third day
-
మూడో రోజూ లాభాలు
ముంబై: ఐటీసీ, ఎల్అండ్టీ, మారుతీ సుజుకీ షేర్ల రికార్డుల ర్యాలీతో పాటు ఈ ఏడాదిలో మూడు సార్లు వడ్డీరేట్ల తగ్గింపు ఉండొచ్చనే ఫెడ్ రిజర్వ్ సంకేతాలతో స్టాక్ సూచీలు మూడోరోజూ లాభాలు ఆర్జించాయి. సెన్సెక్స్ 191 పాయింట్లు పెరిగి 72,832 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 83 పాయింట్లు బలపడి 22,097 వద్ద నిలిచింది. ఉదయం భారీ నష్టాలతో మొదలైన సూచీలు జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాల ప్రభావంతో వెంటనే లాభాల్లోకి మళ్లాయి. ఒక దశలో సెన్సెక్స్ 474 పాయింట్లు పెరిగి 73,115 వద్ద, నిఫ్టీ 169 పాయింట్లు ఎగసి 22,181 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. అయితే యాక్సెంసర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) ఆదాయ వృద్ధి అంచనాల తగ్గింపుతో ఐటీ, టెక్ షేర్లలో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి సూచీల లాభాలను పరిమితం చేసింది. బీఎస్ఈ స్మాల్, మిడ్ ఇండెక్సులు వరుసగా 1.06%, 0.38% చొప్పున లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. రంగాల వారీగా బీఎస్ఈలో టెలికమ్యూనికేషన్ 2.28%, ఆటో 1.67%, రియల్టీ 1.40% కన్జూమర్ డి్రస్కిషనరీ 1.20%, ఇండస్ట్రీస్, మెటల్స్ 1.17%, ప్రభుత్వరంగ బ్యాంకులు 1% చొప్పున లాభపడ్డాయి. ఐపీఓకు స్టాలియన్ ఇండియా ఫ్లోరోకెమికల్స్, శ్రీ తిరుపతి బాలాజీ ఆగ్రో ట్రేడింగ్ ... కొద్ది రోజులుగా కళకళలాడుతున్న ప్రైమరీ మార్కెట్ల ప్రభావంతో తాజాగా రెండు కంపెనీలు ఐపీవో బాట పట్టాయి. ఇందుకు అనుమతించమంటూ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్లను దాఖలు చేశాయి. జాబితాలో మహారాష్ట్ర కంపెనీ స్టాలియన్ ఇండియా ఫ్లోరోకెమి కల్స్, మధ్యప్రదేశ్ కంపెనీ శ్రీ తిరుపతి బాలాజీ ఆగ్రో ట్రేడింగ్ ఉన్నాయి. జీవితకాల కనిష్టానికి రూపాయి రూపాయి విలువ శుక్రవారం జీవితకాల కనిష్ట స్థాయి 83.61 వద్ద ముగిసింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని బలహీనతలు, డాలర్ బలోపేత ధోరణి, దేశీయ క్యాపిటల్ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోవడం రూపాయి కోతకు కారణమయ్యాయని ట్రేడర్లు తెలిపారు. ఉదయం ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంతో పోలిస్తే 83.28 వద్ద మొదలైంది. ట్రేడింగ్లో ఏకంగా 52 పైసలు క్షీణించి 83.65 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరికి 48 పైసలు కోల్పోయి జీవితకాల కనిష్టం 83.61 వద్ద ముగిసింది. కాగా, ఇప్పటి వరకూ డాలర్ మారకంలో రూపాయి కనిష్ట ముగింపు (2023 డిసెంబర్13) 83.40 గా ఉంది. -
Stock market: మళ్లీ 72 వేలపైకి సెన్సెక్స్
ముంబై: అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, మహీంద్రాఅండ్మహీంద్రా షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు మూడో రోజూ లాభపడ్డాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లోని సానుకూల సంకేతాలు కలిసొచ్చాయి. సెన్సెక్స్ 228 పాయింట్లు పెరిగి 72వేల స్థాయిపైన 72,050 వద్ద నిలిచింది. నిఫ్టీ 71 పాయింట్లు బలపడి 21,911 వద్ద స్థిరపడింది. అమెరికా, ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ప్రథమార్థపు ట్రేడింగ్లో స్తబ్ధుగా కదలాడిన సూచీలు మిడ్సెషన్లో యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభంతో జోరు పెంచాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 71,644 వద్ద కనిష్టాన్ని, 72,165 వద్ద గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 21,795 – 21,954 శ్రేణిలో ట్రేడైంది. ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆయిల్అండ్గ్యాస్, విద్యుత్, ఆటో, ఐటీ, కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫార్మా, ఎఫ్ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈలో స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 1.24%, 0.93 % చొప్పున రాణించాయి. రంగాల వారీగా బీఎస్ఈ ఆయిల్అండ్గ్యాస్ 2.61%, యుటిలిటీస్ 2.59%, పవర్ 2%, ఆటో 1.41%, టెలికం 1.26% చొప్పున లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 3,064 కోట్ల షేర్లను విక్రయించగా.., సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,277 కోట్ల షేర్లు కొన్నారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ► డిసెంబర్ క్వార్టర్ నికర లాభం 61% వృద్ధి నమోదుతో మహీంద్రాఅండ్మహీంద్రా షేరు దూసుకెళ్లింది. బీఎస్ఈలో ఆరున్నరశాతం పెరిగి రూ.1766 వద్ద ముగిసింది. ట్రేడింగ్లో 8% ర్యాలీ చేసి రూ.1784 ఆల్టైం హైని నమోదు చేసింది. సెన్సెక్స్, ► ఫెమా నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి తన అనుబంధ సంస్థ పీపీబీఎల్ అధికారులపై ఈడీ విచారణ కొనసాగుతుండంతో పేటీఎం షేరు బీఎస్ఈలో 5% లోయర్ సర్క్యూట్తో రూ.325 వద్ద లాకైంది. ► ప్రభుత్వరంగ ఎన్ఎండీసీ షేరు 5% లాభపడి రూ.246 వద్ద ముగిసింది. క్యూ3లో నికర లాభం జోరుతో ట్రేడింగ్లో 7% ఎగసి రూ.253 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకింది. ► బ్లాక్డీల్ ద్వారా రెండుశాతానికిపైగా వాటాకు సమానమైన రూ.2,600 కోట్ల విలువైన షేర్లు చేతులు మారినట్లు వార్తలు వెలుగులోకి రావడంతో వేదాంత షేరు 4% నష్టపోయి రూ.268 వద్ద ముగిసింది. -
Stock market: మూడో రోజూ వెనకడుగు
ముంబై: స్టాక్ మార్కెట్ మూడోరోజూ నష్టాలు చవిచూసింది. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు మూడోరోజూ అమ్మకాల ఒత్తిడికి లోనవడం, ఐటీ షేర్ల బలహీన ట్రేడింగ్, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు సందేహాలు సెంటిమెంట్ను దెబ్బతీశాయి. ఫలితంగా సెన్సెక్స్ 314 పాయింట్లు నష్టపోయి 71,187 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 110 పాయింట్లు పతనమై 21,462 వద్ద స్థిరపడింది. ఉదయం ఆసియాలో జపాన్, సింగపూర్, థాయిలాండ్ సూచీలు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు 1% లాభపడ్డాయి. అమెరికా మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ► డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు మూడోరోజూ అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బీఎస్ఈలో 3% నష్టపోయి రూ.1,487 వద్ద స్థిరపడింది. బుధ, గురవారాల్లో 11% నష్టపోవడంతో బ్యాంకు మార్కెట్ విలువ రూ.1.45 లక్షల కోట్లు కోల్పోయి రూ.11.28 లక్షల కోట్లకు దిగివచి్చంది. ► ఐసీఐసీఐ ప్రుడెన్సియల్ లైఫ్ ఇన్సూరెన్స్ షేరు 6% నష్టపోయి రూ.486 వద్ద ముగసింది. మూడో క్వార్టర్ ఆర్థిక ఫలితాలు మెప్పించకపోవడం ఇందుకు కారణం. ► క్యూ3 ఫలితాలు అంచనాలకు అందుకోలేకపోవడంతో ఎల్టీఐమైండ్ట్రీ షేరు 11% నష్టపోయి రూ.5,602 వద్ద స్థిరపడింది. -
భారత్తో రెండో టెస్టు: వెస్టిండీస్ నిలకడ
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: భారత్తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ కుప్పకూలిపోకుండా జాగ్రత్తగా ఆడుతోంది. మ్యాచ్ మూడో రోజు శనివారం టీ విరామ సమయానికి విండీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కెపె్టన్ క్రెయిగ్ బ్రాత్వైట్ (235 బంతుల్లో 75; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా...బ్లాక్వుడ్ (16 నాటౌట్), అలిక్ అతనజ్ (13 నాటౌట్) క్రీజ్లో ఉన్నారు. వర్షం కారణంగా మూడో రోజు ఆటకు అంతరాయం కలిగింది. తొలి సెషన్లో 10.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కాగా, విండీస్ 31 పరుగులు చేసి కిర్క్ మెకన్జీ (57 బంతుల్లో 32; 4 ఫోర్లు, 1 సిక్స్) వికెట్ కోల్పోయింది. తొలి టెస్టు ఆడుతున్న మెకన్జీని భారత్ తరఫున అరంగేట్రం చేసిన ముకేశ్ కుమార్ తన తొలి వికెట్గా పెవిలియన్ పంపించడం విశేషం. ముకేశ్ వేసిన బంతిని ఆడలేక మెకన్జీ కీపర్ ఇషాన్ కిషన్కు క్యాచ్ ఇచ్చాడు. క్రీజ్లో ఉన్నంత సేపు మెకన్జీ కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. ఉనాద్కట్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అతను అశ్విన్ బౌలింగ్లో మిడాఫ్ మీదుగా సిక్స్ బాదాడు. లంచ్ విరామ సమయానికి బ్రాత్వైట్ 49 పరుగుల వద్ద ఉన్నాడు. రెండో సెషన్ ప్రారంభం కాగానే బ్రాత్వైట్ 170 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఇదే సెషన్లో అతని వికెట్ తీయడంలో భారత్ సఫలమైంది. అశ్విన్ వేసిన చక్కటి బంతి బ్రాత్వైట్ మిడిల్ స్టంప్ను తాకింది. ఆ తర్వాత బ్లాక్వుడ్, అతనజ్ కలిసి జట్టును నడిపించారు. మరో 13.2 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన టీమిండియా ఈ జోడీని విడదీయడంలో విఫలమైంది. రెండు రివ్యూలు కూడా భారత్కు ప్రతికూలంగా వచ్చాయి. తొలి టెస్టుతో పోలిస్తే ఈ మ్యాచ్లో వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంతో మెరుగ్గా కనిపించింది. రెండో రోజు వెస్టిండీస్ ఓపెనర్లు పట్టుదలగా ఆడి శుభారంభం అందించారు. బ్రాత్వైట్, తేజ్ నారాయణ్ చందర్పాల్ (95 బంతుల్లో 33; 4 ఫోర్లు) కలిసి 34.2 ఓవర్ల పాటు క్రీజ్లో నిలిచి 71 పరుగులు జోడించారు. జడేజా ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. షాట్ ఆడబోయిన చందర్పాల్ పాయింట్లో అశ్విన్కు క్యాచ్ ఇచ్చాడు. అయితే బ్రాత్వైట్, మెకన్జీ కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ 41 ఓవర్లలో వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. బ్రాత్వైట్ (37 నాటౌట్), మెకన్జీ (14 నాటౌట్) అజేయంగా నిలిచారు. -
ఫ్రాన్స్లో ఆగని నిరసనలు
పారిస్: ఫ్రాన్స్లో పోలీసు కాల్పుల్లో యువకుడి మృతి ఘటన అనంతరం మొదలైన ఉద్రిక్తతలు మూడో రోజు రాత్రి కూడా కొనసాగాయి. నిరసనకారులు వీధుల్లో అడ్డంకులు ఏర్పాటు చేసి, కార్లు, దుకాణాలు, ప్రభుత్వ భవనాలకు నిప్పుపెడుతున్నారు. పోలీసులపై రాళ్లతో దాడులు చేస్తున్నారు. బాణసంచా కాల్చి పోలీసుల పైకి వదులుతున్నారు. పారిస్ శివారుల్లో ఆందోళనకారులు ఒక బస్డిపోకు, రోడ్లపై కార్లకు నిప్పుపెట్టారు. పారిస్లోని 12వ డిస్ట్రిక్ట్ పోలీస్స్టేషన్పై దాడి జరిగింది. రివోలీ వీధిలోని కొన్ని దుకాణాలను, నగరంలోని అతిపెద్ద షాపింగ్ మాల్ ఫోరం డెస్ హాలెస్ను దోచుకున్నారు. పరిస్థితులను చక్కదిద్దేందుకు అధికారులు 40వేల మంది పోలీసులను రంగంలోకి దించారు. టియర్ గ్యాస్, వాటర్ కెనన్లను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొడ్తున్నారు. శివారు ప్రాంతాల్లో రాత్రి వేళ కర్ఫ్యూ విధిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పారిస్లో బస్సు, ట్రామ్ సర్వీసులను నిలిపివేశారు. ఆందోళనకారుల దాడుల్లో 200 మంది పోలీసులు గాయపడ్డారు. అదుపులోకి తీసుకున్న 667 మంది ఆందోళనకారుల్లో 307 మంది పారిస్ రీజియన్కు చెందినవారేనని అధికారులు తెలిపారు. ప్రశాంత పరిస్థితులను నెలకొల్పేందుకు కఠినంగా వ్యవహరిస్తామని అంతరంగిక శాఖ మంత్రి గెరాల్డ్ ప్రకటించారు. ఇలా ఉండగా, పారిస్ శివారు నాంటెర్రె వద్ద మంగళవారం యువకుడిపై కాల్పులు జరిపిన పోలీసు అధికారిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన 17 ఏళ్ల నహేల్ కుటుంబం ఆఫ్రికా దేశం అల్జీరియా నుంచి వలస వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనతో మరోసారి ఫ్రాన్స్ పోలీసుల జాతి దురహంకార వైఖరిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాదిలో మరో ఇద్దరిని కూడా పోలీసులు తనిఖీల సమయంలోనే కాల్చి చంపినట్లు చెబుతున్నారు. ఫ్రాన్స్ అల్లర్లు బెల్జియం రాజధాని బ్రస్సెల్స్కు కూడా పాకాయి. బాహాబాహీకి దిగిన 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు చోట్ల ఆందోళనకారులు భవంతులకు, వాహనాలకు నిప్పుపెట్టారని ప్రభుత్వం తెలిపింది. టీనేజర్లను బయటకు రానివ్వకండి: తల్లిదండ్రులకు మాక్రాన్ వినతి దేశమంతటా వ్యాపిస్తున్న అల్లర్లను అణచివేసే క్రమంలో టీనేజీ యువకులను ఇంట్లోనే ఉంచి తోడ్పడాలని అధ్యక్షుడు ఎమ్మానుయేల్ మాక్రాన్ తల్లిదండ్రులను కోరారు. దేశంలో అల్లర్లకు సోషల్ మీడియానే హింసను ప్రేరేపిస్తోందని ఆరోపించారు. శుక్రవారం ఆయన సీనియర్ మంత్రులతో అత్యవసరంగా సమావేశమై శాంతి భద్రతలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసు కాల్పుల్లో 17 ఏళ్ల యువకుడి మృతి అనంతరం అశాంతిని వ్యాపింపజేయడంలో సోషల్ మీడియానే ప్రముఖంగా ఉందన్నారు. హింసాత్మక ఘటనలకు ప్రేరణ కలిగిస్తున్న సామాజిక మాధ్యమ వేదికలైన స్నాప్ చాట్, టిక్టాక్ వంటివి సున్నిత అంశాలకు సంబంధించిన కంటెంట్ను తొలగించాలని కోరారు. వీడియో గేమ్లు యువత మెదళ్లను విషతుల్యం చేస్తున్నాయని, దీంతో కొందరు అస్తమానం వీధుల్లోనే గడుపుతున్నారని వ్యాఖ్యానించారు. -
మూడవ రోజు బీఆర్ఎస్ నేతల పై ఐటీ దాడులు..!
-
మూడో రోజూ మార్కెట్ల జోరు
ముంబై: ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు బలపడ్డాయి. సెన్సెక్స్ 345 పాయింట్లు జంప్చేసి 62,846 వద్ద ముగిసింది. నిఫ్టీ 99 పాయింట్లు ఎగసి 18,599 వద్ద నిలిచింది. యూఎస్ మార్కెట్లు పుంజుకోవడం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ప్రభావంతో ఇన్వెస్టర్లు తొలి నుంచీ కొనుగోళ్లకే ఆసక్తి చూపారు. దీంతో మార్కెట్లు ఊగిసలాడినప్పటికీ లాభాల మధ్యే కదిలాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 524 పాయింట్లు పురోగమించి 63,026కు చేరింది. వెరసి 63,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. నిఫ్టీ సైతం 18,641 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. సానుకూల సెంటిమెంటు నేపథ్యంలో మూడు రోజుల్లో సెన్సెక్స్ 1,072 పాయింట్లు జమ చేసుకోగా.. నిఫ్టీ 313 పాయింట్లు లాభపడింది. దీంతో మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాల సమీపానికి చేరాయి. యూఎస్ రుణ పరిమితిపెంపునకు ఆదివారం సూత్రప్రాయ అనుమతి లభించడంతో ఇన్వెస్టర్లకు జోష్ వచ్చినట్లు స్టాక్ నిపుణులు పేర్కొన్నారు. ఎంఅండ్ఎం జూమ్ ఎన్ఎస్ఈలో కన్సూ్యమర్ డ్యురబుల్స్, మెటల్, బ్యాంకింగ్, ఆటో, రియల్టీ 0.6 శాతం స్థాయిలో బలపడితే.. ఆయిల్–గ్యాస్, ఐటీ 0.4 శాతం స్థాయిలో డీలా పడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో క్యూ4 ఫలితాల అండతో ఎంఅండ్ఎం 3.4 శాతం ఎగసింది. ఇతర బ్లూచిప్స్లో టైటాన్, కోల్ ఇండియా, టాటా స్టీల్, అల్ట్రాటెక్, ఎస్బీఐ లైఫ్, గ్రాసిమ్, హిందాల్కో, హెచ్డీఎఫ్సీ ద్వయం, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్, ఐటీసీ 2.6–1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఓఎన్జీసీ 3 శాతం పతనంకాగా.. దివీస్, పవర్గ్రిడ్, హెచ్సీఎల్ టెక్, మారుతీ, బీపీసీఎల్, బ్రిటానియా, అదానీ ఎంటర్, విప్రో 1.2–0.4 శాతం మధ్య క్షీణించాయి. చిన్న షేర్లు..: బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.3 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,921 లాభపడగా.. 1,715 నష్టపోయాయి. ఇటీవల దేశీ స్టాక్స్పట్ల ఆసక్తి చూపుతున్న విదేశీ ఇన్వెస్టర్లు తాజాగా నగదు విభాగంలో రూ. 1,758 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. దేశీ ఫండ్స్ సైతం రూ. 854 కోట్ల విలువైన స్టాక్స్ సొంతం చేసుకున్నాయి. కాగా.. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 0.2 శాతం నీరసించి 76.82 డాలర్లకు చేరింది. డాలరుతో మారకంలో రూపాయి స్వల్పంగా 4 పైసలు తగ్గి 82.63కు చేరింది. -
Agnipath Scheme: ఆరని అగ్గి
న్యూఢిల్లీ: సైన్యంలో నియామకాల కోసం తెచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశమంతటా నిరసన జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. బిహార్, పశ్చిమ బెంగాల్, హరియాణా, రాజస్తాన్, మహారాష్ట్ర, కేరళ, ఒడిశా, ఉత్తరప్రదేశ్, కేరళ, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో శనివారం సైతం ఆందోళనలు కొనసాగాయి. పలుచోట్ల హింసాకాండ చోటుచేసుకుంది. కొన్ని రాష్ట్రాల్లో యువత రోడ్లు, రైలు పట్టాలపై బైఠాయించారు. పుషప్లు చేస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. 369 రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు నరకం చూశారు. బిహార్లో రైల్వేస్టేషన్కు నిప్పు బిహార్లో యువకులు బంద్కు పిలుపునిచ్చారు. తారేగానా రైల్వే స్టేషన్కు నిప్పుపెట్టారు. రైల్వే పోలీసుల వాహనాన్ని ధ్వంసం చేశారు. దానాపూర్లో అంబులెన్స్పై దాడికి దిగారు. అందులోని ముగ్గురిని తీవ్రంగా కొట్టారు. రాళ్లు విసరడంతో భద్రతా సిబ్బంది గాయపడ్డారు. జెహానాబాద్ జిల్లాలో ఔట్పోస్టుపై దాడిలో పోలీసులు గాయపడ్డారు. రాష్ట్రంలో ఇంటర్నెట్ నిలిపివేత కొనసాగుతోంది. బంద్కు ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు, ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతిచ్చాయి. కర్ణాటకలోని ధార్వాడలో నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. బెంగాల్లో రైలు పట్టాల దిగ్బంధం పశ్చిమ బెంగాల్లో శనివారం కూడా నిరసనకారులు పట్టాలపై బైఠాయించడంతో ఉత్తర 24 పరగణాల జిల్లాలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. అగ్నిపథ్ వద్దంటూ యువకులు పట్టాలపైనే పుషప్స్ చేశారు. తమ భవిష్యత్తుతో ఆటలాడొద్దంటూ నినదించారు. ఆర్మీలో చేరేందుకు కొన్నేళ్లుగా సన్నద్ధమవుతున్న తమకు అన్యాయం చేయొద్దన్నారు. వారిని పోలీసులు చెదరగొట్టారు. కేరళలో భారీ నిరసన ర్యాలీలు కేరళలో నిరసనలు హోరెత్తాయి. ఫిజికల్, మెడికల్ ఫిట్నెస్ పూర్తి చేసుకొని ఫలితాల కోసం చూస్తున్న యువకులు తిరువనంతపురం, కోజికోడ్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. అగ్నిపథ్తో తమ అవకాశాలు దెబ్బతింటాయన్నారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే పుషప్స్ చేశారు. పథనంథిట్టలో ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలు రాళ్లు విసరడంతో పోలీసులు గాయపడ్డారు. యూపీలో 400 మందిపై కేసులు యూపీలో మీరట్, జాన్పూర్, కన్నౌజ్లో యువకులు నిరసన కొనసాగించారు. బస్సులు తగలబెట్టారు. యమునా ఎక్స్ప్రెస్వేపై బైఠాయించారు. బలియా, అలీగఢ్, గౌతమ్బుద్ధ నగర్, వారణాసి తదితర 17 ప్రాంతాల్లో నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 400 మందిపై కేసులు పెట్టినట్టు పోలీసులు ప్రకటించారు. అరెస్టు చేసిన 109 మందిని కోర్టులో హాజరు పరిచి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. లూథియానా రైల్వేస్టేషన్లో బీభత్సం హరియాణాలోని మహేందర్గఢ్లో ఆందోళనకారులు ఓ వాహనాన్ని తగలబెట్టారు. సోనిపట్, కైతాల్, ఫతేబాద్, జింద్లో భారీ నిరసనలకు దిగారు. రోహ్తక్–పానిపట్ హైవేను దిగ్బంధించారు. పంజాబ్లోని లూథియానా రైల్వే స్టేషన్లో నిరసనకారులు బీభత్సం సృష్టించారు. కిటికీల అద్దాలను, టికెట్ కౌంటర్లను ధ్వంసం చేశారు. రాజస్తాన్లోని జైపూర్, జోద్పూర్లోనూ వందలాదిగా రోడ్లపైకి వచ్చారు. అల్వార్లో జైపూర్–ఢిల్లీ హైవేను దిగ్బంధించారు. ఓ బస్సును ధ్వంసం చేశారు. చిదావాలో పట్టాలపై బైఠాయించిన వారిని పోలీసులు చెదరగొట్టారు. -
బీహార్లో ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ ఆందోళనలు
గయ: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షల్లో అక్రమాలు జరిగాయని నిరసిస్తూ బీహార్ లో ఆందోళనలు మూడవ రోజు కూడా కొనసాగాయి. బుధవారం గయ నగరంలో ఉద్యోగార్థులు రైలుకు నిప్పు పెట్టారు. దాదాపు 200 మంది అభ్యర్థులు రైల్వే స్టేషన్ కు చేరుకొని ఆగి ఉన్న ఓ రైలును తగలబెట్టారు. దీంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు, గయా జిల్లా పోలీస్ యంత్రాంగం, నిరసనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. నిరసనకారులపై పోలీసులు బాష్పవాయువు, జలఫిరంగులు ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కొంతమంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నామని, విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని గయ ఎస్ఎస్పీ ఆదిత్యకుమార్ చెప్పారు. నిరసనకారులు నిప్పటించిన కోచ్ యార్డ్ లో ఖాళీగా నిలిపి ఉందని, అందుకే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తూర్పు మధ్య రైల్వే సీపీఆర్వో రాజేష్ కుమార్ తెలిపారు. బీహార్ లోని గయా, పాట్నా, నలంద, నవాదా, ఆరా, హాజిపూర్ ప్రాంతాల్లో వేలాది మంది నిరసనకారులు రైలు పట్టాలపై రైలు రోకో చేశారని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని తెలిపారు. నిరసనల కారణంగా అధికారులు కొన్ని రైళ్లు రద్దు చేశారు. మరికొన్నింటిని ప్రత్యామ్నాయ మార్గాల్లో నడిపారు. ఆర్ఆర్బిఎన్టిపిసి(నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ) మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సిబిటి)లో ఉత్తీర్ణత సాధించిన వారికి మళ్లీ పరీక్షను నిర్వహించాలన్న రైల్వే నిర్ణయాన్ని అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారు. లెవల్ 2 నుండి లెవల్ 6 వరకు 35,000 పోస్ట్లకు పైగా ప్రకటనలు చేసిన పరీక్షలకు దాదాపు 1.25 కోట్ల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఎన్టిపిసి, లెవల్ 1 పరీక్షలను నిలిపివేత హింసాత్మక నిరసనల నేపథ్యంలో రైల్వే తన నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలు (ఎన్టిపిసి), లెవల్ 1 పరీక్షలను నిలిపివేసింది. వివిధ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల (ఆర్ఆర్బి) కింద పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారు, ఫెయిల్ అయిన వారి ఫిర్యాదులను పరిశీలించేందుకు ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత కమిటీ రైల్వే మంత్రిత్వ శాఖకు నివేదిక అందజేయనుంది. అభ్యర్థులు తమ సమస్యలు మరియు సూచనలను సంబంధిత వెబ్సైట్లో కమిటీకి తెలియజేయవచ్చని రైల్వే తెలిపింది. అభ్యంతరాలను తెలపడానికి మూడు వారాల సమయం ఇచ్చింది. ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం కమిటీ మార్చి 4లోపు రైల్వే మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేస్తుంది. నిరసనల సమయంలో విధ్వంసానికి, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడిన వారిని రైల్వేలో ఎన్నటికీ రిక్రూట్ చేయకుండా నిషేధిస్తామని హెచ్చరిస్తూ రైల్వే ఒక సాధారణ నోటీసును జారీ చేసింది. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం వద్దు్ద అభ్యర్థులెవ్వరూ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయవద్దని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. రిక్రూట్మెంట్ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న అభ్యర్థుల ఫిర్యాదులను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. కేంద్రం ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. అభ్యర్థులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని, తమ ఫిర్యాదులను అధికారికంగా ఉన్నత కమిటీకి అందించాలని సూచించారు. చట్టవిరుద్ధంగా ప్రవర్తించినవారిపై చర్యలుంటాయని తెలిపారు. అణచివేత ధోరణి సరికాదు అభ్యర్థులపై ప్రభుత్వ అణచివేత ధోరణి సరికాదని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా అభిప్రాయపడ్డారు. చర్చల ద్వారా వారి సమస్యలకు పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు. ’సత్యాగ్రహ’ మార్గంలో చాలా శక్తి ఉందని, ఆందోళనలు శాంతియుత మార్గంలో చేయాలని ఉద్యోగార్థులకు ఆమె విజ్ఞప్తి చేశారు. -
3వ రోజు నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
-
రంగారెడ్డి జిల్లాలో మూడోరోజు వైఎస్ షర్మిల పాదయాత్ర
-
తిరుమల బ్రహ్మోత్సవాలు: సింహ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు
-
నేడు మూడోరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
-
పార్లమెంట్లో మూడోరోజూ వైఎస్ఆర్సీపీ ఎంపీల ఆందోళన
-
పెట్రో పరుగు: ఇవాళ ఎంత పెరిగిందంటే!
సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా ఇంధన ధరల సెగ కొనసాగుతోంది. వాహనదారులు భయపడినట్టే అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతి రోజు నుంచి పెట్రో బాదుడు తప్పదన్న అంచనాల కనుగునే వరుసగా మూడో రోజు గురువారం కూడా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు నిర్ణయించాయి. లీటర్ పెట్రోలుపై .25పైసలు, డీజిల్ రూ.30 పైసలు చొప్పున పెంచేశాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.99, డీజిల్ రూ.81.42కు చేరింది. ప్రధాన నగరాల్లో లీటరుకు పెట్రోలు, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి ముంబైలో పెట్రోల్ రూ.97.34, డీజిల్ రూ.88.49 చెన్నైలో పెట్రోల్ రూ.92.90, డీజిల్ రూ.86.35 కోల్కతాలో పెట్రోల్ రూ.91.14, డీజిల్ రూ.84.26 బెంగళూరులో పెట్రోల్ రూ.94.01, డీజిల్ రూ.86.31 హైదరాబాద్లో పెట్రోల్ రూ.94.57, డీజిల్ రూ.88.77 అమరావతిలో పెట్రోల్ రూ.97.14, డీజిల్ రూ.90.79 విశాఖపట్టణం పెట్రోల్ రూ.95.90, డీజిల్ రూ.89.59 విజయవాడపెట్రోల్ రూ .96.72, డీజిల్ రూ. 90.41 చదవండి : కరోనా మరణ మృదంగం: సంచలన అంచనాలు -
మూడో రోజూ బాదుడు : వాహనదారులు బెంబేలు
సాక్షి, ముంబై: దేశీయంగా ఇంధన ధరల పరుగు కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు (ఫిబ్రవరి 11, గురువారం) పెట్రోల్ , డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. పెట్రోల్ ధరను 25 పైసలు, డీజిల్పై 30 పైసలు చొప్పున చమురు మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. ఈ తాజాపెంపుతో దేశవ్యాప్తంగా మెట్రోలలో ధరలు కొత్త గరిష్టాన్ని నమోదు చేశాయి. దీంతో వాహనా దారుల్లో అలజడి మొదలైంది. (Petrol Diesel Prices: కొనసాగుతున్న పెట్రో సెగ) ప్రధాన నగరాల్లో పెట్రోల్ , డీజిల్ ధరలు లీటరుకు ఢిల్లీలో పెట్రోలు రూ. 87.85 డీజిల్ రూ. 78.03 ముంబైలో పెట్రోలు రూ. 94.36 రూ. 84.94 కోల్కతాలో పెట్రోల్ ధర రూ .89.16డీజిల్ ధర రూ .81.61 చెన్నైలో పెట్రోల్ ధర రూ .90.18 డీజిల్ ధర రూ . 83.18 బెంగళూరులో పెట్రోల్ రూ.90.78 డీజిల్ రూ.82.72 హైదరాబాదులో పెట్రోల్ ధర రూ. 91.35, డీజిల్ ధర రూ. 85.11 అమరావతిలో పెట్రోల్ రూ. 93.99, డీజిల్ రూ. 87.25 మరోవైపు ఇంధన ధరల పెరుగుదలపై కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ లోక్సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. -
సెంచరీతో ఆదుకున్న రూట్
గాలె: శ్రీలంక, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతోన్న రెండో టెస్టు మూడోరోజు ఆటలో లంక లెఫ్టార్మ్ స్పిన్నర్ లసిత్ ఎంబుల్డేనియా (7/132), కెరీర్లో 99వ టెస్టు ఆడుతున్న ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ (309 బంతుల్లో 186; 18 ఫోర్లు)ల పోరాటం హైలైట్గా నిలిచింది. లసిత్ స్పిన్ ధాటికి సహచరులంతా పరుగులు చేయడానికి తడబడుతుంటే... అతన్ని సమర్థంగా ఎదుర్కొన్న జో రూట్ వరుసగా రెండో టెస్టులో శతకాన్ని నమోదు చేశాడు. దీంతో 98/2 ఓవర్నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ ఆటముగిసే సమయానికి 9 వికెట్లకు 339 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఇంకా 42 పరుగులు వెనుకబడి ఉంది. ఓవర్నైట్ స్కోరు 67తో ఆదివారం బరిలో దిగిన రూట్ టెస్టుల్లో 19వ సెంచరీని సాధించాడు. దీంతోపాటు ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు (8,238) చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానానికి చేరాడు. తొలి మూడు స్థానాల్లో అలిస్టర్ కుక్ (12,472), గ్రాహమ్ గూచ్ (8,900), అలెక్ స్టీవార్ట్ (8,463) ఉన్నారు. జాస్ బట్లర్ (55; 7 ఫోర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. కెరీర్లో తొమ్మిదో టెస్టు ఆడుతోన్న ఎంబుల్డేనియా ఈ మ్యాచ్లో స్యామ్ కరన్ (13) వికెట్తో ఇన్నింగ్స్లో 5 వికెట్ల ఘనతను మూడోసారి అందుకున్నాడు. ఆ తర్వాత డామ్ బెస్ (32; 4 ఫోర్లు), మార్క్ వుడ్ (1)లను కూడా పెవిలియన్ పంపి తన అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేశాడు. శ్రీలంక ప్లేయర్ తిరిమన్నె ఐదు క్యాచ్లు అందుకున్నాడు. తద్వారా వికెట్ కీపర్లు కాకుండా టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక క్యాచ్లు పట్టిన శ్రీలంక ఫీల్డర్గా గుర్తింపు పొందాడు. -
సుందరం శార్దూలం...
ఒక్క తొలి టెస్టు తప్ప... ప్రతీ టెస్టుకు ముందు భారత్కు ప్రతికూలతలే. మ్యాచ్ మొదలయ్యాక కష్టాలే! అయినా సరే ప్రతికూలతలకు ఎదురీదుతోంది. కష్టాలన్నీ అధిగమిస్తోంది. మ్యాచ్ మ్యాచ్కూ అనుభవజ్ఞులు దూరమవుతున్నా... రిజర్వ్ బెంచ్ సత్తా చాటుతోంది. నిజం చెప్పాలంటే టీమిండియాది పోరాటం కాదు... అంతకుమించిన ఉక్కు సంకల్పం. అందుకేనేమో ప్రత్యర్థి పైచేయి సాధిస్తున్న ప్రతీసారి భారత్ పిడికిలి బిగిస్తోంది. ఆతిథ్య జట్టును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో ఈ భారత్–ఆసీస్ సిరీస్ రసవత్తరంగా మారి యావత్ సంప్రదాయ క్రికెట్కు కొత్త జీవం పోస్తోంది. ఐదు రోజుల టెస్టు బోర్ కాదు బెస్ట్ అని చాటి చెబుతోంది. బ్రిస్బేన్: మెరుపుల టి20ల ముందు వెలవెల బోతున్న టెస్టులకు కాలం చెల్లలేదని భారత్, ఆస్ట్రేలియా సిరీస్ ప్రతీ మ్యాచ్లోనూ నిరూపిస్తోంది. కాదు కాదు చూపిస్తోంది. ఆఖరి టెస్టులో మూడో రోజు ఆటను భారత లోయర్ మిడిలార్డర్ బ్యాట్స్మెన్ శార్దుల్ ఠాకూర్ (115 బంతుల్లో 67; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), వాషింగ్టన్ సుందర్ (144 బంతుల్లో 62; 7 ఫోర్లు, 1 సిక్స్) మార్చేశారు. ఆతిథ్య బౌలర్లను వీళ్లిద్దరే శాసించారు. ఆదివారం తొమ్మిది మంది బ్యాటింగ్కు దిగితే ఈ జోడీ మాత్రమే ఆస్ట్రేలియాను చెమటలు కక్కించింది. భారత్ను కష్టాల నుంచి గట్టెక్కించింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 111.4 ఓవర్లలో 336 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో హాజల్వుడ్ (5/57) ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో 33 పరుగుల ఆధిక్యమే పొందిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో ఆట నిలిచే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఓపెనర్లు వార్నర్ (20 బ్యాటింగ్), హారిస్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ జట్టు ఓవరాల్ ఆధిక్యం 54 పరుగులు. నాలుగో రోజు రెండు జట్ల ఆటతీరే ఈ మ్యాచ్ ఫలితం ఎవరివైపు మొగ్గుతుందో తేల్చనుంది. భారత బౌలర్లు ఆసీస్ బ్యాట్స్మెన్ను కట్టడి చేస్తారా... భారత బౌలింగ్ను ధీమాగా ఎదుర్కొని భారీ స్కోరు చేసి ఆసీస్ నిలబడుతుందా వేచి చూడాలి. ‘వంద’ వరకే బాగుంది తొలి సెషన్ ఆరంభంలో బాగున్నట్లు కనిపించిన భారత ఇన్నింగ్స్ లంచ్లోపే కష్టాల్లోకి జారుకుంది. ఓవర్నైట్ స్కోరు 62/2తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ 100 పరుగుల దాకా బాగానే ఉంది. ఓవర్నైట్ బ్యాట్స్మెన్ చతేశ్వర్ పుజారా (94 బంతుల్లో 25; 2 ఫోర్లు), కెప్టెన్ రహానే (93 బంతుల్లో 37; 3 ఫోర్లు) నిలదొక్కుకుంటున్న తరుణంలో హాజల్వుడ్ దెబ్బతీశాడు. 105 స్కోరు వద్ద పుజారాను ఔట్ చేశాడు. వేగంగా దూసుకొచ్చి న బంతిని డిఫెన్స్ చేయడానికి ప్రయత్నించగా... అది పుజారా బ్యాట్ అంచును తగిలి కీపర్ పైన్ చేతుల్లో పడింది. తర్వాత లంచ్ విరామానికి కాస్తముందుగా రహానే ఆటను స్టార్క్ ముగించాడు. బెంబేలెత్తించిన హాజల్వుడ్ భారత్ 161/4 స్కోరుతో లంచ్ బ్రేక్కు వెళ్లొచ్చిన వెంటనే హాజల్వుడ్ నిప్పులు చెరిగే బౌలింగ్తో కుర్రాళ్లను హడలెత్తించాడు. దీంతో రెండో సెషన్ మొదలైన రెండో బంతికే మయాంక్ అగర్వాల్ (75 బంతుల్లో 38; 3 ఫోర్లు, సిక్స్) పెవిలియన్ చేరాడు. షాట్కు ప్రయత్నించిన మయాంక్ రెండో స్లిప్లో ఉన్న స్మిత్ చేతికి చిక్కాడు. కాసేపటికే రిషభ్ పంత్ (23; 2 ఫోర్లు) కూడా హాజల్వుడ్ బౌలింగ్లోనే అవుటయ్యాడు. బౌన్సర్ను షాట్గా మలిచేందుకు చేసిన పంత్ ప్రయత్నం బెడిసింది. అక్కడే గాల్లోకి లేచిన బంతిని గల్లీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న గ్రీన్ అందుకోవడంతో పంత్ ఇన్నింగ్స్ ముగిసింది. అప్పటికి భారత్ స్కోరు 186/6. గత టెస్టులో తమతో ఓ ఆటాడుకున్న పంత్ పెవిలియన్ చేరడం, ఇకపై వచ్చే స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ ఎవరూ లేకపోవడంతో ఆసీస్ శిబిరంలో ఆనందం ఆకాశాన్నంటింది. ఫిఫ్టీ–ఫిఫ్టీలతో బాగుపడింది కెరీర్లో తొలి టెస్టు ఆడుతున్న వాషింగ్టన్ సుందర్ ... రెండో టెస్టు మాత్రమే ఆడుతున్న శార్దుల్ ఠాకూర్లు బౌలింగ్ కేటగిరీలోనే తుది జట్టులోకి వచ్చారు. ఇద్దరికీ బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ ఆసీస్ గడ్డపై... అది కూడా స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్నే గడగడలాడిస్తున్న ఆసీస్ పేస్ త్రయం హాజల్వుడ్, కమిన్స్, స్టార్క్ను ఎదుర్కోగలరని ఎవరూ ఊహించలేదు. కానీ వీరిద్దరి ఆట అరివీర పేసర్ల బంతుల్ని తుత్తునీయలు చేసింది. తర్వాత్తర్వాత పరుగులతో ఇన్నింగ్స్ను పేర్చేసింది. అటుపై కష్టాల నుంచి జట్టును గట్టెక్కించింది. ప్రత్యర్థి భారీ ఆధిక్యానికి లొంగాల్సిన చోట భారీ భాగస్వామ్యాన్ని నిర్మించింది. దీంతో పంత్ అవుటైనప్పటి ఆనందం ఆసీస్లో క్రమంగా ఆవిరైంది. ఓవర్లు గడిచేకొద్దీ... పరుగులు పెరిగేకొద్దీ... ఇద్దరు అర్ధశతకాలు బాదేసేదాకా సాగిపోయింది. ఇది భారత్ ఇన్నింగ్స్ను పటిష్టస్థితికి తీసుకెళ్లింది. ప్రత్యర్థి బౌలింగ్ను నీరుగార్చేసింది. కమిన్స్ ఓవర్లో బ్యాక్వర్డ్ స్క్వేర్లెగ్లో సిక్సర్ బాదిన శార్దుల్... బౌండరీలనైతే మంచినీళ్ల ప్రాయంగా బాదేశాడు. సుందర్ కూడా లయన్ బౌలింగ్లో భారీ సిక్సర్ కొట్టాడు. ఇద్దరు చక్కని సమన్వయంతో ఫిఫ్టీలను పూర్తి చేసుకున్నారు. జట్టు స్కోరు 300 మార్క్ను దాటింది. గబ్బాలో ఏడో వికెట్కు అత్యధికంగా 123 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాక శార్దుల్ ఔటయ్యాడు. తర్వాత భారత్ ఇన్నింగ్స్ ఎంతో సేపు సాగలేదు. సైనీ (5), సిరాజ్ (13)లను హాజల్వుడ్ ... సుందర్ను స్టార్క్ అవుట్ చేయడంతో టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 369; భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) స్టార్క్ (బి) లయన్ 44; శుబ్మన్ గిల్ (సి) స్మిత్ (బి) కమిన్స్ 7; పుజారా (సి) పైన్ (బి) హాజల్వుడ్ 25; అజింక్య రహానే (సి) వేడ్ (బి) స్టార్క్ 37; మయాంక్ అగర్వాల్ (సి) స్మిత్ (బి) హాజల్వుడ్ 38; రిషభ్ పంత్ (సి) గ్రీన్ (బి) హాజల్వుడ్ 23; వాషింగ్టన్ సుందర్ (సి) గ్రీన్ (బి) స్టార్క్ 62; శార్దుల్ ఠాకూర్ (బి) కమిన్స్ 67; నవదీప్ సైనీ (సి) స్మిత్ (బి) హాజల్వుడ్ 5; సిరాజ్ (బి) హాజల్వుడ్ 13; నటరాజన్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 14; మొత్తం (111.4 ఓవర్లలో ఆలౌట్) 336. వికెట్ల పతనం: 1–11, 2–60, 3–105, 4–144, 5–161, 6–186, 7–309, 8–320, 9–328, 10–336. బౌలింగ్: స్టార్క్ 23–3–88–2, హాజల్వుడ్ 24.4–6–57–5, కమిన్స్ 27–5–94–2, గ్రీన్ 8–1–20–0, లయన్ 28–9–65–1, లబ్షేన్ 1–1–0–0. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: హారిస్ (బ్యాటింగ్) 1; డేవిడ్ వార్నర్ (బ్యాటింగ్) 20; మొత్తం (6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 21. బౌలింగ్: సిరాజ్ 2–1–12–0, నటరాజన్ 3–0–6–0, వాషింగ్టన్ సుందర్ 1–0–3–0. ► అరంగేట్రం టెస్టులోనే మూడు వికెట్లు తీయడంతోపాటు 50 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన పదో క్రికెటర్గా, భారత్ నుంచి మూడో క్రికెటర్గా వాషింగ్టన్ సుందర్ గుర్తింపు పొందాడు. భారత్ నుంచి సుందర్కంటే ముందు దత్తూ ఫాడ్కర్ (1947లో ఆస్ట్రేలియాపై సిడ్నీలో... 51 పరుగులు; 3/14), హనుమ విహారి (2018లో ఇంగ్లండ్పై ఓవల్లో... 56 పరుగులు; 3/37) ఈ ఘనత సాధించారు. ► భారత్పై టెస్టుల్లో 33 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కడం ఆస్ట్రేలియాకిది మూడోసారి. గతంలో 33 పరుగుల ఆధిక్యం పొందిన రెండుసార్లూ ఆస్ట్రేలియా (1979లో కాన్పూర్; అడిలైడ్ 2003) ఆ టెస్టుల్లో ఓడిపోవడం గమనార్హం. ► ఆస్ట్రేలియా గడ్డపై భారత బ్యాట్స్మన్ జోడీ ఏడో వికెట్కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పడం ఇది నాలుగోసారి. గతంలో రిషభ్ పంత్–రవీంద్ర జడేజా (204 పరుగులు; 2019లో సిడ్నీ)... విజయ్ హజారే–హేమూ అధికారి (132 పరుగులు; 1948లో అడిలైడ్)... అజహరుద్దీన్–మనోజ్ ప్రభాకర్ (101 పరుగులు; 1992లో అడిలైడ్) జోడీలు ఈ ఘనత సాధించాయి. -
రూపాయి.. హ్యాట్రిక్
ముంబై: డాలర్ మారకంలో రూపాయి బలోపేత ధోరణి కొనసాగుతోంది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో బుధవారం వరుసగా మూడవ ట్రేడింగ్ సెషన్లోనూ లాభాల బాటన పయనించిం ది. మంగళవారం ముగింపుతో పోల్చితే 27 పైసలు లాభంతో 74.19 వద్ద ముగిసింది. ట్రేడింగ్లో 74.49 వద్ద ప్రారంభమైన రూపాయి, 74.09 స్థాయి గరిష్ట, 74.52 కనిష్ట స్థాయిల్లో తిరిగింది. కారణాలు చూస్తే... ఆరు కరెన్సీలతో (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ట్రేడయ్యే– డాలర్ ఇండెక్స్ బలహీన ధోరణి, దేశంలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం, కరోనా వ్యాక్సిన్ సిద్ధమైపోయిందన్న వార్తలు రూపాయికి బలం చేకూర్చుతున్నట్లు ఫారెక్స్ ట్రేడర్లు పేర్కొంటున్నారు. విదేశీ వ్యవస్థాగత ఇన్వెస్టరు (ఎఫ్ఐఐ) క్యాపిటల్ మార్కెట్లో బుధవారం నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. రూ.3,072 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. గత రెండు సెషన్లలో ఎఫ్ఐఐలు బిలియన్ డాలర్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారనీ, దీనితో ఈ నెల్లో వీరి పెట్టుబడుల విలువ 5.1 బిలియన్ డాలర్లకు చేరిందని మోతీలాల్ ఓశ్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఫారెక్స్ అండ్ బులియన్ విశ్లేషకులు గౌరంగ్ తెలిపారు. మరింత పెరగాల్సిందే.. కానీ!: నిజానికి రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తరఫున ప్రభుత్వ రంగ బ్యాంకులు జరిపిన కొనుగోళ్లు రూపాయి బలోపేతానికి పగ్గాలు వేశాయి కానీ, లేదంటే భారత్ కరెన్సీ మరింత బలపడి ఉండేదని విశ్లేషకులు పేర్కొన్నారు. అలాగే దిగుమతిదారుల నుంచి కూడా డాలర్లకు డిమాండ్ ఉన్నట్లు రిలయెన్స్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ ఎనలిస్ట్ శ్రీరామ్ అయ్యర్ పేర్కొన్నారు. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). కాగా, ఈ వార్త రాస్తున్న రాత్రి 7.41 గంటల సమయంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ 92.40 వద్ద ట్రేడవుతుండగా, రూపాయి విలువ లాభాల్లో 74.21 వద్ద ట్రేడవుతోంది. -
మూడో రోజు జూనియర్ డాక్టర్ల సమ్మె
-
నేలతిమ్మాయిపల్లి నుంచి మూడో రోజు యాత్ర
-
మూడో రోజూ క్షీణించిన బంగారం ధర
న్యూఢిల్లీ: బులియన్ మార్కెట్లో బంగారం ధరలు శనివారం మరింత దిగివచ్చాయి. విదేశీ మార్కెట్లో డాలర్ తిరిగి రావడంతో సెంటిమెంట్ బలహీనంగా ఉంది. దీంతో వరుసగా మూడోరోజుకూడా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.55 లు క్షీణించింది. రూ. 29,370 స్థాయికి పడిపోయింది. దీంతోపాటు దేశీయ నగల మార్కెట్లో డిమాండ్ తగ్గడంతో దేశీయంగా కూడా ధరలు తగ్గాయి. వెండి ధర కూడా రూ .40వేల స్థాయికినుంచి దిగివచ్చింది. రూ. 225 నష్టంతో కిలో వెండి రూ .39,900 కి చేరుకుంది. విలువైన లోహాల కోసం డిమాండ్ తగ్గడం, స్థానిక నగల స్థానిక నగల నుంచి డిమాండ్ పడిపోవడం కూడా ధరల పతనానికి కారణమని మార్కెట్ వర్గాల అంచనా. ప్రపంచవ్యాప్తంగా బంగారం 0.88 శాతం పడిపోయి 1,266.40 డాలర్లకు చేరుకుంది. వెండి ధర 1.35 శాతం పెరిగి 17.17 డాలర్లకు చేరుకుంది. దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల ధర రూ. 55 తగ్గి 29,370 రూపాయలకు పడిపోయింది. గత రెండు రోజుల్లో పుత్తడి ధరలు 370 రూపాయలు క్షీణించాయి. ఫ్యూచర్స్ మార్కెట్లో పది గ్రా. పుత్తడి ధరలు రూ.114 తగ్గి రూ.29, 017 వద్ద ఉంది. సావరిన్ గోల్డ్ ఎనిమిది గ్రాముల ధర రూ. 100 తగ్గి రూ .24,400 కు పడిపోయింది. వెండి ధర 225 రూపాయల నుంచి రూ. 39,900 కి చేరుకుంది. -
మూడో రోజు 16,820 క్వింటాళ్ల పంపిణీ
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా వ్యాప్తంగా శుక్రవారం మూడో రోజు విత్తన పంపిణీ కొనసాగింది. మొదటి రెండు రోజులతో పోలిస్తే పంపిణీ సరళి కాస్తంత మెరుగుపడింది. మూడో రోజు 14,595 మంది రైతులకు 16,820 క్వింటాళ్లు విత్తనకాయలు పంపిణీ చేసినట్లు వ్యవసాయశాఖ జేడీ శ్రీరామమూర్తి శుక్రవారం ప్రకటించారు. మూడు రోజుల్లో 27,158 మంది రైతులకు 31,608 క్వింటాళ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు సర్వర్ మొరాయించడంతో బయోమెట్రిక్ మిషన్లు పనిచేయక రైతులు గంటల పాటు వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. సెంట్రల్ సర్వర్ ఫెయిల్ కావడంతో ఇబ్బందులు తలెత్తినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. ఉదయం 7 గంటలకే పంపిణీ కౌంటర్ల వద్ద రైతులు వేచి ఉండటం, సర్వర్ పని చేయకపోవడంతో ఇబ్బందులు తప్పలేదు. ఇక విత్తన నాణ్యతపై జిల్లా వ్యాప్తంగా చాలా మండలాల్లో రైతులు పెదవి విరుస్తున్నారు. పుల్లలు, నాసులు, కల్తీకాయలు ఎక్కువగా ఉన్నట్లు రైతులు ఫిర్యాదులు వచ్చాయి. అనంతపురం, ఉరవకొండ, మరికొన్ని మండల కేంద్రాల్లో రైతులు, రైతు సంఘాల నాయకులు ఈ అంశంపై అధికారులు, ఏజెన్సీలతో వాదులాటకు దిగారు. నిబంధన మేరకు విత్తనకాయల్లో నాణ్యత ప్రమాణాలు ఉన్నట్లు అధికారులు వాదిస్తున్నారు. 74 శాతం గట్టిదనం, 70 శాతం మొలక, 96 శాతం ఫిజికల్ఫ్యూరిటీ, 4 శాతం వ్యర్థాలు ఉండవచ్చనే నిబంధనలను ఏజెన్సీలు, ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకులు, పంపిణీ సంస్థలు బాగా ఉపయోగించుకోవడంతో రైతులకు నాసిరకం విత్తనం తప్పలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఫ్లాట్గా ముగిసిన మార్కెట్లు
ముంబై: ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాలతో ఆరంభంలో భారీ లాభాలను నమోదు చేసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. రోజంతా ఒడిదుడుకుల మధ్య సాగి, వరుసగా మూడో సెషన్లో కూడా నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్ 6 పాయింట్లు తగ్గి 26,299 వద్ద నిఫ్టీ 3 పాయింట్లు పెరిగి 8,112 వద్ద ముగిశాయి. రెండు రోజుల భారీ నష్టాల తరువాత దేశీ స్టాక్ మార్కెట్లు భారీ హెచ్చుతగ్గుల మధ్య కదలాడాయి. మిడ్ సెషన్ తరువాత అమ్మకాలు ఊపందుకోవడంతో నష్టాలలోకి జారుకున్నాయి. ముఖ్యంగా ఫార్మా, బ్యాంకింగ్, రియల్టీ, ఎఫ్ఎంసీజీ, మెటల్స్ రంగాలు నష్టపోగా ఐటీ, ఆటో వంటి రంగాలు స్వల్ప లాభాల్లో ముగిసాయి. మీడియా, ఐటీ, ఆటో షేర్ల లాభాలు మార్కెట్లకు అండగా నిలిచాయి. మరోవైపు బ్యాంకింగ్, ఫార్మా, రియల్టీ షేర్లలో అమ్మకాలజోరు కొనసాగింది. ఏషియన్ పెయింట్స్, జీ, ఐషర్, టెక్మహీంద్రా, టీసీఎస్, మారుతీ, హెచ్డీఎఫ్సీ, భారతీ, యస్బ్యాంక్ లాభాలను ఆర్జించగా హిందాల్కో, ఐటీసీ, అరబిందో, సిప్లా, అంబుజా, లుపిన్, డాక్టర్ రెడ్డీస్, కొటక్ బ్యాంక్, గెయిల్ నష్టపోయాయి. అటు టుబాకో రంగంలో ఎఫ్డిఐలపై నిషేధించేందుకు కేంద్రం యోచిస్తోందన్న వార్తలతో ఐటీసీ భారీగా నష్టపోయింది. దాదాపు 3 శాతం పతనమైంది. అటు డాలర్ మారకపు విలువలో రూపాయి 9 పైసలు నష్టపోయి 67.83 వద్ద ఉంది.ఎంసీఎక్స్ మార్కెట్లో పసిడి స్వల్ప లాభంతో పది గ్రా. 29.321 వద్ద ఉంది. -
ఇంగ్లండ్కు భారత్ ధీటైన జవాబు