United Nation
-
కశ్మీర్పై మళ్లీ విషం చిమ్మిన పాక్.. తిప్పికొట్టిన భారత్
ఐక్యరాజ్యసమితి: పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితిలో మరోమారు కశ్మీర్ అంశంపై విషం చిమ్మింది. ఈ నేపధ్యంలో కశ్మీర్ విషయంలో పాక్ ఐక్యరాజ్యసమితిలో అసత్యాలను ప్రచారం చేస్తూ, ఈ ప్రపంచ వేదికను దుర్వినియోగం చేస్తోందని భారత్ ఆరోపించింది.అబద్ధాలు ప్రచారం చేసేందుకు ఐక్యరాజ్యసమితి వేదికను పాక్ ఉపయోగించుకుంటోందని భారత్ పొరుగుదేశం పాక్పై దుమ్మెత్తి పోసింది. పాక్ ఇలాంటి ఎన్ని ప్రచారాలు సాగించినా, క్షేత్రస్థాయిలో వాస్తవాలు మారబోవని భారత్ పేర్కొంది. సమాచార సంబంధిత ప్రశ్నలపై యూఎన్ జనరల్ అసెంబ్లీకి చెందిన నాల్గవ కమిటీ సాధారణ చర్చలో రాజ్యసభ సభ్యుడు రాజీవ్ శుక్లా ప్రసంగించారు. ఒక పాకిస్తానీ ప్రతినిధి బృందం మరోసారి అబద్ధాలను వ్యాప్తి చేయడానికి ఈ ప్రతిష్టాత్మక వేదికను ఉపయోగించుకున్నదని ఆయన ఆరోపించారు.దుష్ప్రచారం చేయడం, తప్పుడు సమాచారం ఇవ్వడం ఈ ప్రతినిధి బృందానికి అలవాటైందని రాజీవ్ శుక్లా ఆరోపించారు. ఐక్యారాజ్య సమితిలో పాకిస్తాన్.. జమ్ము కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన దరిమిలా శుక్లా పాక్కు ఘాటుగా సమాధానం ఇచ్చారు. పాక్ ఎన్ని తప్పుడు సమాచారాలు ఇచ్చినా వాస్తవాలు మారవన్నారు. ఈ ఫోరమ్ (పాక్) రాజకీయ ఎజెండా కోసం కాకుండా నిర్మాణాత్మకంగా చర్చలో పాల్గొనాలని అన్నారు. ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా, విశ్వసనీయ సమాచారం అందిస్తూ ప్రజలను సాధికారతపరచడానికి భారత్ కృషి చేస్తున్నదన్నారు. ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్లో నిరసనలు -
పాలస్తీనాను అదీనంలో ఉంచుకోవడం చట్టవిరుద్ధం
ది హేగ్: పాలస్తీనా ఆక్రమిత ప్రాంతాలను ఇజ్రాయెల్ తమ అ«దీనంలో ఉంచుకోవడం చట్ట విరుద్ధమని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ న్యాయస్థానం శుక్రవారం స్పష్టం చేసింది. ఆక్రమిత ప్రాంతాల నుంచి వైదొలగాలని, అక్కడ స్థిర నివాసానికి కాలనీల నిర్మాణాన్ని తక్షణం నిలిపివేయాలని సూచించింది. 57 ఏళ్ల కిందట ఆక్రమించిన పాలస్తీనా ప్రాంతాలపై ఇజ్రాయెల్ అజమాయిషీని తప్పుపడుతూ అంతర్జాతీయ న్యాయం స్థానం తీర్పు ఇవ్వడం అసాధారణ విషయంగా పేర్కొంటున్నారు. వెస్ట్బ్యాంక్, తూర్పు జెరూసలెంలలో ఇజ్రాయెల్ సెటిల్మెంట్లను నిర్మించడం, విస్తరించడం, ఆక్రమిత ప్రాంతాలను స్వా«దీనం చేసుకోవడం, వాటిపై నియంత్రణ, అక్కడి సహజ వనరులను వినియోగించుకోవడం, పాలస్తీనియన్లపై వివక్షతో కూడిన విధానాలను అమలు చేయడం.. ఇవన్నీ అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనేనని జడ్జీల ప్యానెల్ అభిప్రాయపడింది. ఆక్రమిత ప్రాంతాలపై ఇజ్రాయెల్కు సార్వ¿ౌమాధికారం లేదని, పాలస్తీనాలోని ప్రాంతాలను బలవంతంగా ఆక్రమించడంఅంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనేనని పేర్కొంది. అయితే అంతర్జాతీయ న్యాయ స్థానం ఇచి్చన ఈ తీర్పుకు కట్టుబడి ఉండాల్సిన, పాటించాల్సిన అవసరం ఇజ్రాయెల్కు లేదు. ఇదొక అభిప్రాయం మాత్రమే. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు దీనిపై స్పందిస్తూ.. ఆ ప్రాంతాలు యూదు ప్రజల చారిత్రక మాతృభూమిలో భాగమన్నారు. -
ఐక్యరాజ్య సమితిలో ఓటింగ్ ఎలా జరుగుతుంది?
ఇజ్రాయెల్, హమాస్ మధ్య గత కొన్ని రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో ఇరువైపులా వేలాది మంది ప్రజులు మృతి చెందారు. ప్రస్తుతం ఈ యుద్ధాన్ని ఆపడం యావత్ ప్రపంచానికి పెను సవాలుగా మారింది. అమెరికా నుంచి బ్రిటన్ వరకు పలు దేశాలు ఇందుకోసం ప్రయత్నించాయి. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఇజ్రాయెల్-హమాస్ విషయమై ఒక ప్రతిపాదన వచ్చింది. దీనికి సంబంధించిన ఓటింగ్లో భారత్ పాల్గొనలేదు. ఇంతకీ ఐక్యరాజ్య సమితి (యూఎన్ఓ)లో ఓటింగ్ ఎలా జరుగుతుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సమయంలో మాదిరిగానే భారత్ ఈసారి కూడా ఐక్యరాజ్య సమితిలోని ఓటింగ్కు దూరంగా ఉంది. ఇజ్రాయెల్-హమాస్ వివాదంపై రూపొందించిన ఈ ప్రతిపాదనలో వీలైనంత త్వరగా యుద్ధాన్ని ముగించడం, గాజాలోని బాధితులకు ఉపశమనం కల్పించడం, కాల్పుల విరమణ, బందీల విడుదల తదితర అంశాలు ఉన్నాయి. జోర్డాన్ ఈ ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టింది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఏ దేశమైనా తన ప్రతిపాదనను సమర్పించవచ్చు. దీనిపై ఓటింగ్ జరగాలా వద్దా అనేదానిని యూఎన్ఓ చైర్మన్ నిర్ణయిస్తారు. ప్రతిపాదనను ఆమోదించడానికి మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. ప్రస్తుతం ప్రపంచంలోని 193 దేశాలు ఐక్యరాజ్యసమితిలో సభ్యులుగా ఉన్నాయి. ఇజ్రాయెల్-హమాస్ కేసులో తీసుకొచ్చిన తీర్మానానికి 120 ఓట్లు వచ్చాయి. అంటే మెజారిటీ వచ్చింది. ఎటువంటి పరిస్థితులనైనా శాంతియుతంగా పరిష్కరించడం కోసం సిఫార్సులు చేయడం యూఎన్జీఏ పని. తీర్మానం ఆమోదం కోసం వచ్చినప్పుడు ఈ సమస్యపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల స్టాండ్ ఏమిటో తెలుస్తుంది. తరువాత యుద్ధంలో పాల్గొన్న దేశానికి నైతిక సందేశం పంపిస్తారు. యూఎన్జీఏ ఏ దేశాన్నీ చట్టబద్ధంగా కట్టడి చేయదు. దీని కోసం యూఎన్ఎస్సీని రూపొందించారు. ఇది కూడా చదవండి: ఏ రాష్ట్రంలో ఎక్కువ పనిగంటలు? -
ఏపీ విద్యావ్యవస్థకు అరుదైన గుర్తింపు
-
ఐరాస భద్రతా మండలిలో భారత్.. సభ్యదేశాలదే తుది నిర్ణయం
న్యూఢిల్లీ: ప్రపంచంలో సిసలైన దేశం అంటూ ఏదైనా ఉందంటే అది భారతదేశమేనని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వ్యాఖ్యానించారు. ఇండియాను ‘విశ్వ దేశం(కంట్రీ ఆఫ్ ది వరల్డ్)’గా అభివరి్ణంచారు. జీ20 సదస్సులో పాల్గొనేందుకు శుక్రవారం ఆయన ఢిల్లీ చేరుకున్నారు. ‘ అంతర్జాతీయంగా బహుళపక్ష వ్యవస్థలో భారత అత్యంత ముఖ్యమైన భాగస్వామి. అయితే ఐరాస భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం ఇచ్చే ప్రక్రియలో నా పాత్ర ఏమీ లేదు. సభ్య దేశాలదే తుదినిర్ణయం’ అని గుటెరస్ స్పష్టంచేశారు. ‘ఐరాస భద్రతా మండలిలో, బహుపాక్షిక వ్యవస్థల్లో సంస్కరణలు తప్పనిసరి. అంతర్జాతీయ ఆర్థిక మౌలికస్వరూపం సైతం పాతదైపోయింది. ఇందులోనూ నిర్మాణాత్మకమైన సంస్కరణలు జరగాలి. అంతర్జాతీయ వ్యవస్థలు పారదర్శకంగా ఉండాలి. అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలను అవి తీర్చాలి. యుద్ధాలు, సంక్షోభాలతో కాలాన్ని వృధా చేసుకోకూడదు. ఓవైపు పేదరికం, ఆకలి, అసమానతలు పెరుగుతుంటే మరోవైపు సహానుభూతి, సంఘీభావం తెలిపే గుణం తగ్గిపోతున్నాయి. మంచి కోసం అందరం కలిసికట్టుగా ముందడుగువేద్దాం’ అంటూ జీ20 దేశాలను గుటెరస్ కోరారు. సమీప భవిష్యత్తులో ఉక్రెయిన్– రష్యా శాంతి ఒప్పందం వాస్తరూపం దాలుస్తుందన్న నమ్మకం తనకు లేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ప్రపంచం కోరుకునే గణనీయమైన మార్పుల సాధనకు భారత జీ20 సారథ్యం సాయపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ‘ ప్రపంచం ఒక వసుధైక కుటుంబంలా మనగలగాలంటే ముందుగా మనం ఒక్కటిగా నిలుద్దాం. ప్రపంచం ఇప్పుడు కీలకమైన మార్పు దశలో ఉంది. భవిష్యత్ అంతా భిన్న ధ్రువ ప్రపంచానిదే’ అని ఆయన వ్యాఖ్యానించారు. -
సాక్షి రిపోర్టింగ్ ఫ్రం ఐక్యరాజ్యసమితి
అమెరికాలోని న్యూయార్క్ మహానగరంలో ఐక్యరాజ్యసమితి హైలెవల్ పొలిటికల్ ఫోరమ్ సమావేశాలను సాక్షి మీడియా గ్రూప్ తరపున కవర్ చేశారు మంగ వెంకన్న, సీనియర్ న్యూస్ కోఆర్డినేటర్, సాక్షి. మన దేశం నుంచి ఈ అవకాశం దక్కిన అతి కొద్ది మందిలో వెంకన్న ఒకరు. తెలుగు మీడియాలో వెంకన్న మాత్రమే ఈ అవకాశం అందుకోగలిగారు. నల్గొండ జిల్లా నుంచి చిన్న విలేకరిగా ప్రస్థానం ప్రారంభించి.. ఇప్పుడు ఏకంగా అగ్రరాజ్యం అమెరికాలో ఏకంగా ఐక్యరాజ్యసమితి ఈవెంట్ను కవర్ చేయడం జర్నలిస్టుగా వెంకన్న సాధించిన విజయం. కవరేజ్ గురించి వెంకన్న మాటల్లోనే.. "హై-లెవల్ పొలిటికల్ ఫోరమ్ 2023 సమావేశాల్లో సుస్థిర అభివృద్ధి ఎజెండాగా ఉన్నత స్థాయి రాజకీయ వేదిక (HLPF) ఆర్థిక, సామాజిక మండలి ఆధ్వర్యంలో జూలై 10, సోమవారం నుండి 19 జూలై 2023 వరకు జరిగిన సమావేశాలను కవర్ చేయడం నా జర్నలిజం కెరియర్లో దక్కిన అతి పెద్ద అదృష్టం" ప్రపంచ మేధావుల విలువైన పాఠాలు UN కౌన్సిల్ యొక్క ఉన్నత-స్థాయి విభాగంలో భాగంగా సస్టైనబిలిటీ ప్రధాన అజెండా ఫోరమ్ యొక్క మూడు రోజుల మంత్రివర్గ ECOSOC యొక్క ఉన్నత-స్థాయి సెగ్మెంట్ కార్యక్రమాన్ని రిపోర్ట్ చేశాను. "కరోనా వైరస్ వ్యాధి (COVID-19) నుండి ప్రపంచ రికవరీని వేగవంతం చేయడం, అన్ని స్థాయిలలో సుస్థిర అభివృద్ధి కోసం 2030 ఎజెండాను పూర్తిగా అమలు చేయడం ఎజెండాగా ఈ సమావేశాలు జరిగాయి. ముఖ్య అజెండా లో పేర్కొన్న అంశాలపై వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధుల అభిప్రాయాలను సేకరించాను. ఒక్కో భిన్నమైన నేపథ్యం నుంచి వచ్చిన వారు కావడంతో ఒక్కొక్కరు వినూత్నమైన, విలువైన విషయాలు ఎన్నో చెప్పారు. (వరల్డ్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ లచ్చే జర స్టవ్ తో UN స్పెషల్ కన్సల్టేటివ్ మెంబర్ షకీన్ కుమార్) ఎడ్యుకేషన్ లో ఏపీ.. ది బెస్ట్ న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం హై లెవెల్ పొలిటికల్ ఫోరంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాడు నేడు స్టాల్ ఏర్పాటు చేసింది. దీని ద్వారా జెండర్ ఈక్వాలిటీ, బాలికల విద్య కోసం అమలు చేస్తున్న పథకాలు ప్రయోజనాల వివరాలను స్టాల్ రూపంలో ఏర్పాటు చేశారు. హయ్యర్ ఎడ్యుకేషనల్ సస్టైనబులిటీ ఇనిషియేటివ్ ప్రోగ్రాం హై లెవెల్ పొలిటికల్ ఫోరం కాన్ఫరెన్స్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి విద్యార్థికి నాలెడ్జ్ బేస్డ్ ఎడ్యుకేషన్ విధానాన్ని అందిస్తున్నారని ఏపీ ప్రతినిధులు ప్రజెంట్ చేశారు. ఈ స్టాల్ ను సందర్శించిన వివిధ దేశాల ప్రతినిధులు, ఐక్యరాజ్యసమితి సభ్యులు విద్యావేత్తలను నేను జర్నలిస్టుగా ఇంటర్వ్యూ చేయడం వల్ల ఆయా దేశాల్లో అనుసరిస్తున్న తీరు, విద్యావిధానాలను తెలుగు ప్రజలకు చెప్పే అవకాశం వచ్చింది. నాడు-నేడు స్టాల్ గురించి తెలుసుకున్న పలువురు విదేశీ విద్యావేత్తలు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యావిధానాన్ని ప్రశంసించినప్పుడు తెలుగోడిగా గర్వపడ్డాను. ఐక్యరాజ్యసమితి ఆశయాలు భుజాల మీద వేసుకొని పేద ప్రజల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలు, నవరత్నాలు అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దార్శనికతను ఐక్యరాజ్యసమితిలో ప్రపంచ దేశాలు140 దేశాల నుండి వచ్చిన ప్రతినిధుల సమక్షంలో వివరించడం సంతోషం కలిగింది. (కొలంబియా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రాధికా అయ్యంగార్ ) అమెరికాకు ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల బృందం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సెప్టెంబర్లో జరిగే అమెరికా పర్యటన సందర్భంగా కొలంబియా యూనివర్సిటీ సెంటర్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ రాధిక అయ్యంగార్ను కలిశాను. ఐక్యరాజ్యసమితి స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకీన్ కుమార్తో కలిసి రాధిక అయ్యంగార్తో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయడం వల్ల చాలా కొత్త విషయాలు తెలుగు పాఠకులకు అందించగలిగాం. ప్రపంచ ఐక్యత కోసం, దేశాల మధ్య సమస్యల పరిష్కారం, ప్రపంచ శాంతి కోసం, పౌర హక్కుల కోసం పనిచేసే ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం ఒక రకంగా ప్రతీ ఒక్కరికి ఎన్నో పాఠాలు చెబుతుంది. అనుభవాలు గొప్పగా అనిపించాయి. మంగా వెంకన్న, సీనియర్ న్యూస్ కోఆర్డినేటర్, సాక్షి -
అన్నా.. ఇది పద్ధతి కాదే.. పవన్ కళ్యాణ్ కు అభిమాని చురకలు
పవన్ కళ్యాణ్.. నేను ప్రశ్నిస్తూనే ఉంటానంటూ ప్రతీ సారి చెప్పుకునే పీకే.. ఇప్పుడు పనికిరాని ప్రశ్నలు వేసి నవ్వులపాలవుతున్నాడు. తనకు తెలియని విద్యావిధానం గురించి, ఇంకెవరో రాసిచ్చిన ప్రశ్నలను అనుసంధానం చేసి.. దాన్ని సోషల్ మీడియా వేదికగా సంధించి ప్రభుత్వంపై బురద జల్లాలనుకున్న పవన్ ప్రయత్నం పాపం.. బెడిసికొట్టింది. ఆంధ్రప్రదేశ్ విద్యావిధానాలు భేష్ ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్ ప్రభుత్వం విద్యార్థుల కోసం చేస్తున్న ప్రయత్నాలు, తీసుకొచ్చిన పథకాలకు దేశవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు వచ్చాయి. అమెరికా న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి వేదికగా జులై మూడో వారంలో జరిగిన హైలెవల్ పొలిటికల్ డిస్కషన్ మీట్ సందర్భంగా ఏపీ ప్రతినిధులు ప్రత్యేకంగా రాష్ట్రంలో చేపడుతున్న విద్యావిధానాలను ఐక్యరాజ్యసమితి సమావేశంలో ప్రజెంట్ తీసుకొచ్చారు. పేదరికాన్ని పారదోలాలంటే విద్యకు మించిన విధానం మరొకటి లేదన్న సీఎం జగన్ ఆశయానికి పలు ప్రశంసలు వచ్చాయి. (ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ఏపీ ప్రభుత్వ విద్యావిధానాలపై స్టాల్) (చదవండి : ఏపీ విద్యావిధానాలు భేష్) విద్యార్థులకిచ్చిన ట్యాబ్లెట్లపై అక్కసు ఏపీ విధానాలను అందరూ ప్రశంసిస్తుంటే.. కొందరిలో మాత్రం అక్కసు మొదలైంది. అసలు పేద విద్యార్థులకు ట్యాబ్లు ఎలా ఇస్తారన్నట్టుగా వీరి వ్యవహారం తయారయింది. విద్యార్థుల విషయ పరిజ్ఞానం పెంచుకునేందుకు ట్యాబ్లు ఉపయోగపడుతాయన్న కనీస స్పృహ లేకుండా.. దానిపై చిలువలు పలువలుగా వ్యాఖ్యానాలు జోడించి, కొన్ని ప్రశ్నలను ట్విట్టర్ వేదికగా వదిలారు పవన్ కళ్యాణ్. Points to note : 1. ప్రభుత్వం బైజూస్ కంటెంట్ లోడ్ చేసిన టాబ్లెట్స్ కోసం దాదాపు 580 కోట్లు ఖర్చు చేస్తుంది. బహిరంగ మార్కెట్ లో ఒక్కొక్క టాబ్లెట్ విలువ 18,000 నుండి 20,000 ఉంటుంది. 2. బైజూస్ CEO రవీంద్రన్ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) లో భాగంగా 8వ తరగతి… — Pawan Kalyan (@PawanKalyan) July 23, 2023 సొంత అభిమాని నుంచే పవన్ కు ప్రశ్న పవన్ వ్యాఖ్యలను చాలా మంది తప్పుబట్టారు. అయితే వారంతా ప్రభుత్వానికి చెందిన వారని, వైఎస్సార్ సిపి క్యాడర్ అని జనసేన చెప్పుకోవచ్చు కానీ.. పవన్ ట్వీట్కు సొంత అభిమాని రమేష్ బోయపాటి నుంచి ఎదురయిన విమర్శను మాత్రం కచ్చితంగా క్షుణ్ణంగా చదవాల్సిందే. మీ సినిమాలు చూస్తాను, మిమ్మల్ని అనుసరిస్తాను కానీ, పేద విద్యార్థులకు మేలు చేసే విద్యావిధానాన్ని విమర్శిస్తే మాత్రం మౌనంగా ఉండలేనంటూ నేరుగా స్పందన వచ్చింది. ప్రస్తుతం అనుసరిస్తున్న విద్యావిధానంలో కచ్చితంగా సీఎం జగన్ ప్రభుత్వాన్ని అభినందించాల్సిందేనంటూ నొక్కి వక్కాణించారు రమేష్ బోయపాటి. పవన్ కళ్యాణ్ గారు బైజూస్ తో రాష్ట్రం కుదుర్చుకున్న ఒప్పందం గురించి మీరు లేవనెత్తిన సందేహాలు విలువైనవి. ఇక్కడ మీ ట్వీట్ ఉద్దేశం బైజూస్ తో ఒప్పందం గురించి కన్నా, ఆ ఒప్పందంలో ఉన్న అనేక సందేహాల గురించి అర్థం చేసుకునే ప్రయత్నం అనిపించింది. నేను కూడా ఈ విషయం గురించి అవగాహన ఏర్పరుచుకునే… pic.twitter.com/thDcCgldYM — Ramesh Boyapati (@rameshboyapati) July 24, 2023 -
బాలల సంరక్షణకు భారత్ చర్యలు భేష్
ఐక్యరాజ్య సమితి: అంతర్జాతీయంగా భారత్కు మరో శుభపరిణామమిది. చిన్న పిల్లలు సాయుధ పోరాటాల వైపు వెళ్లకుండా కట్టడి చేసినందుకు గాను ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ (యూఎన్ఎస్జీ) వార్షిక నివేదిక నుంచి భారత్ పేరును తొలగించినట్టుగా యూఎన్ సెకట్రరీ జనరల్ ఆంటోనియా గుటెరెస్ తెలిపారు. సాయుధ ఘర్షణల ప్రభావం పడకుండా చిన్నారుల మెరుగైన సంరక్షణ కోసం భారత్ తీసుకున్న చర్యల్ని గుటెరెస్ స్వాగతించారు. 2010 నుంచి భారత్ పేరు ఈ నివేదికలో ఉంటూ వస్తోంది. కశ్మీర్లో ఉగ్రసంస్థలు బాలలను నియమించడం, భద్రత పేరుతో సైనికులు తిరిగి అదుపులోకి తీసుకోవడం వంటివాటితో భారత్ పేరు ఆ నివేదికలో ఉంటూ వస్తోంది. భారత్తో పాటు బుర్కినా ఫాసో, కేమరూన్, నైజీరియా, పాకిస్తాన్, ఫిలిఫ్పీన్స్లోనూ చిన్నారులు ఉగ్రముఠాల్లో చేరుతున్నట్టు యూఎన్ నివేదికలు చెబుతున్నాయి. బాలల హక్కుల పరిరక్షణకు కశ్మీర్లో ఒక కమిషన్ను ఏర్పాటు చేయడంపై గుటెరెస్ హర్షం వ్యక్తం చేశారు. బాలల సంక్షేమం కోసం చేపట్టిన చర్యలతో ఛత్తీస్గఢ్, అసోం, జార్ఖండ్, ఒడిశా, జమ్ముకశ్మీర్లలో బాలల సంరక్షణ మెరుగైందని ఆ నివేదిక వెల్లడించింది. -
కాంగోలో వరదల బీభత్సం..200 మందికిపైగా మృతి
ఆఫ్రికా దేశమైన డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో వరదలు బీభత్సం సృష్టించాయి. గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా దక్షిణ ప్రావిన్స్లోని కలేహలో నదులు వరదలతో పోటెత్తాయి. దీంతో బుషుషు, న్యాముకుబి వంటి గ్రామాలను ముంచెత్తింది. ఈ వరదల ధాటికి కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 200 మందికిపైగా మృతి చెందగా, పలువురు గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే 203 మృతదేహాలను గుర్తించినట్లు సివిల్ సొసైటీ సభ్యుడు కసోల్ మార్టిన్ చెప్పారు భారీ వర్షాల కారణంగా ఆయా ప్రాంతాల్లోని నదులు పొంగిపొర్లడంతో అనేక గ్రామాలు మునిగిపోయాయని, చాలా ఇళ్లు కొట్టుకుపోయాయని పేర్కొన్నారు. ఈ మేరకు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత డెనిస్ ముక్వేగే ప్రకృతి విపత్తులో నిరాశ్రయులైన ప్రజలకు తక్షణ వైద్య సాయం అందించేలా వైద్యులను, సాంకేతిక నిపుణలను ఆయా ప్రాంతాలకు పంపినట్లు ప్రకటించారు. ఐతే రువాండ సరిహద్దులో ఉన్న దక్షిన కిపులో తరచుగా వరదలు, కొండచరియలు విరిగిపడటం సర్వసాధారణమని అధికారులు చెబుతున్నారు. కాగా, ఈ వారం రువాండాలో భారీ వర్షాలకు వరదలు సంభవించి.. కొండచరియలు విరిగిపడటంతో సుమారు 130 మంది దాక మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ విధ్వంసంలో ఐదువేలకు పైగా గృహాలు ధ్వంసమైనట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, రువాండ, కాంగోలో సంభవించిన ప్రకృతి విపత్తులకు ప్రభావితమైన ప్రజలకు యూఎన్ సెక్రటరీ జనరల్ గుటెర్రెస్ తన సంతాపాన్ని తెలియజేశారు. గ్లోబల్ వార్మింగ్ కోసం ఎలాంటి చర్యలు తీసుకోని దేశాలకు ఇదోక వినాశకరమైన ఉదాహరణ అని పేర్కొంది. వేగవంతమైన వాతావరణ మార్పులకు ఇదొక మచ్చుతునక అని స్పష్టం చేసింది. కాగా, 2014లో కూడా కాంగో ఇంతే స్థాయిలో ప్రకృతి విపత్తుని ఎదర్కొన్నట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొంది. నాటి విధ్వంసంలో సుమారు 130 మందికి పైగా ప్రజలు గల్లంతయ్యినట్లు యూఎన్ పేర్కొంది. (చదవండి: చైనా తమ దేశంలోని పేదరికం గురించి బయటకు పొక్కనీయదు..ఆఖరికి ఆన్లైన్ వీడియోలను) -
పర్యావరణానికి ‘లైఫ్’
కెవాడియా: వాతావరణ మార్పుల కారణంగా విధ్వంసకరమైన పరిణామాల నుంచి మన భూమండలాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా భారత్ ఆధ్వర్యంలో ఒక అంతర్జాతీయ కార్యాచరణ రూపు దిద్దుకుంది. ప్రధాని మోదీ, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్ సంయుక్తంగా మిషన్ లైఫ్(లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్)ను ప్రారంభించారు. ప్రజలు తమ జీవన విధానాన్ని మార్చుకోవడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని, దీనిని ప్రపంచ దేశాల ప్రజల్లోకి ఒక ఉద్యమంలా తీసుకువెళ్లాలని నిర్ణయించారు. గుజరాత్లోని ఐక్యతా విగ్రహం దగ్గర గురువారం లైఫ్ మిషన్ను ప్రారంభించారు. ప్రజలు లైఫ్ స్టైల్లో మార్చుకోవాల్సిన జాబితాతో పాటు లైఫ్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ మిషన్ పీ3 మోడల్ అని ప్రో ప్లేనెట్, పీపుల్గా వ్యాఖ్యానించారు. ‘రెడ్యూస్, రీయూజ్, రీ సైకిల్’ విధానాన్ని అందరూ అనుసరించాలని ప్రధాని పిలుపునిచ్చారు. ప్రజలు చేయాల్సిందిదే..! ప్రతీ రోజూ ఒక వ్యక్తి జిమ్కి వెళ్లడానికి పెట్రోల్తో నడిచే బైక్, కారు వంటి వాహనాన్ని వాడే బదులుగా సైకిల్పై వెళ్లడం మంచిదన్నారు. ఎల్ఈడీ బల్బులు వాడితే విద్యుత్ బిల్లులు తగ్గడమే కాకుండా పర్యావరణానికి మేలు జరుగుతుందని ప్రధాని హితవు పలికారు. ఇలాంటివన్నీ ప్రజలందరూ మూకుమ్మడిగా పాటిస్తే ప్రపంచ దేశ ప్రజలందరి మధ్య ఐక్యత పెరుగుతుందని మోదీ చెప్పారు. ప్రకృతి వనరుల్ని అతిగా వాడొద్దు : గుటెరస్ ప్రకృతి వనరుల్ని అతిగా వినియోగించడం వల్ల పర్యావరణానికి హాని జరుగుతోందని గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. జీ–20 దేశాలు 80 శాతం గ్రీన్ హౌస్ వాయువుల్ని విడుదల చేస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చెప్పిన మాటల్ని గుటెరస్ గుర్తు చేసుకున్నారు. ‘‘ప్రతీ ఒక్కరి అవసరాలు తీర్చే వనరులు ఈ భూమిపై ఉన్నాయి. కానీ అందరి అత్యాశలను నెరవేర్చే శక్తి భూమికి లేదు. దురదృష్టవశాత్తూ ఇవాళ రేపు ప్రతీ ఒక్కరూ అత్యాశకి పోతున్నారు. దానిని మనం మార్చాలి’’ అని కొన్ని దశాబ్దాల కిందటే గాంధీజీ చెప్పారని ఇప్పటికీ అది అనుసరణీయమని వ్యాఖ్యానించారు. భారత్ తీసుకువచ్చిన ఈ కార్యాచరణని ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయి. -
World Refugee Day: బతుకు జీవుడా
ఉక్రెయిన్పై రష్యా దండయాత్రతో శరణార్థి సంక్షోభం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రష్యా సైన్యం నుంచి ఏ క్షణం ఎటు వైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయంతో ప్రాణాలరచేతుల్లో పెట్టుకొని కట్టుబట్టలతో కన్న భూమిని విడిచి వెళ్లిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏడాదికేడాది పెరిగిపోతున్న శరణార్థుల్ని చూసే దిక్కు లేక దుర్భర జీవితాన్ని కొనసాగిస్తున్నారు. శరణార్థుల దుస్థితిపై అవగాహన కల్పించడానికి, వారిని అన్ని విధాలా ఆదుకోవడానికి ఐక్యరాజ్య సమితి ప్రతీ ఏడాది జూన్ 20న ప్రపంచ శరణార్థుల దినం నిర్వహిస్తోంది. 10 కోట్లు.. అక్షరాలా పది కోట్లు మంది ప్రపంచవ్యాప్తంగా.. ఉన్న ఊరుని విడిచి పెట్టి మెరుగైన జీవితాన్ని వెతుక్కుంటూ వెళ్లిపోయారు. యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఆఫ్ రెఫ్యూజీస్ (యూఎన్హెచ్సీఆర్) తేల్చిన లెక్కలు ఇవి. యుద్ధాలు, అంతర్గత ఘర్షణలు, వాతావరణ మార్పులు, ఆకలి కేకలు, అణచివేత, హింసాకాండ, మానవహక్కుల హననం వంటి కారణాలు దశాబ్ద కాలంగా శరణార్థుల సంఖ్యను పెంచేస్తున్నాయి. కరోనా సంక్షోభం, ఉక్రెయిన్పై రష్యా దాడి, శ్రీలంకలో ఆర్థిక సంక్షోభంతో బలవంతంగా వలస బాట పట్టినవారు ఎందరో ఉన్నారు. ఏటికేడు శరణార్థుల సంఖ్య ఎలా పెరుగుతోందంటే వీళ్లందరూ ఒకే ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటే అది ప్రపంచంలో అతి పెద్ద జనాభా కలిగిన 14వ దేశంగా అవతరిస్తుంది. అందులోనూ ఉక్రెయిన్పై రష్యా దండయాత్రతో ప్రపంచవ్యాప్తంగా శరణార్థుల సంఖ్య రికార్డు స్థాయికి చేరుకుంది. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం 2021 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 8.9 కోట్ల మంది శరణార్థులు ఉంటే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత వారి సంఖ్య 10 కోట్లు దాటేసింది ప్రపంచాన్ని కుదిపేసిన సంక్షోభాలు ఉక్రెయిన్ ఉక్రెయిన్పై రష్యా ఈ ఏడాది ఫిబ్రవరి 24 నుంచి చేస్తున్న భీకరమైన దాడులతో ఇప్పటివరకు 50 లక్షల మందికిపైగా శరణార్థులుగా ఇతర దేశాలకు వెళ్లిపోయారు. ఇక అంతర్గతంగా చెట్టుకొకరు పుట్టకొకరుగా వెళ్లిపోయిన వారు 80 లక్షల మంది వరకు ఉంటారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శరణార్థి సంక్షోభం రికార్డు స్థాయికి చేరుకుంది ఇప్పుడే. పోలండ్, రష్యా, రుమేనియా వంటి దేశాలు ఉక్రెయిన్ శరణార్థులను అక్కున చేర్చుకుంటున్నాయి. వారి అవసరాలు తీరుస్తున్నాయి. సిరియా దాదాపుగా పదేళ్ల పాటు అంతర్యుద్ధంతో నలిగిపోయిన సిరియాలో 2021 చివరి నాటికి 67 లక్షల మంది సిరియన్లు శరణార్థులుగా ఇతర దేశాలకు వెళ్లిపోయారు. లెబనాన్, జోర్డాన్, ఇరాక్, ఈజిప్టు, టర్కీ దేశాల్లో వీరంతా బతుకులీడుస్తున్నారు. అఫ్గానిస్తాన్ ఈ దేశం నుంచి నిరంతరం శరణార్థులుగా ఇతర దేశాలకు వెళ్లేవారు చాలా ఎక్కువ. ప్రతీ పది మందిలో ఒకరు అక్కడ జీవనం సాగించలేక ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారు. కనీసం 26 లక్షల మంది శరణార్థి శిబిరాల్లోనే పుట్టారు. సూడాన్ దక్షిణ సూడాన్లో నిరంతర ఘర్షణలతో ఇల్లు వీడి వెళ్లిన వారి సంఖ్య 40 లక్షలు ఉంటే, 26 లక్షల మంది దేశం విడిచి వేరే దేశాలకు వెళ్లిపోయారు. మయన్మార్ మయన్మార్లో రోహింగ్యాలను మైనార్టీల పేరుతో ఊచకోత కోస్తూ దేశం నుంచి తరిమి కొట్టడంతో ఏకంగా 10 లక్షల మంది ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లిపోయారు. ఆదుకోవడం ఎలా? శరణార్థులుగా ఇతర దేశాలకు వెళుతున్న వారికి కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ అందించడానికి ఆయా దేశాలు ఎంతో చేస్తున్నాయి. కానీ కేవలం అవి చేస్తే సరిపోవు. వారికి విద్య, ఆరోగ్యం, ఉపాధి, కుటుంబం , స్థిరత్వం అన్నింటికంటే గుర్తింపు కూడా అత్యంత ముఖ్యం. ఇల్లు, దేశం విడిచి వెళ్లిన శరణార్థి ఇతర దేశాల్లో స్థిరపడడానికి కనీసం 20 ఏళ్లు వేచి చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం నిధుల కొరత. శరణార్థులు కొత్త జీవితం గడపడానికి అవసరమైన నిధులు అందడం లేదు. ప్రతీ ఏడాది మానవీయ సంక్షోభాలు లెక్కకు మించి వస్తూ ఉండడంతో కనీసం వెయ్యి కోట్ల డాలర్లు (రూ.77,000 కోట్లు) లోటు ఉంది. యెమెన్, అఫ్గానిస్తాన్, సూడాన్లో శరణార్థులుగా మారిన వారిలో మూడో వంతు మందికి కూడా సాయం అందలేదని యూఎన్ లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ కాకుండా నిత్యం శరణార్థుల్ని పుట్టించే 30 ఘర్షణాత్మక ప్రాంతాలు ప్రపంచంలో ఉన్నాయి. శరణార్థుల్లో సగానికి సగం మంది పిల్లలే ఉండడం ఆందోళనకరం. వారిలో ఒక్క శాతం మందికి కూడా సాయం అందడం లేదు. సంపన్న దేశాలు ఇకనైనా శరణార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. –సాక్షి, నేషనల్ డెస్క్ -
అణు నిఘాను ఇరాన్ అడ్డుకుంటోంది
వియెన్నా: అణు కేంద్రాల వద్ద ఉన్న నిఘా కెమెరాలను ఇరాన్ తొలగించడంపై ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ) ఆందోళన వ్యక్తం చేసింది. ఐఏఈఏ పర్యవేక్షణ కోసం నతాంజ్ భూగర్భ అణు శుద్ధి కేంద్రం వద్ద బిగించిన రెండు కెమెరాలను ఆఫ్ చేసినట్లు బుధవారం ఇరాన్ ప్రకటించింది. యురేనియం శుద్ధిని మరింత వేగవంతం చేయనున్నట్లు కూడా ఇరాన్ ఐఏఈఏకి సమాచారం అందించింది. అగ్రరాజ్యాలతో జరుగుతున్న అణు చర్చల్లో ప్రతిష్టంభన నేపథ్యంలో ఒత్తిడి పెంచేందుకే ఇరాన్ ఈ ప్రకటన చేసినట్లు భావిస్తున్నారు. దేశంలోని మూడు అప్రటిత ప్రాంతాల్లో కనుగొన్న అణుధార్మిక పదార్ధాలకు సంబంధించి విశ్వసనీయమైన సమాచారం అందించడంలో విఫలమైందంటూ ఇరాన్ను బుధవారం ఐఏఈఏ తప్పుబట్టింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని ఐఏఈఏలోని 35 దేశాలకు 30 బలపరిచాయి. తీర్మానాన్ని రష్యా, చైనా వీటో చేయగా లిబియా, పాకిస్తాన్, భారత్ ఓటింగ్లో పాల్గొనలేదు. ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రఫేల్ మరియానోవియెన్నాలో మీడియాతో మాట్లాడారు. ఇరాన్ అధికారులు నతాంజ్, ఇస్ఫాహాన్ల వద్ద ఉన్న రెండు మాత్రమే కాదు, మొత్తం 40కి పైగా కెమెరాలకు గాను 27 కెమెరాలను మూసేసినట్లు సమాచారం ఉందన్నారు. ఈ చర్యతో ఇరాన్ అణు కార్యక్రమం పురోగతి వివరాలు అంతర్జాతీయ సమాజానికి వెల్లడయ్యే అవకాశం లేదన్నారు. అణుకేంద్రాల వద్ద అమర్చిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీని ఇరాన్ 2021 నుంచే ఐఏఈఏకి అందించడం మానేసింది. -
సమీపంలో మహా సంక్షోభం
ఉత్తరాదిన భానుడి చండప్రతాపం 50 డిగ్రీల సెంటీగ్రేడ్. అంటే గడచిన 122 ఏళ్ళలో ఎన్నడూ లేనంతగా ఈ మార్చి, ఏప్రిల్లలో ఉష్ణోగ్రత. దక్షిణాదిన బెంగుళూరులో గంటల వ్యవధిలో ఒక్కపెట్టున కురిసిన వర్షంతో తిప్పలు. అస్సామ్ సహా ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు, భూపతనాలు. ఎండ, వాన, చలి – అన్నీ అతిగానే! ఏదైనా అకాలమే!! ఈ శతాబ్దంలో భారత్ ఎదుర్కొంటున్న పెను ముప్పు వాతావరణ సంక్షోభం అని శాస్త్రవేత్తలు మొత్తుకుంటున్నది అందుకే! ప్రపంచ వ్యాప్తం గానూ ప్రధాన సమస్యలు – వాతావరణ మార్పులు, కాలుష్యమే. ఐక్యరాజ్య సమితి (ఐరాస) తాజా నివేదికలు ఆ మాటే చెబుతున్నాయి. వాతావరణ మార్పునకు ప్రధాన సూచికలైన నాలుగూ (గ్రీన్హౌస్ వాయువుల సాంద్రత, సముద్ర మట్టంలో పెరుగుదల, మహాసముద్రాల వేడిమి, ఆమ్లీకరణ) గత ఏడాది రికార్డు స్థాయిలో పెరిగాయి. మానవాళి మహా సంక్షోభం దిశగా వెళుతోంద నడానికి ఇదే సాక్ష్యమంటూ ఐరాస ప్రమాద ఘంటిక మోగిస్తోంది. ఒక రకంగా ఐరాస విడుదల చేసిన వాతావరణ రిపోర్ట్ కార్డు ఇది. దీన్ని బట్టి చూస్తే, ఉష్ణోగ్రతను పెంచే గ్రీన్హౌస్ వాయువుల స్థాయి ప్రపంచమంతటా 2020లోనూ, ఆ వెంటనే 2021లోనూ పెరుగుతూ పోయింది. పారిశ్రామికీకరణ ముందు రోజులతో పోలిస్తే ఇప్పుడు వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ సాంద్రత ఏకంగా 149 శాతం హెచ్చింది. ఇక, సముద్రమట్టం ఏటా సగటున 4.5 మి.మీ. వంతున పెరుగుతోంది. మహా సముద్రాల ఉష్ణోగ్రత, ఆమ్లీకరణ సైతం ఎక్కువవుతూ వస్తోంది. దీని వల్ల పగడాల దిబ్బలలాంటి నీటిలోని జీవావరణ వ్యవస్థలు, ప్రాణికోటి నాశనమవుతాయి. కాలుష్యం సంగతికొస్తే – వాయు, జల, రసాయన తదితర కారణాలతో ఒక్క 2019లోనే ప్రపంచవ్యాప్తంగా 90 లక్షల మంది మరణించారు. ‘లాన్సెట్ ప్లానెటరీ హెల్త్’ బుధవారం బయటపెట్టిన ఈ లెక్క ప్రకారం ప్రతి 6 మరణాల్లో ఒకటి కాలుష్య మరణమే. ఈ మొత్తంలో దాదాపు 24 లక్షల చావులు భారత్లో సంభవించినవే. ప్రపంచ కాలుష్య మరణాల్లో 66.7 లక్షల ప్రధాన వాటా వాయు కాలుష్యానిది. మన దేశంలోనూ కాలుష్య కోరలకు బలైన 24 లక్షల మందిలో... 16.7 లక్షల మంది పీల్చే గాలే ప్రాణాంతకమైనవారు. ఆ లెక్కన భారత్లో వాయు కాలుష్య మరణాల సంఖ్య ప్రపంచంలోని ఏ దేశంలోనూ లేనంత ఎక్కువ. భారత్లోనే కాదు... ప్రపంచమంతటా ఉగ్ర ఉష్ణపవనాలు, తుపానులు, అకాల వర్షాలు, కొన్నిచోట్ల అనావృష్టి, సముద్రమట్టాల పెరుగుదల ఊహించని రీతిలో తరచుగా సంభవిస్తున్నాయి. వీటికి కాలుష్యం, పర్యావరణ మార్పులే కారణమన్నది శాస్త్రవేత్తల విశ్లేషణ. దేశంలో ఇవాళ 63.8 కోట్ల జనాభాకు ఆవాసమైన 75 శాతానికి పైగా జిల్లాలు ఈ విపరీత వాతావరణ మార్పులకు కేంద్రాలట. ఇలాంటి వాతావరణ వైపరీత్యాలు 1970 నుంచి 2019 మధ్య 50 ఏళ్ళలో 20 రెట్లకు పైగా పెరిగాయి. భారతీయ మేధావుల బృందమైన ‘కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్’ (సీఈఈడబ్లు్య) తన అధ్యయనంలో ఈ సంగతి తేల్చింది. ఇది పైకి కనిపించకుండా శ్రామికశక్తినీ, ఆర్థిక వ్యవస్థనూ కూడా దెబ్బతీస్తున్న విషవలయం. ఏ ఏటికాయేడు పెరుగుతున్న వైపరీత్యాలతో ఇటు పట్నాల్లో, అటు పల్లెల్లో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది. జీవనోపాధి పోతోంది. స్వయంకృతాపరాధమైన వాతావరణ వైపరీత్యాలతో భారీ సామాజిక ఆర్థిక మూల్యం చెల్లిం చాల్సి వస్తోంది. పెరుగుతున్న వేడిమి వల్ల వ్యావసాయిక ఉత్పత్తి క్షీణిస్తోంది. ఏటా 2.5 నుంచి 4.5 శాతం స్థూల జాతీయోత్పత్తిని నష్టపోయే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ శ్రామిక సంస్థ (ఐఎల్ఓ) లెక్క ప్రకారం ఉష్ణతాపంతో తీవ్రంగా దెబ్బతింటున్న దేశాల్లో భారత్ ఒకటి. వేడిమి వల్ల 1995లో దేశంలో 4.3 శాతం పని గంటలు వృథా అయ్యాయి. వచ్చే 2030 నాటికి ఆ వృథా 5.8 శాతానికి చేరుతుందని అంచనా. దేశంలో గోధుమల ధర పెరగడానికీ పరోక్షంగా వాతావరణ మార్పులే కారణం. ఈ వేసవిలో ఉష్ణపవనాలతో 10 నుంచి 15 శాతం గోధుమ పంట నష్టపోయాం. అదే సమ యంలో ప్రపంచ గోధుమల ఎగుమతిలో ప్రధాన పాత్రధారి ఉక్రెయిన్పై రష్యా యుద్ధంతో సరఫరా చిక్కుల్లో పడింది. గో«ధుమ పిండి ఖరీదైపోయి, సామాన్యుల చపాతీలపై దెబ్బ పడింది. ఇలాంటి ఉదాహరణలు అనేకం. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు నీటి భద్రత పైనా ప్రభావం చూపనున్నాయి. మరి, నీటి లభ్యతను కాపాడుకోవడంలో, నిల్వ చేసుకోవడంలో ఎలాంటి చర్యలు చేపడుతున్నాం? తాత్కాలిక పరిష్కారాలతో సమస్య తీరేది కాదు. కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణకు విధానపరమైన మార్పులు తప్పనిసరి. పునర్వినియోగ ఇంధనం దిశగా మళ్ళాలి. వేడిని పెంచే ఏసీలు, కార్ల బదులు గాలి – వెలుతురు ధారాళంగా వచ్చే ఇళ్ళు, చల్లటి మిద్దెలు, హరితవనాల పెంపకం, అనువైన పౌర రవాణా వ్యవస్థలను ఆశ్రయించాలి. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కీలకం. నిజానికి ప్రతి రాష్ట్రంలో వాతావరణ మార్పును పర్యవేక్షించే సెల్ ఉంది. వాటన్నిటికీ పెద్దగా ప్రధాన మంత్రికి వాతావరణ మార్పుపై సలహాలిచ్చే కౌన్సిల్ కూడా ఉంది. కానీ, 2015 జనవరిలో తొలి సమావేశం తర్వాత మళ్ళీ ఇప్పటి దాకా సదరు కౌన్సిల్ కలిస్తే ఒట్టు. అలాగే, అన్ని రాష్ట్రాల్లోని సెల్స్ను కూడా పట్టించుకుంటున్న పాపాన పోలేదు. ప్రకృతి పెనుకేక పెడుతోంది. చెవి ఒగ్గకపోతే ముప్పు మనకీ, మన పిల్లలకే! -
చదవడమే మొదలు...
ఒకరోజు ఆన్ మోర్గాన్ తన బుక్షెల్ఫ్ చూసుకుంది. సుమారు ఇరవై ఏళ్ల గొప్ప కలెక్షన్ అది. కానీ ప్రధానంగా అన్నీ ఇంగ్లిష్, నార్త్ అమెరికన్ పుస్తకాలే. ఈ లండన్ నివాసికి ఏమాత్రమూ సంతృప్తి కలగలేదు. ‘ఇరవై ఏళ్లుగా చదువుతున్నానే! కానీ ఒక విదేశీ భాషా పుస్తకాన్ని నేను దాదాపుగా ముట్టుకోనేలేదు’ అనుకుంది. అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చింది, ప్రపంచంలోని దేశాలన్నింటికీ సంబంధించి కనీసం ఒక్క పుస్తకమైనా చదవాలని. ఐక్యరాజ్య సమితి గుర్తింపున్న 193 దేశాల జాబితా చూసుకుని తన యజ్ఞం మొదలుపెట్టింది. దీన్ని యజ్ఞం అనడం ఎందుకంటే, వీటన్నింటినీ ఒక్క సంవత్సరంలోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం వల్ల! ఇందులో ఉన్న సవాళ్లు ఏమిటంటే– అన్ని దేశాల పుస్తకాలు సంపాదించాలి; డబ్బు, శ్రమ. ఒక దేశానిది ఒకటే అనుకున్నప్పుడు ఏది ఎంపిక చేసుకోవాలనే సమస్య ఉండనే ఉంది. క్లాసిక్స్, జానపదాలు, సమకాలీన సాహిత్యం, నవలలు, కథాసంపుటాలు, ఆత్మకథలు, బెస్ట్ సెల్లర్స్... ఎలా వడపోయాలి? జపాకు ప్రాతినిధ్యం వహించగలిగే పుస్తకం ఏది? ఏది చదివితే కువైట్ సరిగ్గా అర్థమవుతుంది? ఉత్తర కొరియా నుంచి ఎలాంటిది తీసుకోవాలి? ఏది చదివితే తోగో పరిచయం అవుతుంది? ఖతార్కు చేరువ కాగలిగే పుస్తకం ఏది? వీటన్నింటినీ మదిలో ఉంచుకుని, స్నేహితులు, తెలిసినవాళ్లు, ఔత్సాహికుల సాయంతో పుస్తకాలు సేకరించడం మొదలుపెట్టింది. అసలైన సమస్య ఇంకోటుంది. రోజువారీ పనులు మన కోసం ఆగవు. మోర్గాన్ వృత్తిరీత్యా పాత్రికేయురాలు. ఏడాదిలో పూర్తి చేయాలన్న లక్ష్యం చేరాలంటే, అటూయిటుగా ఒక్కో పుస్తకం 200–300 పేజీలు ఉంటుందనుకుంటే, 1.85 రోజులో పుస్తకం చదివెయ్యాలి. చదవడంతోపాటు చిన్న సమీక్ష రాయాలనుకుంది. ఆ పుస్తకం ఎలాంటిదో చెబుతూ తన పఠనానుభవాల్ని కూడా జోడిస్తూ బ్లాగ్ రాసుకుంటూ పోయింది. భూటాన్, బెలారస్, మంగోలియా, బురుండి, మొజాంబిక్ లాంటి ఎన్నో దేశాల పుస్తకాలు ఆమె జాబితాలో ఉన్నాయి. ఇంతకీ భారత్ నుంచి ఏం తీసుకుంది? పదేళ్లు చదివినా భారతీయ వైవిధ్యభరిత సారస్వత వైభవపు ఉపరితలాన్ని కూడా చేరలేనని తనకు తెలుసంటుంది మోర్గాన్ . కానీ లెక్క కోసం ఎం.టి.వాసుదేవన్ నాయర్ మలయాళీ నవల ‘కాలం’ తీసుకుంది. అది ఆమెకు గొప్పగా నచ్చింది కూడా! తన పఠనానుభవాలన్నింటినీ కలిపి 2015లో ‘ద వరల్డ్ బిట్వీన్ టు కవర్స్: రీడింగ్ ద గ్లోబ్’ పుస్తకంగా ప్రచురించింది. గతేడాది చైనా మూలాలున్న అమెరికా రచయిత్రి యీయూన్ లీ కూడా ఇలాంటి పనే చేసింది. కాకపోతే ఆమె ప్రయోగం వేరు. కోవిడ్ మహమ్మారి మొదలైన కొత్తలో బయటికి వెళ్లలేని జీవితంతో విసుగెత్తి ఆన్ లైన్ జీవితాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలనుకుంది. దానికిగానూ తనలాంటి వారందరినీ ఆహ్వానిస్తూ, లియో టాల్స్టాయ్ మహానవల ‘యుద్ధము–శాంతి’ని సామూహిక పఠనం చేద్దామని పిలుపునిచ్చింది. రోజూ ఒక అరగంట సేపు 12–15 పేజీలు చదవడం, చర్చించుకోవడం, మొత్తంగా 85 రోజుల్లో వెయ్యికి పైగా పేజీల నవల పూర్తయ్యింది. తన పఠనానుభవాలను ‘టాల్స్టాయ్ టుగెదర్: 85 డేస్ ఆఫ్ వార్ అండ్ పీస్’ పేరుతో పుస్తకంగా రాసింది లీ. ఇరాకు చెందిన ప్రొఫెసర్ అజర్ నఫీసీ అనుభవం దీనికి భిన్నమైనది. ఆమె ‘రీడింగ్ లోలిటా ఇన్ తెహ్రాన్ ’ పేరుతో 2003లో పుస్తకం ప్రచురించింది. ఛాందస ప్రభుత్వంలో తనలాంటి ఉదారవాది ఎదుర్కొన్న ఇబ్బందులను తెలియజెప్పడమే రచన లక్ష్యం అయినప్పటికీ పుస్తకాల ఊతంగా తన అనుభవాలను చెప్పడం ఇందులోని విశేషం. కొన్ని పాశ్చాత్య రచనలను గురించి తన విద్యార్థులతో చర్చించే నేపథ్యంలో ఈ రచన సాగుతుంది. ఇందులో చర్చకు వచ్చే కొన్ని పుస్తకాలు: మదామ్ బావరీ(ఫ్లాబే), ద గ్రేట్ గాట్స్బీ(ఫిట్జ్గెరాల్డ్), ద డైరీ ఆఫ్ ఆన్ ఫ్రాంక్, ద ట్రయల్ (కాఫ్కా), ద అడ్వెంచర్స్ ఆఫ్ హకల్బెరీ ఫిన్ (మార్క్ ట్వెయిన్ ). మానవ లైంగికతను ప్రధానంగా చేసుకొన్న నబకోవ్ నవల ‘లోలిటా’ కూడా ఇందులో ఉంది. దాన్నే పుస్తక శీర్షికగా ఎంచుకోవడానికి కారణం – ఇరాన్ లాంటి దేశంలో ఉండే పరిమితులు, పరిధులు, ఆంక్షలను తెలియజెప్పడానికే! పుస్తకాన్ని రాయడం గొప్పనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కానీ దాన్ని చదవడంలో కూడా గొప్పతనం తక్కువా? ఒక వెయ్యి పేజీల మహత్తర గ్రంథరాజాన్ని చదవడం తక్కువ ప్రయత్నంతో కూడినదా? పైగా దాన్ని చదవడం వల్ల కూడా రచయిత అనుభవాన్ని జీవించగలుగుతున్నప్పుడు, ఉత్త పాఠకులుగానే మిగిలిపోతే మాత్రమేం? పైగా రచయిత పడే శ్రమ కూడా తప్పుతుంది. కానీ మోర్గాన్ లాంటి కొందరు పాఠకులు, కేవలం వారి పఠనానుభవం కారణంగా రచయితగా మారగలిగారు. ‘మంత్ర కవాటం తెరిస్తే మహాభారతం మన చరిత్రే’ రాసినప్పుడు, పాత్రికేయుడు కల్లూరి భాస్కరం ప్రధాన వనరు–శీర్షిక సూచిస్తున్నట్టుగా మహాభారతమే! ఇందులోని పరిశోధనా పటిమను తక్కువ చేయడం కాదుగానీ ప్రాథమికంగా అది ఒక సీరియస్ పాఠకుడు మాత్రమే చేయగలిగే వ్యాఖ్యానం. అలాగే ‘కన్యాశుల్కం పలుకుబడి’ని వివరిస్తూ మరో జర్నలిస్ట్ మందలపర్తి కిశోర్ గురజాడ పదకోశమే వెలువరించారు. సరిగ్గా చదవడానికి పూనుకోవాలేగానీ ప్రతి పుస్తకంతోనూ ప్రపంచాన్ని దర్శించవచ్చు; అలాగే ప్రతి పుస్తకంతోనూ ప్రపంచానికి పరిచయం కూడా కావొచ్చు. ఏ రచయితైనా పాఠకుడిగానే తన కెరియర్ను మొదలుపెడతాడని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు కదా! ఇప్పుడు మీ చేతిలో ఏ పుస్తకం ఉంది? -
ఐరాసలో రష్యా దౌత్యాధికారుల బహిష్కరణ
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితిలో రష్యాకు చెందిన 12 మంది దౌత్యాధికారులను అమెరికా బహిష్కరించింది. వీరంతా గూఢచర్య కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారని ఆరోపించింది. అమెరికాది రెచ్చగొట్టే చర్యన్న రష్యా, ఐరాసకు కేంద్రకార్యాలయం ఉన్న దేశంగా అమెరికా ఈ విధంగా చేయడం ఐరాస నిబద్ధతకు వ్యతిరేకమని విమర్శించింది. ఐరాసలో రష్యా శాశ్వత రాయబార బృందానికి, ఐరాస కేంద్ర కార్యాలయానికి బహిష్కరణ విషయాన్ని తెలియజేశామని ఐరాసలో అమెరికా రాయబారి ప్రతినిధి ఓలివియా డాల్టన్ తెలిపారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని వీరిపై చర్య తీసుకున్నామని, ఐరాస కేంద్రకార్యాలయ ఒప్పంద నిబంధనలకు అనుగుణంగానే వారిని బహిష్కరించామని వివరించారు. అమెరికా చర్య నిబంధనలకు వ్యతిరేకమని రష్యా రాయబారి వాస్లీ నెబెంజియా విమర్శించారు. అమెరికా చర్యకు తప్పక ప్రతిచర్య ఉంటుందని హెచ్చరించారు. అనంతరం ఈ విషయాన్ని ఆయన భద్రతామండలి సమావేశంలో ప్రస్తావించారు. అయితే ఎజెండాలో రాయబారుల బహిష్కరణ అంశం లేదని నెబెంజియాను యూఎస్ ప్రతినిధి అడ్డుకున్నారు. ఉక్రెయిన్లో మానవీయ సంక్షోభాన్ని చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటైందన్నారు. (చదవండి: మెళ్లకు మైళ్లు నడిచి..) -
3.68 లక్షలకు చేరుకున్న ఉక్రెయిన్ వలసలు: ఐరాస
జెనీవా: రష్యా యుద్ధం కారణంగా ఉక్రెయిన్ ప్రజల వలసలు వేగంగా పెరుగుతున్నాయని ఐరాస వలస విభాగం తెలిపింది. శనివారం అంచనా ప్రకారం కనీసం 1.50 లక్షల మంది ప్రజలు ఉక్రెయిన్ వీడి పోగా ఆదివారానికి ఈ సంఖ్య 3.68 లక్షలకు చేరుకున్నట్లు పేర్కొంది. వీరంతా పోలండ్, హంగరీ, రొమేనియా తదితర దేశాల్లో తలదాచుకుంటున్నట్లు తెలిపింది. ఉక్రెయిన్ వీడి వచ్చే వారితో పోలండ్ సరిహద్దుల్లో 14 కిలోమీటర్ల పొడవైన కార్ల క్యూ ఉందని వలస విభాగం ప్రతినిధి క్రిస్ మీజర్ ట్విట్టర్లో తెలిపారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారన్నారు. ఎముకలు కొరికే చలిలో వీరు రాత్రంతా కార్లలోనే జాగారం చేశారని చెప్పారు. -
ఎలన్ మస్క్ సవాల్: అలా చేస్తే రూ.45 వేల కోట్లు ఇస్తాను
వాషింగ్టన్: ప్రపంచ కుబేరులు వారి సంపదలో చాలా తక్కువ మొత్తాన్ని దానం చేస్తే భూమ్మీద ఆకలి సమస్య ఉండదన్న యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం(యూఎన్డబ్ల్యూఎఫ్పీ) వ్యాఖ్యలపై స్పేస్ ఎక్స్ ఫౌండర్, బిలియనీర్ ఎలన్ మస్క్ స్పందించారు. ఈ క్రమంలో యూఎన్డబ్ల్యూఎఫ్పీకి ఓ సవాలు విసిరారు ఎలన్ మస్క్. ఆకలి సమస్యను పరిష్కరించడానికి యూఎన్డబ్ల్యూఎఫ్పీ మంచి ప్రణాళికతో వస్తే తాను 6 బిలియన్ డాలర్లు(4,49,13,30,00,000 రూపాయలు) ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు ఎలన్ మస్క్ ఆదివారం ట్వీట్ చేశారు. కొన్ని రోజుల క్రితం యూఎన్డబ్ల్యూఎఫ్పీ సంస్థ డైరెక్టర్ సీఎన్ఎన్తో మాట్లాడుతూ.. ‘‘మస్క్ లేదా ఇతర ప్రపంచ కుబేరుల సంపదలో కేవలం 2 శాతం దానం చేస్తే ప్రపంచంలో ఉన్న ఆకలి సమస్యను తీర్చవచ్చు’’ అన్నారు. సీఎన్ఎన్లో వచ్చిన ఈ వార్త కథనం క్లిప్పింగ్ని ఎలన్ మస్క్ సంస్థ సహా వ్యవస్థాపకుడు డాక్టర్ ఎలి డేవిడ్ ట్వీట్ చేశారు. (చదవండి: ఎంత పనిచేశావు ఎలన్మస్క్..! నీ రాక..వారికి శాపమే..!) ఎలి డేవిడ్ ట్వీట్పై మస్క్ స్పందిస్తూ.. ‘‘6 బిలియన్ల సంపదతో ప్రపంచ ఆకలిని ఎలా తీర్చగలదో యూఎన్డబ్ల్యూఎఫ్పీ ఇక్కడ ట్విటర్ థ్రెడ్లో నాకు తెలిపితే.. నేను ఇప్పుడే టెస్లా స్టాక్ను అమ్మి.. ఆ మొత్తాన్ని దానం చేస్తాను’’ అన్నారు. అంతేకాక ఈ డబ్బును ఎలా వినియోగిస్తున్నారనే దాని గురించి ప్రజలకు బహిరంగ పర్చాలని.. ఒపెన్గా ఉండాలని సూచించారు మస్క్. యూఎన్డబ్ల్యూఎఫ్పీ.. గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 155 మిలియన్ల మంది సరైన ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది. ఈ అంశంపై యూఎన్డబ్ల్యూఎఫ్పీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ డేవిడ్ బీస్లీ.. ‘‘మస్క్ తన సందలో కేవలం 2 శాతం దానం చేస్తే.. 42 మిలియన్ల మంది ప్రజల ప్రాణాలు కాపాడవచ్చు. వీరంతా ఆకలితో అలమటిస్తున్నారు. మనం వారిని ఆదుకోకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది’’ అని తెలిపారు. (చదవండి: ఎలన్ నువ్వు అసాధ్యుడివయ్యా..! అనుకుంటే ఏదైనా చేస్తావ్..!) తన వ్యాఖ్యలపై బిస్లీ మరింత వివరణ ఇస్తూ.. ‘‘ఈ బిలియనీర్ల సంపద ప్రపంచ ఆకలిని తీర్చుతుందని మేం చెప్పడం లేదు. ఒక్కసారి ఇచ్చే ఈ మొత్తం.. ప్రస్తుతం ఆకలి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతన్న 42 మిలియన్ల మందిని కాపాడగలదు. 155 మిలియన్ల మంది ఆకలి తీర్చాలంటే 8.4 బిలియన్ల సంపద కావాలి’’ అన్నారు. చదవండి: ఎలన్మస్క్ నంబర్ 1 ధనవంతుడయ్యాడంటే కారణమిదే - ఆనంద్ మహీంద్రా -
న్యూయార్క్ చేరుకున్న ప్రధాని మోదీ
న్యూయార్క్: అమెరికా పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిజీబిజీగా ఉన్నారు. నిన్న ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్తో సమావేశమైన విషయం తెలిసిందే. వారితో ద్వైపాక్షిక అంశాలతో పాటు అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. అంతకుముందే ప్రముఖ సంస్థల సీఈఓలతో సమావేశమై ‘భారత్లో పెట్టుబడులు పెట్టాలి’ అని ఆహ్వానించారు. చదవండి: తెలంగాణ పర్వతారోహకుడికి సీఎం జగన్ భారీ ఆర్థిక సహాయం తాజాగా ఐక్య రాజ్య సమితిలో ప్రసంగించేందుకు ప్రధాని మోదీ న్యూయార్క్ చేరుకున్నారు. న్యూయార్క్ చేరుకున్న మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. వందేమాతరం అనే నినాదాలు మార్మోగాయి. 76వ నేషనల్ జనరల్ అసెంబ్లీ సమావేశం నేడు జరగనుంది. భారత కాలమాన ప్రకారం సాయంత్రం 6 గంటలకు ఐరాసలో ప్రధాని ప్రసంగించనున్నారు. 2014లో ప్రధానమంత్రి అయ్యాక మోదీ అమెరికా పర్యటనకు వెళ్లడం ఇది ఏడోసారి. అమెరికాలోని ఎన్నారైల్లో ప్రధానికి మంచి ఆదరణ ఉంది. #WATCH | PM Narendra Modi meets people as they cheer for him & chant 'Vande Mataram' & 'Bharat Mata ki Jai' outside the hotel in New York. He is scheduled to address at the 76th session of UNGA pic.twitter.com/hafLDBSimC — ANI (@ANI) September 25, 2021 -
అఫ్గాన్కు భారీ స్థాయిలో ఆర్థికసాయం!
ఐక్యరాజ్య సమితి/జెనీవా: తాలిబన్లు చెరబట్టిన అఫ్గాన్ను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు భారీ స్థాయిలో ఆర్థికసాయం చేస్తామని ప్రకటించాయి. కరువు, పేదరికం, వలసలతో సతమతమవుతున్న అఫ్గాన్ ప్రజల ఆకలి, వసతుల కష్టాలు తీర్చేందుకు 1.2 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.8,836 కోట్లు) ఆర్థిక సాయం చేస్తామని పలు దేశాలు హామీ ఇచ్చాయని ఐక్యరాజ్య సమితి(ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ వెల్లడించారు. ఉగ్రవాదం పెచ్చరిల్లకుండా చూడడం, మానహక్కుల పరిరక్షణ తదితర సమస్యలపైనా ప్రపంచ దేశాలు తమ వంతు కృషిచేయాలని గుటెర్రస్ సూచించారు. సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న అఫ్గాన్కు సత్వర ఆర్థిక సాయం కోరుతూ ఐరాస సోమవారం జెనీవాలో విరాళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం తెల్సిందే. ఈ ఏడాది అవసరాలు తీర్చేందుకు కనీసం 60.6 కోట్ల డాలర్ల సాయం చేయాలని గుటెర్రస్ కోరడం విదితమే. ‘ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ సమాజం నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఏకంగా 1.2 బిలియన్ డాలర్ల సాయం చేస్తామని ‘ముఖ్యమైన’ దేశాలు ప్రకటించాయి. నా అంచానాలకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో విరాళాలు వస్తున్నాయి. అఫ్గాన్కు అంతర్జాతీయ సమాజం ఎంతటి భారీ స్థాయిలో ఆర్థిక తోడ్పాటు ఇస్తుందనడానికి ఈ ఘటనే తార్కాణం’ అని స్విట్జర్లాండ్ నగరం జెనీవాలో పత్రికా సమావేశంలో గుటెర్రస్ చెప్పారు. ‘తాలిబన్ల అనుమతి లేకుండా మానవతా కార్యక్రమాల అమలు అసాధ్యం. మానవ హక్కులు, మాదక ద్రవ్యాలు, ఉగ్రవాదం.. అంశమేదైనా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అక్కడి ప్రజలకు సాయం అందాలంటే తాలిబన్ ప్రభుత్వంతో నిరంతర సంప్రదింపులు కొనసాగించాల్సిందే’ అని ఆయన స్పష్టంచేశారు. ‘ తాలిబన్ల దురాక్రమణ, కాబూల్ ఎయిర్పోర్ట్ వద్ద వేలాది మంది అఫ్గాన్ అభాగ్యుల పడిగాపులు, బాంబు పేలుళ్లు వంటి విషాదకర ఘటనలతో స్థానికుల భవిష్యత్ అగమ్యగోచరమైన నేపథ్యంలో ఐరాస అక్కడ సహాయ కార్యక్రమాలను కొనసాగించడం తప్పనిసరి’ అని గుటెర్రస్ వ్యాఖ్యానించారు. -
Yoga Day 2021: దివాణంలో దివ్యౌషధం
రోగ నిరోధక శక్తి, ఊపిరితిత్తుల సామర్థ్యం, శరీరంలో ఆక్సిజన్ స్థాయి, మానసిక దృఢత్వం... ఏడాదిన్నర కాలంగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కోవిడ్–19కు గట్టి విరుగుడుగా చెబుతున్న నాలుగు మాటలు, సహజ పరిష్కారాలు ఇవే! ముందు నుంచీ ఇవి తమలో ఉన్నవారు కరోనా వైరస్ను ధీటుగా ఎదుర్కోగలుగుతున్నారు. వ్యాధి బారిన పడ్డాకయినా... వీటిని పెంచుకుంటే కోవిడ్ నుంచి తేలిగ్గా బయటపడగలరనీ చెబుతున్నారు. అత్యధిక సందర్భాల్లో ఇదే రుజువైంది. కానీ, ఈ నాలుగింటినీ ఇచ్చే ఔషధాన్ని ఇంతవరకు ప్రపంచ వైద్యారోగ్య నిపుణులు, శాస్త్రవేత్తలు కనుక్కోలేదు. ఔషధ పరిశ్రమలేవీ దీన్ని ఉత్పత్తి చేయలేదు. ఈ నాలుగింటినీ ధారాళంగా అందించే ఒక ప్రక్రియ మాత్రం అయిదువేల ఏళ్ల నుంచే భారతీయులకు అందుబాటులో ఉంది. అదే ‘యోగా’! సనాతన సంప్రదాయం నుంచి, మధ్యయుగాల ఆచరణ ద్వారా, ఆధునిక శాస్త్ర–సాంకేతిక తరం వరకు... అవిచ్ఛిన్నంగా భారతీయ జీవన విధానంలో అవిభాజ్య భాగమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆరేళ్ల కిందటి ఓ కృషి ఫలితంగా ఐక్యరాజ్య సమితిలోనూ గుర్తింపు దక్కింది. ఫలితంగా 177 సభ్య దేశాల మద్దతుతో, మనం ప్రతిపాదించిన తీర్మానం ఆమోదం పొంది, 2015 నుంచి ఏటా జూన్ 21, ‘అంతర్జాతీయ యోగ దినోత్సవం’గా జరుగుతోంది. భవిష్యత్ కార్యక్రమాల్లో యోగానొక భాగంగా యూఎన్ నిర్ణయించింది. కోవిడ్ కష్టకాలంలో యోగ ప్రాధాన్యతను అందరూ గుర్తిస్తున్నారు. ‘అందరి అభ్యున్నతికి యోగ’ ఈయేడు ప్రాధాన్యతగా యూఎన్ ప్రకటించింది. ‘ఇంటి వద్దే యోగ, కుటుంబ సభ్యులందరితో కలిసి’ అనే నినాదాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రాచుర్యంలోకి తెస్తున్నారు. అవగాహన లేమి వల్ల చాలా మంది ‘యోగ’ను పరిమితార్థంలో చూస్తారు. ఏవో రెండు ఆసనాలో, శ్వాస కసరత్తులనో యోగగా భావిస్తారు. కానీ, స్థూలార్థంలో ఇదొక పటిష్టమైన జీవన ప్రక్రియ. ఇందులో చాలా అంశాలు ఇమిడి ఉన్నాయి. ‘యోగ’ అంటే (విడిపోవడమనే ‘వియోగ’ శబ్దానికి వ్యతిరేకార్థం) కలిపి ఉంచడం. శరీరం, మేధ, మనసు... ఈ మూడింటినీ ఒకే మార్గంలోకి తెచ్చి, మనిషిలోని అంతఃశక్తుల్ని గరిష్టంగా ఉద్దీపించే ప్రక్రియే యోగ! మూలాలు పరిశోధించి, సాధన పద్ధతుల్ని క్రోడీకరించి పతంజలి మహర్షి ‘అష్టాంగయోగ’ను వేల ఏళ్ల కిందటే రూపొందించారు. ‘పతంజలి’ కూడా ఒకరు కాదని, వేర్వేరు కాలాల్లో తమ నైపుణ్యాల్ని సమాజహితంలో (క్రీ.పూ 500 నుంచి క్రీ.శ 400) ప్రదర్శించిన ఇద్దరు ముగ్గురు రుషితుల్యులని చరిత్రకారుల ఉవాచ. ‘యమ’ (నైతికాంశాలు), ‘నియమ’ (ప్రవర్తన కట్టుబాట్లు), ‘ఆసన’ (శరీర పటిష్టత), ‘ప్రాణాయామ’(శాస్వ నియంత్రణ), ‘ప్రత్యాహార’(ఇంద్రియ నిగ్రహం), ‘ధారణ’(ఏకాగ్రత), ‘ధ్యాన’(నిమగ్నత), ‘సమాధి’(అన్నీ అదుపులోకి తెచ్చిన ఉన్నతస్థితి)... వీటన్నింటినీ కలిపి అష్టాంగయోగగా చెబుతారు. మనిషి ఇవి సాధన చేసి, పరిపూర్ణ జీవితం గడపాలనేది లక్ష్యం. గౌతమ బుద్దుడి ‘అష్టాంగిక పథం’ కూడా ఇటువంటిదే! ఆ మహనీయుల పథనిర్దేశంలోనే మనిషి జీవిత ముఖ్యసారముందని జాతిపిత మహాత్ముడు, రాజ్యాంగ నిర్మాతల్లో ఒకరైన డా.అంబేడ్కర్లు గట్టిగా విశ్వసించారు. ఇప్పుడు కరోనా విజృంభిస్తున్న కాలంలోనూ.. ప్రాణాంతకమైన అనూహ్య సూక్ష్మ జీవుల నుంచీ సదరు జీవనశైలి రక్షణ కల్పిస్తోంది. శతృదుర్భేధ్యమైన ఓ కోటలా శరీరాన్ని తీర్చిదిద్దుతుందీ యోగ! ఆధ్యాత్మిక, భౌతిక, మానసిక దృఢత్వాన్ని పెంపొందిస్తుంది. కలవరపాటు, మానసిక ఒత్తిళ్ల నుంచీ ఉపశమనం కలిగిస్తుంది. మనిషిని ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉంచడమే కాకుండా ఆధ్యాత్మిక ప్రజ్ఞ పెంచి మానసిక దృఢత్వంతో వ్యవహరించేలా చేస్తుంది. ‘ప్రాణాయామం’ శ్వాసమీద ధ్యాస నిలిపేలా చేస్తుంది. పద్దతిగా ఉశ్ఛ్వాస–నిశ్ఛ్వాస క్రియల సాధన ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. శరీరంలోని అన్ని అవయవాలకు, కణజాలాలకు ఆక్సిజన్ సమృద్ధిగా అందుతుంది. ఈ అవసరాన్ని, ఓ గుణపాఠంగా చెప్పింది కరోనా! మెదడు, శరీరం, ఆత్మ ఒకే వరసలోకి వచ్చి ఏకీకృత శక్తిగా మారి, మనిషి తనను తాను సమగ్రంగా తెలుసుకుంటాడని విశ్లేషకులంటారు. ఫలితంగా స్వీయ అవగాహన పెరిగి, ప్రాపంచిక అంశాల పట్ల సమ్యక్ దృష్టి, తనకు తాను సమస్థితి మనిషి సాధిస్తాడనేది విశ్వాసం. ప్రకృతిని వికృతం చేస్తున్న మానవ తప్పిదాల వల్లే పర్యావరణం పాడవుతోంది. పలు విపరిణామాలొన్నాయి. వేగంగా వస్తున్న ‘వాతావరణ మార్పు’ ప్రభావంతో మున్ముందు ఇంక చాలా వైరస్లు దాడి చేస్తాయనే అధ్యయనాల నేపథ్యంలో... ఎన్నో సమస్యలకు ‘యోగ’ ఒక దీర్ఘకాలిక పరిష్కారం! జబ్బులనే కాక జీవితంలో దారితప్పిన క్రమతనూ సరిదిద్దే శక్తి యోగాకు ఉంది. ‘యోగా ఒక కాంతి ప్రజ్వలనం. ఒకసారి వెలిగితే ఆరిపోయేది కాదు. ఎంత ఎక్కువ సాధన చేస్తే అంత వెలుగు’ అన్న యోగాచార్యుడు బి.కె.ఎస్ అయ్యంగార్ మాటలు అక్షర సత్యాలు. సాధన చేస్తే, మనిషి దివాణంలో సర్వవేళలా అందుబాటులో ఉండే దివ్యౌషధం ఈ యోగా! దీనికోసం జాతి మరింత జాగృతం కావాలి. నవతరం యువత తమ జీవనశైలిలో యోగాను ఒక భాగం చేసుకోగలిగితే... శారీరకంగా, మానసికంగా తలెత్తే భవిష్యత్ సవాళ్లను వారు సమర్థంగా ఎదుర్కోగలుగుతారు. తట్టుకొని నిలువగలుగుతారు. -
కోవిడ్ వల్ల అనాథలుగా 577 మంది బాలలు
న్యూఢిల్లీ: కోవిడ్ మరణాల వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన పిల్లలు 577 మంది ఉన్నట్లు రాష్ట్రాలు వెల్లడించాయని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు చెప్పారు. ఈ పిల్లలందరనీ వారి దగ్గర బంధువుల వద్దే ఉంచి, జిల్లా కలెక్టర్ల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. వీరి పట్ల ఏ మాత్రం నిర్లక్ష్యం వహించడం లేదని, సంక్షేమం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రాలు, జిల్లాల స్థాయిలో పిల్లల గురించి వివరాలు కనుక్కుంటున్నట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి. మహిళా శిశుసంక్షేమ శాఖ సహా ఐక్యరాజ్యసమితికి చెందిన యూనిసెఫ్ సైతం వీరికి తోడ్పాటును అందిస్తున్నాయని వెల్లడించాయి. (చదవండి: ఆస్పత్రిలో చేరిన బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి) -
15 మంది రోహింగ్యాల దుర్మరణం
ఢాకా: బంగ్లాదేశ్లోని ఒక రోహింగ్యా క్యాంపులో చెలరేగిన మంటల కారణంగా 15మంది దుర్మరణం చెందగా 400 మంది కనిపించకుండా పోయారు. దాదాపు 45వేలమంది నివాసముండే ఈ క్యాంపులో అగ్నిప్రమాదం కారణంగా 10వేలకుపైగా గృహాలు దగ్ధమయ్యాయని ఐరాస అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 15 మృతదేహాలను వెలికితీశారు. 560మంది గాయాలబారిన పడ్డారు. క్యాంపులో అధికశాతం షెల్టర్లు వెదురుతో నిర్మించినవి కావడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని యూఎన్ రెఫ్యూజీ ఏజెన్సీ ప్రతినిధి జొహన్నాస్ వాండీర్ క్లావూ చెప్పారు. మంటల్లో నాలుగు ఆస్పుత్రులు, ఆరు హెల్త్ సెంటర్లు ధ్వంసమయ్యాయి. బర్మా నుంచి రోహింగ్యాల వలసలు ఆరంభమైనప్పటినుంచి ఇది అదిపెద్ద ప్రమాదమని బంగ్లా అధికారులు చెప్పారు. ఎంతమంది మరణించింది అధికారికంగా ప్రకటించలేదు. ప్రమాదంపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు చెప్పారు. కాక్స్ బజార్లో దాదాపు 11 లక్షల మంది రోహింగ్యాలు వివిధ క్యాంపుల్లో ఆశ్రితులుగా ఉంటున్నారు. వీరిని బర్మా తరలించాలని భావించినా, ఆదేశంలో మిలటరీ పాలన రావ డంతో వీరి భవితవ్యంపై అయోమయం నెలకొంది. చదవండి: (అమెరికాలో మళ్లీ పేలిన తూటా.. 10 మంది మృతి) -
మమ్మల్నీ కలుపుకోండి.. నిప్పురవ్వలం మేము
ఆషా పట్వాల్కు కళ్లు లేవు. ‘లేనిది మాకు కదా.. మీకు చూడ్డానికేం?’ అంటోంది. ఆమెకు చెవులూ వినిపించవు. వినికిడి లేనిది మాకు కదా.. మీకు వినడానికేం?’ అంటోంది. ‘మమ్మల్నీ కలుపుకోండి.. నిప్పురవ్వలం మేం’ అంటోంది. ఐరాస డేటా ఫోరమ్కి మాట లేదు! ఏం పిల్ల..! అనైతే అంది. మందాకిని, అలకనంద నదుల సంగమంలో ఉంటుంది రుద్రప్రయాగ. మహాశివుడి మూడు కళ్లలా ఉత్తరాఖండ్లోని చమోరి, పౌరి, తెహ్రీ జిల్లాల నుంచి రుద్రప్రయాగ ఆవిర్భవించింది. రుద్రుడంటే శివుడు. ఆ రుద్రస్థలిలో జన్మించిన ఆషా పట్వాల్కు రెండు కళ్లూ లేవు! కళ్లతోపాటు వినికిడి శక్తీ లేదు! అనుకోకుండా ఏదైనా అద్భుతం జరిగితే ఆ అమ్మాయికి చూపు రావచ్చు. అయితే తనకు చూపు రావాలని కోరుకోవడం లేదు ఆషా. ‘నాలాంటి వారు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారు. మమ్మల్ని చూడండి’ అని విజ్ఞప్తి చేస్తోంది. ఆ విజ్ఞప్తిని నిముషం కన్నా తక్కువ నిడివిగల వీడియోలో చూసి ఐక్యరాజ్య సమితి అధికారులు కదిలిపోయారు! ఆషాకు పదహారేళ్లు. రుద్ర ప్రయాగ్లో పదవ తరగతి చదువుతోంది. చూపు, వినికిడి లేకున్నా, మాట ఉంది. చక్కగా ఆటలు ఆడుతుంది. డిస్కస్ త్రోయింగ్, పరుగు పందెం ఆమెకు ఇష్టమైన ఆటలు. న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ‘వరల్డ్ డేటా ఫోరమ్’.. ‘డేటా ఎందుకు అవసరమంటే?’ అనే టాపిక్ని ఇచ్చి, నిముషంలోపు వీడియోలో రికార్డ్ చేసి పంపమని ఎంట్రీలు ఆహ్వానిస్తే ఆషా కూడా తన వీడియోను రికార్డ్ చేసి పంపింది. అందుకు ఆమెను ‘సెన్స్ ఇండియా’ అనే స్వచ్ఛంద సంస్థ ప్రోత్సహించింది. 15–24 ఏళ్ల వయసులోని వారికి డేటా ఫోరమ్ పెట్టిన ప్రపంచవ్యాప్త పోటీ ఇది. ఆ పోటీ పేరు ‘1 మినిట్ వాయిసెస్ ఆఫ్ యూత్’. షార్ట్లిస్టులో పదిమంది ఫైనల్స్కు చేరుకున్నారు. ఆ పదిమందిలో ఒకరు ఆషా పట్వాల్! ‘ఐ యామ్ ఇన్విజిబుల్’అని ఆషా వీడియో మొదలౌతుంది. ‘నేను కనిపించను’ అని. వీడియోలో తను కనిపిస్తూనే ఉంటుంది. సైలెంట్ వీడియో అది. చేతులు కదుపుతూ, కళ్ల సైగలతో చెబుతుంటుంది. మరి కనిపించకపోవడం ఏంటి? తనను, తనలాంటి వాళ్లను ప్రపంచం చూడటం లేదని చెప్పడం. పట్టించుకోవడం లేదని, లెక్కల్లోకి తీసుకోవడం లేదని గుర్తు చెయ్యడం. జనాభా లెక్కల్లోకి తమలాంటి వాళ్లను కూడా చేర్చుకొమ్మని ఆ వీడియోలో ఆషా అభ్యర్థించింది. తమలాంటి వాళ్లు అంటే.. రెండు విధాలైన అసహాయతలతో ఉన్నవారు అని. బధిరత్వం, అంధత్వం రెండూ ఉన్నవారు. ‘‘డేటాలోకి మమ్మల్నీ తీసుకుంటే ప్రపంచంలో మేమూ ఒక భాగం అవుతాం. ఈ కరోనా సమయంలో మేము జీవితాన్ని మరింత ఛాలెంజ్గా తీసుకోవలసి వస్తోంది. అందుకు ఆవేదన చెందడం లేదు. టీచర్ని కావాలని నా ఆశయం. అందుకోసం కూడా కష్టపడుతున్నాను’’ అని వీడియోలో చెప్పింది ఆషా. (ఆమె సంజ్ఞలు అర్థం అయేందుకు వీడియోలో కింద టెక్స్ట్ వస్తుంటుంది). ‘‘డేటా అవసరం ఏంటి అని కదా మీరు అడిగారు. భవిష్యత్తును నిర్మించుకోడానికి డేటా అవసరం. మీ డేటాలోకి మాకూ స్థానం ఇవ్వండి. జాతిలో స్ఫూర్తిని రాజేసే నిప్పురవ్వలం మేము’’ అని ఆషా ముగించింది. బధిరత్వం, అంధత్వం రెండూ ఉన్నవారు దేశంలో ఐదు లక్షలమంది వరకు ఉన్నారు. అయితే ప్రత్యేకమైన కేటగిరీగా మాత్రం వీళ్లు జనాభా లెక్కల్లో లేరు. ఆ విషయం ఆషా తన వీడియోలో ప్రధానంగా ప్రస్తావించింది. ఆషాకు పుట్టిన కొన్నాళ్లకు చూపు సమస్య వచ్చింది. కంజెనిటల్ క్యాటరాక్ట్. తండ్రికీ, ఇద్దరు తోబుట్టువులకూ ఆ వైకల్యం ఉంది. డెహ్రాడూన్లోని ‘షార్ప్ మెమోరియల్ స్కూల్ ఫర్ బ్లైండ్’ ప్రిన్సిపాల్ సుమనా సామ్యేల్ ఆషాను ఢిల్లీ తీసుకెళ్లి సర్జరీ చేయించారు. తిరిగి రుద్రప్రయాగ్కి రాగానే ఆషాకు మెనింజైటిస్ ఇన్ఫెక్షన్ సోకింది! దానిని గుర్తించి చికిత్సకు వెళ్లేలోపే వినికిడి శక్తీ పోయింది. మళ్లీ సుమననే ఆషాను డెహ్రాడూన్లోని ‘బజాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ డెఫ్ చిల్డ్రన్’లో చేర్పించి, సంజ్ఞల భాషను నేర్పించారు. ఐక్యరాజ్యసమితి ‘1 మినిట్ వాయిసెస్ ఆఫ్ యూత్’ కాంటెస్ట్ షార్ట్లిస్ట్లో ఉన్న ఆషా విజేత అయినా, కాకున్నా ఆమె చూపించే ప్రభావం మాత్రం మనదేశంలోని బధిర–అంధులకు ప్రయోజనకారిగా ఉండొచ్చు. మన దేశంలో వచ్చే ఏడాది ఏప్రిల్ 1న జనగణన మొదలవుతోంది. అందులో కనుక బధిర అంధులకు ఒక కేటగిరీ ఉంటే అది తప్పకుండా ఆషా వీడియో ఎఫెక్టే! తమనూ సెన్సస్ ‘డేటా’లో చేర్చాలన్న ఆమె విజ్ఞప్తి ఇప్పటికే ఐరాస అధికారుల దృష్టిలో ఉంది కనుక ఆ మేరకు ఈలోపే మన ప్రభుత్వానికి వారి నుంచి సూచనలు అందవచ్చు. -
అప్పటి, ఇప్పటి పరిస్థితులేంటి? : మోదీ
-
‘ఐరాస బృందం’లో భారత పర్యావరణవేత్త
ఐక్యరాజ్యసమితి: భారత్కు చెందిన మహిళా యువ పర్యావరణవేత్త ఒకరు ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ సలహా మండలికి ఎంపికయ్యారు. రోజు రోజుకూ దారుణంగా మారుతున్న పర్యావరణ పరిస్థితిని మెరుగు పరిచేందుకు అవసరమైన సలహాలను వీరు యూఎన్ చీఫ్కు అందిస్తారు. ఈ మండలికి ప్రపంచవ్యాప్తంగా ఏడుగురు (18–28 ఏళ్ల వారు) ఎంపిక కాగా భారత్ నుంచి అర్చన సొరెంగ్(24) అందులో ఒకరు కావడం విశేషం. పర్యావరణాన్ని సమతులంగా ఉంచేందుకు ఆదివాసులు ఉపయోగిస్తున్న పద్ధతులను, వారి సంప్రదాయ నైపుణ్యాన్ని పరిరక్షించేందుకు అర్చన పరిశోధనలు సాగిస్తున్నారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఈ సందర్భంగా అర్చన మాట్లాడుతూ.. మన పూర్వీకులు సంప్రదాయ విధానాల్లో అడవులను, పర్యావరణాన్ని పరిరక్షించారని, ఇప్పుడు ఆ బాధ్యత మనపై ఉందని, వాతావరణ మార్పులతో మనం పోరాడాల్సి ఉందని చెప్పారు. ఈమె టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ముంబై (టిస్) నుంచి రెగ్యులేటరీ గవర్నెన్స్ పూర్తి చేశారు. ఆమె టిస్ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా పనిచేశారు. ‘మనం పర్యావరణ అత్యవసర పరిస్థితిలో ఉన్నాం. మనకు ఎక్కువ సమయం లేదు’అని గుటెరస్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. త్వరితగతిన నిర్ణయాలు తీసుకుని కోవిడ్తో పాటు, అన్యాయం, అసమానత్వం, పర్యావరణ నాశనం వంటి వాటిపై పోరాడాలన్నారు. యువతను మరింత ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగానే సలహామండలిని ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. -
130 మిలియన్ డాలర్లు.. కొనేవాళ్లు లేక తిప్పలు
మెక్సికో సిటీ: గత ప్రభుత్వాల అవినీతికి నిదర్శనంగా నిలుస్తోన్న లగ్జరీ జెట్ ‘బోయింగ్ 787 డ్రీమ్లైనర్’ను అమ్మడానికి మెక్సికన్ ప్రభుత్వం ఏడాదిన్నరగా ప్రయత్నిస్తోంది. సరైన కొనుగోలుదారు కోసం ఇన్ని రోజులు ఈ లగ్జరీ జెట్ను అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఉంచారు. కానీ ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లించి విమానాన్ని కొనడానికి ఎవరూ ఆసక్తి చూలేదు. ఈ క్రమంలో విమానాన్ని తిరిగి మెక్సికోకు రప్పించినట్లు ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ తెలిపారు. అంతేకాక ఈ లగ్జరీ విమానాన్ని మెక్సికో వాసులకే అమ్మాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో మెక్సికో నగరంలోని బెనిటో జుయారెజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండింగ్ అవుతున్న దృశ్యాలు అక్కడి టెలివిజన్ చానెల్స్లో ప్రసారం అయ్యాయి. 2012లో ఈ జెట్ను మాజీ అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటో స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత దీన్ని 80 మంది ప్రయాణించేలా పునర్నిర్మించారు. బాత్రూమ్లను పాలరాయితో నిర్మించారు. ప్రస్తుతం దీనిలో ఒక ప్రెసిడెంట్ సూట్, ప్రైవేట్ బాత్ ఉన్నాయి. (ప్రధాని కోసం ప్రత్యేక విమానం) ఐక్యరాజ్య సమితి ఈ విమానం ఖరీదును 130మిలియన్ డాలర్లుగా నిర్ణయించింది. ఇంతకంటే తక్కువ ధరకు అమ్మడానికి లోపెజ్ ఒబ్రాడోర్ ఇష్టపడకపోవడంతో ఈ లగ్జరీ జెట్ను కొనడానికి ఎవరు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో విమానాన్ని దక్షిణ కాలిఫోర్నియాలో ఖాళీగా ఉంచితే.. విలువ పడిపోతుందని భావించి.. తిరిగి దాన్ని మెక్సికోకు రప్పించారు. ఈ క్రమంలో ఈ నెల ప్రారంభంలో వివరాలు వెల్లడించని ఓ వ్యక్తి విమానాన్ని కొనడానికి ఆసక్తి చూపించాడని లోపేజ్ ఒబ్రాడోర్ తెలిపారు. సదరు వ్యక్తి ఈ జెట్ కోసం 120 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాడని.. ఇప్పటికే కొంత ముందస్తు చెల్లింపు కూడా చేశాడని సమాచారం. మెక్సికోలో సగం పైగా జనాభా పేదరికంలో మగ్గుతున్నారు. (మెక్సికో లేడీ డాన్ ఆఖరి క్షణాలు....) ఇలాంటి సమయంలో కరోనా ఆ దేశ పరిస్థితులను మరింత దిగజార్చింది. ఆస్పత్రుల్లో తగినన్ని ఔషధాలు అందుబాటులో లేవు. అంతేకాక కరోనా మరణాల సంఖ్యలో మెక్సికో ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానంలో ఉంది. ఈ లాంటి పరిస్థితుల్లో ఇంత లగ్జరీ విమానం వల్ల దేశానికి ఎలాంటి లాభం లేదని భావించి దాన్ని అమ్మకానికి పెట్టింది ప్రభుత్వం. ఈ లగ్జరీ జెట్లో ఓ రాఫెల్ విమానం కూడా ఉన్నట్లు సమాచారం. -
గతేడాది ఆత్మహత్య.. రూ.100 కోట్లు ఇప్పించండి
తిరువనంతపురం: కేరళకు చెందిన ప్రిజిన్ అనే ఓ యువకుడు గత ఏడాది ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం అతడి కుటుంబం ఇటలీ నుంచి రూ. 100 కోట్లు నష్టపరిహారం డిమాండ్ చేస్తోంది. కేరళ యువకుడికి.. ఇటలీకి సంబంధం ఏంటనుకుంటున్నారా.. అయితే చదవండి. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం అంటే 2012లో కేరళ తీరం వెంబడి చేపల వేటకు వెళ్ళిన జాలర్లను సముద్ర దొంగలుగా భావిస్తూ ఇటలీ ఓడ ‘ఎన్రికా లెక్సి’పై ఉన్న ఇటలీ మెరైన్లు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు భారతీయులు చనిపోయారు. అయితే ఈ సంఘటన జరిగినప్పుడు ప్రిజిన్ అక్కడే ఉన్నాడు. అప్పుడు అతడి వయసు 14 సంవత్సరాలు. ఆ తర్వాత ఈ కేసు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంతర్జాతీయ ట్రిబ్యునల్కి చేరింది. ఈ క్రమంలో తాజాగా జాలర్ల మరణానికి సంబంధించి ప్రాణ నష్టానికి బదులుగా పరిహారం పొందేందుకు భారత్ అర్హత సాధించిందని ట్రిబ్యునల్ తెలిపింది. ఈ నేపథ్యంలో నాటి ఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన ప్రిజిన్ కుటుంబం ఇటలీ నుంచి రూ.100 కోట్ల నష్ట పరిహారం ఇప్పించాల్సిందిగా కేంద్రాన్ని కోరుతుంది. ఈ సందర్భంగా ప్రిజిన్ కుటుంబ సభ్యులు ఈ నెల 6న కేంద్రానికి లేఖ రాశారు. దానిలో ‘‘ఎన్రికా లెక్సి’ సంఘటన 2012 ఫిబ్రవరి 15న జరిగింది. అప్పుడు ప్రిజిన్ అక్కడే ఉన్నాడు. నాటి ఘటనలో ప్రిజిన్ స్నేహితులు అజీష్ షింక్, మరోక మత్య్సకారుడు జెలాస్టిన్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ సంఘటనతో అతడు షాక్కు గురయ్యాడు. తనకు కూడా చిన్న చిన్న దెబ్బలు తగిలాయి’ అని తెలిపారు. (ఇటాలియన్ మెరైన్స్ కేసు: కీలక పరిణామం) అంతేకాక ‘ఈ దారుణానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన ప్రిజిన్కు అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇవ్వాల్సిన రక్షణ ఇవ్వలేదు. ఈ ఘటన తర్వాత అతడు డిప్రెషన్లోకి వెళ్లాడు. ప్రభుత్వం అతడికి సరైన వైద్య చికిత్స కూడా అందించలేదు. ఈ బాధతోనే అతడు గత ఏడాది ఆత్మహత్య చేసుకున్నాడు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ప్రిజిన్ నాటి ఘటనలో బాధితుడే. అతడికి ఇటలీ ప్రభుత్వం రూ.100 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలిందిగా కేంద్రం డిమాండ్ చేయాలి’ అని ప్రిజిన్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. -
ముంచుకొస్తున్న మరో ముప్పు!
వాషింగ్టన్: మనం నిత్యం వాడుతున్న మొబైల్ ఫోన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మిషన్లు, ఎలక్రిక్ వస్తువులు, ఇతర గాడ్జెట్లు... విచ్చలవిడిగా పెరుగుతున్న వాడకమే కాదు. వీటవల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ఎలక్ట్రానిక్ వేస్టేజ్ కూడా ప్రమాదకరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి గ్లోబల్ ఈ-వేస్ట్ మానిటర్ 2020 నివేదిక ప్రకారం 2019లో ప్రపంచవ్యాప్తంగా 52.7 మిలియన్ టన్నుల ఈ-వేస్ట్ ఉత్పత్తి కాగా అందులో కేవలం 17.4 శాతం మాత్రమే సేకరించి రీసైకిల్ చేసినట్లు వెల్లడించింది. ఈ నివేదిక ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులను తిప్పికొట్టడంలో ఎంతో దోహదం చేస్తుందని ఐక్యరాజ్య సమితి అభిప్రాయ పడింది. గత ఏడాది మొత్తం ఉత్పత్తి అయిన ఈ-వ్యర్థాలలో ఆసియా పెద్దమొత్తంలో అనగా సుమారు - 46.4 శాతం ఉత్పత్తి చేయగా తరువాత స్థానాల్లో అమెరికా (24.4 శాతం), యూరప్ (22.3 శాతం), ఆఫ్రికా (5.4 శాతం), ఓషియానియా (1.3 శాతం) ఉన్నాయి. ఐరాస నివేదిక ప్రకారం 2030 నాటికి ప్రస్తుతం ఉన్న ఈ-వేస్ట్కు అదనంగా 19.6 మిలియన్ టన్నులు జోడించి మొత్తం ఈ- వేస్ట్ 72.8 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని నివేదిక తెలిపింది. అంతేకాక ఈ దశాబ్దం చివరి నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఈ-వేస్ట్ సమస్య మరింత తీవ్రమవుతుందని నివేదిక హెచ్చరించింది. (కరోనా వ్యాక్సిన్కు రెండున్నర ఏళ్లు పడుతుంది) ప్రపంచవ్యాప్తంగా ఏసీలు, ఫ్రిజ్లు, ఎలక్ట్రిక్ దీపాల వాడకంతో పాటు స్మార్ట్ ఫోన్ల వినియోగం, తక్కువ లైఫ్టైం ఉన్న టెక్ గాడ్జెట్లు ఈ-వ్యర్థాల ఉత్పత్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని నివేదిక వెల్లడించింది. ఈ-వేస్ట్పై పోరాడటానికి ప్రపంచ దేశాలకు 2014వరకు ఎలాంటి విధానాలు లేవు. అయితే ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చిందని ఇప్పటికే పలు ప్రపంచ దేశాలు ఈ-వేస్ట్ నియంత్రణ కోసం చట్టాలు, విధానాలు రూపొందించాయని నివేదిక పేర్కొన్నది. ప్రస్తుతం ఈ- వేస్ట్ నియంత్రణకు చట్టాలు రూపొందించిన దేశాల సంఖ్య 61 నుంచి 78 కి పెరిగిందని నివేదిక తెలిపింది. రాజకీయ కారణాల వల్ల ఇప్పటికి ఈ-వేస్ట్ నిర్వహణను పలు దేశాలు సరిగా అమలు చేయడం లేదని యూఎన్వో తెలిపింది. ఐక్యరాజ్యసమితి టెలికాం శాఖ అయిన ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) సగానికి పైగా ప్రపంచ దేశాలు ఈ-వేస్ట్ చట్టాన్ని అమలు చేయాలని భావిస్తోంది. కానీ ప్రస్తుతం 78 దేశాలు మాత్రమే ఈ-వేస్ట్ చట్టాలను రూపొందించాయి. 2015 సెప్టెంబరులో యూఎస్, దాని సభ్య దేశాలు సుస్థిర అభివృద్ధి కోసం 2030 ఎజెండాను ఆమోదించాయి. దీనిలో 17 ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు’ (ఎస్డీజీ), ‘పేదరికాన్ని అంతం చేయడం, భూమిని పరిరక్షించడం,అందరి శ్రేయస్సుకు కృషి చేయడం’ వంటి 169 లక్ష్యాలను గుర్తించాయి. అయితే పెరుగుతున్న ఈ-వ్యర్థాలతో పాటు వాటిని అసురక్షిత పద్దతిలో ట్రీట్ చేయడం, కాల్చడం, పల్లపు ప్రదేశాలలో పారవేయడం వల్ల ఈ లక్ష్యాలను సాధించడానికి అవరోధం కలగడమే కాక మానవ ఆరోగ్యం పర్యావరణం దెబ్బతింటుందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఐక్యరాజ్య సమితి గ్లోబల్ ఈ-వేస్ట్ మానిటర్ 2020 నివేదిక వెల్లడించిన గణాంకాలు ఈ విధంగా ఉన్నాయి 2019 లో వినియోగించిన ఫ్రిజ్లు, ఎయిర్ కండిషనర్ల నుండి 98 మెట్రిక్ టన్నుల కార్జన్డై ఆక్సైడ్ వాతావరణంలోకి విడుదల అయ్యింది. ఇది ప్రపంచ గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలలో సుమారు 0.3 శాతంగా ఉంది. గత సంవత్సరం పోగుపడ్డ ఈ-వ్యర్థాలను పంచితే భూమిపై ఉన్న ప్రతి పురుషుడు, స్త్రీ , బిడ్డకు సగటున 7.3 కిలోలు వస్తుంది. 16.2 కిలోల తలసరి ఈ-వ్యర్థాల ఉత్పత్తితో యూరప్ ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉంది. ఓషియానియా రెండవ స్థానంలో (16.1 కిలోలు), అమెరికా (13.3 కిలోలు) తువాతి స్థానంలో ఉన్నాయి. ఆసియా, ఆఫ్రికా చాలా తక్కువగా ఈ- వేస్ట్ను ఉత్పత్తి చేస్తున్నాయి. ఏటా 50 టన్నుల పాదరసాన్ని మానిటర్లు, పీసీబీలు ఫ్లోరోసెంట్, ఎనర్జీ సేవింగ్ లైట్ సోర్స్లలో ఉపయోగిస్తున్నారు. 2019 లో ఉత్పత్తి అయిన ఈ-వ్యర్థాల్లో ప్రధానంగా చిన్న పరికరాలు (17.4 టన్నులు), పెద్ద పరికరాలు (13.1 మెట్రిక్ టన్నులు) ఉష్ణోగ్రత మార్పిడి పరికరాలు (10.8 టన్నులు) ఉన్నాయి. ఈ-వేస్ట్లో స్క్రీన్స్, మానిటర్లు, లైట్స్, చిన్న ఐటి ,టెలికమ్యూనికేషన్ పరికరాలు వరుసగా 6.7 మెట్రిక్ టన్నులు 4.7 మెట్రిక్ టన్నులు, 0.9 మెట్రిక్ టన్నులుగా ఉన్నాయి. తక్కువ ఆదాయ దేశాలలో ఆర్థిక పరిస్థితులు మెరుగు పడుతుండటంతో ఎలాక్ట్రానిక్ వస్తువుల వినియోగం పెరుగుతుంది. ఫలితంగా ఈ-వెస్ట్ పెరుగుతోంది. ఈ-వేస్ట్లో చిన్న ఐటీ, టెలికమ్యూనికేషన్ పరికరాల పెరుగుదల నెమ్మదిగా ఉండగా, స్క్రీన్లు మానిటర్లు స్వల్పంగా తగ్గుదలని చూపించాయి (-1 శాతం). భారీ సీఆర్టీ మానిటర్లు, స్క్రీన్ల స్థానంలో తేలికైన ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లేలు ఎక్కువవుతున్నాయి. 2014 నుండి, జాతీయ ఈ-వేస్ట్ విధానాలు, చట్టాలు రూపొందించిన దేశాల సంఖ్య 61 నుంచి 78 కి పెరిగింది. ఇది సానుకూల ధోరణి అయినప్పటికి, ఇది అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ నిర్దేశించిన లక్ష్యానికి దూరంగా ఉంది. ఈ యూనియన్ ఈ-వేస్ట్ చట్టాలు రూపొందించిన దేశాల శాతాన్ని 50 శాతానికి పెంచాలని భావిస్తోంది. -
అలా అయితే 34 కోట్ల కొలువులు హుష్!
జెనీవా: ఈ ఏడాది ద్వితీయార్థంలో మరోసారి కోవిడ్–19 విజృంభిస్తే ప్రపంచవ్యాప్తంగా11.9 శాతం పనిగంటలను కోల్పోవాల్సి వస్తుందని, ఇది 34 కోట్ల ఫుల్టైమ్ ఉద్యోగాలు కోల్పోవడానికి సమానమని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) హెచ్చరించింది. దీని నుంచి అంతర్జాతీయ శ్రామిక మార్కెట్ ఈ యేడాదిలో కోలుకోవడం అనిశ్చితితో కూడుకున్నదని ‘ఐఎల్ఓ మానిటర్: కోవిడ్–19 అండ్ ద వరల్డ్ ఆఫ్ వర్క్’ ఐదవ ఎడిషన్ వెల్లడించింది. 2020 ద్వితీయ త్రైమాసికంలో అంతర్జాతీయంగా 14 శాతం పనిగంటలు తగ్గాయని, ఇది 40 కోట్లు ఉద్యోగాలు కోల్పోవడంతో సమానమని ఐఎల్ఓ నివేదిక తెలిపింది. (అగ్రరాజ్యంలో కరోనా కల్లోలం..ఒక్కరోజే 50 వేల కేసులు) గతంలో అంచనా వేసిన దానికంటే ఈ ఏడాది ప్రథమార్థంలో కోల్పోయిన పనిగంటలు తీవ్రస్థాయిలో ఉన్నట్టు వెల్లడయ్యింది. కోవిడ్ మహమ్మారి ప్రభావం మహిళలపై తీవ్రంగా ఉన్నదని, గత కొన్ని దశాబ్దాల్లో స్త్రీపురుష అసమానతలను ఛేదించడంలో సాధించిన ప్రగతిని సైతం కోల్పోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వెలిబుచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా తీవ్రంగా ప్రభావితమైన నాలుగు రంగాల్లో, 36.6 శాతం మంది పురుషులు పనిచేస్తోంటే, మహిళలు 40శాతం(51 కోట్ల) మంది పనిచేస్తున్నారని వెల్లడించింది. -
భారత్పై మరోసారి మిడతల దాడి
న్యూఢిల్లీ: కరోనాతో కకావికలమైన ఇండియా త్వరలోనే మిడతల రూపంలో మరోసారి ప్రమాదాన్ని ఎదుర్కొబోతున్నట్లు ఐక్యరాజ్య సమితి అనుభంద సంస్థ వ్యవసాయ ఆహార సంస్థ(ఎఫ్ఏఓ) హెచ్చరించింది. పంటను నాశనం చేసే ఎడారి మిడతలు జూలైలో మరోసారి భారత్పై దాడి చేయనున్నట్లు తెలిపింది. మిడతల వల్ల బాగా నష్టపోయిన రాజస్తాన్, మధ్యప్రదేశ్ సహా మరో 16 రాష్ట్రాలపై మిడతలు మరోసారి దాడి చేయనున్నట్లు కేంద్రం హెచ్చరించిన సంగతి తెలిసిందే. వర్షాకాలం ముందు మే నెలలో నైరుతి పాకిస్తాన్ నుంచి రాజస్తాన్కు వసంత-జాతి మిడుత సమూహాలు వలసలు వస్తాయని ఈ సంస్థ తెలిపింది. 1962 తరువాత ప్రస్తుతం మొదటిసారి వీటిలో కొన్ని సమూహాలు ఉత్తరాది రాష్ట్రాలకు ప్రయాణించాయని ఎఫ్ఏఓ వెల్లడించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం పంజాబ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్గఢ్లోని వ్యవసాయ భూముల్లో వృక్షసంపద ద్వారా వ్యాప్తి చెందుతున్న ఈ సమూహాలు ఏప్రిల్లో పాకిస్తాన్ నుంచి భారతదేశంలోకి ప్రవేశించాయన్నారు. ఇవి కూడా ‘హార్న్ ఆఫ్ ఆఫ్రికా’ నుంచి వచ్చాయని తెలిపారు. తూర్పు ఆఫ్రికాలోని వాయవ్య కెన్యాలో ప్రస్తుతం రెండో దశ బ్రీడింగ్ జరుగుతుందని.. ఫలితంగా జూన్ రెండవ వారం నుంచి జూలై మధ్య వరకు అపరిపక్వ సమూహాలకు దారి తీస్తాయని హెచ్చరించారు. సోమాలియా, ఇథియోపియాలో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే కొనసాగుతోంది. కొత్త సమూహాలు చాలా వరకు కెన్యా నుంచి ఇథియోపియాకు, జూన్ మధ్యకాలం తరువాత దక్షిణ సూడాన్ నుంచి సుడాన్ వరకు ప్రయాణిస్తాయి. మరికొన్ని సమూహాలు ఉత్తర ఇథియోపియాకు వెళతాయి. ఈశాన్య సోమాలియాకు చేరుకున్న సమూహాలు ఉత్తర హిందూ మహాసముద్రం మీదుగా ఇండో-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతానికి వలస వెళ్ళే అవకాశం ఉంది అని ఎఫ్ఏఓ తెలిపింది. (వణికిస్తున్న రాకాసి మిడతలు) మిడతలు రోజులో 150 కిలోమీటర్ల వరకు ఎగురుతాయి. ఒక చదరపు కిలోమీటర్ మేర ఉన్న సమూహం.. 35,000 మంది ప్రజలకు సరిపోయే ఆహారాన్ని తింటాయి. రాజస్థాన్లోని బార్మెర్, జోధ్పూర్ జిల్లాల్లోని అనేక గ్రామాలు మిడతల దాడులను చూస్తూనే ఉన్నాయని భారత ప్రభుత్వ లోకస్ట్ వార్నింగ్ ఆర్గనైజేషన్ (ఎల్డబ్ల్యూఓ) కేఎల్ గుర్జార్ తెలిపారు. ప్రస్తుతం 65,000 హెక్టార్ల ప్రాంతంలో మిడతలు నియంత్రించబడ్డాయని.. రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా కొత్త మిడతల సమూహాలు లేవని ఆయన అన్నారు. (మిడతలను పట్టే ‘మెథడ్స్’) మిడతల దాడులను నియంత్రించడానికి మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో హెలికాప్టర్ల వాడకాన్ని చూసే అవకాశం ఉందని ఎల్డబ్ల్యూఓ తెలిపింది. రాత్రిపూట చెట్లపైకి చేరిన తర్వాత మిడతలు మీద రసాయనాలను పిచికారీ చేయడానికి డ్రోన్లు, ఫైర్ టెండర్లు, ట్రాక్టర్లు ఉపయోగిస్తున్నామన్నారు. పెద్ద సంఖ్యలో కదులుతున్న మిడతల దండును నియంత్రించడానికి హెలికాప్టర్లను కూడా ఉపయోగిస్తాము అని గుర్జార్ చెప్పారు. మధ్యప్రదేశ్లోని వింధ్య, బుందేల్ఖండ్, గ్వాలియర్-చంబల్ ప్రాంతాల్లో శుక్రవారం మిడతలు కనిపించాయన్నారు. రాజస్థాన్లో, బార్మెర్, పాలి, జోధ్పూర్, జలూర్, నాగౌర్, బికనేర్ వంటి ప్రదేశాల్లో మిడుత సమూహాలు కనిపించాయన్నారు. -
కొత్త ఏడాది రికార్డు
ఐక్యరాజ్యసమితి: కొత్త ఏడాది ప్రారంభం రోజునే భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రపంచ జనాభాలో రెండోస్థానంలో ఉన్న మన దేశం 2020 జనవరి 1న శిశు జననాల్లో టాప్గా నిలిచింది. కొత్త ఏడాది మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 4 లక్షల మంది పిల్లలు పుడితే వారిలో భారత్లోనే 67,385 మంది పుట్టినట్టు ఐక్యరాజ్యసమితికి చెందిన శిశు సంరక్షణ సంస్థ యూనిసెఫ్ వెల్లడించింది. ఇక ప్రపంచ జనాభాలో మొదటి స్థానంలో ఉన్న చైనా 46,299 శిశు జననాలతో ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ‘కొత్త సంవత్సరం ప్రారంభం, అందులోనూ కొత్త దశాబ్దం అంటే ప్రపంచ ప్రజల ఆశలు, ఆకాంక్షలు భవిష్యత్తే కాదు, కొత్తగా పుట్టిన వారి భవిష్యత్ కూడా’ అని యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రియెట్ట ఫోర్ అన్నారు. మొత్తంగా జన్మించిన 3,92,078 శిశువుల్లో సగం మంది కేవలం ఎనిమిది దేశాల్లోనే జన్మించారు. అయిదేళ్లలోపు చిన్నారుల మరణాలు ఎక్కువే ప్రతీ ఏడాది జనవరి 1న చిన్నారుల జననాన్ని యూనిసెఫ్ ఒక వేడుకగా నిర్వహిస్తుంది. విరీ చైల్డ్ అలైవ్ పేరుతో ఒక ఉద్యమాన్ని నిర్వహిస్తోంది. బిడ్డల్ని సంరక్షించడంలో నర్సులకి శిక్షణ ఇవ్వడానికి వెంటనే పెట్టుబడులు పెట్టడం, తల్లీ బిడ్డలకి సరైన పోషకాహారం, మందులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటోంది. 2018లో జనవరి 1న పుట్టిన వారిలో 25 లక్షల మంది నెలరోజుల్లోగానే మరణించారు. ఇదే అంశంపై యూనిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా అయిదేళ్ల వయసులోపు మరణాలు ఎక్కువగా నమోదు కావడం ఆరోగ్య రంగంలో డొల్లతనాన్ని బయటపెడుతోందని యూనిసెఫ్ అంటోంది. ప్రపంచ దేశాలు దీనిపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొంది. మరో ఏడేళ్లలో చైనాని దాటేస్తాం జనాభా ఇలా పెరుగుతూ పోతే ప్రపంచంలో మనం మొదటి స్థానంలోకి వచ్చే రోజు ఎంతో దూరంలో లేదు. 2019 నాటికి చైనా జనాభా 143 కోట్లయితే, భారత్ జనాభా 137 కోట్లుగా ఉంది. ప్రపంచ జనాభాలో చైనా వాటా 19శాతమైతే, భారత్ వాటా 18శాతం. 2027 నాటికి జనాభాలో చైనాని భారత్ దాటేస్తుందని యూనిసెఫ్ అంచనా వేస్తోంది. ఈ శతాబ్దం చివరినాటికి భారత్ 150 కోట్లతో మొదటి స్థానంలో ఉంటే, చైనా110 కోట్లతో రెండో స్థానంలో, నైజీరియా 73 కోట్లతో మూడో స్థానంలో ఉండే అవకాశాలున్నాయి. ఇక ఆ తర్వాత స్థానాల్లో అమెరికా, పాక్లు ఉంటాయని యూనిసెఫ్ అంచనా వేసింది. ప్రస్తుతం ప్రపంచ జనాభా 780 కోట్లని లెక్కలున్నాయి. -
అంతర్జాతీయ వేదికపై పాక్కు మరో ఎదురుదెబ్బ
అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా బాలాకోట్ వైమానికి దాడులను సమర్థించడంతో ఆమెను యూనిసెఫ్ గుడ్విల్ అంబాసిడర్గా తొలగించాలంటూ పాక్ మానవ వనరుల శాఖ మంత్రి షిరిన్ మజరి ఐక్యరాజ్యసమితికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ అంశంపై యూఎన్ స్పందించింది. తనకు సంబంధించిన అంశాలపై.. తన వ్యక్తిగత సామార్థ్యం మేరకు స్పందించే హక్కు ప్రియాంకకు ఉందని ఐక్యరాజ్యసమితి స్పష్టం చేసింది. (చదవండి: కశ్మీర్పై ఐరాసలో రహస్య చర్చలు) ఈ మేరకు యూఎన్ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘యూనిసెఫ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న వ్యక్తికి తన వ్యక్తిగత లేదా తనకు సంబంధించిన సమస్యలపై స్పందించే హక్కు ఉంది. వారి వ్యక్తిగత అభిప్రాయాలు, చర్యలతో యూనిసెఫ్కు ఎలాంటి సంబంధం ఉండదు. కానీ యూనిసెఫ్ గురించి మాట్లాడినప్పుడు మాత్రమే వారి వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుంటాం. నిరాధార వ్యాఖ్యలను ప్రోత్సాహించము. అంతేకాక స్వచ్ఛందంగా తమ సమయాన్ని, వారి గుర్తింపును పిల్లల హక్కులు కాపాడటం కోసం వినియోగించడానికి అంగీకరించిన ప్రముఖులను మాత్రమే యూనిసెఫ్ గుడ్విల్ అంబాసిడర్లుగా నియమిస్తాం’ అని తెలిపారు. బాలాకోట్లో జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరంపై భారత వైమానిక దాడులను ఐక్యరాజ్యసమితి గుడ్విల్ అంబాసిడర్ హోదాలో ప్రియాంక చోప్రా సమర్ధించడం పట్ల లాస్ఏంజెల్స్లో జరిగిన ఓ ఈవెంట్లో ప్రియాంకను పాక్కు చెందిన ఆయేషా అనే మహిళ నిలదీశారు. ప్రియాంక తీరును కపటత్వంగా ఆయేషా అభివర్ణిస్తూ మండిపడ్డారు. ఆమె ఆరోపణలపై ప్రియాంక ఆ వేదికపై దీటుగా స్పందించారు. తాను యుద్ధాన్ని కోరుకోవడం లేదని.. తన దేశం పట్ల అభిమాననాన్ని వెల్లడించే హక్కు తనకు ఉందని ప్రియాంక స్పష్టం చేశారు. -
ఆర్టికల్ 370: పూలమాలతో ఎదురు చూడటం లేదు
ఇస్లామాబాద్: జమ్మూకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాల పట్ల దాయాది దేశం విషం చిమ్ముతున్న సంగతి తెలిసిందే. కశ్మీర్ విభజనను సాకుగా చూపి అంతర్జాతీయ సమాజంలో భారత్ను దోషిగా నిలపాలని పాక్ తెగ ప్రయత్నించింది. అయితే ఈ విషయంలో పాక్కు నిరాశే ఎదురయ్యింది. కశ్మీర్పై భారత్ తీసుకున్న నిర్ణయం పట్ల అంతర్జాతీయ సమాజం తమకు అండగా నిలిచే అవకాశం లేదని స్వయంగా పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ పరోక్షంగా అంగీకరించారు. అలాగే అక్కడి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పాక్ ప్రజలపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. కశ్మీర్ అంశంలో భారత్పై పాక్ చేయబోయే ఫిర్యాదు స్వీకరించడానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సిద్ధంగా లేదని ఖురేషీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కశ్మీర్ అంశాన్ని ఉపయోగించుకొని భావోద్వేగాల్ని రెచ్చగొట్టడం, అభ్యంతరాలు వ్యక్తం చేయడం చాలా సులభం. కానీ ఈ విషయంలో ముందుకు సాగడం చాలా కష్టం. మనకు పూలమాలతో స్వాగతం పలకడానికి ఐక్యరాజ్యసమితి సిద్ధంగా లేదు. శాశ్వత సభ్య దేశాల్లో ఎవరైనా మనకు అడ్డం పడవచ్చు. ప్రజలు వివేకంతో ఆలోచించాలి’ అని ఖురేషి జనాలను కోరారు. కశ్మీర్పై భారత్ తీసుకున్న నిర్ణయానికి రష్యా మద్దతుగా నిలిచిన మరుసటి రోజే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
ఎన్నాళ్లీ ప్రమాదాలు?
‘మాట్లాడదాం... ప్రాణాలు కాపాడదాం’ అనే నినాదంతో ఐక్యరాజ్యసమితి ఈ నెల 6 నుంచి 12 వరకూ ప్రపంచ రహదారి భద్రతా వారం పాటించమని పిలుపునిచ్చింది. సరిగ్గా ఈ వారంలోనే ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా వెల్దుర్తి వద్ద ఘోర ప్రమాదం సంభవించి 16 నిండు ప్రాణాలు బలయిపోయాయి. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా రామాపురం నుంచి కొందరు బంధువులు, స్నేహితులు శనివారం ఒక వివాహాన్ని నిశ్చయం చేసుకుని వస్తుండగా అతి వేగంతో దూసుకొచ్చిన బస్సు వారిని కబళించింది. ఈ ప్రమాదంలో ఒక ద్విచక్రవాహనదారు కూడా మరణించాడు. ఆ మరుసటి రోజు తెలంగాణలోని కరీంనగర్ జిల్లా నుస్తులాపూర్ వద్ద లారీని బస్సు ఢీకొట్టడంతో బస్సులోని 20మంది ప్రయాణికులు గాయపడ్డారు. రహదారి భద్రత విష యంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోమని ఎక్కడికక్కడ ప్రభుత్వాలను పౌర సమాజాలు డిమాండ్ చేయాలని, ఒత్తిళ్లు తీసుకురావాలని ఐక్యరాజ్యసమితి ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా ఏటా కోటిమందికిపైగా రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారు. దాదాపు 5 కోట్లమంది వరకూ క్షతగాత్రులవుతున్నారు. మన దేశంలో సగటున ఏటా 5 లక్షల ప్రమాదాల్లో లక్షన్నరమంది కన్ను మూస్తున్నారు. మన రోడ్లు నిత్యం నెత్తుటి చరిత్రను రచిస్తున్నాయి. కేవలం ప్రభుత్వాల నిర్లక్ష్యమే ఈ ప్రమాదాల్లో అత్యధిక భాగానికి కారణమని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. దేశంలో కేరళ, యూపీ, నాగాలాండ్ మినహా మరే రాష్ట్రమూ రహదారి భద్రతా విధానాన్ని రూపొందించుకోలేదని సుప్రీం కోర్టు నియమించిన కమిటీ నివేదిక తేల్చి చెప్పింది. ఇప్పుడు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని గమనించినా ఈ సంగతి అర్ధమవుతుంది. హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారి నుంచి పక్కనున్న గ్రామాల్లోకి వెళ్లేందుకు, వాహనాలు యూటర్న్ తీసుకోవడానికి ఏర్పాటు చేసిన క్రాస్ రోడ్లు భీతిగొలుపుతాయి. వాటి సమీపంలో ఏటా పదులకొద్దీ ప్రమాదాలు జరగుతున్నా ఎవరికీ పట్టడం లేదు. ముఖ్యంగా వెల్దుర్తి క్రాస్ వద్ద రహదారి డిజైన్లో లోపమున్నదని సాధారణ పౌరులు సైతం ఫిర్యాదు చేసినా సరైన స్పందన లేదు. అక్కడ అండర్వే నిర్మించమని, సర్వీసు రోడ్డు ఏర్పాటు చేయమని స్థానికులు అడుగుతున్నా వినిపించుకునే దిక్కు లేదు. ఇలాంటిచోట తగినన్ని స్పీడు బ్రేకర్లు నిర్మించి, అవసరమైన లైటింగ్, సిగ్నల్స్, జీబ్రా లైన్స్ వంటివి ఏర్పాటు చేస్తే వాహ నాల వేగానికి కళ్లెం పడుతుంది. ఇదేచోట గతంలోనూ ప్రమాదాలు చోటుచేసుకున్నా దిద్దుబాటు చర్యలు లేవు. అత్యధిక వేగంతో వెళ్లే వాహనాలకు అనుమతులిచ్చినప్పుడే మన రహదార్ల తీరు తెన్నులపై కూలంకషంగా సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్న స్పృహ ఉండాలి. నిబం ధనల ఉల్లంఘనే ప్రమాదాలకు మూలకారణమని ప్రతిసారీ అధికారులు చెబుతుంటారు. కానీ ఆ నిబంధనలు అవసరమైనంతగా ఉన్నాయో లేదో, వాటిని పాటించక తప్పని స్థితి ఏర్పరచాలంటే ఇంకేం చర్యలు అవసరమో సమీక్షించే వ్యవస్థ ఉందా? అదే ఉంటే జాతీయరహదారి పొడవునా ఉన్న గ్రామాల్లోని జనం గోడు పట్టించుకునేవారు. లక్షల కోట్లు ఖర్చుపెట్టి నాలుగు లేన్లు, ఆరు లేన్లు అంటూ విశాలమైన రహదారులు నిర్మిస్తున్నారు. వాటిపై వాయువేగంతో దూసుకుపోయే వాహనాలు కూడా వచ్చి వాలుతున్నాయి. కానీ ఈ రొదలో ఆ రోడ్లకు ఇరుపక్కలా ఉండే పల్లెటూ ళ్లలో బతుకీడ్చే సాధారణ పౌరుల భద్రతకు ఏం చేయాలో సరిగా ఆలోచించడం లేదు. వారి ఫిర్యా దులను పరిగణనలోకి తీసుకుని లోపాలు సరిదిద్దటం లేదు. బ్రెజిల్ రాజధాని బ్రెసిలియాలో నాలుగేళ్లక్రితం జరిగిన రహదారి భద్రత సదస్సులో 2020 నాటికి రోడ్డు ప్రమాద మృతుల సంఖ్యను సగానికి తగ్గించాలన్నది లక్ష్యంగా నిర్ణయించారు. వచ్చే ఏడాదికి ఆ గడువు ముగిసిపోతుండగా అంతకంతకు ప్రమాదాలు, అందులో మరణాలు పెరుగు తున్నాయే తప్ప తగ్గడం లేదు. ముఖ్యంగా 25–29 ఏళ్లమధ్య వయస్కుల్లో జరిగే మరణాలకు కార ణమేమిటని ఆరా తీసినప్పుడు రోడ్డు ప్రమాదాలదే ప్రధాన పాత్ర అని తేలింది. ప్రభుత్వాల వైపుండే లోపాలతోపాటు అతి వేగం, ముందుండే వాహనాలను అధిగమించాలనుకోవడం, తాగి వాహనాన్ని నడపడం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన హేతువులు. ఈమధ్యకాలంలో సెల్ఫోన్ వీటికి అదనంగా చేరింది. హైదరాబాద్ నగరంలో మూడేళ్లక్రితం నిండా ఇరవైయ్యేళ్లు దాటని ఆరుగురు విద్యార్థులు పట్టపగలే మద్యం సేవించి పెను వేగంతో కారు నడుపుతూ వేరే కారులో ప్రయా ణిస్తున్న ముగ్గురు కుటుంబసభ్యుల్ని బలిగొన్నారు. మద్యం తాగి వాహనం నడిపేవాడు ఆత్మాహు తికి పాల్పడే ఉగ్రవాదిలాంటివాడని కొన్నేళ్లక్రితం ఢిల్లీ కోర్టు వ్యాఖ్యానించింది. ఈ బాపతు ఉగ్ర వాదులకు కళ్లెం వేయడంలో మన ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయి. ప్రపంచంలోని వాహనాల్లో మన దేశంవాటా ఇప్పటికీ ఒక్క శాతం మాత్రమే. కానీ రోడ్డు ప్రమాదాల్లో 10 శాతం మరణాలు మన దేశంలోనే సంభవిస్తున్నాయి. వీటి కారణంగా విలువైన మానవ వనరుల్ని కోల్పోతున్నాం. దాంతోపాటు మన ఆర్థిక వ్యవస్థ కూడా ఎంతో నష్టపోతోంది. ఈ ప్రమాదాల్లో గాయపడేవారిది వేరే కథ. వారు తాత్కాలికంగా ఉపాధికి దూరం కావడం, కొన్ని సందర్భాల్లో దాన్ని శాశ్వతంగా కోల్పోవడం... అదే సమయంలో తడిసిమోపెడయ్యే ఆసుపత్రి బిల్లులు చెల్లించాల్సి రావడం కుటుంబాలను దిగదీస్తోంది. ఇప్పుడు వెల్దుర్తి ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారంతా దళిత కుటుంబాలవారు. కడుపునిండా తినడమే కష్టమైన ఆ కుటుంబాల్లోని వారికి ఇకపై ఆసరాగా నిలిచేదెవరు? పాలకులు ఆలోచించాలి. ఆదుకోవాలి. ప్రభుత్వాలు తమ నిర్లక్ష్యాన్ని వదుల్చుకుని, పకడ్బందీ ప్రణాళికలు రూపొందించుకుని పటిష్టంగా పనిచేస్తేనే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుంది. అంతర్జాతీయ సదస్సుల్లో హామీలివ్వడం మాత్రమే కాదు.. వాటిని ఆచరణలో అమలు చేయాలన్న దృఢ సంకల్పం కూడా ఉండాలి. -
మీరు ఏ రంగు అరటిపండు తింటున్నారు?
అరటి.. ప్రపంచంలో ఎక్కువగా తినే పండు. అన్ని రకాల పండ్లు కొన్ని సీజన్స్లలో మాత్రమే దొరుకుతాయి. కొన్ని పండ్లు సంవత్సరానికి ఒక్కసారే దొరుకుతాయి. చాలా తక్కువ పండ్లు మాత్రమే ప్రతి రోజు దొరుకుతాయి, అలా దొరికే పండ్లలో మనకు ఎక్కువగా అందుబాటులో ఉండేది అరటి పండు. అరటి పండు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ రోజు( ఏప్రిల్ 17) ప్రపంచ అరటి పండ్ల దినోత్సవం. ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ (ఐఎఫ్ఏడీ) అరటికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. అవేంటో ఒక్కసారి చూద్దాం.. అరటి పండ్లలో చాలా రకాలు ఉంటాయి. గ్రీన్ కలర్ అరటి పండ్లు, పసుపు రంగు అరటి, మచ్చల అరటి, బ్రౌన్ కలర్ అరటి. అయితే వీటిలో ఒక్కొ రంగు అరటి పండు ఒక్కో విధంగా ఉపయోగపడుతుందట. బాగా పండిన లేదా రంగుమారిన అరటి పండ్లను (బ్రౌన్ కలర్ అరటి) పడేయకూడదట. వాటిని తినడం వల్ల ఒత్తిడి, ఆందోళ తగ్గుతుంది. బ్రౌన్ కలర్ అరటి పండ్లలలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని జ్యూస్ చేసుకొని తాడగం కానీ బానానా బ్రెడ్గా చేసుకొని తింటే మంచిదని చెబుతున్నారు. ఇక గ్రీన్ కలర్ అరటి పండ్లు షుగర్ పెరగకుండా కాపాడుతాయి. ఈ కలర్ అరటి పండ్లు నెమ్మదిగా జీర్ణమవుతాయ. దీని వల్ల రక్తంలో గ్లూకోజ్ పరిమాణం నెమ్మదిగా పెరుగుతాయి. ఇక పసుపు రంగు అరటి పండ్ల తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి తినడం చాలా రోగాలు మనకు సోకవట. ఇవి చాలా సులభంగా జీర్ణమై బలాన్ని ఇస్తాయట. మచ్చలు ఉన్న అరటిలో ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిలో అనేక అనామ్లజనకాలు ఉంటాయి. ఈ కలర్ అరటి పండు చాలా రుచికరంగా ఉంటుంది కానీ మిగతా అరటి పండ్ల కంటే వీటిలో పోషకాలు కాస్త తక్కువట. అరటి పండు తినటం వల్ల ఇంకా చాలా ప్రయోజనాలు కలుగుతాయి, మనకి అరటిపండ్లు చాలా సులభంగా దొరుకుతాయి కాబట్టి ప్రతిరోజు ఒక్క అరటిపండు అయిన తింటే చాలా ఆరోగ్య సమస్యల నుండి మనం తప్పించుకోవచ్చు. అరటి పండ్ల తినడం వల్ల కలిగే మరిన్ని ఉపయోగాలు అరటి పండులో విటమిన్స్,మినరల్స్, ఫైబర్, పొటాషియం ఎక్కువగా ఉండటం వలన మనకు రోజంతా ఎనర్జీని ఇస్తుంది. హార్ట్ సమస్యలు, యాసిడిటి సమస్యలను అరటి తొందరగా అరికడుతుంది. ఈ పండు తినడం వలన జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి ముఖ్యంగా ఎసిడిటిని ఎక్కువగా తగ్గిస్తుంది. అరటిలో పొటాషియం ఎక్కువగా ఉండి సోడియం తక్కువగా డటంవలన బ్లెడ్ ప్రెషర్ ని తగ్గిస్తుంది ప్రతి రోజు అరటి పండు తినడం వలన ఇందులో ఉండే ఐరన్, హిమోగ్లోబిన్ ని ఎక్కువ చేసి అనీమియాను రాకుండా చేస్తుంది. ఇందులో ఎక్కువగా విటమిన్స్ ఉండటం వలన కంటి చూపుకు కూడా చాలా పనిచేస్తుంది. మచ్చలున్న అరటి పండులో క్యాన్సర్ తో పోరాడే కణాలు అధికంగా ఉంటాయి. మలబద్దకం ఎక్కువగా ఉన్నవారికి ఒక నెల రోజులు కచ్చితంగా తినిపిస్తే వారికి ఇక ఆ సమస్య ఉండదు. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండి అది మలబద్దకాన్ని నివారిస్తుంది. -
2019లో ప్రపంచవృద్ధి 3 శాతమే!
ఐక్యరాజ్యసమితి: ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ఐక్యరాజ్యసమితి నిరాశాపూరిత నివేదిక విడుదల చేసింది. 2019లో ఈ వృద్ధి రేటు కేవలం 3 శాతంగా పేర్కొంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ అంచనాలను 3.7 శాతం (అక్టోబర్ అంచనా) నుంచి 3.5 శాతానికి తగ్గించింది. అయితే అంతకన్నా తక్కువ వృద్ధి రేటును ఐక్యరాజ్యసమితి అంచనావేస్తుండడం గమనార్హం. 2018లో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 3.1 శాతంకన్నా కూడా ఇది తక్కువ కావడం మరో అంశం. వాణిజ్య యుద్ధం తీవ్రతలు, గుత్తాధిపత్య ధోరణులు, పలు దేశాల రుణ భారాలు, పర్యావరణ సమస్యల వంటివి 2019లో ప్రపంచం ముందు ఉన్న సవాళ్లని ఐక్యరాజ్యసమితి నివేదిక వివరించింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ►ఐక్యరాజ్యసమితిలో ఆర్థిక సామాజిక వ్యవహారాల శాఖ, వాణిజ్య అభివృద్ధి వ్యవహారాల శాఖ, ఐదు ప్రాంతీయ ఆర్థిక కమిషన్లు సంయుక్తంగా ఈ 218 పేజీల నివేదికను రూపొందించాయి. ► జరుగుతున్న వృద్ధిలోసైతం అసమానతలు ఉన్నాయి. వృద్ధి ఫలలూ అతి పేద దేశాలకు చేరడం లేదు. ►పర్యావరణ సమతౌల్యం, పేదరిక నిర్మూలనకు నిధుల సమకూర్చుకోవడం, అసమానతలు రూపుమాపడం వంటి కార్యక్రమాలకు ప్రపంచదేశాల ఉమ్మడి కృషి అవసరం. ►ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ 2018లో 6.6 శాతం వృద్ధి నమోదుచేసుకుంది. 1990 తరువాత ఇంత పేలవ స్థాయి వృద్ధిని నమోదుచేసుకోవడం చైనాకు ఇదే తొలిసారి. ఇదే ధోరణి మున్ముందూ కొనసాగే వీలుంది. 2019లో వృద్ధి రేటు 6.3 శాతానికి పడిపోవచ్చు. ఐఎంఎఫ్ లెక్కింపు విధానం వేరు... ప్రపంచ వృద్ధి రేటు విషయంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), ఐక్యరాజ్యసమితి మధ్య వ్యత్యాసం ఉంది. విభిన్న విశ్లేషణా విధానాలను రెండు సంస్థలూ అవలంభించడమే దీనికి కారణం. చైనా, భారత్, కొన్ని అభివృద్ధి చెందిన దేశాల వృద్ధి విషయంలో ఐఎంఎఫ్ వెయిటేజ్ ఐక్యరాజ్యసమితి వెయిటేజ్తో పోల్చితే కొంత అధికం. అర శాతం మేర అంచనాల్లో తేడాలు రావడానికి ప్రధాన కారణాల్లో ఇది ఒకటి. – డాన్ హోలెండ్ ఐరాస ప్రపంచ ఆర్థిక పర్యవేక్షణావిభాగం చీఫ్ -
ఆగని ఆకలి కేకలు
బ్యాంకాక్: ఓ వైపు ఆసియా–పసిఫిక్ దేశాలు(తూర్పు, దక్షిణ, ఈశాన్య ఆసియాతోపాటు ఆస్ట్రేలియా, రష్యాలో కొంత భాగం, పసిఫిక్ తీరంలోని మరికొన్ని దేశాలు) అభివృద్ధిలో దూసుకుపోతున్నా... మరోవైపు వాటిలో ఆకలి కేకలూ అదే స్థాయిలో ఉన్నాయని ఐక్యరాజ్య సమితి తాజా నివేదికలో వెల్లడైంది. సుమారు 48కోట్ల 60 లక్షల మంది ఇంకా ఆకలి సమస్యతో బాధపడుతున్నారని నివేదిక తెలిపింది. బ్యాంకాక్, మలేసియా, కౌలాలంపూర్ లాంటి మేటి నగరాల్లోనూ ఇప్పటికీ చాలా కుటుంబాలు తినడానికి తిండి లేక అలమటిస్తున్నాయని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్తో పాటు ఐక్యరాజ్య సమితికి చెందిన మరో మూడు ఏజెన్సీలు తెలిపాయి. ఒక్క బ్యాంకాక్లోనే మూడో వంతు చిన్నారులు తగిన ఆహారాన్ని పొందలేకపోతున్నారని వెల్లడించాయి. ఇక మన పొరుగు దేశమైన పాకిస్థాన్లో కేవలం 4శాతం చిన్నారులు మాత్రమే సరిపడ ఆహారాన్ని తీసుకుంటున్నారని సర్వేలో తేలింది. ‘ఈ ప్రాంతాల్లో 2030 నాటికి ఆకలితో బాధపడేవారి సంఖ్యను సున్నాకు తీసుకురావాలంటే... రోజుకు కనీసం లక్షా పదివేల మందిని ఆకలి సమస్యకు దూరం చేయాల్సి ఉంటుంద’ని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రీజినల్ డైరెక్టర్ జనరల్ కుందవి కడియన్సన్ తెలిపారు. తూర్పు, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో పోషకాహార లోపంతో బాధపడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిందని, గత కొన్నేళ్లలో ఈ ప్రాంతాల్లో ఎలాంటి మెరుగుదలా కనిపించలేదని ఆమె వివరించారు. ఇక భారత్తోపాటు దక్షిణాసియాలోని ఇండోనేసియా, మలేసియా, కంబోడియాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉందని తెలిపారు. ఈశాన్య ఆసియా దేశాల్లో ప్రత్యేకించి కంబోడియాలో మంచినీటి కొరత సైతం తీవ్రంగా ఉందని ఆమె వెల్లడించారు. అంతేకాదు ఈ సర్వేలో తేలిన వివరాల ప్రకారం సుమారు 79 మిలియన్ చిన్నారులు పౌష్టికాహార లోపం కారణంగా పూర్తి స్థాయి ఎత్తు కూడా ఎదగలేకపోతున్నారని తేలింది. ఇక పట్టణ ప్రాంతాల్లోని వారు అనారోగ్యమైన, తక్కువ ధరకు లభించే ప్రాసెస్డ్ ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఒబేసిటీ బారిన కూడా పడుతున్నట్లు వెల్లడైంది. -
నిక్కీ హేలీ స్థానంలో ఇవాంకా ట్రంప్..?!
వాషింగ్టన్ : ఐక్యరాజ్యసమితిలో అమెరికా ప్రతినిధిగా ఉన్న నిక్కీ హేలీ రాజీనామా చేశారు. ఎలాంటి ముందస్తు ఊహాగానాలు లేకుండా ఆమె అకస్మాత్తుగా రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. అయితే నిక్కీ రాజీనామా తరువాత ఆమె స్థానంలో ఎవరూ వస్తారు అనే అంశం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఇవాంకా ట్రంప్ని ఆ పదవిలో నియమిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగా ట్రంప్ కూడా సంకేతాలు వెలువరించారు. ‘నిక్కీ తర్వాత అలాంటి డైనమిక్ అంబాసిడర్ అయ్యే అర్హత ఇవాంకాకి ఉందనుకుంటున్నా. అయితే, నా కూతుర్ని ఎంపిక చేస్తే.. నాకు బంధుప్రీతి అని ఆరోపిస్తారేమో’ అంటూ ట్రంప్ విలేకరుల సమావేశంలో తెలిపారు. అయితే ఈ వార్తల్ని ఇవాంకా కొట్టి పారేశారు. ‘ప్రస్తుతం నేను వైట్ హౌస్లో చాలా గొప్ప వారితో కలిసి పనిచేస్తున్నాను. నిక్కీ హేలీ చాలా గొప్ప వ్యక్తి. ఆమె స్థానంలో అధ్యక్షుడు మరో గొప్ప వ్యక్తిని నియమిస్తారని నమ్ముతున్నాను. అయితే ఆ వ్యక్తి నేను మాత్రం కాదం’టూ ఇవాంకా ట్రంప్ తెలిపారు. దక్షిణ కరోలినా మాజీ గవర్నర్ అయిన నిక్కీ హేలీ.. 2020 ఎన్నికల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకే రాజీనామా చేసి ఉంటారనే ప్రచారం జోరందుకుంది. అయితే, ఆ వాదనను నిక్కీ హేలీ కొట్టిపారేశారు. ‘నా జీవితంలో ఇవి ఉన్నతమైన రోజులు. నా తర్వాత అంబాసిడర్గా వచ్చేవారికి అన్నీ అనుకూలంగా ఉండేలా చూడడం ఇప్పుడు నా ముందున్న లక్ష్యం. 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో లేను. ట్రంప్కే ప్రచారం చేస్తా’ అని నిక్కీ హేలీ ప్రకటించారు. కానీ, తాను ఎందుకు రాజీనామా చేశారో మాత్రం ఆమె చెప్పలేదు. -
అమెరికా రాయబారి పదవికి నిక్కీ హేలీ రాజీనామా
వాషింగ్టన్ : ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి పదవికి నిక్కీ హేలీ రాజీనామా చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమె రాజీనామాకు ఆమోదం కూడా తెలిపినట్టు సమాచారం. ఇండియన్ అమెరికన్ అయిన నిక్కీ హేలీని 2016 నవంబర్లో ఐరాసకు అమెరికా రాయబారిగా ట్రంప్ నియమించారు. ఈ పదోన్నతితో అమెరికా యంత్రాంగంలో కేబినెట్ స్థాయి పదవికి నియమితురాలైన తొలి ఇండో అమెరికన్గా నిక్కీ పేరు మారుమోగింది. హేలీ గతంలో సౌత్ కరోలినా గవర్నర్గా కూడా పనిచేశారు. కాగా, అమెరికా కాలమాన ప్రకారం మంగళవారం ఉదయం ఓవల్లోని కార్యాలయంలో తన స్నేహితురాలు నిక్కీ హేలీతో కలిసి ఓ ముఖ్యమైన ప్రకటన చేయనున్నట్టు ట్రంప్ ట్విట్ చేశారు. Big announcement with my friend Ambassador Nikki Haley in the Oval Office at 10:30am. — Donald J. Trump (@realDonaldTrump) October 9, 2018 -
నీకు మతిలేదు... నువ్వో పిచ్చోడివి..!
సియోల్/వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ శృతిమించుతోంది. ఇరువురు నేతలూ నీకు పిచ్చంటే... నీకు పిచ్చని వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ఐక్యరాజ్య సమితి వేదికగా ఉత్తర కొరియాను సర్వనాశనం చేస్తానంటూ ట్రంప్ చేసిన ప్రసంగంపై కిమ్ స్పందిస్తూ... ట్రంప్కు మతి లేదని వ్యాఖ్యానించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్... ‘కిమ్ ఓ పిచ్చోడు’అంటూ బదులిచ్చారు. ‘ప్రపంచం ముందు నన్ను, నా దేశాన్ని ట్రంప్ అవమానించారు. ఆయన మానసిక స్థితి సరిగా లేదు. కొరియాపై ఆయన వ్యాఖ్యలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’అని కిమ్ హెచ్చరించినట్టు అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. దీనికి బదులుగా... ‘ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఓ పిచ్చోడు. సొంత ప్రజలను ఆకలితో మాడ్చడానికి, వారిని చంపడానికి కూడా వెనుకాడడు. ఇందుకు ఫలితం అనుభవించక తప్పదు’అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. పసిఫిక్లో హైడ్రోజన్ బాంబ్..! మరోవైపు ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రి యోంగ్ హూ... పసిఫిక్ మహాసముద్రంలో హైడ్రోజన్ బాంబు ప్రయోగించే అవకాశం ఉందన్న సంకేతాలిచ్చి అగ్గికి ఆజ్యం పోశారు. ఇది తమ అధినేత కిమ్ నిర్ణయంపై ఆధారపడి ఉందన్నారు. -
పాకిస్తాన్ కాదు..టెర్రరిస్తాన్!
ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్, పాక్ల మాటల యుద్ధం వాడి, వేడిగా సాగింది. కశ్మీరీల పోరాటాన్ని భారత్ దారుణంగా అణచేస్తోందని దాయాది దేశం ప్రధాని షాహిద్ కఖాన్ అబ్బాసీ విషం చిమ్మారు. స్వల్పకాలిక యుద్ధానికి తెర తీసినా భారత్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఐరాసలో కశ్మీర్కు ప్రత్యేక ప్రతినిధిని ఏర్పాటు చేయాలని సూచించారు. అబ్బాసీ ప్రసంగాన్ని ఐరాసలో భారత ప్రతినిధి ఈనామ్ గంభీర్ చీల్చి చెండాడారు. ఉగ్రవాదానికి పాక్ అందిస్తున్న సాయాన్ని ప్రస్తావిస్తూ.. దాయాది బండారాన్ని విశ్వ వేదికపై బట్టబయలు చేశారు. ‘మీది స్వచ్ఛమైన భూమిగా పేర్కొనే పాకిస్తాన్ కాదు.. ఉగ్రవాదానికి పర్యాయపదంగా మారిన టెర్రరిస్తాన్’ అంటూ నిప్పులు చెరిగారు. ఐక్యరాజ్యసమితి: భారత్ ఐక్యరాజ్యసమితి వేదికగా మరోసారి పాకిస్తాన్పై నిప్పులు చెరిగింది. దాయాదిని ‘టెర్రరిస్తాన్’ అని ఘాటుగా విమర్శిస్తూ.. అంతర్జాతీయ ఉగ్రవాదానికి పాక్ పుట్టినిల్లుగా మారిందని పేర్కొంది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో భారత ప్రతినిధి ఈనామ్ గంభీర్ పాకిస్తాన్ తీరును తీవ్రంగా ఎండగట్టారు. ఒసామా బిన్ లాడెన్, ముల్లా ఒమర్ వంటి ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన పాక్.. తామే ఉగ్రబాధితులమని చెప్పుకోవటం విడ్డూరంగా ఉందన్నారు. అంతకుముందు ఐరాస సమావేశంలో పాక్ ప్రధాని షాహిద్ అబ్బాసీ ‘ఎల్వోసీని దాటివస్తే భారత్కు దీటుగా సమాధానమిస్తామ’ంటూ చేసిన వ్యాఖ్యలకు గంభీర్ ఘాటుగా సమాధానమిచ్చారు. కాగా, తమపై ఒత్తిడి పెంచేందుకు భారత ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ రూపొందిస్తున్న వ్యూహాలు విజయవంతం కాకుండా అడ్డుకోగలమని పాకిస్తాన్ పేర్కొంది. పాక్ చెబితే ప్రపంచం వినాలా? అంతర్జాతీయ మిలటరీ, అభివృద్ధి సహాయ నిధి నుంచి వచ్చిన కోట్ల డాలర్లను ప్రమాదకర ఉగ్రవాద మౌలికవసతుల కల్పనకే పాకిస్తాన్ వినియోగించుకుందని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత మిషన్లో ఫస్ట్ సెక్రటరీగా ఉన్న ఈనామ్ గంభీర్ విమర్శించారు. ‘పాక్కు తను పెంచి పోషించిన ఉగ్రవాదమే ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది’ అని ఆమె పేర్కొన్నారు. అంతర్గత పరిస్థితులను అదుపులో పెట్టుకోలేని దేశం నుంచి.. మానవ హక్కుల రక్షణ, ప్రజాస్వామ్యంపై పాఠాలు వినేందుకు ప్రపంచం సిద్ధంగా లేదని గంభీర్ వ్యాఖ్యానించారు. ‘అంతర్జాతీయ ఉగ్రవాదంలో టెర్రరిస్తాన్ భాగస్వామ్యం అసామాన్యం. పాకిస్తాన్ తీరు ప్రపంచానికి ఇబ్బందులు కలిగిస్తోంది’ అని ఆమె పేర్కొన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా కశ్మీర్ భారత్లో అంతర్భాగంగానే ఉంటుందని గంభీర్ స్పష్టం చేశారు. పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినంత మాత్రాన భారత భౌగోళిక సమగ్రతకు భంగం కలిగించటంలో విజయం సాధించలేదన్నారు. పాకిస్తాన్ ఉగ్ర కేంద్రం: అఫ్గానిస్తాన్ ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్తాన్.. అంతర్జాతీయ సమాజాన్ని పక్కదారి పట్టిస్తూ ఉగ్రవాదులపై చర్యలు తీసుకోకుండా జాగ్రత్త పడుతోందని అఫ్గానిస్తాన్ ఆరోపించింది. ఐరాస సర్వప్రతినిధి సభలో అఫ్గాన్ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘పాక్తో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అఫ్గాన్ నిరంతరాయంగా వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తోంది. కానీ పాకిస్తాన్ ఇందుకు సుముఖంగా లేదు. మా దేశంలో తాలిబాన్ స్థావరాలున్నాయని పాక్ ఆరోపిస్తోంది. కానీ అవన్నీ వారి భూభాగంలోనే ఉన్నాయి. అంతర్జాతీయ సమాజాన్ని పక్కదారి పట్టిస్తూ.. ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ముద్రవేసిన వారికీ ఆశ్రయమిస్తూ పాక్ తన వక్రబుద్ధిని చాటుకుంటోంది’ అని ఘాటుగా విమర్శించారు. 1971లో పాక్ మారణహోమం: హసీనా బంగ్లాదేశ్పై పాకిస్తాన్ 1971లో దారుణ మారణకాండకు ఒడిగట్టిందని.. 30 లక్షల మంది అమాయక ప్రజలను హతమార్చిందని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా వెల్లడించారు. ఐరాస సర్వప్రతినిధి సభనుద్దేశించి ఆమె మాట్లాడతూ.. ‘1971 మార్చి 25 అర్థరాత్రి పాకిస్తాన్ సైన్యం తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్)పై విరుచుకుపడింది. మతం, జాతి, రాజకీయ విశ్వాసం పేరుతో ప్రజలను అన్యాయంగా చంపేసింది. బంగ్లా మేధావులను పాక్ సైనికులు అత్యంత క్రూరంగా హతమార్చారు. 2లక్షల మంది మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. 9 నెలల తర్వాత భారత సైన్యం సాయంతో పాకిస్తాన్ను ఓడించగలిగాం’ అని పేర్కొన్నారు. ‘ఉగ్రవాదానికి మతం, విశ్వాసం, జాతి అనే తేడాల్లేవు. నాపైనే చాలాసార్లు ఉగ్రదాడియత్నాలు జరిగాయి. అందుకే ఉగ్ర బాధితులకు సరైన భద్రత కల్పించాలని నేను కోరుకుంటున్నా. హింసాత్మక అతివాదానికి మతం పేరు చెప్పి తప్పించుకోవటం సరికాదు. ఉగ్రవాదులకు ఆర్థిక, ఆయుధ సాయం అందకుండా ఐక్యరాజ్యసమితి కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా’ అని హసీనా పేర్కొన్నారు. ద్వైపాక్షిక చర్చలే పరిష్కారం: చైనా కశ్మీర్ వివాదాన్ని భారత్, పాకిస్తాన్లు ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చైనా శుక్రవారం వ్యాఖ్యానించింది. కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని అమలు చేయాలన్న ఇస్లామిక్ సహకార సంస్థ (ఓఐసీ)తో చైనా విభేదించింది. ఓఐసీ సూచన గురించి చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లూ కాంగ్ వద్ద ప్రస్తావించగా, ‘çకశ్మీర్ అంశంపై చైనా వైఖరిని ఇప్పటికే స్పష్టం చేశాం. ఈ వివాదం ఇప్పటిది కాదు. ప్రాంతీయ శాంతి, స్థిరత్వాలను కాపాడుతూ భారత్, పాక్లు చర్చల ద్వారా కశ్మీర్ అంశాన్ని పరిష్కరించుకుంటాయని మేం ఆశిస్తున్నాం’ అని అన్నారు. ఉగ్రవాదానికి పర్యాయపదం పాక్ పాకిస్తాన్ ప్రధాని షాహిద్ అబ్బాసీ ప్రసంగంలోని ప్రతి అంశానికీ ఈనామ్ గంభీర్ దీటుగా బదులిచ్చారు. ‘పాకిస్తాన్ ప్రదర్శిస్తున్న వాస్తవాల వక్రీకరణ, మోసం, కపట నాటకాల కారణంగా పొరుగుదేశాలన్నీ బాధితులుగా మారాయి. వాళ్లిప్పుడు ఎన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నా వాస్తవాన్ని దాచలేరు. అనతికాలంలోనే ఉగ్రవాద దేశానికి పాకిస్తాన్ పర్యాయపదంగా మారిపోయింది’ అని ఈనామ్ పేర్కొన్నారు. ‘పాకిస్తాన్ అంటే స్వచ్ఛమైన దేశం (ల్యాండ్ ఆఫ్ ప్యూర్) అని అర్థం. కానీ వారు దాన్ని స్వచ్ఛమైన ఉగ్రవాద దేశం (ల్యాండ్ ఆఫ్ ప్యూర్ టెర్రర్)గా మార్చేశారు. అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని ఉత్పత్తి చేస్తూ పాకిస్తాన్ ఇప్పుడు టెర్రరిస్తాన్గా మారిపోయింది’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రవేసిన లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ఎన్నికల్లో పోటీచేస్తానని ప్రకటించటాన్ని బట్టి పాక్లో తాజా పరిస్థితిని అంచనా వేయవచ్చని ఈనామ్ గంభీర్ పేర్కొన్నారు. కశ్మీర్ పోరాటాన్ని అణచివేస్తున్నారు: పాక్ ప్రధాని అబ్బాసీ తొలిసారి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన పాక్ ప్రధాని అబ్బాసీ.. కశ్మీర్లో ప్రజలు స్వాతంత్య్రం కోసం చేస్తున్న పోరాటాన్ని భారత్ క్రూరంగా అణచివేస్తోందని పేర్కొన్నారు. ఐరాస కశ్మీర్పై ప్రత్యేక ప్రతినిధిని నియమించాలని ఆయన కోరారు. ‘కశ్మీర్ సమస్య ధర్మబద్ధంగా, శాంతియుతంగా, వీలైనంత త్వరగా పరిష్కారం కావాలి. శాంతి చర్చలను కొనసాగించేందుకు భారత్ సిద్ధంగా లేదు. కాబట్టి, జమ్మూకశ్మీర్ విషయంలో ఐక్యరాజ్యసమితి భద్రతామండలి జోక్యం చేసుకోవాలని కోరుతున్నాం. కశ్మీర్కు ప్రత్యేక దూతను ఏర్పాటుచేసేలా ఐరాస సెక్రటరీ జనరల్ నిర్ణయం తీసుకోవాలి. భద్రతామండలి తీర్మానాలు అమలయ్యేలా ఆ దూత చర్యలు తీసుకోవాలి’ అని అబ్బాసీ పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి భారత్ 600 సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడినా పాకిస్తాన్ నిగ్రహంగా ఉందన్నారు. ఈ సమస్యలన్నీ పరిష్కరించుకునేందుకు భారత్తో శాంతియుత చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇందుకోసం పాక్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించటాన్ని భారత్ మానుకోవాలన్నారు. ‘ఒకవేళ నియంత్రణ రేఖ దాటి భారత్ ముందుకొస్తే దీటైన జవాబు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని అబ్బాసీ వెల్లడించారు. అంతర్జాతీయ ఉగ్రవాదంపై పోరాటం కారణంగా చాలా నష్టపోయామన్నారు. దోవల్ వ్యూహాలు ఫలించనీయం పాకిస్తాన్పై ఒత్తిడి పెంచేందుకు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అనుసరిస్తున్న ‘అఫెన్సివ్ డిఫెన్స్, డబుల్ స్క్వీజ్’ వ్యూహాలను విజయవంతం కానీయబోమని పాకిస్తాన్ పేర్కొంది. ఈ ప్రాంతం లో తన ఆధిపత్యం పెంచుకునేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామంది. ‘ఈ ప్రాంతంలో భారత ఆధిపత్యాన్ని పెంచేందుకు అజిత్ దోవల్ దూకుడైన రక్షణ వ్యూహం, అంతర్గతంగా, అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచే అఫెన్సివ్ డిఫెన్స్, డబుల్ స్క్వీజ్ వ్యూహలను ప్రయోగిస్తున్నారు. వీటిని ఫలించనీయం. పాక్లో అల్లకల్లోలం సృష్టించాలని భారత్ ప్రయత్నిస్తోంది. ఉగ్రవాదం, గూఢచర్యం ద్వారా భారత్ చేస్తున్న ప్రయత్నాలు కలలుగానే మిగిలిపోతాయి’ అని ఐరాసలో పాకిస్తాన్ ప్రతినిధి టిపూ ఉస్మాన్ పేర్కొన్నారు. హెచ్–1బీపై టిల్లర్సన్తో సుష్మ చర్చలు అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్తో భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తొలిసారిగా శుక్రవారం సమావేశమై హెచ్–1బీ, ఉగ్రవాదం సహా పలు విషయాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్–అమెరికా రాజకీయ, ఆర్థిక భాగస్వామ్యంపై ఇద్దరు మంత్రులు చర్చించారు. అమెరికాలోని భారత సాంకేతిక సంస్థలు అధికంగా ఆధారపడే హెచ్–1బీ వీసాల విషయాన్ని సుష్మ ఈ భేటీలో ప్రస్తావించారు. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, ఉగ్రవాదం తదితర ప్రాంతీయ అంశాలపై వీరి మధ్య చర్చలు జరిగాయి. కాగా, ఐరాస సర్వప్రతినిధి సమావేశంలో సుష్మ శనివారం ప్రసంగించనున్నారు. -
పాక్ చెంప చెల్లుమనిపించిన భారత్
న్యూయార్క్: పాకిస్థాన్కు భారత్ గట్టి సమాధానం చెప్పింది. తొలిసారి ఐక్యరాజ్యసమితిలో తమ దేశం తరుపున మాట్లాడిన పాక్ కొత్త ప్రధాని షాహిద్ ఖబన్ అబ్బాసీ భారత్పై తీవ్ర నిందలు వేయగా దానికి బదులుగా చెంపచెల్లుమనేట్లుగా భారత్ బదులిచ్చింది. 'పాకిస్థాన్ ఇప్పుడు టెర్రిరిస్థాన్.. స్వచ్ఛమైన ఉగ్రవాదానికి అది ఇప్పుడు పుట్టినిళ్లుగా ఉంది' అంటూ భారత్ ఐక్యరాజ్యసమితిలో ఏ మాత్రం సంకోచించకుండా వ్యాఖ్యానించింది. 'పాక్కు ఉంది కొద్ది చరిత్రే. అందులోనే ఉగ్రవాదానికి అర్థంగా మారింది. స్వచ్ఛమైన ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ ఉత్పత్తి చేసి పెంచిపోషిస్తోంది. పాకిస్థాన్ ఇప్పుడు టెర్రరిస్థాన్. ప్రపంచం మొత్తానికి ఆ దేశమే ఉగ్రవాదాన్ని పంపిణీ చేస్తోంది' అంటూ భారత్ తరుపున ఐక్యారాజ్యసమితిలో మాట్లాడిన సెక్రటరీ ఈనం గంబీర్ వ్యాఖ్యానించారు. ఒసామా బిన్ లాడెన్, తాజాగా హఫీజ్ సయీద్లాంటి ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఆశ్రయం ఇస్తుందని, ఉగ్రవాదులపాలిట స్వర్గంగా పాకిస్థాన్ మారిందని స్పష్టం చేశారు. ఉగ్రవాద సంస్థగా లష్కరే తోయిబాను ఐక్యరాజ్యసమితి గుర్తించగా ఇప్పుడు అదే సంస్థకు చెందిన హఫీజ్ మహ్మద్ సయీద్ పార్టీ పెడతానంటూ ప్రకటించారని, పాకిస్థాన్లో ఎలాంటి పరిస్థితి ఉందో ఈ ఒక్క విషయం గమనిస్తే అర్ధమైపోతుందని అన్నారు. -
ఐక్యరాజ్యసమితికి జాధవ్ పత్రాలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో గూఢచర్యం ఆరోపణలపై మరణశిక్షకు గురైన భారత మాజీ నేవీ అధికారి కుల్భూషణ్ జాధవ్కు సంబంధించిన కీలక పత్రాలను ఐక్యరాజ్యసమితికి సమర్పించేందుకు పాకిస్తాన్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు అతనికి సంబంధించిన పత్రాలను పాక్ సిద్ధం చేసినట్టు ఆ దేశ మీడియా వెల్లడించింది. ఈ పత్రాలను ఐక్యరాజ్యసమితితో పాటు ఇస్లామాబాద్లోని విదేశీ రాయబారులకు అందజేయనున్నట్టు పేర్కొంది. జాధవ్ తొలుత ఇచ్చిన వాంగ్మూలంతో పాటు.. కరాచీ, బలూచిస్తాన్లో గూఢచర్యం, విద్యోహ కార్యకలాపాలకు సంబంధించి ఫీల్డ్ జనరల్ కోర్టు మార్షల్ ఎదుట అతను ఇచ్చిన వాంగ్మూలానికి చెందిన పత్రాల ఆధారంగా ఈ తాజా పత్రాలను పాక్ సిద్ధం చేసిందని, వీటితో పాటు కోర్టు మార్షల్ జనరల్ నివేదికను, అలాగే కోర్టు విచారణ కాలక్రమానికి చెందిన పత్రాలను కూడా జత చేసినట్టు ద నేషన్ పత్రిక వెల్లడించింది. జాధవ్కు చెందిన స్థలాల్లో జరిగిన సోదాలు.. అరెస్టులకు సంబంధించిన పత్రాలు కూడా ఇందులో ఉన్నాయని తెలిపింది. గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న 46 ఏళ్ల జాధవ్కు పాకిస్తాన్ సైనిక చట్టం ప్రకారం ఫీల్డ్ జనరల్ కోర్టు మార్షల్ మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖుమర్ జాదవ్ బజ్వా గత వారం నిర్థారించారు. -
తొలిసారిగా ఐరాస వేదికగా..
భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో చేసుకొనే దివ్వెల పండుగ దీపావళి తొలిసారిగా ఐక్యరాజ్యసమితిలోనూ వెలుగులు నింపింది. ఐరాస కార్యాలయంలో దీపావళి పండుగ ఘనంగా జరిగింది. ఈ పర్వదినం సందర్భంగా ఐరాస ప్రధాన కార్యాలయాన్ని దీపాలతో అలకరించి ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ‘హ్యాపీ దీవాలి’ అంటూ దీపావళి శుభాకాంక్షలను పెట్టారు. ఐరాసలో దీపావళి పండుగ జరుపుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక దేశమంతటా దీపావళి పండుగ సంబరాలు హోరెత్తుతున్నాయి. ఆలయాలను దర్శించుకొని లక్ష్మీ, గణేష్ పూజలను నిర్వహిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖులు రణ్బీర్కపూర్, అనుష్క శర్మ, ప్రియాంక చోప్రా, ‘ట్రిపుల్ ఎక్స్’ సినిమా జోడీ విన్ డీజిల్, దీపికా పదుకొనే, క్రికెటర్ విరాట్ కోహ్లి తదితరులు దేశప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. Happy Diwali, India -
'పాక్ను రచ్చకు ఈడుస్తాం'
కాబూల్: పాకిస్థాన్కు అఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని గట్టి ఝలక్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ రెండు దేశాల మధ్య మంచి సహకారం కొనసాగుతోందని ప్రపంచ దేశాలు భావిస్తుండగా అవేం లేవని తాజా వ్యాఖ్యలతో స్పష్టం చేశారు. తమ దేశ సరిహద్దు వెంబడి గుండా జరుగుతున్న ఉగ్రవాద చర్యలకు పాకిస్థాన్ పరోక్ష కారణం అని ఆయన ఆరోపించారు. ప్రతి రోజు చొరబాట్లకు పాల్పడుతూ హింసను సృష్టిస్తున్నా తాలిబన్లపై పాకిస్థాన్ ఎందుకు చర్య తీసుకోవడం లేదని చెప్పారు. వాస్తవానికి పాక్ కు తాలిబన్ ను అణిచివేసేంతటి సైనిక బలం ఉందని, అయినా కావాలనే ఆ ఉగ్రవాదులపై చేయి వేయకుండా వారికి అవకాశం ఇస్తున్నారని, అందుకే తమ దేశ సరిహద్దు వెంబడి ఉగ్రవాదులు పెట్రేగి పోతున్నారని ఆరోపించారు. త్వరలోనే ఐక్యరాజ్య సమితికి పాకిస్థాన్ను ఈడుస్తున్నాని, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. తాలిబన్లకు వ్యతిరేకంగా పాకిస్థాన్ చర్యలు తీసుకోకుంటే మాత్రం పై చర్యల విషయంలో తప్పక ముందుకు వెళతామని అన్నారు. తాలిబన్లు తమ వ్యవహారాలను పాకిస్థాన్ నుంచి కొనసాగిస్తున్నారని, అందుకే వారిపై చర్యలు తీసుకునే అవకాశం పాకిస్థాన్కే ఉందని చెప్పారు. 'నేను ఈ సందర్భంగా ఓ విషయం చెప్పదలుచుకున్నాను. పాకిస్థాన్ తాలిబన్ నాయకులను శాంతి చర్చలకోసం తీసుకొస్తుందని నేను అనుకోవడం లేదు' అని ఘనీ అఫ్గన్ పార్లమెంటు ఉభయ సభల్లో మాట్లాడారు.