united state
-
అమెరికా నుంచి భారతీయుల తరలింపుపై కేంద్రం ప్రకటన
-
అమెరికా హెచ్చరించినా.. వెనక్కి తగ్గని హౌతీలు
న్యూయార్క్: ఎర్ర సముద్రంలో దాడులు నిలిపివేయాలని అమెరికా మిత్రపక్షాలు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ హౌతీ ఉగ్రవాదులు వెనక్కి తగ్గడం లేదు. అమెరికా హెచ్చరికలను ఏ మాత్రం లెక్కచేయకుండా దాడులను మరింత పెంచే దుస్సాహసం చేస్తున్నారు. తాజాగా అమెరికా నావికాదళం, వాణిజ్య నౌకలకు సమీప దూరంలో డ్రోన్ దాడులకు పాల్పడ్డారు. హౌతీలు సాయుధ మానవ రహిత ఉపరితల నౌక(USV)ను ప్రయోగించారని అమెరికా పేర్కొంది. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీల దాడులు ప్రారంభమైనప్పటి నుంచి మానవరహిత ఉపరితల నౌకను ప్రయోగించడం ఇదే మొదటిసారని అమెరికా నేవీ ఆపరేషన్స్ హెడ్ వైస్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ తెలిపారు. యూఎస్వీలు హౌతీల సముద్ర యుద్ధాల్లో కీలకమైన భాగమని క్షిపణి నిపుణుడు ఫాబియన్ హింజ్ తెలిపారు. సౌదీ సంకీర్ణ దళాలకు వ్యతిరేకంగా గతంలో జరిగిన యుద్ధాల్లో వాటిని ఉపయోగించారని చెప్పారు. తరచుగా సూసైడ్ డ్రోన్ పడవలను ఎక్కువగా ఉపయోగింస్తారని వెల్లడించారు. ఇరాన్లో తయారైన కంప్యూటరైజ్డ్ గైడెన్స్ సిస్టమ్స్లతో అమర్చబడి ఉంటాయని తెలిపారు. ఎర్ర సముద్రంలో హౌతీల దాడుల వెనక ఇరాన్ ఉందని యుఎస్ డిప్యూటీ రాయబారి క్రిస్టోఫర్ లూ అన్నారు. హౌతీలకు బాలిస్టిక్ క్షిపణులతో సహా అధునాతన ఆయుధ సరఫరా చేస్తోందని ఆరోపించారు. ఇరాన్తో అమెరికా ఘర్షణ కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని నిరసిస్తూ ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు. గత డిసెంబర్ నుంచి ఇప్పటివరకు 23 దాడులకు పాల్పడ్డారు. హౌతీల ఆగడాలకు అడ్డుకట్టవేయడానికి అమెరికా సహా 12 మిత్ర దేశాలు ఏకమయ్యాయి. ఎర్రసముద్రంలో గస్తీ నిర్వహిస్తున్నాయి. వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి. హౌతీల దాడులు నిలిపివేయకపోతే సైనిక చర్యను ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా మిత్ర దేశాలు గురువారం హెచ్చరికలు జారీ చేశాయి. ఈ హెచ్చరికలు చేసిన కొన్ని గంటల తర్వాతే హౌతీలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటం గమనార్హం. ఇదీ చదవండి: సైనిక చర్యకు దిగుతాం.. హౌతీలకు అమెరికా వార్నింగ్ -
వర్క్ ప్రమ్ హోం ఉద్యోగులకు IBM వార్నింగ్...
-
భారతీయులకు గుడ్ న్యూస్.. ఇంటర్వ్యూ లేకుండానే అమెరికా వీసా!
వాషింగ్టన్: భారతీయులకు బీ1, బీ2 వంటి సాధారణ వీసాల జారీ ప్రక్రియ పునర్ప్రారంభమైన తరుణంలో అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే వీసాలు మంజూరు చేయాలని కాన్సులర్ అధికారులను విదేశాంగ శాఖ ఆదేశించింది. అయితే డిసెంబర్ 31వరకు దరఖాస్తు చేసుకున్న నిర్దిష్ట కేటగిరీల దరఖాస్తుదారులకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. ఎఫ్, హెచ్-1,హెచ్-3, హెచ్-4, నాన్ బ్లాంకెట్ ఎల్,ఎం, ఓ, పీ, క్యూ, అకాడమిక్ జే విసాలకు ఈ కొత్త నిబంధన వర్తిస్తుందని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. వీసా గడువు ముగిసిన తర్వాత 48 నెలల లోపు రెనివల్ చేయించుకునే వారికి కూడా ఇంటర్వ్యూ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించింది. కానీ గతంలో వీసాలు తిరస్కరణకు గురైన వారికి ఇది వర్తించదని స్పష్టం చేసింది. ఇంటర్వ్యూల నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ నాన్ఇమిగ్రాంట్ వీసా అపాయింట్మెంట్ల వెయిటింగ్ పీరియడ్ మాత్రం ఎక్కువ కాలం ఉండనుంది. కరోనా సమయంలో కలిగిన ఇబ్బందులే ఇందుకు కారణమని అమెరికా చెప్పింది. ఇప్పటికే వీసా దరఖాస్తు రుసుం చెల్లించిన వారు వీసాల జారీకీ ఆలస్యం అవుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమెరికా ఎంబసీ పేర్కొంది. కరోనా సమయంలో పేమెంట్ చేసిన వారి వ్యాలిడిటీని 2023 సెప్టెంబర్ 23వరకు పొడిగించనున్నట్లు తెలిపింది. చదవండి: పరాన్నజీవులూ, వెళ్లిపొండి -
Viruses Alert: ఒకే వ్యక్తిలో కరోనా, మంకీపాక్స్ నిర్ధారణ!
వాషింగ్టన్: ఓవైపు కరోనా వైరస్ ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న క్రమంలోనే మరో మహమ్మారి ఆందోళన కలిగిస్తోంది. పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో మంకీపాక్స్ను సైతం ప్రపంచ ఆరోగ్య అత్యవసర స్థితిగా ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. వైరస్ సోకిన వారికి అత్యంత సన్నిహితంగా మెలిగిన వారికి ఇది సోకుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. అయితే.. ప్రస్తుతం మంకీపాక్స్ ఇతర పద్ధతుల్లోనూ ఇతరులకు సోకుతోందని డబ్ల్యూహెచ్ఓ అధికారులు పేర్కొన్నారు. తాజాగా ఒకే వ్యక్తిలో కరోనా వైరస్, మంకీపాక్స్ సోకినట్లు నిర్ధారణ అయింది. అమెరికాకు చెందిన వ్యక్తిలో రెండు వైరస్లను శనివారం గుర్తించారు. ఇలా ఒకే వ్యక్తిలో రెండు వైరస్లు గుర్తించటం తొలిసారిగా అగ్రరాజ్యం అధికారులు తెలిపారు. కాలిఫోర్నియాకు చెందిన మిట్కో థాంప్సన్ కు జూన్లో కరోనా వైరస్ సోకింది. ఆ తర్వాత కొన్ని రోజులకు వీపు, కాళ్లు, చేతులు, మెడపై ఎర్రటి బొబ్బలు కనిపించాయి. పరీక్షలు నిర్వహించగా అది మంకీపాక్స్గా నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. ‘నాకు మంకీపాక్స్, కరోనా వైరస్ రెండూ ఉన్నాయని వైద్యులు కచ్చితంగా చెప్పారు.’ అని ఓ ఛానల్కు తెలిపారు మిట్కో థాంప్సన్. ఇన్ఫ్లూయెంజా కేసుగా మారిందని, జ్వరం, శ్వాస తీసుకోలేకపోవటం, జలుబు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపించాయి. అమెరికాలో ఇప్పటి వరకు 2,400 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఇద్దరు పిల్లల్లో మంకీపాక్స్ నిర్ధరణ అయింది. ఈ వైరస్ సన్నిహితంగా మెలిగిన వారికి సోకుతుంది. ఫ్లూ, శరీరంపై బొబ్బల వంటి లక్షణాలు కనిపిస్తాయి. అమెరికాలో ఇప్పటికే కరోనా వైరస్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. బీఏ5 వేరియంట్ వేగంగా విజృభిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. జులై 19న అత్యధికంగా ఒక్క రోజే 1.7 లక్షల కేసులు వచ్చాయి. -
ఇండియన్ స్టూడెంట్కి వేధింపులు
-
అనుమానంతో కూతుర్ని కాల్చి చంపిన తండ్రి
వాషింగ్టన్: ఇంట్లోకి ఆగంతకులు చొరబడ్డారన్న అనుమానంతో తన 16 ఏళ్ల కూతురుని తుపాకితో కాల్చిచంపిన ఘటన అమెరికాలో వెలుగు చూసింది. ఇంట్లోని అలారం మోగడంతో ఎవరో ఆగంతకులు చొరబడ్డారని ఆమె తండ్రి కాల్పులు జరిపాడు. కాసేపటి తర్వాత ఆ ప్రాంతానికి వెళ్లి చూడగా తన కూతరు జానే హెయిర్స్టన్ అక్కడ పడిపోయిఉండటాన్ని తల్లిదండ్రులు గమనించారు. ఈ ఘటనపై బుధవారం ఉదయం 4:30గంటల ప్రాంతంలో ఆమె తల్లి అత్యవసర సేవలకు కాల్చేసి తెలియజేసింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు, అత్యవసర బృందం సాయంతో ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ హెయిర్స్టన్ చికిత్స పొందుతూ 5:42 గంటల ప్రాంతంలో మరణించినట్లు ప్రకటించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (చైనా జెట్ విమానాలు కొన్న పాక్) -
PM Modi Visit To US: కమలతో కీలక భేటీ
-
ఎలక్ట్రికల్ ఎయిర్ టాక్సీలపై నాసా ప్రయోగాలు
ఆల్ ఎలక్ట్రిక్ వెర్టికల్ టేక్ఆఫ్ అండ్ లాండింగ్(ఇవీటీఓఎల్) ఎయిర్క్రాఫ్ట్.. పేరు వినగానే ఏదో భారీ యుద్ధ విమానం అనుకుంటున్నారా! అదేం కాదు. టేకాఫ్ అవసరం లేకుండా గాల్లోకి నేరుగా ఎగరే, లాండయ్యే విమానం, అది కూడా కరెంటుతో నడిచేదాన్ని ఇవీటీఓఎల్ అంటారు. తాజాగా అమెరికాకు చెందిన నాసా ఈ వాహనాలపై జోబీ ఏవియేషన్తో కలిసి ప్రయోగాలు ఆరంభించింది. ప్రయోగాలు సఫలమైతే త్వరలో ఎయిర్టాక్సీలు అమెరికన్లకు అందుబాటులోకి వస్తాయి. ఇలాంటి వాహనాలపై నాసా ప్రయోగాలు చేయడం ఇదే తొలిసారి. ఏఏఎం(అడ్వాన్డ్స్ ఎయిర్ మొబిలిటీ) నేషనల్ కాంపైన్లో భాగంగా ఈ వాహనాలపై నాసా5 ప్రయోగాలు ఆరంభించింది. జోబీకి చెందిన ఎలక్ట్రిక్ ఎయిర్బేస్ కాలిఫోర్నియాలో ఉంది. దీనిలో నాసా ప్రయోగాలు జరుపుతోంది. వేగవంతమైన రవాణాకు ఈ వాహనాలు ఎంతో ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. ఇప్పటికే జోబీ తయారుచేసిన ఇవీటీఓఎల్ ఎయిర్క్రాఫ్ట్ పనితీరును ప్రస్తుతం నాసా మదింపు చేస్తోంది. డేటా పరిశీలనతో వచ్చే ఏడాది పలు పరీక్షలు నిర్వహిస్తారు. రాబోయే సంవత్సరాల్లో అమెరికాలోని అనేక ప్రాంతాల్లో ఎయిర్ మొబిలిటీ ప్రయోగాలు జరగనున్నాయని నాసా వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ప్రయోగాల్లో భాగంగా ఎయిర్టాక్సీకి 50కి పైగా మైక్రోఫోన్లు అమరుస్తారు. అనంతరం విమానం ఎగురుతున్నప్పటి దశల్లో జరిగే మార్పులను రికార్డు చేస్తారు. నాసా చేపట్టిన కార్యక్రమం భవిష్యత్లో ఎలక్ట్రిక్ ఎయిర్ వాహనాలకు కీలకమని జోబీ ఏవియేషన్ సీఈఓ జోబెన్ చెప్పారు. నాసాతో కలిసి పనిచేయడం గర్వంగా ఉందన్నారు. చదవండి: స్పేస్లో మనిషి: మనుగడకోసం ఇస్రో మరో ముందడుగు -
ఏంటీ.. ఈ టెక్నాలజీతో రేపు ఏం జరుగుతుందో తెసుకోవచ్చా!
గతంలో ఏం జరిగింది. ప్రజెంట్ ఏం జరుగుతుందో అందరికి తెలిసిందే. అదే భవిష్యత్ లో ఖచ్చితంగా ఏం జరుగుతుందో ముందే తెలుసుకుంటే ఎలా ఉంటుంది?! ఇది కొంచెం కష్టమే అయినా దాన్ని సుసాధ్యం చేసేందుకు అమెరికా పావులు కదుపుతోంది. టెక్నాలజీని ఉపయోగించి భవిష్యత్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ ప్రయోగాలు చేస్తోంది. గ్లోబల్ ఇన్ఫర్మేషన్ డామినాన్స్ ఎక్స్పెరిమెంట్స్ యుద్ధాలు జరిగే సమయంలో సైలెంట్ గా ఉండకుండా శుత్రు దేశాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఎలాంటి వ్యూహరచనలు చేస్తున్నాయి. ఇలా తదితర అంశాల గురించి తెలుసుకునేందుకు రక్షణ సంస్థ పెంటగాన్ మోడ్రన్ టెక్నాలజీ, శాటిలైట్స్, నెట్వర్క్స్ లను వినియోగించుకుంటున్నాయి. తద్వారా మిగిలిన దేశాలకంటే తామే ముందజలో ఉండాలనేది తాపత్రయం. ఇందులో భాగంగా గ్లోబల్ ఇన్ఫర్మేషన్ డామినాన్స్ ఎక్స్పెరిమెంట్స్ (gide) అనే పేరుతో ప్రయోగాలు ప్రారంభించింది. శాటిలైట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రాడార్ల నుంచి రోజూ వచ్చే డేటాను తీసుకొని ప్రపంచం నలుమూలలా ఏం జరుగుతుందో వేగంగా కనిపెట్టేస్తుంది. టెక్నాలజీ ద్వారా వచ్చే డేటా పర్ఫెక్ట్గా ఉంటుందని, దేశం మరో దేశంపై యుద్ధానికి రెడీ అవుతుంటే ఆ వివరాల్ని అమెరికా టెక్నాలజీ గైడ్కి చేరవేస్తుంది. తద్వారా యుద్ధం ఎక్కడ జరుగుతుందో అమెరికా ముందే కనిపెట్టేస్తుంది. ఆ తర్వాత అంతా తన కంట్రోల్లోకి తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. -
ముగ్గురు యువతులతో ప్రియుడి డేటింగ్.. ట్విస్ట్ ఏంటంటే..
వాషింగ్టన్: ఈ మధ్యకాలంలో తరచుగా అబ్బాయిలు, అమ్మాయిలు ప్రేమ పేరుతో మోసపోతున్న సంఘటనలు చాలానే చోటు చేసుకుంటున్నాయి. అయితే, వీటి వెనుక అనేక కారణాలు ఉంటున్నాయి. కొన్ని చోట్ల ఒక యువకుడు.. ఇద్దరు, ముగ్గురు యువతులతో డేటింగ్ చేస్తుండగా.. మరికొన్ని చోట్ల యువతులు తామేమి తీసిపోనట్టు ఇదే విధంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో ఇలాంటి మోసాలు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా, యూఎస్కి చెందిన ఒక యువకుడు ఒకేసారి ముగ్గురు యువతులను మోసం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఈ సంఘటన బోయిస్లో జరిగింది. కాగా, బోయిస్ కు చెందిన మోర్గాన్ అనే యువకుడు.. బెకా కింగ్, అబిరాబర్ట్స్, టాబోర్ యువతులతో ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం నడిపాడు. కొంత కాలం ఇతగాడి మోసం బాగానే సాగింది. అయితే, కొన్ని రోజుల తర్వాత టాబోర్ అనే యువతి, తన ప్రియుడి మోసాన్ని గ్రహించింది. దీంతో ఈ బండారం కాస్త వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా తన చేదు అనుభవాన్ని సిఎన్ఎన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. టాబోర్ ఒక రోజు ఫేస్బుక్లో తన ప్రియుడు వేరే యువతితో కలిసి ఉన్న ఫోటోలను చూసింది. దీంతో ఆమె అనుమానంతో తన ప్రియుడి అకౌంట్ను తెరిచి చూసింది. ఆమెకు షాకింగ్ విషయాలు తెలిశాయి. అతను మరో యువతితో డేటింగ్ చేస్తున్నట్లు తెలుసుకుంది. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించింది. తాను ఎవరితో అయితే, జీవితం పంచుకోవాలనుకుందో.. అతను మోసం చేయడంతో తట్టుకోలేక పోయింది. దీంతో సదరు, ప్రియుడికి బుద్ధి చెప్పాలనుకుంది. అతని అకౌంట్ను మరింత పరిశీలించింది. అతనితో డేటింగ్లో బెకాసింగ్, రాబర్ట్స్అనే మరో ఇద్దరు యువతులు కూడా ఉన్నట్లు గుర్తించింది. అయితే, టాబోర్ వీరిని రహస్యంగా కలుసుకుంది. తన ప్రియుడి మోసం గురించి వారికి తెలియజేసింది. దీంతో అతని బండారం కాస్త బయటపడింది. ఒకరోజు మోర్గాన్, టాబోర్ను కలవటానికి వచ్చాడు. ఈ క్రమంలో వారంతా ఒక్కచోటికి చేరి అతగాడిని నిలదీశాడు. వారిని ఒక చోట చూసి అతను షాక్కు గురయ్యాడు. అయితే, అప్పటికి వారికి మాయమాటలు చెప్పాడానికి ప్రయత్నించాడు. ఆ ముగ్గురు యువతులు ప్రియుడికి బుద్ధి చెప్పారు. అతగాడి బారినుంచి తప్పించుకున్నారు. అతగాడు వీరినే కాకుండా, మరో ఆరుగురిని కూడా మోసం చేస్తున్నట్లు తెలుసుకొని ఆశ్చర్యపోయారు. ఈ మోసం నుంచి బయటకు పడ్డాక.. బెకా కింగ్, అబిరాబర్ట్స్, మోర్గాన్ టాబోర్లు మంచి స్నేహితులుగా మారిపోయారు. ఈ మోసం నుంచి బయటపడాటానికి ఎక్కడికైనా విహార యాత్రకు వెళ్లాలనుకున్నారు. ఈ క్రమంలో వారు ముగ్గురు కూడా ఒక పాత బస్సు కొనుగోలు చేశారు. వారు దానికి కొన్ని మరమ్మత్తులు చేయించారు. ఆ తర్వాత వారి యాత్రను ప్రారంభించారు. దీనికి కొంత మంది దాతలు కూడా సహయం చేశారు. ఈ క్రమంలో వారు.. బోయిస్లోని సరస్సులు, గ్రాండ్ టెటన్ నేషనల్ పార్క్, ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్ లను సందర్శించినట్లు తెలిపారు. ఇప్పుడు మేము చాలా ఆనందంగా ఉన్నాము. మా గతంలోని చేదు అనుభవాలను పూర్తిగా మరిచిపోయామని రాబర్ట్, బెకాసింగ్ తెలిపారు. అతనికి ప్రేమను పొందే హక్కులేదు. ఇప్పుడు తామంతా ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించామని టాబోర్ తెలియజేసింది. -
సిజేరియన్ డాక్టర్ల నిర్వాకం.. పసికందు ముఖంపై 13 కుట్లు
వాషింగ్టన్: అమెరికాలో సిజేరియన్ డాక్టర్ల నిర్వాకం బయటపడింది. ఓ మహిళకు ప్రసవం చేసే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ల కారణంగా పసికందు ముఖంపై గాయమైంది. దాంతో శిశువు ముఖంపై ఏకంగా 13 కుట్లు పడ్డాయి. వివరాలలోకి వెళ్తే.. జూన్ 15 న కొలరాడోలోని డెన్వర్ హెల్త్ హాస్పిటల్లో డమార్కస్ విలియమ్స్ భార్య రిజానా డేవిస్ పడంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. కానీ డెలివరీ సమయంలో తమ బిడ్డ క్యాని విలియమ్స్కు కలిగిన గాయం చూశాక అల్లాడిపోయారు. ‘మొదట మేము నార్మల్ డెలివరీకే యత్నించాం. కానీ, ప్రసవ సమయంలో వైద్యులు పాప హృదయ స్పందన ఖచ్చితం కనుగొనలేకపోవడంతో వెంటనే రిజానాను సి-సెక్షన్లోకి తీసుకువెళ్లారు. సిజేరియన్ తరువాత తల్లీ బిడ్డ క్షేమం అని చెప్పారు. అయితే, మా బిడ్డ ఎడమ చెంపపైన 13 కుట్లు ఉన్నాయి. ఇదేంటని డాక్టర్లను ప్రశ్నించగా సరైన సమాధానం లభించలేదు’ అని డమార్కస్ విలియమ్స్ చెప్పారు. ఇక ఈ విషయం గురించి శిశువు తాతయ్య మాట్లాడుతూ.. ‘చిన్నారి క్యాని రాక మా అందరికీ ఆనందం కలిగించింది కాని అంతే భయం, బాధ కలిగింది’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాదిని నియమించుకుని ఆస్పత్రిపై దావా వేస్తామని తెలిపారు. చదవండి:విషాదం: ప్రపంచ రికార్డ్ కోసం ఫీట్ చేసి ప్రాణాలు కోల్పోయాడు -
అమెరికాలో తీవ్ర మంచు తుపాను
-
అమెరికాలో హైదరాబాద్ యువతి మృతి
-
కొత్త మలాలా
వాతావరణంలోని పెనుమార్పులకు, ఆ మార్పులు వల్ల సంభవించబోయే విపత్తులకు రాజకీయ నాయకుల నిర్లక్ష్యమే కారణమని పదహారేళ్ల స్వీడన్ పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రెటా థన్బర్గ్ చేసిన ప్రకటన ఐక్యరాజ్యసమితి దృష్టి వరకు వెళ్లింది. గ్రెటా తాజాగా ‘వేకప్’ (మేల్కొండి) అంటూ యు.ఎస్.పార్లమెంటు సభ్యులను ఉద్దేశించి ఈ ప్రకటన చేశారు. గత ఏడాది తరగతి గది నుండి బయటికి వచ్చి తక్కిన పిల్లలతో పాటు స్వీడన్ పార్లమెంటు భవనం ఎదుట ‘వాతావరణాన్ని కాపాడండి’ అని నినాదాలు చేయడంతో గ్రేటా గురించి తొలిసారి ప్రపంచానికి తెలిసింది. -
ఫార్మా కంపెనీలకు అమెరికా FDA సమస్య లేదు
-
ఉక్కు సుంకంపై అమెరికాతో చర్చలు
న్యూఢిల్లీ: అమెరికా ప్రభుత్వం ఉక్కు దిగుమతులపై విధిస్తున్న భారీ సుంకాలను తగ్గించాలని.. అక్కడి అధికారును భారత ప్రభుత్వం కోరింది. ఉక్కు ఎగుమతి సంస్థల ప్రయోజనాల దృష్యా అమెరికా ప్రభుత్వ అధికారులతో శుక్రవారం చర్చలు జరిపినట్లు కేంద్ర ఉక్కు కార్యదర్శి బినోయ్ కుమార్ తెలిపారు. సెయిల్ నిర్వహించిన ఒక సమావేశంలో ఈ అంశాన్ని వెల్లడించిన ఆయన.. ‘ఉక్కు దిగుమతులపై సుంకాలు తగ్గించాలని అమెరికా అధికారులను అడిగాం. భారత స్టీల్ పరిశ్రమ చాలా ప్రత్యేకమైది. ఈ పరిశ్రమ ప్రయోజనాలను కాపాడుకోవల్సిన అవసరం భారత ప్రభుత్వంపై ఉందని వారికి చెప్పాం. అయితే, చర్చల ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.’ అని మీడియాతో చెప్పారాయన. ఈ ఏడాది మార్చిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్... మన దేశం నుంచి దిగుమతి చేసుకునే ఉక్కుపై 25 శాతం, అల్యూమినియంపై 10 శాతం సుంకాలను విధించటం తెలిసిందే. ఆర్సెలర్ మిట్టల్ను వేగం పెంచమన్న సెయిల్జేవీ అంశంపై లక్ష్మీ ఎన్ మిట్టల్కు లేఖ హై–ఎండ్ ఆటోమోటివ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన జాయింట్ వెంచర్ ప్రక్రియను వేగవంతం చేయాలని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) ఆర్సెలర్ మిట్టల్ను కోరింది. ఇరు సంస్థలు ఏర్పాటుచేయనున్న ఈ వెంచర్కు గతేడాదిలోనే సెయిల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ.. పలు ఆర్థిక అంశాలపై ఇప్పటికీ తుది ఒప్పంద సంతకాలు పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో జేవీ ఏర్పాటు వేగవంతం కావాలని, ఒప్పంద సంతకాలను పూర్తి చేయాలని ఆర్సెలర్ మిట్టల్ సీఈఓ లక్ష్మీ ఎన్ మిట్టల్కు గురువారం ఒక లేఖ రాసినట్లు సెయిల్ చైర్మన్ అనిల్ కుమార్ చౌదరి వెల్లడించారు. ‘మిట్టల్ సంస్థ జేవీ ఏర్పాటుకు సుముఖంగానే ఉంది. మావైపు నుంచి మేము కూడా చాలా స్పష్టంగా ఉన్నాం. నిజానికి ఈ నెలలోనే డీల్ పూర్తిచేయాలనుకున్నాం. అయితే, మిట్టల్ సంస్థ వేగంగా లేనందున వచ్చే నెలలో జేవీ ఒప్పంద తుది సంతకాలను పూర్తి చేసే అవకాశం ఉందని భావిస్తున్నాం.’ అని తెలిపారు. -
ట్రంప్ను పట్టించుకోని ఫెడ్
వాషింగ్టన్: అమెరికా సెంట్రల్ బ్యాంకు ఫెడరల్ రిజర్వ్... మరోమారు వడ్డీ రేట్లను పావు శాతం మేర పెంచింది. దీంతో ఈ ఏడాది ఫెడ్ నాలుగు దఫాలు వడ్డీరేట్లను పెంచినట్లయింది. ఒకపక్క రేట్లపెంపుపై యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్న తరుణంలో ఫెడ్ రేట్ల పెంపునకు సిద్ధపడడం గమనార్హం. ఈ ఏడాది అమెరికా ఎకానమీ బాగా బలపడిందని, దాదాపు అంచనాలకు తగినట్లే వృద్ధి నమోదు చేస్తోందని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని స్వల్పకాలిక వడ్డీరేట్లను మరో పావు శాతం పెంచుతున్నామన్నారు. తాజా పెంపుదలతో ఫెడ్ రేటు 2.25–2.5%కి చేరింది. ఇదేమీ అసాధారణమైన పెంపు కాదని తెలిపారు. ప్రభావం చూపని ట్రంప్ ట్వీట్ ఫెడ్ సమావేశానికి ముందు రేట్లను పెంచొద్దని, మరో తప్పు చేయొద్దని ఫెడ్ను ఉద్దేశించి ట్రంప్ ట్వీట్ చేశారు. రేట్ల పెంపుపై నిర్ణయానికి ముందు ఫెడ్ సభ్యులు వాల్స్ట్రీట్ జర్నల్ ఎడిటోరియల్ చదవాలని కూడా ట్వీట్లో సూచించారు. రేట్లను పెంచి మార్కెట్లో లిక్విడిటీ కొరతను తీసుకురావద్దని కోరారు. ఇంత చెప్పినా ఫెడ్ మాత్రం రేట్లను పెంచేందుకే సిద్ధమైంది. కాకపోతే దీనిపై ట్రంప్ ఇప్పటిదాకా స్పందించలేదు. మరోవైపు బ్యాంకు నిర్ణయాలపై ట్రంప్ అభిప్రాయాలు ఎలాంటి ప్రభావం చూపవని ఫెడ్ చైర్మన్ పావెల్ వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది రెండు సార్లకే పరిమితం ‘‘2019లో మరో 3 మార్లు రేట్లు పెంచేందుకు అవసరమైన ఆర్థిక పరిస్థితులుంటాయని ఫెడ్ సభ్యుల్లో ఎక్కువమంది గతంలో అభిప్రాయపడ్డారు. కానీ తాజా పరిస్థితులను బట్టి చూస్తే వచ్చే సంవత్సరం మరో 2 దఫాలు రేట్లు పెంచితే సరిపోవచ్చు. అయితే మా నిర్ణయాలను ముందుగానే నిర్ధారించలేం. అప్పటికి అందే ఆర్థిక గణాంకాలే విధాన నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. దేశీయ ఆర్థిక స్థితిగతులనే కాకుండా అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలను సైతం పరిశీలిస్తూ ఉంటాం’’ అని పావెల్ వివరించారు. -
సమైక్య రాష్ట్రంలో వీసీల ఇష్టారాజ్యం
♦ స్వయంప్రతిపత్తి పేరిట అధికార దుర్వినియోగం: సీఎం ♦ రిటైర్మెంట్ రోజునా వందలాది మంది నియామకం ♦ ప్రభుత్వ నియంత్రణ కొరవడే ఈ దుస్థితి ♦ అందుకే అంబేద్కర్, రాజీవ్గాంధీ వర్సిటీల చట్ట సవరణ బిల్లు ♦ వీసీల నియామక కమిటీలో ప్రతిపక్షానికీ చోటు కల్పిస్తాం ♦ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సాక్షి, హైదరాబాద్: ‘‘సమైక్య రాష్ట్రంలో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన వందలాది ఎకరాల భూములు ఎలా మాయమయ్యాయి. దానికి ఉండాల్సిన భూమి ఎంత, ఇప్పుడెంత మిగిలింది. స్వయంప్రతిపత్తిని వీలైనంత దుర్వినియోగం చేసి వీసీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. జగదీశ్రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉండగా కొన్ని యూనివర్సిటీలను సమీక్షిస్తే ఎన్నో దారుణాలు వెలుగు చూశాయి. వీసీలపై విచారణ చేయాల్సిన దుస్థితి వచ్చింది. సాయంత్రం పదవీవిరమణ చేయాల్సి ఉంటే ఉదయం పూట వందల మందిని ఉద్యోగాల్లో నియమించారు. ఓ దగ్గర 370 మంది, మరో దగ్గర 300 మందిని నియమించారు. ప్రభుత్వ నియంత్రణ కొరవడటం వల్లే ఈ దుస్థితి దాపురించింది. ఇలాంటి ఇష్టారాజ్యాన్ని సవరించే అక్కర ఉందా లేదా అన్నది అంతా ఆలోచించాలి. అందుకే చట్టసవరణను ప్రతిపాదించాం. ఇదేమీ ఆషామాషీ నిర్ణయం కాదు. దీని వెనక మరే రాజకీయ దురుద్దేశాలు లేవు’’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు శాసనసభలో స్పష్టం చేశారు. అంబేడ్కర్ సార్వత్రిక, రాజీవ్గాంధీ సాంకేతిక విజ్ఞాన విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లులపై విపక్షాలు అభ్యంతరం తెలపడంపై కేసీఆర్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నేపథ్యం, ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే సవరణలు అవసరమని భావించామని, దీని వెనక రాజకీయ ఉద్దేశాలు లేవని పేర్కొన్నారు. గవర్నర్ చాన్స్లర్గా ఉండొద్దని బిల్లుల్లో లేదని, ప్రభుత్వం కూడా చెప్పడం లేదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు గవర్నర్ ఒక్కరే చాన్స్లర్గా ఉంటే పని ఒత్తిడిలో ఆయన ప్రతి యూనివర్సిటీపై దృష్టి సారించలేరని, దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న ఉద్దేశంతోనే ఈ బిల్లులను తెస్తున్నామన్నారు. యూనివర్సిటీల్లో కొనసాగతున్న విచ్చలవిడితనాన్ని తాను స్వయంగా గవర్నర్ను దృష్టికి తీసుకెళ్లి వివరించానని, ఆయనతో చర్చించి ఆమోదం తీసుకున్నాకే సవరణకు నిర్ణయించామని ముఖ్యమంత్రి తెలిపారు. ‘‘గవర్నర్ వేరు, రాష్ట్ర ప్రభుత్వం వేరు అనటానికి లేదు. గవర్నర్ ఉండాల్సిన చోట వారు ఉంటారు. ఎన్నింటిలో ఉంటారనే విషయంపై వారిని అడుగుతాం. కొన్ని యూనివర్సిటీలకు న్యాయమూర్తులను కూడా వీసీలుగా నియమించాలనుకుంటున్నాం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్లి న్యాయమూర్తులను కేటాయించాలని కోరాను’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. ఊరికొకటి పల్లెకొకటి చొప్పున స్థాపిస్తే యూనివర్సిటీల గౌరవం పోతుందని, తాము హుందాగా ఓ ప్రతిపాదన తెచ్చామని, వీసీలను ఎంపిక చేసే కీలక కమిటీలో ప్రతిపక్ష సభ్యుడికీ అవకాశం ఉండేలా చూస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రతి యూనివర్సిటీకి విడివిడి చట్టం ఉండాలా, అన్నీ కలిసి ప్రభుత్వ అధీనంలో ఒకే చట్టం పరిధిలో పనిచేయాలా అనే విషయంపై విద్యా వ్యవస్థపై జరిగే స్వల్పకాలిక చర్చలో చర్చిద్దామని ప్రతిపక్షాలకు సూచించారు. -
మళ్లీ క్లీన్సిటీ..
- నడుం బిగించిన మహానగరపాలక సంస్థ - వరంగల్ పూర్వవైభవానికి సన్నాహాలు - నేడు సీడీఎంఏ జనార్దన్రెడ్డి రాక - అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం - పటిష్ట కార్యాచరణతో ముందుకు.. 2012 అక్టోబర్ 10 నుంచి 17.. క్లీన్సిటీ చాంపియన్ షిప్.. దేశంలోనే ప్రప్రథమంగా వరంగల్ నగరంలో చేపట్టిన బృహత్తర కార్యక్రమం. ఆ తర్వాత ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం వెరసి ఆరు నెలల్లోనే సీన్ రివర్స్ అరుంది. ఈ క్రమంలో క్లీన్సిటీని మళ్లీ గాడిన పెట్టేందుకు మహా నగర పాలక సంస్థ నడుం బిగించింది. మసకబారిన ఓరుగల్లు క్లీన్సిటీ ప్రతిష్టను తిరిగి నిలబెట్టేందుకు రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్, డెరైక్టర్ జనార్దన్రెడ్డి, బల్దియా కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ శ్రీకారం చుట్టారు. ఈ మేరకు బల్దియూ సిబ్బందికి దిశానిర్దేశం చేసేందుకు సీడీఎంఏ జనార్దన్రెడ్డి ఆదివారం వరంగల్కు రానున్నారు. వరంగల్ అర్బన్ : క్లీన్సిటీపై వరంగల్ మహానగరపాలక సంస్థ మళ్లీ దృష్టి కేంద్రీకరించింది. సమైక్య రాష్ట్రంలో దేశంలోనే తొలిసారిగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని వరంగల్ నగరంలో 2012లో చేపట్టారు. 1.19 లక్షల ఇళ్లు, షాపుల నుంచి తడి,పొడి చెత్తను వేర్వేరుగా సేకరించారు. జిల్లా అధికారులు, సిబ్బందితోపాటు తెలంగాణ ప్రాంతంలోని మునిసిపాలిటీల నుంచి 150 బృందాలు 450 మంది ఉద్యోగులు విచ్చేసి కార్యక్రమంలో వారం రోజులపాటు పాల్గొన్నారు. అప్పటి కమిషనర్ వివేక్యాదవ్ ఈ బృహత్తర కార్యక్రమానికి నడుం బిగించగా... అవార్డుల మీద అవార్డులు వచ్చారు. దేశంలోని పలు నగరాలకు వరంగల్ రోల్మోడల్గా మారింది. కానీ.. పలు కారణాలతో ఈ కార్యక్రమం మధ్యలోనే నిలిచిపోరుంది. తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావం.. రాజధాని హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరం కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో క్లీన్సిటీపై సీడీఎంఏ జనార్దన్రెడ్డి, గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ దృష్టి కేంద్రీకరించారు. 2012లో... ట్రైసిటీ పరిధి చెత్తను సేకరించేందుకు 600 రూట్లను ఏర్పాటు చేశారు. ప్రతి రూట్కు తోపుడు బండి, ఒక మగ, మరో ఆడ కార్మికులను కేటాయించారు. ఇద్దరు కార్మికులు రోజు వారీగా 250 నుంచి 300 ఇళ్ల నుంచి తడి,పొడి చెత్తను సేకరించడం ప్రారంభించారు. చెత్త కుండీల రహిత నగరంగా మార్చేశారు. కార్మికులు సేకరించి తడి,పొడి చెత్తను తూకం వేయడం, పనితీరును పర్యవేక్షించడం కొనసాగింది. డ్రై వేస్ట్ సెంటర్కు పొడి చెత్తను తరలించడం, వేరు చేసి పలు సంస్థలకు విక్రయించారు. తడి చెత్తను మడికొండ డంపింగ్ యార్డుకు తరలించడం... అక్కడ ప్రత్యేక యంత్రం ద్వారా శుద్ధి చేశారు. కమిషనర్, నోడల్ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లు క్షేత్ర స్థాయిలో నిత్యం సమన్వయంతో విధులు నిర్వర్తించారు. కార్మికులకు ప్రోత్సాహం, కాలనీ ప్రజలను బృహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ఆరు నెలల పాటు క్లిన్సిటీ కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగింది. దీంతో కార్పొరేషన్కు ప్రశంస పత్రాలు, దేశ వ్యాప్త అవార్డులు వరించాయి. కొంత కాలం తర్వాత ప్రధాన రహదారుల్లో వ్యాపార,వాణిజ్య సంస్థల నుంచి పొడి చెత్తను సేకరించడంలో సిబ్బంది వెనుకబడిపోయారు. ఇంటింటా ఉదయం 6 గంటల నుంచి చెత్త సేకరణ కార్యక్రమం కొనసాగింది. దుకాణాలు ఉదయం 10 నుంచి 11 గంటలకు తెరవడం వల్ల సకాలంలో షాపుల నుంచి చెత్తను సేకరించకపోవడంతో ఎక్కడ పడితే అక్కడ చెత్త దర్శనిమిచ్చింది. ఈ క్రమంలో అప్పటి కమిషనర్ వివేక్యాదవ్ 150 చెత్త కుండీలను తెప్పించి, ప్రధాన రహదారుల్లో ఏర్పాటు చేయించారు. అనంతరం కమిషనర్ వివేక్యాదవ్ బదిలీ బాట పట్టారు. తదుపరి కమిషనర్ సువర్ణపండాదాస్ బాధ్యతలు స్వీకరించారు. తడి, పొడి చెత్త సేకరణపై అప్పటి కమిషనర్ దృష్టి కేంద్రకరించకపోవడంతోపాటు మొత్తం చెత్తను డంప్ యార్డుకు తరలించాలని ఆదేశించారు.విద్యుత్ తయారీ చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో పారిశుద్ద్య కార్మికులు తడి,పొడి చెత్తను కలిపి ఇంటింటా సేకరించడం తోపుడుబండ్ల ద్వారా వాహనాలకు చేర్చడం, అక్కడి నుంచి డంపింగ్ యార్డులోకి చేరడం ప్రారంభమైంది. దీంతో యార్డులో చెత్త గుట్టలుగుట్టలుగా పేరుకుపోరుుంది. దీంతో క్లీన్సిటీ కార్యక్రమం పూర్తిస్థారుులో అటకెక్కింది. గత తప్పిదాలు, లోటుపాట్ల నేపథ్యంలో క్లీన్సిటీలో ప్రధానంగా దృష్టిసారించాల్సిన అంశాలు... రూట్ల విభజన 2012లో 600 రూట్లలో ఇంటింటా తడి,పొడి చెత్త సేకరించారు. ప్రస్తుతం విస్తరించిన నగరంలో మరి న్ని రూట్లు విభజించి సిబ్బందికి కేటారుుంచాలి. క్షేత్రస్థారుులో పర్యవేక్షణకు అధికారులను నియమించాలి. తడి, పొడి చెత్త.. ఇంట్లో వెలువడిన వ్యర్థాలను తడి, పొడి చెత్త రూపంలో వేర్వేరుగా వేసేలా నగర ప్రజల్లో పూర్తిస్థారుులో అవగాహన కల్పించాలి. తడి చెత్త ద్వారా సేంద్రియ ఎరువు, పొడి చెత్తను రీ సైక్లింగ్ చేయడం ద్వారా ఆదాయం వస్తుందని, ఈ మేరకు సహకరించేలా ప్రజల్లో చైతన్యం తేవాలి. పొడి చెత్తను ఏ రోజుకు ఆ రోజు విక్రయించేలా ఏర్పాట్లు చేయాలి. మార్కెట్ల నుంచి వెలువడిన వ్యర్థాలను బయోగ్యాస్ ఆధారిత ప్లాంట్లకు ఎప్పటికప్పుడు తరలించేలా పటిష్ట ఏర్పాటు చేయూలి. సేకరణ, నిర్వహణ కీలకం... పారిశుద్ధ్యం విషయంలో చెత్త సేకరణ, నిర్వహణ కీలకాంశాలు. ఇందుకోసం మహా నగర పాలక సంస్థ ఏటా కోట్లాది రూపాయాలు వెచ్చిస్తున్నప్పటికీ... పరిస్థితిలో ఆశించిన మార్పులు రావడం లేదు. నగర పరిధిలోని ప్రతి ప్రాంతానికి.. నిర్ధిష్ట సమయంలో తోపుడు బండ్లు, ట్రాలీలు వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. తడి,పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలి. సమన్వయం.. ప్రోత్సాహకం.. పర్యవేక్షణ కమిషనర్, నోడల్ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లు క్షేత్ర స్థాయిలో నిత్యం సమన్వయంతో పనిచేయూలి. కార్మికులకు ప్రోత్సాహకాలు అందించి వారిలో ఉత్తేజం నింపాలి. అదేవిధంగా అధికారులు నిరంతరం ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలి. వాహనాలపై నిఘా పెట్టాలి.. కాజీపేట, హన్మకొండ, వరంగల్ ప్రాంతాల నుంచి రోజూ చెత్తను తరలించడానికి సరిపడా వాహనాలున్నాయి. ట్రాక్టర్లు, డంపర్ ప్లేసర్లు, ఆటోలు, క్యాంపాక్టర్లులు మొత్తంగా 70 వరకు ఉన్నాయి. వీటిని సరైన పద్ధతిలో నడిపించే వారు లేరు. వాహనాల పని తీరుపై నిఘా లేదు. ఇంటర్నెట్ ద్వారా వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ అమల్లో ఉన్నప్పటికీ.. దీన్ని పరిగణనలోకి తీసుకుంటలేరు. కాంట్రాక్టు డ్రైవర్లు సైతం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంజినీరింగ్, ప్రజారోగ్య విభాగాల నడుమ సమన్వయం కొరవడడంతో ఈ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఈ మేరకు గాడినపెట్టాలి. వాహనాలపై నిఘా ఉంచాలి. ఖాళీపోస్టులు భర్తీ చేయాలి.. క్లీన్సిటీ సక్రమ నిర్వహణ, నిరంతర పర్యవేక్షణ ఉండాలంటే ఉద్యోగులు, అధికారుల కొరత లేకుండా చూడాలి. ప్రస్తుతం మహా వరంగల్ నగర పాలక సంస్థ పరిధిలో క్షేత్ర స్థాయి ఉద్యోగుల కొరత వేధిస్తోంది. పదోన్నతులపై ఏఈలు, టీపీఎస్లు, టీపీబీఓలు బదిలీపై వెళ్తున్నారు. వీరి స్థానంలో కొత్త వారు రాకపోవడంతో ఉన్న సిబ్బందిపై పనిభారం పెరిగింది. రోజురోజుకూ విస్తరిస్తున్న కొత్త కాలనీలతో క్షేత్ర స్థాయి సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. జీఓ ఎంఎస్ నెంబర్ 151 ప్రకారం కార్పొరేషన్కు 103 పోస్టుల భర్తీ ప్రక్రియ నాలుగేళ్లలో జరగాలి. కానీ.. కేవలం పది నుంచి పదిహేను మంది అధికారులు, ఉద్యోగుల పోస్టుల మంజూరయ్యాయి. అంత్యంత కీలకమైన సీటి ప్లానర్, ఎంహెచ్ఓ, ఆరోగ్యశాఖాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితోపాటు క్షేత్ర స్థాయి ఉద్యోగులు, సిబ్బంది పోస్టులు భర్తీ చేయూలి. ప్రజలను భాగస్వాములను చేయాలి.. బృహత్తర కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలి. ఇళ్లల్లో వెలువడిన తడి,పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించాలి. రోజు చెత్త అందించే బాధ్యతను కట్టబెట్టాలి. లేనిపక్షంలో జరిమానాలు విధించాలి. పారిశుద్ధ్య సిబ్బంది రోజు గడపగడపనూ తట్టాలి. కాలనీ వారీగా క్లీన్సిటీ కమిటీలను ఏర్పాటు చేయాలి. వారికే పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించాలి. అప్పడే ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. సేంద్రియ ఎరువుల తయారీపై దృష్టిసారించాలి... సేంద్రియ ఎరువు తయారీకి మడికొండ డంప్యార్డులో సూమారు రూ.40లక్షలు వెచ్చించి ప్రత్యేకంగా షెడ్లను నిర్మించారు. తడి, పొడి చెత్తను డంపింగ్ యార్డులో ప్రత్యేక మిషన్ ద్వారా జల్లెడ పట్టినప్పటికీ సేంద్రియ ఎరువు తయారీలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అవి నిరుపయోగంగా మారాయి. ఈ మేరకు వీటిపై దృష్టిసారించాలి. తడి చెత్తతో సేంద్రియ ఎరువును విరివిగా తయారు చేసి సరసమైన ధరకు విక్రరుుంచాలి. బయోగ్యాస్ విద్యుత్ ప్లాంట్ అందుబాటులోకి తేవాలి... చెత్త ప్రక్షాళన నిబంధనావళిలో భాగంగా హన్మకొండలో చిల్డ్రన్ పార్కులో బయోగ్యాస్ విద్యుత్ ఆధారిత ప్లాంట్ విజయవంతంగా కొనసాగుతోంది. బాలసముద్రంలోని కూరగాయల మార్కెట్ నుంచి వ్యర్థాలు తీసుకెళ్లి, ఎర్రల సహాయంతో సేంద్రియ ఎరువు తయారు చేసి బయోగ్యాస్ విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. బల్దియా ప్రధాన కార్యాలయం అవరణలో బయోగ్యాస్ విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేసినా.. అందుబాటులోకి రాలేదు. దీన్ని అందుబాటులోకి తెస్తే కొంతమేరనైనా విద్యుత్ సమస్య తీరుతుంది. -
చదువుల తోట..
సీతారాంనాయక్.. ప్రస్తుతం మహబూబాబాద్ ఎంపీ. దేశఅత్యున్నత చట్టసభలో సభ్యుడు. మొన్నటి వరకు కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్. యూనివర్సిటీ నుంచి లోక్సభకు వెళ్లిన సీతారాంనాయక్.. మళ్లీ ఒకసారి కాకతీయ యూనివర్సిటీకి వచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యావిధానం.. యూనివర్సిటీలో పరిస్థితులపై విద్యార్థి నాయకులతో, అధ్యాపకులతో ‘సాక్షి’ ప్రతినిధిగా ముచ్చటించారు. ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ : తెలంగాణ సాధన ఉద్యమంలో కాకతీయ విశ్వవిద్యాలయం చరిత్ర సృష్టించిన మాట వాస్తవం. తెలంగాణలో విశ్వవిద్యాల యాలు, విద్యార్థులు, అధ్యాపకులు ఎలా ఉండాలి? మీరు ఏం కోరుకుంటున్నారు? బి.వీరేందర్(పార్ట్ టైం లెక్చరర్) : సమైక్య రాష్ట్రంలో అనేక మంది విద్యార్థులు పీజీలు, పీహెచ్డీ పట్టాలు తీసుకుని నిరుద్యోగులుగా ఉన్నారు. వీరికి చదువుల తోటఉపాధి అవకాశాలు కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యావిధానాన్ని తీసుకురావాలి. సీతారాంనాయక్ : సమైక్య రాష్ట్రంలోని చట్టాలే ఇప్పుడు ఉన్నారుు. అప్పటి ఉమ్మడి విధానమే ఉంది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? మోహన్రాజ్(టీఎఫ్ఏడీ అధ్యక్షుడు) : తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని, ప్రత్యేక రాష్ట్రంతో ఆ ఫలాలు అందుతాయని విద్యార్థులు త్యాగం చేసిండ్లు. కొత్త ప్రభుత్వం నాణ్యమైన విద్యను, కొఠారి కమిషన్ ప్రకారం కామన్ విధానాన్ని ప్రవేశపెట్టాలి. విదేశీ యూనివర్సిటీలను తీసుకురావడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం దీనిని అడ్డుకోవాలి. విద్యార్థులకు ఎన్నికలు జరగాలి. దీనివల్ల రాజకీయంగా చైతన్యమవుతారు. సీతారాంనాయక్ : కొన్ని విదేశీ విశ్వవిద్యాలయాలు మన దేశంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ప్రవేశపెట్టాలని గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది. ఇప్పుడు చేస్తున్నాయి? దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? చల్లా శ్రీనివాస్(కుర్సా అధ్యక్షుడు) : భారతీయ విద్యా విధానం ఇప్పటివరకు శాస్త్రీయంగా ఉంది. పెట్టుబడిదారీ విధానం మన విద్యా విధానంలోకి వస్తే మన విద్య కుంటుబడుతుంది. మన విద్యార్థుల్లో అధిక శాతం గ్రామీణ ప్రాంతాల వారు. గ్రామీణ విద్యార్థి ఒకేసారి పెట్టుబడిదారీ విధానానికి అలవాటుపడలేదు. మన ఆచార, సంస్కృతి కూడా భ్రష్టుపడుతుంది. సీతారాంనాయక్ : అటానమస్పై మీ అభిప్రాయం ఏమిటి? డిగ్రీ కాలేజీలకు విశ్వవిద్యాలయంతో సంబంధం ఉండదు? ప్రైవేటు కాలేజీలకు స్వయంప్రతిపత్తి ఇవ్వాలని అంటున్నారు? కొంగర జగన్(కుర్సా వర్కింగ్ ప్రెసిడెంట్) : ప్రైవేటు కాలేజీలకు అటానమస్ ఇస్తే విద్య ప్రైవేటు పరమవుతుంది. దీనివల్ల విద్యా వ్యవస్థ, విద్యా విధానం ప్రైవేటు పరమైపోతాయి. ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. పీజీ సెంటర్లకు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు స్వయం ప్రతిపత్తి ఇస్తే బాగుంటుంది. అకడమిక్ విద్య దెబ్బతినదు. ఉపాధి అవకాశాలకు ఇబ్బంది ఉండదు. విద్య అనేది ప్రభుత్వమే నిర్వహించాలి. సీతారాంనాయక్ : కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు, ఇక్కడ ఉన్న కొన్ని పేరున్న సంస్థలు.. అప్గ్రేడ్ చేసి ప్రైవేటు విశ్వవిద్యాలయాలుగా చేయాలని కోరుతున్నారుు? దీనిపై మీ అభిప్రాయం? ఎం.చిరంజీవి(పీడీఎస్యూ) : ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విద్యార్థులు పోరాటం చేశారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాలు రూ.వేల కోట్లతో వ్యాపారం చేస్తున్నాయి. ప్రైవేటీకరణను మేం వ్యతిరేకిస్తున్నాం. ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు పర్మిషన్ ఇవ్వొద్దనేది మా అభిప్రాయం. సీతారాంనాయక్ : పీహెచ్డీ పూర్తి చేసిన వారు ప్రైవేటు కాలేజీల్లో నామమాత్రపు జీతాలకు పని చేస్తున్నారు. విద్యార్థులకు క్యాలిబర్ను బట్టి ఉపాధి దొరికే పరిస్థితి ఉంది. మీరు ఎలాంటి కోర్సులు కోరుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుతున్నారు? ఓడపెల్లి మురళి(టీబీఎస్ఎఫ్) : అన్ని ప్రభుత్వాలు సైన్స్ గ్రూపులకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆర్ట్స్ గ్రూపులు తీసివేయాలని ప్రయత్నించారు. అప్పుడు తెలంగాణలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం వల్ల ఇక్కడ ఆర్ట్స్ గ్రూపులు అలాగే ఉన్నారుు. ఆర్ట్స్ గ్రూపులతో ఉపాధి కల్పించే సంస్థలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వాసుదేవరెడ్డి(టీఆర్ఎస్వీ): బంగారు తెలంగాణకు బాటలు వేయాలంటే విద్యా విధానంలో మార్పులు చేయాలి. సమైక్య రాష్ట్రంలో భారీగా కాలేజీలకు అనుమతులు ఇవ్వడం వల్ల కోర్సులకు డిమాండ్ తగ్గింది. ఇంజినీరింగ్ కాలేజీలు పుట్టగొడుగుల్లా ఏర్పడ్డాయి. నాణ్యత కొరవడింది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు పూర్తి చేసిన వారు నైపుణ్యం లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగం సాధ్యంకాదు కాబట్టి వృత్తి విద్యా కోర్సులు రావాలి. హైదరాబాద్లో ఇప్పటికే సాఫ్ట్వేర్, ఇతర పరిశ్రమలకు పనికి వచ్చే నిపుణత కలిగే కోర్సులను తీసుకురావాలి. ఎంబీబీఎస్లాగే.. ఇంజినీరింగ్ విద్యార్థులకు నైపుణ్యం పెంచేందుకు కాలేజీలకు, పరిశ్రమలకు అనుబంధం ఉండాలి. సీతారాంనాయక్ : సమైక్య రాష్ట్రంలో తెలంగాణ విద్యార్థులకు విద్యా, ఉపాధి పరంగా ఏమైనా నష్టం జరిగిందా? ఇప్పుడు మీరేం ఆశిస్తున్నారు? వలీ ఉల్లాఖాద్రీ(ఏఐఎస్ఎఫ్) : సమైక్య రాష్ట్రంలో యూనివర్సిటీల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగింది. యూనివర్సిటీ గ్రాంట్ విషయంలో ప్రతిసారి ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలను పట్టించుకోలేదు. ఇలాంటి అన్యాయాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఉస్మానియా, కేయూలకు రూ.500 కోట్ల చొప్పున కేటాయించాలి. ఉపాధి, జానపద కళలకు ప్రాధాన్యత ఇచ్చేలా కోర్సులు ఉండాలి. సీతారాంనాయక్ : కాంట్రాక్టు ఉద్యోగ విధానం ఎందుకొచ్చింది? దీనివల్ల ప్రయోజనాలు ఏమిటీ? దీనిపై మీ అభిప్రాయం చెప్పండి? దుర్గం సారయ్య(పీడీఎస్యూ) : చంద్రబాబు హయూంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేక.. కాంట్రాక్టు పద్ధతిని తీసుకొచ్చారు. కాంట్రాక్టు విధానంలో ఉద్యోగం చేస్తున్న వారు.. కుటుంబానికి తిండిపెట్టలేని పరిస్థితి ఉంది. తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయాలి. విద్యా, ఉపాధి విషయాలు ప్రభుత్వ పరిధిలోనే ఉండాలి. సీఎం కొడుకు, పేద పిల్లవాడు ఒకేచోట చదివేలా కామన్ విద్యా విధానం ఉండాలి. సీతారాంనాయక్ : ప్రాథమిక విద్యా ఎలా ఉండాలి? కులాల పేర్లతో హాస్టళ్లు ఉన్నాయి. ఇలా ఉంటే విద్యార్థుల్లో న్యూనత భావం ఏర్పడుతుంది. దీనిని ఎలా చేస్తే బాగుంటుంది? సుత్రపు అనిల్(పీడీఎస్యూ) : ప్రాథమిక విద్య అనేది కుల, మత బేధం లేకుండా అందరికీ ఒకే విద్యా విధానం ఉండాలి. ప్రస్తుతం ప్రీప్రైమరీ, ఆశ్రమ, గురుకుల, సాంఘిక సంక్షేమం, ఐటీడీఏ స్కూళ్లు ప్రాథమిక విద్యలో 12 రకాలు ఉన్నాయి. కొత్త రాష్ట్రంలో ఈ విధానాన్ని మార్చాలి. ఉపాధ్యాయులకు కూడా ఏకీకృత సర్వీసు రూల్స్ను తీసుకురావాలి. సీతారాంనాయక్ : యూనివర్సిటీల్లో హాస్టల్స్పై మీ అభిప్రాయం ఏమిటీ? హాస్టళ్ల ప్రైవేటీకరణ ఉండాలా? వద్దా? అనే అంశంపై చర్చ జరుగుతోంది. ఎలా ఉంటే బాగుంటుంది? మాతంగి మురళి(టీఎన్ఎస్ఎఫ్) : తెలంగాణలోని యూనివర్సిటీల్లో చదుకునేవారిలో ఎక్కువ మంది బడుగు, బలహీన వర్గాల విద్యార్థులే. కాంట్రాక్టు, ప్రైవేటు మెస్ విధానాల వల్ల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదు. విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతింటోంది. రంజిత్(టీఆర్ఎస్వీ) : వర్సిటీల్లో గ్రామీణ, పేద విద్యార్థులే ఉంటున్నారు. విద్యార్థులతో మెస్ కమిటీలు లేకపోవడం వల్ల ప్రైవేటు కాంట్రాక్టర్లు లాభమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అలాగే హాస్టళ్లలో మౌలిక వసతుల కల్పనపై శ్రద్ధ పెడితే బాగుంటుంది. సీతారాంనాయక్ : విశ్వవిద్యాలయాల్లో రెగ్యులర్ అపాయింట్మెంట్లు జరగడం లేదు. వీసీలుగా వచ్చిన వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఉదంతాలు ఉన్నాయి. నాట్ టీచింగ్ రిక్రూట్మెంట్ విషయంలో ఎలా వ్యవహించాలి? పి.కొండల్రెడ్డి(ఉద్యోగుల జేఏసీ చైర్మన్) : ఉన్నత విద్యను అందించే విశ్వవిద్యాలయాల్లో నాన్ టీచింగ్ స్టాఫ్లో అర్హత, నైపుణ్యం ఉన్న వారికి అవకాశాలు రావాలి. కేయూలో ఏడాదిగా నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ జరగలేదు. వైస్ చాన్సలర్, ఎగ్జిక్యూటీవ్ కమిటీ ఉండాలి. దీని వల్ల అక్రమాలను నివారించవచ్చు. సీతారాంనాయక్ : వర్సిటీలో వీసీలను ఘెరావ్ చేయడం లేదా రిజిస్ట్రార్లను బయటపెట్టడం తరచుగా చూస్తున్నాం. ఇలాంటి గొడవలకు కారణమేమిటీ? కె.శంకర్(ఎన్జీవోస్, కేయూ, అధ్యక్షుడు) : వ్యవస్థ అన్నప్పుడు అన్ని రకాల వ్యక్తులు ఉంటరు. యూనివర్సిటీలోనూ స్వార్థపరులు ఎక్కువైనప్పుడు పరిపాలన సరిగా ఉండదు. ఉన్నతాధికారులు పరిపాలన విషయంలో నిక్కచ్చిగా ఉంటే ఏమీ జరగదు. కేయూలో నియామకాలు, బదిలీలు పారదర్శకంగా జరగడంలేదు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వీటిని మార్చుకోవాలి. సీతారాంనాయక్ : విశ్వవిద్యాలయం పరిరక్షణ విషయంలో అకుట్ ఏ రకమైన బాధ్యత నిర్వర్తిస్తోంది? డాక్టర్ వెంకయ్య(అకుట్) : ఉద్యోగుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం పోరాటాల్లో అకుట్ ముందుంటోంది. ఈ మధ్య కాలంలో యూనివర్సిటీ భూములు అన్యాక్రాంతమవుతుంటే మేం స్పందించి గవర్నర్కు, ముఖ్యమంత్రికి, కలెక్టర్కు లేఖలు రాశాం. సీతారాంనాయక్ : కేయూలో ఉత్తరాలు రాయడం మొదటి నుంచి ఉంది. ఉత్తరాలు రాస్తే ప్రయోజనం ఏమిటి? కేయూ భూమి 554 ఎకరాలు ఉండగా, ఇప్పుడు 500 ఎకరాలు కూడా లేదు. భూ ఆక్రమణల విషయంలో మీరు ముందుండడం లేదు? డాక్టర్ వెంకట్ : గతంలో పరిపాలన పరంగా తప్పులు దొర్లారుు. యూనివర్సిటీ వైపు నుంచి సరైన చర్యలు తీసుకోలేదు. వీసీ, రిజిస్ట్రార్ సరిగా ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. సీతారాంనాయక్ : వాళ్లు చేయలేదు సరే. మీరేం చేశారు? అకుట్గా మీరు చేయాల్సి ఉండె కదా? డాక్టర్ వెంకట్ : జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డాం. ఐదు నెలలుగా వీసీ లేరు. దీనిపై మా వంతుగా చర్యలు చేపడుతాం. సీతారాంనాయక్ : దూరవిద్య అనేది యూనివర్సిటీ నిధుల పరంగా ఉత్పత్తి కేంద్రం. ఎస్డీఎల్సీఈలో అక్రమాలు జరుగుతున్నాయని చాలాసార్లు పేపర్లలో చూస్తుంటాం. ఇలాంటివి జరుగుతాయా? జరిగితే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వల్లాల తిరుపతి(ఉద్యోగి) : యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా ఎస్డీఎల్సీఈని నడుపుతోంది. కొందరు అధికారులు మాత్రం దీన్ని నిర్లక్ష్యం చేస్తూ బంగారుబాతులాగే చూస్తున్నారు. రెవెన్యూ తీసుకుంటున్నారుగానీ, అక్కడ ప్రక్షాళన జరగడం లేదు. సీతారాంనాయక్ : మీకూ అధికారాలు ఉన్నారుు కదా? డెరైక్టర్, అసిస్టెంట్ డెరైక్టర్ అందరు ఉన్నారు కదా? అలాంటివి ఎందుకు జరుగుతాయి. అపనిందలు ఎందుకు వస్తాయి? వల్లాల తిరుపతి : వీరికి నామమాత్రపు అధికారాలే ఇచ్చారు. ఏదీ చేయాలన్నా మళ్లీ వీసీ, రిజిస్ట్రారు అనుమతి తీసుకోవాల్సిందే. సీతారాంనాయక్ : యూనివర్సిటీల్లోని పరిశోధనల విషయంలో నానారకమైన భావనలు వ్యక్తమవుతున్నాయి. సూపర్వైజర్ల లోపం ఏమైనా ఉందా? ఇటీవల కొత్త నామ్స్ వచ్చాయి. గైడ్గా నియమించిన వారి వద్దే విద్యార్థి పరిశోధన పూర్తి చేయాలని ఉంది. ఇది మంచిదా? పాత విధానమే మంచిదా? డాక్టర్ ముస్తఫా(అసిస్టెంట్ ప్రొఫెసర్) : పరిశోధనకు సంబంధించిన విద్యార్థులకు మెరిట్ కంటే ముఖ్యంగా ఆసక్తి ఉండాలి. ఎవరికీ బిగినింల్లో ఏమీ రాదు. నేర్చుకుంటే అనుభవపరంగా ఎంతో వస్తుంది. ఆసక్తి ఉన్న వారికే అవకాశం కల్పించాలి. ప్రొఫెసర్ తెలిసిన విద్యార్థులకు గైడ్లుగా ఉంటే మంచిది. కొత్త వారితో అయితే కొంత గ్యాప్ ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న వసతులు సరిపోవు. ఉన్నత ప్రమాణాలతో ఉండాలి. దీని కోసం ప్రయత్నించాలి. -
రాజధాని లేదు.. నిధులు లేవు...
రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు కదిలిరావాలి ఏపీ ఉభయసభల సమావేశంలో గవర్నర్ పిలుపు సాక్షి, హైదరాబాద్: ‘‘సమైక్యాంధ్రప్రదేశ్ విభజన తీరు తీవ్ర అసంతృప్తిని, చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. అధిక భాగం ప్రజల మనోభావాలు, ఆకాంక్షలు, ఆశలు నెరవేరలేదు. అశాస్త్రీయ విభజన తీరు తెలుగు ప్రజల హృదయాలను తీవ్రంగా గాయపరిచింది. ఈ గాయాలు మానడానికి కొంత సమయం పడుతుంది’’ అని అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ పేర్కొన్నారు. విభజనానంతరం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్కు రాజధాని గానీ, రాష్ట్రాభివృద్ధికి తగిన నిధులు గానీ లేవన్నారు. జపాన్, సింగపూర్ ప్రేరణతో మహోద్యమంగా రాష్ట్ర పునర్నిర్మాణానికి కదిలిరావాలని ప్రజలకు పిలుపిచ్చారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడం అందరి లక్ష్యం కావాలన్నారు. గవర్నర్ శనివారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలిల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం మేరకు.. ఉదయం 8:50 గంటలకు సభలోకి ప్రవేశించిన గవర్నర్కు సభ్యులు సాదరంగా స్వాగతం పలికారు. నరసింహన్ కుడి ఎడమల శాసనమండలి చైర్మన్ ఎ.చక్రపాణి, శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్లు ఆశీనులయ్యారు. జాతీయ గీతాలాపనతో సభ ప్రారంభమైంది. గవర్నర్ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించి ఇంగ్లిష్లో కొనసాగించారు. చివర్లో తిరిగి తెలుగులో మాట్లాడి తన 26 పేజీల ప్రసంగాన్ని ముగించారు. సమైక్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ను గత 58 ఏళ్లలో దాదాపు 13.20 లక్షల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తే దానికి తగ్గట్టుగా అవశేష ఆంధ్రప్రదేశ్కు పరిహారం రాలేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పారు. ఏడు కీలక రంగాలకు చెందిన స్థితిగతులపై శ్వేతపత్రాలను విడుదల చేస్తామన్నారు. రాష్ట్రం ఆర్థికంగా క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటోందని, తమ ముందున్న పెను సవాళ్లను ఎదుర్కొనేందుకు అందరూ కలసి రావాలని విజ్ఞప్తి చేశారు. -
ఇప్పుడున్న రాష్ట్రంలోనే ఎన్నికలు
రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితి ప్రకారమే.. అంటే ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయి. ఈ విషయాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్ వి.ఎన్.సంపత్ తెలిపారు. తెలంగాణలోని పది జిల్లాల్లోను ఏప్రిల్ 30వ తేదీన, సీమాంధ్ర ప్రాంతంలోని 13 జిల్లాల్లోను మే 7వ తేదీన పోలింగ్ జరుగుతుంది. అయితే అపాయింటెడ్ డేట్ జూన్ 2వ తేదీ అని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది కాబట్టి, తాము రాజ్యంగం, చట్టం ప్రకారమే వెళ్తామని.. అంటే ఉమ్మడి రాష్ట్రం మాత్రమే ఎన్నికల నాటికి, ఇప్పుడు కూడా ఉంది కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు నిర్వహిస్తామని సంపత్ చెప్పారు. పైగా తాము ఎక్కడికక్కడ అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల వారీగా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. తెలంగాణలో ఏప్రిల్ 2న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇక్కడ నామినేషన్ల దాఖలు గడువు ఏప్రిల్ 9. 10న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఏప్రిల్ 12 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఇక సీమాంధ్రలో ఏప్రిల్ 12న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. నామినేషన్ల దాఖలు గడువు ఏప్రిల్ 19. నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 21న ఉంటుంది. 23 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుంటుంది. -
ప్రస్తుతం మనం ఉమ్మడి రాష్ట్రంలోనే ఉన్నాం: హైకోర్టు
ప్రస్తుతానికి మనమింకా ఉమ్మడి రాష్ట్రంలోనే ఉన్నామని హైకోర్టు వ్యాఖ్యానించింది. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ గందరగోళంగా ఉందని, రెండు రాష్ట్రాలుగా విడిపోయినందున రిజర్వేషన్ల కోటా కూడా మారే అవకాశం ఉందంటూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయి. అయితే.. ఆంధ్రప్రదేశ్ ఇంకా రెండు రాష్ట్రాలుగా విడిపోలేదని, ఇప్పటికి గెజిట్ నోటిఫికేషన్ మాత్రమే వచ్చిందని, అపాయింటెడ్ డేను ఇంకా ప్రకటించలేదని.. ఆ రోజు తర్వాత మాత్రమే రాష్ట్రం విడిపోయినట్లు అవుతుందని ధర్మాసనం తెలిపింది. ప్రస్తుతం మనమింకా ఉమ్మడి రాష్ట్రంలోనే ఉన్నామని వ్యాఖ్యానించింది. -
రాష్ట్రం ఇంకా కలిసే ఉంది: జైరాం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికి ఇంకా కలిసే ఉందని, ఇంకా విభజన ప్రక్రియ పూర్తి కాలేదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్ తెలిపారు. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మీడియాకు చెప్పే సందర్భంలో ఏయే రాష్ట్రంలో ఎంతమందికి వివిధ పథకాల కింద లబ్ధి చేకూరుతుందని వివరిస్తున్నప్పుడు ఆయనీ విషయం చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో 19వేల మందికి లబ్ధి కలుగుతుందని జైరాం రమేష్ చెబుతున్నప్పుడు కొంతమంది మీడియా ప్రతినిధులు తెలంగాణకా.. సీమాంధ్రకా అని అడిగినప్పుడు జైరాం రమేష్ ఈ విధంగా స్పందించారు. రాష్ట్రం ఇంకా సమైక్యంగానే ఉందని, విభజనకు సమయం ఉందని అన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. -
సమైక్య స్టార్ జగన్
పార్టీ మారడంలో నాది స్వార్థం కాదు.. ఆవేదనే: మాజీ మంత్రి ధర్మాన శ్రీకాకుళం, న్యూస్లైన్: సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, ఆయనే నిజమైన సమైక్య స్టార్ అని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఆదివారం శ్రీకాకుళంలో జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో దివంగత సీఎం రాజశేఖరరెడ్డి తర్వాత అంతటి నాయకత్వం లేదని, ప్రస్తుత రాజకీయాల్లో నాయకత్వ లక్షణాలు, తండ్రి ధీరత్వం, రాజసం జగన్లో ఉన్నాయన్నారు. రాజన్న రాజ్యం మళ్లీ జగన్ నాయకత్వంలో వస్తుందన్న ఆశతో ప్రజలంతా ఎదురుచూస్తున్నారన్నారు. సమైక్య నినాదాన్ని 2010లోనే పార్లమెంట్లో విన్పించిన నాయకుడు జగన్ ఒక్కడేనని చెప్పారు. ‘‘సమైక్య చాంపియన్లు అని ఎవరికి వారు అనుకుంటే సరిపోదు. ప్రజలంతా జగన్నే సమైక్య స్టార్గా నిర్ణయించారు. శ్రీకాకుళం జిల్లాలో నూరు శాతం సీట్లను గెలిపించుకుని వైఎస్సార్సీపీని అధికారంలో తేవడమే మా లక్ష్యం’’ అని ఉద్ఘాటించారు. తాను పార్టీ మారడంలో ఎలాంటి స్వార్థం లేదని, రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారన్న ఆవేదనతో, జగన్ నాయకత్వంపై పూర్తి విశ్వాసంతో వైఎస్సార్సీపీలోకి వచ్చానన్నారు. రాష్ట్ర విభజనలో అధికార పార్టీని నిలదీయాల్సిన చంద్రబాబు ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషించడంలో విఫలమయ్యారన్నారు. స్వార్థ రాజకీయాల కోసం 2 ప్రసార సాధనాలను అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆకలి, కన్నీరును రాజకీయం చేస్తున్న, చేసిన ఘనత బాబుకే దక్కుతుందని, అదే సామాన్యుల ఆకలిని తీర్చి, కన్నీటిని తుడిచేలా ఎన్నో ప్రతిష్టాత్మక పథకాలు అమలు చేసిన ఘనత మహానేత వైఎస్సార్కే దక్కుతుందని పేర్కొన్నారు. సోనియాకు రాజీనామా లేఖ ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసినట్లు పేర్కొంటూ సోనియాగాంధీకి ఆదివారం ఉదయం ఫ్యాక్స్ ద్వారా లేఖ పంపారు. రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆవేదన చెంది పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. -
విభజన బిల్లును తిరస్కరించాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వే దిక కోఆర్డినేటర్ వి.లక్ష్మణరెడ్డి డిమాండ్ అసెంబ్లీలో గాదె వెంకటరెడ్డిపై దాడికి ఖండన హరీశ్రావు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచన ఒంగోలు, న్యూస్లైన్: రాష్ట్ర సమైక్యతను కాంక్షించే పార్టీల నాయకులు అసెంబ్లీలో, శాసనమండలిలో రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లులోని ప్రతి క్లాజుపై చర్చించి ఓటింగ్ ద్వారా బిల్లును తిరస్కరిస్తున్నామంటూ ఏకవాక్య తీర్మానాన్ని ఆమోదించి రాష్ట్రపతికి పంపాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక కోఆర్డినేటర్ వి.లక్ష్మణరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఒంగోలులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర సమైక్యతను పరిరక్షించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి ఒక్కరే కృషి చేస్తున్నారని, ఆయన బాటలో మిగతా పార్టీల నేతలు నడవాలని సూచించారు. విభజనకు అనుకూలంగా అసెం బ్లీలో మాట్లాడే ప్రజాప్రతినిధుల్ని వచ్చే ఎన్నికల్లో సమైక్యవాదులు తిరస్కరించాలని కోరారు. అసెంబ్లీలో గాదె వెంకటరెడ్డిపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు తన నోటిని అదుపులో పెట్టుకోవాలని సూచించారు. విభజన బిల్లులోని ప్రతి క్లాజుపైనా చర్చించడానికి సమయం సరిపోదని, మరో 20 రోజుల అదనపు సమయాన్ని ఇవ్వాలని కోరుతూ రాష్ట్రపతికి సీఎం లేఖ రాయాలని కోరారు. ఏపీఎన్జీవోలు ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 13న విభజన బిల్లు ప్రతులను భోగిమంటల్లో దగ్ధం చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర విభజన యత్నాలను నిరసిస్తూ 17, 18 తేదీల్లో తలపెట్టిన రాష్ట్ర బంద్కు మద్దతిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే 20న అసెంబ్లీని ముట్టడిస్తామని తెలిపారు. విభజనను వ్యతిరేకించే సమైక్యవాదపార్టీలు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాలు, జాయింట్ యాక్షన్ కమిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ఆ పార్టీ ఎంపీలు ముందుకు రావాలని పిలుపుఇచ్చారు. సమైక్యస్ఫూర్తికి విఘాతం కలిగించేలా ఉన్న ఆర్టికల్ 3కు రాజ్యాంగ సవరణ తీసుకురావాలన్నారు. అసెం బ్లీల తీర్మానం లేకుండా రాష్ట్ర విభజన చేయరాదనే తీర్మానాన్ని పార్లమెంట్లో ఆమోదించేందుకు అన్ని జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కృషిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీఎన్జీవో సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బషీర్ మాట్లాడుతూ.. టీ-బిల్లుపై అసెంబ్లీ, మండలిలలో అర్థవంతమైన చర్చ జరగట్లేదన్నారు. బిల్లును తిరస్కరిస్తూ ఏకవాక్య తీర్మానం చేసి పంపాలని డిమాండ్ చేశారు. కొన్ని రాజకీయపక్షాలు బయట ఒక రకంగా, చ ట్టసభలో మరోవిధంగా ప్రవర్తిసున్నాయన్నారు. -
సమైక్యాంధ్ర కోరితే సంకెళ్లు వే స్తారా!
చింతలపూడి, న్యూస్లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సమైక్య రాష్ర్టం సాధిస్తామని మాజీ ఎమ్మెల్యే, పార్టీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త మద్దాల రాజేష్కుమార్ అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ సమావేశాలను నుంచి సస్పెండ్ చేయడం, అరెస్ట్ను నిరసిస్తూ చింతలపూడి పాత బస్టాండ్ సెంటర్లో శుక్రవారం రాజేష్కుమార్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు రాస్తారోకో చేశాయి. సోనియా, కేంద్ర మంత్రుల ఫ్లెక్సీలను దహనం చేశారు. రాజేష్కుమార్ మాట్లాడుతూ అసెంబ్లీలో సమైక్య రాష్ర్టం కోసం పోరాడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడమే కాక మార్షల్స్తో గెంటించి అనంతరం అరెస్టు చేయడం అమానుషమన్నారు. అరె స్ట్లకు భయపడేది లేదన్నారు. సమైక్య రాష్ట్ర సాధనకు వైఎస్సార్ సీపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు డి.నవీన్బాబు, మండల కన్వీనర్ తుమ్మూరి వెంకట్రామిరెడ్డి, సర్పంచ్ మారిశెట్టి జగన్, పట్టణ కన్వీనర్ గంధం చంటి, ఏఎంసీ మాజీ చైర్మన్ బొడ్డు వెంకటేశ్వరరావు, ట్రేడ్ యూనియన్ కన్వీనర్ ఎం.ఇమ్మానియేలు, నాయకులు ఎస్.కాంతారావు, గోలి చంద్రశేఖర్రెడ్డి, జగ్గవరపు శ్రీహరిరెడ్డి, వేమారెడ్డి, దాసరి వెంకన్న, చెంచమరాజు, భాస్కర్, ఏడుకొండలు, తాతారావు, మైసన్న, పండు పాల్గొన్నారు -
సమయం మించిపోలేదు
-
సమయం మించిపోలేదు
సమైక్య తీర్మానంపై పీసీసీ చీఫ్ బొత్స ఆ 30 మంది వెళ్లిపోతేనే పార్టీకి మేలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేలా తీర్మానం చేసేందుకు సమయం మించిపోలేదని, ఇప్పుడైనా అందుకు అవకాశం ఉందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. ఆయన శుక్రవారం అసెంబ్లీలోని తన చాంబర్లో మీడియాతో మాట్లాడారు. శాసనసభా సమావేశాల ముగింపు సమయంలో సీఎం కిరణ్కువూర్రెడ్డి సమైక్య తీర్మానం ప్రవేశపెడతారని వస్తున్న వార్తల గురించి విలేకరులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘‘ప్రభుత్వంలో తెలంగాణ ప్రాంత ప్రతినిధులు కూడా ఉన్నారు కనుక సమైక్య తీర్మానంఎలా సాధ్యం? ప్రభుత్వం తరఫున కాకపోవచ్చు. సీమాంధ్ర ప్రతినిధుల తరఫున వూత్రమే తీర్మానం పెట్టేందుకు వీలుంటుంది. అందుకు ఇప్పటికీ అవకాశం ఉంది’’ అని బొత్స వివరించారు. కాంగ్రెస్ పార్టీనుంచి 30 వుంది వరకు ఎమ్మెల్యేలు బయుటకు వెళ్లిపోవచ్చని బొత్స పునరుద్ఘాటించారు. ఇతర పార్టీల వైపు చూస్తూ కాంగ్రెస్లో కొనసాగుతున్న అలాంటి ఎమ్మెల్యేలు వెళ్లిపోతే, కొత్తవారిని నియమించుకొని పార్టీని ఆయూ నియోజకవర్గాల్లో పటిష్టం చేసుకోవడానికి వీలుంటుందని అభిప్రాయపడ్డారు. శ్రీధర్బాబు శాఖను ఎందుకు మార్చాల్సి వచ్చిందో తనకు తెలియదన్నారు. సీమాంధ్ర ఎంపీల సంకల్ప దీక్ష గురించి తనకు ముందుగా చెప్పారన్నారు. వారికి సంఘీభావం తెలుపుతున్నారా? అని అడిగితే మౌనం దాల్చారు. -
సమైక్య తీర్మానం ప్రతిపాదిస్తాం
-
7 సమరమే
-
‘సమైక్యం’కోసం మీ కృషి ప్రశంసనీయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయస్థాయిలో చేస్తున్న కృషి పట్ల పంచాయతీరాజ్ శాఖ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. జేఏసీ చైర్మన్ వి.మురళీకృష్ణ నాయుడు ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం గురువారం జగన్ను కలసి ప్రత్యేక అభినందనలు తెలిపింది. జగన్ను కలసిన వారిలో జేఏసీ నేతలు వై.మోహన్మురళీ, జంధ్యాల గోపాలకృష్ణ, సుజనప్రియ, బి.రవీంద్రబాబు తదితరులున్నారు. ఈ సందర్భంగా వారితోపాటు పార్టీ నేతలు శోభానాగిరెడ్డి, వాసిరెడ్డి పద్మ కూడా ఉన్నారు. -
జగన్ నా తమ్ముడి లాంటివారు.. నా బాట సమైక్యమే: మమత
-
జగన్ నా తమ్ముడి లాంటివారు.. నా బాట సమైక్యమే: మమత
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తమ్ముడి లాంటి వారని, తానెప్పుడూ ప్రాంతాలు సమైక్యంగా ఉండాలనే కోరుకుంటానని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే ప్రయత్నాల్లో భాగంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు కోల్కతాలో మమతా బెనర్జీని కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా, రాష్ట్రాలను ఇష్టం వచ్చినట్లు విభజిస్తే కుదరదని జగన్ మోహన్ రెడ్డి అన్నారు. విభజనకు ఒక ప్రాతిపదిక అంటూ ఉండాలని, రాజ్యాంగాన్ని గౌరవించాలని ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని విభజించాలంటే అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి చేయాలని, రాజ్యాంగంలోని మూడో అధికరణను సవరించకుండా వాళ్ల ఇష్టం వచ్చినట్లు రాష్ట్రాలను విభజించకుంటూ పోతామంటే కుదరదని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీలోను, పార్లమెంటులో కూడా మూడింట రెండొంతుల మెజారిటీ ఉంటేనే కొత్త రాష్ట్రం ఏర్పడాలని, లేనిపక్షంలో రాష్ట్రాన్ని విభజించకూడదని జగన్ అన్నారు. అంతేతప్ప అడ్డదిడ్డంగా, ఇష్టం వచ్చినట్లు విభజిస్తే అంగీకరించేది లేదని అన్నారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ అంతా కలిసే ఉండాలన్నదే తన భావన అని తెలిపారు. విభజిస్తూ పోతే సమస్య పరిష్కారం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఐదేళ్లుగా మాట్లాడకుండా ఊరుకుని ఇప్పుడు ఎన్నికలు వచ్చే తరుణంలో ఆంధ్రప్రదేశ్ను ఎందుకు విభజిస్తున్నారని ఆమె నిలదీశారు. అభివృద్ధి కావాలంటే కొత్త జిల్లాలను ఏర్పాటుచేసుకోవచ్చని, ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించవచ్చని.. లేదా వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేక హోదా కల్పించవచ్చని ఆమె తెలిపారు. లేదు అంతా కలిసి విభజిద్దామని నిర్ణయం తీసుకునితీర్మానం ఆమోదిస్తే దాన్ని ఎవ్వరూ వ్యతిరేకించరని మమతా బెనర్జీ అన్నారు. ఉదాహరణకు జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ఏర్పాటుకు అన్ని పార్టీలూ ఒప్పుకున్నాయని, పార్లమెంటులోకూడా 2/3 కన్నా ఎక్కువ మెజార్టీతో ఒప్పుకున్నారని ఆమె గుర్తుచేశారు. -
రాజ్నాథ్ సింగ్తో వైఎస్ జగన్ సమావేశం
-
రాజ్నాథ్ సింగ్తో వైఎస్ జగన్ సమావేశం
హైదరాబాద్: బిజెపి జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి తమ పార్టీ ముఖ్యనేతలతో కలిసి సమావేశమయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న ఒకే ఒక అంశంపై ఆయనతో చర్చలు జరుపుతారు. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను ఆయనకు వివరిస్తారు. కొన్ని సమస్యలు పరిష్కరించలేనివి ఉన్నందున రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సహకరించమని ఆయనను కోరతారు. రాష్ట్రానికి సంబంధించి ఒక నివేదిక కూడా వారు ఆయనకు ఇవ్వనున్నారు. రాష్ట్ర సమైక్యతకు బిజెపి ఎందుకు మద్దతు ఇవ్వాలో తెలియజేసే అంశాలు ఆ నివేదికలో ఉన్నట్లు తెలుస్తోంది. -
రాష్ట్రాన్ని ఆవహేళన చేయవద్దు:ఆళ్ల నాని
రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆళ్లనాని స్పష్టం చేశారు. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా వచ్చిన రాష్ట్రాన్ని అవహేళన చేయవద్దని ఆయన తెలంగాణ వాదులకు విజ్ఞప్తి చేశారు. సమైక్య రాష్ట్రం కోసం తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రాణ త్యాగానికైనా సిద్ధంగానే ఉన్నాట్లు ఆయన తెలిపారు. భారీ వర్షాల కారణంగా వరద ముంపునకు గురైన నల్గొండ, ఖమ్మం జిల్లాలో బాధితులను పరామర్శించడానికి తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వెళ్తే తెలంగాణ వాదులు, కాంగ్రెస్ నేతలు ఎందుకు భయపడుతున్నారని ఆళ్లనాని ఈ సందర్భంగా ప్రశ్నించారు. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం. అయితే తెలంగాణవాదులు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని బ్లాక్ డేగా వ్యవహరించడం పట్ల ఆళ్లనాని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆళ్లనానిపై విధంగా స్పందించారు. -
విభజన వద్దంటూ రాష్ట్రపతికి ఎన్నారైల ఫ్యాక్స్
హైదరాబాద్ : రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్రకు తీరని అన్యాయం జరుగుతుందని లండన్లో ఉన్న ఎన్నారైలు ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్లు సీట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో విభజించకూడదంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నారైలు రాష్ట్రపతికి ఫ్యాక్స్ ద్వారా వినతిపత్రం పంపించారు. ఈ సందర్భంగా విభజనకు కారణమైన సీమాంధ్ర కాంగ్రెస్, టిడిపి నేతలపై ఎన్నరైలు మండిపడ్డారు. -
ప్రజాస్వామ్యానికి పాతర వేయొద్దు
= పాలకులకు సమైక్యవాదుల హితవు = కొనసాగుతున్న సమైక్య పోరు తిరుపతి, న్యూస్లైన్: ‘ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు. ప్రజాభీష్టాన్ని మన్నించని పాలకులకు పుట్టగతులు ఉండవు. మా సహనాన్ని పరీక్షించవద్దు’ అంటూ జిల్లాలో సమైక్యవాదులు హెచ్చరించా రు. సమైక్య రాష్ట్రం కోసం జిల్లా వ్యాప్తంగా బుధవారం ఆందోళన కార్యక్రమాలు కొనసాగాయి. తిరుపతిలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విద్యార్థి జేఏసీల ఆధ్వర్యంలో కే ంద్ర ప్రభుత్వ కార్యాలయాలను, బ్యాంకులను మూసివేయించారు. కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయంలోకి దూసుకెళ్లే ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకుని, లాఠీలకు పనిచెప్పారు. అందోళనకారులు పోలీసు భద్రతను ఛేదించుకుని మెయిన్గేట్ దాటి వెళ్లి కార్యాలయ ప్రవేశద్వారం వద్ద ధర్నాకు దిగారు. జేఏసీల తరఫున కొందరు ప్రతినిధులు లోనికెళ్లి సిబ్బంది తో చర్చలు జరిపి కార్యాలయాన్ని మూసివేయించడంతో పరిస్థితి సద్దుమణిగింది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమవుతున్నట్లు టీవీలో వస్తున్న వార్తలను చూసి తట్టుకోలేక మనోహర్ అనే ఫొటోగ్రాఫర్ గుండెపోటుతో మృతి చెందాడు. ఎస్వీయూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో పద్మావతి మహిళా యూ నివర్సిటీ పరిపాలన భవనాన్ని ముట్టడించారు. సిబ్బందిని బయటకు పంపించారు. పూలకుండీలను ధ్వంసం చేశారు. ఉద్యోగ జేఏసీ నాయకులు బీఎస్ఎన్ఎల్ కార్యాలయానికి తాళం వేశారు. మదనపల్లెలో జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించారు. మహిళా ఉద్యోగులు మోకాళ్లపై కూర్చొని నిరసన తెలియజేశారు. ట్రాన్స్ కో ఉద్యోగులు సబ్స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. న్యాయవాదులు కోర్టు నుంచి ర్యాలీగా వచ్చి ఎన్జీవోల దీక్షకు సంఘీభావం ప్రకటించారు. చిత్తూరులో జేఏసీ నాయకులు గాంధీ విగ్రహం వద్ద పేపర్ విష్ణు చక్రాలను తిప్పుడూ నిరసన తెలిపారు. వీధుల్లో భిక్షాటన చేశారు. ఎన్జీవోలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. పీలేరులో సమైక్యవాదులు ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట ఎలక్ట్రానిక్ వస్తువులను దగ్ధం చేశారు. పుంగనూరులో ఉపాధ్యాయులు చీరలు కట్టుకుని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీ ల మాస్క్లు తగిలించుకున్నారు. న్యాయవాదులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. పలమనేరులో జేఏసీ ఆధ్వర్యంలో పండ్లు అమ్మి నిరసన తెలిపారు. కుప్పంలో పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో ఆటోలను శుభ్రం చేశారు. పుత్తూరులో మాజీ కౌన్సిలర్ రాజశేఖర్వర్మ ఆధ్వర్యంలో సమైక్యవాదులు రాస్తారోకో చేపట్టారు. -
రేపు సీఎంతో సీమాంధ్ర ఉద్యోగుల సమావేశం
-
సమైక్యంధ్రకు మద్దతు కూడగట్టేందుకు డీల్లీ వెళ్లిన వైఎస్ విజయమ్మ
-
ప్రయాణం.. నరకం!
సాక్షి, చిత్తూరు: సమైక్యరాష్ట్రం కోసం రెండు నెలలుగా జిల్లాలో జరుగుతున్న ఆందోళనలు అత్యవసర ప్రయాణాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఆర్టీసీ బస్సులు సైతం లేకపోవడంతో దూరప్రాంతాల ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోవడం నరకప్రాయంగా మారుతోంది. దీనికి తోడు శుక్రవారం నుంచి 72 గంటల పాటు సీమాంధ్ర బంద్కు వైఎస్సార్ సీపీ పిలుపు ఇవ్వటంతో ప్రయాణికులకు మరిన్ని అవస్థలు తప్పడం లేదు. ప్రత్యామ్నాయ ప్రజా రవాణా వ్యవస్థగా ఉన్న రైల్వేశాఖ సామాన్యుని కడగండ్లు పట్టించుకునే పరిస్థితిలో లేదు. దూర ప్రాంతాలకు వెళ్లే వారు రైలు బోగీల్లో కనీసం కాలుమోపే స్థలం లేకున్నా అవస్థలు పడుతూ వెళుతున్నారు. దీంతో తిరుపతి నుంచి వచ్చిపోయే రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. దీనికి తోడు తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభం అ య్యాయి. ఏటా ఈ ఉత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ ఏడాది ఇలా వచ్చే వారికి రైలు తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గం లేదు. అయినా దక్షిణ మధ్య రైల్వేశాఖ ప్యాసిం జర్ రైళ్లకు ఇంతవరకు అదనపు బోగీలు అమర్చలేదు. కేవలం ఆదాయం సమకూరే వెంకటాద్రి ఎక్స్ప్రెస్, మరికొన్ని సూపర్ఫాస్టు రైళ్లకు మాత్రమే ఒకటి రెండు అదనపు బోగీలు వేసి చేతులు దులుపుకుంది. ఇక తిరుపతి కాట్పాడి మార్గంలో అయితే ప్యాసింజర్ రైలు బోగీల్లో లోపల స్థలం లేక డోర్వద్ద వేలాడుతూ, ఒక్కొక్కసారి ట్రైన్పైకి ఎక్కి ప్రయాణం చేస్తున్నారు. తిరుపతి నుంచి శ్రీకాళహస్తి మీదుగా విజయవాడ వరకు నడిచే ప్యాసింజర్ రైళ్లకు కూడా అదనపు బోగీలు లేవు. టిక్కెట్లు మాత్రం అడిగినంతమందికి ఇస్తున్నారు. చెన్నయ్ రూట్లోనూ రెండు ఎక్స్ప్రెస్ రైళ్లకు ఒక్క అదనపు బోగీ వేయలేదు. ఈ క్రమంలో అత్యవసర పనులపై వెళ్లేవారు నరకం చవిచూస్తున్నారు. దోచేస్తున్న ప్రైవేట్ వాహనాలు రైళ్లతో పాటు నిత్యం వేలాదిమంది సుమోలు, టెంపోలు, సెవెన్సీటర్ ఆటోలను ఆశ్రయించి ప్రయాణం చేస్తున్నారు. బస్సులు లేకపోవడం, ప్రయాణికుల అవసరాలను అదనుగా తీసుకున్న ప్రైవేట్ వాహనాలవారు కనీస దూరానికి కూడా రూ.100 నుంచి 150 వరకు వసూలు చేస్తున్నారు. చిత్తూరు నుంచి పీలేరుకు సెవెన్సీటర్లు, ఇతర మామూలు వాహనాల్లో రూ.100, ప్రైవేట్ ట్రావెల్స్ కార్లలో రూ.150 వరకు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రయాణికుల జేబులకు చిల్లు తప్పడం లేదు. -
65వ రోజు ఉవ్వెత్తున ఎగిసిన నిరసన
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్లైన్: సమైక్య రాష్ట్రం కోసం జిల్లా వాసులు చేస్తున్న ఉద్యమం కట్టలు తెచ్చుకుంది. 65 రోజులుగా విధులు బహిష్కరించి, జీతాలు లేకుండా శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న వివిధ వర్గాలకు చెందిన నిరసనకారులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో తెలంగాణ నోట్ తయారైందన్న వార్తను విన్న నిరసనకారులు ఒక్కసారిగా తీవ్రస్థాయిలో ప్రతిఘటించారు. ప్రత్యేకంగా ప్రజాప్రతినిధులు అలసత్వం వల్లనే రాష్ట్రానికి ఇటువంటి పరిస్థితి దాపురించిందంటూ వారి ఇళ్లను ముట్టడించటంతో పాటు వారి తీరును తూర్పారబట్టారు. రాత్రి వరకు తమ పట్టును వీడకుండా నిరసనకారులు ఆందోళన కొనసాగించారు. ప్రధానంగా జిల్లాలో కుటుంబ పాలన సాగిస్తున్న బొత్స సోదరులకు జీవిత కాలం రాజకీయ నిషేధం విధించటంతో పాటు, జిల్లా నుంచి వారిని బహిష్కరించాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ విషయంలో జిల్లా ప్రజలంతా సమిష్టిగా ఉండాలని విజ్ఞప్తిచేశారు. విశాలాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు పిలుపునివ్వటంతో పాటు మంత్రి బొత్స ఇంటి ముట్టడికి తరలిరావాలని పిలుపునిచ్చారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు మేరకు జిల్లాలో ఎంపీ ఇళ్ల ముందు చేపటి ్టన 48 గంటల వంటా వార్పు విజయనగరంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. వివిద ఉద్యోగ సంఘాల నేతృత్వంలో ఉదయం 8 గంటలకే మంత్రి బొత్స ఇంటి వద్దకు చేరుకున్న ఉద్యమకారులు 11 గంటల సమయంలో తెలంగాణ నోట్ తయారైందన్న వార్త తెలుసుకుని నిరసనను ఉధృతం చేశారు. మంత్రి ఇంటిని ముట్టడించేందుకు యత్నించగా అప్పటికే మోహరించిన పోలీసు బలగాలు అడ్డుకున్నాయి. అయినా వెనక్కి తగ్గని ఉద్యమకారులు 12 గంటల సమయంలో ఒక్కసారిగా బారీకేడ్లను, పోలీసులను తోసుకుని మంత్రి ఇంటి వద్దకు చేరుకుని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ ఘటనలో పోలీసులు, నిరసకారులు మధ్య జరిగిన తోపులాటలో మొత్తం ఐదుగురు ఉద్యమకారులకు స్వల్ప గాయాలయ్యాయి. గరివిడిలో బొత్స క్యాంపు కార్యాలయాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులు ముట్టడించారు. గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య క్యాంప్ కార్యాలయ ముట్టడి యత్నించిన ఉద్యోగులు, విద్యార్థులపై పోలీసులు దౌర్జన్యానికి దిగటంతో ప్రతిఘటించిన నిరసనకారులు క్యాంప్ కార్యాలయంపై రాళ్లు రువ్వారు. అంతేకాకుండా కురుపాంలో కేంద్రమంత్రి కిషోర్చంద్రదేవ్ ఇంటిని వేల మంది సమైక్యవాదులు ముట్టడించి జేఏసీ పిలుపు మేరకు వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. జోరు వానలోను ఉద్యమస్ఫూర్తితో ముందుకు కదిలారు. ఈ నేపథ్యంలో మంత్రి ఇంట్లోకి నిరసనకారులు వెళ్లేందుకు యత్నించగా కొద్దిపాటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 65వ రోజు మిన్నంటిన నిరసనలు విజయగనరంలో ఏపీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, పాఠశాలల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో పట్టణంలో కళాజాత నిర్వహించా రు. ఇందులో భాగంగా గంగిరెద్దులు, తప్పెటగుళ్లు, బుఱ్ఱకథ కళాకారులచే పట్టణంలోని అన్ని ప్రధాన జంక్షన్లలో ప్రదర్శనలు నిర్వహించి విభజన వలనే కలిగే నష్టాలను ప్రజలకు వివరించారు. విశాలాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో కేంద్రం రూపొందిం చిన తెలంగాణ నోట్ను వ్యతిరేకిస్తూ మంత్రి బొత్స ఇంటి ముందు సోనియా, దిగ్విజయ్, షిండే , బొత్స, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. మున్సిపల్ ఉద్యోగులు గంటస్తంభం వద్ద నిరసన చేయగా... వైద్య ఉద్యోగులు మొక్కలు నాటుతూ నిరసన వ్యక్తం చేశారు. చీపురుపల్లిలోని మూడురోడ్ల జంక్షన్లో పట్టణంలోని కళాశాలలకు చెందిన విద్యార్థులు, ఎన్జీఓ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగులు భారీ ఎత్తున ధర్నా నిర్వహించి విజయనగరం-పాలకొండ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. నెల్లిమర్ల మండల కేంద్రం లో నాయీ బ్రాహ్మణ సంక్షేమ సంఘం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించింది. నగర పంచాయితీ పరిధిలోని ప్రధాన కూడళల్లో బ్యాండు పార్టీలతో ప్రదర్శన నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని సమైక్యవాదులపై పోలీసుల దాడికి నిరసనగా జేఏసీ నేతలు తీవ్రంగా స్పందించారు. విజయనగరం-పాలకొండ రహదారిపై గంటసేపు రాస్తారోకో చేపట్టారు. భోగాపురం మండల కేంద్రంలో కూడా ఉపాధ్యాయ జేఏసీ, ఏపీఎన్జీఓలు వేర్వేరుగా రాస్తారోకోలు చేపట్టారు.వీరికి మండల కల్లుగీత కార్మిక సంఘం సంఘీబావం తెలిపింది. పూసపాటిరేగ ప్రధాన రహదారిపై విద్యార్థులు మాక్ డ్రిల్ నిర్వహించారు. అలాగే యోగాసనాలు వేసి నిరసనలు చేపట్టారు. డెంకాడ మండలాల్లో కూడా సమైక్యవాదులు ఆందోళనలు చేపట్టారు. ఎస్.కోటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీల ఆధ్వర్యంలో వేర్వేరుగా సోనియా, బొత్స దిష్టి బొమ్మలను దహనం చేశారు. సాలూరులో జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్భందించి నిరసన చేయగా.. మున్సిపల్ ఉద్యోగులు పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. బొబ్బిలిలో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు రాస్తారోకో చేయగా... బాడంగి మండలంలో ఉపాధ్యాయ, ఉద్యోగుల జేఏసీ అధ్వర్యంలో చెవిలో పువ్వులు పెట్టుకొని వినూత్నంగా నిరసన తెలిపారు. జోరు వర్షంలో గొడుగులతో నిలబడి సమైక్య నిరసనలు తెలిపారు. రామభద్రపురంలో ఉపాధ్యాయుల రాస్తారోకో చేశారు. బెలగాంలో మహిళలు చేతిపై సమైక్యాంధ్ర ఆకారంలో గోరింటాకు పెట్టుకుని నిరసన చేయగా.. న్యాయవాదులు, కోఆపరేటివ్ సొసైటీ ఉద్యోగులు నిరాహారదీక్ష చేశారు. -
సమైక్యం కోసం కృషి చేస్తున్నది వైఎస్సార్సీపీయే: బూచేపల్లి
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు నిజాయితీగా కృషి చేస్తున్న ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని ప్రకాశం జిల్లా దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అన్నారు. ఢిల్లీలో పొత్తుల కోసం టీడీపీ పైరవీలు చేస్తోందని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని చంద్రబాబు మరోసారి ఢిల్లీలో బేరం పెట్టారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు ఒక దివాలాకోరు అని, తెలంగాణ నోట్ వచ్చే ఈ సమయంలోనైనా చంద్రబాబు మనసు మారాలని శివప్రసాద్రెడ్డి అన్నారు. చంద్రబాబు యాత్రల్లో ఆత్మగౌరవం లేదని, ఉన్నదంతా ఆత్మవంచనేనని ఆయన విమర్శించారు. సమైక్యవాదులు చంద్రబాబు యాత్రలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. -
'కిరణ్ వీరావేశం అంతా అధిష్టానం కనుసన్నల్లోనే జరిగింది'
సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దాడి వీరభద్రరావు శనివారం విశాఖపట్నంలో నిప్పులు చెరిగారు. సీఎం కిరణ్ నిన్న విలేకర్ల సమావేశంలో చూపిన వీరావేశం అంతా అధిష్టానం కనుసన్నల్లోనే జరిగిందని దాడి వీరభద్రరావు ఆరోపించారు.కిరణ్కు సమైక్య రాష్ట్రంపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీని వెంటనే సమావేశ పరచాలని ఆయన డిమాండ్ చేశారు. సమైక్య రాష్టం కోసం నిజాయితీగా ఉన్నట్లు ప్రకటించిన మీరు ఎంపీల రాజీనామాలను ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన సీఎం కిరణ్ను ప్రశ్నించారు. సమైక్య ఉద్యమాన్ని వెన్నుపోటు పొడవడంలో భాగంగానే సీఎం కిరణ్ విశాఖపట్నంలో పర్యటించనున్నారని అన్నారు. -
29నే కర్నూలు ‘సమైక్య’ సభ
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్లైన్: సమైక్యాంధ్ర పరిరక్షణకు రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతంగా, ప్రణాళికబద్ధంగా నిర్వహించనున్నట్లు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా చైర్మన్ వి.సి.హెచ్.వెంగల్రెడ్డి తెలిపారు. ఈనెల 30న కర్నూలులో నిర్వహించతలపెట్టిన భారీ బహిరంగ సభను 29వ తేదీనే నిర్వహించాలని రాష్ట్రస్థాయి సమైక్య జేఏసీ నిర్ణయించిందన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 29న టీఆర్ఎస్, తెలంగాణ ఉద్యోగ సంఘాలు హైదరాబాద్లో సదస్సును నిర్వహించనున్నాయని, వాటికి దీటుగా కర్నూలులో అదే రోజు సమైక్య రాష్ట్ర పరిరక్షణ సదస్సు పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. సమైక్య రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈ నెల 24న జిల్లా బంద్ చేపడతామన్నారు. 19, 20 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను దిగ్బంధిస్తామని.. 21న సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు లైట్లు ఆర్పి నిరసన తెలుపనున్నట్లు వివరించారు. 22, 23 తేదీల్లో సమైక్య రాష్ట్ర ఆవశ్యకతను వివరిస్తూ గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అవగాహన సదస్సులు ఏర్పాటవుతాయన్నారు. 25, 26 తేదీల్లో ప్రైవేటు వాహనాల బంద్.. 27, 28 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల బంద్ చేపడతామని తెలిపారు. -
రేపటి నుంచి ‘వైఎస్సార్ టీచర్స్’ సమైక్య సదస్సులు
ఏపీ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కోస్తా, రాయలసీమల్లోని 13 జిల్లాల్లో బుధవారం నుంచి సమైక్యాంధ్ర ప్రదేశ్ ఉపాధ్యాయ సద్భావన సదస్సులు నిర్వహిస్తున్నట్టు ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ కే ఓబుళపతి తెలిపారు. సదస్సు నిర్వహణ కరపత్రాలను స్థానిక పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం సీజీసీ సభ్యుడు వై విశ్వేశ్వరరెడ్డి ఆవిష్కరించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన అవసరాన్ని, ప్రాధాన్యతను వివరిస్తూ రోజుకు రెండు జిల్లాల చొప్పున ఉపాధ్యాయ సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం 18న వైఎస్సార్ జిల్లా కేంద్రంలో తొలి సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 27 వరకూ జరిగే సదస్సులు అనంతపురంలో ముగుస్తాయన్నారు. కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమంలో ఫెడరేషన్ సారథ్య సంఘం సభ్యులు కె.జాలిరెడ్డి, పి.అశోక్కుమార్రెడ్డి, పి.వి.రమణారెడ్డి, రియాజ్ హుస్సేన్ పాల్గొన్నారు. -
సమైక్య పోరాటం.. మరో స్వాతంత్య్రోద్యమం
డోన్, న్యూస్లైన్: భారతదేశం కోసం స్వాతంత్రోద్యం చేస్తే సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం మరో పోరాటం చేయాల్సి వచ్చిందని రెడ్ల సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు ధర్మవరం సుబ్బారెడ్డి, లక్కసాగరం లక్షీ్ష్మరెడ్డి అన్నారు. ఆదివారం డోన్ పట్టణంలో 5వేల మందితో రెడ్డి సమైక్య గళం కార్యాక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే దీక్షలకు సంఘీభావం తెలిపారు. దీక్ష శిబిరంలో వారు మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా చేస్తున్న ఉద్యమంతో కేంద్రపెద్దలు కళ్లు తెరవాలన్నారు. తమ హక్కులు సాధన కోసం ప్రజలు, యువకులు, సమైక్యవాదులు ఉద్యమ బాట పట్టారన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఉద్యమంలో భాగస్వాములై పోరాడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజిస్తే వచ్చే సమస్యలను పట్టించుకోకుండా తెలంగాణ ఇస్తామంటూ ప్రకటనలు చేయడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో రెడ్డి సంఘం నాయకులు డాక్టర్ పోచా ప్రభాకర్రెడ్డి, కోట్ల హరిచంద్రారెడ్డి, శివరాంగారెడ్డి, సుదర్శన్రెడ్డి, కృష్ణారెడ్డి, విక్రమసేనారెడ్డి, ప్రకాష్రెడ్డి ఉన్నారు. -
ఏమి చేయాలబ్బా..!
‘రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ప్రజాభీష్టానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవడంలో విఫలమయ్యాం. అధినేత డొంకతిరుగుడు చర్యల పట్ల ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ శ్రేణులు ప్రత్యక్ష ఆందోళనలు చేస్తున్నా ప్రజలు విశ్వసించడం లేదు. పదవులకు రాజీనామా చేసి ప్రత్యక్ష పోరాటం చేస్తున్న వైఎస్సార్సీపీకి ప్రజల్లో అపారమైన మద్దతు లభిస్తోంది. ఏమి చేయాలబ్బా...‘ముందు చూస్తే నుయ్యి వెనుక చూస్తే గొయ్యి’ అన్న చందంగా పరిస్థితి తయారైందని తెలుగు తమ్ముళ్లు తలలు బాదుకుంటున్నారు’. సాక్షి ప్రతినిధి, కడప: కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీసుకున్న నిర్ణయం ఫలితంగా రాయలసీమ, కోస్తాంధ్రలో సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమం ఎగిసిపడుతోంది. 35రోజులుగా జిల్లాలో ఎడతెగని పోరాటాన్ని సమైక్యవాదులు చేస్తున్నారు. ఉద్యమం వల్ల ఎంతటి కష్టనష్టాన్ని భరించేందుకు సైతం వెనుకంజ వేయడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అండగా నిలవాల్సిన రాజకీయపార్టీలు ఓట్ల కోసం డొంకతిరుగుడు వ్యవహారాన్ని భుజానికెత్తుకుంటున్నారు. అందులో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అగ్రభాగాన నిలుస్తున్నారు. ‘యథా రాజా తథా ప్రజ’ అన్నట్లుగా అధినేత తీరుకు తగ్గట్టుగానే తెలుగుతమ్ముళ్ల వ్యవహారం కన్పిస్తోంది. రాష్ట్ర విభజన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. నిరసనగా రాజీనామాలు చేపట్టాల్సిందిగా ఉద్యమకారులు టీడీపీ నేతలను కోరారు. స్పందించకపోతే కాళ్లు పట్టుకొని బ్రతిమలాడారు. అధినేత నిర్ణయానుసారమే నడుచుకుంటామని స్పష్టం చేశారు. చంద్రబాబు సైతం రాష్ట్ర విభజన ప్రకటన రాగానే, సీమాంధ్ర ప్రాంతానికి పరిహారం ఇవ్వాల్సిందిగా సలహా ఇచ్చారు. ఈ పరిణామాలను గమనిస్తున్న రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజానీకం అటు కాంగ్రెస్, ఇటు టీడీపీలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దీక్షలు సైతం పార్టీ ఆదేశాల మేరకే.. ప్రజాభీష్టానికి అనుకూలంగా వైఎస్సార్సీపీ నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాష్ట్ర విభజన ప్రకటన కంటే ముందే పదవులకు రాజీనామాలు చేశారు. ఉద్యమంలో ముందంజలో ఉన్నారు. ఆమరణదీక్షలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. దీంతో ఇప్పటికైనా దీక్షలు చేపట్టండి. లేకపోతే ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత తప్పదని టీడీపీ నాయకత్వం ఆదేశించడంతో జిల్లా కేంద్రంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో ఆమరణదీక్షలు చేపట్టినట్లు సమాచారం. ఎమ్మెల్యే లింగారెడ్డి ముందుగా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. టీడీపీ నేతల వైఖరిని పరిశీలిస్తున్న ఉద్యమకారులు, వారి దీక్షలకు ఆశించిన మేరకు సంఘీబావం తెలపలేదనే చెప్పాలి. జనసమీకరణ చేపట్టాల్సిందిగా పార్టీ అధిష్టానం కడప నేతలను ఆదేశించినా ఫలితం లేకపోయింది. ఇప్పటికే రాష్ట్ర విభజన విషయంలో పార్టీ నాయకత్వం నిర్ణయాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. పార్టీలో ఉంటూ ఉద్యమానికి అనుకూలంగా పనిచేసినా ఆశించిన మేరకు ఉద్యమకారులకు నమ్మకం కలిగే పరిస్థితులు లేవని, పార్టీని వీడి సమైక్యం కోసం కృషి చేస్తేనే యోగ్యకరంగా ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు అభిప్రాయబడ్డారు. అయిష్టంగానే పార్టీ ఆదేశాల మేరకు దీక్షలను కొనసాగించాల్సిన పరిస్థితి తలెత్తిందని ఆయన పేర్కొనడం విశేషం. దీక్షలకు కూర్చోబెట్టి జారుకున్న నేతలు... వైఎస్సార్సీపీ ఆమరణదీక్షలు చేస్తోందని, మనం కొనసాగించాలని పట్టుబట్టి రైల్వేకోడూరు ఇన్ఛార్జి అజయ్బాబును టీడీపీ నేతలు ఆమరణదీక్షలకు కూర్చోబెట్టినట్లు తెలుస్తోంది. పార్టీ నేతలను విశ్వసించి ఆయన దీక్ష చేపట్టారు. అయితే జనసమీకరణలో నేతలు చేతులేత్తిసినట్లు సమాచారం. చంద్రబాబు రథయాత్రకు కొందరు నేతలు జనాన్ని వెంటేసుకొని వెళ్లారని, మరికొందరు నేతలు దీక్షల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని తెలుస్తోంది. ఎమ్మెల్యే లింగారెడ్డి దీక్షలు చేపట్టితే అజయ్బాబు స్వయంగా పది వాహనాల్లో జనాన్ని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీ నేతల దీక్షలు విజయవంతం చేసేందుకు తన వంతు కృషి చేసినా, తన దీక్షలకు సహరించకపోవడంపై పార్టీ నేతల వైఖరిపై అజయ్బాబు అనుచరుల ఎదుట వాపోయినట్లు తెలిసింది. కాంగీయుల స్పందన అంతంతే... రాష్ర్ట విభజనలో ప్రధమ ముద్దాయి అయిన కాంగ్రెస్ పార్టీ నేతలకు ఉద్యమకారుల నుంచి ప్రతిఘటన తప్పడం లేదు. జిల్లాలో ఇప్పటికే మంత్రి అహ్మదుల్లా, 20 సూత్రాల అమలు కమిటీ చెర్మైన్ తులసిరెడ్డిపై ఉద్యమకారులు చెప్పులు విసిరిన సంఘటనలున్నాయి. అప్పటి నుంచి కాంగ్రెస్ నేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకత్వాన్ని తిడుతూనే, ఇబ్బంది లేదనుకున్న కార్యక్రమాల్లోనే పాల్గొంటున్నారు. ఇప్పటికే వైఎస్సార్సీపీ గ్రామస్థాయిలో సైతం సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమాల్లో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో అటు టీడీపీ, ఇటు కాంగ్రెస్ పార్టీలు ఎటూ పాలుపోని స్థితిలో ఉండిపోయాయి. భవిష్యత్ రాజకీయం ప్రశ్నార్థకం కానుందని నేతలు మథనపడుతున్నారు. -
సమ్మెతోనే ఉద్యమం ఉద్ధృతం
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్లైన్: సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల సంఘాలు చేపట్టిన సమ్మెతోనే ఉద్యమం ఉద్ధృతమైందని మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్రెడ్డి తెలిపారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికులు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన సామూహిక నిరాహార దీక్ష కార్యక్రమానికి శనివారం వైఎస్ఆర్సీపీ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా ఎస్వీ మోహన్రెడ్డి మాట్లాడుతూ సమ్మె కాలానికి జీతాలు రాకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రానున్న రోజుల్లో వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలని అలా చేయలేకపోతున్నందున రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరాహార దీక్ష చేపట్టారని వివరించారు. రాయలసీమలో కనీసం వెయ్యి మందికి ఉపాధినిచ్చే పరిశ్రమ ఒక్కటి లేదని, సమన్యాయం చేయకుండా హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం గర్హనీయమన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఉద్యోగులతో కలిసి వైఎస్సార్సీపీ ఉద్యమిస్తుందని, అవసరమైతే ప్రాణాలు అర్పించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు రాష్ట్ర విభజనను అడ్డుకోక పోతే భావితరాలు క్షమించవని హెచ్చరించారు, పదవులను వదులుకొని మీరే ముందుండి ఉద్యమాన్ని నడిపిస్తే మేము వెనుక ఉండి ఉద్యమిస్తామని పేర్కొన్నారు. సమైక్య ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందని, ఎప్పుడూ కనీ వినీ ఎరుగని రీతిలో సమైక్యాంధ్ర కోసం లక్షల మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకపోవడం దారుణమన్నారు. -
జగన్ బాటలో...మేము సైతం
జననేత బాటలో జనం కదులుతున్నారు. సమైక్యం కోసం ఉద్యమిస్తున్నారు. రాష్ట్రంలో ఇరు ప్రాంతాలకూ సమన్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షకు సంఘీభావం వెల్లువెత్తుతోంది. మేము సైతం అంటూ జగన్ దీక్షకు మద్దతుగా జిల్లాలో 14 మంది ఆమరణదీక్షలకు దిగారు. సాక్షి, విజయవాడ : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సమన్యాయం కోసం జగన్మోహన్రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షకు జిల్లాలో ప్రజల మద్దతు పెరుగుతోంది. జగన్ దీక్షకు సంఘీభావంగా ఇప్పటికే జిల్లాలో ఐదుగురు ఆమరణదీక్షకు దిగగా, మంగళవారం మరో తొమ్మిది మంది దీక్షలు చేపట్టారు. మరో వందమందికి పైగా రిలేదీక్షల్లో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్, యువజన నేత జ్యేష్ఠ శ్రీనాధ్ మైలవరంలో చేస్తున్న ఆమరణ దీక్షలు మంగళవారం మూడోరోజుకు చేరుకున్నాయి. వీరికి పెద్ద సంఖ్యలో మద్దతు లభిస్తోంది. పెడన సమన్వయకర్త ఉప్పాల రాము చేపట్టిన నిరాహార దీక్ష రెండోరోజుకు చేరింది. ఆయనకు పార్టీ నేతలు కె.నాగేశ్వరరావు, ఉప్పాల రాంప్రసాద్, వాకా వాసుదేవరావు తదితరులు సంఘీభావం ప్రకటించారు. విజయవాడలో మాజీ కార్పొరేటర్ జవ్వాది సూర్యనారాయణ (రుద్రయ్య), జయంతికి చెందిన గుంజి సుందరరావు చేపట్టిన నిరాహార దీక్షలు రెండోరోజుకు చేరాయి. మంగళవారం కొత్తగా తిరువూరులో శీలం నాగ నర్సిరెడ్డి, కలికొండ రవికుమార్, ఆలపాటి శ్రీనివాసరావు, కంటిపూడి రమేష్, షేక్ జకీర్, పిడపర్తి లక్ష్మికుమారి, గుడివాడ టౌన్ కన్వీనర్ మరీదు కృష్ణమూర్తి, నూజివీడులో లాకా వెంగళరావు యాదవ్, పెనుగంచిప్రోలు వూట్ల నాగేశ్వరరావు ఆమరణదీక్షలు ప్రారంభించారు. వూట్ల నాగేశ్వరరావు దీక్షా శిబిరాన్ని జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ప్రారంభించారు. పెడన సమన్వయకర్త వాకా వాసుదేవరావు బుధవారం ఆమరణదీక్ష ప్రారంభించనున్నారు. ఉదయభాను నేతృత్వంలో జలదీక్ష.. జగన్ దీక్షకు మద్దతుగా పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను నేతృత్వంలో విజయవాడ కృష్ణానదిలో జలదీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పాలక మండలి సభ్యురాలు ఉప్పులేటి కల్పన, పార్టీ జిల్లా ప్రచార కన్వీనర్ సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ నేతలు బట్టలు ఉతికి నిరసన తెలిపారు. విజయవాడ నగర కన్వీనర్ జలీల్ఖాన్ ఆధ్వర్యంలో జగన్ మాస్క్లతో భారీ ప్రదర్శన నిర్వహించారు. పార్టీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ సమన్వయకర్త పి.గౌతంరెడ్డి తన అనుచరులతో బీఆర్టీఎస్ రోడ్డుపై ఉదయం నుంచి సాయంత్రం వరకు సైకిల్ తొక్కి నిరసన తెలిపారు. నందివాడ మండలంలో మండల కన్వీనర్ పెయ్యల ఆదాం నేతృత్వంలో 9 మంది రిలే దీక్షలు చేపట్టారు. పామర్రు సెంటర్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. నూజివీడులో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మేకా ప్రతాప్ ఆధ్వర్యంలో రిలేదీక్షలు ప్రారంభించారు. పది మంది కార్యకర్తలు దీక్షల్లో కూర్చున్నారు. కైకలూరులో పార్టీ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రిలేదీక్షలు మూడోరోజుకు చేరాయి. లోకుమూడి సర్పంచ్ మాడపాటి లక్ష్మణరావు ఆధ్వర్యంలో 30 మంది రిలే దీక్షల్లో కూర్చున్నారు. సాయంత్రం జగన్ మాస్క్లు ధరించి డీఎన్నార్ ఆధ్వర్యంలో వినూత్న ప్రదర్శన జరిగింది. వత్సవాయిలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించి మానవహారాన్ని నిర్వహించి నిరసన తెలిపారు. గన్నవరంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరాహారదీక్షలు, వంటావార్పు, రహదారుల దిగ్బంధం కార్యక్రమాలను నిర్వహించారు. వత్సవాయిలో పార్టీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. హనుమాన్జంక్షన్ ఎస్బీఐ సెంటర్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు నాలుగోరోజుకు చేరాయి. వైఎస్సార్సీపీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు పార్టీ కండువాలను కార్యకర్తలకు కప్పి దీక్షలను ప్రారంభించారు. నందిగామ పట్టణంలో జగన్ మాస్కులు ధరించి ర్యాలీ నిర్వహించారు. అనంతరం జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. వైఎస్సార్సీపీ పెనమలూరు నియోజకవర్గ సమన్వయ కర్తలు, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ తాతినేని పద్మావతి, బీసీ విభాగం జిల్లా కన్వీనర్ పడమట సురేష్బాబు ఆధ్వర్యంలో కంకిపాడులో నిరసన ప్రదర్శన, ధర్నా, మానవహారం చేపట్టారు. పెడన పార్టీ కార్యాలయంలో వీవీఆర్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. చాట్రాయిలో రిలే నిరాహారదీక్షలను పార్టీ సమన్వయకర్త మేకా ప్రతాప్ ప్రారంభించారు. మోపిదేవిలో ఆ పార్టీ జిల్లా స్టీరింగ్కమిటీ సభ్యుడు కోసూరు రామాంజనేయులు, మెరకనపల్లి పంచాయతీ పాలకవర్గ సభ్యులు రాయన నాంచారయ్య నిరాహారదీక్ష చేశారు. కోడూరు మండల పరిధిలోని సాలెంపాలెంలో పార్టీ సమన్వయకర్త సింహాద్రి రమేష్బాబు ఆధ్వర్యంలో రైతులు, నాయకులు దీక్ష చేపట్టారు. విస్సన్నపేటలో రిలేదీక్షా శిబిరంలో చెవులు, కళ్లు, నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలిపారు. విభజనతో సీమాంధ్ర ఎడారే : భాను రాష్ట్ర విభజనతో సీమాంధ్ర జిల్లాలు ఎడారిగా మారతాయని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను అన్నారు. తెలుగు ప్రజలందరూ కలిసి ఉన్నప్పుడే సీమాంధ్ర జిల్లాల్లోని కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాలను కాపాడుకోగలుగుతామని ఆయన స్పష్టం చేశారు. జగన్ దీక్షకు మద్దతుగా ఆ పార్టీ ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కృష్ణానదిలో జలదీక్ష కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ముందుగా వైఎస్సార్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి, కృష్ణాజలాలతో అభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రాంత ప్రజానీకం విభజన జరిగితే రానున్న రోజుల్లో కృష్ణమ్మ ఎడారిగా దర్శనమిస్తుందన్నారు. కృష్ణా, గోదావరి జిల్లాల్లో ఆయా నదీ జలాలు అందకుండా తెలంగాణావాదులు అడ్డుతగులుతారని చెప్పారు. మరోవైపు హైదరాబాద్ చుట్టూ సీమాంధ్ర జిల్లాలకు చెందిన విద్యార్థుల విద్యా ఉపాధి అంశాలు ముడిపడి ఉన్నాయన్నారు. పామర్రు సమన్వయకర్త ఉప్పులేటి కల్పన పాల్గొన్నారు. -
సమైక్యంగా ఉంచాలనే హక్కు మాకూ ఉంది: ఉండవల్లి అరుణ్కుమార్
ప్రత్యేక తెలంగాణ కోరుకునే హక్కు వాళ్లకు ఎంత ఉంటుందో, సమైక్యంగా ఉంచాలనే హక్కు అవతలివాళ్లకి కూడా ఉంటుందని రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ అన్నారు. సీమాంధ్ర ప్రాంత ఎంపీలు లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్కుమార్, అనంత వెంకట్రామిరెడ్డి తదితరులు కాంగ్రెస్ వార్ రూంలో ఆంటోనీ కమిటీతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్, సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు హాజరయ్యారు. అంతకుముందు కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు కార్యాయలంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు సమావేశమయ్యారు. ఆంటోనీ కమిటీతో ఏం చెప్పాలన్న విషయమై వారు తీవ్రంగా చర్చించుకున్నారు. అసలు.. ఈ సమావేశాల్లోనే కాదు, ఏ పార్లమెంటు సమావేశాల్లోనైనా తెలంగాణ బిల్లు వస్తుందా లేదా అనే విషయాన్ని ఎవరూ చెప్పలేరని ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో తాము చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని, అందుకే తామిక్కడ ఉన్నాం తప్ప.. ఆందోళనలకు భయపడి సీమాంధ్ర ప్రాంతానికి వెళ్లడంలేదన్నది సరికాదని ఆయన అన్నారు. ఇక ఆంటోనీ కమిటీతో భేటీ అనంతరం కూడా ఉండవల్లి మీడియాతో మాట్లాడారు. రాజధాని హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ఆందోళనల సందర్భంగా కొంతమంది నాయకుల ప్రవర్తన గర్హనీయమని, దీన్ని వెంటనే ఆపాలని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణ కావాలని కోరుకునే హక్కు వారికి ఎలా ఉందో, సమైక్యంగా ఉండాలని కోరుకునే హక్కు అవతలివాళ్లకు కూడా అంతే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. దాన్ని రౌడీయిజంతోనో, దాదాగిరితోనో ఆపాలనుకుంటే కుదరదని తెలిపారు. ఈ విషయాన్ని ఆంటోనీ కమిటీకి తెలిపామని, వెంటనే సంబంధితులందరికీ దీన్ని తెలియజేసి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరామని.. దానికి కమిటీ కూడా సానుకూలంగా స్పందించిందని అరుణ్కుమార్ అన్నారు. రాజధాని నగరంలో ఏ విధమైన శాంతియుత ప్రదర్శన జరిగినా దాని మీదకు వెళ్లే అధికారం ఎవరికీ లేదని, ఉంటే గింటే ప్రభుత్వానికే ఉంటుందని ఆయన చెప్పారు. విద్యుత్ సౌధ, జలసౌధతో పాటు ఏపీ ఎన్జీవో కార్యాలయంలో లాయర్ల సమావేశంలో జరిగిన గొడవను కూడా ఆంటోనీ కమిటీ దృష్టికి సీమాంధ్ర ఎంపీలు తీసుకెళ్లారు. సమావేశాల నిర్వహణకు అనుమతి ఇవ్వాలా లేదా అనే హక్కు కేవలం ప్రభుత్వానికే ఉంటుందని, అడ్డుకోవాలంటే పోలీసులు అడ్డుకోవాలి తప్ప వ్యక్తులు, పార్టీలు వాటిని అడ్డుకోవాలని చూడటం సరికాదని ఉండవల్లి అన్నారు. దౌర్జన్యం చేయాలనుకుంటే దాని దుష్ఫలితాలు వారే అనుభవిస్తారని చెప్పారు. సీమాంధ్రలో ఉద్యమ తీవ్రత గురించి ఎవరికీ ఏమీ చెప్పాల్సిన అవసరం లేదని, మీ అందరి (మీడియా) దయవల్ల అక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క విషయం అందరికీ తెలుస్తోందని ఆయన అన్నారు. ఇంత ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమం తాను పుట్టాక భారతదేశంలో ఇంతవరకు ఎన్నడూ లేదని, ఇకముందు కూడా జరుగుతుందన్న నమ్మకం లేదని ఆయన చెప్పారు. ఆంటోనీ కమిటీతో చెప్పాల్సిందంతా చెప్పామని, తొందర్లోనే మొత్తం సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు, కేంద్ర మంత్రులు మళ్లీ ఓసారి కమిటీతో సమావేశమై, పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా పరిస్థితులు వివరిస్తామని అన్నారు. ఈరోజే సమగ్రంగా చెబుదామనుకున్నా, ఆహారభద్రత బిల్లుపై లోక్సభలో ఓటింగ్ ఉండటం వల్ల ఈరోజు కుదరలేదని ఆయన చెప్పారు. -
'సమైక్యంగా ఉంచాలని ఆంటోనిని కోరతా'
హైదరాబాద్ నగర అభివృద్ధిలో అన్ని ప్రాంతాల ప్రజలకు భాగస్వామ్యం ఉందని రాష్ట మంత్రి కొండ్రుమురళి మంగళవారం న్యూఢిల్లీలో వెల్లడించారు. విద్యా, వైద్య రంగాలకు సంబంధించి ముఖ్య కేంద్రాలన్ని హైదరాబాద్ నగరంలోనే ఉన్నాయని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఎ.కే.ఆంటోనిని కోరతామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు రెండో ఎస్సార్సీ వేయాలని ఆయన యూపీఏ సర్కార్ను ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలనేది కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు వ్యక్తిగత అభిప్రాయమని కొండ్రుమురళి పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రాంతంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మంత్రులు, సీనియర్ నాయకులు మంగళవారం ఆంటోని కలవనున్నారు. ఈ సందర్బంగా వారంతా న్యూఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. మంగళవారం తమను కలవాలని కాంగ్రెస్ అధిష్టానం నుంచి సీఎం కిరణ్కు పిలుపు వచ్చింది. దాంతో ఆయన ఈ రోజు ఉదయం ఢిల్లీ పయనమైయ్యారు. అదికాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సీఎం కిరణ్ ఈ రోజు న్యూఢిల్లీలో పేర్కొన్న విషయం కూడా విధితమే. -
విజయమ్మ దీక్షకుసంఘీభావం
సాక్షి, విజయవాడ : అన్ని ప్రాంతాలకు సమన్యాయం పాటించాలని, లేదంటే రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 19 నుంచి వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టనున్న ఆమరణ దీక్షకు సంఘీభావం పెరుగుతోంది. దీక్షకు ఏపీ ఎన్జీవోలు పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్బాబు విజయమ్మను రాజధానిలో కలిసి ఆమరణ దీక్ష నిర్ణయాన్ని స్వాగతించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం ఎవరు పూనుకున్నా తాము పూర్తి మద్దతు ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికే పొలిటికల్ జేఏసీ కూడా విజయమ్మ దీక్షకు సంఘీభావం ప్రకటించిన సంగతి తెలిసిందే. సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్న వారందరూ విజయమ్మ దీక్ష నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికార కాంగ్రెస్తో పాటు దానికి కొమ్ముకాస్తున్న ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు ద్వంద్వ వైఖరులతో ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తుండగా, సమైక్యం కోసం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేసింది వైఎస్సార్ సీపీ నుంచే కావడంతో ప్రజలు, ప్రజా సంఘాల నుంచి మద్దతు లభిస్తోంది. సమైక్యం కోసం ఏకంగా ఒక పార్టీ అధినేత్రి ఆమరణ దీక్షకు దిగడం వల్ల ఉద్యమానికి మద్దతు పెరుగుతుందని సమైక్యవాదులు భావిస్తున్నారు. నేడు దీక్షా వేదిక ఖరారు.. ఈ నెల 19 నుంచి విజయమ్మ చేపట్టనున్న ఆమరణ దీక్ష వేదికను శుక్రవారం ఖరారు చేయనున్నారు. వైఎస్సార్సీపీ గవర్నింగ్ బాడీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం విజయవాడ రానున్నారు. ప్రోగ్రామింగ్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ ఉదయభాను, నగర కన్వీనర్ జలీల్ఖాన్, తూర్పు, సెంట్రల్ నియోజకవర్గాల కన్వీనర్లు వంగవీటి రాధాకృష్ణ, పి.గౌతంరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పేర్ని నాని, కొడాలి నాని, జోగి రమేష్, అడుసుమిల్లి జయప్రకాష్ తదితరులతో ఆయన సమావేశమై వేదిక ఖరారు చేయనున్నారు. -
సమైక్య రాష్ట్ర కోసం ప్రత్యేక ప్రార్ధనలు
-
సమైక్య రాష్ట్రం కోసం పల్లె జనం నగరాలు
సమైక్య రాష్ట్రం కోసం పల్లె జనం నగరాలు, పట్టణాలకు కదలివచ్చి ఉద్యమంలో పాల్గొన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జిల్లాలో పెద్ద ఎత్తున తొమ్మిది రోజులుగా ఉద్యమాలు కొనసాగుతున్నాయి. పల్లెల్లోనూ నిరసనలు తెలియజేస్తున్నారు. నగరాలు, పట్టణాల్లో వినూత్న రీతిలో జరుగుతున్న నిరసనల్లో పాల్గొనేందుకు సమైక్యవాదులు గురువారం పెద్ద ఎత్తున తరలివచ్చారు. తిరుపతి డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి పొదుపు సంఘాల మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి ఆందోళనలో భాగం పంచుకున్నారు. బాలాజీ కాలనీ నుంచి తెలుగుతల్లి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహిం చారు. జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. సాక్షి, తిరుపతి : రాష్ట్ర విభజన జరిగితే రాయలసీమకు, ముఖ్యంగా తిరుపతికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మె ల్యే భూమన కరుణాకర రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం తిరుపతిలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఆయన మాట్లాడుతూ తిరుపతికి వచ్చే కృష్ణా జలాలు తెలంగాణ నుంచే రావాల్సి ఉందని, ఆ నీళ్లను ఆపేస్తారని పేర్కొన్నారు. శ్రీశైలం డ్యాంకు నీళ్లు అందకపోతే, తెలుగుగంగ నీరు సరఫరా కాదని చెప్పారు. ఇప్పుడు తిరుపతి ప్రజలకు అందుతున్న 30 లీటర్ల నీళ్లు కూడా లభించవని తెలిపారు. దీంతో పాటు రాయలసీమలోని ఏ ప్రాజెక్టుకు నీళ్లు అందవని చెప్పారు. చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి అయాచితంగా ముఖ్యమంత్రి పదవి పొంది, ప్రతిరోజు సంపాదన కోసం అర్రులు చాస్తున్నారు కానీ, రాయలసీమ ప్రయోజనాల గురించి ఆలోచించడం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన జరుగుతుందని తెలిసిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు తోబుట్టువులేనని, అయితే అక్కడ ఉద్యమం చేస్తున్న దొరలు సీమాంధ్రపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రజల ఒత్తిడిని తట్టుకోలేక టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు చేస్తున్న దొంగ రాజీనామాలను ప్రజలు నమ్మడం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకించి, తిరుపతి ప్రజలు ఎండ, వానలు లెక్క చేయకుండా పోరాటం చేస్తున్నారని అభినందించారు. అనంతరం వైఎస్సార్సీపీ నగర కన్వీనరు పాలగిరి ప్రతాపరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, చిత్తూరు జిల్లాలో పుట్టినా, హైదరాబాద్లో ఓటు హక్కు ను రాసుకున్నారని తెలిపారు. ఎమ్మెల్యే కరుణాకరరెడ్డికి అండగా ఉంటూ, ఆయన చేస్తున్న పోరాటానికి సహకరించాలని పిలుపునిచ్చారు. మద్య నిషేధం కోసం భూమన అభినయ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ఈ నెల 14 తీర్పు వస్తుందని, తీర్పు అనుకూలంగా వస్తే తిరుపతిలో మద్యం నిషేధం విధిస్తారని పేర్కొన్నారు. తాము సమైక్యాంధ్రకు మద్దతు ఇస్తున్నామంటూనే కొందరు నాయకులు రాజీనామాలు చేయకుండా దొంగనాటకాలు ఆడుతున్నారని పార్టీ నాయకులు ఎస్కె.బాబు విమర్శించారు. రాష్ట్రాన్ని విభజించడానికి, రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించడానికి దిగ్విజయ్ సింగ్ ఎవరని పార్టీ మైనారిటీ విభాగం కన్వీనరు షఫీ అహ్మద్ ఖాద్రీ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పదవులను కాపాడుకునేందుకు రాష్ట్రాన్ని పణంగా పెడుతున్నారని పార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు ఎంవిఎస్.మణి పేర్కొన్నారు. కార్యక్రమంలో మహిళా కన్వీనర్ కుసుమ, ఎస్సీ సెల్ కన్వీనర్ రాజేంద్ర తదితరులు ప్రసంగించారు. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వెంకటముని, తిరుమలయ్య, కేతం రామరావు, బాలమునిరెడ్డి, మల్లం రవి, మాధవనాయుడు, చెంచయ్యయాదవ్, తొండమనాటి వెంకటేష్, ముద్ర నారాయణ, దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, శాంతారెడ్డి, పునీత, తాళ్లూరు ప్రసాద్, గౌరి, రంగా యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
త్యాగాలకు సిద్ధం కండి
సాక్షి, కాకినాడ : త్యాగాలకు వెనుకాడకుండా సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమించాలని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపునిచ్చింది. సమైక్యాంధ్ర ఉద్యమానికి దిశానిర్దేశం చేసేందుకు జిల్లా స్థాయిలో ఏర్పాటైన సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక తొలి కార్యక్రమం కాకినాడలో సోమవారం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన వివిధ వర్గాల ప్రజలు, అన్ని శాఖల ఉద్యోగులు జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుంచి భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం బాలాజీచెరువు సెంటర్లో జరిగిన సభలో జేఏసీ చైర్మన్ బూరిగ ఆశీర్వాదం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, 12లోగా రాజీనామాలు సమర్పించి ‘సైమైక్య’ ఉద్యమ బాట పట్టకుంటే అదేరోజు అర్ధరాత్రి నుంచి మెరుపు సమ్మెకు దిగుతామన్నారు. కార్యదర్శి పితాని త్రినాథరావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని విడగొట్టాలన్న ఆలోచనకు జేఏసీ చెక్ పెడుతుందన్నారు. మెరుపుసమ్మె తో అత్యవసర సర్వీసులు మినహా పరిపాలనను స్తంభింపజేస్తామన్నారు. కమిటీలు వేసి డివిజన్స్థాయిలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు. కాంగ్రెస్ అనుచిత నిర్ణయం వల్ల వారంరోజుల వ్యవధిలో 42 మంది మరణించారన్నారు. ప్రజలు బియ్యం, కిరాణా సామాన్లు ముందుగానే కొనుగోలు చేసుకుని సమ్మెకు సహకరించాలన్నారు. విభజించి పాలించడమే కాంగ్రెస్ నీతా? మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ విభజించిన రోజునుంచే రాష్ట్రానికి దుర్దినాలు ప్రారంభమయ్యాయన్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసం ఏకపక్ష కుట్రతో విభజనకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. కొత్త రాజధాని ఎక్కడనేది చెప్పలేని ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటుకు ఆతృత ప్రదర్శించడం సిగ్గుచేటన్నారు. సామాన్యుడు జబ్బు పడితే తెల్లకార్డుతో నిమ్స్కు వెళ్లి చికిత్స కూడా చేయించుకోలేని దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉత్తుత్తి రాజీనామాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజీనామా పత్రం ఎవరికి ఇవ్వాలో తెలియని అజ్ఞానంలో కొందరు నేతలు ఉండడం దురదృష్టకరమన్నారు. విభజన విషయంలో చంద్రబాబు నాయుడు పాత్ర అనుమానాస్పదంగా ఉందన్నారు. పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగంతో ఏర్పడిన రాష్ట్రాన్ని రాజకీయ దురుద్దేశంతో రెండు ముక్కలు చేస్తే సహించేది లేదన్నారు. విభజనతో రాష్ట్రం దుస్థితికి నెట్టివేయబడుతుందన్నారు. ఒక ఉద్యమకారునిగా జేఏసీకి మద్దతు పలుకుతున్నానన్నారు. కాకినాడ తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ఉద్యమ కసి రగలాలంటే మంత్రు లు, ఎంఎల్ఏలు స్పీకర్ ఫార్మేట్లో రాజీనామాలు చేయాలన్నారు. జేఏసీ ఉద్యమాలకు పార్టీ జెండా లు పక్కనబెట్టి నాయకులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సుజనాచౌదరి వంటి నేతలు రాజీనామాలు చేసినా రెండు రాష్ట్రాలు ఉండడం తప్పుకాదంటున్నారని, ఇది తెలుగుదేశం పార్టీ నైజాన్ని బయటపెడుతోందని విమర్శించారు. జేఏసీ కార్యక్రమాలకు తమ తోడ్పాటు అందిస్తామన్నారు. టీడీపీ, కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే పదవులకు రాజీ నామా చేసి ఉద్యమంలోకి రావాలన్నారు. ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూని యన్ ప్రతినిధి ఖాన్ మాట్లాడుతూ ఆరీ్టిసీలోని సంఘాలన్నీ ఉమ్మడి కార్యచరణతో సమ్మె చేస్తాయని ప్రకటించారు. ఆర్టీసీకి నష్టం కలగకుండా ఉద్యమాన్ని సాగించాలన్నారు. టీడీపీ నేత పోతుల విశ్వం సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. తన విద్యా సంస్థలలో 7వేల మంది విద్యార్థులు జేఏసీ ఎప్పుడు పిలిచినా వస్తారన్నారు. మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ జేఏసీ నిర్ణయం మేరకు ఉద్యమంలో పాల్గొంటామన్నారు. జేఏసీ మాజీ అధ్యక్షుడు ఆచంట రామారాయుడు, ఎమ్మె ల్సీ బొడ్డు భాస్కరరామారావు, వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ నాయకుడు చలమలశెట్టి సునీల్, నగర కన్వీనర్ ఫ్రూటీకుమార్, జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణు, వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్లు చింతా కృష్ణమూర్తి, మిండగుదిటి మోహన్, కొండేటి చిట్టిబాబు, విప్పర్తి వేణుగోపాల్, తోట సుబ్బారావునాయుడు, వివిధ విభాగాల కన్వీనర్లు కర్రి పాపారాయుడు, గుత్తుల రమణ, శెట్టిబత్తుల రాజబాబు, రావూరి వెంకటేశ్వరరావు, అధికారప్రతినిధి పి.కె. రావు, జేఏసీ ప్రతినిధులు పిల్లి సత్యనారాయణమూర్తి, సుబ్బారావు, ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
సమైక్యాంధ్రపై స్పష్టమైన ప్రకటన చేయాలి- టీచర్స్ జేఏసీ డిమాండ్
చిత్తూరు(టౌన్), న్యూస్లైన్: రాజకీయ పార్టీలు రెండు నాల్కల ధోరణి విడనాడి సమైక్యాంధ్రపై స్పష్టమైన ప్రకటన చేయాలంటూ ఉపాధ్యాయ జేఏసీ డిమాండ్ చేసింది. జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం విధులు బహిష్కరించి, నల్లబ్యాడ్జీలు ధరించి పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. అక్కడి నుంచి సీకే.బాబు నిర్వహిస్తున్న దీక్షా శిబిరం వద్దకు వెళ్లి మద్దతు ప్రకటించారు. అనంతరం గాంధీ విగ్రహం చుట్టూ మానవహారంగా ఏర్పడి సమైక్యాం ధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. ర్యాలీగా డీఈవో కార్యాలయానికి వెళ్లారు. విధులు బహిష్కరించి ఉద్యమంలో పాల్గొనాలని విద్యాశాఖ సిబ్బం దిని కోరారు. జేఏసీ, విద్యాశాఖ సిబ్బంది డీఈవో కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జేఏసీ నేతలు మాట్లాడుతూ సమైక్యాంధ్రపై కేంద్రం నుంచి ప్రకటన వచ్చేంత వరకు ఉద్యమం ఆపమన్నారు. రాజకీయ పార్టీలు రెండు నాల్కల ధోరణి విడనాడి సమైక్యాంధ్రపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. జేఏసీ కార్యక్రమాలకు ఎంఈవోల సంఘం జిల్లా అధ్యక్షులు బి.సుధాకర్ మద్దతు ప్రకటించి, మంగళవారం నుంచి జరిగే కార్యక్రమాల్లో ఎంఈవోలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ సంఘాల నేతలు కృష్ణారెడ్డి, చెంగల్రాయమందడి, రెడ్డిశేఖర్రెడ్డి, గంటామోహన్, గిరిప్రసాద్రెడ్డి, చంద్రశేఖర్నాయుడు, నరేంద్రకుమార్, శేఖర్, వెంకటేశ్వర్లు, నరోత్తమరెడ్డి, రవీంద్రరెడ్డి, విద్యాశాఖ సిబ్బంది మురళి, ప్రభాకర్నాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
విభజనకు నిరసనగా హరికృష్ణ రాజీనామా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు తాను వ్యతిరేకం కాదని ప్రకటన చేసిన మరుసటిరోజే టీడీపీ ఎంపీ నందమూరి హరికృష్ణ మాటమార్చారు. కాంగ్రెస్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామాకు ఆదివారం ఉదయం 8.46 గంటలకు ముహూర్తంగా నిర్ణయించుకున్న హరికృష్ణ సరిగ్గా అదే సమయానికి రాజీనామా పత్రాలపై సంతకం చేసి తన తండ్రి ఎన్టీఆర్ సమాధిపై ఉంచారు. అనంతరం ఎన్టీఆర్ ఘాట్ వద్దే మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు పేర్కొంటూ ఆ పత్రాలను రాజ్యసభ చైర్మన్, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు పంపిస్తున్నట్లు ప్రకటించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటానని ఒక ప్రశ్నకు పరోక్షంగా జవాబిచ్చారు. ‘‘అన్నదమ్ములను విడగొట్టేందుకు విషప్రయోగం జరిగింది. ఒక్క గడ్డిపోచ ఏమీ చేయలేదు. అనేక గడ్డిపోచలు కలిస్తేనే బలంగా తయారవుతాయి. సమైక్యతలో ఉన్న మాధుర్యం, గొప్పదనం విడిపోతే ఉండదు. కొందరు స్వార్థపరుల నాటకంలో భాగస్వామ్యం అయ్యాం. సోనియాగాంధీ దుష్టశక్తిగా వచ్చి తన కొడుకును ప్రధానమంత్రి చేసేందుకు అన్నదమ్ములను విడదీశారు. ఢిల్లీ ఏసీ రూముల్లో కూర్చుని కళ్లకు గంతలు కట్టుకున్నవారు విభజనపై నిర్ణయం తీసుకున్నారు. నీటివాటాలు, ఉద్యోగాలు, రాష్ట్ర అప్పులను ఏం చేస్తారు?’ అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనకు టీడీపీ అనుకూలంగా నిర్ణయం తీసుకుందని గుర్తు చేయగా.. తన రాజీనామా గురించి మాత్రమే మాట్లాడాలని కోరారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటారా? అని ప్రశ్నించగా..‘ఎందుకు పాల్గొనకూడదు?’ అని ఎదురు ప్రశ్నవేశారు. -
నెల్లూరు జిల్లాలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా