Umar Akmal
-
కోహ్లి కంటే మా తమ్ముడు ఎంతో బెటర్: పాక్ మాజీ క్రికెటర్
టీ20 వరల్డ్కప్-2024లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి పేలవ ప్రదర్శన కొనసాగుస్తున్న సంగతి తెలిసింది. ఐపీఎల్-2024 టాప్ రన్స్కోరర్గా నిలిచిన కింగ్ కోహ్లి.. ఈ పొట్టి ప్రపంచకప్లో మాత్రం తన మార్క్ను చూపించలేకపోతున్నాడు. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు 3 మ్యాచ్లు ఆడిన విరాట్.. కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో కోహ్లిని ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ కంటే తన తమ్ముడు ఉమర్ అక్మల్ ఎంతో బెటర్ అని కమ్రాన్ అక్మల్ అభిప్రాయపడ్డాడు."విరాట్ కోహ్లి సాధించిన రికార్డులకు మా తమ్ముడు ఉమర్ అక్మల్ దగ్గరకలేకపోవచ్చు. కానీ టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో మాత్రం ఉమర్ అక్మల్ రికార్డ్స్ కోహ్లీ కంటే మెరుగ్గా ఉన్నాయి. టీ20 వరల్డ్కప్లో కోహ్లి కంటే మెరుగైన స్ట్రైక్ రేట్, అత్యధిక వ్యక్తిగత స్కోరును ఉమర్ కలిగి ఉన్నాడు.కానీ కోహ్లిలా మాకు పీఆర్ ఎజెన్సీలు లేవు. అందకే మా గణాంకాలు, ప్రదర్శనలను సోషల్ మీడియాలో ప్రమోటు చేసుకోలేము. పొట్టి ప్రపంచకప్లో మా తమ్ముడు కలిగి ఉన్న గణాంకాలు ప్రస్తుత 15 మంది సభ్యుల గల భారత జట్టులో ఎవరికి లేవు. ప్రస్తుత టోర్నీల్లో కోహ్లి వరుసగా విఫలమవుతున్నాడు. మెనెజ్మెంట్ విరాట్ను విమర్శించిన ఆశ్చర్యపోనక్కర్లలేదని ఏఆర్వై న్యూస్ డిబీట్లో కమ్రాన్ అక్మల్ విషం చిమ్మాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వీడియో వైరలవుతోంది. ఇది చూసిన కోహ్లి ఫ్యాన్స్ అక్మల్కు కౌంటిరిస్తున్నారు. కోహ్లితో ఉమ్రాన్కు పోలికా, అందుకే మీ జట్టు లీగ్ దశలోనే ఇంటికి వెళ్లిపోయిందని పోస్టులు పెడుతున్నారు. -
నా కూతురు ఫీజు కూడా కట్టలేకపోయా.. కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ క్రికెటర్
ఉమర్ అక్మల్.. పాకిస్తాన్ తరపున సత్తా చాటి కనుమరుగు అయిపోయిన క్రికెటర్లలో ఒకడు. పాకిస్తాన్ స్టార్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ సోదురుడే ఈ ఉమర్ అక్మల్. అరంగేట్ర టెస్టులోనే సెంచరీతో చెలరేగిన అక్మల్.. అన్నకు తగ్గ తమ్ముడిగా నిరూపించుకున్నాడు. అయితే పాక్ క్రికెట్లో కీలక ఆటగాడిగా ఎదుగుతున్న తరణంలో ఉమర్ మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకుని తన భవిష్యత్తును నాశనం చేసుకున్నాడు. 2020లో మ్యాచ్ ఫిక్సింగ్ కోసం బుకీలు తనని సంప్రదించిన విషయాన్ని దాచిన అక్మల్పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మూడేళ్ల నిషేధం విధించింది. అయితే అదే ఏడాది తన తప్పును క్షమించాలని, శిక్షను తగ్గించాలంటూ అక్మల్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ను ఆశ్రయించాడు. ఈ క్రమంలో అతడిపై ఉన్న మూడేళ్ల నిషేధాన్ని 12 నెలలకు కుదిస్తూ న్యాయస్ధానం తీర్పు వెల్లడించింది. దీంతో అతడిపై 2021లో పీసీబీ నిషేదం ఎత్తివేసింది. అయితే ఆ తర్వాత అతడికి పాక్ జాతీయ జట్టులో మాత్రం చోటు దక్కలేదు. తాజాగా ఓ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఉమర్.. తనపై నిషేదం ఉన్న సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ఆమె చాలా గ్రేట్.. "ఆ సమయంలో నేను పడిన బాధ నా శత్రువులకు కూడా కలగకూడదు. ఆ దేవుడు కొన్ని సమయాల్లొ మనల్ని పరీక్షిస్తాడు. నా రోజులు బాగోలేక నేను గడ్డుపరిస్ధితులు ఎదుర్కొన్నప్పుడు.. చాలా మంది అసలు రూపం బయటపడింది. నన్ను తప్పుబడుతూ నా పక్కన ఉన్నవారు కూడా వెళ్లిపోయారు. నేను ఆ సమయంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నా కూతరి ఫీజు కట్టలేక ఎనిమిది నెలల పాటు స్కూల్కి పంపలేకపోయాను. అదే విధంగా నా భార్య ఓ సుసంపన్న కుటుంబంలో పుట్టింది. అయినప్పటికీ ఆ క్లిష్ట పరిస్ధితుల్లో ఆమె నన్ను అర్ధం చేసుకుని లా సపోర్ట్గా ఉండేది. ఆమెకి ఎప్పటికి రుణపడి ఉంటాను. ఆ రోజుల గురించి తలచుకున్నప్పుడల్లా కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి అంటూ అక్మల్ ఉద్వేగానికి లోనయ్యాడు. చదవండి: World Cup 2023: వన్డే ప్రపంచకప్కు భారత జట్టు ఇదే.. స్టార్ ఆటగాళ్లకు నో ఛాన్స్! సంజూకు -
పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్కు ఊరట
కరాచీ: పాకిస్తాన్ సీనియర్ ఆటగాడు ఉమర్ అక్మల్కు ఊరట లభించింది. పీసీబీ అతనిపై విధించిన బ్యాన్ను కోర్ట్ ఆప్ ఆర్బిర్టేషన్ ఫర్ స్పోర్ట్స్(సీఏఎస్) 12 నెలలకు తగ్గించడంతో పాటు రూ. 42 లక్షల జరిమానా విధించింది. అయితే పీసీబీ యాంటీ కరప్షన్ కోడ్ నిర్వహించే రీహాబిటేషన్ సెషన్లో పాల్గొన్న తర్వాతే ఉమర్ అక్మల్ను క్రికెట్ ఆడేందుకు అనుమతి ఇస్తామని పీసీబీ తెలిపింది. తాజాగా విధించిన 12 నెలల నిషేధం ఉమర్ అక్మల్ ఇప్పటికే పూర్తి చేసి ఉండడంతో త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టనున్నాడు. కాగా ఉమర్ అక్మల్ 2019 అక్టోబర్లో పాక్ తరపున చివరి వన్డే ఆడాడు. ఇప్పటివరకు పాక్ తరపున అక్మల్ 121 వన్డేల్లో 3194 పరుగులు, 84 టీ20ల్లో 1690 పరుగులు సాధించాడు. అక్మల్ ప్రస్తుతం 30ఏళ్ల వయసులో ఉన్న అక్మల్ తిరిగి జట్టులో స్థానం సంపాదిస్తే మరో 5నుంచి 6ఏళ్ల పాటు ఆడే అవకాశం ఉంది. 2019లో పాకిస్తాన్ సూపర్ లీగ్ సందర్భంగా బుకీల గురించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు తెలపకపోవడంతో పాటు, పీసీబీ అవినీతి నిరోధక చట్టాన్ని ఉల్లంఘించినందుకు గానూ అక్మల్పై ఏప్రిల్లో మూడేళ్ల సస్పెన్షన్ విధించారు. తన తప్పును అంగీకరించిన అక్మల్ తనను క్షమించాలంటూ జూలై 2020లో సీఏఎస్కు అప్పీల్ చేయగా.. అప్పట్లో కోర్టు 18 నెలలకు కుదించింది. తాజాగా అక్మల్ అభ్యర్థనను మరోసారి పరిగణలోకి తీసుకొన్న సీఏఎస్ నిషేధాన్ని 12 నెలలకు తగ్గించడంతో పాటు జరిమానా విధించింది. చదవండి: పాస్పోర్టు గల్లంతు: కీలక టోర్నికి కెప్టెన్ దూరం? స్వదేశం.. విదేశం.. రెండింట్లో కోహ్లినే టాప్ -
పీసీబీపై కనేరియా మరోసారి ఆగ్రహం
కరాచీ : పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్కు విధించిన మూడేళ్ల నిషేదాన్ని 3 సంవత్సరాల నుంచి 18 నెలలకు తగ్గించడం పట్ల పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా ట్విట్టర్ వేదికగా స్పందించాడు. అక్మల్ విషయంలో కనికరించిన పీసీబీ నా విషయంలో మాత్రం ఏం పట్టింపులేనట్లు వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ' జీరో-టాలరెన్స్ విధానం నాపై మాత్రమే వర్తిస్తుందని, పాకిస్తాన్లోని ఇతర ఆటగాళ్లకు మాత్రం వర్తించదు. కేవలం మతం కారణంగా నేను వివక్షకు గురయ్యా. మ్యాచ్ ఫిక్సింగ్ విధానాన్ని నివేదించడంలో విఫలమైనందుకు ఉమర్ అక్మల్కు క్రికెట్ నుంచి మూడేళ్ల నిషేధం 18 నెలలకు తగ్గించబడింది.. అంటే అతను వచ్చే ఏడాది ఆగస్టులో తిరిగి ఆటలోకి తిరిగి వస్తాడు. నాకు జీవిత నిషేధం విధించడానికి గల కారణాన్ని ఎవరైనా సమాధానం చెప్పగలరా.నా రంగు, మతం, బ్యాక్ గ్రౌండ్ కారణంగా నాకు ఈ విధానాలు వరిస్తాయి. అయితే నేను హిందువును అందుకు నేను గర్వంగా ఉన్నాను' అని డానిష్ కనేరియా తెలిపాడు.('ఆ మ్యచ్ ఓటమి జీర్ణించుకోలేకపోతున్నా') 2012లో ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ ఆడుతుండగా.. డానిష్ కనేరియా మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డాడని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అతడిపై జీవితకాల నిషేధం విధించింది. దీంతో కనేరియా అప్పటినుంచీ ఎలాంటి క్రికెట్ ఆడడం లేదు. 2018లో ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన నేరాన్ని అంగీకరించాడు. అయినా పీసీబీ తనపై కనికరం చూపడం లేదంటూ చాలాసార్లు తన ఆవేదన వ్యక్తం చేశాడు. తాను హిందువు అయినందున పాక్ బోర్డు తన విషయంలో జోక్యం చేసుకోవట్లేదని బాహాటంగానే ఆరోపించాడు. ఈ విషయం అప్పుట్లో పెద్ద దుమారమే రేపింది. -
ఉమర్ అక్మల్ సస్పెన్షన్ కుదింపు
కరాచీ: పాకిస్తాన్ బ్యాట్స్మన్ ఉమర్ అక్మల్కు కొంత ఊరట లభించింది. అతనిపై విధించిన మూడేళ్ల నిషేధాన్ని 18 నెలలకు కుదిస్తూ స్వతంత్ర న్యాయ నిర్ణేత ఫకీర్ మొహమ్మద్ ఖోఖర్ తీర్పు వెలువరించారు. అతనిపై నిషేధం ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వచ్చే ఏడాది ఆగస్టు వరకు కొనసాగుతుందని ఖోఖర్ తెలిపారు. అయితే ఈ తీర్పుపై అక్మల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మరోసారి దీనిపై అప్పీల్ చేస్తానని పేర్కొన్నాడు. తనకన్నా తీవ్రమైన నేరాలకు పాల్పడిన క్రికెటర్లకు తేలికపాటి శిక్షలు విధించారన్న అక్మల్ తనకు మాత్రం పెద్ద శిక్ష వేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తాజా తీర్పు పట్ల సంతోషంగా లేనని పేర్కొన్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ సందర్భంగా బుకీల గురించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు తెలపకపోవడంతో పాటు, పీసీబీ అవినీతి నిరోధక చట్టాన్ని ఉల్లంఘించినందుకు గానూ అక్మల్పై ఏప్రిల్లో మూడేళ్ల సస్పెన్షన్ విధించారు. తన తప్పును అంగీకరించిన అక్మల్ తనను క్షమించాలంటూ కోర్టుకు అప్పీల్ చేయగా తాజాగా శిక్షను 18 నెలలకు కుదించారు. -
షోయబ్ అక్తర్కు సమన్లు
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) లీగల్ అడ్వైజర్ తఫాజ్జుల్ రిజ్వి అసమర్థుడని సంచలన వ్యాఖ్యలు చేసిన ఆ దేశ మాజీ పేసర్ షోయబ్ అక్తర్కు ఫెడరల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ(ఎఫ్ఐఏ) సమన్లు జారీ చేసింది. రిజ్విపై అక్తర్ చేసిన వ్యాఖ్యలపై విచారణకు సిద్ధమైన ఎఫ్ఐఏ.. ముందుగా సమన్లు పంపింది. శుక్రవారం అక్తర్ స్టేట్మెంట్ను రికార్డు చేసిన తర్వాత విచారణను చేపట్టనున్నట్లు పేర్కొంది. ‘ ఇంకా అక్తర్పై ఎటువంటి కేసు నమోదు చేయలేదు. అతని యూట్యూబ్ చానల్లో రిజ్విని దూషించిన క్రమంలో ఫిర్యాదు అందింది. దాంతో అక్తర్కు సమన్లు జారీ చేశాం. అక్తర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా.. వద్దా అనేది స్టేట్మెంట్ను రికార్డు చేసుకున్నాక పరిశీలిస్తాం’అని ఒక అధికారి తెలిపారు.(బాల్కనీ నుంచి దూకేద్దామనుకున్నా: ఊతప్ప) తనపై అసభ్య పదజాలం వాడటమే కాకుండా న్యాయపరమైన అంశాల్లో అక్తర్ తలదూర్చిందుకు గాను అతనిపై పరువు నష్టం దావా వేశాడు రిజ్వి. ఈ క్రమంలోనే 100 మిలియన్లు పాకిస్తాన్ కరెన్సీ చెల్లించాలంటూ అందులో పేర్కొన్నాడు. అవినీతి ఆరోపణల్లో భాగంగా పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ ఉమర్ అక్మల్పై మూడేళ్లు నిషేధం విధించిన సందర్భంలో పీసీబీ లీగల్ డిపార్ట్మెంట్పై అక్తర్ అసంబద్ధ వ్యాఖ్యలు చేశాడు. తూ తన యూట్యూబ్ చానల్లో వీడియోను విడుదల చేశారు. ప్రధానంగా మూడేళ్ల నిషేధాన్ని తప్పుబట్టాడు. ఇది పీసీబీ లీగల్ అడ్వైజరీ అసమర్థవత వల్లే ఉమర్కు మూడేళ్ల శిక్ష పడిందంటూ వ్యాఖ్యానించాడు. అదే సమయంలో రిజ్విపై ఆరోపణలు చేశాడు. చాలా సున్నితమైన అంశాల్లో రిజ్వికి అనుభవం లేదంటూ విమర్శించాడు. పీసీబీ లీగల్ డిపార్ట్మెంట్ అనేది కుళ్లిన టెంక అంటూ విమర్శలు చేశాడు. పీసీబీ అండదండలు ఉన్న కారణంగానే రిజ్వి సుదీర్ఘ కాలం లీగల్ అడ్వైజర్గా కొనసాగుతున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. దాంతో అక్తర్పై పరువు నష్టం కేసును రిజ్వి దాఖలు చేశాడు. (ముగ్గురు క్రికెటర్లపై ఫిక్సింగ్ ఆరోపణలు) -
నిషేధంపై ఉమర్ అక్మల్ అప్పీల్
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తనపై విధించిన మూడేళ్ల నిషేధాన్ని సవాలు చేస్తూ పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ మంగళవారం అప్పీల్ పిటిషన్ను దాఖలు చేశాడు. దాంతో పీసీబీ ఈ అంశాన్ని విచారించడానికి స్వతంత్ర హోదా కలిగిన ఒక ప్యానెల్ను ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్ సభ్యులు మరోసారి ఉమర్æ వాదనలను వింటారు. ఈ ఏడాది జరిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్ సందర్భంగా తనను సంప్రదించిన బుకీల సమాచారాన్ని గోప్యంగా ఉంచడంతో ఆగ్రహించిన పీసీబీ ఉమర్పై మూడేళ్ల నిషేధాన్ని విధించింది. పాక్ తరఫున గత ఏడాది అక్టోబర్లో చివరి మ్యాచ్ ఆడిన ఉమర్ అక్మల్... ఇప్పటి వరకు 16 టెస్టులు, 121 వన్డేలు, 84 టి20ల్లో తన దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. -
‘అధికారుల్ని ముప్పుతిప్పలు పెట్టాడు’
కరాచీ: అవినీతి ఆరోపణలపై మూడేళ్ల నిషేధాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్లో కనీసం పశ్చాత్తాపం ఎక్కడా కనబడటం లేదని పీసీబీ క్రమశిక్షణా ప్యానల్ పేర్కొంది. తనకు పడిన నిషేధంపై ఎటువంటి చింతా లేని అక్మల్.. బోర్డుకు కూడా క్షమాపణలు తెలుపలేదని ప్యానల్ చీఫ్ ఫజల్ ఈ మిరాన్ చౌహాన్ తెలిపారు. ఉమర్ అక్మల్ కేసులో సమగ్ర నివేదికను పీసీబీకి అందజేసిన ఫజల్.. దర్యాప్తు చేసేటప్పుడు కూడా అధికారుల్నిముప్పు తిప్పలు పెట్టడన్నారు. కనీసం బాధ్యత లేకుండా విచారణకు సైతం సహకరించలేదన్నారు. ఆర్టికల్ 2.4.4 నియమావళిని అక్మల్ అతిక్రమించిన కారణంగా అతనిపై సుదీర్ఘ కాలం నిషేధం పడిందన్నారు. బుకీలు సంప్రదించినప్పుడు దాన్ని బోర్డుకు చెప్పకుండా దాచి పెట్టడం అతి పెద్ద నేరమని ఫజల్ తెలిపారు. దీనిలో భాంగానే ఉమర్ అక్మల్ మూడేళ్ల నిషేధాన్ని చవిచూడాల్సి వచ్చిందన్నారు. ఉమర్ అక్మల్ విచారణకు సహకరించకపోవడంతోనే రెండు నెలల సమయం పట్టిందన్నారు.(అతనొక మూర్చ రోగి: పీసీబీ మాజీ చైర్మన్) పీఎస్ఎల్కు సంబంధించి మ్యాచ్ ఫిక్సింగ్ చేయమంటూ అక్మల్ను కొందరు సంప్రదించారు. దానికి అక్మల్ అంగీకరించలేదు. కానీ తనను బుకీలు సంప్రదించిన విషయాన్ని గోప్యంగా ఉంచాడు. ఈ విషయంపై కొన్ని నెలల క్రితం బయటపడటంతో ఉమర్పై వేటు తప్పలేదు. ఉమర్పై నిషేధమే సబబు అని భావించి పీసీబీ ఈ నిర్ణయం తీసుకుంది. మరొకవైపు ఫిట్నెస్ టెస్టుకు హాజరైన క్రమంలో ట్రైనర్తో ఉమర్ దూకుడుగా వ్యవహరించాడనే అపవాదు కూడా ఉంది. ఆ సమయంలోనే అక్మల్పై వేటు పడుతుందని భావించినా దాని నుంచి తప్పించుకున్నాడు.కేవలం ఒక వార్నింగ్తో పీసీబీ సరిపెట్టడంతో ఉమర్ బయటపడ్డాడు. అయితే ఫిక్సింగ్ వివాదంలో మాత్రం అక్మల్ నిషేధాన్ని చవిచూడాల్సి వచ్చింది. గతంలో మికీ ఆర్థర్ కోచ్గా ఉన్న సమయంలో కూడా ఉమర్ ప్రవర్తన విసుగు తెప్పించేది. ఆర్థర్పై పలు మార్లు బహిరంగ విమర్శలు చేసి తరచు వార్తల్లో నిలిచేవాడు ఉమర్. తన అంతర్జాతీయ కెరీర్లో 16 టెస్టులు, 121 వన్డేలు, 84 టి20లను ఉమర్ ఆడాడు.గత అక్టోబర్లో పాకిస్తాన్ తరఫున అక్మల్ చివరిసారి ప్రాతినిథ్యం వహించాడు. (ధావన్ ఒక ఇడియట్.. స్ట్రైక్ తీసుకోనన్నాడు..!) -
‘ఆ క్రికెటర్ ఒక మూర్చ రోగి’
కరాచీ: అవినీతి ఆరోపణలపై ఇటీవల మూడేళ్ల పాటు నిషేధానికి గురైన పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్పై పీసీబీ మాజీ చైర్మన్ నజామ్ సేథీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమర్ ఒక మూర్చ రోగి అంటూ మరో కొత్త వివాదానికి తెరలేపారు. తాను పీసీబీ చైర్మన్గా,ఎగ్జిక్యూటివ్ కమిటీ హెడ్గా ఉన్నసమయంలో తాను ఎదుర్కొన్న తొలి సమస్య ఉమర్దేనని పేర్కొన్నారు. ఉమర్కు మూర్చ ఉన్నట్లు అప్పటి మెడికల్ రిపోర్ట్ల్లో వెల్లడైందని, కానీ దానిని సెలక్షన్ కమిటీ సీరియస్గా తీసుకోలేదన్నారు. అతనికి మూర్చ ఉండటం వల్లే వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటాడని సేథీ తెలిపారు. అయితే తనకు మూర్చ రోగిననే విషయాన్ని అంగీకరించడానికి ఉమర్ సిద్ధంగా లేడనే విషయాన్ని కూడా ఆయన తేల్చిచెప్పారు. గత తన పీసీబీకి చేసిన సేవల్లో ఉమర్తో పెద్ద సమస్యగా ఉండేదన్నారు. దాంతోనే రెండు నెలల పాటు అతన్ని క్రికెట్కు దూరంగా పెట్టానని, ఆ తర్వాత సెలక్షన్ కమిటీ లైట్గా తీసుకోవడంతో క్రికెట్ను తిరిగి కొనసాగించడన్నాడు. సెలక్షన్ కమిటీ విషయాల్లో తలదూర్చకూడదనే ఉద్దేశంతోనే తాను అప్పుడు మౌనంగా ఉండిపోయానన్నాడు. (తమ్ముడూ... సచిన్, ధోని, కోహ్లిలను చూసి నేర్చుకో) ఇప్పుడు ఉమర్పై మూడేళ్ల నిషేధం పడటంతో అతని కెరీర్ గిసిపోయినట్లేనని సేథీ తెలిపారు. తాను ఎప్పుడూ ఉమర్ కెరీర్ గురించి ఆందోళన చెందుతూనే ఉండేవాడినని, నియమావళిని అతిక్రమించడంతో అతని కెరీర్ను నాశనం చేసుకున్నాడన్నాడు. ఉమర్పై విధించిన మూడేళ్ల నిషేధంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకునే ప్రసక్తే లేదని సేథీ అభిప్రాయపడ్డారు. కొన్ని రోజుల క్రితం ఉమర్ అక్మల్పై పీసీబీ మూడేళ్ల నిషేధాన్ని విధించింది. బోర్డు నియమావళిలోని ఆర్టికల్ 2.4.4ను అతిక్రమించినట్లు దర్యాప్తులో తేలడంతో అతనిపై వేటు వేశారు. రెండు నెలలపాటు విచారించిన తర్వాత ఉమర్పై నిషేధమే సబబుగా భావించి పీసీబీ నిర్ణయం తీసుకుంది. పీఎస్ఎల్లో ఒక బుకీ తనను సంప్రదించాడనే విషయాన్ని దాచి పెట్టడంతోనే ఉమర్పై వేటుకు కారణమైంది.మరొకవైపు ఫిట్నెస్ టెస్టుకు హాజరైన క్రమంలో ట్రైనర్తో ఉమర్ దూకుడుగా వ్యవహరించాడనే అపవాదు కూడా ఉంది. అంతుకుముందు మికీ ఆర్థర్ కోచ్గా ఉన్న సమయంలో కూడా ఉమర్ ప్రవర్తన విసుగు తెప్పించేంది. ఆర్థర్పై పలు మార్లు బహిరంగ విమర్శలు చేసి వార్తల్లోకెక్కాడు ఉమర్. తన అంతర్జాతీయ కెరీర్లో 16 టెస్టులు, 121 వన్డేలు, 84 టి20లను ఉమర్ ఆడాడు. (అక్తర్పై ‘పీసీబీ’ పరువు నష్టం కేసు) -
షోయబ్ అక్తర్పై ‘పీసీబీ’ పరువు నష్టం కేసు
కరాచీ: పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్పై పీసీబీ లీగల్ అడ్వైజర్ తఫాజ్జుల్ రిజ్వి పరువు నష్టం కేసు వేశారు. దాంతో పాటు అక్తర్పై క్రిమినల్ కేసును కూడా ఫైల్ చేశారు. అవినీతి ఆరోపణల్లో భాగంగా పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ ఉమర్ అక్మల్పై మూడేళ్లు నిషేధం విధించిన సందర్భంలో పీసీబీ లీగల్ డిపార్ట్మెంట్పై అక్తర్ అసంబద్ధ వ్యాఖ్యలు చేశాడు. ఉమర్ అక్మల్ మూడేళ్ల నిషేధంలో పీసీబీ లీగల్ అడ్వైజరీ తీసుకున్న నిర్ణయాలను తప్పుబట్టాడు. దీనిపై ఒక వీడియో కూడా విడుదల చేసి బహిరంగ చర్చకు ఆజ్యం పోశాడు. అక్తర్ వైఖరితో విసుగుచెందిన పీసీబీ లీగల్ అడ్వైజర్ రిజ్వి పరువు నష్టం కేసును వేశారు. న్యాయపరమైన అంశాలు మాట్లాడేటప్పుడు అక్తర్ కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యాఖ్యానిస్తే మంచిదనే సలహా ఇచ్చారు. దీనిపై పీసీబీ కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. అసలు అక్తర్ బహిరంగంగా పీసీబీ లీగల్ డిపార్ట్మెంట్తో పాటు తమ అడ్వైజరీపై ఇలా ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నించింది. ఇది అక్తర్కు సరికాదని మండిపడింది. (తమ్ముడూ... సచిన్, ధోని, కోహ్లిలను చూసి నేర్చుకో) ఇటీవల ఉమర్ అక్మల్కు అనుకూలంగా అక్తర్ మాట్లాడుతూ తన యూట్యూబ్ చానల్లో వీడియోను విడుదల చేశారు. ప్రధానంగా మూడేళ్ల నిషేధాన్ని తప్పుబట్టాడు. ఇది పీసీబీ లీగల్ అడ్వైజరీ అసమర్థవత వల్లే ఉమర్కు మూడేళ్ల శిక్ష పడిందంటూ వ్యాఖ్యానించాడు. అదే సమయంలో రిజ్విపై ఆరోపణలు చేశాడు. చాలా సున్నితమైన అంశాల్లో రిజ్వికి అనుభవం లేదంటూ విమర్శించాడు. కాగా, ఉమర్ అక్మల్పై పీసీబీ మూడేళ్ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. పీసీబీ అవినీతి నిరోధక విభాగం అతనిపై రెండు నెలలుగా విచారించింది. చివరకు సోమవారం శిక్ష ఖరారు చేసింది. అయితే ఉమర్పై నిషేధం విధించడానికి గల స్పష్టమైన కారణాలను పీసీబీ వెల్లడించలేదు. కానీ బోర్డు నియమావళిలోని ఆర్టికల్ 2.4.4ను అతిక్రమించినట్లు దర్యాప్తులో తేలడంతో వేటు వేశామని పీసీబీ ఒక ప్రకటనలో పేర్కొంది.(అతని కంటే మాలికే బెటర్: చహల్) -
తమ్ముడూ... సచిన్, ధోని, కోహ్లిలను చూసి నేర్చుకో
న్యూఢిల్లీ: భారత క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోనిలను చూసి తన తమ్ముడు ఉమర్ అక్మల్ బుద్ధి తెచ్చుకోవాలని పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ అన్నాడు. వారిని చూసైనా మైదానంలోనూ, బయట ఎలా ప్రవర్తించాలో తెలుసుకోలంటూ ఉమర్ అక్మల్కు సూచించాడు. ఉమర్పై తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మూడేళ్ల పాటు నిషేధం విధించింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) సందర్భంగా బుకీలు తనను సంప్రదించిన విషయాన్ని రహస్యంగా ఉంచినందుకుగానూ పీసీబీ ఈ శిక్ష విధించింది. నిషేధ కాలంలో ఏ స్థాయి క్రికెట్ ఆడకూడదంటూ హెచ్చరించింది. ఈ సందర్భంగా కమ్రాన్ అక్మల్ మాట్లాడుతూ ‘ఉమర్ ఇంకా యువకుడు. అతను తప్పు చేసి ఉంటే ఇతరులను చూసి నేర్చుకోవాలి. జీవితంలో ఎన్నో ప్రలోభాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి సమయంలో విరాట్, సచిన్, ధోని జీవితాల నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. వివాదాలకు దూరంగా సచిన్ నీతిగా క్రికెట్ ఆడాడు. విరాట్, ధోని, బాబర్ ఆజమ్ల నుంచి ఉమర్ ఇంకా చాలా నేర్చుకోవాలి’ అని కమ్రాన్ అన్నాడు. -
పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్పై నిషేధం
కరాచీ: పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్పై ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) మూడేళ్ల నిషేధం విధించింది. పీసీబీ అవినీతి నిరోధక విభాగం అతనిపై రెండు నెలలుగా విచారించింది. చివరకు సోమవారం శిక్ష ఖరారు చేసింది. అయితే ఉమర్పై నిషేధం విధించడానికి గల స్పష్టమైన కారణాలను పీసీబీ వెల్లడించలేదు. కానీ బోర్డు నియమావళిలోని ఆర్టికల్ 2.4.4ను అతిక్రమించినట్లు దర్యాప్తులో తేలడంతో వేటు వేశామని పీసీబీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఫిబ్రవరిలో ఉమర్ అక్మల్ రెండు అనుచిత, అసందర్భ ఘటనలకు బాధ్యుడయినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. అందుకే మూడేళ్ల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ట్విట్టర్లో పోస్ట్ చేసింది. పాక్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో అతని సందేహాస్పద ప్రవర్తనే నిషేధానికి కారణం కావొచ్చని తెలిసింది. 29 ఏళ్ల ఉమర్ అక్మల్ మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ కమ్రాన్ అక్మల్కు సొంత తమ్ముడు. ప్రస్తుత కెప్టెన్ బాబర్ ఆజమ్కు కూడా వరుసకు సోదరుడవుతాడు. ఉమర్ అంతర్జాతీయ కెరీర్లో 16 టెస్టులు, 121 వన్డేలు, 84 టి20లు ఆడాడు. -
డైలమాలో అక్మల్ కెరీర్..!
కరాచీ: పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ కెరీర్ డైలమాలో పడింది. మ్యాచ్ ఫిక్సింగ్ కోసం బుకీలతో అక్మల్ సంప్రదింపులు జరిపినట్లు వెలుగులోకి రావడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అతనిపై ఇటీవల సస్పెన్షన్ విధించిన విషయం తెలిసిందే. అక్మల్పై విచారణ పూర్తయ్యే వరకూ అతను ఎటువంటి క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనవద్దని పీసీబీ ఆదేశాలు జారీ చేసింది. అయితే అక్మల్పై పాక్ క్రికెట్ బోర్డు జీవితకాల నిషేధం విధించే అవకాశం ఉంది.అవినీతి నిరోధక కోడ్లోని పలు ఉల్లంఘనలకు పాల్పడినందున ఉమర్ అక్మల్కు పీసీబీ నోటీసులు జారీ చేసింది.(ఉమర్.. మా డబ్బులు మాకిచ్చేయ్!) మ్మ్యాచ్ ఫిక్సింగ్కు సంబంధించిన విషయాలను ఉద్దేశపూర్వకంగా బోర్డు అవినీతి నిరోధక శాఖ అధికారులకు తెలియజేయనందున ఈ నోటీసులు జారీ చేసింది. దీనిపై మార్చి 31 లోపు లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని పేర్కొంది. ఒకవేళ అక్మల్ చెప్పే కారణాలతో పీసీబీ సంతృప్తి చెందకపోతే.. అతడిపై ఆరు నెలల నుంచి గరిష్టంగా జీవితకాల నిషేధం విధించే అవకాశం ఉంది. గతేడాది ఆగస్టులో శ్రీలంకపై జరిగిన టీ20 మ్యాచ్లో పాకిస్తాన్ తరపున అక్మల్ చివరిసారి ఆడాడు. ఆ సిరీస్లో అక్మల్ విఫలం కావడంతో.. అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో పాకిస్తాన్ జట్టులో చోటు కోల్పోయాడు. ప్రస్తుతం వాయిదా పడిన పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ఆడేందుకు సిద్దమయ్యాడు. కానీ.. ఇంతలోనే అక్మల్పై తాత్కాలిక నిషేధం విధించడంతో పీఎస్ఎల్కు అక్మల్ దూరమయ్యాడు. -
ఉమర్.. మా డబ్బులు మాకిచ్చేయ్!
కరాచీ: ఇటీవల పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ ఉమర్ అక్మల్ను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అవినీతి నిరోధక నియమావళిలోని ఆర్టికల్ 4.7.1 కింద అక్మల్ సస్పెండ్ అయ్యాడు. గతంలో పీఎస్ఎల్ ఆడే క్రమంలో తనను ఒక బుకీ సంప్రదించిన విషయాన్ని దాచి పెట్టిన కారణంగానే అక్మల్పై నిషేధం విధించారు. అక్మల్పై విచారణ పూర్తయ్యే వరకూ అతను ఎటువంటి కార్యకలాపాల్లో పాల్గొనకుండా పీసీబీ ఆదేశాలు జారీ చేసింది. దాంతో ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)ను అక్మల్ మిస్సయ్యాడు. పీఎస్ఎల్ క్వెట్టా గ్లాడియేటర్స్కు ప్రాతినిథ్యం వహించాల్సిన అక్మల్ సస్పెన్షన్ కారణంగా ఆ లీగ్కు దూరం కావాల్సి వచ్చింది. దాంతో అక్మల్కు మరో తలనొప్పి ఎదురైంది. (ఇక్కడ చదవండి: అక్మల్ను సస్పెండ్ చేశారు..!) పీఎస్ఎల్ ఆడటానికి తాము ముందుగా ఇచ్చిన అడ్వాన్స్ను తిరిగి ఇచ్చేయాలంటూ గ్లాడియేటర్స్ స్పష్టం చేసింది. ఈ మేరకు పీఎస్ఎల్ నిర్వహిస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు విన్నవించింది. ‘అక్మల్ సస్పెండ్ అయిన కారణంగా అతనికి చెల్లించిన 70శాతం డబ్బును తిరిగి ఇచ్చేయండి. అతను చేసుకున్న కాంట్రాక్ట్లో భాగంగా చెక్ రూపంలో చెల్లించాం. దాన్ని పీసీబీ ద్వారానే సదరు క్రికెటర్కు అందజేశాం. దాంతో ఉమర్కు అందజేసిన డబ్బులు విషయంలో పీసీబీదే బాధ్యత’ అని ఫ్రాంచైజీ అధికారి ఒకరు తెలిపారు. పీఎస్ఎల్లో ఆటగాళ్ల నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు నగదును క్రికెట్ బోర్డు ద్వారానే ఇప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్మల్కు 70 శాతం కాంట్రాక్ట్ మొత్తాన్ని చెల్లించారు. (ఇక్కడ చదవండి: ‘జీవితకాల నిషేధం విధించండి’) అబ్దుల్ రజాక్ను ‘అమ్మ’ను చేసేశాడు..! -
‘జీవితకాల నిషేధం విధించండి’
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్లో మళ్లీ మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం రేగడంతో ఆ జట్టు మాజీ కెప్టెన్, ప్రముఖ వ్యాఖ్యత రమీజ్ రాజా ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు అవినీతికి పాల్పడ్డ పాక్ క్రికెటర్లపై జీవితకాలం నిషేధం విధించేలా పార్లమెంట్లో చట్టం చేయాలని ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు విజ్ఞప్తి చేశాడు. గతంలో పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో ఫిక్సింగ్ చేయమని తనను కొంతమంది సంప్రదించిన విషయాన్ని పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ దాచి పెట్టాడు. ఇది తాజా విచారణలో తేలడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అవినీతి నిరోధక నియమావళిలోని ఆర్టికల్ 4.7.1 కింద అతన్ని సస్పెండ్ చేసింది. దీనిపై పూర్తి విచారణ జరిగే వరకూ అక్మల్పై నిషేధం కొనసాగుతుందని పేర్కొంది. దీంతో పీసీబీ అవినీతి నిరోధక విభాగం విచారణ ముగిసే వరకు అక్మల్ ఎలాంటి క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం లేదు. ఈ క్రమంలోనే తాజా పీఎస్ఎల్ను అక్మల్ మిస్సయ్యాడు. (ఇక్కడ చదవండి: అబ్దుల్ రజాక్ను ‘అమ్మ’ను చేసేశాడు..!) అయితే ఈ తరహా క్రికెటర్లను అసలు క్రికెట్ ఆడకుండా జీవితకాలం నిషేధం విధించాలని రమీజ్ రాజా డిమాండ్ చేస్తున్నాడు. ఈ మేరకు పార్లమెంట్లో చట్టం చేయాలని ప్రధాని ఇమ్రాన్ను కోరాడు. ‘ షార్జిల్, ఖలీద్ల ఫిక్సింగ్ వ్యవహారం నిన్ననో-మొన్ననో జరిగినట్లు ఉంది. అది ఇంకా కళ్లు ముందు ఉండగానే మరొక ఫిక్సింగ్ కలకలం. పాకిస్తాన్ క్రికెట్లో ఇలా జరగుతూ ఉండటం నన్ను తీవ్రంగా కలచి వేస్తోంది. మరొకవైపు అసహ్యం కూడా వేస్తోంది. ఇక నుంచి ఫిక్సింగ్ చేసేవాళ్లు జీవిత కాలం నిషేధం విధించేలా చట్టం అవసరముంది. న్యూజిలాండ్ తరహా దేశాల్లో ఫిక్సింగ్ చేస్తే చాలా కాలం వరకూ వారికి అవకాశమే ఉండదు. ఫిక్సింగ్లో దోషి అని తేలితే జీవితం కాలం వేటే సరైనది’ రమీజ్రాజా పేర్కొన్నాడు. -
ఎట్టకేలకు అక్మల్ను సస్పెండ్ చేశారు..!
కరాచీ: పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ ఉమర్ అక్మల్పై ఎట్టకేలకు సస్పెన్షన్ వేటు పడింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అవినీతి నిరోధక నియమావళిలోని ఆర్టికల్ 4.7.1 కింద ఆయనను సస్పెండ్ చేశారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పీసీబీ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో పీసీబీ అవినీతి నిరోధక విభాగం విచారణ ముగిసే వరకు అక్మల్ ఎలాంటి క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం లేదు. ‘ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నందున పీసీబీ దీనిపై ముందు ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయబోదు’ అని పీసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. గతంలో పీఎస్ఎల్లో భాగంగా ఒక బుకీ సంప్రదించిన విషయాన్ని దాచి పెట్టిన కారణంగానే అతనిపై నిషేధం విధించినట్లు తెలుస్తోంది. ఓ ఫిట్నెస్ టెస్ట్ సందర్భంగా ఉమర్ అక్మల్ దురుసుగా ప్రవర్తించినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే అతడిపై సస్పెన్షన్ వేటు పడాల్సి ఉండగా దాని నుంచి తప్పించుకున్నాడు. లాహార్లోని నేషనల్ క్రికెట్ అకాడమీ వద్ద జరిగిన ఫిట్నెస్ టెస్టులో విఫలమైన అక్మల్... అక్కడి సిబ్బందితో అభ్యంతరకరంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు వచ్చాయి. (ఇక్కడ చదవండి: మేము వదిలేసుకోవడానికి సిద్ధం: పాకిస్తాన్) కొన్ని రోజుల క్రితం ఈ ఘటనపై అక్మల్ క్షమాపణలు కోరిన క్రమంలో అతనిపై ఎటువంటి నిషేధం విధించడం లేదని పీసీబీ తెలిపింది. ఇప్పుడు అవినీతి నిరోధక నియమావళిని అతిక్రమించిన కారణంగా అక్మల్ను సస్పెండ్ చేశారు. గతేడాది ఆగస్టులో శ్రీలంకపై జరిగిన టీ20 మ్యాచ్లో పాకిస్తాన్ తరపున అక్మల్ చివరిసారి కనిపించాడు. ఆ సిరీస్లో అక్మల్ ఘోరంగా విఫలం కావడంతో అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో పాకిస్తాన్ జట్టులో అక్మల్ చోటు కోల్పోయాడు. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) ఆరంభానికి ముందు అక్మల్ను సస్పెండ్ చేయడం గమనార్హం. ఈ రోజు నుంచి పీఎస్ఎల్ ఆరంభం కానుంది. (ఇక్కడ చదవండి: అబ్దుల్ రజాక్ను ‘అమ్మ’ను చేసేశాడు..!) -
అబ్దుల్ రజాక్ను ‘అమ్మ’ను చేసేశాడు..!
కరాచీ: ఇటీవల పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ ఉమర్ అక్మల్ అన్ని విధాల విమర్శల పాలవుతున్నాడు. కొన్ని రోజుల క్రితం ఫిట్నెస్ పరీక్షలకు హాజరై ట్రైనీతో గొడవపడిన అక్మల్.. మరొకసారి తాను చేసిన ట్వీట్తో నవ్వుల పాలయ్యాడు. ఇక్కడ పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ను ‘అమ్మ’ను చేయడంతో నెటిజన్ల విమర్శలకు గురయ్యాడు. ఇంగ్లిష్లో అంతగా ప్రావీణ్యం లేని ఉమర్ అక్మల్.. రజాక్తో దిగిన ఫొటోను ట్వీటర్లో జత చేసి ‘Mother from another Brother’ అనే క్యాప్షన్ జోడించాడు. ఇక్కడ కాస్త తికమక పడ్డ అక్మల్.. ఏకంగా రజాక్ను ‘అమ్మ’ను చేయడం ఒకవైపు నవ్వులు పూయించడంతో పాటు మరొకవైపు విమర్శల పాలు చేసింది. వాస్తవానికి ‘Brother from another Mother’ అనే విషయాన్ని ఉమర్ అక్మల్ చెప్పాలనుకున్నాడు.. కానీ.. దాన్ని రివర్స్లో ఉమర్ అక్మల్ వాడేశాడు. (ఇక్కడ చదవండి: నాకు కొవ్వుందా.. ఏది చూపించు!) దీంతో.. నెటిజన్లు అతనిపై సెటైర్ల వర్షం కురిపించేశారు. అభిమానుల విమర్శలతో తేరుకున్న ఉమర్ అక్మల్.. వెంటనే ఆ ట్వీట్ని డిలీట్ చేశాడు. అయితే అప్పటికే అది వైరల్గా మారిపోవడంతో ఉమర్ అక్మల్ మరొకసారి ‘ట్రెండ్’ అయిపోయాడు. ‘ఎందుకురా నాయనా.. ఇంగ్లిష్ రాకపోతే, నీకు తెలిసిన హిందీలో ట్వీట్ చేయొచ్చు కదా’ అని ఒకరు ఎద్దేవా చేయగా, ‘ నీకు పాకిస్తాన్ జట్టులో అవకాశం రాకపోతే, దాన్ని దక్కించుకునే ప్రయత్నం గట్టిగా చేయి కానీ ఇలా అభాసు పాలుకావొద్దు’ అని మరొకరు చమత్కరించారు. ‘An apple a day keeps the doctor away’ అనే సామెతను ‘A doctor a day Keeps the apple away’ అన్నట్లు ఉంది ఉమర్ అక్మల్ సర్ అంటూ విమర్శిస్తున్నారు. -
ఉమర్ అక్మల్పై నో యాక్షన్!
కరాచీ: పాకిస్తాన్ నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) ట్రైనర్ను కొట్టినంత పని చేసిన ఆ దేశ వెటరన్ బ్యాట్స్మన్ ఉమర్ అక్మల్పై ఎటువంటి చర్యలు తీసుకోకుండానే ఆ వివాదాన్ని పీసీబీ ముగించేసింది. ఇటీవల నిర్వహించిన ఫిట్నెస్ టెస్టుల్లో భాగంగా ట్రైనర్తో అతిగా ప్రవర్తించిన ఉమర్ అక్మల్పై జరిమానాతో పాటు నిషేధం కూడా ఉంటుందని హరూన్ రషీద్ నేతృత్వంలోని ఎంక్వైరీ కమిటీ స్పష్టం చేసింది. అతన్ని తాత్కాలికంగా పాకిస్తాన్ దేశవాళీ మ్యాచ్లు ఆడకుండా నిషేధం విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విచారణ తర్వాత హరూన్ పేర్కొన్నాడు. దీనిపై నివేదకను కూడా పీసీబీ అందజేశాడు. అయితే పీసీబీ మాత్రం పేరుకే కమిటీ వేసి విచారణ చేపట్టినా అతనిపై చర్యలకు ముందుడుగు వేయలేదు. తన ప్రవర్తనపై క్షమాపణలు చెప్పడంతో అక్మల్పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరొకసారి ఆ తప్పు చేయొద్దని హెచ్చరించి వదిలేసింది. దాంతో నిషేధం నుంచి అక్మల్ తప్పించుకున్నట్లయ్యింది. గతంలో మికీ ఆర్థర్ కోచ్గా ఉన్న సమయంలో కూడా అక్మల్ ప్రవర్తన పీసీబీకి తలనొప్పిగా ఉండేది. పలుమార్లు కోచ్ను విమర్శించడంతో పాటు ఫిట్నెస్ టెస్టును కూడా సీరియస్గా పట్టించుకునేవాడు కాదు. అయినప్పటికీ అతనిపై చర్యలు శూన్యం. కొన్ని రోజుల క్రితం నిర్వహించిన పలురకాల ఫిట్నెస్ టెస్టుల్లో విఫలం కావడంతో పాటు తనకు కొవ్వు ఉందంటావా అంటూ ట్రైనర్తో వాగ్వాదానికి దిగాడు. తనకు కొవ్వు ఎక్కడ ఉందో చూపించూ అంటూ అతిగా ప్రవర్తించాడు. చొక్కా విప్పి మరీ బెదిరింపు చర్యలకు దిగాడు. దీనిపై కోచ్ మిస్బావుల్ హక్-పీసీబీలకు సదరు ట్రైనర్ ఫిర్యాదు చేశాడు. దానిపై కమిటీ వేసిన పీసీబీ.. ఎటువంటి చర్యలు తీసుకోకుండానే చేతులు దులుపేసుకోవడం పాకిస్తాన్ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతేడాది అక్టోబర్లో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ ద్వారా పాకిస్తాన్ క్రికెట్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన వికెట్ కీపర్ ఉమర్ అక్మల్ వరుసగా రెండు గోల్డెన్ డక్లతో విమర్శల పాలై జట్టుకు మరొకసారి దూరమయ్యాడు. ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా ఉన్న మిస్బావుల్ హక్.. ఆటగాళ్ల ఫిట్నెస్ టెస్టులపై సీరియస్గా దృష్టిసారించాడు. జూనియర్, సీనియర్ స్థాయిలో క్రికెటర్లు ఏ ఫిట్నెస్ టెస్టులో విఫలమైనా అతన్ని పక్కకు పెట్టాలనే తలంపుతో ముందుకు వెళుతున్నాడు. ఇది కేవలం అంతర్జాతీయ మ్యాచ్లతో పాటు దేశవాళీ మ్యాచ్లకు కూడా వర్తింప చేస్తే ఫిట్నెస్ ప్రమాణాలు పెరుగుతాయనే భావనలో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఉమర్ అక్మల్కు ఫిట్నెస్ నిర్వహించగా ఫెయిల్ అయ్యాడు. -
నాకు కొవ్వుందా.. ఏది చూపించు!
కరాచీ: గతేడాది అక్టోబర్లో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ ద్వారా పాకిస్తాన్ క్రికెట్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన వికెట్ కీపర్ ఉమర్ అక్మల్ వరుసగా రెండు గోల్డెన్ డక్లతో విమర్శల పాలై జట్టుకు మరొకసారి దూరమయ్యాడు. అయితే తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నాడు ఉమర్ అక్మల్. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) నిర్వహించిన ఫిట్నెస్ టెస్టులకు హాజరైన ఉమర్ అక్మల్. అక్కడ ఎన్సీఏ అకాడమీలో ఉన్న ట్రైనర్తో అతిగా ప్రవర్తించాడు. ఉమర్ అక్మల్కు ఫిట్నెస్ నిర్వహించే క్రమంలో ట్రైనర్తో వాగ్వాదానికి దిగాడు. తనకు ఎక్కడ కొవ్వుందో చూపించూ అంటూ వాదించాడు. ఒక ఫిట్నెస్ టెస్టు ఫెయిల్ అయిన తర్వాత సహనం కోల్పోయిన ఉమర్ అక్మల్ నోటికి వచ్చినట్లు మాట్లాడాడు. ఇది పీసీబీ పెద్దల దృష్టికి వెళ్లడంతో ఉమర్ అక్మల్పై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. తదుపరి దేశవాళీ టోర్నమెంట్ నుంచి అక్మల్ను నిషేధించే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా ఉన్న మిస్బావుల్ హక్.. ఆటగాళ్ల ఫిట్నెస్ టెస్టులపై సీరియస్గా దృష్టిసారించాడు. జూనియర్, సీనియర్ స్థాయిలో క్రికెటర్లు ఏ ఫిట్నెస్ టెస్టులో విఫలమైనా అతన్ని పక్కకు పెట్టాలనే తలంపుతో ముందుకు వెళుతున్నాడు. ఇది కేవలం అంతర్జాతీయ మ్యాచ్లతో పాటు దేశవాళీ మ్యాచ్లకు కూడా వర్తింప చేస్తే ఫిట్నెస్ ప్రమాణాలు పెరుగుతాయనే భావనలో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఉమర్ అక్మల్కు ఫిట్నెస్ నిర్వహించగా ఫెయిల్ అయ్యాడు. దాంతో ఫిట్నెస్ టెస్టులు నిర్వహించే ట్రైనర్ను తిట్టిపోశాడు. చొక్కా విప్పి మరీ తన కొవ్వును చూపించు అంటూ బెదిరింపు చర్యలకు దిగాడు. గతంలో మికీ ఆర్థర్ కోచ్గా ఉన్న సమయంలో కూడా ఉమర్ అక్మల్ పదేపదే ఫిట్నెస్ టెస్టుల్లో విఫలమయ్యాడు. అప్పుడు కూడా ఆర్థర్పై విమర్శలు గుప్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి. -
తుప్పు పట్టిన తుపాకీలతో లాభం ఏమిటి?
లాహోర్: చాలాకాలం తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టులో రీఎంట్రీ ఇచ్చిన ఉమర్ అక్మల్ ఇప్పుడు విమర్శకులకు బాగానే పనిచెప్పాడు. శ్రీలంకతో వరుస రెండు టీ20ల్లో గోల్డెన్ డక్(ఆడిన తొలి బంతికే) పెవిలియన్ చేరి ట్రెండింగ్లోకి వచ్చేశాడు. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో మూడో స్థానంలోబ్యాటింగ్కు దిగి గోల్డెన్ డకౌట్ కాగా రెండో మ్యాచ్లో ఐదో స్థానంలో బ్యాటింగ్ చేపట్టి మరోసారి మొదటి బంతికే ఔటయ్యాడు. కాగా, రెండో టీ20కి ముందు ఉమర్ అక్మల్తో పాటు మరో క్రికెటర్ అహ్మద్ షెహజాద్లకు అండగా నిలిచాడు కోచ్ మిస్బావుల్ హక్. వారిని విమర్శలతో ప్రమాదంలోకి నెట్టవద్దని, స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వాలని మద్దతు ప్రకటించాడు. అయితే రెండో టీ20లో ఉమర్ అక్మల్-షెహజాద్లు నిరాశపరచడంతో ట్వీటర్లో విమర్శల వర్షం కురుస్తోంది. ఇక్కడ పాకిస్తాన్ కోచ్ మిస్బావుల్ హక్ను కూడా టార్గెట్ చేస్తూ నెటిజన్లు మండిపడుతున్నారు. ‘ కాలం చెల్లిపోయిన తుప్పు పట్టిన తుపాకీలతో లాభం ఏమిటి?’ అంటూ నిలదీస్తున్నారు. ‘ బ్యాక్ టు బ్యాక్ గోల్డెన్ డక్స్. రీఎంట్రీలో ఇది అత్యంత ప్రదర్శన’ అంటూ మరొకరు ట్వీట్ చేశారు. ‘ పాపం మిస్బావుల్.. ఉమర్ అక్మల్ వరుస గోల్డెన్ డక్లతో మిస్బా ఇబ్బందిల్లో పడ్డాడు’ అని మరొక నెటిజన్ చమత్కరించారు. ‘ ఇక మీ ఇద్దర్నీ చూడాలని అనుకోవడం లేదు’ అంటూ మరొకరు పేర్కొన్నారు. పాకిస్తాన్తో వన్డే సిరీస్ను కోల్పోయిన శ్రీలంక జట్టు టి20 సిరీస్లో ఆకట్టుకుంది. మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు టి20ల సిరీస్ను శ్రీలంక 2–0తో కైవసం చేసుకుంది. లాహోర్లో సోమవారం జరిగిన రెండో టి20లో లంక 35 పరుగుల తేడాతో పాకిస్తాన్పై గెలిచింది. మొదట లంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. రాజపక్స (77; 4 ఫోర్లు, 6 సిక్స్లు) చెలరేగాడు. పాక్ 19 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. ఇమద్ వసీమ్ (47) రాణించాడు. రేపు ఆఖరి మ్యాచ్ ఇక్కడే జరుగుతుంది. శ్రీలంక సీనియర్ జట్టులో పది మంద వరకూ పాక్ పర్యటనకు రావడానికి వెనుకాడితే.. ‘జూనియర్’ జట్టుతోనే పోరుకు సిద్ధమైంది. అయితే వన్డే సిరీస్ను కోల్పోయిన లంకేయులు.. టీ20 సిరీస్లో అంచనాలు మించి రాణించారు. వరుస రెండు టీ20ల్లోనూ విజయం సాధించి తాము ఎంత ప్రమాదకరమో చాటిచెప్పారు. టీ20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న పాకిస్తాన్ను శ్రీలంక మట్టికరిపించడం గమనార్హం. -
‘ఆ ఇద్దర్నీ మరింత ప్రమాదంలోకి నెట్టకండి’
కరాచీ: సుదీర్ఘ కాలం తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టులోకి పునరాగమనం చేసిన అహ్మద్ షెహజాద్, ఉమర్ అక్మల్లకు ఆ జట్టు ప్రధాన కోచ్ మిస్బావుల్ హక్ మద్దతుగా నిలిచాడు. వారిద్దరూ వచ్చిన సత్తాచాటుకోవాలంటే కష్టమని మిస్బా పేర్కొన్నాడు. కనీసం వారిద్దరూ టచ్లోకి రావడానికి కనీస మద్దతు ఇస్తే వారు తమ పూర్వ ఫామ్ను అందిపుచుకుంటారన్నాడు. అంతేకానీ ఏదో ఒకటి రెండు ప్రదర్శనలతో తర్వాత ఆ ఇద్దరిపై విమర్శలు వారి కెరీర్ను ప్రమాదంలోకి నెట్టవద్దని సూచించాడు. ఇక ఒత్తిడిలో ఉన్న పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్కు అండగా నిలిచాడు మిస్బావుల్ హక్. ‘ప్రమాదంలో ఉన్నవారు సాయం కోసం ప్యానిక్ బటన్ నొక్కినట్లు షెహజాద్, ఉమర్ అక్మల్ విషయంలో చేయకండి. వారు తిరిగి ఫామ్లోకి వస్తారు. దయచేసి మరింత ప్రమాదంలోకి నెట్టవద్దు. వారి నుంచి ఆశించిన ప్రదర్శన రావాలంటే స్వేచ్ఛ ఇవ్వాలి. ఇక సర్ఫరాజ్ను ఒత్తిడి నుంచి బయట పడేయటం కూడా నా విధుల్లో భాగం’ అని మిస్బా పేర్కొన్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో షెహజాద్, ఉమర్ అక్మల్లు విఫలమైన నేపథ్యంలో వారిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మిస్బావుల్ మాట్లాడుతూ.. ఒక్క ప్రదర్శన కారణంగా విమర్శలు చేయడం తగదన్నాడు. వచ్చే టీ20 వరల్డ్కప్ను దృష్టిలో పెట్టుకునే ప్రయోగాలు చేస్తున్నామని చెప్పుకొచ్చాడు. -
అక్తర్ ఫిక్సింగ్ చేయమన్నాడు!
ఒంటారియో: తమ దేశానికి చెందిన ఓ మాజీ క్రికెటర్ తనను ఫిక్సింగ్ చేయమన్నాడంటూ వివాదాస్పద పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ మరో వివాదానికి తెరలేపాడు. గ్లోబల్ టీ20 కెనడా లీగ్లో భాగంగా విన్పిగ్ హాక్స్ తరఫున ఆడుతున్న అక్మల్ను ఆ జట్టు మేనేజ్మెంట్ కీలక పాత్ర పోషిస్తున్న మన్సూర్ అక్తర్ ఫిక్సింగ్ చేయమన్నాడట. ఈ విషయాన్ని కెనడా లీగ్ యాజమన్యంతో పాటు తమ అవినీతి నిరోధక విభాగానికి అక్మల్ తెలియజేనట్లు పీసీబీ వర్గాలు వెల్లడించాయి. ‘కొన్ని మ్యాచ్లు ఫిక్సింగ్ చేస్తావా’ అంటూ అక్తర్ ఆఫర్ చేసిన అక్మల్ తమ దృష్టికి తీసుకొచ్చాడని పాక్ క్రికెట్ బోర్డులోని ఒక అధికారి పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు సదరు అధికారి తెలిపారు. 61 ఏళ్ల మన్సూర్ అక్తర్ 19 టెస్టులు, 41 వన్డేలు ఆడాడు. 1980 నుంచి 1990 వరకూ పాక్ తరఫున క్రికెట్ ఆడాడు. ప్రస్తుతం గ్లోబల్ ట20 కెనడా లీగ్ విన్పిక్ హాగ్స్ మేనేజ్మెంట్ విభాగంలో సేవలందిస్తున్నాడు. ఇదిలా ఉంచితే, ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్కప్లో ఉమర్ అక్మల్కు చోటు దక్కలేదు. కోచ్ మికీ ఆర్థర్తో విభేదాల నేపథ్యంలో అక్మల్ను వరల్డ్కప్ జట్టులో ఎంపిక చేయలేదు. ఈ ఏడాది మార్చి-ఏప్రిల్లో ఆస్ట్రేలియా జరిగిన వన్డే సిరీస్లో అక్మల్ ఆకట్టుకున్నప్పటికీ అతనికి వరల్డ్కప్ జట్టులో చోటు కల్పించలేదు. -
పాక్ క్రికెటర్ నోట.. ఐపీఎల్ మాట
కరాచీ: మరో 12 రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-12 సీజన్ ప్రారంభం కానుంది. మార్చి 23వ తేదీన ఆరంభమయ్యే ఐపీఎల్ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఈ పొట్టి క్రికెట్ సంగ్రామం కోసం క్రికెట్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. క్యాష్ రిచ్ లీగ్గా పేరుగాంచిన ఐపీఎల్పై పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ పాకిస్తాన్లో జరుగుతుందంటూ నోరుజారాడు. పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్(పీఎస్ఎల్)కు బదులుగా 'ఐపీఎల్' అని వ్యాఖ్యానించి నాలుక కరచుకున్నాడు. పీఎస్ఎల్ మొత్తం పాకిస్తాన్లో జరగదు. ఈ లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి యూఏఈలో నిర్వహిస్తున్నారు. అయితే, నాకౌట్ మ్యాచ్లు లేదా పైనల్ మ్యాచ్ని మాత్రమే పాకిస్తాన్లో నిర్వహిస్తున్నారు. తాజా సీజన్లో లీగ్ మ్యాచ్లకు దుబాయి ఆతిథ్యమిస్తుండగా. ప్లే ఆఫ్ మ్యాచ్లు కరాచీలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సూపర్ లీగ్లో క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఉమర్ అక్మల్ ఓ వీడియోని ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నాడు. అందులో ‘సొంతగడ్డపై అభిమానుల మద్దతు ఉంటే.. వచ్చే ఐపీఎల్ పాకిస్తాన్లోనే జరుగుతుంది’ అని ఉమర్ అక్మల్ అన్నాడు. ఆపై వెంటనే తేరుకున్న ఉమర్ అక్మల్ సారీ.. పీఎస్ఎల్ పాకిస్తాన్లోనే జరుగుతుందని సరిదిద్దుకునే యత్నం చేశాడు. -
భారత్తో ఫిక్సింగ్ చేయమన్నారు : పాక్ క్రికెటర్
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ సంచలన ఆరోపణలు చేశాడు. 2015 వన్డే ప్రపంచకప్లో భారత్తో జరిగిన మ్యాచ్లో స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడాలని తనను బుకీలు సంప్రదించినట్లు అక్మల్ వెల్లడించాడు. ‘‘2015 ప్రపంచకప్లో భారత్తో అదే మా తొలి మ్యాచ్. ఈ సందర్భంగా నేను వరుసగా రెండు బంతులు ఆడకుండా వదిలేస్తే బుకీలు దాదాపు రూ.1.3 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారు. అంతకు ముందు కూడా అలాంటి భారీ ఆఫర్లు పెద్ద ఎత్తున వచ్చాయి, కానీ వాటిని తిరస్కరించా. వాటికి నేను విరుద్ధమని, ఇలాంటి ఉద్దేశాలతో మరోసారి నా దగ్గరకు రావద్దని వాళ్లకు గట్టిగా హెచ్చరించా’’ అని అక్మల్ చెప్పాడు. ఈ వ్యాఖ్యల అనంతరం ఐసీసీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డులు వివరణ ఇవ్వాలంటూ అక్మల్కు సమన్లు జారీ చేశాయి. 2015 ఫిబ్రవరి 15న జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో దిగిన పాక్ మహమ్మద్ షమీ బౌలింగ్ ధాటికి 224 పరుగులకు కుప్పకూలింది. దీంతో భారత్ 76 పరుగులతో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్లో కోహ్లి 107 పరుగులతో చెలరేగిపోయాడు. Umar Akmal claims he was offered $200,000 during World Cup to leave two deliveries, tells @Shoaib_Jatt that he was also offered money to skip games against India. I wonder if Akmal had ever reported these approaches, if not then this statement will get him in more troubles. pic.twitter.com/inIQLN5Np4 — Faizan Lakhani (@faizanlakhani) June 24, 2018 -
నేను బతికే ఉన్నాను : అక్మల్
-
ప్లీజ్.. నన్ను చంపొద్దు: క్రికెటర్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: అసలే ఫామ్ కోల్పోయాడు. ఆపై గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ కోసం తంటాలు పడుతున్న పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ చనిపోయాడంటూ సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొట్టాయి. 'నేను బతికే ఉన్నాను. లాహోర్లో క్షేమంగా ఉన్నాను. జాతీయ జట్టులోకి వచ్చేందుకు ఫిట్నెస్ పై దృష్టిపెట్టాను. దయచేసి నన్ను చంపోద్దంటూ' అక్మల్ ట్వీట్ చేశాడు. అయినా తాను చనిపోయానంటూ ప్రచారం జరగడంపై మరోసారి వీడియో రూపంలో స్పందించాడు. తాను నిక్షేపంగా ఉన్నానని, ఎలాంటి ఆందోళన అక్కర్లేదని వీడియో పోస్ట్ చేశాడు ఈ క్రికెటర్. 'అందరికీ నమస్కారం. అల్లా దయ వల్ల నేను ప్రాణాలతోనే ఉన్నాను. నాపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. నేను బతికే ఉన్నాను. నేషనల్ 20కప్ 2017 సెమీ ఫైనల్ మ్యాచ్లో నన్ను చూస్తారు. నేను చనిపోయానంటూ ఎలాంటి వార్తలు వ్యాప్తి చేయొద్దు. అందరికీ ధన్యవాదాలు' అంటూ ఉమర్ అక్మల్ తాను పోస్ట్ చేసిన వీడియో ద్వారా విజ్ఞప్తి చేశాడు. ఇటీవల పాకిస్తాన్లో మతఘర్షణలు చేలరేగడంతో కొందరు ప్రాణాలు కోల్పోయారు. కాగా, సోషల్ మీడియాలో ఓ నెటిజన్.. ఉమర్ ఫొటో పోస్ట్ చేస్తూ.. క్రికెటర్ చనిపోయాడని పోస్ట్ చేయడం కలకలం రేపింది. దీంతో తాను బతికే ఉన్నానంటూ ఉమర్ అక్మల్ సోషల్ మీడియాలో రెండు రోజులు పోస్టులు చేశాడు. -
ఉమర్ అక్మల్ దే తప్పు..!
కరాచీ: గత నెల్లో పాకిస్తాన్ క్రికెట్ కోచ్ మికీ ఆర్థర్ తో జరిగిన వాగ్వాదంలో క్రికెటర్ ఉమర్ అక్మల్ దే తప్పుగా తేలింది. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఏర్పాటు చేసిన విచారణ కమిటీ అక్మల్ ను దోషిగా తేల్చింది. పీసీబీ కమిటీ తన విచారణలో భాగంగా ఉమర్ తో పాటు అక్కడ ఉన్న మిగతా సభ్యులతో కూడా సమావేశమై వారితో చర్చించింది. అనంతరం ఈ వ్యవహారంలో ఉమర్ దే తప్పుగా నిర్ధారించిన కమిటీ.. అతనిపై మూడు మ్యాచ్ లు నిషేధాన్ని విధించేందుకు పీసీబీకి సిఫారుసు చేసింది. మరొకవైపు కొంతకాలం విదేశీ లీగ్ లు ఆడేందుకు అతనికి అనుమతి ఇవ్వకూడదని హారూన్ రషీద్ నేతృత్వంలోని విచారణ కమిటీ తన నివేదికలో పేర్కొంది. దీనిపై పీసీబీ చైర్మన్ నజీమ్ సేథీ త్వరలో చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గత నెల్లో లాహోర్ లోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఉమర్ అక్మల్-మికీ ఆర్థర్ ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే ఉమర్ నోరు జారాడు. కాగా, తనను కోచ్ దూషించాడంటూ అక్మల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. 'నాతో వాగ్వాదం సందర్భంగా ఆర్థర్ చాలా పేలవమైన భాష మాట్లాడాడు. అదే క్రమంలో దూషణలకు దిగాడు. మా క్రికెట్ పెద్దలు ఇంజమామ్, ముస్తాక్ లు సాక్షిగా నాపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఫిట్ నెస్ శిక్షణకు హాజరైన క్రమంలో క్లబ్ క్రికెట్ ఆడుకో అని ఆర్తర్ సహనాన్ని కోల్పోయాడు. అదే క్రమంలో తీవ్రస్థాయిలో దూషణలకు దిగాడు' అని ఆ గొడవ అనంతరం ఉమర్ అక్మల్ ఆరోపణలు గుప్పించాడు. -
'నన్ను కోచ్ దూషించాడు'
కరాచీ:తనను క్రికెట్ కోచ్ మైక్ ఆర్థర్ తీవ్రంగా దూషించాడంటూ పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ ఆరోపిస్తున్నాడు. లాహోర్ లో జాతీయ క్రికెట్ అకాడమీలో తమ మధ్య జరిగిన వాగ్వాదం సందర్భంగా తనపై ఆర్థర్ దూషణలకు పాల్పడ్డాడని అక్మల్ పేర్కొన్నాడు. ఇందుకు చీఫ్ సెలక్టర్ ఇంజమాముల్ హక్ తో పాటు ముస్తాక్ అహ్మద్ లే సాక్ష్యమన్నాడు. 'నాతో వాగ్వాదం సందర్భంగా ఆర్థర్ చాలా పేలవమైన భాష మాట్లాడాడు. అదే క్రమంలో దూషణలకు దిగాడు. మా క్రికెట్ పెద్దలు ఇంజమామ్, ముస్తాక్ లు సాక్షిగా నాపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఫిట్ నెస్ శిక్షణకు హాజరైన క్రమంలో క్లబ్ క్రికెట్ ఆడుకో అని ఆర్తర్ సహనాన్ని కోల్పోయాడు. అదే క్రమంలో తీవ్రస్థాయిలో దూషణలకు దిగాడు'అని ఉమర్ అక్మల్ తెలిపాడు. ఆ తరహా వ్యాఖ్యల్న ఒక కోచ్ నుంచి తాను ఊహించలేదన్నాడు. -
ఉమర్ ను బౌల్డ్ చేసిన మహిళా క్రికెటర్!
-
ఉమర్ ను బౌల్డ్ చేసిన మహిళా క్రికెటర్!
ఓస్లో: క్రికెట్ అనేది కేవలం పురుష ఆధిపత్యం ఉన్న ఆట మాత్రం కాదనేది ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. ఇందుకు ఇంగ్లండ్ లో ప్రస్తుతం జరుగుతున్న మహిళా వన్డే వరల్డ్ కప్ ఒక చక్కటి ఉదాహరణ. ఆ టోర్నీలో మహిళలు రికార్డులు సృష్టిస్తూ పురుషులకు ఏమాత్రం తీసిపోమని నిరూపించుకుంటూ దూసుకుపోతున్నారు. ఇదిలాఉంచితే, పురుష క్రికెటర్లు-మహిళా క్రికెటర్లు కలిసి మ్యాచ్లు ఆడటం అనేది చాలా అరుదు. అయితే నార్వేలో జరిగిన ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్లో రెండు మహిళా క్రికెట్ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్లో పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ సైతం పాల్గొని అదనపు ఆకర్షణగా నిలిచాడు. కాగా, ఉమర్ ను ఓ చక్కటి బంతికి బౌల్డ్ చేసిందో మహిళా క్రికెటర్. ఆ మహిళా క్రికెటర్ వేసిన అద్భుత బంతికి ఉమర్ అక్మల్ తడబడ్డాడు. బంతిని లెగ్ స్టంప్ పక్కనుంచి ఆడబోయి బౌల్డ్ అయ్యాడు. ఆ అవుట్ ను ఊహించని అక్మల్ నవ్వుకుంటూ పెవిలియన్ కు చేరుకోగా, మహిళా క్రికెటర్లు ఆనందంలో మునిగిపోయారు. -
పాక్ క్రికెటర్ను చెడుగుడు ఆడేశారు!
కొత్తకారు కొనుక్కుని దాని ముందు ఠీవిగా నిలబడి ఫొటో తీసుకుని దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే స్నేహితులు, సన్నిహితుల నుంచి అభినందనలు సందేశాలు వస్తుంటాయి. మరికొందరైతే జాగ్రత్త కారు నడపమని సలహాయిస్తారు. పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్కు మాత్రం నెటిజన్లు వ్యతిరేకంగా స్పందించారు. ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ విజేతగా నిలిచింది. దీంతో తమ ఆటగాళ్లకు పాకిస్తాన్ క్రికెట్(పీసీబీ) బోర్డు భారీ నజరానాలు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉమర్ అక్మల్ తన ట్విటర్ పేజీలో పోస్ట్ చేసిన ఫొటోపై నెటిజన్లు విమర్శలు ఎక్కుపెట్టారు. సిల్వర్ కలర్ బెంట్లే కారు ముందు నిలబడి దిగిన ఫొటోను అక్మల్ పోస్ట్ చేశాడు. ‘ఎంజాయింగ్ లండన్ ఆఫ్టర్ హార్డ్వర్క్’ అని ఫొటోకు క్యాప్షన్ కూడా పెట్టాడు. దీనిపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నువ్వు హార్డ్ వర్క్ చేయడమా అంటూ ఒకరు ఎద్దేవా చేశారు. ‘ఖరీదైన బ్లెంటీ కారు కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి. వేరొకరి కారు ముందు ఫొటో తీసుకునివుంటావ’ని మరొకరు వ్యాఖ్యానించారు. పాక్ క్రికెట్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్టు ఎందుకు కోల్పోయావో చెప్పగలవా అంటూ ప్రశ్నించారు. పాక్ జట్టులో స్థానం కోల్పోయిన అక్మల్ ఖరీదైన కారు ఎలా కొన్నాడని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి చిల్లర పనులు మానేసి క్రికెట్పై దృష్టి పెట్టాలని మరొకరు సలహాయిచ్చారు. అభిమానుల నుంచి నెగెటివ్ కామెంట్లు పోటెత్తడటంతో అక్మల్ స్పందించాడు. తనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయొద్దని వేడుకున్నాడు. ఫ్యాన్స్ అంటే తనకెంతో ప్రేమ ఉందని, వారి ఆదరాభిమానాలను మర్చిపోనని అన్నాడు. -
ఇండియాపై నా సత్తా చూపిస్తా: పాక్ క్రికెటర్
కరాచీ: చాంపియన్స్ ట్రోఫీలో బద్ధ విరోధి భారత్పై తన సత్తా ఏంటో చాటేందుకు సిద్ధంగా ఉన్నానని పాకిస్థాన్ క్రికెటర్ హారిస్ సోహైల్ తెలిపాడు. ఉమర్ అక్మల్ ఫిట్నెస్ టెస్టులో ఫెయిలవ్వడంతో అతని స్థానంలో పాకిస్థాన్ జట్టులోకి సోహైల్ వచ్చాడు. అన్ఫిట్ అని తేలడంతో అక్మల్ను ఇంగ్లండ్ నుంచి అర్ధంతరంగా వెనుకకు పిలిపించిన సంగతి తెలిసిందే. అనంతరం నిర్వహించిన ఫిట్నెస్ టెస్టుల్లో అతను ఫెయిలవ్వడంతో అతన్ని జట్టు నుంచి తప్పించారు. ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీ సన్నాహాల్లో భాగంగా ఇంగ్లండ్లోని బర్మింగ్హామ్లో పాక్ జట్టు ప్రత్యేక శిక్షణ తీసుకుంటోంది. 2015 మేలో జింబాబ్వే పర్యటనలో తొలిసారి అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన 28 ఏళ్ల సోహైల్ తిరిగి జాతీయ జట్టులోకి అడుగుపెట్టడంతో సంతోషం వ్యక్తం చేశాడు. ‘జట్టు విజయం కోసం నా శాయశక్తులా కృషి చేస్తాను. ప్రతి ఆటగాడు కూడా భారత్పై బాగా ఆడాలని కోరుకుంటాడు. భారత్తో మ్యాచ్లో నాకు ఆడేందుకు అవకాశం వస్తే.. తప్పకుండా నా ఉత్తమ ఆటతీరు చూపేందుకు ప్రయత్నిస్తా’ అని సోహైల్ ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ పత్రికతో చెప్పాడు. చాంపీయన్స్ ట్రోఫీలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దాయాదుల సమరానికి రంగం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. జూన్ 4న బర్మింగ్హామ్ వేదికగా భారత్-పాకిస్థాన్ తలపడుతుండటంతో ఇప్పుడు ఇరుదేశాల్లోని క్రికెట్ ప్రేమికుల దృష్టి మ్యాచ్పైనే నెలకొని ఉంది. -
అక్మల్.. వెనక్కి వచ్చేయ్..!
లండన్: త్వరలో చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే పాకిస్తాన్ క్రికెట్ జట్టు నుంచి ఉమర్ అక్మల్ ను తప్పించారు. ప్రస్తుతం ఇంగ్లండ్ లో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ క్యాంపు నుంచి అతన్ని వెనక్కి వచ్చేయమంటూ ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఆదేశించింది. గత కొన్ని రోజుల నుంచి ఉమర్ అక్మల్ కు నిర్వహిస్తున్న రెండు ఫిట్నెస్ టెస్టుల్లో అతను విఫలమవుతున్న నేపథ్యంలో వెనక్కి వచ్చేయాల్సిందింగా పీసీబీ కబురు పంపింది. దాంతో ఉమర్ అక్మల్ తిరుగు పయనం అయ్యేందుకు సిద్ధమవుతుండగా, అతని స్థానంలో ప్రత్యామ్నాయం కోసం అన్వేషిస్తున్నారు పాకిస్తాన్ సెలక్టర్లు. ఉమర్ అక్మల్ స్థానంలో యువ క్రికెటర్లు ఉమర్ అమిన్ కానీ, హారిస్ సోహైల్ను కానీ ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ మేరకు ఉమర్ అక్మల్ ను వెనక్కి రప్పిస్తున్నట్లు పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఇంగ్లండ్ లో అతనికి నిర్వహించిన ఫిట్ నెస్ పరీక్షల్లో ఫెయిలైనట్లు షహర్యార్ తెలిపారు. చాంపియన్స్ ట్రోఫీకి ఫిట్ నెస్ టెస్టుల్లో విఫలమైన ఆటగాళ్ల స్థానాల్ని భర్తీ చేసేందుకు మే 25వ తేదీ వరకూ మాత్రమే గడవు ఉందని పేర్కొన్నారు. జూన్ 1 వ తేదీ నుంచి చాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ వేదికగా జరిగే ఈ ట్రోఫీలో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జూన్ 4వ తేదీన మ్యాచ్ జరుగనుంది. -
వివాదంలో పాకిస్తాన్ బ్యాట్స్ మన్
లాహోర్: వివాదాలతో సావాసం చేసే పాకిస్తాన్ బ్యాట్స్ మన్ ఉమర్ అక్మల్ మరోసారి వార్తల్లో నిలిచాడు. నడిరోడ్డుపై ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి అందరి దృష్టిలో పడ్డాడు. సొంత నగరంలో లాహోర్ లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించడంతో కారులో వెళుతున్న అక్మల్ ను పోలీసులు ఆపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యక్తిగతంగా తన కారుకు నంబరు ప్లేట్ పెట్టించికున్నందుకు అతడిని పోలీసులు ప్రశ్నించారు. ఆగ్రహంతో ఊడిపోయిన అక్మల్ వారిపై తిట్లదండకం అందుకున్నాడు. అక్కడితో ఆగకుండా వారితో గొడవకు దిగాడు. అయితే పోలీసులు తన పట్ల దురుసుగా ప్రవర్తించారని అతడు ఆరోపించాడు. ‘పోలీసులు నన్ను ఆపారు. దుర్భాషలాడారు. నాకు నేనుగా నంబరు ప్లేట్ తొలగించాలన్నార’ని మీడియాతో అక్మల్ చెప్పాడు. పాకిస్తాన్ క్రికెట్ టీమ్ లో బ్యాడ్ బాయ్ గా ముద్ర పడిన అక్మల్ కు వివాదాలు కొత్త కాదు. 2014 ఫిబ్రవరిలో ట్రాఫిక్ వార్డెన్ తో గొడవపడి జైలు శిక్షకు గురయ్యాడు. క్రమశిక్షణ ఉల్లంఘనతో జట్టులో స్థానం కోల్పోయాడు. -
కోహ్లీతో పోలిక.. పాక్ ప్లేయర్ మండిపాటు!
న్యూఢిల్లీ: గత కొన్ని నెలలుగా పాకిస్తాన్ క్రికెట్ సంక్షోభంలో ఉంది. దీంతో పాటు ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగిపోతుంది. ముఖ్యంగా ఉమర్ అక్మల్, అహ్మద్ షెహజాద్ లపై పాక్ క్రికెట్ అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు. తనను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో సరిపోల్చడం ఉమర్ అక్మల్ జీర్ణించుకోలేక పోతున్నాడు. ఈ ముగ్గురు క్రికెటర్ల కెరీర్ దాదాపు ఒకే సమయంలో జరిగింది. జట్లు వేరయినా పోలిక మాత్రం పాక్ ఆటగాళ్లకు మింగుడు పడటం లేదు. 'కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగుతాడు. దయచేసి నన్ను కోహ్లీతో పోల్చవద్దు. ఎందుకంటే నేను ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి క్రీజులోకి వస్తాను. ఒకవేళ పాక్ క్రికెట్ ఫ్యాన్స్, క్రీడా విశ్లేషకులు తనను కోహ్లీతో పోల్చాలనుకుంటే.. రెండు కండిషన్లు పాటిస్తే బాగుంటుంది. ఒకటి.. నా తరహాలో కోహ్లీ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయడం. రెండోది.. కోహ్లీ లాగానే తనకు వన్ డౌన్ లో బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఇప్పించడం. ఇంకా చెప్పాలంటే మా జట్టు వన్ డౌన్ ఆటగాడు బాబర్ అజమ్ తో కోహ్లీని పోల్చడం సరైన ఆలోచన' అని కీపర్ ఉమర్ అక్మల్ వివరించాడు. 116 వన్డేలాడిన అక్మల్ రెండు సెంచరీలు సాధిస్తే.. 179 వన్డేలాడిన విరాట్ 27 సెంచరీలతో దూసుకుపోతున్నాడు. వీటికి తోడు పాక్ వరుస సిరీస్ ఓటములతో ఉమర్ అక్మల్, అహ్మద్ షెహజాద్ లపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉమర్ తన అసహనాన్ని వెల్లగక్కాడు. -
సెంచరీ కొట్టాడు.. జట్టులోకొచ్చాడు!
కరాచీ: వికెట్ కీపర్ ఉమర్ అక్మల్ ప్రస్తుత ఫాం బాగున్న కారణంగా మళ్లీ పాకిస్తాన్ టీ20 జట్టులోకి తీసుకున్నామని చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ చెప్పాడు. దేశవాలీ టీ20 చాంపియన్ షిప్లో విశేషంగా రాణిస్తున్న అక్మల్ త్వరలో పాక్-వెస్టిండీస్ మధ్య జరగనున్న టీ20 సిరీస్ లో చోటు దక్కించుకున్నాడు. దేశవాలీ మ్యాచ్ లలో ఫాంలోకి వచ్చాడని అతడ్ని జట్టులోకి తీసుకోవాలని పాక్ క్రికెట్ బోర్డు సూచన మేరకు సెలక్షన్ ప్యానెల్ అక్మల్ కు అవకాశం ఇచ్చింది. ఐదు నెలలు జాతీయ జట్టుకు దూరంగా ఉండటం ఎంతో కష్టంగా ఉంటుందన్నాడు. వివాదాలు లేకుండా కెరీర్ కొనసాగించాలని భావిస్తున్నట్లు అక్మల్ చెప్పాడు. జట్టులో పర్మినెంట్ ఆటగాడు అవ్వడానికి తగిన ప్రదర్శన చేస్తానని తనతో చెప్పాడని ఇంజీ వెల్లడించాడు. మరోవైపు ఫాంలేని కారణంగా షాహిద్ అఫ్రిది, ఓపెనర్ హెహజాద్ అహ్మద్ లను సెలెక్ట్ చేయలేదన్నాడు. వారి ఫిట్ నెస్ పై కూడా విశ్వాసం లేదన్నాడు. టీ20 సిరీస్ ప్రదర్శనతో వన్డే జట్టులోనూ స్థానం దక్కించుకుంటానని అక్మల్ ధీమా వ్యక్తంచేశాడు. మరోవైపు లాహోర్ వైట్స్ తరఫున ఆడిన ఉమర్ అక్మల్ 48 బంతుల్లోనే 115 పరుగులతో నాటౌట్ గా నిలవడమే అతడి పునరాగమనానికి కారణమని మాజీ కెప్టెన్, చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ వివరించాడు. -
వార్నర్ పీఎస్ఎల్ టైటిల్ గెలిచాడట!
ముంబై: తమ క్రికెటర్లు పెద్దగా విద్యావంతులు కాదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)చైర్మన్ షహర్యార్ ఖాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను నిజమని నిరూపించాడు ఆ దేశ క్రికెటర్ ఉమర్ అక్మల్. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9 టైటిల్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ను అభినందించే క్రమంలో అక్మల్ తప్పులో కాలేశాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)టైటిల్ గెలిచిన కెప్టెన్ వార్నర్కు అభినందనలు అంటూ ట్వీట్ చేశాడు. ఇప్పటివరకూ పీఎస్ఎల్లో ఆడని వార్నర్ టైటిల్ గెలవడం ఏమిటని ట్విట్టర్లో విమర్శలు పోటెత్తడంతో ఉమర్ అక్మల్ ముక్కన వేలేసుకున్నాడు. అతను చేసిన తప్పును గ్రహించి వెంటనే మరో ట్వీట్ ను పోస్ట్ చేశాడు. ఇది పొరపాటున జరిగిందంటూ ఉమర్ సర్దుకునే యత్నం చేశాడు. -
వెంటాడుతున్న ప్రపంచ కప్ వైఫల్యం
లాహోర్: టి-20 ప్రపంచ కప్లో విఫలమైన పాకిస్తాన్ క్రికెటర్లు షాహిద్ అఫ్రిదీ, అహ్మద్ షెహజాద్, ఉమర్ అక్మల్కు నిరాశ ఎదురైంది. వచ్చే నెలలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే పాక్ జట్టులో ఈ ముగ్గురికి ఆడే అవకాశం దక్కలేదు. ఇంజమామ్ ఉల్ హక్ సారథ్యంలోని పాక్ సెలెక్షన్ కమిటీ ఇంగ్లండ్ టూర్కు 35 ఆటగాళ్లతో ప్రాబబుల్స్ జాబితాను ఎంపిక చేసింది. వీరికి ఈ నెల 14 నుంచి జూన్ 4 వరకు ఖైబర్-పాక్టుంక్వా ప్రావిన్స్లో శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు. టి-20 ప్రపంచ కప్లో విఫలమైనందుకు అఫ్రిదీపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక అహ్మద్ షెహజాద్, ఉమర్ అక్మల్ పేలవ ప్రదర్శనతో పాటు క్రమశిక్షణ చర్యల కింద వారిపై వేటు వేశారు. ఇంగ్లండ్ పర్యటనలో పాక్ నాలుగు టెస్టులు, ఐదు వన్డేలు, ఓ టి-20 మ్యాచ్ ఆడనుంది. -
మరో వివాదంలో పాక్ క్రికెటర్
కరాచీ: థియేటర్లో జరిగిన ఓ ఘర్షణలో ప్రమేయముందని ఆరోపణలు ఎదుర్కొంటున్న పాక్ స్టార్ బ్యాట్స్ మెన్ ఉమర్ అక్మల్తో పాటూ మరో నలుగురు జాతీయ స్థాయి క్రికెటర్లపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విచారణకు ఆదేశించింది. వివరాలు.. ఫైసలాబాద్ లోని ఓ థియేటర్ లో ఆదివారం రాత్రి జరిగిన డ్రామా షోకు అక్మల్, మరో నలుగురు క్రికెటర్లు హాజరయ్యారు. అయితే డ్రామాలో ఓ యువతి చేసిన నృత్యాన్ని మరోసారి చేయాలంటూ వీరు డిమాండ్ చేశారు. దీనికి థియేటర్ యాజమాన్యం నిరాకరించింది. దీంతో వారితో ఘర్షణకు దిగారు. ఈసంఘటన జరిగిన సమయంలో అక్మల్తో పాటూ క్రికెటర్లు అవాసిస్ జియా, బిల్ వాల్ బట్టి, మహ్మద్ నవాజ్, షాహిద్ యుసుఫ్లు ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో పాక్ టీవీ చానళ్లలో చక్కర్లు కొట్టడంతో అక్మల్ వివరణ ఇచ్చుకున్నాడు. 'నా వ్యక్తిగత జీవతం వేరు, క్రికెట్ వేరు. అనవసరంగా చిన్న విషయాన్ని రాద్దాంతం చేస్తున్నారు. వినోదం కోసం మాత్రమే ఆ థియేటర్లో డ్రామా చూడటానికి వెళ్లాను.అదేం తప్పు కాదు. క్రికెటర్ వ్యక్తిగత జీవితాన్ని హైలెట్ చేసి చూడకూడదు' అని పేర్కొన్నారు. అయితే ఇంతకు ముందుకూడా ఉమర్ అక్మల్ రెడ్ సిగ్నల్ పడినా.. దాటుకుని పోవడమే కాకుండా.. ట్రాఫిక్ పోలీసులతో వాదనకు దిగి, వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. -
కోచ్పై చిందులేసిన క్రికెటర్
కరాచీ: పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ చిక్కుల్లో పడ్డాడు. అక్మల్.. పాకిస్తాన్ దేశవాళీ జట్టు కోచ్, మాజీ టెస్టు క్రికెటర్ బాసిత్తో అనుచితంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. కరాచీ నేషనల్ స్టేడియంలో జరిగిన ఖ్వాయిద్ ఏ అజామ్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుందని, డ్రెస్సింగ్ రూమ్లో అక్మల్.. బాసిత్తో దురుసుగా ప్రవర్తించి దూషించినట్టు క్రికెట్ వర్గాలు తెలిపాయి. బ్యాటింగ్ ఆర్డర్లో వెనుక పంపడంతో అక్మల్.. కోచ్పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఆల్ రౌండర్ హుసేన్ను మూడో స్థానంలో బ్యాటింగ్కు పంపడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. తనను ఎందుకు వెనుకగా పంపారని కోచ్ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. డ్రెస్సింగ్ రూమ్లో ఆటగాళ్లు, అధికారుల సమక్షంలో ఈ గొడవ జరిగినట్టు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ఇదిలావుండగా అక్మల్ ఇటీవల నిషేధం ఎదుర్కొనే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఓ మ్యాచ్ సందర్భంగా పోలీసులు ఓ ప్రైవేట్ డాన్స్ పార్టీపై దాడి చేసి అక్మల్తో పాటు మరికొందరు ఆటగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు అక్మల్ను విడుదల చేయడంతో పాటు డాన్స్ పార్టీలో అతను పాల్గొనలేదని నివేదిక ఇవ్వడంతో అతనికి ఊరట కలిగింది. -
'పార్టీలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించలేదు'
కరాచీ: తాను ఓ పార్టీలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినట్లు వచ్చిన వార్తలను పాకిస్థాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ ఖండించాడు. అందులో ఎటువంటి వాస్తవం లేదన్నాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించి అక్మల్ కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు, ఇంగ్లండ్ తో వచ్చే నెలలో జరిగే ట్వంటీ 20 టీమ్ నుంచి తొలగించడం జరిగింది. పాకిస్థాన్ జట్టులోని 16 మంది ట్వంటీ బృందంలో ముందు అక్మల్ కు చోటు కల్పించినా.. ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో అతనిపై ఆకస్మిక వేటు పడింది. దీనిపై స్పందించిన ఉమర్.. తాను పాకిస్థాన్ లోని హైదరాబాద్ లో జరిగిన ఓ పార్టీకి వెళ్లిన మాట వాస్తవమేనని కాగా మహిళలతో అసభ్యంగా ప్రవర్తించలేదన్నాడు. టీమ్ మేనేజర్ నుంచి అధికారిక అనుమతి తీసుకున్న తర్వాతే పార్టీకి వెళ్లినట్లు పేర్కొన్నాడు. తాను ఎక్కడా కూడా క్రికెట్ నిబంధనలు ఉల్లంఘించలేదని పీసీబీకి వివరణ ఇచ్చే యత్నం చేశాడు. ప్రస్తుతం ఉమర్ పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోంది. దీనిపై ఇప్పటికే పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ కూడా ఉమర్ ను హెచ్చరించాడు. ఉమర్ తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు. ఒకవేళ ఉమర్ క్రమశిక్షణా ఉల్లంఘనకు పాల్పడినట్లు రుజువైతే మాత్రం అతని క్రికెట్ భవిష్యత్తు ప్రశ్నార్ధకమే. -
పాకిస్తాన్దే టి20 సిరీస్
రెండో మ్యాచ్లోనూ జింబాబ్వేపై విజయం హరారే: జింబాబ్వేతో 2 మ్యాచ్ల టి20 సిరీస్ను పాకిస్తాన్ చేజిక్కించుకుంది. ఆదివారం తొలి టి20లో నెగ్గిన పాక్, మంగళవారం జరిగిన రెండో మ్యాచ్లో 15 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన పాక్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 136 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఉమర్ అక్మల్ (28 బంతుల్లో 38 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్స్కోరర్గా నిల వగా, మఖ్సూద్ (25 బంతుల్లో 26; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. జాంగ్వే, పన్యగారా చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 121 పరుగులు మాత్రమే చేయగలిగింది. సీన్ విలియమ్స్ (36 బంతుల్లో 40 నాటౌట్; 4 ఫోర్లు), సికందర్ రజా (36 బంతుల్లో 36; 1 ఫోర్) ఐదో వికెట్కు 60 పరుగులు జోడించినా జట్టును గెలిపించలేకపోయారు. ఇర్ఫాన్, ఇమ్రాన్ చెరో 2 వికెట్లు తీశారు. ఇమాద్ వసీంకు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీ స్’ అవార్డు దక్కింది. -
ఉమర్ అక్మల్ను సంప్రదించిన బుకీ
కరాచీ: పాకిస్థాన్ క్రికెట్లో మరోసారి ఫిక్సింగ్ వివాదం తెర పైకి వచ్చింది. 2012లో పాక్ జట్టు యూఏఈ పర్యటనలో ఉన్నప్పుడు ఉమర్ అక్మల్ను మ్యాచ్లను ఫిక్స్ చేయాల్సిందిగా ఓ బుకీ సంప్రదించాడు. అయితే ఈ విషయాన్ని వెంటనే ఉమర్ జట్టు సెక్యూరిటీ మేనేజర్కు తెలియపర్చాడు. ‘భారత్కు చెందిన నంబర్ నుంచి ఉమర్ అక్మల్కు రెగ్యులర్గా ఓ కాల్ వచ్చేది. ఫిక్సింగ్ రాకెట్లోకి ప్రవేశిస్తే ఊహించనంత డబ్బు ఇస్తానని మూడు సార్లు ఆ బుకీ ప్రలోభపెట్టాడు. అయితే ఈ గుర్తుతెలియని వ్యక్తి గురించి అక్మల్ వెంటనే పాకిస్థాన్ టీమ్ సెక్యూరిటీ మేనేజర్కు తెలిపాడు. వారు ఈ అంశాన్ని ఐసీసీ ఏసీఎస్యూ ముందుంచారు. నిజాయితీగా విషయాన్ని వ్యక్తపరిచినందుకు అందరూ అక్మల్ను అభినందించారు’ అని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ఆ పర్యటనలో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్ను పాక్ 3-0తో గెలుచుకుంది. -
మరో వివాదంలో ఉమర్ అక్మల్
వివాహ వేడుకల్లో నిబంధనల ఉల్లంఘన కేసు నమోదు చేసిన పోలీసులు కరాచీ: పాకిస్థాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. మంగళవారం రాత్రి వివాహం చేసుకున్న ఉమర్... ఆ వేడుకల్లో నిబంధనల్ని ఉల్లంఘించాడన్న ఆరోపణపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. వివాహ వేడుకలు రాత్రి 10 గంటలకే ముగించాలన్న నిబంధన అమల్లో ఉండగా, ఉమర్ వివాహానికి సంబంధించి విందును 10 గంటల తరువాత కూడా కొనసాగించారు. పైగా విందులో ఒక్క వంటకాన్ని మాత్రమే వడ్డించాల్సివుండగా, పలు రకాల వంటకాలు వడ్డించారు. అంతేగాకుండా లాహోర్ సమీపంలోని ఓ ఫామ్హౌస్లో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులు, స్థానిక అధికారులపై ఉమర్ కుటుంబ సభ్యులు దురుసుగా ప్రవర్తించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు కుటుంబ సభ్యుల్ని అరెస్టు చేశారు. అయితే ఉమర్ మాత్రం భార్యతో కలిసి రహస్య ప్రదేశానికి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. గత ఫిబ్రవరిలోనూ ఉమర్.. ట్రాఫిక్ పోలీసుతో గొడవపడి అరెస్టు కావడం, బెయిలుపై విడుదలై టి20 ప్రపంచకప్లో ఆడడం తెలిసిందే. -
పాకిస్థాన్ గట్టెక్కింది
అఫ్ఘానిస్థాన్పై గెలుపు ఉమర్ అక్మల్ అజేయ సెంచరీ ఆసియా కప్ ఫతుల్లా: అంతర్జాతీయ మ్యాచ్లో క్యాచ్లు పట్టడం ఎంత ముఖ్యమో అఫ్ఘానిస్థాన్ జట్టుకు తెలిసొచ్చింది. ఆసియా కప్లో గురువారం జరిగిన మ్యాచ్లో ఓ దశలో పాకిస్థాన్ 117 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే 37వ ఓవర్లో ఉమర్ అక్మల్ 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇచ్చిన క్యాచ్ను ఆఫ్సైడ్ స్క్వేర్లో సమీయుల్లా మిస్ చేశాడు. ఫలితంగా ఉమర్ అక్మల్ (89 బంతుల్లో 102 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) రెండు కీలక భాగస్వామ్యాలు నమోదు చేసి జట్టును ఆదుకున్నాడు. దీంతో ఖాన్ సాహెబ్ ఉస్మాన్ అలీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో పాక్ 72 పరుగుల తేడాతో అఫ్ఘానిస్థాన్పై విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పాక్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 248 పరుగులు చేసింది. ఓపెనర్లలో షెహజాద్ (74 బంతుల్లో 50; 7 ఫోర్లు) రాణించాడు. ఒంటరిపోరాటం చేసిన అక్మల్ చివర్లో అన్వర్ అలీ (36 బంతుల్లో 21; 2 ఫోర్లు)తో కలిసి ఏడో వికెట్కు 60, ఉమర్ గుల్ (12 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్సర్)తో కలిసి ఎనిమిదో వికెట్కు 40 పరుగులు జోడించాడు. దౌలత్ జద్రాన్, అషఫ్,్ర సమీయుల్లా తలా రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన అఫ్ఘానిస్థాన్ 47.2 ఓవర్లలో 176 పరుగులకే ఆలౌటైంది. నూర్ అలీ జద్రాన్ (63 బంతుల్లో 44; 7 ఫోర్లు) టాప్ స్కోరర్. హమ్జా స్టానిక్జాయ్ (91 బంతుల్లో 40; 3 ఫోర్లు), నౌరోజ్ మంగల్ (57 బంతుల్లో 35; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. మూడో వికెట్కు 74 పరుగులు జోడించిన హమ్జా, మంగల్ మూడు పరుగుల వ్యవధిలో అవుట్ కావడం జట్టును దెబ్బతీసింది. తర్వాత పాక్ స్పిన్నర్లు ధాటిగా బౌలింగ్ చేయడంతో అఫ్ఘాన్ బ్యాట్స్మెన్ పెవిలియన్కు క్యూ కట్టారు. 37 పరుగుల తేడాతో చివరి 8 వికెట్లు చేజార్చుకున్నారు. హఫీజ్ 3, అజ్మల్, గుల్ చెరో రెండు వికెట్లు తీశారు. గుల్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. పాక్కు బోనస్తో కలిపి 5 పాయింట్లు లభించాయి. ఆకట్టుకున్న కూనలు పాక్తో మ్యాచ్లో పరుగుల తేడా చూస్తే అఫ్ఘాన్ చిత్తుగా ఓడినట్లే. కానీ... తొలిసారి ఓ పెద్ద టోర్నీలో ఆడిన కూనలు ఆకట్టుకున్నారు. బౌలింగ్లో తొలుత అద్భుతంగా రాణించారు. నిజానికి ఉమర్ అక్మల్ క్యాచ్గనక పట్టి ఉంటే పాక్ 150లోపే ఆలౌటయ్యేది. అఫ్ఘాన్కు చిరస్మరణీయ విజయం దక్కేది. ఇక బ్యాటింగ్లో తక్కువ స్కోరే చేసినా... అనుభవలేమి కనిపించింది. ఓవరాల్గా అఫ్ఘాన్కు ఇది సంతృప్తికర ప్రదర్శనే అనుకోవాలి. స్కోరు వివరాలు పాకిస్థాన్ ఇన్నింగ్స్: షర్జీల్ (సి) నూర్ అలీ (బి) హమ్జా 25; షెహజాద్ (బి) సమీయుల్లా 50; హఫీజ్ (సి) నబీ (బి) అషఫ్10; మక్సూద్ (సి) అస్గర్ (బి) సమీయుల్లా 13; మిస్బా రనౌట్ 0; అక్మల్ నాటౌట్ 102; ఆఫ్రిది (బి) దౌలత్ 6; అన్వర్ అలీ (సి) నౌరోజ్ (బి) అషఫ్ ్ర21; ఉమర్ గుల్ (బి) దౌలత్ 15; అజ్మల్ నాటౌట్ 1; ఎక్స్ట్రాలు: 5; మొత్తం: (50 ఓవర్లలో 8 వికెట్లకు) 248. వికెట్ల పతనం: 1-55; 2-78; 3-89; 4-89; 5-108; 6-117; 7-177; 8-217 బౌలింగ్: షాపూర్ 9-1-42-0; దౌలత్ 10-0-73-2; నబీ 8-0-46-0; హమ్జా 8-1-22-1; అషఫ్ ్ర8-1-29-2; సమీయుల్లా 7-0-34-2 అఫ్ఘానిస్థాన్ ఇన్నింగ్స్: షహజాద్ (సి) అక్మల్ (బి) గుల్ 9; నూర్ అలీ ఎల్బీడబ్ల్యు (బి) అజ్మల్ 44; అస్గర్ (సి) హఫీజ్ (బి) ఆఫ్రిది 40; నౌరోజ్ రనౌట్ 35; నబీ ఎల్బీడబ్ల్యు (బి) గుల్ 15; నజీబుల్లా (బి) హఫీజ్ 1; సమీయుల్లా (బి) హఫీజ్ 14; అషఫ్ రనౌట్ 4; దౌలత్ (బి) అజ్మల్ 0; షాపూర్ (సి) అజ్మల్ (బి) హఫీజ్ 1; హమ్జా నాటౌట్ 0; ఎక్స్ట్రాలు: 13; మొత్తం: (47.2 ఓవర్లలో ఆలౌట్) 176. వికెట్ల పతనం: 1-32; 2-65; 3-139; 4-140; 5-151; 6-159; 7-172; 8-172; 9-175; 10-176 బౌలింగ్: గుల్ 9-0-44-2; అన్వర్ 4-0-23-0; జునైద్ 6-1-16-0; ఆఫ్రిది 10-0-31-1; అజ్మల్ 9-1-25-2; హఫీజ్ 9.2-0-29-3 -
ఉమర్ అక్మల్ అరెస్ట్
లాహోర్: సిగ్నల్ పడినపుడు ఆగకపోవడమే కాకుండా ఇదేమిటని అడిగినందుకు ట్రాఫిక్ వార్డెన్పై పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్ వీరంగం చేశాడు. దుర్భాషలాడడమే కాకుండా అతడి యూనిఫామ్ను చించేశాడు. దీంతో అక్మల్ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ‘ఉమర్ సిగ ్నల్ను అతిక్రమించినందుకు పోలీస్ వార్డెన్ చలాన్ రాశాడు. దీంతో వాగ్వాదం ప్రారంభమైంది. అతడు వార్డెన్ మెడ పట్టుకోవడంతో పాటు చొక్కాను చించేశాడు. విధుల్లో ఉన్న అధికారిపై దాడి చేయడమే కాకుండా అతడి చొక్కాను చించేయడాన్ని చాలా తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. ఉమర్పై కేసు నమోదు చేశాం’ అని గుల్బర్గ్ స్టేషన్ ఎస్ఎస్పీ తారీఖ్ అజీజ్ తెలిపారు. మరోవైపు ట్రాఫిక్ వార్డెనే తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, చెంపపై కొట్టాడని అక్మల్ ఫిర్యాదు చేశాడు. దీనికి సాక్ష్యంగా అక్కడ సీసీటీవీ ఫుటేజిలున్నాయని, వాటిని పరిశీలిస్తే ఎవరిది తప్పో తెలుస్తుందని వాదించాడు. అయితే ఇరువురు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారని, ఇతర వార్డెన్ వచ్చి విడదీశాడని ప్రత్యక్ష సాక్షి తెలిపాడు.