Traditional
-
ప్రధాన మీడియాకు ఆన్లైన్ ప్లాట్ఫాంలు...పరిహారం ఇవ్వాల్సిందే
న్యూఢిల్లీ: కొత్త తరాన్ని ఆకట్టుకునేందుకు పుంఖానుపుంఖాలుగా పుట్టుకొస్తున్న ఆన్లైన్ మీడియా ప్లాట్ఫాంల వల్ల వార్తాపత్రికలు, వార్తా చానళ్ల వంటి సంప్రదాయ ప్రధాన స్రవంతి మీడియా సంస్థలు ఆర్థికంగా నష్టపోతున్నాయని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అభిప్రాయపడ్డారు. ‘‘సంప్రదాయ మీడియా సంస్థలకు సంబంధించిన కంటెంట్ను ఆన్లైన్ ప్లాట్ఫాంలు విస్తారంగా వాడుకుంటున్నాయి. ఇందుకు వాటికవి సముచిత పరిహారం చెల్లించాల్సి ఉంటుంది’’ అని స్పష్టం చేశారు. ఈ దిశగా చర్యలు తీసుకునేందుకు కేంద్రం కృషి చేస్తోందని వెల్లడించారు. గురువారం స్టోరీబోర్డ్18 డీఎన్పీఏ సదస్సును ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో సంప్రదాయ మీడియా పెను సవాళ్లను ఎదుర్కొంటోందని అభిప్రాయపడ్డారు. ‘‘ఆన్లైన్ ప్లాట్ఫాంలు కృత్రిమ మేధ (ఏఐ) తదితరాల సాయంతో కంటెంట్ను అత్యంత ఆకర్షణీయంగా రూపొందిస్తూ పాఠకులు, వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. దాంతో యువత సంప్రదాయ మీడియా నుంచి పూర్తిగా డిజిటల్ మీడియావైపు మళ్లుతోంది. ఈ పరిస్థితుల్లో సంప్రదాయ మీడియా తన పాత్రను సమీక్షించుకోవాల్సి ఉంది. శరవేగంగా చోటుచేసుకుంటున్న కొత్త తరం మార్పులకు అనుగుణంగా తనను తాను మార్చుకోవాలి. ఇది చాలా ముఖ్యం’’ అని సూచించారు. ఈ మార్పిడి క్రమంలో సంప్రదాయ మీడియాకు అన్నివిధాలా దన్నుగా నిలిచేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వెల్లడించారు. డిజిటల్ ప్లాట్ఫాంలు తమ ఆదాయంలో సంప్రదాయ ప్రధాన స్రవంతి మీడియా సంస్థలకు సముచిత వాటా ఇచ్చేలా పలు దేశాల్లో ఇప్పటికే చట్టాలు అమల్లో ఉన్నాయని సమాచార ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘‘భారత్లో మాత్రం ఇంకా ఆ పరిస్థితి లేదు. డిజిటల్ మీడియా ప్లాట్ఫాంలకు ఇప్పటికీ ప్రధాన స్రవంతి సంస్థల కంటెంటే ప్రధాన వనరు. కానీ వాటి ఆదాయంలో మాత్రం ప్రధాన మీడియా సంస్థలకు తదనుగుణంగా అందడం లేదు’’ అన్నారు. -
అస్సాం సత్రియా చారిత్రాత్మక అరంగేట్రం
యాగ్రాజ్లో జరిగే మహా కుంభమేళాలో అస్సాం సత్రియా సంస్కృతిని ప్రదర్శించనున్నారు. మజులిలోని ఔనియాతి సత్రం నుంచి 40 మంది సభ్యుల బృందం సాంప్రదాయ సత్రియా నృత్యం, సంగీతం, నాటకాన్ని ప్రదర్శిస్తుంది, ఇది రాష్ట్ర ఆధ్యాత్మిక, కళాత్మక వారసత్వంలోకి ఒక ప్రత్యేకమైన విండోను అందిస్తుంది. ఈ ప్రదర్శనలలో శ్రీమంత శంకరదేవుని భక్తి నాటకం రామ్ విజయ్ భావోనా, దిహా నామ్ (సామూహిక గానం), సాంప్రదాయ బోర్గీత్, ఖోల్, సింబల్స్, ఫ్లూట్, వయోలిన్, దోతర వంటి వాయిద్యాలతో కూడిన నృత్యం ఉంటుంది. ఈ బృందం పురుష (పారశిక్ భాంగి), స్త్రీ (స్త్రీ భాంగి) నృత్య శైలులను ప్రదర్శిస్తుంది. 2000 సంవత్సరంలో భారతదేశ శాస్త్రీయ నృత్య రూపాలలో ఒకటిగా గుర్తింపు పొందిన సత్రియాను 15వ శతాబ్దంలో శ్రీమంత శంకరదేవుడు నృత్యం, నాటకం, సంగీతం ద్వారా శ్రీకృష్ణుని బోధనలను వ్యాప్తి చేయడానికి భక్తి మార్గంగా ప్రవేశపెట్టారు. కుంభమేళాలో ప్రదర్శనలు సత్రియాకు కేంద్రంగా ఉన్న గొప్ప కథ చెప్పడం, ఆధ్యాత్మిక ఇతివృత్తాలను ప్రతిబింబిస్తాయి. ఔనియాతి సత్రం సత్రాధికార్ పీతాంబర్ దేవ్ గోస్వామి, అస్సాం సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిష్టాత్మక వేదికపై ప్రాతినిధ్యం వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ బృందం జనవరి 31 నుండి ఫిబ్రవరి 10, 2025 వరకు ప్రయాగ్రాజ్లో ఉంటుంది. భగవత్ పఠనాన్ని నిర్వహిస్తుంది. ఈ భాగస్వామ్యం అస్సాంకు ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఇది జనవరి 13 నుండి ఫిబ్రవరి 26, 2025 వరకు జరిగే పవిత్ర కుంభమేళాలో ప్రపంచ ప్రేక్షకులతో దాని సాంస్కృతిక సంప్రదాయాలను పంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. (చదవండి: సేఫ్ లడకీ దేశాన్ని చుట్టేస్తోంది!) -
గీతాభాస్కర్ సమర్పించు సంక్రాంతికి సకినాలు
గీతాభాస్కర్ సినిమాలలో నటిస్తే నటన ఎక్కడా కనిపించదు. పూర్తిగా సహజత్వమే. ఆమె ఏ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లోనూ శిక్షణ తీసుకోలేదు. ‘డెస్టినీస్ చైల్డ్’ అనే పుస్తకం రాస్తే.... ‘పుస్తకం అంటే ఇలా ఉండాలి నాయనా’ అనిపిస్తుంది. ఆమె పెద్ద పుస్తకాలు రాసిన పెద్ద రచయిత్రి కాదు. నటన అయినా రచన అయినా వంట అయినా... ఏదైనా ఇట్టే నేర్చుకోగల సామర్థ్యం గీతమ్మ సొంతం. గీత పుట్టి పెరిగింది చెన్నైలో. అయినప్పటికీ... ఆమె సకినాలు చేస్తే తెలంగాణ పల్లెకి చెందిన తల్లి చేసినంత రుచిగా ఉంటాయి. పెళ్లయిన తరువాత గీత... దాస్యం గీతాభాస్కర్ అయింది. అత్తగారిది పక్కా తెలంగాణ. తెలంగాణ అంటే ది గ్రేట్ సకినాలు. ఇక నేర్చుకోకుండా ఉంటారా! సకినాలు ఎలా చెయ్యాలి... నుంచి ఫ్యామిలి ముచ్చట్ల వరకు ‘సాక్షి’తో పంచుకున్నారు గీతాభాస్కర్. ఆమె మాటల్లోనే.. అరిసెల పిండిలానే సకినాల పిండి కూడా తయారు చేసుకోవాలి. మామూలుగా వరి పిండి అయితే గట్టిగా అయిపోతుంది. పైగా అంతకుముందు వేరే గోధుమ పిండిలాంటివి పట్టి ఉంటే... అదే గిర్నీలో ఈ పిండి పడితే సరిగ్గా ఉండదు. అదే తడి పిండి అనుకోండి వేరే పిండి ఏదీ పట్టరు... బియ్యం పిండి మాత్రమే పడతారు. అయితే అరిసెల పిండికి రోజంతా బియ్యం నానబెట్టాలి. కానీ సకినాలకి నాలుగు గంటలు నానబెడితే సరిపోతుంది.మా ఆయన ఉన్నప్పుడు ముగ్గుల పోటీకి తీసుకుని వెళ్లేవారు. ఒకసారి గవర్నర్ చేతుల మీదగా బహుమతి కూడా అందు కున్నాను. పండగ రోజున మంచి మంచి ముగ్గులు వేస్తుంటాను. నా ముగ్గులన్నీ డిఫరెంట్గా ఉంటాయి. దసరా, సంక్రాంతి అంటే ముగ్గుల పోటీలో నేను పాల్గొనాల్సిందే. ఆయన అలా తీసుకువెళ్లేవారు.– గీతాభాస్కర్ గీతా భాస్కర్ వేసిన ముగ్గునువ్వులు ఎక్కువ వేస్తాసకినాల పిండికి కొలతలు అంటూ ఉండవు. ఒక గ్లాసు పిండికి నేను పావుకిలో నువ్వులు వేస్తాను. నువ్వులు ఎక్కువ వేస్తే గ్యాప్ ఎక్కువ వస్తుంది... పైగా నువ్వుల నుంచి కూడా నూనె వస్తుంది కదా.. బాగా ఉడుకుతుంది. దాంతో సకినం కరకరలాడుతుంది. కొంతమందైతే పచ్చి నువ్వులు వేసేస్తారు. నేను చెన్నై నుంచి వచ్చినదాన్ని కదా... మాకు అక్కడ మురుకులు అలవాటు. అక్కడ వేయించిన నువ్వులు వేస్తారు. నేను సకినాల్లో అలానే వేస్తా. అసలు ఇక్కడికి వచ్చాకే నేను సకినాలు వండటం నేర్చుకున్నాను. సకినాలకి దొడ్డు బియ్యం బాగుంటుంది. నేను దాదాపు రేషన్ బియ్యమే వాడతాను. అవి ఎక్కువ పాలిష్ ఉండవు కాబట్టి సకినాలకి బాగుంటుంది. అలాగే వేరు శెనగ నూనె వాడతాను.అమ్మ వైపు... నాన్న సైడుమా తండ్రి, తల్లివైపు వాళ్లందరూ చెన్నైలో సెటిల్ అయ్యారు. నేను పుట్టింది, పెరిగిందీ అక్కడే. రెండు కుటుంబాల వాళ్లు బిగ్ బిజినెస్ పీపుల్. ఇక మా అమ్మగారివైపు అయితే పూర్తిగా కాస్మోపాలిటన్. ఆవిడ హార్స్ రైడ్ చేసేవారు. చెన్నైలో శివాజీ గణేశన్లాంటి స్టార్స్ ఉండే మలోని స్ట్రీట్లో మా తాత ఉండేవారు. పొలిటికల్గా ఆయనకు చాలా స్ట్రాంగ్ కనెక్షన్స్ ఉండేవి. నెహ్రూగారితో పరిచయం ఉండేది. మా అమ్మ బట్టలన్నీ సినిమా కాస్ట్యూమర్స్ కుట్టేవారు. ఇక నాన్నవైపు పూర్తిగా భిన్నం. వాళ్లు కూడా వ్యాపారవేత్తలే. నాన్న వాళ్లది పప్పుల వ్యాపారం. నాన్నగారి కుటుంబంలో అమ్మాయిలు బయటకు వెళ్లకూడదు... మగవాళ్లతో మాట్లాకూడదు... అలా ఉండేది. నేను ఇటు అమ్మవైపు అటు నాన్నవైపుఇలాంటి కాంబినేషన్లో పెరిగా. మా అమ్మ ఒక్కతే కూతురు. ఆమెకి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. ఒక్కతే కూతురు కావడంతో రాణిలా పెంచారు. నాన్నవాళ్లు పదమూడుమంది. నాన్నమ్మ వాళ్లు బాగా ట్రెడిషనల్. ఇంటికి పెద్ద కోడలిగా అమ్మకి చాలా బాధ్యతలు ఉండేవి. అయితే అమ్మ ఎక్కడిది అక్కడే అన్నట్లుగా తనను మలచుకుంది. అత్తింటి విషయాలు పుట్టింటికి, అక్కడివి ఇక్కడ ఎప్పుడూ చెప్పలేదు. మా నాన్నమ్మ సైడ్లో పూర్తి ట్రెడిషనల్ పిండి వంటలు వండేవాళ్లు. అమ్మ సైడ్ కొంచెం డిఫరెంట్. అలా నాకు అమ్మ వల్ల, నాన్నమ్మ వల్ల వంటలు చేయడం అలవాటైంది. ఇక నేను పెళ్లి చేసుకుని ఇక్కడికి (తెలంగాణ) వచ్చాక పూర్తి భిన్నమైన వంటలు వండాల్సి వచ్చింది.అత్తింట్లోనే సకినాలు నేర్చుకున్నాఅత్తింటికి వచ్చాకే సకినాలు చేయడం నేర్చుకున్నాను. మా అత్తగారైతే అన్ని వంటలు బాగా వండుతావు... ఈ సకినాలు ఎందుకు చేయలేకపోతున్నావు... ఇవి కూడా చేయడం వస్తది అనేవారు. మా పెద్ద ఆడబిడ్డ, చిన్న ఆడబిడ్డ సకినాలు నేర్పించారు. మామూలుగా సకినాలకు ఉల్లికారం బాగుంటుంది. మా తరుణ్ (హీరో–దర్శకుడు– రచయిత తరుణ్భాస్కర్) కాస్త కారంగా తింటాడు. ఉల్లికారం తనకి తగ్గట్టుగా చేస్తాను. అయితే మా అత్తవాళ్లు ఉప్పు, కారం నూరి దానిమీద పచ్చి నూనె వేసేవారు. నేను కాస్త చింతపండు వేస్తాను. పండగకి అరిసెలు కూడా వండుతాను. యాక్చువల్లీ మా అమ్మ బాగా వండేది. నాకు కుదిరేది కాదు. అత్తింటికి వచ్చాక కూడా సరిగ్గా వండలేక΄ోయేదాన్ని. అయితే నా ఫ్రెండ్ వాళ్ల అమ్మ నేర్పించారు. అప్పట్నుంచి అరిసెలు చక్కగా మెత్తగా వండటం నేర్చుకున్నాను. ఇట్లు... బొబ్బట్లుఒకప్పుడు బుట్టలు బుట్టలు పిండివంటలు వండేవాళ్లు. మా ఇంట్లో మా అమ్మమ్మ, నాన్నమ్మ అలా వండటం చూశా. కానీ ఇప్పుడు ఒకట్రెండు కేజీలు వండటానికే కష్టపడిపోతున్నాం. అప్పట్లో పిండి దంచి వండేవాళ్లు. ఇప్పుడు అన్నింటికీ మిషన్ ఉంది. అయినా చేయలేకపోతున్నాం. కానీ బయట కొనుక్కుని తింటే అంత సంతృప్తి ఉండదు. ఇంట్లో వండితే పండగకి ఇంట్లో వండాం అనే తృప్తి ఉంటుంది. కానీ ఎందుకింత శ్రమ తీసుకుంటున్నావని తరుణ్ అంటుంటాడు. ఇప్పుడు తను కూడా బిజీ కాబట్టి హెల్ప్ చేసే వీలుండదు. కానీ నాకు పండగకి ఇంట్లో వండితేనే మనసుకి బాగుంటుంది. పోయిన గురువారం నాకు స్కూల్లో ఓ వర్క్షాప్ ఉంది. అలాగే కల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్లు గవర్నమెంట్ సపోర్ట్తో ఓ నాలుగైదు ప్రోగ్రామ్స్ చేయమన్నారు. ఇంకా ‘ఇట్లు బొబ్బట్లు’ అని పిల్లలు తయారు చేస్తుంటారు. వాళ్లు పిలిస్తే వెళ్లాను. మా నాన్నగారు మాతోనే ఉంటారు. ఆయనకు 90 ఏళ్లు. ఆయన్ని చూసుకుంటూ, బయట పనులు చూసుకుని, ఇంటికొచ్చాక పిండి వంటలు మొదలుపెట్టా. ఇలా ఇంట్లో వండుకుంటే ఫీల్గుడ్ హార్మోన్తో మనసు హాయిగా ఉంటుంది. అది మన హెల్త్కి మంచిది. సకినాలు ఈ తరానికి నేర్పుదాంమన యంగర్ జనరేషన్కి మనం స్ఫూర్తిగా ఉండాలనుకుంటాను. ఇప్పుడు మనం వండితే భవిష్యత్తులో అప్పట్లో మన అమ్మ అలా వండేది కదా అనుకుంటారు. సో... యంగర్ జనరేషన్కి మన కల్చర్ అలవాటు చేయాలి. అందుకే మనం ఇంట్లోనే వండాలి. అమ్మ కష్టపడి వంట చేస్తుంటే పిల్లలకు హెల్ప్ చేయాలనిపిస్తుంది. మా తరుణ్ ఈ మధ్య ఓ రెండు రోజులు ఇంటికి రావడానికి కూడా కుదరలేదు. ఒక సినిమాకి డైలాగ్స్ రాస్తున్నాడు. ఆ స్ట్రెస్లో ఉన్నాడు. ఇంటికి వచ్చాక ఒక గిల్ట్తో ‘ఇంకో రెండు మూడు పేజీలు రాయాలమ్మా... అయిపోతుంది’ అన్నాడు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ సకినాలు చేయడంలో నాకు హెల్ప్ చేశాడు (నవ్వుతూ). స్ట్రెస్ ఉంటే తరుణ్ ‘చెఫ్’మా తరుణ్కి కూడా వంటలంటే ఇష్టం. నేను చేస్తుంటే వచ్చి చేస్తుంటాడు. నేనేదైనా బాగా వండితే, ఎలా వండావు అని అడిగి తెలుసుకుంటాడు. మా ఇంటి పక్కనే మాకు బాగా పరిచయం ఉన్న ఫ్యామిలీ ఉంది. అలాగే మా ఆఫీసు ఒకటి క్లోజ్ చేశాం... ఆ ఆఫీసులో ఉన్న ఇద్దరు పిల్లలు మా ఇంట్లో ఉంటారు. ఇక ఆ ఫ్యామిలీ, ఈ పిల్లలు అందరూ కలిసి చేస్తుంటాం. మా నాన్న కూడా సలహాలు ఇస్తుంటారు. మా తరుణ్కి చాలా స్ట్రెస్ ఉండిందనుకోండి... అప్పుడు వంట చేస్తాడు. నా వంటిల్లు మొత్తం హైజాక్ అయి΄ోతుంది (నవ్వుతూ). వాడి బర్త్డేకి వాడికి తెలియకుండా వంటల బుక్ రాసి, గిఫ్ట్గా ఇచ్చాను. ఈ తరానికి నేర్పుదాంమన యంగర్ జనరేషన్కి మనం స్ఫూర్తిగా ఉండాలనుకుంటాను. ఇప్పుడు మనం వండితే భవిష్యత్తులో అప్పట్లో మన అమ్మ అలా వండేది కదా అనుకుంటారు. సో... యంగర్ జనరేషన్కి మన కల్చర్ అలవాటు చేయాలి. అందుకే మనం ఇంట్లోనే వండాలి. అమ్మ కష్టపడి వంట చేస్తుంటే పిల్లలకు హెల్ప్ చేయాలనిపిస్తుంది. మా తరుణ్ ఈ మధ్య ఓ రెండు రోజులు ఇంటికి రావడానికి కూడా కుదరలేదు. ఒక సినిమాకి డైలాగ్స్ రాస్తున్నాడు. ఆ స్ట్రెస్లో ఉన్నాడు. ఇంటికి వచ్చాక ఒక గిల్ట్తో ‘ఇంకో రెండు మూడు పేజీలు రాయాలమ్మా... అయిపోతుంది’ అన్నాడు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ సకినాలు చేయడంలో నాకు హెల్ప్ చేశాడు (నవ్వుతూ). -
అప్పాల తయారీ అదుర్స్!
సాక్షి, పెద్దపల్లి: సంక్రాంతి పండుగ అనగానే పిండి వంటలు గుర్తుకొస్తాయి.. కానీ అప్పాలు అంటే సుల్తానాపూర్ గ్రామం గుర్తుకొస్తుంది. ఆ ఊరే అప్పాలకు కేరాఫ్ అడ్రస్. ఆ గ్రామస్తుల క్వాలిటీయే వారి బ్రాండ్. చూస్తేనే నోరూరించే పిండి వంటలు. ఒక్కఫోన్ చేస్తే చాలు.. ఎంచక్కా పిండివంటలు మన ఇంటికి వచ్చేస్తాయి. శుభకార్యాలకు కావాల్సిన సారెలో అందించే అన్నిరకాల పిండివంటలను తయారుచేసి తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, ఇతర దేశాలకూ సరఫరా చేస్తూ స్వయం ఉపాధి పొందుతూ.. మరికొంతమందికి ఉపాధి ఇస్తూ లాభాల బాటలో పయనిస్తున్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుల్తానాపూర్ గ్రామానికి చెందిన మహిళలు.మాకు చేసివ్వరా... పదిహేడేళ్ల క్రితం సుల్తానాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మి లీడర్గా పదిమంది సభ్యులతో ఒక గ్రూప్గా ఏర్పడ్డారు. ఇంటివద్దే ఉంటూ చిన్న మొత్తాలతో ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నారు. పలురకాలుగా ఆలోచిస్తున్న సమయంలో గ్రూప్లోని ఒక సభ్యురాలి ఇంట్లో వివాహ వేడుకకు పెద్దమొత్తంలో అప్పాలు తయారు చేయాల్సి వచి్చంది. దీంతో తమ గ్రూప్ సభ్యుల సహకారంతో ఆ పెళ్లికి కావాల్సిన సారెను అందరూ కలిసి సరదాగా సిద్ధం చేశారు. దీంతో ఆ వేడుకకు వచి్చన బంధువులు ‘మా బిడ్డ సీమంతం ఉంది కొంచెం చేసి పెడతారా? మా కొడుకు, కోడలు అమెరికా వెళుతున్నారు.. అప్పాలు చేసి పెడతారా’అని అడగటంతో వారికి వీరు సైతం చేసిచ్చారు. అయితే ఊళ్లో ఉన్న మనకే సారె తయారు చేయడానికి ఇతరుల సహాయంతో చేయాల్సిన పరిస్థితి నెలకొందని, సిటీలో ఉన్నవారి పరిస్థితి ఏమిటి? వారు అప్పాలు పెద్దమొత్తంలో ఎలా తయారు చేసుకుంటారు? అనే ఆలోచన లక్ష్మికి తట్టింది. దీన్నే ఉపాధిగా ఎందుకు మార్చుకోకూడదని గ్రూప్ సభ్యులకు తెలిపింది. తెలిసిన పని, తక్కువ పెట్టుబడితో కూడినది కావటంతో అందరూ సరేనన్నారు. దీంతో అప్పాలు చేయడం ఉపాధిగా మలుచుకొని లక్షణంగా లక్షలు సంపాదిస్తున్నారు. 8 గ్రూప్లు.. 400 మంది వర్కర్లుగ్రూప్నకు ఎటువంటి పేరు, బ్రాండ్ లేకపోయినా, క్వాలిటీతో మొదట తమ గ్రూప్ సభ్యులు, వారి బంధువులు, స్నేహితులకు ఆర్డర్లపై అప్పాలు తయారు చేసి ఇచ్చేవారు. అలా నోటిమాటతో క్వాలిటీ నచ్చి ఆర్డర్లు పెరుగుతూపోయాయి. దాదాపు ఏడాదికి రూ.50 లక్షల పైనే ఆర్డర్లు వస్తుండటంతో అప్పాలు కాల్చడానికి, పిండి పిసకడానికి, సకినాలు చుట్టడానికి, ఇతరత్రా పనులకు రోజువారి వర్కర్ల సాయం తీసుకుంటూ వారికి కూడా ఉపాధి కల్పింపిస్తున్నారు. వీరిని చూసి గ్రామంలో మరో 8 సంఘాలు ఏర్పడ్డాయి. ఒక్కో గ్రూప్లో పదిమంది సభ్యులతోపాటు, వారికి సాయం పనికి వచ్చే 50మంది వర్కర్లతో పాటు, పిండిగిరి్న, ట్రాలీ, కట్టెలు కొట్టేవారు తదితరులతో కలిసి దాదాపు 400 మందికిపైగా ఆ గ్రామంలో అప్పాలతో ఉపాధి పొందుతున్నారు.బాహుబలి అప్పాలు.. 32 వరుసలతో చక్రాల్లా సకినాలు, కిలో పరిమాణంలో లడ్డూ, గరిజ, బెల్లం అరిసెలు, నువ్వుల లడ్డూ, మురుకులు, చెగోడీలు, గవ్వలు, ఖారా, ఇతరత్రా వంటకాలను పెద్దఎత్తున తయారు చేయడం వీరి ప్రత్యేకత.ఆర్డర్పై విదేశాలకు మా గ్రామంలో 17 ఏళ్లుగా ఆర్డర్పై అప్పాలను తయారు చేస్తూ ఎగుమతి చేస్తున్నాం. అమెరికా, ఆ్రస్టేలియా, ఇంగ్లండ్ వంటి దేశాలు, తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్రకు సైతం పంపిస్తున్నాం. ఏడాదిలో రూ.50లక్షలపైగా ఆర్డర్లు వస్తాయి. తయారు చేసి వారు కోరుకున్న సమయానికి అందజేస్తాం. – తానిపత్తి లక్ష్మీదేవి, గ్రూప్ లీడర్కలిసి పనిచేస్తాం మా బంధువులం అందరం కలిసి అప్పాలను తయారు చేస్తాం. ప్రతీ ఒక్కరికి రోజుకు రూ.500 నుంచి రూ.600 వరకు గిట్టుబాటు అవుతుంది. ఆర్డర్లు ఎక్కువ వస్తే ఇతర గ్రూప్లతో పంచుకుంటాం. అందరం కలిసి పనిచేసుకుంటూ పిల్లలను మంచిగా సెటిల్ చేశాం. – అలివేణి, సుల్తానాపూర్ ఆర్డర్లపై తయారీ మా గ్రూప్ ద్వారా ఆర్డర్లపై సుమారు 11 ఏళ్లుగా అప్పాలను తయారు చేస్తూ విజయవాడ, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ నగరాలతోపాటు లండన్, అమెరికాకు పంపిస్తున్నాం. మా గ్రూపు సభ్యులకు ఉపాధి కల్పించటంతోపాటు ఇతరులకు సైతం ఉపాధి కల్పిస్తున్నందుకు సంతోషంగా ఉంది. – మాధవి, శ్రీరామ గ్రూప్ నిర్వాహకురాలు -
మేము.. మా రెండు హృదయాలు.. పీవీ సింధు పోస్ట్ వైరల్ (ఫోటోలు)
-
తల్లితో కలిసి బుట్టబొమ్మలా.. మంచులో భర్త ప్రేమలో తడిసి ముద్దవుతూ ఇలా (ఫొటోలు)
-
ఉత్సాహంగా ఎఫ్–టామ్ ట్రెడిషనల్ ఫ్యాషన్ షో..
ముంబై సెంట్రల్: ఎఫ్–టామ్ ఆధ్వర్యంలో బుధవారం థాణేలో తెలుగువారి కోసం ఫ్యాషన్ షోను నిర్వహించారు. ఎఫ్–టామ్ ఫ్యాషన్ విభాగం బాధ్యురాలు మచ్చ అంజలి నేతృత్వంలో ఠాణేలోని కాశీనాథ్ ఘాణేకర్ సభాప్రాంగణంలో నిర్వహించిన తెలుగువారి ‘సాంప్రదాయ దుస్తుల ఫ్యాషన్ షో, అవార్డు ప్రదానోత్సవ’కార్యక్రమంలో సాంప్రదాయ దుస్తులు ధరించిన యువతులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా నటి మీనాక్షీ గడేకర్, నగల వ్యాపారి సుహాస్ మాలవీయ, టీవీ నటీమణి సష్టి సింగ్, నటుడు సిద్ధాంత్ దాండే, సెలబ్రిటీ ఆర్గనైజర్ ప్రమోద్ సింగ్, మోడల్ వల్లకాటి జ్యోతి, మేకప్ ఆర్టిస్ట్ మానసి తదితరులు హాజరయ్యారు. ఫ్యాషన్ దివా, ‘బెస్ట్’విజేతల ఎంపిక ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోడి సునీత, వేముల వాణికి బెస్ట్ స్మైల్, ఇవటూరి కిరణ్మయికి బెస్ట్ వాక్, మామిడాల హరిత రావుకు బెస్ట్ కాని్ఫడెన్స్, నారయ్య నీరజకు బెస్ట్ ఆటిట్యూడ్, జోషి ప్రియాంకకు బెస్ట్ బ్యూటిఫుల్, అనుపమకు బెస్ట్ గ్రేస్ఫుల్, కూన లక్ష్మీప్రసన్నకు బెస్ట్ అటైర్, పారసు నివేదితకు బెస్ట్ ఫోజ్, పోలు నూతన్కు బెస్ట్ ఐస్, సూర భాగ్యశ్రీకి బెస్ట్ డ్యాన్స్ స్టెప్స్ అవార్డులు లభించాయి. ఉత్తమ ఫ్యాషన్ దివా అవార్డుల ప్రథమ విజేతగా ఉబాలే సరోజ్, రెండవ విజేతగా జోషి ప్రియాంక, మూడవ విజేతగా కూన లక్ష్మీప్రసన్న ఎన్నికయ్యారు. అన్నిరంగాల్లో ‘తెలుగు’ముద్ర అవసరం: గంజి జగన్బాబు ‘‘వేగంగా మారుతున్న ప్రపంచంలో తెలుగు యువత కూడా అన్ని రంగాల్లో ముందంజ వేయాలనీ, సాహిత్య, సాంస్కృతిక రంగాలతో పాటు ఫ్యాషన్ రంగంలో కూడా తమదైన ముద్రను ఏర్పాటు చేసుకోవాలనీ, అప్పుడే తెలుగు అనే భావన, గర్వం అందరిలో కలుగుతుందని’ఎఫ్–టామ్ అధ్యక్షుడు గంజి జగన్బాబు అభిప్రాయపడ్డారు. ముంబైలో తెలుగువారి కోసం ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ఫ్యాషన్ రంగానికి చెందిన పూర్తిస్థాయి కార్యక్రమంగా ఫ్యాషన్ షో నిలిచిందని అన్నారు -
యునెస్కో సాంస్కృతిక ఫుడ్స్ 2024
యునెస్కో ప్రతి యేటా వివిధ దేశాల సాంస్కృతిక వారసత్వాలను, అక్కడి కళారూ΄ాలను గుర్తించి మనముందుకు తీసుకువస్తుంది. ఈ యేడాది అత్యంత ప్రాచీనమైన వివిధ రుచికరమైన వంటకాల జాబితాను తీసుకొచ్చింది. వాటిలో...అరబిక్ కాఫీఅరబ్ ప్రపంచంలో కాఫీ తయారీ, దానిని అతిథులకు అందజేసే విధానం అత్యద్భుతంగా ఉంటుందట. ఈ విధానం కూడా వారి తరతరాల భాగస్వామ్యం ఉందని, దీనిని యునెస్కో జాబితాలో చేర్చింది.జపాన్ వారి సాకె రైస్వైన్గా గుర్తింపు పొందిన సాకె ను స్థానిక సాంస్కృతిక వేడుకలలో సేవిస్తారు. దీని తయారీ వెనక తరాలుగా వస్తున్న కుటుంబాల శ్రమ ఉంటుంది.మలేషియన్ బ్రేక్ఫాస్ట్వంటకాల రుచి గురించి చెప్పుకోవాలంటే ఉదయం అల్పాహారంగా మలేషియా ‘నాసి లెమక్, రోటీ కనాయ్’ని ఈ దేశపు హిస్టరీగా చెప్పుకోవచ్చు. వందల ఏళ్ల ఈ ఆహార తయారీ ఫార్ములా వారికి మాత్రమే తెలుసు.కొరియా జంగ్కొరియా వంటకాలలో జంగ్ అనే వంటకం తయారీ, రుచి, దానిని నిల్వ చేసే పద్ధతలు శతాబ్దాలుగా ఒక తరం నుంచి మరో తరానికి వస్తున్నాయి.అజెర్బైజాని బ్రెడ్మనం ఇప్పటి వరకు ఎన్నో రకాల బ్రెడ్స్ చూసి ఉంటాయి. కానీ, అజెర్బైజాని బ్రెడ్ తయారీలో వారి సంస్కృతి పరమైన ప్రభావం ఎంతో ఉందంటున్నారు. ఈ బ్రెడ్ తయారీలో వాడే పదార్థాలు, తయారీలో తరాల వారసత్వం ఉందని జాబితాలో పొందుపరిచారు. -
Doodh Peda: ప్రపంచమే చూడగా.. ధార్వాడ పేడా
బనశంకరి: చాలామంది ఇష్టంగా తినే మిఠాయిల్లో ధారవాడ దూద్ పేడా ఒకటి. ఎంతో రుచిగా, తియ్యగా బాగుంటుంది. దీన్ని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. నోట్లో వేసుకుంటే కరిగిపోయి మృదువుగా ఎంతో రుచికరంగా ఉంటుంది. పండుగల సమయాల్లో ఇంట్లో దూద్పేడా చేసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతారు. కర్ణాటకలోని ధారవాడలో చిన్నగల్లీ నుంచి ప్రారంభమైన దూద్పేడా ప్రయాణం నేడు విదేశాలకు సైతం ఎగుమతి అవుతుంది. పాలతో తయారుచేసే పదార్థాలపైకి అధికకాలం వినియోగంలోకి రావడంతో ధారవాడ దూద్పేడా జీఐ ట్యాగ్ పొందింది. బయటి వాతావరణంలో ఐదారు రోజులు పాటు దూద్పేడా చెడిపోకుండా రుచికరంగా ఉంటుంది. ఉత్తరప్రదేశ్ ఉన్నావోలో 19వ శతాబ్దం ప్రారంభంలో ప్లేగ్ మహమ్మారి అనంతరం ధారవాడకు వలస వచ్చిన ఠాకూర్ కుటుంబం దూద్పేడాను తయారు చేసి వ్యాపారం ప్రారంభించారు. మిఠాయి వ్యాపారి రామ్రతన్సింగ్ ఠాకూర్ స్థానికంగా దూద్పేడా తయారు చేసి విక్రయించేవారు. అనంతరం ఇదే కుటుంబం ఈ వ్యాపారం విస్తరించారు. రామ్రతన్సింగ్ఠాకూర్ మనవడు బాబుసింగ్ఠాకూర్ ధారవాడ లైన్బజార్ దుకాణంలో దూద్పేడా వ్యాపారం మరింత విస్తరించగా నేడు ఇదే కుటుంబం 6వ తరం కొనసాగిస్తోంది. ధారవాడలో 177 ఏళ్ల క్రితం పుట్టుకొచ్చిన తీపి వంటకం నేడు పెద్ద పరిశ్రమగా మారిపోయింది. ఇన్నేళ్లు గడిచినప్పటికీ ధారవాడ దూద్పేడా నాణ్యత, రుచిలో ఎలాంటి మార్పు రాలేదు ఏడాది నుంచి ఏడాదికి దూద్పేడా డిమాండ్ హెచ్చుమీరగా మార్కెట్ కూడా విస్తరించింది. బ్రిటిష్ వారి నుంచి గౌరవం ధారవాడ పారిశ్రామికవాడ ప్రదేశంలో దూద్పేడా ప్రదర్శనలో పాల్గొనడానికి (1913 నవంబరు 17) అప్పటి బాంబే గవర్నర్ హెచ్ఇ.లార్డ్స్విల్లింగ్టన్, బాబుసింగ్ఠాకూర్కు వెండిపతకం సరి్టఫికెట్ అందించి గౌరవించారు. అంతేగాక ధారవాడ దూద్పేడా కు రాజీవ్గాందీ శ్రేష్ట పురస్కారం, ప్రియదర్శిని ఇందిరాగాంధీ పురస్కారాలు అందుకున్నారు. దూద్పేడా ప్రత్యేకతలు.. తీపి తిండి రంగంలో ధారవాడ దూద్పేడా గత ఏడాది 2023లో దసరా, దీపావళి పండుగ సమయంలో రికార్డుస్థాయిలో 25 వేల కిలోలు విక్రయం కాగా 2022లో 20 టన్నులు విక్రయాలు జరిగాయి. ప్రస్తుతం ప్రతిరోజు సరాసరి 9–10 వేల కిలోల ధారవాడ పేడా రాష్ట్ర వ్యాప్తంగా విక్రయిస్తున్నారు. ధారవాడ–హుబ్లీ మాత్రమే కాకుండా బెంగళూరు, బెళగావిలో దూద్పేడా పెద్దపెద్ద దుకాణాలు ఏర్పాటుకాగా ప్రాంచైసీ దుకాణాల సంఖ్య 1000కి పైగా ఉండటం విశేషం. హైదరాబాద్ కోల్కత్తా, ముంబై, ఢిల్లీ, చెన్నైతో పాటు ప్రముఖ 150 నగరాల్లో ధారవాడ దూద్పేడా విక్రయిస్తున్నారు. ప్రముఖ రైల్వే, బస్స్టేషన్లలో కూడా దూద్పేడా అందుబాటులోకి వచ్చింది. రుచిలో సరిసాటి నాణ్యత రుచిలో ధారవాడ దూద్పేడాకు సరిసాటి ఏదీలేదు. దూద్పేడాను స్వచ్ఛమైన నెయ్యి, కోవా, చక్కెరతో తయారు చేస్తారు. ధారవాడ స్థానిక ప్రదేశాలనుంచి సేకరించిన పాలను వినియోగించి కోవా తయారు చేస్తారు. ముందుగా ఒక లీటరు పాలు తీసుకుని వాటిని 50 ఎంఎల్ అయ్యేవరకు మరిగించాలి. అలా మరిగించిన పాలల్లో చక్కెర వేసుకుని బాగా కలుపుకోవాలి. తరువాత అందులో ప్లెయిన్ కోవా, ఇలాచి పొడివేసి మరోసారి బాగా కలుపుకుని దగ్గరగా ముద్దలా అయ్యేలా చేసుకోవాలి. అనంతరం పేస్ట్ను నెయ్యిరాసిన ప్లేట్మీద పరుచుకుని కాస్త చల్లారిన తరువాత గుండ్రంగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అంతే కమ్మని దూద్పేడా తయారవుతుంది. -
మాదాపూర్ శిల్పారామంలో లోక్ మంథన్ ఉత్సవాలు (ఫొటోలు)
-
పల్లెటూరి అల్లరి పిల్ల కేతిక.. లుక్కే మార్చేసిందిగా! (ఫొటోలు)
-
బిగ్బాస్ బ్యూటీ శోభాశెట్టి ట్రెడిషనల్ లుక్.. అదిరిందిగా! (ఫొటోలు)
-
అనసూయ లేటెస్ట్ ట్రెడిషనల్ లుక్స్ (ఫొటోలు)
-
Natarajan: సంగీతానికి ఇన్స్ట్రుమెంట్ ఈ కుటుంబం..
భక్తి పాటల భజనకైనా, జానపద గీతాలకైనా, సంగీత కచేరీలకైనా తంబురా, హార్మోనియం, డోలక్, తబలా వంటి వాద్యాలు తప్పనిసరి! పాపులర్ మ్యూజిక్లో వీటి జాడ అరుదు ఇంకా చెప్పాలంటే కరవూ! కానీ కర్నూల్లోని నటరాజన్ ఇంట్లో ఇప్పటికీ ఇవి శ్రుతి సరిచేసుకుంటున్నాయి.. శ్రోతలకు మెలోడీ ఫెస్ట్ని అందివ్వడానికి!నటరాజన్ సంగీత వాద్యపరికరాలు తయారు చేయడంలో ఘనాపాఠి! ఇది ఆయనకు వారసత్వంగా అబ్బిన, అందిన విద్య, వృత్తి, సంపద కూడా! నటరాజన్ తాత, ముత్తాతల కాలం నుంచీ ఇది కొనసాగుతోంది. ఆ కుటుంబంలోని అందరూ బాగా చదువుకున్నవారే. నటరాజన్ ముత్తాత మురుగేషన్ మొదలియార్.. బ్రిటిష్ కాలంలో హార్మోనియం గురువుగా ఉన్నారు. డ్రామాలకు దుస్తులను సరఫరా చేసే కంపెనీనీ నడిపారు. ఆయన ఇద్దరు కొడుకుల్లో ఒకరైన రామస్వామి కొడుకే నటరాజన్ తండ్రి.. బాలసుబ్రహ్మణ్యం.పేపర్ మిల్లో ఎలక్ట్రికల్ ఇంజినీర్గా పనిచేసేవారు. ఆ మిల్లు మూతపడటంతో తాతల వృత్తి సంగీత వాద్యపరికరాల తయారీని జీవనోపాధిగా మలచుకున్నారు. దాన్ని తన కొడుకు నటరాజన్కూ నేర్పారు. నటరాజన్ కూడా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. అయినా తండ్రి నేర్పిన విద్యకే ప్రాధాన్యం ఇచ్చారు. హార్మోనియం, వయొలిన్, వీణ, మృదంగం, డోలక్, తబలా, ఫ్లూట్ వంటి వాయిద్యాలను యువతను ఆకర్షించేలా తయారుచేస్తున్నారు. వీరి ఈ పరికరాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కర్ణాటకలోనూ డిమాండ్ ఉంది. ఈయన దగ్గర అయిదు వేల రూపాయల నుంచి 50 వేల రూపాయల దాకా విలువ చేసే హార్మోనియం, వీణ, తబలాలు అందుబాటులో ఉన్నాయి.‘నేటి స్ట్రెస్ఫుల్ లైఫ్కి మంచి ఊరట సంప్రదాయ వాద్య సంగీతం. ఇది మనసును ఇట్టే తేలిక చేసి సాంత్వననిస్తుంది. అయితే ఎలక్ట్రానిక్ సంగీత పరికరాలు అందుబాటులోకి రావడంతో అలనాటి సంగీత పరికరాలను మర్చిపోతున్నారు. గత అయిదారు సంవత్సరాల నుంచి దేవాలయాల్లో భజన కార్యక్రమాలు ఎక్కువవడంతో మళ్లీ అలనాటి సంగీత పరికరాలకు ఆదరణ పెరిగి.. మాకు మళ్లీ చేతినిండా పని దొరికినట్టయింది’ అని చెబుతున్నారు నటరాజన్. – కె.రామకృష్ణ -
Navya Nair : స్టన్నింగ్ లుక్స్తో ఆకట్టుకుంటున్న నవ్య నాయర్ (ఫోటోలు)
-
పాత పాత్రలతో వంటకాలకు కొత్త రుచులు!
సంప్రదాయంగా వస్తున్న అనేక రకాల వంట పాత్రలతో వంటకాలకు కొత్త రుచులను అద్దవచ్చునని పాకశాస్త్ర నిపుణులు అంటున్నారు. సంప్రదాయ వంట పాత్రలపై నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ విభిన్న రుచులు, సువాసనల సమ్మేళనమైన తెలంగాణ వంటకాలు సంప్రదాయ వంటపాత్రల్లో వండడం ద్వారా మరింత సువాసనను, రుచులను జోడించవచ్చని వివరించారు.సాధారణంగా రుచికి, వంటకు ఉపయోగించే పాత్రలకి ఉన్న సంబంధాన్ని తక్కువగా పరిగణనలోకి తీసుకుంటారని, అయితే వారసత్వంగా మనకు అందివచ్చిన పాత్రలను మాత్రం ఆ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకునే రూపొందించారన్నారు. ఈ సందర్భంగా గోల్డ్ డ్రాప్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ మితేష్ లోహియా మాట్లాడుతూ, ‘మట్టి సువాసనలను నింపే మట్టి కుండల నుంచి, ఇనుప పాత్రల వరకు సాంప్రదాయ తెలంగాణ వంట పాత్రలు ప్రతి వంటకానికి తమదైన ప్రత్యేకతను అద్దడం ద్వారా వాటికి ప్రామాణికతను జోడిస్తాయి‘ అని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు సంప్రదాయ వంట పాత్రల విశిష్టతలను వివరించారు.రాతి చిప్ప: ఇదొక రాతితో తయారు చేసిన పాత్ర. దీనిని కల్ చట్టి అని కూడా పిలుస్తారు. తెలంగాణ వంటశాలలలో ఓ రకంగా మల్టీ టాస్కర్ ఇది. సన్నటి మంటపై వండితే రుచి బాగుంటుందనుకునే వంటకాలు అయిన పప్పు, సాంబార్లకు ఇది అనువైనదిగా ఉంటుంది. మరింత రుచిని కల్పిస్తుంది. చేతితో చెక్కిన ఈ పాత్రలను ఆహారాన్ని నిల్వ చేయడానికి కూడా ఉపయోగిస్తారు.ఉరులి: ఒక గుండ్రని వంట పాత్ర ఇది. వివిధ రకాల వంటకాలకు అనువైనది ఈ ఉరులి. కేరళకు చెందిన నైపుణ్యం కలిగిన కళాకారుల చేతుల మీదుగా ఫుడ్–గ్రేడ్ ఇత్తడితో రూపొందింది. ఈ పాత్ర కడాయి తరహాలో ఉపయోగపడుతుంది. ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, టమాటాలతో వండిన బెండకాయ వేపుడు (వేయించిన ఓక్రా)తో సహా తెలంగాణలో పలు వంటకాలకు రుచికరమైన ప్రామాణికతను జోడిస్తుంది.మురుకు అచ్చు: ఇది కరకరలాడే మురుకులు లేదా జంతికలు కోసం తప్పనిసరిగా ఉండవలసిన సర్వ సాధారణ సాధనం.అట్టుకల్: సిల్ బత్తా, కల్ బత్తా వంటి విభిన్న పేర్లతో పిలిచే ఈ గ్రైండింగ్ రాయి మొత్తం మసాలాలు, ధాన్యాలు, పప్పులను సువాసనగల పేస్ట్లు పౌడర్లుగా మారుస్తుంది. దీనిలో చట్నీలను రుబ్బడం వల్ల అది ఒక కొత్త ఆకర్షణను అందిస్తుంది. ఇంటి వంటల మధురమైన జ్ఞాపకాలను సమున్నతం చేస్తుంది.మట్టి పాత్రసహజమైన మట్టితో రూపొందించిన ఈ సంప్రదాయ కుండ, కోడి కూర (ఆంధ్రా స్టైల్ చికెన్ కర్రీ) చేయడానికి సరైన పాత్ర. మట్టికి మాత్రమే కలిగిన ప్రత్యేక లక్షణాలు తేమను నిలుపుకోవడంలో దీనికి సహాయపడతాయి. ఈ కుండలు అవసరమైన పోషకాలను కూడా కలిగి ఉంటాయి.ది మ్యాజిక్ ఆఫ్ కాస్ట్ ఐరన్: కాస్ట్ ఐరన్ తో చేసిన వంటసామాను తో కూడా తెలంగాణ వంటకాలు వండుతారు. ఈ దఢమైన కుండలు సన్నగా దోసెలు, నోటిలో కరిగిపోయే హల్వా, గుంట పొంగనాలు వంటి వాటికి బాగా అనుకూలం. -
Lok sabha elections 2024: ఇస్తినమ్మా తాంబూలం.. వస్తినమ్మా ఓటింగ్కు!
లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు దేశవ్యాప్తంగా వినూత్నమైన కార్యక్రమాలెన్నో జరుగుతున్నాయి. ఛత్తీస్గఢ్లో బలరామ్పూర్ జిల్లా స్వయం సహాయక మహిళా సంఘాలు చేసిన ‘సంప్రదాయ’ కృషి వీటన్నింట్లో ఎంతో ఆసక్తికరం. మూడో దశలో భాగంగా ఈ నెల 7న రాష్ట్రంలో ఏడు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. బలరామ్పూర్ జిల్లాలోని సర్గూజా లోక్సభ స్థానంలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల అధికారులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అందులో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు చింతాకులు, అక్షితలు అందించారు. తప్పకుండా ఓటేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. స్థానిక సంప్రదాయాలను ఇలా వినూత్నంగా వాడుకున్న తీరు అందరినీ ఆకర్షించింది. ‘చింతాకులు, అక్షితలు అందించడం మా సంస్కృతిలో భాగం. పెళ్లిళ్లకు, మా సంఘం కార్యక్రమానికి ఇలాగే ఆహా్వనిస్తాం. అదే పద్ధతిలో విధిగా ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాం. దీనికి స్పందన కూడా చాలా బాగా వచి్చంది’’ అని స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యురాలు విమలా సింగ్ హర్షం వెలిబుచ్చారు. కార్యక్రమానికి జిల్లా అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందించినట్టు జిల్లా నోడల్ అధికారి రైనా జమీల్ పేర్కొన్నారు. ఓటర్లను ఇలా వినూత్నంగా పోలింగ్ బూత్లకు తరలాల్సిందిగా కోరిన తీరు పొరుగు రాష్ట్రాలైన జార్ఖండ్, ఒడిశాలను కూడా ఆకట్టుకుంది. ఆ రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం మే 13న నాలుగు విడతలో మొదలై జూన్ 1న ఏడో విడత దాకా కొనసాగనుంది. అక్కడ కూడా ఇలా ఓటర్లను సంప్రదాయ పద్ధతిలో ఓటేసేందుకు ఆహా్వనించాలని పలు జిల్లాల ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. అందుకోసం ఇప్పటినుంచే ఏర్పాట్లు కూడా చేస్తున్నారట!– సాక్షి, నేషనల్ డెస్క్ -
'పఖాలా'తో వేసవి తాపం పరార్!
ఒడియా ప్రజల సంప్రదాయ వంటకం పఖాలా. ఈ వంటకం కోసం ప్రత్యేక రోజు కూడా ఉంది. ఆ రెసీపీ పేరుతోనే ప్రతి ఏటా మార్చి 20న 'పఖాలా దిబాసా' అనే దినోత్సవాన్న ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు ఒడియా ప్రజలంతా ఆ వంటకాన్ని వివిధ పద్ధతుల్లో తయారు చేసుకుని ఆస్వాదిస్తారు. అంతేకాదు పూరీ జగన్నాథుడికికి నైవైద్యంగా ఈ వంటకాన్నే పెడతారు కూడా. ఇంతకీ ఏంటా ప్రత్యేకమైన వంటకం? ఎలా తయారు చేస్తారు. ఆ వంటకం పేరు 'పాఖాల భాటా(పఖాలా భాటా)'. దీన్ని 'పఖాలా' లేదా 'పాఖాలా' అని పిలుస్తారు ప్రజలు. ఇది ఒడిశా సంప్రదాయ వంటకం. ఈ వంటాకాన్ని వండిన అన్నంలో కడిగినా లేదా నీటిలో తేలికగా పులియబెట్టి తయారు చేస్తారు. దీన్ని పప్పు తప్పించి వివధ రకాల కూరలతో నొంచుకుని తింటారు. ఇది వేసవిలో తాపాన్ని హరించే ఒరిస్సా సంప్రదాయ వంటకం. అయితే ఒడిస్సాలో ఈ వంటకాన్ని 10వ శతాబ్దం నుంచి పూరీకి చెందిన జగన్నాథుడికి నైవైద్యంగా పెట్టే రెసిపీలో దీన్ని కూడా చేర్చారు. ఈ వంటకాన్ని నేపాల్, మయాన్మార్ ప్రజలు కూడా తినడం విశేషం. నిజానికి ఈ వంటకం ఎలా వచ్చింది అంటే..ఒడిశాలో కడు పేదరికంతో కొట్టుమిట్టాడుతుండేది. ఆ టైంలో ఇలా పులియబెట్టిన వంటకం ప్రాచుర్యంలోకి వచ్చింది. అందుబాటులో ఉన్నవాటితోనే ఇలా బలవర్థకమైన వంటకాన్ని అక్కడి ప్రజలు తయారుచేసుకుని తినేవారు. ఇది వారికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించేది. ఎన్నిరకాలు తయారు చేస్తారు.. సజా పఖా (తాజా పఖా): నిమ్మకాయ చుక్కలతో తాజాగా వండిన అన్నం చేసిన తర్వాత తక్షణమే నీటిని జోడించడం ద్వారా తయారుచేస్తారు. ఈ రూపాంతరం కిణ్వ ప్రక్రియ అవసరం లేదు. బాసి పఖా (పులియబెట్టిన పఖాలా): ఒడియాలో బాసి అంటే పాతది అన్నాన్ని పులియబెట్టడం ద్వారా సాధారణంగా రాత్రంతా ఉంచి మరుసటి రోజు తింటారు. ఇది ఒడిశాల్లో ఏళ్లుగా చేసిన సాంప్రదాయ రెసిపి ఇది. దీనికి నిమ్మకాయలు, ఉల్లిపాయాలు, వివిధ కూరగాయాలు జోడించి రకరకాలు తయారు చేయడం ప్రారంభించారు. సాగా భాజా: దీని వేయించిన చేపలు, లేదా కాల్చిన కూరగాయలను వేసి తయారు చేస్తారు. జీరా పఖా: కరివేపాకుతో వేయించిన జీలకర్రను పఖాలో చేర్చి తయారు చేస్తారు దహి పఖా: పెరుగు జోడించి తయారు చేస్తారు. కాలక్రమేణ ఇలా రకరకాల పఖాలాలు వచ్చాయి. ఇది వేసవికాలంలో ఎక్కువగా చేసుకునే వంటకం. వేడిని అధిగమించడంలో సహాయపడే రిఫ్రెష్నిచ్చే వంటకం. శరారానికి చలువ చేస్తుంది. అలాగే దీనిలో జీర్ణక్రియకు, రోగనిరోధక శక్తికి తోడ్పడే ప్రోబయోటిక్ సమృద్ధిగా ఉంది. అందువల్ల దీన్ని ఆహారంగా తీసుకోవడంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందగలుగుతారు. అంతేకాదండోయ్ ఐదేళ్ల క్రితం ఒడిశా ప్రజలు ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నాకి ఈ సంప్రదాయ రెసిపీతోనే విందు ఏర్పాటు చేశారు. ఈ ఒడిశా దిబాస్ నేపథ్యంలో నాటి ఘటనను గుర్తు చేసుకుంటూ ఆ వీడియోని పంచుకున్నారు. View this post on Instagram A post shared by FOOD IN ODISHA | Odisha food | Odia Cuisine (@foodinodisha) (చదవండి: ప్రధాని మోదీ మెచ్చిన అడవి పండు! ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా!) -
Actress Shriya Traditional Photos: టాలీవుడ్ హీరోయిన్ శ్రియా శరణ్ చీర కట్టు.. ఫొటోలు
-
Anu Emmanuel: అందానికి చీర కడితే అను ఇమ్మాన్యుయేల్లా ఉంటుందేమో (ఫోటోలు)
-
ఇవాళే సౌభాగ్యదాయిని ‘అట్లతద్ది’!
అట్లతద్ది ముఖ్యంగా స్త్రీలు జరుపుకునే పండుగ. ‘తదియ’ నే ‘తద్దె’ అంటారు. ఉండ్రాళ్ల తద్దె , అట్ల తద్దె అనేవి అలా వచ్చినవే. ఆశ్వయుజ బహుళ తదియనాడు దీనిని జరుపుకుంటారు. దీనినే ఉయ్యాల పండుగ అనీ , గోరింటాకు పండుగ అనీ అంటారు. అసలు ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారు? దాగున్న ఆరోగ్య రహస్యాలు ఏమిటీ? తదితరాల గురించే ఈ కథనం!. ఈ పండుగకు గోరింటాకు పెట్టుకోవడం చాలా ముఖ్యం అట్లతద్దె ఈ తద్ది ప్రసిద్దమైనది. ఆంధ్ర ఆడపడుచులకు చాల ముఖ్యమైన పండుగ. అట్లతద్ది ముందురోజు భోగి అని పిలుస్తారు. ఆడపిల్లలందరూ చేతులకు, కాళ్ళకు గోరింటాకు పెట్టుకుని తెల్లవారుఝామునే లేచి ఉట్టి కింద కూర్చుని చద్దన్నం తింటారు(ఇప్పుడు ఉట్లు లేవు లెండి) ఆటపాటలతో కాలక్షేపం చేసి ఉయ్యాలలూగుతారు! పగలంతా ఉపవాసముండి సాయంకాలం చంద్రోదయం అయిన తరువాత చంద్రదర్శనం చేసుకుని 'చంద్రోదయోమా వ్రతం' చేసి అట్లు దానమిచ్చి , ఉమాదేవిని పూజించి భోజనం చేస్తారు. ఈ అట్లతద్దికి గోరింటాకును పెట్టుకోవడం చాల ముఖ్యం! చర్మ వ్యాధులు రాకూడదని.. గోరింట అంటే గోరు+అంటు= గోరింట అని బ్రౌణ్యం చెపుతోంది. సంస్కృతంలో కూడ దీన్ని నఖరంజని అంటారు. దీన్ని బట్టి చూస్తే గోరింటాకు గోర్లకు మంచిది అని తెలుస్తుంది. ఈ గోరింటాకు ఎంత బాగా పండితే అంత మంచి మొగుడొస్తాడని సరసాలడతారు. గ్రీష్మఋతువులోని ఆషాఢమాసంలోనూ వర్షఋతువులోని భాద్రపద మాసంలోనూ శరదృతువులోని ఆశ్వయుజ మాసంలోనూ మూడు సందర్భాలలో గోరింటాకును పెట్టుకుంటారు. ఇవి మూడు వానకారు పబ్బాలుగా ప్రసిద్ది! తెల్లవారుఝాము నుంచీ ఆడపిల్లలు పాడుతూ ఆడుకునే పాటలలో ఎన్నో ఆరోగ్యరహస్యాలను పొందుపరిచారు. ఇళ్ళల్లో నీళ్ళతావుల్లో తిరిగే ఆడవాళ్ళకు చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వాటికి వాడవలసిన మందులను తెలిపే పాట.... 'కాళ్ళగజ్జ కంకాళమ్మ వేగుచుక్క వెలగామొగ్గ మొగ్గా కాదు మోదుగనీరు నీరుకాదు నిమ్మలబావి బావికాదు వావిటికూర కూరకాదు గుమ్మిడిపండు పండుకాదు పాపిడిమీసం' కాళ్ళకు గజ్జి లాంటి చర్మవ్యాధులొస్తే కంకాళమ్మ ఆకును నూరి పసరుతీసి రాస్తే గజ్జి పోతుంది. దానికి లొంగకపోతే వెలగ మొగ్గను నుజ్జుచేసి శరీరంపై పూసుకోవాలి. అప్పటికీ తగ్గకపోతే వావిటికూరను ముద్దగాజేసి పట్టీలు వేసుకోవాలి అప్పుడు ఆ వ్యాధి నిమ్మళించి గుమ్మడి పండులాగ నిగనిగలాడతారని ఈ పాటలో చెప్పారు! అలాగే గోరింటాకు పెట్టుకున్నగోళ్ళు వాటి రంగులు చూసుకుంటూ 'చిప్పచిప్ప గోళ్ళు సింగరాజు గోళ్ళు' అని పాడుకుంటారు. 'ఒప్పులకుప్ప ఒయ్యారిభామా సన్నబియ్యం ఛాయాపప్పు మునగాపప్పూ నీమొగుడెవరు గూట్లోరూపాయి నీమొగుడు సిపాయి' అని ఈరోజు ఉదయంనుంచి తయారు చేసిన పదార్ధాల మూలాలను తలచుకుంటూ వీర్యవృద్ధి కలిగిన ఈ పిండివంటలన్నీ రాబోయే మొగుడికోసమేనని మేలమాడుతూ రోటిపాటలు పాడతారు.ఆ రోళ్ళకు ఉయ్యాలలు కట్టి ఊయలలూపుతూ పెళ్ళయిన పడుచులను మొగుడిపేరు గట్టిగా చెప్పేదాకా వదలకుండా ఊపుతారు. పెట్టుకున్న గోరింటాకు ఎలా పండిందో చూసుకుని మురిసిపోతూ ... 'గోపాలకృష్ణమ్మ పెళ్ళయ్యేనాడు గోరింట పూచింది కొమ్మలేకుండా మాఇంట అబ్బాయి పెళ్ళయ్యేనాడు మల్లెలు పూచాయి మొగ్గలేకుండా' ఈ సంప్రదాయ స్త్రీ పాటనే కృష్ణశాస్త్రిగారు తమపాట పల్లవిగా మలచుకున్నారు. తరువాత వారి చరణమే 'మందారంలా పూస్తే మంచిమొగుడొస్తాడు గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు సిందూరంలా పూస్తే చిట్టిచేయంతా అందాల చందమామ అతనే దిగివస్తాడు' అనుకుంటూ చంద్రోదయోమావ్రతం చేసుకుంటారు! ఇవన్నీ నిన్నామొన్నటి వరకు పల్లెపడుచుల అట్లతద్ది ఆటపాటలు. బహుశః ఏ పైలోకాలలోనో తెలుగు ఆడపడుచులకు వాళ్ళ చిన్నతనంలోని పాటలన్నీ వినాలనిపించిందేమో ... ఈ పాటల ఊయలలను తీసుకుపోయి అందనంత ఎత్తులో వాళ్ళదగ్గరే ఉంచేసుకున్నారు. కానీ ఊయలెప్పుడూ ఒకేచోట ఉండదు! అది కిందకు రాక తప్పదు!! మళ్ళీ ఈ అట్లతద్ది ఆటపాటలు మాకందివ్వకా తప్పదు!!! ఈ తరం పడుచులందరికీ ఒకటే వినతి! రండి లేవండి తెల్లవారు ఝామునే చద్దన్నం తిని మన ఆటపాటల ఊయలను మనమే పట్టుకుందాం రండి!! 'అట్లతద్దోయ్ ఆరట్లోయ్ ముద్దపప్పోయ్ మూడట్లోయ్ సీమ పచ్చిమిరపకాయ్ చిఱ్ఱో చిఱ్ఱో నీ మొగుడు కొడితే మొఱ్ఱో మొఱ్ఱో' అట్లతద్ది అంతరార్థం త్రిలోక సంచారి అయిన నారదముని ప్రోద్బలంతో గౌరీదేవి శివుని పతిగా పొంద గోరి మొదటి సారిగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్త్రీలు సౌభాగ్యం కోసమై చేసుకునే వ్రతం ఇది. చంద్రారాధన వల్ల చంద్రకళల్లో కొలువై ఉన్న శక్తి వ్రతం చేసిన వారికి వస్తుందని , ఆయన అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని , కుటుంబంలో సుఖశాంతులు వర్థిల్లుతా యని శాస్త్ర వచనం. ఈ పండుగలో అమ్మవారికి అట్లని నైవేద్యంగా పెట్టడంలో ఒక అంతరార్థం దాగి ఉంది. నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహా ప్రియం. అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోషం పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులూ రావని నమ్మకం. రుతుచక్రం సరిగా ఉండేలా చేసి కాపాడతాడు. అందువల్ల గర్భధారణలో ఎటువంటి సమస్యలూ ఉండవు. మినపపిండి , బియ్యపు పిండిని కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువుకు , బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు. గర్భ దోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి. బియ్యం , మినప్పప్పు కలిపి చేసిన అట్లను అమ్మవారికి నివేదించటంలో సమస్త గ్రహాలు కూడా శాంతించి జీవితాన్ని సుఖవంతంగా ఉండేటట్లుగా అనుగ్రహిస్తుందని నమ్మకం. అమ్మవారి నైవేద్యం ఆరోగ్యాన్ని , శక్తిని కలిగిస్తుంది. ఈ పండుగను అవివాహిత స్త్రీలు చేస్తే మంచి మొగుడు వస్తాడని, పెళ్లైన వారు చేస్తే సౌభాగ్యం కలకలం ఉంటుందని శాస్త్ర వచనం. (చదవండి: కోరికలు కలలోని పూదోటలు! వాటి కోసం పరుగులు తీస్తే చివరికి..) -
Birthday Special: అదిరే అందం..అదితి హైదరి సొంతం
-
Srinidhi Shetty Latest Photos: ట్రెడిషనల్ & ట్రెండీ లుక్లో కవ్వించేస్తోన్న కేజీఎఫ్ బ్యూటీ
-
Shakeela: ఒకప్పుడు గ్లామర్ డాల్.. ఇప్పుడు ట్రెడిషనల్ అవతార్ (ఫోటోలు)
-
Saxophonist: శాక్సాఫోన్ సుబ్బలక్ష్మి
సుబ్బలక్ష్మి ఇంటి పేరు ఎవరికీ తెలియదు. ప్రపంచమంతా ఆమెను శాక్సాఫోన్ సుబ్బలక్ష్మి అనే పిలుస్తుంది. మగవారు మాత్రమే వాయించే ఈ వాయిద్యంలో సుబ్బలక్ష్మి స్త్రీగా ఉనికి సాధించింది. పట్టుచీర, వడ్డాణం ధరించి వేదిక మీద సంప్రదాయ ఆహార్యంలో ఈ ఆధునిక వాయిద్యం మీద వెస్ట్రన్, కర్నాటక్లో అద్భుత ప్రతిభ చూపుతుంది. డైరీలో ఒకరోజు కూడా ఖాళీ ఎరగని ఈ బెంగళూరు వాద్యకారిణి సక్సెస్ స్టోరీ. 40 ఏళ్ల సుబ్బలక్ష్మి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయాలంటే సంవత్సరం ముందు బుక్ చేసుకోవాలి. ఆమె డైరీలో ఒక్కరోజు కూడా ఖాళీ ఉండదు. ఇవాళ చెన్నై, రేపు బెంగళూరు, ఎల్లుండి దుబాయ్... ఆమె కచ్చేరీలు సాగిపోతూ ఉంటాయి. భర్త కిరణ్ కుమార్కు ఐ.టి. రంగంలో మంచి ఉద్యోగం. కానీ ఈమె కచ్చేరీల బిజీ చూసి ఉద్యోగం మానేసి సాయంగా ఉంటున్నాడు. బెంగళూరులో నివాసం ఉండే సుబ్బలక్ష్మి సొంతింట్లో ఉండేది తక్కువ. కచ్చేరీలకు తిరిగేది ఎక్కువ. కాని ఈ విజయం అంత సులువు కాదు సుమా. ఒక్కతే శిష్యురాలు సుబ్బలక్ష్మి పూర్తిపేరు ఎం.ఎస్.సుబ్బలక్ష్మి. అవును. మహా గాత్ర విద్వాంసులు ఎం.ఎస్.సుబ్బులక్ష్మిని జ్ఞప్తికి తెచ్చే పేరు. ఆ పేరు ప్రభావమో, ఇంట్లో సంగీతం ఉండటమో సుబ్బలక్ష్మికి కూడా సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. సుబ్బలక్ష్మి తాత మైసూర్ సంస్థానంలో ఆస్థాన సంగీత విద్వాంసుడుగా ఉండేవాడు. సుబ్బలక్ష్మి తండ్రి సాయినాథ్ మంగళూరులో మృదంగ విద్వాంసుడు. అతడు అనేకమంది సంగీతకారులకు కచ్చేరీల్లో వాద్య సహకారం అందించేవాడు. ఐదో ఏట నుంచే గాత్ర సంగీతం నేర్చుకుంటున్న సుబ్బలక్ష్మి ఒకసారి తండ్రితోపాటు కచ్చేరీకి వెళ్లింది. అది శాక్సాఫోన్ విద్వాంసుడు కద్రి గోపాల్నాథ్ కచ్చేరి. అందులో గోపాల్నాథ్ అద్భుతంగా శాక్సాఫోన్ వాయిస్తుంటే సుబ్బలక్ష్మి మైమరిచిపోయింది. తాను కూడా శాక్సాఫోన్ నేర్చుకోవాలనుకుంది. అప్పుడు ఆమెకు 13 ఏళ్లు. ఆ రోజుల్లో ఆడపిల్లలు శాక్సాఫోన్ను అంతగా నేర్చుకునేవారు కాదు. గురువులు నేర్పించేవారు కూడా కాదు. అది పూర్తిగా మగవారి వాయిద్యం. కాని సుబ్బలక్ష్మి పట్టుబట్టింది. మొత్తం 16 మంది శిష్యులు ఆ సమయంలో కద్రి గోపాల్నాథ్ దగ్గర ఉంటే వారిలో ఒకే ఒక శిష్యురాలు సుబ్బలక్ష్మి. గర్భం దాల్చాక కూడా సుబ్బలక్ష్మి శాక్సాఫోన్ వాయించడంలో ఒక వరుస ఉంటుంది. ఆమె మొదట కర్నాటక సంగీతం వాయించి ఆ తర్వాత ఫ్యూజన్లోకి వస్తుంది. వెస్ట్రన్ను, కర్నాటక్ను మిళితం చేసి కచ్చేరీల్లో ఒక ఊపు తెస్తుంది. అది జనానికి నచ్చుతుంది. ఇది కూడా కొంతమంది శాక్సాఫోన్ విద్వాంసులకు నచ్చదు. ఆమెను విమర్శిస్తుంటారు. ‘నన్ను ఎన్నో విమర్శిస్తారు. కాని నేను భయపడలేదు. కచ్చేరీలు కొనసాగించాను. 7 కిలోల శాక్సాఫోన్ను రెండు గంటల పాటు పట్టుకుని కచ్చేరి చేయడం ఎంత కష్టమో ఆలోచించండి. ఆడది అలా చేయలేదు అనేవాళ్లకు సమాధానంగా నిలిచాను. నా ఊపిరితిత్తుల బలం నాకు సహకరించింది. పెళ్లయి గర్భం దాల్చాక నా శత్రువులు ఇక ఆమె కచ్చేరీలు చేయదు అనే ప్రచారం మొదలెట్టారు. డెలివరీ అయ్యాక కచ్చేరీలు సాధ్యం కాదని ఆర్గనైజర్స్ను భయపెట్టారు. దాంతో షోలు బుక్ చేసిన ఆర్గనైజర్స్ అడ్వాన్సులు వెనక్కు ఇమ్మని అడగడం మొదలెట్టారు. నేను పట్టుదలగా ఆ పుకార్లను తోసి పుచ్చాను. రేపు డెలివరీ అనగా ఇవాళ కూడా కచ్చేరీ చేశాను. నిండు గర్భవతిగా స్టేజ్ మీద శాక్సాఫోన్ వాయించింది నేనే అనుకుంటా. అలాగే డెలివరీ అయిన 15 రోజులకు మళ్లీ స్టేజ్ మీదకు వచ్చాను. ఈ రంగంలో నేనేమిటో నిరూపించుకోవాలనే నా పట్టుదలే నాకు బలాన్ని ఇచ్చింది’ అంటుంది సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి సోదరి లావణ్య కూడా శాక్సాఫోన్ విద్వాంసురాలిగా రాణిస్తోంది. వీరు విడివిడిగా కచ్చేరీలు చేసినా కలిసి చేసే కచ్చేరీలు కూడా వీనుల విందుగా ఉంటాయి. ఎన్నో వెక్కిరింతలు సాధనలో అబ్బాయిలు సుబ్బలక్ష్మిని అస్సలు సహించలేదు. ‘నేను శాక్సా పట్టుకుని సాధన చేస్తుంటే వాళ్లు నవ్వుతుండేవారు. కుర్చీ కిర్రుకిర్రుమన్నట్టు ఉంది అనేవారు. గురువు గారి భార్య మా అమ్మకు స్నేహితురాలు. వీళ్లు నవ్వుతుంటే ఆమె బయటికొచ్చి చూసి– వాళ్లు నవ్వనీ ఏమైనా అననీ... నువ్వు మాత్రం ట్రై చేస్తూనే ఉండు. నీకు వస్తుంది అని ఎంకరేజ్ చేసింది. ఆమె ప్రోత్సాహం వల్ల ధైర్యం తెచ్చుకున్నాను. నేను శాక్సాఫోన్ నేర్చుకోవడంలో ప్రోత్సాహం కంటే అవమానమే ఎక్కువ. కచ్చేరీల్లో కావాలని నా టైము మధ్యాహ్నం ఇచ్చేవారు. ఆ సమయంలో ఆడియెన్స్ ఉండరు. మహా అయితే పది నిమిషాలు కేటాయించేవారు. మగవారు సాయంత్రం నిండు సభలో వాయించేవారు. వారికి గంట సమయం దొరికేది. నన్ను ప్రత్యేకంగా మహిళా శాక్సాఫోనిస్ట్ అని విడిగా చూసేవారు’ అని తెలిపింది సుబ్బలక్ష్మి. -
గిన్నిస్ భర్ సింగ్
పంజాబ్కు చెందిన అమృత్భర్సింగ్ పేరు వినబడగానే అదేదో ఆయన ఇంటి పేరులాగా ‘గిన్నిస్ బుక్’ అనే సౌండ్ ఠకీమని ప్రతి«ధ్వనిస్తుంది. గతంలో ఎన్నో రికార్డ్లను క్రియేట్ చేసిన అమృత్భర్సింగ్ తాజాగా మరో రికార్డ్ సృష్టించాడు. ఒక నిమిషంలో ఫింగర్ టిప్స్పై 86 పుషప్లు చేసి గిన్నిస్బుక్లోకి ఎక్కాడు. గుర్దాస్పూర్ జిల్లా ఉమర్వాలా గ్రామానికి చెందిన సింగ్ ΄ాశ్చాత్య పద్ధతుల్లో కాకుండా సంప్రదాయ పద్ధతుల్లో ్ర΄ాక్టీస్ చేస్తుంటాడు. మోడ్రన్ జిమ్లకు వెళ్లకుండా ఇంటిపరిసరాలలో ఉన్న పశువుల కొట్టాన్ని జిమ్గా మార్చుకున్నాడు. ఇటుకలు, ఇసుక బస్తాలు, ΄్లాస్టిక్ క్యాన్లు తన ్ర΄ాక్టీసింగ్ సాధనాలు. సప్లిమెంట్స్కు దూరంగా ఉండే సింగ్ నేచురల్ డైట్స్ మాత్రమే తీసుకుంటాడు. ‘గతనెల ఫిబ్రవరి నెలలో సెట్ చేసిన రికార్డ్ను నేనే బ్రేక్ చేయాలనుకున్నాను. ్ర΄ాక్టీస్ కోసం ఎన్నోనెలలు చెమటలు చిందించాను. ఫలితం వృథా ΄ోలేదు’ అంటున్నాడు అమృత్భర్ సింగ్. -
రాత్రికి రాత్రే వయసు తగ్గిపోయింది!
రాత్రికి రాత్రే వయసు ఏకంగా ఒకటి నుంచి రెండేళ్లు తగ్గిపోయింది. అదీ ఒకరిద్దరికీ కాదు. ఏకంగా 5 కోట్ల మందికి!. ఇదేం జంబలకిడి పంబ మాయ కాదు. కొత్తగా తీసుకొచ్చిన చట్టం మూలంగా అక్కడి ప్రజల వయసు అలా ఆటోమేటిక్గా తగ్గిపోవాల్సి వచ్చింది. ఇంతకీ ఏమా చట్టం? ఎవరా ప్రజలు?.. ఎందుకు మార్చాల్సి వచ్చింది తెలియాలంటే.. దక్షిణ కొరియా.. జనాభా దాదాపు ఐదున్నర కోట్ల దాకా ఉంటుంది. కానీ, వాళ్లను వయసెంత అని అడిగితే మాత్రం మూడు రకాల సమాధానాలు ఇస్తుంటారు. దాని వల్ల ఆ దేశంలో అన్నింటా గందరగోళమే!. అందుకు కారణం.. మూడు విధాలుగా వాళ్ల వయసును లెక్కించడం. ► సౌత్ కొరియాలో ఇప్పటివరకూ.. సంప్రదాయ పద్దతిలో వయసు లెక్కింపు విధానంతో పాటు కేలండర్ ఏజ్, ఇంటర్నేషనల్ ఏజ్ అనే మూడు రకాల పద్ధతులను వాడుతూ వచ్చారు. కొరియన్ సంప్రదాయం ప్రకారం.. బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే వయసు లెక్కింపు మొదలవుతుంది. అలాగే.. జనవరి 1వ తేదీ నుంచి(కేలండర్ ఏజ్) ప్రకారం ఒక వయసు(అంటే ఒకవేళ బిడ్డ డిసెంబర్ 31వ తేదీన పుట్టినా కూడా.. ఆ మరుసటి రోజు నుంచి ఆ బిడ్డ వయసును రెండేళ్లుగా గుర్తిస్తారు) ఒక వయసు, ఇక ఇంటర్నేషనల్ స్టాండర్డ్కు తగ్గట్లుగా అంటే అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించి వయసు లెక్కింపు(డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా).. ఇలా మూడు రకాలుగా ఉంటూ వచ్చింది. ► ఉదాహరణకు ఒక వ్యక్తి 2003 జూన్ 30వ తేదీన పుట్టాడనుకోండి.. ఆ వ్యక్తికి 29 జూన్ 2023 నాటికి ఇంటర్నేషనల్ ఏజ్ బర్త్ ప్రకారం 19 ఏళ్లు, అదే కౌంటింగ్ ఏజ్ విధానంలో 20, కొరియన్ ఏజ్ విధానంలో 21 ఏళ్లు ఉండేది. దీనివల్ల చదువు మొదలు ఉద్యోగాల దాకా అన్నింటా చాలా ఏళ్లుగా గందరగోళం ఏర్పడుతూ వస్తోంది. పైగా ఈ తరహా విధానాల వల్ల ప్రభుత్వాలపై ఆర్థికంగా పెను భారం పడుతూ వచ్చింది ఇంతకాలం. ► దీనికి తెర దించేందుకు.. ఇక నుంచి అంతర్జాతీయ విధానాన్ని.. అంటే అన్ని దేశాల్లో ఎలా అనుసరిస్తారో అలా పుట్టిన తేదీ నుంచి(డేట్ ఆఫ్ బర్త్) విధానాన్ని అనుసరిస్తారు. ఇందుకోసం చేసిన చట్టం బుధవారం నుంచి అమలులోకి వచ్చింది. సో.. ఇప్పటి నుంచి పుట్టిన తేదీ ప్రకారమే అక్కడి ప్రజలు జీవనం కొనసాగించనున్నారు. ► దక్షిణ కొరియాకు అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక యూన్ సుక్ యోల్ సంస్కరణల వైపుగా అడుగులేయడం మొదలుపెట్టారు. సాంప్రదాయ వయస్సు-గణన పద్ధతులు వల్ల అనవసరమైన సామాజిక, ఆర్థిక వ్యయాలు ఏర్పడుతున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేశారాయన. ఇక నుంచి కొత్త చట్టం అమలు మూలంగా అన్ని జ్యుడీషియల్, అడ్మినిస్ట్రేటివ్ విషయాల్లో అంతర్జాతీయ వయసు లెక్కింపు విధానాన్నే అను సరిస్తారని, దీనివల్ల సామాజిక గందరగోళాలు, వివాదాలు తగ్గుముఖం పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ► ఈ చట్టాన్ని పోయిన ఏడాది డిసెంబర్ లోనే పార్లమెంట్ ఆమోదించింది. అలాగే పబ్లిక్ ఒపీనియన్లో భాగంగా సర్కారు నిర్ణయానికి ఏకంగా 86.2% దేశ ప్రజలు మద్దతు ప్రకటించారు. మిగతా సర్వేల్లోనూ.. ప్రతీ నలుగురిలో ముగ్గురు డేట్ ఆఫ్ బర్త్ వయసు గణన వైపే మొగ్గు చూపించారు. గతంలో చాలా దేశాలు సంప్రదాయ వయసు లెక్కింపు విధానాలను పాటించేవి. అందులో తూర్పు ఏషియా దేశాలు ప్రముఖంగా ఉండేవి. అయితే వీటిలో చాలావరకు వాటిని వదిలేసి.. గ్లోబల్ స్టాండర్డ్ను పాటిస్తూ వస్తున్నాయి. జపాన్ 1950లో, ఉత్తర కొరియా 1980 దాకా సంప్రదాయ వయసు లెక్కింపు విధానాలనే పాటిస్తూ ఉండేవి. ఇదీ చదవండి: డైనోసార్లు మనకు కాస్త దగ్గరే! -
జై శ్రీ అన్నా
గతంతో పోల్చితే చిరుధాన్యాల పెద్ద ఉపయోగాల గురించి పల్లె, పట్టణం అనే తేడా లేకుండా విస్తృత అవగాహన పెరిగింది. దీనికి సాక్ష్యంగా నిలిచే వీడియోను ప్రధానమంత్రి నరేంద్రమోదీ షేర్ చేశారు. ‘వైబ్రెంట్ విలేజెస్’ కార్యక్రమంలో భాగంగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఒక గ్రామంలోకి వెళ్లారు. ఆ గ్రామంలోని ఒక మహిళ మంత్రిగారికి చిరుధాన్యాలతో చేసిన సంప్రదాయ వంటల రుచి చూపించడమే కాదు... జొన్నె రొట్టె నుంచి రాగి లడ్డు వరకు చిరుధాన్యాలు చేసే మంచి గురించి మంచిగా మాట్లాడింది. ప్రధాని ప్రశంస అందుకొంది. ‘ప్రతి పల్లెలో ఇలాంటి దృశ్యం కనిపించాలి’... ‘క్షేత్రస్థాయి నుంచి మొదలైన స్పృహ, చైతన్యం వేగంగా విస్తరిస్తుంది’... ‘కనుల విందు చేసే వీడియో’... ఇలాంటి కామెంట్స్ కనిపించాయి. -
వైభవంగా అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ నిశ్చితార్థ వేడుక
సాక్షి, ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ఎంగేజ్మేంట్ వేడుక ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది. గుజరాతీ హిందూకుటుంబాలలో తరతరాలుగా అనుసరిస్తున్న గోల్ ధన, చునారి విధి వంటి పురాతన సంప్రదాయాలతో ఈ వేడుకను నిర్వహించారు. గుజరాతీ హిందూ కుటుంబాలు తరతరాలుగా పాటిస్తున్న గోల్ ధన, చునారి విధి కార్యక్రమాలు కుటుంబ దేవాలయంలో నిర్వహించారు. కుటుంబ సభ్యులు బహుమతులు ఇచ్చిపుచ్చుకుని ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు గుజరాతీ సంప్రదాయాలలో వివాహానికి ముందు జరిగే వేడుక గోల్ ధన. అంటే ఏంటీ గోల్ ధన అంటే బెల్లం, కొత్తిమీర గింజలు అని అర్ధం. గుజరాతీ సంప్రదాయాలలో వివాహానికి ముందు జరిగే నిశ్చితార్థం లాంటిదే. వధువు కుటుంబం బహుమతులు, స్వీట్లతో వరుడి నివాసానికి తరలి వెళ్లి, అక్కడ బంధు మిత్రుల సమక్షంలో ఆపై జంట ఉంగరాలు మార్చుకుంటారు. ఉంగరాలు మార్చుకున్న తర్వాత దంపతులు తమ పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. సాయంత్రం వేడుకలకు అనంత్ సోదరి ఇషా నేతృత్వంలో అంబానీ కుటుంబ సభ్యులు రాధికను ఆహ్వానించడానికి మర్చంట్ నివాసానికి వెళ్లడంతో వేడుకలు ప్రారంభమైనాయి. ఈ మేరకు రిలయన్స్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. అనంత్, రాధికలతోపాటు కుటుంబసభ్యులు శ్రీకృష్ణుని దర్శించుకుని సాంప్రదాయ లగ్న పత్రిక లేదా రాబోయే వివాహానికి ఆహ్వానం పఠనం తర్వాత గణేష్ పూజతో విధులను ప్రారంభించడానికి బృందం అక్కడి నుండి వేడుక వేదికకు తరలివెళ్లింది. గోల్ ధన , చునారి విధి తర్వాత అనంత్ రాధిక కుటుంబీకుల మధ్య ఆశీర్వాదాలు, బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. ముఖేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ నేతృత్వంలో నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటూ విశేషంగా నిలిచింది. సోదరి ఇషా రింగ్ వేడుక ప్రారంభమైనట్లు ప్రకటించిన వెంటనే అనంత్ రాధిక ఉంగరాలు మార్చుకుని పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంత్, రాధిక పెళ్లికబురు గత కొన్నిరోజులుగా ప్రత్యేకంగా నిలుస్తోంది. తాజాగా వివాహబంధంలో కీలకమైన వేడుకను సెలబ్రేట్ చేసుకున్నారు . కాగా బిలియనీర్ ముఖేశ్ అంబానీ, నీతా కుమారుడు అనంత్ అమెరికాలోని బ్రౌన్ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్. రిలయన్స్ ఇండస్ట్రీస్లో జియో, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ బోర్డ్లలో సభ్యునిగా కూడా వివిధ హోదాల్లో పనిచేసి, ప్రస్తుతం RIL ఇంధన వ్యాపారానికి నాయకత్వం వహిస్తున్నారు. శైలా, వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక, న్యూయార్క్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్. ఎన్కోర్ హెల్త్కేర్ బోర్డ్లో డైరెక్టర్గా పనిచేస్తున్నారు.ప్రత్యేక దీపాలు,పుష్పాలంకరణతో వేదిక దేదీప్యమానంగా మంగళవారం రాధిక మర్చంట్ మెహందీ వేడుకను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Sankranti 2023: పండగ రోజు ట్రెడిషనల్ లుక్ కోసం ఇలా చేయండి..
పండగ రోజున సంప్రదాయ దుస్తులతో ప్రత్యేకంగా కనిపిస్తూ సందడి చేస్తారు. అదేవిధంగా మేకప్ కూడా ప్రత్యేకంగా ఉంటే లుక్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. రోజంతా మేకప్తో ఫ్రెష్ లుక్లో కనిపించాలంటే ఎంపిక చేసుకునే సాధనాలలోనూ జాగ్రత్త వహించాలి. బ్లష్ సంప్రదాయ దుస్తులు ధరించినప్పుడు ఎక్కువ మేకప్ వేసుకోవడం కాస్త కష్టమే. అయితే, ట్రెడిషనల్గా నేచురల్ లుక్ కావాలంటే బ్లష్ అప్లై చేసుకోవచ్చు. ఫెయిర్గా ఉన్నవారు బ్లష్తో వారి ముఖారవిందాన్ని మరింతగా మెరిపించుకోవచ్చు. బ్లష్ అప్లై చేసిన తర్వాత రెగ్యులర్ ఫౌండేషన్ తో టచ్ అప్ చేయాలి. హైలైటర్ ధరించిన దుస్తులు ప్రకాశవంతమైన రంగులో ఉంటే, దానితో ప్రత్యేకంగా కనిపించడానికి లైట్ మేకప్ ఉత్తమంగా ఉంటుంది. ఇది న్యూడ్ ఐషాడో, లిప్స్టిక్తో పాటు చాలా తేలికపాటి బేస్ ఉంటుంది. దీనికోసం లైట్ హైలైటర్ని ఉపయోగించవచ్చు. మెరిసే కనుబొమ్మ గ్లిట్టర్ ఐషాడో ఎంపిక పండుగ రోజున ఉత్తమ ఎంపిక. సంప్రదాయ రూ΄ాన్ని అధునాతనంగా మార్చడానికి దీన్ని ప్రయత్నించవచ్చు. జరీ అంచు దుస్తులు ధరిస్తారు కాబట్టి బంగారు లేదా వెండి షిమ్మర్ ఐషాడో వేసుకుంటే ముఖ కాంతి మరింతగా పెరుగుతుంది. మాట్ లుక్ చాలా మంది సినీ తారలు మాట్ లుక్ మేకప్ని అనుసరిస్తారు. దీంతో చీర లేదా మరేదైనా సంప్రదాయ వేషధారణలో వారు మరింత అందంగా కనిపిస్తారు. మ్యాట్ లుక్ చర్మాన్ని ప్రకాశవంతంగా, సహజంగా కనిపించేలా చేస్తుంది. అయితే ఈ మేకప్ వేసుకునే ముందు చర్మ తత్వం గురించి తెలుసుకోవాలి. డార్క్ లిప్ స్టిక్ డార్క్ లిప్స్టిక్ మీ మేకప్ను మరింత అందంగా మారుస్తుంది. పండగరోజుల్లో సాధారణంగా బ్రైట్గా ఉండే దుస్తులను ధరిస్తారు కాబట్టి అప్పుడు ముదురు రంగు లిప్స్టిక్ ఎంపిక ధరించిన దుస్తులకు తగిన విధంగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో మాట్ లిప్స్టిక్ షేడ్స్ కూడా బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. -
తిరునామాలు, పంచెకట్టుతో ప్రధాని మోదీ ఎంట్రీ
-
ఆ పాత్ర మేకప్కే 45 నిమిషాలకు పైగా: విజయ్ సేతుపతి
Vijay Sethupathi Turns Traditional Street Performer: నటుడు విజయ్ సేతుపతి తాజాగా వీధి బాగోతం కళాకారుడి అవతారమెత్తారు. తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ కథానాయకుడిగా విజయ్ సేతుపతి రాణిస్తున్నాడు. అయితే వైవిధ్యం ఉంటే ఏ తరహా పాత్ర అయినా పోషించడానికి సిద్ధమవుతున్నాడు. ఆ మధ్య సూపర్ డీలక్స్ చిత్రంలో హిజ్రాగా నటించి ప్రశంసలు అందుకున్నారు. అదేవిధంగా మాస్టర్ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించి శభాష్ అనిపించుకున్నారు. తాజాగా వీధి బాగోతం కళాకారుడి అవతారమెత్తారు. తమిళనాడులో పారంపర్య కళల్లో వీధి బాగోతం కళ (తెరు కూత్తు) ఒకటి. ఈ కళను నేర్చుకోవాలనే ఆసక్తిని నటుడు విజయ్ సేతుపతి వ్యక్తం చేశారు. ఈయన్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నిశ్చల ఛాయాగ్రాహకుడు ఎల్.రామచంద్రన్ వీధి బాగోతం కళాకారుడిగా తీర్చిదిద్ది నూతన సంవత్సర క్యాలెండర్ రూపొందించారు. ఈ సందర్భంగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. వీధి బాగోతం కళాకారుడిగా మారడానికి మేకప్కే 45 నిమిషాలకు పైగా పట్టిందన్నారు. చదవండి: (ఐదేళ్ల తర్వాత బిగ్స్క్రీన్పై కనిపించబోతున్నా!) -
పండుగ వేళ.. గృహ కళ!
సాక్షి, హైదరాబాద్: పండుగ వేళ మీ ఇంటి శోభను రెట్టింపు చేయాలంటే ఇల్లును, ఇంట్లోని వస్తువులను శుభ్రం చేయడమే కాదు.. చిన్న చిన్న మెళకువలతో ట్రెండీ లుక్ తీసుకురావచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సంప్రదాయ అలంకరణ స్థానంలో ట్రెండీ లుక్ రావాలంటే ఎక్స్టీరియర్, ఇంటీరియర్ రెండు చోట్లా డెకరేటివ్ చేస్తే ఎకో–ఫ్రెండ్లీగా మారుతుందంటున్నారు. ► సంప్రదాయమైన దీపాంతులు, కొవ్వొత్తులకు కాలం చెల్లింది. వీటి స్థానంలో సిరామిక్ లేదా మార్బుల్ పల్లెంలో మట్టి దీపాంతలను వెలిగించండి. వీటిని హాల్, పూజ గదిలో పెట్టండి. డిస్కౌంట్ ధరల్లో వినూత్న డిజైన్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మరింత సృజనాత్మకత కావాలంటే బంగారపు వర్ణం ఉండే ఎలక్ట్రిక్ దీపాంతలు కూడా లభ్యమవుతాయి. ► ప్రముఖ ఎల్రక్టానిక్ కంపెనీలు బహుళ రంగుల లైట్లు, పోర్టబుల్ లైట్లు, లాంతర్లు వంటి వినూత్న లైటింగ్ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. వీటిని స్మార్ట్ఫోన్తో ఆపరేట్ చేసుకోవచ్చు కూడా. వైర్లెస్ ఉత్పత్తులు కావటంతో మొబైల్తో మనకు ఎంత కావాలంటే అంత కాంతి స్థాయి, రంగులను ఎంపిక చేసుకోవచ్చు. ► రంగు రంగుల బాటిల్స్లో కొవ్వొత్తులను పెట్టి గోడల మూలల్లో లేదా ప్రధాన ద్వారానికి ఇరు వైపులా, ఇంటి చుట్టూ వేలాడదీయవచ్చు. దీంతో ఇల్లు రకరకాల వర్ణాల్లో అందంగా దర్శనమిస్తుంటుంది. ► చేతితో తయారు చేసిన మట్టి దీపాంతలు, లాంతర్లు చాలా కామన్. వీటికి బదులుగా అకార్డియన్ పేపర్ లాంతర్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఇవి పగటి పూట సూర్య రశి్మని సేకరించి.. రాత్రి సమయాల్లో ప్రకాశిస్తాయి. వీటిని హెవీ డ్యూటీ నైలాన్తో తయారు చేస్తారు. ఈ లాంతర్ సెట్లు వివిధ డిజైన్స్, రంగుల్లో దొరుకుతాయి. ► ఈ మధ్య కాలంలో నీళ్లల్లో తేలియాడే కొవ్వొత్తులు బాగా ప్రాచుర్యం పొందాయి. అలంకరణ ప్రాయంగా వీటిని పూల కుండీల్లో, మొక్కలున్న ప్రాంతాల్లో, స్విమ్మింగ్పూల్, ఫౌంటేన్ వంటి మీద అమర్చుకోవచ్చు. -
తిరుమలలో సంప్రదాయ భోజనం కార్యక్రమం రద్దు
సాక్షి, తిరుమల: సంప్రదాయ భోజనంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం తగదని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. సంప్రదాయ భోజనం టీటీడీ అమ్మడం లేదన్నారు. ట్రయల్ రన్ విజయవంతం కాకపోవడంతో నిలుపుదల చేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. ఈ రోజు ఉదయం స్వామి వారి సేవలో పాల్గొన ఆయన ఆలయ వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ పాలక మండలి లేని సమయంలో టీటీడీ అధికారులు ఒక మంచి ఉద్దేశంతో సంప్రదాయ భోజనం ప్రవేశ పెట్టారని, అయితే అధికారులతో చర్చించి సంప్రదాయ భోజనాన్ని నేటి నుండి నిలిపి వేస్తున్నామని తెలిపారు. తిరుమలలో ఏ ఆహారమైన స్వామి వారి ప్రసాదంగానే అందించాలని అందువలనే సంప్రదాయ భోజనాన్ని నిలిపి వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. సోషల్ మీడియాలో కొందరు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని.. భక్తులు నమ్మొద్దని ఆయన కోరారు. కృష్ణాష్టమి సందర్భంగా టీటీడీలో నూతన సేవకు శ్రీకారం చుట్టబోతున్నామని, కృష్ణుడికి ఎంతో ఇష్టమైన నవనీత సేవ కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. టీటీడీలో ఇప్పటికే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే గుడికో గోమాత, గోపూజ, గోవిందునికి గోధారిత నైవేద్యం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ.. నవనీత సేవ లాంటి ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. శ్రీవారి నైవేద్యం, కైంకర్యాలకు కావాల్సిన పదార్ధాలు సాంప్రదాయ బద్ధంగా గోవు నుండి పాలు,నెయ్యి, వెన్నను సేకరించి స్వామి వారికి అందింస్తున్నట్లు వెల్లడించారు. కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో సర్వ దర్శనాలపై ఇప్పుడే నిర్ణయం తీసుకోమని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. -
అన్నమయ్య భవన్లో టీటీడీ సంప్రదాయ భోజనం
-
ఆషాఢ ఎడబాటు వెనుక.. ఆచారం.. ఆంతర్యం ఇవే..
సాక్షి, సిరిసిల్ల (కరీంనగర్): ఆషాఢాన్ని శూన్య మాసంగా భావిస్తారు. శుభకార్యాలు చేయకూడదని పెద్దలు విశ్వసిస్తారు. నిజానికి పెద్ద పండుగల రాకను ఈ మాసం తెలుపుతుంది. కొత్త దంపతులకు ఆషాఢం విరహ మాసం. ఒకరికొకరు దూరంగా ఉండాల్సిన అనివార్యమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సిన తరుణం. చూసుకోవడానికి కూడా వీల్లేకుండా కఠిన నిబంధనలు.. కలుసుకుంటే కలిగే దుష్పరిణామాల గురించి ఎన్నో అనుమానాలు. మారిపోయిన ప్రస్తుత కాలంలో నెల రోజుల ఎడబాటు అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త దంపతుల ఎడబాటు అనివార్యం అనే సంప్రదాయం సడలింపు దిశగా సాగిపోతోంది. ఫార్మాలిటీ కోసం ఓ 5 రోజులపాటు పుట్టింటికి వెళ్లి వస్తే చాలు అనే భావన కొందరు వెలిబుచ్చుతున్నారు. పెద్దల నియమం కూడా మంచికే అనుకునే వాళ్లూ ఉన్నారు. అయితే ఎడబాటు కూడా మంచికే అన్నది పెద్దల నిశ్చితాభిప్రాయం. ఆచారం.. ఆంతర్యం ఇవే.. ఆషాఢ మాసం నవ దంపతులను దూరంగా ఉంచడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నెల ప్రారంభం నుంచి కొత్త కోడలు అత్తగారి ముఖం చూడకూడదు. అలాగే కొత్త అల్లుడు అత్తగారింటి గడప తొక్కకూడదు అనే ఆచారం తరతరాలుగా వస్తోంది. కోడలు, అత్త ఒకరినొకరు చూసుకోవడం వల్ల వచ్చే సమస్యలు ఏమీ లేవు. మృగశిర నుంచి మొదలయ్యే చినుకుల ఆగమనం.. క్రమంగా ఆషాఢ మాసం ప్రవేశించే సరికి సమృద్ధిగా వర్షాకాలం అవుతుంది. సాగు ప్రధాన వృత్తిగా ఉన్న మెజార్టీ కుటుంబాల్లో ఇంటిల్లిపాది అదే పనుల్లో తలమునకలవుతారు. దీంతో కొత్త అల్లుడికి చేయాల్సిన మర్యాదలు చేయలేకపోతారు. పని ఆధారిత ప్రాంతాల్లో చేసే వృత్తిని కాదని మిగిలిన వాటికి ప్రాధాన్యత ఇవ్వరు. అందుకే ఈ నెలలో కొత్త అల్లుడు ఇంటికి రాకుండా ఉంటే సాగు పనులు నిరాటంకంగా సాగిపోతాయనే ఉద్దేశంతో ఈ నియమం విధించారు. వ్యవసాయాధారిత కుటుంబాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ దీన్ని అనుసరిస్తున్నారు. సంప్రదాయం వెనక శాస్త్రీయత నవ దంపతులు ఆషాఢ మాసంలో విడిగా ఉండాలనే నియమం పూర్వం నుంచి కొనసాగుతూ వస్తోంది. కొత్తగా పెళ్లయిన దంపతులు ఆరు నెలలపాటు అత్తగారింట్లో ఉండే సంప్రదాయం ఉండేది. శ్రమించే సమయంలో అత్తగారింట్లో కూర్చుని ఉంటే జరగాల్సిన పనులు నిలిచిపోతాయి. నవ దంపతులు ఒకే గూటిలో ఉండటం అంత మంచిది కాదంటారు. ఈ సమయంలో గర్భధారణ జరగడం తల్లీబిడ్డలకు అంత క్షేమం కాదు. ఆషా«ఢ మాసంలో కురిసే వర్షాలు, వరదల కారణంగా జలాశయాలు, పరిసరాల్లోని నీళ్లు కలుషితం అవుతాయి. ఈ నీటి వినియోగం అనారోగ్యాలకు కారణమవుతుంది. చలిజ్వరాలు, విరేచనాలు, తలనొప్పి మొదలైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. చీడపీడలు జనించే సమయంలో అనారోగ్య రోజులు, అశుభ సమయాల్లో గర్భధారణ జరిగితే అది పుట్టే శిశువుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని శాస్త్ర వచనం. ప్రత్యామ్నాయాలు బోలెడు ఎడబాటు కొత్త జంటకు కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ ఆధునిక కాలంలో అందుబాటులో ఉన్న సాంకేతిక పరికరాలు ఆ భావనను దూరం చేస్తున్నాయి. సెల్ఫోన్ వచ్చాక మనుషుల మధ్య మానసికంగా దూరం చాలా వరకు తగ్గిపోయింది. ఎస్ఎంఎస్లు, వాట్సాప్, ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా పరస్పర సందేశాల ఎలాగూ మార్చుకునే సౌకర్యం ఉండనే ఉంది. దూరంగా ఉండటమే శ్రేయస్కరం ఆషాఢ మాసంలో విడిగా ఉండటం శ్రేయస్కరమే. ఈ సమయంలో గర్భధారణ జరిగితే ప్రసవం వచ్చే ఎండాకాలంలో అవుతుంది. అధిక ఉష్ణోగ్రతల సమయంలో శిశువు జన్మిస్తే బాహ్య పరిసరాలను భరించడం కష్టమవుతుంది. ఆషాఢ మాసంతోపాటు పూజలు, నోముల పేరుతో శ్రావణంలో ఎడబాటు కొనసాగిస్తే సంతానోత్పత్తి› సమయాన్ని జూలై, ఆగస్టు వరకు పొడిగించుకునే అవకాశం ఉంటుంది. సుఖ ప్రసవానికి అనువుగా ఉంటుంది. – డాక్టర్ గీతావాణి, గైనకాలజిస్టు వివాహ బంధం బలోపేతం ఆషాఢ మాసం కొత్త దంపతుల మధ్య అనురాగాన్ని చిగురింపజేస్తుంది. అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు, ఆచారాలు, వ్యవహారాలు, సంప్రదాయాలు అన్నీ చూసి నిర్ధారించిన వివాహాల్లో ఈ నియమం చాలా బాగా పని చేస్తుంది. ఆషాఢ మాసంతో పరస్పర అభిప్రాయాలను పంచుకునే వీలు కలుగుతుంది. తద్వారా వివాహ బంధం బలోపేతం అవుతుంది. – బోయిని గౌతమ్, హారిక సంప్రదాయాన్ని పాటిస్తున్నాం పెద్దవాళ్లు ఏ నియమం పెట్టినా అది పిల్లల మంచి కోసమే. తరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని పాటించడం వల్ల సమస్యేమీ లేదు. పైగా ఇప్పుడు సెల్ఫోన్ లాంటి సాంకేతిక పరికరాలు మనుషులను కలిపే ఉంచుతున్నాయి. పెద్దవాళ్లు వి«ధించిన నియమ నిబంధనలు శాస్త్రీయ కోణంలోనే చూడకుండా, ఆరోగ్యం దృష్ట్యా పాటిస్తే మేలు కలుగుతుంది. అందుకే మేము ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నాం. – గూడెల్లి సురేశ్, వాసవి, సాఫ్ట్వేర్ దంపతులు 5 రోజులు తీసుకెళ్లారు పిల్లలు బాగుండాలనే పెద్దలు అనేక నియమాలను వి«ధించారు. టైమ్తో సంబంధం లేకుండా ఉద్యోగాలు చేసుకునే కాలంలో ఇలాంటి ఇవి కొంత అసౌకర్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి సంప్రదాయం కోసం ఐదు రోజులు పుట్టింటికి తీసుకెళ్లారు. ఎడబాటుతో అన్యోన్యత కూడా పెరుగుతుంది కాబట్టి ఆషాఢ నియమం మంచిదే. – గోవిందు భరత్కుమార్ (ప్రైవేట్ ఉద్యోగి), పద్మజ -
శ్రీమతి వైజాగ్ ట్రెడిషనల్ ఫ్యాషన్ షోలో మెరిసిన సినీ నటి అర్చన
-
పెళ్లిలో హోమాలు ఎందుకు చేస్తారో తెలుసా?
పాణి గ్రహణమైన తర్వాత, వధూవరులిద్దరూ హోమగుండం చుట్టు ప్రదక్షిణలు చెయ్యాలి. అప్పుడు వరుడు వధువు చేత ఏడడుగులు నడిపిస్తాడు. దీనినే సప్తపది అంటారు. ఆ సమయంలో చదివే మంత్రాలు, వరుడి సంకల్పాన్ని దేవతలకు ఏడు వాక్యాలలో తెలియజేస్తాయి. వధువు మొదటి అడుగు వలన అన్నం, రెండవ అడుగు వలన బలం, మూడవ అడుగు వలన కర్మ, నాల్గవ అడుగు వలన సుఖసంతోషాలు, ఐదవ అడుగువలన పశుసంపద, ఆరవ అడుగు వలన ఋతుసంపద, ఏడవ అడుగు వలన సత్సంతానం కలగాలని వరుడు ప్రార్థిస్తాడు. తర్వాత ఆ వధువు చేత ‘నేను తీర్థం, వ్రతం, ఉద్యాపనం, యజ్ఞం, దానం మొదలైన గృహస్థాశ్రమ ధర్మాలలో మీకు అర్ధ శరీరమై మసలుకుంటాను, హవ్య, కవ్య సమర్పణలో దేవ, పితృపూజలలో, కుటుంబ రక్షణ, పశుపాలనలో, మీ వెన్నంటే ఉంటాను’ అని ప్రతిజ్ఞ చేయిస్తారు. ఆ తర్వాత వధువుతో తన సఖ్యతను తెలియజేసి వధువు సఖ్యతను పొందుతాడు. అలా వారిద్దరి మధ్యన ఏర్పడిన బంధం ఏడు జన్మల వరకు నిలవాలని కోరుకోవడమే సప్తపది. తర్వాత షోడశ హోమాలు అంటే పదహారు ప్రధాన హోమాలను చేసి సోముడు, గంధర్వుడు, అగ్ని, ఇంద్రాది సమస్త దేవతలకు హవిస్సులర్పిస్తారు. తరువాత వధువుచేత, తన భర్తకు దీర్ఘాయుష్షు, తనకు అత్తవారింటితో చక్కటి అనుబంధం, అన్యోన్య దాంపత్యం కలగాలని లాజహోమాన్ని చేయిస్తారు. తదుపరి వధువు నడుముకు కట్టిన యోక్త్రమనే తాడును విడిపిస్తారు. తరువాత, వరుడు, వధువును రథంలో ఎక్కించుకుని, తన ఇంటికి తీసుకెళ్తాడు. ఆ వాహనంలో తీసుకెళ్ళేటప్పుడు చెప్పే మంత్రాలు హైందవ సాంప్రదాయాలలో స్త్రీకి ఇచ్చిన ప్రాముఖ్యతను తప్పకుండా అందరూ గ్రహించి తీరాలి. ఆ మంత్రాలకు అర్థం, ‘ఓ వధూ..! నీవు మా ఇంట ప్రవేశించి మా విరోధులను తరిమి వేయి. నీ భర్తనైన నన్ను మాయింట శాసించు. నాపై ఆధిపత్యం వహించు. సంతానంతో నా వంశాన్ని వృద్ధి చేయి. నీ అత్తమామలకు, ఆడపడుచుకు, బావలకు, మరుదులకు సామ్రాజ్ఞివికా. మా కుటుంబానికి, మా సంపదలకు యజమానురాలివికా. అందరితో కలిసి మెలసి నా ఇంటిని ఆహ్లాదకరంగా చేయి’. వరుడు ఈ ప్రమాణాలు చేయడం ద్వారా వధువుకు అత్తవారి ఇంట సర్వాధిపత్యం ఇవ్వబడుతుంది. తదుపరి, వరుని గృహంలో వధూవరులిద్దరు హోమం చేస్తారు. దీనినే ప్రవేశహోమం అంటారు. ప్రవేశ హోమంలో పదమూడు మంత్రాలతో దేవతలకు హవిస్సులర్పిస్తారు.. వానిలో ‘ఓ ఇంద్రాగ్నులారా..! నా భార్యకు నూరు సంవత్సరాలు భోగభాగ్యాలను కలిగించు, ఓ త్వష్ట ప్రజాపతీ..! మాకు సుఖాలను ప్రసాదించు. హే విశ్వకర్మా..! ఈమెను నాకు భార్యగా నీవే పుట్టించితివి. నావలన సంతానం పొంది నూరేళ్ళు జీవించునట్లు అనుగ్రహించు’ ఇత్యాది మంత్రాల ద్వారా వైదిక దేవతలకు హవిస్సులర్పిస్తూ ఆ దంపతులకు ఆయుర్దాయం, పరస్పరానురాగం, సత్సంతానం, భోగ భాగ్యాలు, ధనధాన్యాలను కోరుకుంటారు. తర్వాత జయాది హోమాలు చేయాలి. తదుపరి స్థాలీపాకహోమం చేసి కనీసం ఇద్దరికి భోజనం ఏర్పాటు చేయాలి. – ఆచార్య తియ్యబిండి కామేశ్వరరావు -
అనసూయ ట్రెడిషనల్ ఫొటోస్ ఓ లుక్కేయండి..
-
దుకుట్టీలు
దుపట్టా జారదు... చేతికి అడ్డం రాదుమోయాల్సిన అవసరం ఉండదుజాగ్రత్త చేసుకోవాల్సిన కష్టం ఉండదుఈ దుపట్టాలు కుట్టిన దుపట్టాలు. దుకుట్టీలు. ►బ్రౌన్ కలర్ సిల్క్ లెహెంగాకు స్టోన్, కట్దానా, జర్దోసీ వర్క్ చేసిన గ్రీన్ కలర్ బ్లౌజ్. ఆభరణాల అవసరం లేకుండా బ్లౌజ్ ప్యాటర్న్కు నెక్ దగ్గర జత చేసిన దుపట్టా స్టైల్ క్లచ్.ఎంబ్రాయిడరీ చేసిన లేత పచ్చ రంగు సిల్క్ గౌన్, దానికి జత చేసిన జరీ అంచులు గల ముదురు పసుపు దుపట్టా ప్రత్యేక ఆకర్షణ. ►లెహంగా, చోలీ, దుపట్టా ఒకే రంగులో ఉన్న ఇండో వెస్ట్రన్ స్టైల్ లుక్. చోలీకి మెడ భాగంలో జత చేసిన దుపట్టా ఈ డ్రెస్కి ప్రధాన ఆకర్షణ. ►లంగా ఓణీ స్టైల్లో డిజైన్ చేసిన వెస్ట్రన్ గౌన్ ఇది. అంటే టూ ఇన్ వన్ ౖస్టైల్ అన్నమాట. దీనికి ఎడమ భుజం మీదుగా దుపట్టా స్టైల్ వచ్చేలా డిజైన్ చేశారు. దీంతో ఇది పూర్తిగా ఇండోవెస్ట్రన్ లుక్తో ఆకట్టుకుంటుంది. ►లెహెంగా–ఛోలీని కలుపుతూ డిజైన్ చేసిన అందమైన దుపట్టా. సంప్రదాయ వేడుకల్లో ఈ స్టైల్ హైలైట్గా నిలుస్తుంది. ►వెస్ట్రన్ గౌన్కి నెటెడ్ దుపట్టా రెండు భుజాలమీదుగా తీసి, నడుము దగ్గర జత చేయడంతో లుక్లో భిన్నమైన మార్పు కనిస్తోంది. ►ఎంబ్రాయిడరీ చేసిన లాంగ్ డిజైనర్ గౌన్కి దుపట్టాని భుజం మీదుగా సన్నగా తీసి, కింది భాగం ఫ్లెయిర్ ఎక్కువ ఉండేలా జత చేశారు. ►డిజైనర్ లంగాఓణీలలో ఎన్నో మార్పులు వచ్చాయి. లెహంగాకు నడుము దగ్గర ఓణీని జత చేసి ఓ భిన్నమైన లుక్ని తీసుకువచ్చారు. ►జార్జెట్ గౌన్కి సింపుల్ ఎంబ్రాయిడరీ చేసిన దుపట్టాను మెడకు హారంలా ఉండేలా జత చేశారు. ►ఇది లెహంగా కుర్తీ స్టైల్. దీనికి దుపట్టా మోడల్ లుక్ వచ్చేలా పవిట, కొంగు భాగాలను హైలైట్ చేస్తూఎంబ్రాయిడరీతో డిజైన్ చేశారు. -
కొత్తగా.. పండగలా..
ఆకాశం నుంచి నక్షత్రాలు తెచ్చి అల్లినట్టుగా...భూమ్మీద ముగ్గులు తెచ్చి అద్దినట్టుగా...తోకాడించే గాలిపటాలనుగగనానికి పంపినట్టుగా...అంతా పండగలా.. కానీ, కొంచెం కొత్తగా!తెలుగింటి విరిబోణి కట్టు లంగా ఓణీ. సంప్రదాయ వేడుక లేదా పండగ అనగానే పట్టు లంగా ఓణీ తలపుకు వచ్చేస్తుంది. ఎప్పుడూ ఒకే టైప్ డ్రెస్ కోడ్ అనే నేటితరానికి మరికొంచెం కొత్తగా, మరింత ఆకర్షణీయంగా ఉండేలా ఇలాంటి డిజైన్ లెహంగా, దుపట్టాలను ఎంపిక చేయచ్చు. అయితే, కలర్ కాంబినేషన్స్, అలంకరణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ప్లెయిన్ కలర్స్ అయినా కట్, కుట్టుతో ఇలాంటి కాంబినేషన్ ఆకట్టుకుంటుంది. సంప్రదాయ రంగులు అయితే పెద్ద పెద్ద ఆభరణాలు ధరించినా అందంగా కనిపిస్తారు. అదే, స్పెషల్ అనిపించే గ్రే, లైట్ క్రీమ్, సియాన్.. వంటి రంగులకు ఆభరణాల అలంకరణ అంతగా నప్పవు. డిజైన్లో ఉన్న తేడాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇతర అలంకరణపై దృష్టి పెట్టాలి. ►గ్లాస్ బీడ్స్, ముత్యాలు, జర్దోసీల కలయికతో ఎంబ్రాయిడరీ చేసిన రా సిల్క్ లెహెంగా, జాకెట్టు గ్రాండ్గా కనువిందు చేస్తుంది. దీనికి రెడ్ కలర్ కట్వర్క్ నెటెడ్ దుపట్టా జత చేయడంతో చూపులను కట్టడి చేస్తుంది. ►జర్డోసీ, గ్లాస్ బీడ్స్తో ఎంబ్రాయిడరీ చేసిన పసుపు లెహెంగా పండగ సమయంలో ధరిస్తే చూపు తిప్పుకోనివ్వదు. లెహెంగా అంచు రంగును పోలిన నీలాకాశపు కట్ వర్క్ దుపట్టా మింట్ రా సిల్క్ డిజైనర్ బ్లౌజ్ లెహంగాకి పర్ఫెక్ట్ మ్యాచ్. ►సంప్రదాయ వేడుకలకు చిరునామాగా నిలుస్తాయి ఎరుపు, పసుపు రంగులు. ఎరుపు రంగు రా సిల్క్ మీద సీక్వెన్స్ వర్క్, జియోమెట్రికల్ ప్యాటర్న్ బ్లౌ, కట్వర్క్ దుపట్టా లుక్ని అందంగా మార్చింది. బెల్ట్ భాగం ప్రత్యేకతను నిలుపుతోంది. ►ముదురు ఎరుపు లంగా, జాకెట్టు దానికి క్రీమ్ కలర్ దుపట్టా సరైన కాంబినేషన్. అయితే ఇందుకు ఫ్యాబ్రిక్ ఎంపికలో జాగ్రత్త తీసుకోవాలి. బీజ్ టుల్ లెహెంగా మీద ఆలోవర్ సిక్వెన్ వర్క్, జియోమెట్రికల్ ప్యాటర్న్ బ్లౌజ్, కట్వర్క్ నెటెడ్ దుపట్టా కళను రెట్టింపు చేస్తుంది. ►లేత గులాబీని తలపించే బీజ్ టుల్ లెహెంగా, దాని మీద ఆలోవర్ సీక్వెన్ వర్క్ అబ్బురుపరుస్తుంటుంది. దీనికి లేత నీలం రంగు కట్వర్క్ దుపట్టా, సీక్వెన్ బ్లౌజ్ ఆకర్షణీయంగా రూపుకట్టింది. ►రా సిల్క్ లెహెంగా, మీద గ్లాస్ బీడ్స్, జరీ వర్క్ చేయడంతో ట్రెండీ లుక్ తీసుకువచ్చింది. లెహెంగా రంగులోనే డిజైనర్ బ్లౌజ్, క్రీమ్ కలర్ నెటెడ్ కట్వర్క్ దుపట్టా జతచేయడంతో అందానికి అంబరమే హద్దుగా మారింది. ఫాయిల్ప్రింటెడ్ రా సిల్క్ ఫ్యాబ్రిక్తో డిజైన్ చేసిన లెహెంగా ఇది. దీనికిజర్దోసీ వర్క్ చేసిన బ్లౌజ్ని జత చేయడంతో యంగ్ లుక్ని మరింత ఆకర్షణీయంగా మార్చేసింది. ఇదే రంగు సీక్వెన్ కట్ వర్క్ దుపట్టాతో లుక్ మరింత ఆకర్షణీయంగా మారింది. -
నేషనల్ కాస్ట్యూమ్ ప్రెజంటేషన్: తళుక్కుమన్న భామలు
-
సంప్రదాయ షోయగం
-
మేకని చంపి తీరాల్సిందే! అన్నాడా సాయి? ఇదేమిటి?
సాయి చేసే ప్రతి చేష్టా, సాయి మాట్లాడే ప్రతి మాటా, సాయి నడిచే ప్రతి ప్రదేశం, సాయి చరిత్రలో కన్పించే ప్రతి సంఘటనా ఓ కొత్త విషయాన్ని జీవితాంతం మనకి గుర్తుండేలా, గుర్తుంచుకునేలా చేస్తూనే ఉంటుంది. ఓ చిరుచీకటి ఉన్న గదిలోనికి ప్రవేశించకుండానూ, కనీసం ప్రవేశించి చూద్దామనే ఊహకూడా లేకుండానూ అదో చీకటి శూన్యపు గది అనడం ఏ మాత్రమూ సరికాదు. చక్కని దీపపు వెలుగుతో దానిలోనికి ప్రవేశించి, చూస్తే ఏదైనా ఉందో లేదో? ఉంటే ఏముందో?... అలా వివరాలన్నింటినీ తెలుసుకోగలుగుతాం! అదిగో ఆ పనినే చేద్దాం! చేస్తున్నాం కూడా!ఆ మేకని చంపెయ్! ఎవరో ఓ వ్యక్తి ఓ మేకని తెచ్చి సాయికి ఇచ్చాడు. ఆ మేకని సాయి దగ్గరే ఓ చిన్న స్తంభానికి కట్టివేశాడు. భక్తులంతా చూస్తున్నారు ఆ మేకని. అది పాపం అందరూ జాలిపడేలా దీనాతి దీనంగా చూస్తోంది. ఆ సందర్భంలో సాయి ‘బడేబాబా’ అనే అతన్ని పిలిచాడు ‘రావలసింది’ అని.బడేబాబా సాయికి ఎంతో.. మళ్లీ మాట్లాడితే.. మరెంతో సన్నిహితుడు. రోజూ సాయి అతనికి 50 రూపాయలని దక్షిణగా ఇచ్చేవాడు.అలా సొమ్మిచ్చినందుకు సన్నిహితుడని దీని అర్థం కాదు. బడేబాబాని కొంతదూరం సాగనంపి వస్తుండేవాడు సాయి.ఏ రోజూ భక్తులంతా భోజనం వేళకి సభామండపానికి ఆనందంగానూ సాయితో కలిసి కూర్చుని భోజనాన్ని చేయాలనీనూ ఆత్రుతతో వస్తూండేవారు. భక్తులంతా ఎదురు బదురుగా రెండు వరుసల్లో ఓ క్రమశిక్షణ పద్ధతిలో తాడు పట్టుకుని చూస్తే సరిపోయేంత సరళరేఖలా చక్కగా కూర్చుంటూండేవారు. ఈ రెండు వరుసలూ ఎంతో పొడుగ్గా ఉండేవి. ఆ రెండు వరుసలకీ మధ్యలో ఆ వరుసలు ప్రారంభమయ్యే చోటున ఇద్దరు కూర్చోవడానికి రెండు చోట్లు ఖాళీగా ఉండేవి. ఆ కుడివైపున సాయి కూర్చునేవాడు. ఆయనకి ఎడమ పక్కన బడేబాబా కూర్చునేవాడు. మొత్తం అందరి విస్తళ్లలోనూ వడ్డన అయిపోయినా భోజనం చేసే సంప్రదాయం సాయికి బాగా తెలుసు కాబట్టి, ఆ సాయి భక్తులకీ మరింతగా తెలుసు కాబట్టి, ఎవరి మటుకు వారు విస్తళ్లలో వేయబడ్డ పదార్థాలని వేసిన వెంటనే తినేస్తుండేవారు కానే కాదు. ఇలాంటి సందర్భాలని పరిశీలిస్తే ‘బ్రాహ్మణసమారాధన, బ్రాహ్మణ గృహాల్లో జరుగుతూండే భోజన సంప్రదాయ పద్ధతి’ సాయిలో కన్పిస్తూ ఆశ్చర్యం వేస్తుంది. ఇంత వడ్డన జరిగినా.. ఇందరూ వచ్చి కూర్చున్నా.. సాయి మాత్రం తన ఎడమపక్కన బడేబాబా వచ్చి కూర్చోనిదే విస్తరిని ముట్టేవాడు కాడు. అలాగని బడేబాబా కావాలని ఆలస్యం చేయడమో లేక ఏదో పని మీద ఉండి ఆలస్యంగా వస్తూ ఇందరిని ఎదురుచూసేలా చేయడమో చేసేవాడు కాదు! అదే సభామండపంలో కొంత ముందుగానే వచ్చి, భక్తి శ్రద్ధలతో ఓ మూల కూర్చుని, సాయి పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. అంతా కూర్చున్నాక, అన్ని పదార్థాలు వడ్డింపబడ్డాక ఇక భోజనాన్ని చేయవచ్చు అన్నాక.. ఆవో బడేబాబా (బడేబాబా! రా! ) అని ఆప్యాయంగా పిలిచేవాడు సాయి. ఆవుదూడ కట్టుని విప్పేస్తే ఎలా ఆ దూడ తల్లిగోవు పొదుగులో తలని దూర్చేస్తుందో అలా, అంత ఇష్టంతో బడేబాబా వచ్చి సాయి ఎడమపక్కన కూర్చునేవాడు. ఆ మీదట భోజనాలు ముగిసేవి. ఇది ఓ నిత్యక్రతువులా సాగిపోతూ ఉండేది షిర్డీలో. అయితే ఈ రోజున మాత్రం అందరూ భోజనాన్ని ప్రారంభించే ముందు, అందరూ వింటూ ఉండగా.. ‘బడేబాబా! ఈ మేకని కత్తితో ఒకే వేటుకి తల నరికి చంపెయ్!’ అని బిగ్గరగా ఆజ్ఞ చేసాడు సాయి. అది దీపావళి రోజు కావడంతో రోజూ కంటే ఎక్కువ పదార్థాలతో పాటు మిఠాయిల్నీ, ఇంకా తీపిపదార్థాలనీ కూడా వడ్డించారు విస్తళ్లలో. రోజూ ఉండే పద్ధతి ప్రకారం బడేబాబాని సాయి పిలవటం ఆయన వచ్చి కూర్చోగానే భోజనాలు ప్రారంభం కావటం జరగాల్సి ఉంది. అయితే కథ తారుమారై.. ‘మేకను చంపడం’ అనే కొత్త కథ ప్రారంభమైంది. భక్తులంతా వింతగా చూస్తున్నారు ఏం జరుగుతుందోనని.బడేబాబా సాయి చేసిన ఈ ఆజ్ఞని విని బాధతో సాయి పక్కకి వచ్చి కూర్చోవలసిన వాడు కాస్తా.. ఎటో వెళ్లిపోయాడు. అది సాయి ఆజ్ఞ కదా! ఎవరో భక్తులు మొత్తానికి బడేబాబాని వెదికి తీసుకొచ్చారు. బడేబాబా కూర్చోనిదే సాయి భోజనాన్ని ముట్టడు కదా! సాయి ప్రారంభించనిదే భక్తులు కూడా ప్రారంభించరు గదా! అదీ అప్పటి స్థితి. ఎవరికీ ఏం తోచడం లేదు.బడేబాబాని ఇలా మర్యాదపూర్వకంగా ఆప్యాయతతో భోజనానికి పిలవడం, ఆయన వచ్చి తన సరసన కూర్చుని ఆయన భోజనాన్ని ముట్టుకున్నాక తాను భోజనాన్ని ప్రారంభించడమనే ఈ పద్ధతిని అందరు భక్తుల సమక్షంలోనూ సాయి చేస్తూ ఉండటం ఎందుకంటే... అతిథి అనేవాడు లేకుండా తానొక్కడే తినకూడదని, ఆ అతిథిని కూడా గౌరవపూర్వకంగా ఆహ్వానించవలసిందే తప్ప చేతి సంజ్ఞని చేస్తూ చోటుని చూపించడం సరికాదనీ, అతిథి తన భోజనాన్ని ముగించాక యథాశక్తి దక్షిణని ఇచ్చి, కనీసం నూరు అడుగులైనా ఆయనతో వెళ్తూ ఆయన్ని సాగనంపి రావాలనీ, దాన్నే అతిథి సత్కారమంటారనీ అందరికీ తెలియజెప్పడానికే సాయి ఇలా చేస్తూ ఉండేవాడు రోజూ. అలాంటిది, అంత గొప్పగా తాను భావించే అతిథిని, అది కూడా ఎవరో అతిథి కాకుండా బడేబాబాని ‘మేకని చంపవలసిందే’ అని ఆజ్ఞాపించడమా? అది కూడా ఈ సమయంలోనా? అని అంతా ఆశ్చర్యపోతూ ఉంటే బడేబాబా ‘నిష్కారణంగా ఈ మూగజీవిని నేనెందుకు చంపాలి?’ అని సాయిని ప్రశ్నించాడు.సాయి వెంటనే అక్కడే ఉన్న ‘శ్యామా’ అనే మరింత సన్నిహిత భక్తుడ్ని చూస్తూ ‘పోనీ! నువ్వైనా సరే కత్తి తెచ్చి ఒకే ఒక్క వేటుతో దీని తల నరికెయ్యి! పో! కత్తి తెచ్చుకో! వెళ్లు వెంటనే!’ అన్నాడు. నిజానికి శ్యామాకి కూడా మనసు నిండుగా చెప్పలేనంత బాధ వస్తోంది ఆ జాలి గొలుపుతున్న మేకని చూస్తుంటే. బడేబాబాలాగానే తనకీ అనిపిస్తోంది ‘నిష్కారణంగా ఆ మూగజీవాన్ని తాను చంపడమా?’ అని. ‘అసలు అలాంటి మూగజీవిని చంపబోతున్నా చూడలేమే! మరి దాన్ని నేను నా చేతులతో చంపడమా?’ అని లోలోపల కుమిలిపోతూ అది సాయి ఆజ్ఞ అనుకుంటూ చక్కని వంటలని భక్తితో శ్రద్ధతో సకాలంలో వండి పంపించే రాధాకృష్ణమాయి దగ్గరికెళ్లి కత్తి తెచ్చి ఆ కత్తిని సాయి ముందు పెట్టాడు శ్యామా.ఇంతలో భక్తుల ద్వారా రాధాకృష్ణమాయికి కత్తి విషయం తెలిసి దాన్ని ఓ మూగజీవిని బలిని ఇచ్చేందుకు ఉపయోగించవలసివస్తే వద్దు! కత్తిని తిరిగి తెచ్చేయవలసిందని రాధాకృష్ణమాయి కబురు చేసింది సభామండపానికి. సాయి ఈ విషయాన్ని తెలుసుకుని.. కొద్ది దూరంలో ఉన్న శ్యామానే మళ్లీ పిలుస్తూ ‘సరే! మరోచోటి నుంచి కత్తిని తెచ్చి ఒకే ఒక్క వేటుకి దాని తలని నరికెయ్యి!’ అని ఆజ్ఞ చేశాడు. భక్తులందరికీ ఈ మేక తలని నరకడంలో సాయి చూపిస్తున్న పట్టుదలకి ఆశ్చర్యం అనిపిస్తోంది. మేక ప్రాణాలు ఎలా పోతాయోనని బాధగా ఉంది! ఆ సంఘటనకి సాక్షిగానూ, ఏ దోషం చేసిందో ఎవరికీ తెలియని ఓ ముద్దాయిలా నిలబడి, అమాయకంగా మరణశిక్ష పడుతుందని కూడా తెలియని తీరులో నిలబడి ఉంది మేక.‘కర్ర విరగకుండా.. పాము చావకుండా..’ అనే సామెతకి ఉదాహరణగా శ్యామా కత్తిని తేవడానికి వెళ్లినట్లుగా వెళ్లి ఎంతసేపటికీ రాకుండా ‘ఓడ’లో కూర్చుండిపోయాడు. మేక ఎవరి చేతిలోనూ చంపబడకూడదని, తన చేతితో తాను నరకనే నరకకూడదని శ్యామా దృఢసంకల్పం. అందుకే సాయి ఆజ్ఞకి కట్టుబడినట్లే ఉంటూ అక్కడే ఉండిపోయాడు.ఎంతసేపటికీ శ్యామా రాకపోయేసరికి సాయి మరో సన్నిహిత భక్తుడైన ‘కాకా’ని పిలిచి.. ‘కాకా! తొందరగా నువ్వైనా ఈ పనిని ముగించెయ్యి’ అన్నాడు.కాకాలో అంతర్మధనం ప్రారంభమైంది. మేలిమి బంగారంతో సమానమైనవాడివని తనని సాయి అనేక పర్యాయాలు అన్నాడు. చెప్పిన ఆజ్ఞని పాటించేవాడివని కూడా అంటుంటాడు. అలాంటి తనని ఈ అకృత్యాన్ని చేయవలసిందేనని సాయి ఆజ్ఞాపిస్తున్నాడంటే ఏదో అంతరార్థం ఉండే ఉంటుంది. ఇప్పటికే తన ముందు ముగ్గురు ఆ పనిని చేయడానికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ విముఖతని చూపిస్తే.. ఆ పనిని సాయి తనకి పురమాయిస్తున్నాడంటే.. ఏదో ఉండే ఉంటుంది దానిలో ఓ రహస్యం. వజ్రం ఎంతో గొప్పది. ఎంత కొట్టినా పగులనితనంతో దృఢంగా ఉంటుంది. అలాంటి వజ్రాన్ని కూడా చక్కనైన నగలో అమర్చాలంటే దానికీ కోత తప్పదు. నగిషీకోసమని సాన మీద అరగదీయడం తప్పదు. ఒక సన్నని తీగని చుట్టి ఆ వజ్రాన్ని మంచి వేడితో మండిపోయే కొలిమిలో కాల్చడం తప్పదు. అది ప్రకాశించాలంటే, దాని గొప్పదనం తెలియాలంటే, లోకానికి తెలియజేసేలా చేయాలంటే.. ఈ చిత్రహింసలు, మనం అనుకునే ఈ తీరు పరీక్షలు దానికి తప్పవు. మరి ఈ కఠిన పరీక్షలన్నీ వజ్రానికే ఉంటాయి గానీ, మామూలు రాతికి ఉండనే ఉండదు కదా!... అని ఈ తీరులో ఆలోచించుకుంటుంటే.. ఇంకా ఆలస్యం చేస్తున్నావేమి? అన్నట్లు చూశాడు సాయి.దాంతో తాను గురువు ఆజ్ఞని ధిక్కరిస్తూన్న భావం మనసులో మెదిలింది. ‘నేను చేసే దానిలో, చేస్తున్న దానిలో ఏదైనా తప్పుగానీ ఉంటే అది సాయి–నామజపం వల్ల పూర్తిగా తొలిగిపోయి తీరుతుంది’ అని దృఢభావంతో కత్తి కోసం బయలుదేరాడు. తనకి ఏ హానినీ చేయని ఆ మూగజీవిని చంపడమనే పాపం కంటే గురువు ఆజ్ఞని ధిక్కరిస్తూ ఇందరు భక్తుల మధ్య గురువుని తృణీకరించినవాడు’ అని అన్పించుకోవడం మహా పాపం అనుకున్నాడు. అయినా సాయినామజపమనే ఔషధం తనదగ్గరే ఉన్నప్పుడు ఈ మనోవ్యాధి తననేం చేస్తుంది? అనే దృఢధైర్యంతో పదును చూసుకుని మరీ కత్తిని తెచ్చుకోవాలనుకున్నాడు. దానికి కారణం సాయి ఆజ్ఞ ప్రకారం దాని మెడ ఒక్కవేటులోనే తెగిపోవాల్సి ఉంది కాబట్టి.గురువు ఆజ్ఞని పాటిస్తున్న తనకి పుణ్యం లభిస్తుందనే నమ్మకం తప్ప కాకాకి మరో ఆలోచనే రావడం లేదు, రాలేదు. భక్తులందరూ కాకా కూడా శ్యామాలాగానే ఎక్కడకో వెళ్లి రాకుండా ఉండిపోతాడని అనుకున్నారు. అయితే కాకా మాత్రం ‘సాఠేవాడా’ అనే ప్రదేశానికి వెళ్లి, కత్తినీ దాని పదునునీ నిశితంగా పరిశీలించుకుని, తన వెంట తెచ్చుకుని సాయి సమక్షానికొచ్చాడు. భక్తులందరికీ భయం, ఉద్వేగం, ఆశ్చర్యం, మూగజీవి పట్ల జాలి.. అయ్యో! అనే భావాలు కలుగుతున్నాయి. కాకా తన ధోవతిని ఎగగట్టాడు. చొక్కా చేతుల్ని పైకి మడుచుకున్నాడు. మేక వద్దకి వెళ్లాడు. లోపల ఆలోచన ప్రారంభమైంది. తాను పుట్టుకతో బ్రాహ్మణ కులానికి చెందినవాడు. సహజంగానే కోమల స్వభావం, చెప్పలేని కరుణా, అంతేకాక తన వంశంలో మాంసాహారం కాదు గదా కోడిగుడ్డుని కూడా వాడని వాడైన కారణంగా హింసాభావమే ఉండదు. ఆ కారణంగా ఈ మూగజీవిని చంపడమా? అనే ఆలోచన మళ్లీ ప్రారంభమైంది మనసులో. ఆ మేక మాత్రం వెర్రి చూపులు చూస్తోంది.‘గురుకార్యం కర్తవ్యం’ అనే దిటవుతో రెండు చేతులతో కత్తిని గట్టిగా పట్టుకుని ఆ మేకని నరకడం కోసం సిద్ధమై ‘సాయీ.. తలని నరుకుతున్నా..!’అంటూ మేక మెడని చూస్తున్నాడు నిశితంగా. హఠాత్తుగా అతని మదిలో జాలి ప్రారంభమైంది. కత్తి పట్టిన చేతులు వణుకుతున్నాయి. అడుగులు వెనక్కి పడుతూ ముందుకి రాలేక మేకమెడకి సూటి తప్పుతూ ఉంటే.. సాయి ఆ పరిస్థితిని గమనించి.. ‘చూస్తావేం? నరుకు!’ అన్నాడు బిగ్గరగా. మేకకి అదే చివరి శ్వాస అనుకుంటూ కాకా ఓ మారు సాయినామాన్ని జపించి, తలని తెగగొట్టడం కోసం కత్తిని దృఢంగా పట్టుకుని, బలంగా ఎత్తి వేటు వేసెయ్యబోతుంటే సాయి బిగ్గరగా అరుస్తూ... ‘ఆగాగు! దాన్ని చంపుతావేమిటయ్యా? ఏం అపకారం చేసింది నీకు? మూగజీవి కదా! పైగా మరణాసన్న (చావుకి సమీపించిన) స్థితిలో ఉంది కదా! అంతేకాక నువ్వు బ్రాహ్మణుడివి! చంపవచ్చునా?’ అనగానే కాకా కత్తిని కిందపడేశాడు. ఎవ్వరికీ ఏం అంతుబట్టడం లేదు. ఎందుకు చంపమన్నాడో...? ఎవరికి వాళ్లు తప్పించుకుంటూంటే పట్టుబట్టి చంపడానికి సిద్ధపడేంతవరకూ ఎందుకు ప్రోత్సహించాడో...? చివరికి గుండెధైర్యంతో మనసుని చంపుకుని, చంపబోయేసరికి వద్దని ఎందుకు నివారిస్తున్నాడో..? ఎవరికీ అర్థం కాలేదు.సాయి అన్నాడు. ‘కాకా..! ఇలారా!! ఇది నిజంగా చావుకి సమీపంగా ఉన్న మేక. చూడు ఎంత దుర్బలంగా ఉందో! దీన్ని తెచ్చి ఇచ్చాడు ఆ వ్యక్తి ఎవరో, దీన్ని సంప్రదాయబద్ధమైన పద్ధతిలో ‘‘హలాల్’’ చేస్తాను. నీటి పాత్రని పట్టుకో!’ అన్నాడు. ‘‘హలాల్’’ అంటే చావబోతున్న మేక చెవిలో ఖురాన్ మంత్రాలని కొన్నింటిని చదవడం అని అర్థం. అలా చదివి, దాని కట్టు నుంచి తొలిగించారు. అంతే! అది కొద్ది దూరం అడుగులు వేసి, తనంత తానే చనిపోయింది అందరూ చూస్తుండగానే.నేర్చుకోవలసిందేమిటి?ఈ మేకకి మాత్రమే చావు లేదు. మనందరం కూడా అలాంటి మేకల్లాంటి వాళ్లమే. అక్కడెవరో ఓ వ్యక్తి సాయికి ఆ మేకని బహూకరించినట్లు, మనల్ని కూడా మన తల్లిదండ్రులు ఓ శరీరాన్ని ఇచ్చి, ఈ లోకంలో ఓ ప్రాణిగా అందించారు. ఈ శరీరానికి ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా మరణమనేది తప్పదు. ఆ విషయం మనకెందుకు గుర్తుండదు. మన ముందే ఎందరో చనిపోతున్నా, వాళ్ల అంత్యక్రియలకి వెళ్లి అక్కడి కార్యక్రమాలని చూసి వస్తున్నా, ఆ నిరాశ, వైరాగ్యమనేవి ఏ ఒక్కటో రెండు రోజులు మాత్రమే ఉంటూ ఆ మీదట మర్చిపోతూ ఉంటాం. కాలం అనేది మేకని చంపడానికి ఉపయోగించబడే కత్తి లాంటిది. ఆ కాలమనేది ఎవరి కారణంగా, ఏ స్థలంలో, ఏ తీరుగా, ఎందుకు మూడుతుందో తెలియదు. అందుకే చంపాలన్న ఆజ్ఞని వింటూనే ‘ఎందుకు?’ అన్నాడు బడేబాబా. కత్తి కోసం వెళ్లి అక్కడే ఉండిపోయాడు శ్యామా. ఏ మాత్రమూ ఇష్టంలేక ప్రయత్నించి విఫలుడయ్యాడు కాకా.భగవంతుడనే వాడు కూడా మన మరణాన్ని అనేక పర్యాయాలు ఇలాగే ఏవో కారణాలతో వాయిదా వేయిస్తూ ఉంటాడు. దాని కోసమే మనం నామజపాన్ని చేయవలసి ఉంటుంది. మేకని చంపదలిచి ఇన్ని ప్రయత్నాలు జరుగుతున్నా మేక అమాయకంగా చూస్తోందే తప్ప కట్టు విడిపించుకుని పారిపోయే ప్రయత్నాన్నే చేయడం లేదు. అందరు భక్తులున్నా ఎవరూ ఆ సాయి ఆజ్ఞకి వ్యతిరేకాన్ని చెప్పడం లేదు. భగవంతుని ఆజ్ఞ దాట వీలులేనిది. ఎదురు తిరిగే శక్తిని ఎవరికీ ఇయ్యనిది. ఏదో మనం చేసుకున్న పుణ్యాల కారణంగానే మనకి చావు సమీపించి ఉన్న ఏవేవో కారణాల ప్రకారం ఆ విరోధించే వ్యక్తులు వెనుకడుగు వేస్తూ ఉంటారు. ఆ ఇబ్బంది తప్పినప్పుడల్లా అది మన సామర్థ్యం, మేధావితనం, నేర్పరితనం అని మనమనుకుంటాం తప్ప అదంతా దైవకృప అని అనుకోం.ఇలాంటి మరణాసన్నస్థితిలో ఉండి కూడా కావాలని ఎవరికో హానిని తలపెట్టడం, బాకీలని తీర్చకపోవడం, దౌర్జన్యాలు చేయడం, తల్లిదండ్రులకి మనస్తాపాన్ని కల్పించే పనుల్ని చేయడం.. వంటి ఎన్నింటినో బాగా తెలిసి కొన్నింటినీ, తెలియక కొన్నింటినీ చేస్తూనే ఉంటాం.ఆ మేకకి సాయి ‘హలాల్’ చేసినట్టుగా మనకి కూడా సాయిలాంటి యదార్థ గురువు మంత్రోపదేశాన్ని చేసినట్లయితే అప్పుడు లభించే మరణం స్వచ్ఛందమరణం లాంటిదే. అదే ఆత్మకి శాంతినిస్తుంది. ఇంతటినిగూఢార్థాన్ని అర్థం చేయించేందుకే సాయి ఈ ఘాతుక సంఘటనని మన ముందుంచాడు తప్ప సాయి మాత్రం పరమ దయార్ద్రహృదయుడే!యదార్థ భాగవద్భక్తుడైన మహమ్మదీయుని వద్దకి వెళ్లడం, ఆయన్ని గురువుగా భావించడం వల్ల అపవిత్రత వస్తుందా? అనే అంశాన్ని చూద్దాం! –సశేషం -
చీర కట్టు అదుర్స్
-
గాయం కడిగిన స్వరాలు
గాయాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి మనిషికి కలిగే గాయం. రెండోది మనిషి వల్ల కలిగే గాయం. మనిషే గాయం చేస్తే ఆ రక్తాన్ని తుడిచేదెవరు? కడిగేదెవరు? మనుషులే. కాదు. తల్లులే. అలా మొదలైందే జొహ్రా. అఫ్గానిస్తాన్లో తగిలిన గాయాలకు సరిగమలు కట్టుకుని యూరప్లో తన గేయాలతో మలామ్ పూస్తోంది జొహ్రా. జొహ్రా... అంటే పర్షియన్ సాహిత్యంలో సంగీత దేవత! ముప్పైమందీ అమ్మాయిలే ఉన్న ఆ ఆర్కెస్ట్రా పేరు కూడా జొహ్రానే! దాన్ని స్థాపించిన కళాకారుడు అహ్మద్ నాసర్ సార్మస్త్. ఇందులో ఆశ్చర్యం, అద్భుతం ఏముంది? అనిపిస్తోందేమో! స్త్రీలకు చదువుకునే హక్కు, కనీసం పట్టపగలు మిట్టమధ్యాహ్నం బయటకు వెళ్లే స్వేచ్ఛ కూడా లేని అఫ్గానిస్తాన్ లాంటి దేశంలో ముప్పైమంది అమ్మాయిలతో ఆర్కెస్ట్రాను ఏర్పాటు చేయడం ఆశ్చర్యం, అద్భుతం మాత్రమే కాదు గొప్ప సాహసం కూడా! దొంగచాటుగా ఆర్కెస్ట్రాకు! నాసర్ సార్మస్త్కు 54 ఏళ్లు. కాబూల్ నివాసి. అఫ్గానిస్తాన్ సంప్రదాయ సంగీత కళాకారుడు. ఆ దేశ సంప్రదాయ సంగీతమంటే ప్రాణం పెడ్తాడు. అఫ్గానిస్తాన్లో మారిన రాజకీయ, సాంఘిక పరిస్థితులు చాలా కళలకు మనుగడ లేకుండా చేస్తున్నాయి. అలాంటి వాటిలో ఆ దేశ సంప్రదాయ సంగీతం కూడా ఒకటి. దాన్ని పరిరక్షించాలని తాపత్రయపడ్తున్నాడు నాసర్. ఆయన జీవితంలో చాలా చేదు అనుభవాలను ఎదుర్కొని కూడా ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. 2014లో కాబూల్లో జరిగిన మానవబాంబు దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు నాసర్. ఆ ప్రమాదం నుంచి కోలుకుంటున్నప్పుడే అనుకున్నాడట తన దేశ సంప్రదాయ స్వరాన్ని ఆగిపోకుండా చూడాలని. అప్పటికే అమ్మాయిలకు సంగీతం నేర్పిస్తూ ఉన్నాడు. అయితే అందులో చాలామంది అమ్మాయిలు రహస్యంగా ఎవరికంటా పడకుండా వచ్చేవాళ్లు. అయినప్పటికీ వాళ్ల సంఖ్య పెరుగుతూ ఉండడంతో, అప్పుడనిపించింది నాసర్కు.. మొత్తం అమ్మాయిలతో ఒక ఆర్కెస్ట్రా స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందీ అని. బçహుశా నలుగురైదుగురు కంటే ఎక్కువ చేరకపోవచ్చు అని సందేహపడ్డాడు వెంటనే. అయినా సరే ఆలోచనను పంచుకుంటే తప్పేంటి అని తన స్టూడెంట్స్ ముందుంచాడు. తన దగ్గరకొస్తున్న పదిమంది అమ్మాయిలంతా సరే అంటూ ఉత్సాహం చూపించారు. ఆ ఉత్సాహమే నాసర్ త్వరగా కోలుకునేలా చేసింది. ఆరోగ్యం కుదుట పడ్డాక కాబూల్లోని అఫ్గానిస్తాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యూజిక్ (ఏఎన్ఐఎమ్)స్టూడెంట్స్నూ అడిగాడు. అందులోని అమ్మాయిలంతా వాళ్ల కుటుంబాల్లోనే కాదు వాళ్ల ప్రాంతంలోనే సంగీతం నేర్చుకుంటున్న తొలితరం అమ్మాయిలు. ఇళ్లల్లో, అక్కడి సమాజంలో ఉన్న నియమ నిబంధనలకు ఏమాత్రం విరుద్ధంగా నడుచుకున్నా పాటే కాదు.. ప్రాణమూ ఆగిపోతుంది. అయినా ఆ రిస్క్ను లెక్కచేయకుండా నాసర్ అభ్యర్థనను మన్నించారు. అతను పెట్టిన ‘జొహ్రా’ఆర్కెస్ట్రాలో చేరారు. అలా 30 మందితో అర్కెస్ట్రా గ్రూప్ తయారైంది. గడపే దాటనివారు యూరప్కి! 2016లో యూరప్లో ఐఎస్ఐఎస్ దాడులు చేసింది. అందులో బెర్లిన్ ఒకటి. తన ఆర్కెస్ట్రాతో శాంతి యాత్ర చేయాలనుకున్నాడు నాసర్. ముప్పై మంది అమ్మాయిలతోనా? పైగా అంతా పధ్నాలుగు నుంచి 20 ఏళ్లలోపు పిల్లలే. సొంత దేశం ‘దేశం దాటడానికి వీల్లేదు’ అంది. ముందు తన గ్రూప్లోని పిల్లల తల్లిదండ్రులను ఒప్పించాడు. అనుమతిస్తున్నట్టు వాళ్ల చేత సంతకాలు తీసుకున్నాడు. తర్వాత ప్రభుత్వానికి ఆర్జీ పెట్టాడు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పర్మిషన్ తెచ్చుకున్నాడు. 2017 జనవరిలో యూరప్ ప్రయాణమయ్యాడు టీమ్తో. యూరప్లోని రెండో ప్రపంచయుద్ధంలో దాడిలో దెబ్బతిన్న ప్రాంతాల్లో, తీవ్రవాదం పంజా విసిరిన ప్రాంతాల్లో తన ఆర్కెస్ట్రాతో ప్రదర్శనలిచ్చాడు నాసర్. అందులో బెర్లిన్లోని కైసర్ విల్హెల్మ్ మెమోరియల్ చర్చి ఒకటి. అది రెండో ప్రపంచయుద్ధ బాంబును ఎదుర్కొంది. ఆ సమీప ప్రాంతంలోనే 2016లో ఐఎస్ఐఎస్ టెర్రర్ ఎటాక్ జరిగింది. ఆ రక్తపు మరకలను జొహ్రా తన సంగీతంతో తుడిచేసింది. ఆ కచేరీని ఆ దాడిలో చనిపోయిన పన్నెండుమందికి అంకితం చేసింది. దాదాపు రెండు వారాలపాటు సాగిన ఈ మ్యూజిక్ టూర్ స్విట్జర్లాండ్లో మొదలై తూర్పు జర్మనీలో ముగిసింది. ‘ఉగ్ర’ గాయాలకు లేపనం టూర్ తర్వాత నాసర్ మ్యూజిక్ స్కూల్కి డిమాండ్ పెరిగింది. పైగా తన మ్యూజిక్ స్కూల్లో ఉగ్రవాద దాడుల్లో ఇళ్లు కోల్పోయిన పిల్లలకు, అనాథలకూ ఉచితంగా సంగీతం నేర్పిస్తున్నాడు నాసర్. అలాగే చదువుకోవడానికి స్కూళ్లు లేని, చదువుకునే వీలులేని ఊళ్ల నుంచి వచ్చిన అమ్మాయిలకూ ఉచితంగానే సంగీత శిక్షణ ఇస్తున్నాడు. వాళ్లలో పందొమ్మిదేళ్ల నెగిన్ ఒకరు. ఈ అమ్మాయి జొహ్రాలో కూడా ఉంది. యూరప్ పర్యటనలోనూ పాల్గొంది. సనాతన సంప్రదాయాలను కాచివడబోస్తున్న పశ్తున్ అనే తెగకు చెందిన పిల్ల. కునర్ ప్రావిన్స్ ఆమె స్వస్థలం. ఆ ఊళ్లో స్కూళ్లు లేవు. చదువుకోసం పక్కనున్న ఊరికి పంపే స్థోమత, ధైర్యం లేదు ఆమె తండ్రికి. దాంతో నెగిన్ను తీసుకెళ్లి కాబూల్లోని అనాథాశ్రమంలో పెట్టాడు. అలాగైనా కూతురుకు చదువు అందుతుంది అన్న ఆశతో. అందులో చదువుకుంటున్నప్పుడే నెగిన్ నాసర్ మ్యూజిక్ స్కూల్ గురించి తెలిసింది. సంగీతం అంటే చెవి కోసుకునే నెగిన్ అందులో చేరింది. ప్రదర్శనలో పాల్గొంది. జొహ్రాలో ఇంకా ఇలాంటి నేపథ్యం ఉన్న అమ్మాయిలు ఎందరో. సంగీతంతో వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని కల్గిస్తున్నాడు నాసర్. ఆ సంగీత సాధనంతోనే తమ హక్కుల పట్లా అమ్మాయి లనూ చైతన్యం చేస్తున్నాడు. ఆ చైతన్యంలో ఆ అమ్మాయిలు వాళ్ల కుటుంబాల్లో మార్పు తెస్తున్నారు. సలామ్ నాసర్. సలామ్ జొహ్రా! కాళ్లు చేతులు కట్టేసి గదిలో పడేశారు! అబీదాది ఇంకో కథ. తాలిబన్ చెరలో ఉన్న ఘజ్నీ ఆమె సొంతూరు. అక్కడ బాల్యవివాహాలే ఉంటాయి. పెళ్లయ్యాక భర్త, మామ ఒప్పుకుంటేనే స్కూల్కి వెళ్లాలి అమ్మాయి. ఆ సంప్రదాయం అబీదా వాళ్లింట్లోనూ ఉంది. అయితే అబీదా లక్ష్యం వేరు. అది వింటే ఇంట్లోవాళ్లు ఆమె చేతులు, కాళ్లు కట్టేసి గదిలో వేసి తాళం పెడ్తారు. అయినా బాల్యవివాహాన్ని ధిక్కరించింది. తన మనసులో మాట తల్లికి చెప్పింది సంగీతం నేర్చుకోవాలనుందని. తన కూతురు జీవితమన్నా బాగుపడాలని రహస్యంగా బిడ్డను బయటకు పంపించింది తల్లి. అబీదా కాబూల్ ఏఎన్ఐఎమ్లో (అఫ్గానిస్తాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యూజిక్) చేరింది. సంగీతం నేర్చుకుంటూ నాసర్ జొహ్రాలో సభ్యురాలైంది. ‘‘పాప్ సింగర్ కావాలని నా ధ్యేయం. ముందు మా సంప్రదాయ సంగీతంలో సరిగమలు పలికించి తర్వాత నాకు ఇష్టమైనట్లు కెరీర్ను మలుచుకుంటా’’ అంటుంది అబీదా. యూరప్ పర్యటన తర్వాత అబీదా ఇంట్లోనూ చాలా మార్పులు వచ్చాయట. ఫోన్లో వాళ్లమ్మ చెప్పిందిట. ‘‘నా కోసం మా అమ్మ చాలా కష్టాలు పడింది. నిందలు మోసింది. ఇప్పుడు మా ఇంట్లో పరిస్థితి మారింది. అది నావల్లే అని అంటుంది అమ్మ. కాని మా అమ్మకే ఆ క్రెడిట్. ఆరోజు నా కోరికను మా అమ్మ అర్థం చేసుకోకపోతే.. ఈ రోజు నేను ఇలా ఉండేదాన్ని కాను’’అని చెప్తుంది అబీదా కళ్లనిండా నీళ్లతో. – శరాది -
ట్రెడిషనల్ లుక్.. బ్యూటీ కిక్
-
కంప్యూటర్తో కుస్తీ... ఆసనాలే ఆస్తి
యోగా కటి చక్రాసన కటి అనగా నడుము. నడుం పక్కలకు తిప్పడం జరుగుతుంది కనుక దీనికి కటి చక్రాసనం లేదా కమర్ చక్రాసనం అని అంటారు. ఇందులో నిలబడి చేసే కటి చక్రాసనాలతో పాటు కూర్చొని చేసే కటి చక్రాసనాలు కూడా ఉన్నాయి. విధానం1: సమస్థితిలో నిలబడి చేతులు 180 డిగ్రీల కోణంలో భూమికి సమాంతరంగా ఉంచాలి. చేతుల మధ్య దూరం అలాగే ఉండేలా శ్వాస తీసుకుంటూ తల చేతులు కుడివైపునకు, శ్వాస వదులుతూ మధ్యలోకి, మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఎడమవైపునకు ఇలా 5 సార్లు చేయాలి. విధానం 2: సమస్థితిలో నిలబడి రెండు కాళ్ళ మధ్య భుజాల మధ్య ఎంత దూరం ఉందో అంత దూరం ఉంచి చేతులు ముందుకు తీసుకెళ్లాలి. భుజాల దూరంలో ఒక అరచేతిని ఇంకొక అరచేతికి ఎదురుగా ఉంచి, శ్వాస తీసుకుంటూ తల రెండూ చేతులను కుడివైపుకి, శ్వాస వదులుతూ మధ్యలోకి, శ్వాస తీసుకుంటూ ఎడమవైపుకి తిరిగి శ్వాస వదులుతూ... ఇలా 5 సార్లు చేయాలి. విధానం 3: సమస్థితిలో కాళ్ళ మధ్య భుజాల మధ్య దూరం ఉంచి నిలబడాలి. చేతులు వలయాకారంగా తిప్పుతూ శ్వాస తీసుకుంటూ ఎడమ చేయి కింద నుండి నడుము వెనుకకు, కుడి చేయి పై నుండి ఎడమ భుజం మీదకు తీసుకెళ్లాలి. తల, భుజాలు ఎడమవైపు తిప్పుతూ, శ్వాస వదులుతూ కుడి చేయి పై నుండి కుడి వైపుకి తీసుకువచ్చి కింద నుండి నడుము వెనుకకు ఎడమ చేయి పై నుండి కుడి భుజం మీదకు తల భుజాలు కుడివైపు తిప్పుతూ 5 పర్యాయాలు చేయాలి. పక్కకు తిరిగేటప్పుడు వీలుగా ఉండటానికి వ్యతిరేక కాలు మడమను పైకి లేపి మునివేళ్లను పాదాన్ని వీలుగా కుడి ఎడమ పక్కలకు తిప్పవచ్చు. వీటిలో కొన్నింటిని కుర్చీ ఆసరాతో మరింత సులభంగా చేయవచ్చు. విధానం4: (కుర్చీ ఆధారంగా) టికెఆర్ 8040: ఫొటోలో చూపినట్టు కుర్చీకి ఎదురుగా నిలబడి కుడిపాదాన్ని కుర్చీలో ఉంచి వెనుక ఉన్న కుర్చీని కుడిచేత్తో ఆధారంగా పట్టుకోవాలి. ఎడమ చేతిని కుడి మోకాలు మీద ఎడమ కాలును స్థిరంగా ఉంచి కుడి భుజమును తలను కుడి వైపుకి శ్వాస తీసుకుంటూ తిప్పాలి. 2 లేదా 3 సాధారణ శ్వాసల తరువాత శ్వాస వదులుతూ తిరిగి ముందుకు (కుర్చీకి ఎదురుగా) రావాలి. ఇదే విధంగా రెండవ వైపు కూడా చేయాలి. 1. పాదాంగుష్ఠాసన కుడి కాలు మీద నిలబడి ఎడమ కాలును ముందుగా కుర్చీ సీటులో, తర్వాత కుర్చీ బ్యాక్ రెస్ట్ పై ఉంచాలి. మోకాలుని నిటారుగా ఉంచి, ఎడమ చేత్తో ఎడమ కాలుని పట్టుకునే ప్రయత్నం చేస్తూ కుడి చేతిని సమంగా పక్కలకు ఉంచి 2 లేదా 3 శ్వాసల తరువాత శ్వాస వదులుతూ కుడి చేయి కిందకు, ఎడమ కాలుని కుర్చీ సీటులోకి తెచ్చి, సమస్థితిలోకి రావాలి. ఇదే విధంగా రెండవవైపు కూడా చేయాలి. కాలు బ్యాక్ రెస్ట్ పైన పెట్టలేకపోతే కుర్చీ పక్కకు తిప్పి కుర్చీ చేతి మీద ఉంచవచ్చు. లేదా కుర్చీ సీటులోనే ఉంచి మోకాలు నిటారుగా పెట్టే ప్రయత్నం చేయవచ్చు. 2. తిర్యక్ పాదాంగుష్ఠాసన ఫొటోలో చూపిన విధంగా కుడికాలుని కుర్చీ బ్యాక్రెస్ట్ మీద ఉంచాలి. ఎడమ చేతిని కుడి షిన్ బోన్ (పిక్కల ముందు భాగపు ఎముక) మీద లేదా కుడి మోకాలు మీద సపోర్ట్ ఉంచి, శ్వాస తీసుకుంటూ తల భుజాన్ని కుడివైపు తిప్పాలి. 2 లేదా 3 సాధారణ శ్వాసల తరువాత కుర్చీకి ఎదురుగా కుడి కాలుని కిందకు తీసుకురావాలి. ఇదే విధంగా రెండవ వైపు కూడా చేయాలి. కుడి కాలు కుర్చీ పైన ఉంటే కుడికి, ఎడమకాలు పైన ఉంటే ఎడమవైపు తల, నడుమును తిప్పడం అనేది ముఖ్యంగా గమనించాలి. ఫొటోలో చూపించిన విధంగా రెండు చేతులను గాలిలో ఒకదానికి సమాంతరంగా రెండవచేతిని 180 డిగ్రీల కోణంలో ఉంచి కూడా నడుమును పక్కకు ట్విస్ట్ చేయవచ్చు. ఉపయోగాలు: కంప్యూటర్ ముందు ఎక్కువ సేపు కూర్చుని పనిచేసేవాళ్లు తప్పక చేయవలసిన ఆసనాలు. వీటి వల్ల నడుము, వెన్నెముకకు ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. బలం చేకూరుతుంది. మలబద్ధకానికి నివారిణగా పనిచేస్తుంది. చేతులు పక్కలకు స్ట్రెచ్ చేసి ఉంచడం వలన ఊపిరితిత్తులు, ఛాతీ వ్యాకోచస్థితిలో ఉంటాయి కనుక వాటి సామర్థ్యం, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. భుజాలు, వీపు భాగాలలోని అన్ని కండరాలకు టోనింగ్ జరుగుతుంది. పాదాంగుష్ఠాసనం ఒక కాలు మీద నిలబడి చేయడం వల్ల శరీరంలో కుడి ఎడమల మధ్య అసమానతలు తగ్గుతాయి. జాగ్రత్తలు: హెర్నియా, స్లిప్డిస్క్, లేదంటే అబ్డామినల్ ఇన్ఫ్లమేషన్ ఉన్నవారు, వెన్నెముకకు ఈ మధ్యనే శస్త్ర చికిత్స చేయించుకున్నవారు అత్యంత జాగ్రత్తగా నిపుణుల సమక్షంలో ఈ ఆసనాలు చేయాలి. ►కంప్యూటర్ ముందు కూర్చుని నిర్విరామంగా చాలాసేపు పనిచేస్తే.. ఎదురయ్యే సమస్యలకి పరిష్కారాలు ఈ ఆసనాలు సమన్వయం: సత్యబాబు ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్ -
దుపట్టు
మోడ్రన్, స్టైలిష్, లేటెస్ట్ ఖాదీ, కాందారీ టస్సర్, చందేరీ షిఫాన్, జార్జెట్ కుర్తా ఏదైనా కానీ పైన ఒక ‘పట్టు’ వేస్తే అదేనండి పట్టు దుపట్టా వేస్తే పోస్ట్ నియో మోడ్రన్ కట్ కూడా ట్రెడిషనల్ అయిపోతుంది. పట్టు దుపట్టా.. అదే దు‘పట్టు’. ► పాలనురుగు లాంటి తెల్లటి లాంగ్ అనార్కలీ ఫ్రాక్ మీదకు ఎరుపు రంగు పట్టు దుపట్టా సంప్రదాయానికి సిసలైన చిరునామాగా నిలుస్తుంది. ► లాంగ్ అనార్కలీ సెట్కి అదే రంగు జరీ జిలుగుల అంచు గల దుపట్టా ధరిస్తే, సంప్రదాయంగా కనువిందు చేస్తూనే స్టైలిష్ మార్కులు కొట్టేస్తారు. ► లాంగ్ అనార్కలీ సెట్ మీదకు పాత కాలం నాటి చీరలకుండేలా పెద్ద అంచున్న పట్టు దుపట్టా వేడుకను కళాత్మకంగా మార్చేస్తుంది. ► గోల్డ్ కలర్ లాంగ్ కుర్తాకి బెనారస్ పట్టు దుపట్టా ఏ వేదిక మీదనైనా, ఏ వేడుకలోనైనా సంప్రదాయపు హంగుతో ఆకట్టుకుంటుంది. ► తెల్లని కుర్తా పైజామా మీదకు మెజెంటా కలర్ ప్యూర్ సిల్క్ దుపట్టా ప్రత్యేక ఆకర్షణ. ► స్టైలిష్ ప్లెయిన్ రెడ్ కుర్తాకు క్రీమ్ కలర్ దుపట్టా ధరిస్తే చూపు తిప్పుకోలేని అందంతో మెరిసిపోవచ్చు -
బంగారు బొడ్డెమ్మ
‘బతుకమ్మ’కు ముందు వచ్చే సంబరం కొన్ని చోట్ల నేటి నుంచి ప్రారంభం విభిన్న సంస్కృతులు, సంప్రదాయాల సమ్మేళనం.. తెలంగాణ. ఆచార, వ్యవహారాలే కాదు.. పండుగల్లోనూ ప్రత్యేకత ఉంటుంది. యాస భాషకే అందాన్నిస్తే.. పండుగలు సంప్రదాయాలకు అద్దం పడతాయి. మహిళలకే ప్రత్యేకమైన మన ‘బతుకమ్మ’.. తెలంగాణే కాదు.. దేశ సరిహద్దులు దాటి నేడు విశ్వవ్యాప్తమైంది. ఈ బతుకమ్మకు ముందు వచ్చే మరో ముఖ్యమైన పండుగ బొడ్డెమ్మ. బతుకమ్మ పెద్దల పండుగ అయితే, బొడ్డెమ్మ చిన్నపిల్లలు, కన్నె పిల్లల వేడుక. అయితే, ఒక్కోచోట ఒక్కోలా ఈ పండుగను జరుపుకొంటారు. కొన్నిచోట్ల పది రోజుల పాటు బొడ్డెమ్మ ఆడుతుంటే, మరికొన్ని చోట్ల ఐదు రోజుల పాటు ఆడతారు. మరికొన్ని చోట్ల ఐదు వారాల పాటు ఆడతారు. భాద్రపద బహుళ పం^è మి మొదలుకొని మహాలయ అమావాస్య వరకు బొడ్డెమ్మను, మహాలయ అమావాస్య నుంచి అశ్వీయుజ శుద్ధ నవమి వరకు బతుకమ్మను జరుపుకుంటారు. ఒకప్పుడు పల్లె పల్లెన, పట్టణాల్లో వీధివీధిన కనిపించిన ‘బొడ్డెమ్మ’కు ప్రస్తుతం ఆదరణ కరువైంది. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లోనే బొడ్డెమ్మ ఆడడం కనిపిస్తోంది. నిజామాబాద్ కల్చరల్/కామారెడ్డి: -
సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ
నల్లగొండ రూరల్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండగ అని బతుకమ్మ ఉత్సవ సమితి అధ్యక్షురాలు నూకల సంధ్యారాణి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బోయవాడలో బతుకమ్మ ఉత్సవ సమితి కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. మహిళలు బతుకమ్మ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించి సంస్కృతి, సంప్రదాయాలను ఘనంగా చాటిచెప్పాలన్నారు. ప్రకృతి ప్రసాదించిన పూలతో బతుకమ్మలను నిర్వహించడం ఆడపడుచులకు గర్వ కారణమన్నారు. సంబరాలను వైభవంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూతురు సత్యవతి, శ్రీలత, పద్మ, కోటగిరి రమ్యశాంతి, లక్ష్మి, శోభ, జ్యోతి, సుజాత, జయశ్రీ, కాశమ్మ, విజయలక్ష్మి, అర్చన, డాక్టర్ అనిత, డాక్టర్ ఇందిర తదితరులు పాల్గొన్నారు. -
సంప్రదాయ కళలను ప్రోత్సహిద్దాం
కర్నూలు (కల్చరల్): భారతీయ సంప్రదాయ కళలను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉందని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. స్థానిక బిర్లాగేట్ సమీపంలోని శ్రీలక్ష్మి ఫంక్షన్హాలులో ఎస్వీ సుబ్బారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి నృత్య పోటీలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్వీ పౌండేషన్ వారు ప్రతి సంవత్సరం శాస్త్రీయ జానపద నృత్య పోటీలను నిర్వహిస్తూ కళాకారులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ఎస్వీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా ఎస్వీ ఫౌండేషన్ రాష్ట్రస్థాయి నృత్య పోటీలను నిర్వహిస్తూ కళాకారులను ఉత్తమ కళాకారులుగా రాణించేందుకు అవకాశం కల్పిస్తోందన్నారు. ఆకట్టుకున్న శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు: ఎస్వీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక శ్రీలక్ష్మి ఫంక్షన్హాలులో జరిగిన రాష్ట్రస్థాయి నృత్య పోటీలల్లో వివిధ జిల్లాలకు చెందిన కళాకారులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రధానంగా చిన్నారులు చేసిన స్వాగత నృత్యం, దుర్గామాత తదితర నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ కేంద్ర క్రమశిక్షణా సంఘం సభ్యులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎస్వీ ఫౌండేషన్ కార్యాధ్యక్షులు రాయపాటి శ్రీనివాస్, కర్నూలు శారదా సంగీత కళాశాల ప్రిన్సిపాల్ రామచంద్రన్, పోటీల న్యాయ నిర్ణేతలు విజయలక్ష్మి, నాగసాయి ప్రదీప్, ఎలమర్తి రమణయ్య, పల్లె గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
శిల్పారామంలో నాట్యాంజలి
-
నాకు సెకండ్ హోమ్లా....
లాడ్బజార్లో.. మనసు లాక్.. హైదరాబాద్లో అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అందుకే ఈ సిటీ అంటే చాలా ఇష్టం. నాది బెంగళూరు అయినప్పటికీ హైదరాబాద్ని కూడా నా హోమ్ టౌన్లానే భావిస్తాను. ఇక్కడివారు ఎంత మోడ్రన్గా ఉంటారో అంతే ట్రెడిషనల్గా కూడా ఉంటారు. ఒకసారి ఓల్డ్ సిటీకి వెళ్లాను. లాడ్బజార్ను చూసి ఆశ్చర్యపోయాను. అక్కడ దొరికే రకరకాల గాజులు చూసి ఇన్ని రకాలుంటాయా..! అనిపించింది. ఆ ప్రాంతానికి కనెక్ట్ అయిపోయాను. హైదరాబాద్లో నేను చాలా ప్లేసెస్కి వెళ్లాను. ఇక్కడ హైదరాబాదీ బిర్యానీ ఫేమస్ అయినా, నేను నాన్-వెజ్ తినను కాబట్టి ఆ రుచి గురించి చెప్పలేను. నేనెంతగా సిటీకి కనెక్ట్ అయ్యానంటే నాకు సెకండ్ హోమ్లా అయిపోయింది. - ప్రణీత -
బ్రైడల్ బ్యూటీస్
పెళ్లి... ప్రతి అమ్మాయి జీవితంలో మధురమైన ఘట్టం! అంతటి గొప్ప వేడుకలో తాను అతిలోక సుందరిలా మెరిసిపోవాలని మురిసిపోని అమ్మాయి ఉండదు. ఈ ట్రెడిషనల్ వేడుకలో సెంటరాఫ్ అట్రాక్షన్ అయిన బ్రైడ్... ప్రౌడ్గా నిలబడాలంటే డ్రెస్సింగ్తోపాటు మేకప్ కూడా కీలకం. ఆ బ్రైడల్ డ్రీమ్ లుక్స్ కోసం... బాలీవుడ్ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ సుష్మాఖాన్ చెబుతున్న టిప్స్! సెలబ్రిటీలకి మేకప్ చేయడం సింపుల్. ఎందుకంటే వాళ్ల స్కిన్టోన్ కాన్వాస్లా ఉంటుంది. దీంతో... వాళ్లు అందంగా కనిపించేలా చేయడం చాలా ఈజీ. కానీ.. సాధారణ మహిళలకు అసాధారణ లుక్ తీసుకురావడమే ఛాలెంజింగ్. నా దగ్గరికి వచ్చేవారు ట్రెడిషనల్గా కనబడాలని చెబుతూనే ఫ్యాషనబుల్గా కూడా ఉండాలని అంటుంటారు. మరికొందరు మేకప్ తక్కువైనా ఫర్వాలేదు, నేచురల్గా కనిపించాలని కోరుకుంటారు. పెళ్లిలో ట్రెడిషనల్ టచ్ ఉండాలి. వధువులు మరింత అందంగా మెరిసిపోవాలంటే మోడరన్ హంగులూ కావాలి. అందుకే... బ్రైట్ మేకప్ను వినియోగించాలి. కళ్లు... డార్క్ గ్లిటరరీ మెటాలిక్ రీతిలో ఉండాలి. దీనికి విరుద్ధంగా న్యూడ్ సాఫ్ట్ లిప్స్ బాగుంటాయి. నవ వధువులు సిగ్గులొలకాలంటే... షిమ్మరింగ్ బ్యూటీ మేకప్ పర్ఫెక్ట్. హెవీ మస్కారా అద్దిన ఐ లాష్తో పాటుగా కోల్-ఔట్లైన్ గీసిన బంగారు వన్నె కళ్లు క్రిమ్సన్ బ్లూసమ్ మేకప్ సొంతం. ఈ మేకప్లో మెరిసే ఎర్రటి పెదాలు వధువును సంప్రదాయంగానూ, అందంగానూ చూపిస్తాయి. మేకప్ అనేది ఆర్ట్. ఐ మేకప్ వేసుకునే సమయంలో కళ్లపై మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. దీంతో కళ్లు మరింత అందంగా కనబడతాయి. ఐబ్రో షేప్ కోసం వార్మ్ చాకొలెట్, స్లేటీ, గ్రే లేదా నేవీ బ్లూ షేడ్స్ ఉన్న ఐ పెన్సిల్ ఉపయోగిస్తే బెటర్. ప్రస్తుతం వేసవికాలం కావడంతో పెదాలకు క్రీమీ లిప్స్టిక్స్ ఉపయోగిస్తే బాగుంటుంది. ప్లమ్, బర్గండి, వైన్, కోరల్, బ్రాండ్ షేడ్లు ఉపయోగిస్తే అందమైన పెదాలకు మరింత అందమొస్తుంది. స్కిన్టోన్, డ్రెసప్ననుసరించి బ్లషర్ ఉపయోగిస్తే మంచిది. ఒక్కొక్కరి స్కిన్ టోన్ ఒక్కోరకంగా ఉంటుంది. మేకప్కు ముందు అందరూ ఫౌండేషన్ వేసుకోవాలన్న రూల్ లేదు. హైలైటర్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు. మేకప్ ఎంత వేసుకున్నా... పెళ్లి సమయంలో సహజంగా వచ్చే అందం ప్రధానం. అందుకోసం ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రోజుకు కచ్చితంగా మూడు లీటర్ల నీటిని తాగాలి. జంక్ఫుడ్ను పూర్తిగా దూరంగా పెట్టాలి. తాజా పండ్లు తినాలి. ఎక్సర్సైజ్ తప్పనిసరి. మంచి నిద్ర మరింత ఎనర్జీనిస్తుంది. ..:: వాంకె శ్రీనివాస్ -
కోటి కళల మైనా... నవ తెలంగాణ
ఏళ్ల నాటి తపస్సు ఫలించి అవతరించిన స్వరాష్ట్రం ‘కళకళ’లాడాలని నవతరం కోరుకుంటోంది. పాశ్చాత్య సంస్కృతి ధాటికి పాతబడిపోతున్న పల్లె కళలకు కొత్త వసంతం తెస్తామంటోంది. సాంస్కృతిక బానిసత్వాన్ని అడ్డుకుంటూ... సంప్రదాయ వారసత్వాన్ని మోసుకుంటూ... కోటి కళల వీణ... మా తెలంగాణ అని నిరూపిస్తామంటోంది. శిల్పారామంలో నిర్వహించిన యువజనోత్సవాల సాక్షిగా... పది జిల్లాల ప్రతిభ ప్రకాశించింది. కాసింత ప్రోత్సాహం అందిస్తే... అద్భుతాలు సృష్టిస్తానంటోంది. - ఎస్.సత్యబాబు ‘చందనాల సులోచనాల రాధా ప్రమీలో... ఊడల మర్రి కింద నాగుల పుట్ట చందనాల సులోచనాల...’ అంటూ జానపదం పల్లవించింది. ‘పాంచాలి... ఏమే ఏమేమే నీ కండకావరము..’ అంటూ పౌరాణికం ప్రతిధ్వనించింది. ‘పొరియా గడేపీ ఆయీ’ అంటూ బంజారా పాట ఝంఝుంమారుతమైతే... ‘వినరా ద్వారకా రాజా యమలోకమందుండెదనురా’ అంటూ యక్షగానం మలయమారుతమైంది. విలువలంటే కళలే... ఆయాసాల నుంచి పుట్టిన ఆటపాటలు, శ్రమైక జీవన పల్లెపదాలు జానపదంతో కదం తొక్కుతాయి. ‘ఊరికి ఉత్తరాన ఊడలమర్రి’ అనే జానపదంతో తనదైన శైలితో ఈ కార్యక్రమంలో ఆకట్టుకున్న సంజీవ్ లాంటివారు... పాప్లూ, ర్యాప్లూ మన సంప్రదాయ శైలుల ప్రాణం తీస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేయడంలో అతిశయోక్తి లేదని చూసిన వారెవరైనా అంటారు. వీటిని యువతకు దగ్గర చేయడం అంటే తెలంగాణ భవితను కళకళలాడేలా చేయడమే. ఇక తెలంగాణ ప్రాంతంలో మరో శక్తివంతమైన సంప్రదాయ కళ యక్షగానం. ‘నాన్న హయాంలో ఆయన ప్రోగ్రామ్ కోసం ఊర్లకు ఊర్లు ఎదురు చూసేవి’ అంటూ గుర్తు చేసుకున్న కరీంనగర్ వాసి ఎన్.సురేష్... యమధర్మరాజు గెటప్ వేసి యక్షగానం ఆలపిస్తే శిల్పారామంలో కళాభిమానులు కళ్లప్పగించేశారు. గోత్రాల వంటి కులాల వారికి వారసత్వంగా వస్తున్న యక్షగానం... ఇప్పుడున్న పరిస్థితిలో కెరీర్గా ఎంచుకోవడం దాదాపు అసాధ్యమే. అయితే అందరూ దీన్ని ఆదాయ కోణంలోనే చూస్తారనలేం. ఏ ఉద్యోగమూ లేదు... కేవలం పాటే నాకు ఉపాధి బాట అంటున్న సురేష్... కంప్యూటర్స్లో పీజీ చేశాడంటే ఆశ్చర్యం అనిపించక మానదు. స్వరాష్ట్రంలోనైనా యువత ‘కళ’లు సాకారం కావాలని సురేష్ కోరుకుంటున్నానన్నాడు. ఘగన్గోర్ తండా నాయకుడి ఇంటి ముందుకు వెళ్లి చేసే నృత్యం... పచ్చదనం ప్రాధాన్యత చెప్పే తీజ్ పండుగ, బావా మరదళ్ల సరసాల పాటలు, లంబాడీ, బంజారాల సంస్కృతి సంప్రదాయాల గురించి ఎంత వర్ణించినా తక్కువే. పెద్దలు, పిన్నలు ఆటపాటలతో గడిపే ఘగన్గోర్ వంటివి తరాల మధ్య అంతరాలకు సంప్రదాయం అందించిన పరిష్కారం. ‘సేవ్ వాటర్ అంటూ మా వన్ యాక్ట్ ప్లేలో సందేశం ఇచ్చాం’ అని చెప్పాడు కృష్ణానాయక్. రంగారెడ్డి జిల్లా, రామచంద్రగూడకు చెందిన ఈ కుర్రాడు... తన 10 మంది సభ్యుల బృందంతో కలిసి వన్ యాక్ట్ ప్లే, సోలో డ్యాన్స్, ఫోక్ సాంగ్ ప్రదర్శనలు ఇచ్చాడు. రెండురోజుల పాటు మాదాపూర్లోని శిల్పకళాతోరణం సకల తెలంగాణ కళల శోభను సింగారించుకుని నవయవ్వనిలా మెరిసి మురిసింది. వ్యయప్రయాసలు తెలియవు... ఈ ఆభరణాలు ఎంత బరువుంటాయో తెలుసా... వీటిని ధరించి గంటల పాటు మోయాలి. వీటన్నింటికీ కలిపి రూ.6 వేల వరకూ అద్దె చెల్లించాలి’ అనే ఈ దుర్యోధన వేషధారి... వేదిక ఎక్కగానే వ్యయప్రయాసలన్నీ మరిచిపోతాడు. పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తాడు. ‘ఖర్చులు, శ్రమ చూసుకుంటే తృప్తి దక్కదు’ అంటున్న జనగాం వాసి గట్టగల్ల భాస్కర్.. బీఏ గ్రాడ్యుయేట్. దేశవ్యాప్తంగా ప్రదర్శనలిచ్చిన భాస్కర్... తాము మొత్తం 20 మంది బృందంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నామని చెప్పాడు. ఫొటోలు: జి.రాజేష్ -
సందట్లో జానపదం
వేడుకలు ఆడంబరాల వేదికలే తప్ప,సంప్రదాయానికి ఆనవాళ్లుగా లేవు అని పెదవి విరిచే వారిని పన్నీటి జల్లులా పలకరిస్తోంది జానపదం. అడుగడుగునా పాశ్చాత్య పోకడలు తొంగి చూస్తున్న సంబురాల్లో పల్లె గాలి అల్లరి లేదని నీరసపడే పట్నవాసులను తెలుగుదనంలో పరవశింపజేస్తున్నాయి పల్లెపదాలు. వివాహం, సీమంతం, బారసాల, పుట్టిన రోజు వేడుక, చీరలు కట్టించడం.. ఇలా సందడి ఏదైనా సిటీలో జానపద పాటలు వీనుల విందు చేస్తూ ఫంక్షన్కు లోకల్ టచ్ ఇస్తున్నాయి. ..:: నిర్మలా రెడ్డి పెద్ద పెద్ద వేదికలు, హుందాగా ఆహూతులు, వారి మధ్య వెలిగిపోతూ వధూవరులు, బాజాభజంత్రీల మోతలు.. ఎన్ని ఉన్నా ఇంకా ఏదో వెలితి నేటి పెళ్లిళ్లలో అనుకునే వారి మదిని సంబురంలో ముంచెత్తుతూ.. ‘సువ్వి సువ్వి సువ్వి సువ్వని సుదతులు దంచెదరు ఓలాల...’ అంటూ ఓ బృందం సుతిమెత్తగా మదిని తట్టిలేపుతుంది. నిన్నటి తరం పెళ్లి ముచ్చటను ఈ తరానికి పరిచయం చేస్తుంది. అందుకే ‘వనితలు మనసులు కుందెన చేసెటు వలపులు దంచెదరు ఓలాల.. కనుచూపులనెడు రోకండ్లతో కన్నెల దంచెదరు ఓలాల..’ అంటూ వేడుకకు సంప్రదాయపు అలంకారాలను అద్దుతున్నాయి జానపద బాణీలు. ఏ తీరుకు ఆ పాట.. డీజే హోరులో తడిసిముద్దవుతున్న నేటి వేడుకలను ఆ పాత రోజుల్లోకి తీసుకెళ్తున్నాయి జానపద బృందాలు. రోలు, రోకటి అచ్చట్లు, వధూవరుల ముచ్చట్లు, అత్తాకోడళ్ల సవాళ్లు, వదినామరదళ్ల ఆటపట్టింపులు.. పెళ్లి వేడుక మొదలైన క్షణం నుంచి అప్పగింతలయ్యే వరకూ ప్రతి తంతునీ విడమరచి చె ప్పే పాటలు జానపదంలో వేలాదిగా ఉన్నాయి. మరుగున పడిపోతున్న ‘లాలి’త్యాన్ని వెలికి తీసి పల్లె బాణీల్లో బారసాల బుజ్జాయికి జోలపుచ్చుతున్నారు కళాకారులు. కట్టు.. బొట్టు.. సిటీలో జరిగే పలు వేడుకల్లో ఇప్పుడు జానపదాలు పల్లవిస్తున్నాయి. ఇక్కడ పాటలు పాడేవారు పది మందికి తగ్గకుండా బృందంగా ఏర్పడతారు. వీరంతా వివిధ ఉద్యోగాల్లో ఉన్నవారూ, పాటలపై ఆసక్తి ఉన్నవారూ అయి ఉంటారు. అలాగే వారికి నాటి సంప్రదాయపు సొగసు కూడా తెలిసి ఉంటుంది. ఆ వేడుకకు తగ్గట్టు తమ ఆహార్యంతోనూ ఆకట్టుకుంటారు. పెద్దంచు పట్టుచీర , నుదుటన పెద్ద బొట్టు, తల నిండుగా పువ్వులు, చేతుల నిండుగా గాజులతో మహిళలు పెళ్లిలో హాస్యమాడే పాటలతో ఆకట్టుకుంటే.. మగవారు సంప్రదాయ పంచెకట్టుతో ఆనందాన్ని పంచుతారు. తరం మారినా.. పెళ్లి సందడిలో వయసుతో నిమిత్తం లేదు. ఇక్కడ మూడు తరాల వారూ కోరుకునేది ఆనందమే. అందుకే అందరూ ఎంటర్టైన్మెంట్కు ప్రాధాన్యం ఇస్తారు. కొన్ని సౌండ్ పార్టీలు డీజేలతో సెలబ్రేట్ చేసుకుంటే, ఇంకొందరు ఆర్కెస్ట్రాలతో ఆహ్వానితులను ఎంగేజ్ చేస్తారు. ఈ మధ్యకాలంలో వీటి స్థానంలో పాతదే అయినా ఈ తరానికి కొత్తదైన జానపద పాటలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా జానపదాలతో వేడుకలలో ఆకట్టుకుంటున్న కళాకారిణి స్నేహలతా మురళి మాట్లాడుతూ ‘నేను మొదట జానపద పాటలను పెళ్లిలో పాడటం మొదలుపెట్టినప్పుడు యువత అనాసక్తి చూపుతారేమో అని భయపడ్డాను. కానీ, వారు పెళ్లికి డీజే పెట్టించుకుని, తర్వాత ఆ విషయమే మర్చిపోయి జానపద పాటల్లో లీనమవడంతో ధైర్యం వచ్చింది. నాతో నా స్నేహితులూ, ఆసక్తి గలవారు చేరడంతో మేమంతా బృందంలా ఏర్పడ్డాం. చిన్నాపెద్ద ఏ ఫంక్షన్కి ఆహ్వానించినా మా పాటలతో వారి వేడుకను ఆద్యంతం సంబురంగా మార్చేందుకు ప్రయత్నిస్తుంటాం. పెళ్లిలో వియ్యాలవారి మధ్య అరమరికలు తొలగడానికి ఈ పాటలు దోహదం చేస్తుంటాయి. కొన్నిసార్లు పిల్లలు, పెద్దలు మాతో శృతి కలుపుతుంటారు. ఈ పాటలతో అప్పటి వరకూ ఉన్న స్తబ్ధత పోయిందని వేడుకకు వచ్చిన వారు చెబుతుంటే ఆనందం కలుగుతుంది. పదేళ్లుగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాను. నటుడు మోహన్బాబు ఇంట పెళ్లికి, సీమంతానికి పాడాం. ఇంకా నగరంలో జరిగిన జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వివాహ వేడుకల్లోనూ జానపద పెళ్లి పాటలు పాడాం’ అని తెలిపారు స్నేహలత. అర్థం చెప్పే ‘పాట’వం.. పెళ్లి పాటలు పదిగురిలోకి చేరాలి. అవి కలకాలం ప్రజల నాలుకలపై ఆడాలి. సంప్రదాయపు సొబగులతో, అవి అందించే ఆశీస్సులతో వేడుకలు మరింత వేడుకగా మారాలి. ఇందుకు నగరంలోని జానపద బృందాలు ‘పాట’పడుతున్నాయి. ముహూర్తం పెట్టి పసుపు దంచింది మొదలు నలుగు పాట, విడి పాట, వియ్యపురాలి పాట, భోజనం బంతి పాట, పూల చెండ్ల పాట, అప్పగింతల పాట.. ప్రతి సందర్భానికీ పాటలే పాటలు. వీరు ఆ పాటలను పాడేసి ఊరుకోవడం లేదు. పాటల సమయ సందర్భాలను, వాటిలోని సాహిత్యాన్నీ అందాన్నీ పరిచయం చేస్తూ జనరంజకం చేస్తున్నారు. పాటకు అనుగుణంగా అప్పటికప్పుడు యువతతోనూ చిందేయిస్తూ తామూ పాదం కలిపి పదం పాడుతుంటారు. మామూలుగా ఈ కార్యక్రమం కొత్తాపాత తేడా లేకుండా కలిసిపోవడానికే! యువతరంలో జోష్నందించడానికే అయినా దానికి మంచి గొప్ప ప్రయోజం కూడా కల్పిస్తున్నారు. ఒకరిని చూసి ఒకరు పెళ్లి పాటలు పాడతాం అని బృందాలుగా తయారవుతున్నారు. అన్నింటికీ ఉన్నట్టే పెళ్లిపాటలు పాడే బృందాలకూ ప్యాకేజీలు ఉన్నాయి. హృద్యంగా పాటలు పాడి, కార్యక్రమాన్ని ఆద్యంతం రంజింపజేసే వారినే అవకాశాలు అధికంగా పలకరిస్తున్నాయి. -
పండగవేళ.. పల్లె కళ..
నేటి ఆధునిక ఫ్యాషన్లు చిన్నాపెద్దను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. అయితే, పరుగులు పెట్టే మోడ్రన్ ఏజ్లోనూ ఒక్కసారి ఆగి,ప్రకృతి సింగారాలను ఒళ్లంతా నింపుకొంటే... పల్లె సిరులను నట్టింటికి తెచ్చుకొంటే... ఆ అందం, ఆనందం ఇబ్బడి ముబ్బడి అవుతాయి. విఘ్నాధిపతి వినాయకుని మట్టితో మూర్తిగా మలిచి, అందంగా అలంకరించి శ్రద్ధగా పూజలు జరుపుతాం.అలాగే పడతుల అలంకరణలోనూ ప్రకృతి సిరులకు స్థానం ఇస్తే పండగ పూట కళగా వెలిగిపోతారు. చేనేత..కళనేత.. మంగళగిరి ప్రింటెడ్ కాటన్ మెటీరియల్తో పరికిణీని తీర్చిదిద్ది, ప్లెయిన్ షిఫాన్ ఓణీకి రాసిల్క్ బార్డర్ జత చేసి, డిజైనర్ బ్లౌజ్లు ధరిస్తే పల్లెకళతో వెలిగిపోతారు. వీటి మీదకు టైటా ఆభరణాలు, పొడవాటి కురులను అల్లిన జడలు ప్రత్యేక ఆకర్షణను తీసుకువస్తాయి. పోచంపల్లి, గద్వాల్, కలంకారీ, ఇక్కత్.. ఇలా మన చేనేత ఫ్యాబ్రిక్స్తో తయారుచేసుకున్న దుస్తులు ఎప్పటికీ కొత్తదనంతో ఆకట్టుకుంటూనే ఉంటాయి. - భార్గవి కూనమ్, ఫ్యాషన్ డిజైనర్ ప్రాచీన కళ.. టైటా... ఏ లోహపు ఆభరణాలకూ తీసిపోని విధంగా ప్రత్యేకతను చాటుతున్న ఈ ఆభరణాలను ఆధునిక యువతులు అమితంగా ఇష్టపడుతున్నారు. నదీ తీరంలో కొట్టుకువచ్చిన ఒండ్రుమట్టిని సేకరించి, పొడిచేసి, ఉడికించి, తగిన అచ్చులలో పోసి ఈ ఆభరణాలను తయారుచేస్తాను. వీటిని వెలిసిపోని రంగుల తో తీర్చిదిద్దుతాను. సంప్రదాయ, ఆధునిక దుస్తుల మీదకు అందంగా నప్పే ఈ ఆభరణాలలో యాంటిక్ గోల్డ్ జుంకాలు, హారాలు ప్రాచీనకళతో ఉట్టిపడుతుంటాయి. వీటి ధరలు రూ.350 నుంచి 5వేల రూపాయల వరకు ఉన్నాయి. ధరించే దుస్తుల రంగులను బట్టి ఆభరణాలను తయారు చేయవచ్చు. - అరుణా దీపక్, టైటా ఆభరణాల నిపుణురాలు యాంటిక్ లుక్తో కనువిందుచేసే ఈ ఆభరణాలు కంచి, ధర్మవరం, ఉప్పాడ.. పట్టు చీరలకు సరైన ఎంపిక. - నిర్వహణ: నిర్మలారెడ్డి -
పార్టీలో పర్ఫెక్ట్గా..!
టీనేజర్స్ ఎక్కడ ఉంటే సందడంతా అక్కడే అన్నట్టు ఉంటుంది. ముఖ్యంగా వేడుకలలో తామే అంతా అయినట్టు తిరిగేస్తుంటారు. అతిథుల దృష్టిని ఆకర్షించేది ఎక్కువగా వీరే! అందుకే వస్త్రాలంకరణ పట్ల టీనేజర్స్ ప్రత్యేక శ్రద్ధ కనపరచడం అవసరం. ముందు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సినది సందర్భానుసారంగా దుస్తుల ఎంపిక. పాశ్చాత్య, సంప్రదాయ వేడుకలను దృష్టిలో పెట్టుకొని థీమ్కు తగ్గ దుస్తులను ఎంచుకోవాలి. ఇతరులను పోల్చి దుస్తులను ఎంచుకోకూడదు. తమ శరీరాకృతికి తాము ఎంచుకున్న దుస్తులు నప్పుతాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. తమ ఎత్తు, లావు, శరీరాకృతిని బట్టి ధరించే దుస్తులు పర్ఫెక్ట్ ఫిట్గా ఉండేలా ఎంచుకోవాలి. చక్కని డ్రెస్ను ఎంచుకున్నా చాలామంది రంగుల విషయంలో పొరపాటు పడుతుంటారు. దీంతో పార్టీలో చార్మింగ్గా వెలిగిపోయేవారు సైతం గాడీ రంగులను ఎంచుకోవడంతో ఎబ్బెట్టుగా కనిపిస్తారు. ఫలితంగా దుస్తుల ఎంపిక తెలియనివారుగా నలుగురిలో పేరుపడిపోతారు. అందుకే తమ మేనిరంగును బట్టి దుస్తుల రంగు ఉండేలా చూసుకోవాలి. సాయంకాలం పార్టీలకు కాంతివంతమైన ముదురు రంగులు, పగటి పూట తేలికపాటి రంగు దుస్తులను ఎంచుకోవాలి. సంప్రదాయ వేడుకలకు హెవీ ఎంబ్రాయిడరీ దుస్తులు, వెస్ట్రన్ పార్టీలకు సింపుల్గా అనిపించేలా వస్త్రాలంకరణ ఉండాలి. క్యాజువల్ ఈవెనింగ్ పార్టీస్ అయితే బ్లూ డెనిమ్ జీన్స్, డీప్ యు-నెక్ టాప్, రెడ్ స్కర్ట టీనేజ్ అమ్మాయిలకు బాగా నప్పుతుంది. యాక్సెసరీస్ కూడా సింపుల్గా, దుస్తులకు మ్యాచ్ అయ్యేవి ధరించాలి. ఒక చేతికి బ్రేస్లెట్, పెద్ద పెద్ద చెవి రింగులు లేదా హ్యాంగింగ్స్, నడుముకు స్టైలిష్ బెల్ట్, కాళ్లకు హీల్స్ వాడితే చాలు, అల్ట్రామోడ్రన్గా కనిపిస్తారు. చిన్న చిన్న స్కర్ట్లు, ఫ్రాక్లు ధరించినప్పుడు తప్పనిసరిగా డ్రెస్ మంచి ఫిటింగ్ ఉండేలా చూసుకోవాలి. స్లీవ్లెస్ టీ -షర్ట్ ధరించినప్పుడు పొడవాటి స్కర్ట్, ఫ్లిప్-స్లాప్స్ అయితే పార్టీ లుక్ అదిరిపోతుంది. అబ్బాయిలైతే కార్గో ప్యాంట్లు, టీ షర్ట్ ధరిస్తే చాలు రాక్ అండ్ రోల్లా క్యాజువల్ పార్టీలో స్టైలిష్గా మెరిసిపోవచ్చు. ఇటీవల పార్టీ థీమ్స్ చాలా రకాలుగా ఉంటున్నాయి. అబ్బాయిలు, అమ్మాయిలు ఎవరైనా థీమ్ పార్టీస్ అయితే దానికి తగ్గట్టుగా డ్రెస్ చేసుకోవడం తప్పనిసరి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.