పారు. ఇంజినీరింగ్ పాసైన వ్యక్తి అటెండర్ ఉద్యోగం చేయడం కన్నా దురదృష్టకరం మరొకటి ఉండదన్నారు. స్కిల్ డెవలప్మెంట్ లేకపోతే మేకిన్ ఇండియా తయారు కాదని, జాగృతి సంస్థ సమాజం మొత్తాన్ని జాగృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాగా నిరుద్యోగ యువతకు పలు రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ జాగృతి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. నగరంలోని అశోక్నగర్లో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, టీఆర్ఎస్ ఎంపీ కవిత ప్రారంభించారు. -
మెల్బోర్న్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
రాయికల్(కరీంనగర్): ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో తెలంగాణ జాగృతి ఆస్ట్రేలియా శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు శనివారం కన్నుల పండువగా జరిగాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితతో పాటు ఆస్ట్రేలియాలోని మంత్రులు హాంగ్లిమ్, మెల్బోర్న్లోని భారత కౌన్సిలర్ జనరల్ రాకేష్ మల్హోత్ర ముఖ్యఅతిధులుగా హాజరయ్యారు. మొదటగా తెలంగాణ అమర వీరులకు తెలంగాణ ఉద్యమసిద్దాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ప్రపంచలోని వివిధ దేశాల్లో ఉంటున్న తెలంగాణ ఉద్యోగులు, పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టి బంగారు రాష్ట్ర సాధనకు కృషిచేయాలన్నారు. తెలంగాణ జాగృతి ద్వారా ఆచార సాంప్రదాయాలను కాపాడటం కోసం చేస్తున్న సేవలను కొనియాడారు. అనంతరం చిన్నారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షురాలు నిషిత రెడ్డి, జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన ఆచారి, కోశాధికారి కృష్ణారెడ్డి, నాయకులు మధు, సంతోష్, కిర ణ్, మనోజ్, సమతలు పాల్గొన్నారు. -
ఆకాశమంత పండుగ
-
హుస్నాబాద్లో నేడు బంగారు బతుకమ్మ
ముకరంపుర/హుస్నాబాద్రూరల్/భీమదేవరపల్లి : తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం హుస్నాబాద్లో బంగారు బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఆర్టీసీ గ్రౌండ్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జాగృతి జిల్లా ఇన్చార్జి ప్రణీత్రావు, జిల్లా కన్వీనర్ జాడి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం కరీంనగర్ ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తంగా చాటిచెప్పిన బతుకమ్మ పండుగను జాగృతి సంస్థ తొమ్మిదేళ్లుగా నిర్వహిస్తోందన్నారు. హుస్నాబాద్లో జరిగే వేడుకలకు నిజామాబాద్ ఎంపీ, జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరువుతారని తెలిపారు. సాయంత్రం మల్లెచెట్లు చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు లంబాడీ నృత్యాలు, ఒగ్గుడోలు కళారూపాలతో ప్రదర్శన ఉంటుందన్నారు. సుమారు 20 వేల మంది మహిళలు వచ్చేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. 200 మంది జాగృతి కార్యకర్తలు వాలంటీర్లుగా వ్యవహరిస్తారని తెలిపారు. జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతాయని పేర్కొన్నారు. ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి బంగారు బతుకమ్మ వేడుకను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జాగృతి జిల్లా అధికార ప్రతినిధి ఇమ్రాన్ అహ్మద్, విద్యార్థి విభాగం రాష్ట్ర కో కన్వీనర్ పసుల చరణ్, మహిళా సమాఖ్య జిల్లా కన్వీనర్ గందె కల్పన, యువజన విభాగం జిల్లా కన్వీనర్ ఠాకూర్ సంగ్రామ్సింగ్, జిల్లా కోశాధికారి గన్నమనేని రంగారావు, పీఆర్వో పుల్లూరి రవీందర్, కవి నంది శ్రీనివాస్, సిటీ మహిళా కన్వీనర్ తొడుపునూరి పద్మజ, యువజన సమాఖ్య జిల్లా కో కన్వీనర్ మల్లేషం పాల్గొన్నారు. ముల్కనూర్ టు హుస్నాబాద్.. బంగారు బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు ఎంపీ కవిత మంగళవారం ఉదయం 9గంటలకు భీమదేవరపల్లి మండలం ముల్కనూరు చేరుకుంటారని జాగృతి జిల్లా కో కన్వీనర్ మూల రాంగౌడ్ తెలిపారు. స్థానిక వెంకటసాయి గార్డెన్స్లో సుమారు వెయ్యి మంది మహిళలతో కలిసి బతుకమ్మను పేర్చనున్నారని చెప్పారు. ఏర్పాట్లను ఎంపీపీ సంగ సంపత్యాదవ్, ఎస్సై సతీష్, సర్పంచ్ వంగ రవీందర్గౌడ్ పరిశీలించారు. ముల్కనూర్లో బతుకమ్మ పేర్చిన అనంతరం కవిత ఉదయం 10 గంటలకు హుస్నాబాద్ మండ లం పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారని ఎమ్మెల్యే సతీష్కుమార్ తెలిపారు. 11 గంటలకు స్థానిక జయశ ంకర్ డిఫెన్స్ అకాడమీ ట్రైనింగ్ క్యాంపును సందర్శించి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారన్నారు. 11.30 గంటలకు కేజేఆర్ గార్డెన్కు చేరుకుని బతుకమ్మ పేర్చుతారని తెలిపారు. సాయంత్రం 5గంటలకు మల్లెచెట్టు చౌరస్తా నుంచి బతుకమ్మలతో ర్యాలీగా వెళ్లి ఆరు గంటలకు ఆర్టీసీ డిపోగ్రౌండ్లో బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. -
వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ సంబురాలు
సాక్షి, హైదరాబాద్: అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజధాని వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి ఉత్తర అమెరికా శాఖ, విజన్ తెలంగాణ అసోసియేషన్, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్లు సంయుక్తంగా బతుకమ్మ సంబురాలను నిర్వహించాయి. ఈ వేడుకలకు అమెరికాలోని వర్జీనియా, మేరీలాండ్, డెలావేర్ రాష్ట్రాల నుంచి ప్రజలు హాజరైనట్లు జాగృతి సంస్థ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. -
రైతులకు అండగా తెలంగాణ జాగృతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలు విషాదకరమని, ఆత్మహ త్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు అండగా నిలవడం అందరి బాధ్యతని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత పేర్కొన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను దత్తత తీసుకోవాలంటూ జాగృతి తరఫున ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన వస్తోందన్నారు. ఇప్పటిదాకా 80 కుటుంబాల దత్తతకు తమ శాఖలు ముందుకు వచ్చాయని, క్రీడాకారులు, ఎన్ఆర్ఐలు, సినీ ప్రముఖులు, కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఆదివారం తెలంగాణ భవన్లో బాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓఝా, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తల్లి నసీమాతో కలసి కవిత విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. రైతు చనిపోతే ఆ కుటుంబం బాధ్యతంతా భార్యపై పడుతుందని, పిల్లల చదువు భారంగా మారుతుందని, అందుకే కుటుంబాలను ఆదుకునేందుకు జాగృతి ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. దీనికోసం ప్రొ. శ్రీధర్ కన్వీనర్గా, దేవీప్రసాద్, ప్రొ. కోదండరాం, విజయ్బాబు తదితరులు సలహాదారులుగా కమిటీని నియమించామన్నారు. రైతు ఆత్మహత్యలపై అక్టోబర్లో వివరాలు సేకరించి విధివిధానాలు రూపొందించుకోవడంతోపాటు గ్రామ స్థాయిలో జాగృతి కార్యకర్తలతో సర్వే నిర్వహించి నవంబర్ 1 నుంచి బాధిత కుటుంబాలకు సాయం అందేలా ప్రణాళిక రూపొందించుకున్నామన్నారు. అండగా ఉంటాం: జ్వాల, ఓఝా దేశానికి వెన్నెముకగా ఉన్న రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబాలు ఎన్నో కష్టాలు పడతాయని, బాధ్యతగల పౌరురాలిగా వారి కుటుంబాలకు అండగా ఉండాలని ముందుకొచ్చినట్లు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల పేర్కొన్నారు. రైతు కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, తమ చేతనైనంత వరకు జాగృతి కార్యక్రమాలకు అండగా ఉంటామని సానియా తరఫున అమె తల్లి నసీమా హామీ ఇచ్చారు. తానూ రైతు కుటుంబానికి చెందిన వాడినేనని, అందుకే తానూ ముందుకొచ్చినట్లు క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓఝా తెలిపారు. రైతులను ఆదుకోవడంలో రాజకీయాలకు అతీతంగా స్పందించాలని జాగృతి ఏర్పాటు చేసిన కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ శ్రీధర్ పిలుపునిచ్చారు. జాగృతి సంస్థకు జ్వాల రూ. లక్ష, ప్రజ్ఞాన్ ఓఝా రూ. 2 లక్షలు, సానియా రూ. 3 లక్షల చొప్పున చెక్కులను అందించారు. జాగృతి ఆధ్వర్యంలో కవి సమ్మేళనం తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో దివంగత ప్రజాకవి కాళోజి యాదిలో కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. ఆదివారం తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత పాల్గొన్నారు. తెలంగాణ భాష అంశంపై కవి సమ్మేళనం జరిగింది. వివిధ జిల్లాల నుంచి హాజరైన కవులు తమ కవితలు వినిపించారు. రచయిత నందిని సిద్దారెడ్డి, కాంచనపల్లి, గనపురం దేవేందర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
రైతు ఆత్మహత్యలపై రౌండ్ టేబుల్ సమావేశం
హైదరాబాద్: రైతు ఆత్మహత్యలపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత తోపాటు పలువురు ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు. రైతుల ఆత్మహత్యలకు దారితీస్తున్న అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను జాగృతి సంస్థ ఆదుకుంటుందని కవిత స్పష్టం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు పిల్లలను చదివిస్తామని చెప్పారు. పంటబీమా విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత నిబంధనలు మార్చాలని కోరారు. 2009 తర్వాత చోటు చేసుకున్న పరిణామాల వల్లనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని కవిత పునరుద్ఘాటించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని టి.జేఏసీ ఛైర్మన్ కోదండరాం కోరారు. రైతుల ఆత్మహత్యలకు గల కారణాలను ప్రభుత్వం సమీక్షించాలన్నారు. తక్షణమే రైతులకు రూ.5 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. -
టీ. జాగృతి సమితి ప్రతినిధి అరెస్టు
హైదరాబాద్: ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలువురిని మోసం చేసిన కేసులో తెలంగాణ జాగృతి సమితికి చెందిన ప్రతినిధిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన నగరంలోని ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తెలంగాణ జాగృతి సంస్థకు చెందిన నవీన్ గౌడ్ అనే వ్యక్తి మరో వ్యక్తి సహాయంతో ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువరి నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. అయితే నెలలు గడుస్తున్నా ఉద్యోగాల విషయం తేలకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయంపై ఫిర్యాదు అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు నవీన్ గౌడ్ను అరెస్టు చేశారు. నవీన్ కు సహాయ పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తెలంగాణపై తెరచాటు కుట్రలు
హన్మకొండలో విద్యార్థి ఉద్యమ యాది సభలో కవి దేశపతి హన్మకొండ: తెలంగాణపై తెరచాటు కుట్రలు చేస్తున్నారని కవి, గాయకుడు, ప్రభుత్వ సలహాదారుడు దేశపతి శ్రీనివాస్ అన్నారు. శనివారం హన్మకొండలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ విద్యార్థి ఉద్యమ యాది సభ జరిగింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి సంఘాల నాయకులను, విద్యార్థులను ఈ సందర్భంగా సన్మానించారు. సభలో దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ సీమాంధ్ర పెట్టుబడిదారి వ్యవస్థ కుట్రలను కొనసాగిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ అస్థిరతను సృష్టించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటుతో తెలంగాణ ప్రజలు ఏం సాధించుకున్నారనేది కాకుండా సీమాంధ్రులకు ఏం కోల్పోయారో స్పష్టంగా అర్థమవుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దోచుకుపోయినవన్ని నిలిచిపోయాయని, నదీ జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా తీసుకోగలిగామన్నారు. అభివృద్ధిలో ముందు భాగాన ఉన్న తెలంగాణను చూసి ఓర్వలేక కుట్రలు సాగిస్తున్నారన్నారు. -
'గల్ఫ్ దేశాలతో తెలంగాణకు అవినాభావ సంబంధం'
బహ్రెయిన్: గల్ఫ్ దేశాలలో తెలంగాణ జాగృతిని విస్తరించాలనే ఉద్దేశ్యంతో చేపట్టిన తన మూడు రోజుల పర్యటనను శనివారం ముగించుకోని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, పార్లమెంటు సభ్యురాలు కె. కవిత భారతదేశానికి తిరిగి పయనమయ్యారు. బహ్రెయిన్ లో శుక్రవారం రాత్రి గల్ఫ్ తెలంగాణ జాగృతి నేత సిహెచ్. హరిప్రసాద్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో అమె పాల్గోన్నారు. పెద్ద సంఖ్యలో వచ్చిన సభికులను ఉద్దేశించి కవిత మాట్లాడుతూ బంగారు తెలంగాణ ఆశయ సాధనలో ప్రవాసీయుల పాత్ర గూర్చి వివరించారు. గల్ఫ్ దేశాలతో తెలంగాణ ప్రాంతానికి అవినాభావ సంబంధం ఉందని, అందుకే జాగృతి ఈ దిశగా ప్రత్యేక దృష్టి సారిస్తుందని అమె పేర్కొన్నారు. అన్ని గల్ఫ్ దేశాలలో తెలంగాణ జాగృతి శాఖలు ఏర్పాటు చేసి ప్రవాసీయులతో సమన్వయం చేస్తున్నామని కవిత అన్నారు. -
గల్ఫ్ నా ఎనిమిదో నియోజకవర్గం: కవిత
ఎడారిలో ఉన్నా.. ప్రవాసీయులు నూటికి నూరుపాళ్లు తెలంగాణ బిడ్డలేనని, వాళ్ల పేర్లను రేషన్ కార్డుల్లోంచి తొలగించకుండా చూస్తానని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చెప్పారు. రాష్ట్ర పరిధిలోని ప్రతి సమస్యనూ పరిష్కరించేందుకు తాను చిత్తశుద్ధితో ప్రయత్నిస్తానని, కేంద్రంపై కూడా ఒత్తిడి తెస్తానని తెలిపారు. గల్ఫ్ పర్యటనలో ఉన్న కవిత.. తెలంగాణ జాగృతి నేత హరిప్రసాద్తో కలిసి శుక్రవారం బహ్రెయిన్లో కార్మిక క్యాంపులను సందర్శించి, అక్కడ కార్మికులతో సహపంక్తి భోజనం చేశారు. తెలంగాణలో అమలు చేస్తున్న మిషన్ కాకతీయతో గ్రామీణప్రాంతాల్లో వ్యవసాయం పెరుగుతుందని, ఇక ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస రావాల్సిన అవసరం ఉండబోదని ఆమె చెప్పారు. సుదూర తీరాలకు వచ్చి నాలుగైదు వేల రూపాయలు సంపాదించేకంటే, ఇంట్లోనే ఉండి వ్యవసాయం చేసుకుని అంతకంటే ఎక్కువ సంపాదించవచ్చని కవిత తెలిపారు. గల్ఫ్లో ఉన్నవాళ్లు తమ పిల్లలను బాగా చదివించి, వృత్తిపరమైన కోర్సులు చేయాలని, ఈ వికాసం బంగారు తెలంగాణకు ఉపయోగపడుతుందని, ఇందులో ప్రవాసీయుల పాత్ర గణనీయమైనదని ఆమె అన్నారు. తన లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్నవి ఏడు సెగ్మెంట్లు కావని, గల్ఫ్తో కలుపుకొంటే ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లని కవిత అన్నారు. అంతకుముందు హరిప్రసాద్ నివాసంలో తెలంగాణ మహిళలతో సమావేశమై బహ్రెయిన్లో బతుకమ్మ నిర్వహణపై సమీక్షించారు. బహ్రెయిన్ దుర్గా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కవిత వెంట సామా రాజిరెడ్డి, శ్రీనివాస్ తదితరులున్నారు. -
'కేంద్రంలో చేరతామనేది ఊహాగానమే'
‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఎంపీ కవిత సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జాగృతి వేదికగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంతో మమేకమై బతుకమ్మ పండుగకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టారు.. ఎంపీ కవిత. ఆమె సీఎం కేసీఆర్ కుమార్తెగా కంటే తెలంగాణ జాగృతి కవితగానే ఎక్కువగా గుర్తింపు పొందారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున నిజామాబాద్ లోక్సభ స్థానంలో పోటీ చేసి మంచి మెజారిటీతో ఎన్నికయ్యారు. కేంద్ర ప్రభుత్వంలో టీఆర్ఎస్ చేరుతుందన్న ప్రచారంతో పాటు సీఎంపైనా, ఆయన కుటుంబ సభ్యులపైనా విపక్షాల విమర్శలు, బీజేపీతో సఖ్యత తదితర అంశాలపై ఆమె మంగళవారం ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు... టీఆర్ఎస్ కేంద్రంలో చేరుతుందన్న ప్రచారంపై మీ స్పందన? కేంద్ర ప్రభుత్వంలో టీఆర్ఎస్ చేరుతుంద న్నవి రాజకీయ ఊహాగానాలే. పార్టీకి, తెలంగాణకు ఏది మంచిదో నిర్ణయించే తెలివి, కార్యదక్షత పార్టీలో కేసీఆర్కు త ప్పితే మరెవరికీ లేదు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అనుసరిస్తాం. పదవులు, హోదాల మీద మా కుటుంబంలో ఎవరికీ ఆశలేదు. తెలంగాణ ప్రజలే ముఖ్యం. ఏ నిర్ణయమైనా పార్టీ, తెలంగాణ ప్రజల కోసమే ఉంటుంది. బీజేపీని కేసీఆర్ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారన్న విమర్శల మాటేమిటి? తెలిసీ తెలియక ఏదో మాట్లాడుతుంటారు. మాకు తెలంగాణ ప్రజలు ముఖ్యం. తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం కేంద్రం విషయంలో టీఆర్ఎస్ వైఖరి మారినట్లుంది? కేంద్ర ప్రభుత్వ విషయంలో మా వైఖరిలో పెద్దగా మార్పేమీ లేదు. బీజేపీ మొదట తెలంగాణకు అనుకూలంగా ఉన్నప్పుడు ఆకాశానికి ఎత్తాం. వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దారిలో పెట్టడానికి ప్రయత్నాలు చేశాం. ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చి తెలుగుదేశానికి, ఎన్టీఆర్కు అనుకూలంగా మాట్లాడినప్పుడు విమర్శించాం. తెలంగాణ ప్రజల అభివృద్ధి గురించి మాట్లాడినప్పుడు సరే అన్నాం. కేంద్రంలో ఎవరున్నా.. ఏ ప్రభుత్వమున్నా.. తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం. ఆ ప్రయోజనాలు కాపాడేందుకు సఖ్యతతో ఉం టాం. తెలంగాణకు వ్యతిరేకమైతే కచ్చితంగా వ్యతిరేకిస్తాం. కేసీఆర్ ఆమరణ దీక్ష, ఉద్యమ సమయంలో ఎలా ఫీల్ అయ్యేవారు? రాష్ట్రం వచ్చాక ఎలా ఫీలవుతున్నారు? రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పటివరకూ పడిన కష్టమంతా చేయితో తీసేసినట్లు అనిపిస్తోంది. కానీ ఉద్యమ సమయంలో అనుభవించిన బాధాకర సంఘటనలు.. ఒకవైపు నాన్న ఉద్యమం.. మరోవైపు చనిపోతున్న పిల్లలు, అరెస్టులు, జైళ్లు, బెయిళ్లు.. అదంతా మామూలు కష్టం కాదు. ఈ పరిస్థితి ఎవరికీ రావొద్దని కోరుకుంటాను. సీఎం కుటుంబ సభ్యులపైనా విమర్శలు వస్తున్నాయి కదా? ఈ పదిహేనేళ్లుగా విమర్శలను ఎదుర్కోవడం అలవాటైంది. చివరకు కుటుంబ సభ్యులనూ టార్గెట్ చేస్తున్నారు. ఉద్యమ సమయంలో కొందరు మహానుభావులు ‘పిల్లలను చంపుతాం’ అని కూడా బెదిరించారు. ఇప్పుడు ఇబ్బంది లేదు. మేమంతా క్రియాశీల రాజకీయాల్లో ఉన్నాం. విమర్శలు వస్తాయి. కానీ, మేమేంటో ప్రజలకు తెలుసు. మా అంకిత భావం, చిత్తశుద్ధి, పట్టుదల వారికి తెలుసు. చాక్లెట్లు పట్టుకుని తిరిగేదాన్ని.. నాన్న పుట్టినరోజును పెద్దగా చేసుకోరు. పెద్దగా స్పెషల్ ఏమీ లేదు. ఆయనకు గుర్తుండదు కూడా. నాన్న పుట్టినరోజు అని నేనే చిన్నప్పుడు చాక్లెట్లు పట్టుకుని తిరిగేదాన్ని. ఇప్పుడు ఆయన అభిమానులుగా మాకు స్పెషల్. ఈ రోజు ఆయన యథావిధిగా తన విధుల్లో ఉన్నారు. మహారాష్ట్ర సీఎంతో చర్చల్లో పాల్గొన్నారు. కేసీఆరే స్టార్ బ్యాట్స్మన్.. ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్పై విపక్షాల విమర్శలు సహజం. కేసీఆర్ స్టార్ బ్యాట్స్మన్. వాళ్లంతా చిన్న చిన్న బౌలర్లు. వారివల్ల ఆయనకు పెద్దగా ఫరక్ (సమస్య) పడేది ఏమీలేదు. కాకుంటే కువిమర్శలు కాకుండా, సద్విమర్శలు చేస్తే ఆహ్వానిస్తాం. ఉద్యమ సమయంలో తీవ్రంగా విమర్శించిన వారినీ కలుపుకొనిపోయాం. మన విధానాల మీద విమర్శలు చేస్తే ఓకే కానీ... వ్యక్తిగతంగా ‘వాస్తును నమ్ముతావ్, జాతకాలు నమ్ముతావ్’ అంటూ విమర్శిస్తే ప్రజలు హర్షించరు. ప్రతిపక్షాలకు నేను ఒకటే చెబుతున్నా.. మీరు కేసీఆర్ వేగాన్ని అందుకోలేరు. వాస్తవాలను విస్మరించి విమర్శిస్తే నవ్వుల పాలవుతారు. ప్రజలకు పనికొచ్చే, రాష్ట్ర అభివృద్ధికి పనికొచ్చే సూచనలు చేయండి.. తీసుకుంటాం. -
రేవంత్రెడ్డి ఇంటిని ముట్టడించిన ‘జాగృతి’
హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ కవితపై టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి చేసిన ఆరోపణలు అవాస్తవమని వెంటనే వాటిని ఉపసంహరించుకొని అసెంబ్లీలో బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన తెలంగాణ జాగృతి కార్యకర్తలు శుక్రవారం బంజారాహిల్స్ రోడ్ నంబర్-12లోని ఎమ్మెల్యే కాలనీలోని రేవంత్రెడ్డి ఇంటిని ముట్టడిం చారు. తమ ఇంటి వద్ద తెలంగాణ జాగృతి కార్యకర్తలు అనవసరంగా రాద్ధాంతం చేశారంటూ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి సోదరుడు కొండల్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసుల తెలంగాణ జాగృతి నేతలపై కేసు నమోదు చేశారు. దాడిని ఖండించిన టీడీపీ నేతలు... టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి నివాసంపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేయడాన్ని టీడీపీ నాయకులు ఎల్.రమణ, రావుల చంద్రశేఖరరెడ్డి, పి.రాములు, వేం నరేందర్రెడ్డి శుక్రవారం వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు. -
పూల పండుగే.. బతుకమ్మ
-
'పోలవరం ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది కాంగ్రెస్సే'
హైదరాబాద్:పోలవరం ఆర్డినెన్స్ ను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని బీజేపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి ఆచారి స్పష్టం చేశారు. ఆ సమయంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను టీఆర్ఎస్ పార్టీ అడ్డుకోలేక పోయిందని తెలిపారు. అప్పుడు లోక్ సభలో ఉన్న టీఆర్ఎస్ ఎంపీలు ఆ ఆర్డినెన్స్ ను ఆపలేకపోయారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు తమ అసమర్ధతను కప్పిపుచ్చుకునేందుకు టీఆర్ఎస్ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆచారి మండిపడ్డారు. పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపడంపై తెలంగాణ వాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లులో చేసిన సవరణలను నిరసిస్తూ తెలంగాణ జాగృతి కార్యకర్తలు శనివారం బీజేపీ కార్యాలయంపై దాడికి దిగారు. పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలపడం తగదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
బంద్ విఫలంతోనే దాడి: బీజేపీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జాగృతి కార్యకర్తలు బీజేపీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించటాన్ని ఆ పార్టీ తీవ్రంగా పరిగణించింది. ఇది బీజేపీ కార్యాలయంపై దాడి చేయటమేనని పేర్కొంది. శాంతి భద్రతలను కాపాడాల్సిన ప్రభుత్వమే, అధికార పార్టీకి అనుబంధంగా ఉన్న సంస్థ చేత రాజకీయపార్టీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేయించటం తీవ్రమైన చర్య అని పేర్కొంది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.ఆచారి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఖమ్మంలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేస్తూ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలపటానిన నిరసిస్తూ బుధవారం జరిగిన తెలంగాణ బంద్ విఫలమైందని ఆచారి అందులో పేర్కొన్నారు. ఇది ప్రజలు నిర్వహించిన బంద్ కాదని, ప్రభుత్వమే వెనుక ఉండి బంద్ నిర్వహించే ప్రయత్నం చేసిందని, అది కాస్తా విఫలం కావటంతో నిరాశనిస్పృహలతో బీజేపీ కార్యాలయంపై దాడికి ఉపక్రమించిందని ఆరోపించారు. -
బీజేపీ కార్యాలయంపై తెలంగాణ వాదుల దాడి
-
బీజేపీ కార్యాలయంపై తెలంగాణ వాదుల దాడి
హైదరాబాద్:పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపడంపై తెలంగాణ వాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లులో చేసిన సవరణలను నిరసిస్తూ తెలంగాణ జాగృతి కార్యకర్తలు శనివారం బీజేపీ కార్యాలయంపై దాడికి దిగారు. పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలపడం తగదంటూ ఆందోళన చేపట్టారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపుటలా జరిగింది. ఈ క్రమంలోనే తెలంగాణ జాగృతి కార్యకర్తలను బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో తెలంగాణ జాగృతి కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలవరం ముంపు మండలాల అంశానికి సంబంధించి పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ పునర్విజన బిల్లులో చేసిన సవరణలకు ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ తెలంగాణ జేఏసీ, వామపక్షాలు ఈ రోజు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కేంద్రం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను తెలంగాణ వాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు జిల్లాలో శుక్రవారం కూడా తెలంగాణ జిల్లాల్లో తెలంగాణవాదులు, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎన్డీయే ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆంధ్ర పాలకుల ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం ఈ చర్యకు ఒడిగట్టిందని పలు రాజకీయ పార్టీల నేతలు విమర్శించారు. రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత దొడ్డిదారిలో సవరణకు ఆర్డినెన్స్ తెచ్చి కుట్రలు చేసిందని దుయ్యబట్టారు. -
ఎన్డీయేకు ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం: కవిత
కరీంనగర్: ఎన్డీయే ప్రభుత్వానికి ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ఎన్డీయే పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తే పోరాటం చేస్తామని ఆమె గురువారమిక్కడ వ్యాఖ్యానించారు. తెలంగాణ అమరవీరుల త్యాగఫలితంగానే టీఆర్ఎస్ విజయం సాధించిందని కవిత అన్నారు. తెలంగాణ జాగృతి సంస్థకు కీలక బాధ్యత వహిస్తూ ముందుకు తీసుకు వెళతామన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో తెలంగాణ జాగృతి కీలక పాత్ర పోషిస్తుందని ఆమె తెలిపారు. -
జాగృతిది.. ప్రతిపక్ష పాత్ర
తెలంగాణ ఉద్యమంలో బీజేపీ ఎంతోకొంత పాల్గొందని, అలాంటి పార్టీ తెలంగాణకు పూర్తిగా వ్యతిరేకమైన టీడీపీతో జతకట్టడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా తెలంగాణ జాగృతి సంస్థ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రలో వైఎస్ జగన్కి పట్టం కట్టనున్నారని చెప్పారు. ఎలక్షన్ సెల్ తెలంగాణ వ్యతిరేక పార్టీతో బీజేపీ పొత్తుకోవడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇక్కడి బీజేపీ నాయకులకు కనీస విలువ ఇవ్వకుండా చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు కలిసి మొత్తం పెత్తనమంతా నడిపి పొత్తు కుదుర్చుకున్నారు. ఈ విషయంలో బీజేపీలోనూ నిరసనలు వెల్లువెత్తాయి. ఇక టీఆర్ఎస్తో పొత్తుకు పలు పార్టీలు ఆహ్వానించినా ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగాలని టీఆర్ఎస్ నిర్ణయించుకుంది. తెలంగాణలో కేసీఆర్.. ఆంధ్రలో జగన్ దేశవ్యాప్తంగా నూతన, యువ నాయకత్వానికి ప్రజలు పట్టంగడుతున్నారు. తెలంగాణ సాధించిన పార్టీగా టీఆర్ఎస్కు ప్రజలు బ్రహ్మరథం పడతారు. తెలంగాణలో టీడీపీ పూర్తిగా కనుమరుగైంది. మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. టీడీపీతో పొత్తు వల్ల తెలంగాణలో బీజేపీ నష్టపోవడం ఖాయం. ఆంధ్రలో వైఎస్సార్ సీపీ స్వీప్ చేస్తుంది. జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రావడం ఖాయం. టీడీపీలోకి మాజీ మంత్రులు వచ్చి చేరినా సీమాంధ్రలో ఆ పార్టీకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. ప్రజలు కొత్త నాయకత్వాన్ని, యువకిశోరాలను కోరుకుంటున్నారు. తెలంగాణ యువతను గాయపరిచిన పవన్ పవన్కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదు. మా సంస్థపై ఆయన చేస్తున్న విమర్శల్లో అర్థం లేదు. మా సంస్థ విరాళాల గురించి ఆయన ప్రశ్నిస్తున్నాడు. అవన్నీ పారదర్శకంగా ఉన్నాయి. ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా, నిబద్ధతగా, పాదర్శకంగా నడుస్తోంది. గత ఐదేళ్లలో పవన్ కళ్యాణ్ ఏమైనా కార్యక్రమాలు చేశాడా? మేం జాగృతి సంస్థ ద్వారా 500 వరకు కార్యక్రమాలు నిర్వహించాం. తెలంగాణ వ్యతిరేక లాబీలో ఉండి ఆయనిలా మాట్లాడుతున్నాడు. తెలంగాణ కోసం వందలాది మంది అమరులైతే అది ఆయన కంటికి కనిపించలేదా? వారి గురించి కనీసం ఒక్కసారైనా మాట్లాడాడా? పోనీ సమైక్యాంధ్ర కోసం చనిపోయిన వారినైనా ఆయన పట్టించుకున్నాడా? పవన్, నాగార్జున మోడీని కలిసి తెలంగాణ యువతను గాయపరిచారు. అసలు పవన్ గురించి ఆలోచించడమే అనవసరం. పునర్నిర్మాణం ఇలా ఉండాలి తెలంగాణ పునర్నిర్మాణంలో వ్యవసాయం లాభసాటిగా మారాలి. ప్రజలు పేదరికం నుంచి బయటపడాలి. విద్యావకాశాలు పెరగాలి. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్లక్ష్యానికి గురైన మైనర్ ఇరిగేషన్ను త్వరలో ఏర్పడబోయే ప్రభుత్వం పునరుద్ధరించాలి. అలాగే మధ్య తరహా, భారీ సాగునీటి ప్రాజెక్టులపైనా దృష్టి సారించాలి. జిల్లాకో మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేయాలి. బలహీన వర్గాలకు అవకాశాలు పెంచాలి. పారిశ్రామికీకరణపై దృష్టి పెట్టాలి. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ను ప్రవేశపెట్టిన కిరణ్కుమార్రెడ్డి అందుకోసం రూ.వందకోట్లు కూడా ఖర్చుచేయలేదు. రేపటి తెలంగాణలో దానిని పక్కాగా అమలుచేయాలి. వక్ఫ్ భూములను రక్షించుకోవాలి. ప్రతీ మండలంలోనూ ఒక మహిళా పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయాలి. పేదలకు మూడెకరాల భూమి ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. అయితే ఆ భూమిని మహిళల పేరుమీద ఇవ్వాలని ఆయనకు సూచించా. మహిళా అక్షరాస్యత పెరగాలి. అప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది. ‘జాగృతి’దే కీలక పాత్ర తెలంగాణ ఏర్పాటు కాగానే తెలంగాణ జాగృతి సంస్థ ఏంచేస్తుందన్న సందేహం చాలామందిలో ఉంది. ఈ సంస్థ ఎప్పటికీ ఉంటుంది. తెలంగాణ పునర్నిర్మాణంలో అది కీలక పాత్ర పోషిస్తుంది. పాలనలో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేస్తుంది. ఒకరకంగా ప్రతిపక్ష పాత్ర పోషించాలన్నదే మా ఉద్దేశం. టీఆర్ఎస్సే కాదు.. ఎవరు అధికారంలో ఉన్నా జాగృతి సంస్థ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. బతుకమ్మను తెలంగాణ రాష్ట్ర పండుగగా చేయాలన్న ‘జాగృతి’ డిమాండ్ మేరకు టీఆర్ఎస్ దానిని ప్రణాళికలో చేర్చింది. ప్రభుత్వం వచ్చాక ఏదో మొక్కుబడిగా బతుకమ్మ పండుగను నిర్వహిస్తే జాగృతి సంస్థ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. అలాగే తెలంగాణ సినీ కళాకారులను ప్రోత్సహించేందుకు రాయితీలు, ఇతర వసతులు కల్పించాలి. సినిమాలు ఎవరు తీసినా బ్యాలెన్స్డ్గా ఉంటూ ప్రోత్సహించాలి. ఉద్యమ సమయంలో భావోద్వేగాలు ఎలా ఉన్నా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. -
ముందు మేకప్.. తర్వాత పేకప్
హైదరాబాద్: పవన్ కళ్యాణ్పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు మేకప్.. తర్వాత పేకప్ అంటూ ఎద్దేవా చేశారు. పేద ప్రజల గురించి తెలిసిన వారు.. ఫైవ్ స్టార్ హోటల్లో పార్టీ ప్రకటన చేయరని అన్నారు. కొత్త వేషాలు వేసుకునే వచ్చేవారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కవిత అన్నారు. ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే పవన్ కళ్యాణ్ ప్రజాజీవితంలోకి రావాలని కవిత అంతకుముందు డిమాండ్ చేశారు. దీనిపై పార్టీ పెట్టినప్పుడు పవన్ కూడా స్సందించారు. -
'పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి'
-
పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి: కవిత
హైదరాబాద్: పవన్ కళ్యాణ్పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీతో సామాజిక తెలంగాణ అని తెలంగాణ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. సామాజిక తెలంగాణ అని తర్వాత జై సమైక్యాంధ్ర అన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు ఏముఖం పెట్టుకుని తమ్ముడు వస్తున్నాడని ప్రశ్నించారు. పీఆర్పీ తప్పిదాలకు ముందుగా క్షమాపణ చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పిన తర్వాతే పవన్ కళ్యాణ్ ప్రజాజీవితంలోకి రావాలన్నారు. పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ పెడుతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. -
వెంకయ్య నోట చంద్రబాబు మాట: కవిత
హైదరాబాద్: తెలంగాణ బిల్లును ఆమోదించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను స్వాగతిస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. బిల్లులో తెలంగాణకు వ్యతిరేకంగా చాలా అంశాలున్నాయని తెలిపారు. హైదారాబాద్లో గవర్నర్ పాలన పెట్టడం సరికాదన్నారు. జనాభా ప్రాతిపదికన కాకుండా ఖర్చును బట్టి అప్పులు పంచాలని సూచించారు. విద్యాఉపాధి అవకాశాల్లో పదేళ్లపాటు రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని చెప్పారు. టెన్త్ సర్టిఫికెట్ నేటివిటి ఆధారంగానే ఉద్యోగులకు ఫించన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీమాంధ్రకు ప్రత్యేకంగా హైకోర్టు ఏర్పాటు చేయాలన్నారు. పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు కవిత చెప్పారు. పోలవరం ప్రాజెక్టును ఒడిశా, ఛత్తీస్గఢ్లు వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. ఆ రెండు రాష్ట్రాల సీఎంలను కలిసి పార్లమెంట్లో పోలవరం డిజైన్ మార్పుకు పట్టుబట్టాలని కోరతామన్నారు. కృష్ణా, గోదావరి జలాల పంపకంపై వాటర్ బోర్డు పెట్టడం వింతగా ఉందన్నారు. చంద్రబాబు మాట వెంకయ్యనాయుడి నోట వస్తోందని కవిత అన్నారు. -
ఘనంగా `బంగారు బతుకమ్మ` సంబరాలు
-
ఘనంగా `బంగారు బతుకమ్మ` సంబరాలు
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా బంగారు బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా.. మహిళలంతా పూలతో పేర్చిన బతుకమ్మలతో.. ఆడుతూ.. పాడుతూ.. కన్నుల పండువగా జరుపుకుంటున్నారు. -
బెల్లంపల్లిలో బంగారు బతుకమ్మ వేడుకలు
బెల్లంపల్లి, న్యూస్లైన్ : తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బుధవారం బెల్లంపల్లిలో బంగారు బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. ఈ వేడుకలకు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బంగారు బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. పద్మశాలి భవన్ నుంచి బతుకమ్మను నెత్తిన ఎత్తుకుని వేలాది మంది మహిళలతో కవిత ర్యాలీగా తిలక్ స్టేడియంకు చేరుకున్నారు. డోలు, ఒగ్గు కళాకారుల విన్యాసాలు, బతుకమ్మ పాటలు, చిన్నారుల కోలాటం ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పద్మశాలి భవన్ నుంచి ప్రారంభమైన ప్రదర్శన కాంటా చౌరస్తా, బజార్ఏరియా, పాతబస్టాండ్ మీదుగా తిలక్ స్టేడియంకు చేరుకుంది. వేలాది మంది మహిళలు బతుకమ్మలతో నిర్వహించిన ప్రదర్శన చూపరులను ఆకట్టుకున్నాయి. తిలక్స్టేడియంలో కవిత ఆడపడుచులతో ఉత్సాహంగా కోలాటం ఆడిపాడారు. స్టేజీ మీద పెద్దపల్లి ఎంపీ జి.వివేకానంద సతీమణి సరోజ, మాజీ ఎమ్మెల్యే పాల్వాయి రాజ్యలకీష్మ, ఇతర మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. బతుకమ్మ పేర్చిన కవిత బంగారు బతుకమ్మను పురస్కరించుకొని కవిత పలువురి ఇళ్లలో బతుకమ్మలను పేర్చారు. పట్టణంలోని స్టేషన్రోడ్ కాలనీలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆర్.ప్రవీణ్, రైల్వే రడగంబాలబస్తీలోని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పి.సురేశ్, రాంమందిర్ఏరియాలో ఉన్న టీఆర్ఎస్ నాయకుడు ఎం.సత్తిబాబు ఇండ్లకు వెళ్లి పెద్దపల్లి ఎంపీ వివేకానంద సతీమణి సరోజతో కలిసి కవిత బతుకమ్మలు పేర్చారు. అంతకుముందు కవిత కన్నాల శివారులోని శ్రీ బుగ్గరాజరాజేశ్వరస్వామి దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. తొలిసారిగా బెల్లంపల్లికి విచ్చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు టీఆర్ఎస్ నాయకులు, మహిళలు అపూర్వ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ జి.వివేకానంద, రాష్ట్ర మాజీ మంత్రి, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి జి.వినోద్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్, మాజీ ఎమ్మెల్యే పి.రాజ్యలకీష్మ, టీబీజీకేఎస్ అధ్యక్షుడు కె.మల్లయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎస్.నర్సింగం, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పి.సురేశ్ , నాయకులు బి.రమేశ్, జి.చంద్రశేఖర్, తెలంగాణ జాగృతి నాయకులు పాల్గొన్నారు. రెండు నెలల్లో ‘తెలంగాణ’ సాకారం మరో రెండు నెలల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారం కాబోతుందని, ఏదేని పరిస్థితుల్లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఆటంకాలు ఏర్పడితే టీజేఏసీ, టీఆర్ఎస్ ఇచ్చే పిలుపు మేరకు ఉద్యమంలో మహిళలు ముందుండాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తిలక్ స్టేడియంలో బతుకమ్మ ఆడిన అనంతరం ఆమె మాట్లాడారు. సీమాంధ్ర ప్రభుత్వం జనావాసాల మధ్య ఓపెన్కాస్టలను ఏర్పాటు చేసి ప్రజలను నిర్వాసితులను చేసిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక జనావాసాలకు దూరంగా బొగ్గు గనులను ఏర్పాటు చేసుకుని ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకోవాలన్నారు. కొత్త గనుల ఏర్పాటుతో నిరుద్యోగులకు 50 వేల ఉద్యోగావకాశాలు కలుగుతాయన్నారు. సింగరేణి యాజమాన్యమే మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని, కార్మికుల పిల్లలకు అందులో ప్రత్యేక కోటా కల్పించాలన్నారు. సీఎం వైఖరితోనే ఏపీఎన్జీవోలతో జరిపిన చర్చలు విఫలమయ్యాయని విమర్శించారు. సీమాంధ్ర ఉద్యమం డ్రామా అని కొట్టిపడేశారు. సీమాంధ్ర సీఎంను తొలగించాలి.. మంచిర్యాల టౌన్ : మొదటి నుంచి కిరణ్ సీమాంధ్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడని చెబుతున్న వాస్తవాలు డీజీపీ వ్యాఖ్యలతో తేలిపోయాయని కవిత అన్నారు.బుధవారం మంచిర్యాలలోని టీఆర్ఎస్ భవన్లో జరిగిన బంగారు బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలతో బతుకమ్మ, కోలాటం ఆడిపడారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, మంచిర్యాలలో మహిళలు బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడంతో ముందుంటారని, ఈ నెల 12వ తేదీన హైదరాబాద్లో నిర్వహించనున్న బంగారు బతుకమ్మ వేడుకలకు మహిళలు భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ వేడుకలు హైదరాబాద్ మాది అని సీమాంధ్రులకు బతుకమ్మ సంబరాలతో తెలియజేస్తామన్నారు. అయితే సీఎంకు సహకరించిన డీజీపీ కూడా అవినీతిపరుడేనని అన్నారు. కేంద్రం రాష్టప్రతి పాలన విధించడమా లేదా సీమాంధ్ర సీఎంను తొలగించడమా తక్షణమే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కవిత వెంట ఎమ్మెల్యే సతీమణి హేమానళిని అరవిందరెడ్డి, జాగృతి మహిళా జిల్లా అధ్యక్షురాలు జోగుల శ్రీదేవి, మండల కన్వీనర్ పుష్ప, పట్టణ కన్వీనర్ తిరుమల, టీఆర్ఎస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు అత్తి సరోజ, స్నేహ ఫౌండేషన్ అధ్యక్షురాలు భాగ్యలకిష్మ, ప్రధాన కార్యదర్శి చందన, సభ్యులు మణిమాల, సంగీత, మహిళలు పాల్గొన్నారు. -
నేడు ఖమ్మంలో ‘బంగారు బతుకమ్మ’
ఖమ్మం కల్చరల్, న్యూస్లైన్: తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో ఖమ్మంలో ఆదివారం ‘బంగారు బతుకమ్మ’ను భారీగా నిర్వహించనున్నట్టు ఈ కార్యక్రమ నిర్వాహక కమిటీ కన్వీనర్ ఈశ్వరప్రగడ హరిబాబు తెలిపారు. ఆయన శనివారం ఖమ్మంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాపరిషత్ వద్ద ఆదివారం సాయంత్రం బతుకమ్మల శోభాయాత్రను తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రారంభిస్తారని చెప్పారు. ఈ యాత్ర నయాబజార్ కళాశాల వరకు సా గుతుందని, అనంతరం అక్కడ బతుకమ్మ ఆట-పాట, సభ ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్య లో మహిళలు, 250మంది కళాకారులు పాల్గొంటారని చె ప్పారు. కార్యక్రమంలో ఉత్తమంగా ఎంపిక చేసిన నాలుగు బతుకమ్మలకు వరుసగా 5000, 3000, 2000, 1000 రూ పాయల నగదు బహుతులను డాక్టర్స్ జేఏసీ కన్వీనర్ డాక్టర్ కెవి.కృష్ణారావు సహకారంతో ఇవ్వనున్నట్టు తెలిపారు. ఖమ్మంలో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే పలు కార్యక్రమాలలో కల్వకుంట్ల కవిత పాల్గొంటారని చెప్పారు. ఉదయం ఎనిమిది గంటలకు స్థంభాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామికి పూజలు చేస్తారని, 10:30 గంటలకు బైపాస్ రోడ్డులో తెలంగాణ జాగృతి సంస్థ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. 11 గంటలకు టీఎన్జీఓ కార్యాలయంలో బతుకమ్మల పేర్పులో, మధ్యాహ్నం 12 గంటలకు సంభాని నగర్లో టీజేఏసీ నిర్వహించే బతుకమ్మ సంబురాలలో పాల్గొంటారని అన్నారు. మూడు గంటలకు మామిళ్ళగూడెంలోని రామాలయం వద్ద బతుకమ్మ సంబురాలలో, సాయంత్రం నాలుగు గంటలకు జిల్లా కోర్టు ప్రాంతంలో న్యాయవాదుల జేఏసీ నిర్వహించే బతుకమ్మ ఆట-పాట కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో టీజేఏసీ జిల్లా నాయకుడు కూరపాటి రంగరాజు, తెలంగాణ జాగృతి సంస్థ రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ ఉస్మాన్ పాషా, కార్యక్రమాల అమలు కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు తానిపర్తి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. జయప్రదం చేయండి ఖమ్మం మామిళ్లగూడెం: తెలంగాణ సం సృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా నగరంలో ఆదివారం జరిగే ‘బంగారు బ తుకమ్మ’ కార్యక్రమాన్ని జయప్రదం చే యాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దిం డిగల రాజేందర్ ఒక ప్రకటనలో కోరా రు.కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా మహి ళలు పెద్దసంఖ్యలో పాల్గొనాలని కోరారు. -
తెలంగాణ సంస్కృతిని కాపాడుకుందాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సంస్కతిని కాపాడుకునేందుకు కృషి చేయాలని పలువురు తెలంగాణవాదులు కోరారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం ‘బతుకమ్మ’ వ్యాస సంకలనాన్ని జాగృతి వ్యవస్థాపకురాలు కె.కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ ఎడిటర్ అల్లం నారాయణ, సంపాదకుడు కె.శ్రీనివాస్, కవి నందిని సిధారెడ్డి, క ళాకారుడు దేశ్పతి శ్రీనివాస్, రచయిత గటిక విజయ్కుమార్, తెలంగాణ జాగృతి యువత అధ్యక్షుడు దాస్యం విజయ్భాస్కర్ తదితరులు ప్రసంగించారు. బతుకమ్మ తెల ంగాణ సంస్కృతిలో భాగమే కాకుండా ఈ ప్రాంత ప్రజలు సంబంధాలను కలిపే వేదికని అన్నారు. సీమాంధ్ర పాలకులు తెలంగాణ సంస్కృతిని దెబ్బతీశారని, పలు మీడియా సంస్థలు సైతం అందుకు ఆజ్యం పోశాయని ఆరోపించారు. బంగారు బతుకమ్మ పేరుతో తెలంగాణ జాగృతి చేపట్టబోయే కార్యక్రమ వివరాలను ఈ సందర్భంగా కవిత వెల్లడించారు. శుక్రవారం నుంచి జిల్లాల వారీగా బంగారు బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహించి ఈనెల 12న ట్యాంక్బండ్ వద్ద పెద్ద ఎత్తున మహిళలంతా బతుకమ్మ ఆడనున్నట్లు చెప్పారు. కాళోజీ నారాయణరావు మొదలుకొని నేటితరం రచయిత నందిని సిధారెడ్డి వరకు బతుకమ్మ పండుగపై రాసిన కవితలను సంకలనం రూపంలో ఆవిష్కరించడం అభినందనీయమన్నారు. బతుకమ్మ పండగ ఉద్యమ సంకేతంగా మారిందని, మర్చిపోతున్న పండుగను తెలంగాణ ఉద్యమం నిలబెట్టిందని అల్లం నారాయణ అన్నారు. డిగ్రీ కూడా చదవని ఏపీఎన్జీవో నేత అశోక్బాబు తెలంగాణ సంస్కృతి గురించి మాట్లాడటం వింతగా ఉందని ఎద్దేవా చేశారు. కె.శ్రీనివాస్ మాట్లాడుతూ...అస్తిత్వానికి ప్రతీకగా ఉన్న బతుకమ్మ పండుగను కాపాడుకునేందుకు తెలంగాణలోని చెరువులు సంరక్షించుకోవడం ముఖ్యమన్నారు.