Vamika
-
వామిక, అకాయ్లతో బృందావనంలో విరాట్- అనుష్క! వీడియో వైరల్
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) మరోసారి ఆధ్యాత్మిక భావనలో మునిగిపోయాడు. సతీమణి అనుష్క శర్మ(Anushka Sharma), పిల్లలు వామిక(Vamika), అకాయ్(Akaay)లతో కలిసి ప్రేమానంద్ మహరాజ్ ఆశీస్సులు తీసుకున్నాడు. కాగా గత కొంతకాలంగా కెరీర్ పరంగా కోహ్లి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.బోర్డర్- గావస్కర్ ట్రోఫీ విఫలంముఖ్యంగా టెస్టుల్లో నిలకడలేమి ఆట తీరు, వరుస వైఫల్యాల కారణంగా తీవ్ర స్థాయిలో విమర్శలు మూటగట్టుకున్నాడు కోహ్లి. తొలుత సొంతగడ్డపై న్యూజిలాండ్తో సిరీస్లో తేలిపోయిన ఈ ‘రన్మెషీన్’.. తనకు ఘనమైన రికార్డు ఉన్న ఆస్ట్రేలియాలోనూ చేతులెత్తేశాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్తో జరిగిన టెస్టు సిరీస్లో టీమిండియా ఓడిపోవడానికి కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ప్రధాన కారణమయ్యాడు కోహ్లి. పెర్త్లో జరిగిన తొలి టెస్టులో శతకం బాదడం మినహా.. మిగతా మ్యాచ్లలో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. అంతేకాదు.. ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతిని ఆడేందుకు ప్రయత్నించి.. ఒకే రీతిలో వికెట్ పారేసుకున్నాడు.అంతేకాదు.. ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్ బౌలింగ్లో ప్రతిసారి బోల్తా పడి వికెట్ సమర్పించుకున్నాడు ఇక ఈ ప్రతిష్టాత్మక సిరీస్లో టీమిండియా కంగారూ జట్టు చేతిలో 3-1తో ఓడిపోయి.. పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది. అంతేకాదు.. ఈ పరాజయం కారణంగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్-2025 ఫైనల్ రేసు నుంచి కూడా భారత జట్టు నిష్క్రమించింది.ఇంగ్లండ్తో స్వదేశంలో సిరీస్లుతదుపరి ఇంగ్లండ్తో స్వదేశంలో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. జనవరి 22 నుంచి ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ మొదలుకానున్నాయి. ఆ తర్వాత వెంటనే చాంపియన్స్ ట్రోఫీ-2025 రూపంలో ఐసీసీ టోర్నీలో తలపడాల్సి ఉంది.ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా పర్యటన ముగిసిన తర్వాత కుటుంబంతో కలిసి కోహ్లి భారత్కు తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మానసిక ప్రశాంతతకై ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో ఉన్న ప్రేమానంద్ మహరాజ్ దర్శనం చేసుకున్నాడు. ఆ సమయంలో భార్య అనుష్కతో పాటు.. కుమార్తె వామిక, చిన్నారి కుమారుడు అకాయ్ కూడా కోహ్లి వెంట ఉన్నారు.అనుష్క వల్లే కోహ్లి ఇలాఈ సందర్భంగా అనుష్క ప్రేమానంద్ మహరాజ్తో మాట్లాడుతూ.. ‘‘గతంలో ఇక్కడికి వచ్చినపుడు నా మనసులోని కొన్ని ప్రశ్నలు అలాగే ఉండిపోయాయి. నేను మిమ్మల్ని అడగాలనుకున్న ప్రశ్నలు వేరే వాళ్లు అడిగేశారు. ఈసారి ఇక్కడికి వచ్చినపుడు మాత్రం నా మనసులోని సందేహాలకు సమాధానం పొందాలని భావించాను. అయితే, ఈసారి కూడా వేరేవాళ్ల వల్ల నా ప్రశ్నలకు జవాబు దొరికింది. ఇప్పుడు మాకు కేవలం మీ ఆశీస్సులు ఉంటే చాలు’’ అని పేర్కొంది.ఇక విరుష్క దంపతులు తన ముందు ప్రణమిల్లడం చూసి భావోద్వేగానికి గురైన ప్రేమానంద్ మహరాజ్.. ‘‘మీరు చాలా ధైర్యవంతులు. ప్రపంచవ్యాప్తంగా కీర్తిప్రతిష్టలు సంపాదించిన తర్వాత కూడా దేవుడి పట్ల ఇంత అణకువగా ఉండటం అందరికీ సాధ్యం కాదు,.భక్తి మార్గంలో నడుస్తున్న అనుష్క ప్రభావమే కోహ్లి మీద కూడా ఉంటుందని మేము అనుకుంటూ ఉంటాం. విరాట్ కోహ్లి తన ఆటతో దేశం మొత్తానికి సంతోషాన్ని పంచుతాడు. అతడు గెలిస్తే దేశమంతా సంతోషంగా ఉంటుంది. అంతలా ప్రజలు అతడిని ప్రేమిస్తున్నారు’’ అంటూ కోహ్లిపై ప్రశంసలు కురిపించారు.ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఇందులో వామిక, అకాయ్ల ముఖాలు కనిపించకుండా విరుష్క జోడీ జాగ్రత్తపడింది. కాగా ఈ జంట ఎక్కువగా లండన్లోనే ఉంటున్న విషయం తెలిసిందే.చదవండి: భార్యను భర్త తదేకంగా ఎందుకు చూడొద్దు: గుత్తా జ్వాల ఫైర్Virat Kohli and Anushka Sharma with their kids visited Premanand Maharaj. ❤️- VIDEO OF THE DAY...!!! 🙏 pic.twitter.com/vn1wiD5Lfc— Mufaddal Vohra (@mufaddal_vohra) January 10, 2025 -
‘త్వరలోనే భారత్కు కోహ్లి గుడ్బై... లండన్లో స్థిరనివాసం’
‘టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి త్వరలోనే శాశ్వతంగా భారత్ను వీడనున్నాడు. కుటుంబంతో కలిసి లండన్లో నివాసం ఉండబోతున్నాడు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి’... ఈ మాటలు అంటున్నది మరెవరో కాదు.. కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ.క్రికెట్ కింగ్గా పేరొందిన విరాట్ కోహ్లి.. 2017లో బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను వివాహమాడిన విషయం తెలిసిందే. ఈ జంటకు 2021లో కుమార్తె వామిక జన్మించింది. పాప పుట్టిన దాదాపు మూడేళ్ల అనంతరం ఇటీవలే అనుష్క- కోహ్లి మగబిడ్డకు జన్మనిచ్చారు.అప్పటి నుంచి ఎక్కువగా లండన్లోనేఇక వామిక భారత్లోనే జన్మించగా.. రెండోసారి ప్రసవం కోసం భర్త విరాట్తో కలిసి అనుష్క లండన్కు వెళ్లింది. అక్కడే ఆమె తమ కుమారుడు అకాయ్కు జన్మనిచ్చింది. అప్పటి నుంచి కోహ్లి కుటుంబం ఎక్కువగా లండన్లోనే నివసిస్తోంది. విరాట్ కూడా సొంతగడ్డపై మ్యాచ్లు ఉన్నపుడు మాత్రమే స్వదేశానికి తిరిగి వస్తున్నాడు. విదేశాల్లో సిరీస్లు ఉన్న సమయంలో లండన్ నుంచి నేరుగా అక్కడికి చేరుకుంటున్నాడు.లండన్లో స్థిర నివాసంఅదే విధంగా.. అనుష్క శర్మ సైతం ముఖ్యమైన పనుల కోసం మాత్రమే ముంబైకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో విరుష్క జోడీ లండన్లో స్థిరనివాసం ఏర్పరచుకోబోతున్నారని వదంతులు వచ్చాయి. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ.. దైనిక్ జాగరణ్తో మాట్లాడుతూ ఈ వదంతులు నిజమేనని పేర్కొన్నాడు.‘‘అవును.. విరాట్ కోహ్లి లండన్కు పూర్తిగా మకాం మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. త్వరలోనే అతడు ఇండియాను శాశ్వతంగా వదిలివెళ్తాడు’’ అని రాజ్కుమార్ శర్మ తెలిపాడు. కాగా విరాట్ కోహ్లికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే విధంగా.. అనుష్కకు కూడా భారీగానే అభిమానగణం ఉంది.కారణం ఇదేకాబట్టి ఈ సెలబ్రిటీ జంటకు సంబంధించిన చిన్న విషయమైనా అభిమానులకు పెద్ద వార్తే. అదే విధంగా.. మీడియా, సోషల్ మీడియాలోనూ వీరి గురించి ఎన్నో కథనాలు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి కామెంట్లు శ్రుతిమించుతాయి కూడా! అప్పట్లో ఓ మ్యాచ్లో కోహ్లి భారత పేసర్ మహ్మద్ షమీకి మద్దతుగా నిలిచాడన్న కారణంతో అతడి కుమార్తెను ఉద్దేశించి నీచంగా మాట్లాడటంతో పాటు బెదిరింపులకు దిగారు కొందరు దుండగులు.ఈ పరిణామాల నేపథ్యంలో తమ సంతానాన్ని లైమ్లైట్కు దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్న విరుష్క జోడీ.. ఇప్పటి వరకు వారి ఫొటోలను కూడా ప్రపంచానికి చూపించలేదు. తమ పిల్లల గోప్యతకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వారు శాశ్వతంగా లండన్లో స్థిరపడాలని భావిస్తున్నట్లు సమాచారం.ఆ తర్వాత శాశ్వతంగా లండన్లోఇటు కుటుంబ గోప్యతతో పాటు.. లండన్లో భారీగా పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలోనే విరాట్ కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు గుడ్బై చెప్పిన ఈ రికార్డుల రారాజు.. వన్డే, టెస్టుల నుంచి తప్పుకొన్న తర్వాత మకాం మొత్తంగా లండన్కు మార్చబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ప్రస్తుతం కోహ్లి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాడు. భార్య అనుష్కతో పాటు పిల్లలు వామిక, అకాయ్లను కూడా తన వెంట తీసుకువెళ్లాడు. కాగా కోహ్లి ఖాతాలో ఇప్పటికే 81(టెస్టు 30, వన్డే 50, టీ20 1) అంతర్జాతీయ శతకాలు ఉన్నాయి.చదవండి: సంజూ శాంసన్కు షాక్ -
నా పిల్లలు ఉన్నపుడు ఇలా చేస్తారా?: మండిపడ్డ కోహ్లి
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సహనం కోల్పోయాడు. తన అనుమతి లేకుండా వీడియో ఎలా తీస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలేం జరిగిందంటే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో భారత స్టార్లు విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా భార్యాపిల్లలతో కలిసి ఆసీస్కు చేరుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా పెర్త్, అడిలైడ్, బ్రిస్బేన్ మ్యాచ్లు ముగియగా.. తదుపరి భారత్- ఆస్ట్రేలియా మెల్బోర్న్లో తలపడనున్నాయి.వామిక, అకాయ్ల వీడియో తీశారనిఇందుకోసం కోహ్లి కుటుంబంతో కలిసి మెల్బోర్న్ వినామాశ్రయానికి చేరుకున్నాడు. అయితే, ఆ సమయంలో కొంతమంది మీడియా ప్రతినిధులు కోహ్లితో పాటు అతడి భార్య అనుష్క శర్మ, పిల్లలు వామిక, అకాయ్ల వీడియో చిత్రీకరించినట్లు సమాచారం. దీంతో కోపోద్రిక్తుడైన కోహ్లి.. సదరు వ్యక్తుల దగ్గరకు వెళ్లి మరీ గట్టిగా హెచ్చరించాడు.నా పిల్లలు ఉన్నపుడు ఇలా చేస్తారా?అనంతరం మరోసారి మీడియాను ఉద్దేశించి మాట్లాడిన విరాట్ కోహ్లి.. ‘‘నా పిల్లలు ఉన్నపుడు నాకు కాస్త ప్రైవసీ ఇవ్వాలి కదా? నా అనుమతి లేకుండా వాళ్ల ఫొటోలు, వీడియోలు ఎలా తీస్తారు?’’ అని ప్రశ్నించాడు. నిజానికి.. కోహ్లి ఫ్యామిలీతో కలిసి వచ్చేసరికి ఆస్ట్రేలియా పేసర్ స్కాట్ బోలాండ్ను కొంత మంది విలేకరులు ఇంటర్వ్యూ చేస్తున్నారు.అయితే, అదే సమయంలో కోహ్లి ఎంట్రీ ఇవ్వడంతో అన్ని కెమెరాలు అతడి వైపు తిరిగాయి. ఇక పిల్లల గురించి హెచ్చరిస్తూ కోహ్లి కాస్త సీరియస్ కావడంతో.. తాము వామిక, అకాయ్ల ఫొటోలు, వీడియోలు తీయలేదని వారు సమాధానం ఇచ్చారట. దీంతో శాంతించిన కోహ్లి వారితో కరచాలనం చేసి అక్కడి నుంచి నిష్క్రమించినట్లు తెలుస్తోంది.పెర్త్లో సెంచరీ మినహాఇదిలా ఉంటే.. ఆసీస్తో పెర్త్ టెస్టులో గెలిచిన టీమిండియా.. అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో ఓడింది. దీంతో సిరీస్ 1-1తో సమం కాగా.. బ్రిస్బేన్ టెస్టు ‘డ్రా’గా ముగిసింది. ఈ నేపథ్యంలో మెల్బోర్న్ బాక్సింగ్ డే టెస్టు(డిసెంబరు 26-30) ఇరుజట్లకు మరింత కీలకంగా మారింది. ఇక ఈ సిరీస్లో పెర్త్లో సెంచరీ చేయడం మినహా కోహ్లి పెద్దగా రాణించలేదు. ఈ క్రమంలో అతడి ఆట తీరుపై విమర్శలు వస్తున్నాయి.చదవండి: నా కుమారుడికి అవమానం జరిగింది.. అశ్విన్ తండ్రి సంచలన ఆరోపణలుIndian cricket superstar Virat Kohli has been involved in a fiery confrontation at Melbourne Airport. @theodrop has the details. https://t.co/5zYfOfGqUb #AUSvIND #7NEWS pic.twitter.com/uXqGzmMAJi— 7NEWS Melbourne (@7NewsMelbourne) December 19, 2024 -
Akaay: కోహ్లి బర్త్డే.. తొలిసారి కుమారుడి ఫొటో షేర్ చేసిన అనుష్క
క్రికెట్ కింగ్, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి పుట్టినరోజు నేడు(నవంబరు 5). ఈ సందర్భంగా ఈ రన్మెషీన్కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి సహా యువరాజ్ సింగ్, సురేశ్ రైనా తదితరులు కోహ్లికి విషెస్ తెలిపారు. అభిమానులు సైతం తమ ఆరాధ్య క్రికెటర్ను విష్ చేస్తూ కోహ్లి పేరును ట్రెండ్ చేస్తున్నారు.ఈ క్రమంలో విరాట్ ఫ్యాన్స్కు స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చింది అతడి సతీమణి అనుష్క శర్మ. తమ ఇద్దరు పిల్లలు వామిక, అకాయ్లతో కోహ్లి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో కోహ్లి అకాయ్ను ఎత్తుకోవడంతో పాటు తన గారాలపట్టి వామికను ఒంటిచేత్తో మోస్తూ కనిపించాడు. అయితే, అనుష్క ఇక్కడో ట్విస్ట్ ఇచ్చారు.తమ చిన్నారుల ముఖాలు కనిపించకుండా లవ్ సింబల్స్తో కవర్ చేశారు. ఏదేమైనా తొలిసారి వామిక, అకాయ్లను ఈమాత్రం చూపించినందుకు ‘థాంక్స్ వదినా’ అంటూ కోహ్లి ఫ్యాన్స్ ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కాగా ఇదివరకు వామిక ఫొటోలను అడపాదడపా షేర్ చేసినా.. అకాయ్కు సంబంధించి మాత్రం ఇదే తొలి ఫొటో. కాగా రికార్డుల రారాజు విరాట్ కోహ్లి నవంబరు 5, 1988లో ఢిల్లీలో జన్మించాడు. అతడి తండ్రి ప్రేమ్ కోహ్లి క్రిమినల్ లాయర్. తల్లి సరోజ్ గృహిణి. కోహ్లి తోబుట్టువులు అన్న వికాస్ కోహ్లి, అక్క భావనా కోహ్లి ధింగ్రా ఉన్నారు.కెప్టెన్గానూ సేవలు2008లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు కోహ్లి. జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగి కెప్టెన్గానూ సేవలు అందించాడు. ఇక వన్డేల్లో అత్యధికంగా 50 సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్గా కోహ్లి వరల్డ్ రికార్డు సాధించాడు కోహ్లి. సమకాలీన క్రికెటర్లలో ఎవరికీ సాధ్యం కాని ఘనతలెన్నో సాధించాడు.ఇప్పటి వరకు టీమిండియా తరపున 118 టెస్టులు, 295 వన్డేలు, 125 టీ20లు ఆడిన కోహ్లి 27,134 పరుగులు చేశాడు. ఇందులో 80 సెంచరీలు ఉన్నాయి. అదే విధంగా.. వన్డే వరల్డ్కప్-2011, చాంపియన్స్ ట్రోఫీ-2013, టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన జట్లలో కోహ్లి సభ్యుడు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్న కోహ్లి తదుపరి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నాడు.బాలీవుడ్ హీరోయిన్తో పెళ్లిఇక వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను కోహ్లి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇటలీలో 2017, డిసెంబరు 11న ఈ జంట వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. విరుష్క జోడీకి తొలి సంతానంగా 2021లో కూతురు వామిక జన్మించగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో కుమారుడు అకాయ్కు ఈ జంట జన్మనిచ్చింది. చదవండి: బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. ముందుగానే ఆస్ట్రేలియాకు ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు? View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) -
డీప్ ఫేక్ బారిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్!
సినిమా ఇండస్ట్రీ వాళ్లను డీప్ ఫేక్ వదలడం లేదు. రష్మిక డీప్ ఫేక్ వీడియో అప్పట్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ నటి అలియా భట్ మరోసారి డీప్ఫేక్ బాధితురాలిగా మారింది. అలియా ముఖాన్ని మార్ఫింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఆ వీడియో మరో నటి వామికా గబ్బికి సంబంధించినదిగా తెలుస్తోంది.గత నెలలో 27న వామిక గబ్బి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఆమె ఎర్రటి చీరను ధరించి స్లీవ్లెస్ బ్లౌజ్తో కనిపించింది. తాజాగా ఆ వీడియోలో ఆలియా భట్ ఫేస్ను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ డీప్ఫేక్ వీడియోను ఇన్స్టాగ్రామ్లో ఓ నెటిజన్ షేర్ చేయగా.. కొద్ది క్షణాల్లోనే వైరల్గా మారింది.కాగా.. అలియా డీప్ఫేక్ ముప్పు బారిన పడడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది నవంబర్లో ఆమె ఫేస్ను మార్ఫ్ చేసిన వీడియో వైరలైంది. అంతుకుముందే రష్మిక మందన్న, రణవీర్ సింగ్, కత్రినా కైఫ్, నోరా ఫతేహి, అమీర్ ఖాన్, కాజోల్ లాంటి ప్రముఖ తారలు డీప్ ఫేక్ బారిన పడ్డారు. View this post on Instagram A post shared by Unfixface (@unfixface) View this post on Instagram A post shared by Wamiqa Gabbi (@wamiqagabbi) -
అందుకే ఆ రెండు నెలలు అక్కడే ఉన్నాం: కోహ్లి
రెండు నెలల పాటు ఆటకు దూరంగా.. కుటుంబానికి దగ్గరగా ఉండటం వింత అనుభూతినిచ్చిందని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అన్నాడు. తన ఇద్దరు పిల్లలతో కలిసి గడిపిన మధుర క్షణాలు వెలకట్టలేనివని పేర్కొన్నాడు. ఇప్పుడిక మళ్లీ ఆట మొదలుపెట్టానన్న కోహ్లి.. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు ఎల్లవేళలా కృషి చేస్తానని అభిమానులకు మాట ఇచ్చాడు. కాగా స్వదేశంలో ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు విరాట్ కోహ్లి దూరమైన విషయం తెలిసిందే. తన భార్య అనుష్క శర్మ ప్రసవం నేపథ్యంలో సెలవు తీసుకున్న ఈ రన్మెషీన్.. ఫిబ్రవరి 15న తమకు కుమారుడు జన్మించాడని ప్రకటించాడు. పిల్లాడికి అకాయ్గా నామకరణం చేసినట్లు వెల్లడించాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2024 ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు ఈ ఆర్సీబీ(రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) బ్యాటర్. సీఎస్కేతో జరిగిన ఆరంభ మ్యాచ్లో కేవలం 21 పరుగులకే పరిమితమైన కోహ్లి.. సోమవారం నాటి మ్యాచ్లో మాత్రం అదరగొట్టాడు. పంజాబ్ కింగ్స్తో బెంగళూరులో జరిగిన మ్యాచ్లో 49 బంతుల్లో 77 పరుగులు సాధించాడు. ఆర్సీబీని గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. 𝗙𝗹𝘂𝗲𝗻𝘁! ✨ King Kohli is off the mark in the chase and how 😎 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvPBKS | @imVkohli pic.twitter.com/mgYvM716Gs — IndianPremierLeague (@IPL) March 25, 2024 ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఆ రెండు నెలల పాటు సాధారణ జీవితం గడిపే అవకాశం వచ్చింది. అప్పుడు మేము మన దేశానికి దూరంగా.. రోడ్డు మీద నడుస్తున్నా మమ్మల్ని ఎవరూ గుర్తుపట్టని ప్రదేశంలో ఉన్నాం. కుటుంబమంతా కలిసే ఉన్నాం. అదొక వింతైన అనుభూతి. ఇద్దరు పిల్లలు ఉన్నపుడు వారితో గడిపే సమయాన్ని కూడా పెంచుకోవాలి కదా! ఏదేమైనా ఆ రెండు నెలలు మొత్తంగా ఫ్యామిలీతో ఉండేందుకు అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కచ్చితంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆ మధురానుభూతులను అస్సలు మర్చిపోలేను. ఇప్పుడిక ఆట మొదలైంది. కచ్చితంగా నా బెస్ట్ ఇస్తానని ప్రామిస్ చేస్తున్నా’’ అని కోహ్లి పేర్కొన్నాడు. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ అనంతరం ఈ మేరకు వ్యాఖ్యానించాడు. కాగా ఆర్సీబీ తదుపరి శుక్రవారం నాటి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. కాగా కోహ్లి- అనుష్క శర్మ దంపతులకు తొలి సంతానంగా కూతురు వామిక జన్మించిన సంగతి తెలిసిందే. -
వామికతో కలిసి రెస్టారెంట్ లో విరాట్ కోహ్లి
-
Virat Kohli: ఇక ఇండియా హాయిగా నిద్రపోతుంది!
Virat Kohli And Anushka Sharma Son Akaay: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి- బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మల కుటుంబంలోకి మరో కొత్త సభ్యుడు వచ్చాడు. తమ గారాలపట్టి వామికకు చిట్టి తమ్ముడినిచ్చింది విరుష్క జంట. ఈ నేపథ్యంలో క్రీడా, సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి ఈ జోడీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘అకాయ్.. మీ అందమైన కుటుంబంలో అడుగుపెట్టిన అత్యంత విలువైన వ్యక్తి. శుభాకాంక్షలు విరాట్, అనుష్క. ప్రకాశించే చంద్రుడన్న అర్థం గల తన పేరు లాగే అతడు.. మీ ప్రపంచాన్ని సంతోషం, అందమైన జ్ఞాపకాలతో నింపేయాలి. లిటిల్ చాంప్.. ఈ ప్రపంచంలోకి నీకు స్వాగతం’’ అని విరుష్కను విష్ చేశాడు. ఇండియా హాయిగా నిద్రపోతుంది ఇక కోహ్లి ప్రాతినిథ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ తమదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపింది. ‘‘ఇప్పుడు నలుగురు సభ్యులు.. అనుష్క, విరాట్లకు కంగ్రాట్స్. ఆర్సీబీ కుటుంబంలోకి అకాయ్ను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అత్యంత సంతోషకరమైన వార్త ఇది. ఈరోజు ఇండియా మొత్తం హాయిగా నిద్రపోతుంది’’ అని ఆర్సీబీ ట్వీట్ చేసింది. అదే విధంగా ముంబై ఇండియన్స్ సహా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్, బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్ముఖ్ తదితరులు విరుష్కను విష్ చేశారు. ఫిబ్రవరి 15న జననం కాగా గత గురువారమే తన భార్య అనుష్క శర్మ మగబిడ్డకు జన్మనిచ్చినట్టు, కుమారుడికి ‘అకాయ్’గా నామకరణం చేసినట్లు కోహ్లి సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ‘ఫిబ్రవరి 15న మా జీవితాల్లోకి వామిక సోదరుడు అకాయ్ వచ్చాడు. ఈ సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాం. ఈ ఆనందకర క్షణాల్లో మీ దీవెనలు మాకు కావాలి. మా ఏకాంతాన్ని గౌరవించండి’ అని కోహ్లి విజ్ఞప్తి చేశాడు. కోహ్లి, అనుష్కకు 2017 డిసెంబర్లో వివాహం కాగా... 2021 జనవరిలో కూతురు వామిక పుట్టింది. వ్యక్తిగత కారణాలతోనే కోహ్లి ప్రస్తుతం ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్కు పూర్తిగా దూరమయ్యాడు. అయితే, సిరీస్కు దూరంగా ఉండటానికి గల అసలు కారణం వెల్లడికాకపోవడంతో విరాట్ తల్లికి అనారోగ్యం, అనుష్క ప్రెగ్నెన్సీలో ఇబ్బందులు అంటూ వివిధ రకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఈమేరకు ట్వీట్ చేయడం గమనార్హం. చదవండి: Shoaib Malik’s 3rd wife: షోయబ్ మాలిక్ భార్యకు చేదు అనుభవం Congratulations to Virat and Anushka on the arrival of Akaay, a precious addition to your beautiful family! Just like his name lights up the room, may he fill your world with endless joy and laughter. Here's to the adventures and memories you'll cherish forever. Welcome to the… https://t.co/kjuoUtQ5WB — Sachin Tendulkar (@sachin_rt) February 20, 2024 ❤️ pic.twitter.com/BgpfycayI4 — Virat Kohli (@imVkohli) February 20, 2024 -
Happy Birthday Vamika : విరాట్ కోహ్లి కూతురు వామికా బర్త్డే.. క్యూట్ ఫొటోలు
-
మ్యాచ్ తిలకించేందుకు అహ్మదాబాద్కు అనుష్క శర్మ
బాలీవుడ్నటి అనుష్క శర్మ మరోమారు గర్భం దాల్చిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ సందర్భంగా ఒక వీడియో వైరల్గా మారింది. అందులో అనుష్కశర్మ బేబీ బంప్ స్పష్టంగా కనిపించింది. అనుష్కకు సంబంధించి తాజా వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ఆమె గుజరాత్లోని అహ్మదాబాద్ చేరుకోవడం కనిపిస్తుంది. ఈ వీడియోలో ఆమెతో పాటు కుమార్తె వామికా కోహ్లీ కూడా ఉంది. ఒక అభిమాని షేర్ చేసిన ఈ వీడియోలో మొదట వామికా కోహ్లీ, తరువాత అనుష్క శర్మ ప్రైవేట్ విమానం నుంచి తెల్లటి సూట్లో బయటకు వస్తున్న దృశ్యం కనిపిస్తుంది. ఈ వీడియోను షేర్ చేసిన యూజర్..‘ఫైనల్ మ్యాచ్ కోసం అనుష్క శర్మ కుమార్తె వామికాతోపాటు అహ్మదాబాద్ చేరుకున్నారు’ అని రాశారు. కాగా ఈ వీడియో వైరల్గా మారింది. అయితే ఈ వీడియో ఎప్పటిది? అనేది స్పష్టం కా లేదు. నవంబర్ 19న భారత్- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇది కూడా చూడండి: భారత్-ఆసీస్ ఫైనల్ పోరు.. హెడ్ టూ హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయంటే? Anushka Sharma has arrived at Ahmedabad for the finals with Vamika #INDvsAUS #WorldcupFinal#AUSvsSA #SAvsAUS #CWC23#ViratKohli𓃵 #RohithSharma#NarendraModiStadium#anushkasharmapic.twitter.com/U0FsYm6TDs — 𝑴𝑺 𝑭𝑶𝑶𝑻𝑪𝑹𝑰𝑪 ⚽🏏 (@IFootcric68275) November 18, 2023 -
మరోసారి గుడ్న్యూస్ చెప్పనున్న అనుష్క- కోహ్లీ.. ఆ రోజే ఫిక్స్
టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ, బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్కశర్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎవరి రంగంలో వారు అగ్రగామిగానే ఉన్నారు. వీరిద్దరి ప్రొఫెషన్ వేరు అయినా మొదట ఓ యాడ్ షూట్ ద్వారా పరిచయం ఏర్పడినట్లు వారు చెప్పారు. అలా మొదలైన స్నేహం ఆ తర్వాత ప్రేమికులుగా మారారు. అప్పట్లో వారిద్దరి మధ్య ఎన్నో రూమర్స్ వచ్చినా వాటిని లెక్కచేయకుండా 2017లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. అప్పటికే వారిద్దరూ కూడా కెరీర్లో టాప్ ప్లేస్లో ఉన్నారు. (ఇదీ చదవండి; Hariteja: నటి హరితేజ విడాకులు.. వైరల్గా మారిన ఆమె కామెంట్) విరాట్ సీక్రెట్స్ను తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఫ్యాన్స్ను అనుష్క ఫిదా చేస్తే... విరాట్ కూడా పలు ఇంటర్వ్యూలలో అనుష్కను ఆట పట్టిస్తూ తమ లవ్ సీక్రెట్స్ను తెలుపుతూ ఉంటాడు. తాజాగా క్యూట్ జంట మరోసారి తల్లిందండ్రులు కానున్నారంటూ సోషల్ మీడియాలో ఒక వార్త ట్రెండ్ అవుతోంది. 2021లో ఈ జోడీకి వామిక జన్మించిన విషయం తెలిసిందే. కానీ ఆ చిన్నారి ఫొటోను ఇప్పటి వరకు సరిగ్గా వారు చూపించింది లేదు. కానీ ఈ దంపతులిద్దరూ పాపతో పలు ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసినా అందులో పాప ముఖం కనిపించకుండా జాగ్రత్త పడేవారు. ఈ క్రమంలో తాజాగా విరాట్, అనుష్క తమ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పనున్నారని తెలుస్తోంది. త్వరలో తమ రెండో సంతనానికి సంబంధించిన వార్తను తమ అభిమానులకు షేర్ చేయనున్నారని సమాచారం. అనుష్క ప్రస్తుతం ప్రెగ్నెంట్గా ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే తాము మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నామని అదికారికంగా విరుష్క జంట ప్రకటించలేదు. నవంబర్ 5న విరాట్ పుట్టినరోజు ఉంది. బహుశా ఆ సందర్భంగా తమ అభిమానులకు ఈ శుభవార్తను చెప్తారని తెలుస్తోంది. (ఇదీ చదవండి: నా ప్రధాని మోదీతో పాటు ఆయనకూ కృతజ్ఞతలు: విశాల్) -
బాలీవుడ్లోకి కీర్తీ సురేష్.. దర్శకుడిగా అట్లీ
వరుణ్ ధావన్ హీరోగా తమిళ దర్శకుడు కాలిస్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తీ సురేష్, వామికా హీరోయిన్స్గా నటిస్తున్నారని బాలీవుడ్ సమాచారం. ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ ముంబైలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ చిత్రీకరణ అక్టోబరు రెండో వారం వరకూ సాగుతుందట. వరుణ్, కీర్తీ కాంబోలో కొన్ని భావోద్వేగ సన్నివేశాలతో పాటు, వరుణ్తో ఓ యాక్షన్ సీక్వెన్స్ను ప్లాన్ చేశారట కాలిస్. కీర్తీసురేష్కు బాలీవుడ్లో ఇదే తొలి చిత్రం. ఈ సినిమాను దర్శకుడు అట్లీ నిర్మిస్తున్నారు. అయితే అట్లీ దర్శకత్వంలోని తమిళ హిట్ ‘తేరీ’ హిందీ రీమేక్గా ఈ చిత్రం తెరకెక్కుతోందనే టాక్ కూడా బాలీవుడ్లో విని పిస్తోంది. -
నా సర్వస్వం నువ్వే.. ఎప్పుడూ నీ చేయి వీడను: కోహ్లి ట్వీట్ వైరల్
Virat Kohli- Anushka Sharma: టీమిండియా స్టార్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తాత్కాలిక కెప్టెన్ విరాట్ కోహ్లి తన సతీమణి అనుష్క శర్మపై ప్రేమను చాటుకున్నాడు. భార్య పుట్టినరోజు సందర్భంగా.. ‘‘నా సర్వస్వం నువ్వే’’ అంటూ అందమైన ఫొటోలతో విషెస్ తెలిపాడు. కాగా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్కు జంటగా ‘‘రబ్ నే బనాదీ జోడీ’’ సినిమాతో తెరంగేట్రం చేసింది అనుష్క. అనతికాలంలోనే బీ-టౌన్లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఆమె.. 2013లో ఓ కమర్షియల్ యాడ్ సందర్భంగా టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లిని కలిసింది. ఈ క్రమంలో ప్రేమలో పడిన విరుష్క.. నాలుగేళ్ల పాటు డేటింగ్ చేసింది. ఈ క్రమంలో 2017లో ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్తో ఒక్కటైంది. వీరికి 2021లో కూతురు వామిక జన్మించింది. దేవుడే కలిపాడు.. జోడీ అంటే ఇలాగే ఉండాలి అన్నట్లుగా.. విరాట్ కోహ్లి- అనుష్క శర్మ కపుల్ గోల్స్ సెట్ చేయడంలో ముందుంటారు. క్రికెటర్గా కోహ్లి, నటిగా అనుష్క తమ తమ రంగాల్లో బిజీగా ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితానికి కూడా తగిన ప్రాధాన్యం ఇస్తారు. కోహ్లి మ్యాచ్ ఆడిన ప్రతిసారి అనుష్క స్టేడియానికి వచ్చి అతడిని ఉత్సాహపరుస్తుంది. కోహ్లి సైతం భార్య షూటింగ్లతో బిజీగా ఉన్నపుడు ఆమెకు తగిన స్పేస్ ఇస్తూనే.. వీలు చిక్కినప్పుడల్లా విహారయాత్రలకు తీసుకువెళ్తూ ఉంటాడని వారి సోషల్ మీడియా పోస్టుల ద్వారా వెల్లడవుతూ ఉంటుంది. నీ చేయి వీడను ఈ క్రమంలో మే 1న అనుష్క శర్మ 35వ పుట్టినరోజును పురస్కరించుకుని కోహ్లి ఆత్మీయ ట్వీట్ చేశాడు. ‘‘ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను నీ చేయి వీడను. ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా నీకు నేను తోడుంటాను. నీతోపాటు నీకున్న అలవాట్లను కూడా అంతే ప్రేమిస్తాను. నా సర్వస్వానికి పుట్టినరోజు శుభాకాంక్షలు’’ అంటూ అనుష్కపై ప్రేమను కురిపించాడు. ఈ సందర్భంగా అనుష్క శర్మకు సంబంధించిన ఫొటోలను కోహ్లి పంచుకున్నాడు. ఈ నేపథ్యంలో భార్యను ఉద్దేశించి కోహ్లి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. దంచి కొడుతున్న కోహ్లి ఇదిలా ఉంటే.. కోహ్లి ప్రస్తుతం ఐపీఎల్-2023తో బిజీగా ఉన్నాడు. అనూహ్య పరిస్థితుల్లో ఫాఫ్ డుప్లెసిస్ స్థానంలో తాత్కాలిక కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు కోహ్లి. ఇక బ్యాటర్గానూ అదరగొడుతున్న ఈ రన్మెషీన్ ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్లలో కలిపి 333 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 82 నాటౌట్. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్లలో నాలుగింట మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. చదవండి: ఆసియా కప్ రద్దు? పాక్కు దిమ్మతిరిగే షాక్.. బీసీసీఐ మాస్టర్ ప్లాన్!? Love you through thick, thin and all your cute madness ♾️. Happy birthday my everything ❤️❤️❤️ @AnushkaSharma pic.twitter.com/AQRMkfxrUg — Virat Kohli (@imVkohli) May 1, 2023 -
RCB VS CSK: హాయ్ విరాట్ అంకుల్.. వామికను డేట్కు తీసుకెళ్లొచ్చా..?
చెన్నై-ఆర్సీబీ జట్ల మధ్య నిన్న (ఏప్రిల్ 17) జరిగిన మ్యాచ్ సందర్భంగా చిన్నస్వామి స్టేడియంలో ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. స్టాండ్స్లో ఓ పిల్లాడు.. హాయ్ విరాట్ అంకుల్.. వామికను డేట్కు తీసుకెళ్లొచ్చా అని రాసివున్న ప్లకార్డును పట్టుకుని కనిపించాడు. ఈ దృశ్యం సోషల్మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు. అభం శుభం తెలియని చిన్నారి గురించి ఇలాంటి మెసేజ్లు ఏంటనీ జనాలు చీదరించుకుంటున్నారు. కొందరేమో.. పిల్లాడికి ఏం తెలుసు.. ఆ చిన్నారి బుద్ధిలేని తల్లిదండ్రులే ఇలా చేయించి ఉంటారని అంటున్నారు. ఇంకొందరేమో.. జనాల దృష్టిని ఆకర్శించేందుకు కొందరు ఇలాంటి చిల్లర పనులు చేస్తుంటారని లైట్గా తీసుకుంటున్నారు. మెజారిటీ శాతం ఆ చిన్నారి తల్లిదండ్రులపై మండిపడుతున్నారు. పెంపకంలో లోపం ఉంటే ఈ పిల్లాడి భవిష్యత్తు ఏంటని ఆందోళన చెందుతున్నారు. వామిక లాగే ఈ చిన్నారి కూడా అభం శుభం తెలియదని.. ఇలా చేసినందుకు అతని తల్లిదండ్రులను బొక్కలొ వేయాలని ఘాటుగా రెస్పాండ్ అవుతున్నారు. కుటిల మనస్తత్వం గల కొందరేమో.. సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ దృశ్యానికి అసభ్యకరమైన మెసేజ్లు పెడుతూ రాక్షసానందం పొందుతున్నారు. కాగా, టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి-బాలీవుడ్ స్టార్ నటి అనుష్క శర్మల గారాల పట్టి వామిక అన్న విషయం అందరికీ తెలిసిందే. 2021లో వామిక జన్మించిన నాటి నుంచి మీడియాతో పాటు సినీ, క్రీడాభిమానుల కళ్లన్నీ ఈ చిన్నారిపైనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం కొందరు ప్రబుద్దులు ఉచ్చరణకు రాని భాషలో వామికపై దారుణమైన ట్రోల్స్ చేశారు. తాజాగా ఇంచుమించు అలాంటిదే ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతోంది. ఇదిలా ఉంటే, చెన్నై సూపర్ కింగ్స్తో నిన్న (ఏప్రిల్ 17) జరిగిన రసవత్తర పోరులో లోకల్ జట్టు ఆర్సీబీ 8 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై.. డెవాన్ కాన్వే (45 బంతుల్లో 83; 6 ఫోర్లు, 6 సిక్సర్లు), శివమ్ దూబే (27 బంతుల్లో 52; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేయగా.. ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 218 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. ఛేదనలో డుప్లెసిస్ (33 బంతుల్లో 62; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), మ్యాక్స్వెల్ (36 బంతుల్లో 76; 3 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడినప్పటికీ, స్వల్ప వ్యవధిలో ఇద్దరూ ఔట్ కావడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. -
Virat Kohli: వామికాతో ఫొటో షేర్ చేసిన కోహ్లి! క్షణాల్లోనే..
Virat Kohli- Vamika: బిజీ బిజీగా గడిపే టీమిండియా స్టార్, ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లి తన గారాలపట్టి వామికాకు సమయం కేటాయించాడు. స్విమ్మింగ్పూల్లో తన చిన్నారి కూతురితో సేద తీరుతున్న ఫొటోను మంగళవారం పంచుకున్నాడు. నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్న ఫొటో క్షణాల్లోనే వైరల్గా మారింది. కాగా ఐపీఎల్-2023లో బెంగళూరు వేదికగా ఆర్సీబీ- లక్నో మధ్య మ్యాచ్ జరిగింది. తప్పని ఓటమి సొంత మైదానంలో ఆడిన ఈ మ్యాచ్లో ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. అయితే, హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఆఖరికి బై రూపంలో పరుగు రావడంతో లక్నో విజయం ఖరారైంది. దీంతో డుప్లెసిస్ బృందానికి రాహుల్ సేన చేతిలో ఓటమి తప్పలేదు. ఇక ఈ మ్యాచ్లో 44 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేశాడు. సెలబ్రిటీ ఇమేజ్కు దూరం ఇదిలా ఉంటే.. సోమవారం నాటి మ్యాచ్ ముగించుకున్న కోహ్లి తనకు దొరికిన కాస్త విరామం కూతురితో గడిపాడు. కాగా 2017లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మను కోహ్లి పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ జంటకు జనవరి 2021లో కూతురు వామిక జన్మించింది. అయితే, విరుష్క జంట మాత్రం ఇంతవరకు వామిక ఎలా ఉంటుందో అభిమానులకు చూపించలేదు. తమ కూతురిని సెలబ్రిటీ ఇమేజ్కు ముఖ్యంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలని భావిస్తున్నట్లు ఇప్పటికే కోహ్లి- అనుష్క అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తన పూర్తి రూపాన్ని చూపించనప్పటికీ ఆమెతో గడిపిన అద్భుత క్షణాలను ఇలా కెమెరాలో బంధిస్తూ అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటారు. చదవండి: అప్పుడేమో నోరు మూయాలన్నాడు! తర్వాత కోహ్లితో ఇలా.. గంభీర్ ఫొటో వైరల్ ❤️ pic.twitter.com/veANraaUBC — Virat Kohli (@imVkohli) April 11, 2023 -
ప్రకృతి ఒడిలో.. వామికాను ఆటలాడిస్తూ.. విరుష్క ఫొటోలు వైరల్
Virat Kohli- Anushka Sharma: న్యూజిలాండ్తో టీ20 సిరీస్ నేపథ్యంలో తనకు లభించిన విరామ సమయాన్ని పూర్తిగా కుటుంబానికే కేటాయించాడు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి. భార్య అనుష్క శర్మ, కూతురు వామికతో కలిసి ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్లాడు. ఈ సందర్భంగా రిషికేశ్లో స్వామి దయానంద్ ఆశ్రమాన్ని సందర్శించిన విరుష్క జోడి.. తర్వాత ‘సాహసయాత్ర’కు బయల్దేరింది. PC: Anushka Sharma Instagram ప్రకృతిని ఆస్వాదిస్తూ తమ గారాల పట్టి వామికాతో కలిసి విరాట్- అనుష్క రిషికేశ్ కొండల్లో ట్రెక్కింగ్ చేశారు. అడుగడుగునా తారసపడిన ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ.. తేటతెల్లంగా ఉన్న నీటిలో వామికాను ఆటలాడిస్తూ మురిసిపోయారు. PC: Virat Kohli Instagram దారిలో తమను రంజింపచేసిన ఆవులు, మేకలు.. పూర్వకాలం నాటి ఇళ్లతో కూడిన పల్లె వాతావరణాన్ని ఎంజాయ్ చేశారు. బిడ్డను భుజాన వేసుకుని కోహ్లి నడుస్తుండగా.. అనుష్క ఫొటోలు క్లిక్మనిపించింది. ఇందుకు సంబంధించిన చిత్రాలను విరాట్ కోహ్లి, అనుష్క శర్మ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. PC: Anushka Sharma Instagram తదుపరి టెస్టు సిరీస్లో.. కాగా న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో తొలి రెండు మ్యాచ్లలో 8, 11 పరుగులు మాత్రమే చేసిన కోహ్లి.. మూడో వన్డేలో 36 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ ద్విశతకం, శతకంతో చెలరేగిన వేళ తన స్థాయికి తగ్గట్లు రాణించడంలో ఈ రన్మెషీన్ విఫలమయ్యాడు. PC: Anushka Sharma Instagram ఇక టీ20 సిరీస్ నేపథ్యంలో సెలక్టర్లు విశ్రాంతినివ్వగా.. ఫిబ్రవరి 9 నుంచి ఆస్ట్రేలియాతో ఆరంభం కానున్న టెస్టు సిరీస్తో విరాట్ కోహ్లి మళ్లీ మైదానంలో దిగనున్నాడు. చదవండి: Ind Vs NZ: ఏదైతేనేం.. హార్దిక్ అలా! సూర్య ఇలా!... ఎన్నో మార్పులు.. భావోద్వేగానికి లోనైన ‘స్కై’ Ind Vs NZ 3rd T20: అతడిని కొనసాగించాల్సిందే.. పృథ్వీ షాను ఆడించండి! -
అనుష్కను దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు, ఎందుకంటే..
బాలీవుడ్ నటి అనుష్క శర్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ ఎదుర్కొంటోంది. తన కూతురు వామిక ఫొటోలను తీస్తున్న మీడియాపై అనుష్క అసహనం వ్యక్తం చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆమె తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. కాగా సెలబ్రెటీ కపుల్ అనుష్క-విరాట్ కోహ్లిలు ఇప్పటి వరకు తమ కూతురిని మీడియాకు చూపించకుండా జాగ్రత్త పడుతున్న సంగతి తెలిసిందే. వామిక పుట్టి ఏడాదిన్నర అవుతున్న ఇప్పటి వరకు కూతురు ఫొటోలు రివీల్ చేయలేదు ఈ జంట. చదవండి: ఆదిపురుష్ టీజర్: రావణుడిగా సైఫ్ లుక్పై ట్రోల్స్, వివరణ ఇచ్చిన డైరెక్టర్ దీంతో ఇంకా ఎంతకాలం దాస్తారు అంటూ ఫ్యాన్స్, నెటిజన్లు వీరిని ట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా కూతురు వామికతో కలిసి విరుష్కలు ఎయిర్పోర్టులో దర్శనమిచ్చారు. వారిని చూసిన మీడియా తమ కెమెరాలకు పని చెప్పారు. అయితే ఇప్పుడు కూడా వారు వామికను మీడియా కంట పడకుండ జాగ్రత్త పడుతున్నారు. అయినప్పటి మీడియా ఫొటోలు తీస్తుండటంతో అనుష్క శర్మ వారి వంక అసహనంగా చూసింది. ‘ఏం చేస్తున్నారు, ఏంటీ?.. ఫొటోలు ఆపండి’ అన్నట్లు మీడియాపై ఆమె అసహనం చూపించింది. అయితే వామిక ఫొటోలు తీయడం లేదు అని అనడంతో ఆమె కాస్తా కూల్ అయ్యింది. చదవండి: ‘పెళ్లి సందD’ హీరోయిన్ శ్రీలీల తల్లిపై కేసు అనంతరం భర్త విరాట్తో కలిసి కెమెరాకు ఫోజులు ఇచ్చింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు విరుష్కలపై గుర్రుమంటున్నారు. ‘ఇంకా ఎంతకాలం వామికను చూపించకుండ దాస్తారు’, ‘అనుష్కకు ఇంత యాటిట్యూడ్ అవసరమా.. ఆమె యాటిట్యూడ్ చూపిస్తుంటే మీరేందుకు ఇంకా వారి వెనకాల పడుతున్నారు. వారి కూతురు ఫొటోలు తీయడం ఆపండి’, విరాట్ నువ్వు అయిన చెప్పొచ్చు కదా మేడంకి యాటిట్యూడ్ తగ్గించుకోమని’ , ‘ఎందుకు వాళ్ల వెంట పడుతున్నారు.. సాధారణ వ్యక్తుల్లాగే వారిని వదిలిలేయండి.. అప్పుడు తెలుస్తుంది వాళ్లకి’ అంటూ కామెంట్స్ చేస్తూ అనుష్కను ట్రోల్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Voompla (@voompla) -
Vamika: వామిక ఫొటోలు వైరల్.. స్పందించిన కోహ్లి...
దక్షిణాఫ్రికాతో టీమిండియా మూడో వన్డే సందర్భంగా విరాట్ కోహ్లి గారాల పట్టి వామికా కెమెరా కంటికి చిక్కిన సంగతి తెలిసిందే. కోహ్లి సతీమణి అనుష్క శర్మ చేతుల్లో కేరింతలు కొడుతున్న చిన్నారి స్క్రీన్పై కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. వెంటనే ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎట్టకేలకు వామిక పాపను చూశామంటూ కొందరు సంబరపడిపోగా.... బ్రాడ్కాస్టర్ ఇలా చేయడమేమిటని మరికొందరు మండిపడ్డారు. విరుష్క కోరినట్లుగా వామిక విషయంలో గోప్యతకు భంగం కలిగించకుండా ఉండాల్సిందని.. ఇలా చేయడం సరికాదని ట్రోల్ చేశారు. ఈ క్రమంలో చాలా మంది ఫొటోలను డిలీట్ చేయగా... కొన్ని వార్తా సంస్థలు సైతం తమ ఆర్టికల్స్లో వామిక ఫొటో కనబడకుండా జాగ్రత్తపడ్డాయి. ఇక ఈ విషయంపై విరాట్ కోహ్లి తాజాగా స్పందించాడు. వామిక ఫొటోలు బయటకు వచ్చిన విషయం తమకు తెలియదని.. ఏదేమైనా వాటిని షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు.. ‘‘నిన్న మైదానంలో మా కుమార్తె ఫొటోలు తీసిన విషయం తెలిసింది. నిజానికి కెమెరా మా మీద ఉందని తెలియదు. ఒకవేళ వామిక ఫొటోలు షేర్ చేయనట్లయితే మీ అందరికీ కృతజ్ఞతలు. అందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాం’’ అని అనుష్కతో కలిసి కోహ్లి ప్రకటన విడుదల చేశాడు. కాగా మూడో వన్డేలో కోహ్లి అర్ధ సెంచరీతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అనుష్క- వామిక నవ్వులు చిందిస్తూ కెమెరాకు చిక్కారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే ఆఖరి వరకు పోరాడిన టీమిండియా 4 పరుగుల తేడాతో ఓటమి పాలై వైట్వాష్కు గురైంది. చదవండి: Ind Vs Sa 3rd ODI: రాహుల్ చక్కగా కెప్టెన్సీ చేశాడు.. ఇదో కనువిప్పు: ద్రవిడ్ View this post on Instagram A post shared by KOHLI & NUSHKIE < 3 (@virushkafandom_) -
Viral Video: దక్షిణాఫ్రికాతో మూడో వన్డే.. లైవ్లో కనిపించిన కోహ్లి కుమార్తె
Vamika First Photo Goes Viral: దక్షిణాఫ్రికాతో మూడో వన్డే సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కుమార్తె వామికా లైవ్లో దర్శనమిచ్చింది. స్టాండ్స్లో తల్లి అనుష్క శర్మ చేతుల్లో ఉండగా కెమెరా కంటికి చిక్కింది. ఈ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతున్నాయి. ఇందులో వామిక ముఖం స్పష్టంగా కనిపించకపోవడంతో అభిమానులు నిరాశ పడుతున్నారు. కాగా, కోహ్లి దంపతులు మొదటి నుంచి చిన్నారి వామిక ముఖాన్ని మీడియా కంట పడకుండా జాగ్రత్త పడుతున్న సంగతి తెలిసిందే. కోహ్లి-అనుష్క దంపతులకు వామిక.. గతేడాది జనవరి 11న జన్మించింది. She is soo soo cute🥺❤️This one is for the baby❤️#ViratKohli #vamika #INDvsSAF pic.twitter.com/IyEvvSicqd— Ananya Sharma (@Theananyasharma) January 23, 2022 చదవండి: "కోహ్లిని బలవంతంగా తప్పుకునేలా చేశారు.." పాక్ మాజీ బౌలర్ సంచలన వ్యాఖ్యలు -
శతక్కొట్టి కూతురికి బర్త్ డే గిఫ్ట్ ఇద్దామనుకున్నాడు.. కానీ..!
Vamika First Birth Day: దక్షిణాఫ్రికాతో మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 223 పరుగులకే ఆలౌటై నిరాశపరిచింది. కెప్టెన్ కోహ్లి(201 బంతుల్లో 79; 12 ఫోర్లు, సిక్స్) ఓంటరి పోరాటం చేయడంతో భారత్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. రెండేళ్లకుపైగా శతక దాహంతో ఉన్న కోహ్లి ఈ మ్యాచ్లో ఎలాగైనా సెంచరీ మార్క్ను అందుకుంటాడని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూశారు. అయితే, వారికి మరోసారి నిరాశే ఎదురైంది. 33 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజ్లోకి వచ్చిన కోహ్లి ఎంతో ఓపికగా ఇన్నింగ్స్ను నిర్మించినప్పటికీ, మరో ఎండ్లో వరుసగా వికెట్లు పడుతుండడంతో ఒత్తిడికి లోనై 211 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్గా వెనుదిరిగాడు. కాగా, తన వ్యక్తిగత జీవితంలో చాలా ప్రత్యేకమైన ఈ రోజున సెంచరీ మార్కును అందుకోవాలని కోహ్లి సైతం ఎంతో పట్టుదలగా కనిపించాడు. అయితే, రబాడ అద్భుతమైన బంతితో కోహ్లిని బోల్తా కొట్టించాడు. ఇదిలా ఉంటే, కోహ్లి వ్యక్తిగత జీవితంలో ఇవాళ ప్రత్యేకమైన రోజు. తన గారాల పట్టి వామిక ఇవాళ మొదటి పుట్టిన రోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా కూతురికి శతకం సాధించి స్పెషల్ గిఫ్ట్ ఇద్దామని కోహ్లి భావించాడు. అయితే, అతని ఆశలు అడియాశలు అయ్యాయి. చాలా కాలంగా ఊరిస్తున్న సెంచరీ మైలరాయి కోసం కోహ్లి మరో ఇన్నింగ్స్ వరకు వేచి చూడాల్సి ఉంది. కాగా, విరాట్ కోహ్లి-అనుష్క శర్మ దంపతులకు గతేడాది జనవరి 11న వామిక జన్మించిన సంగతి తెలిసిందే. వామిక ఫోటోను సైతం కోహ్లి దంపతులు ఇప్పటివరకు బయటి ప్రపంచానికి తెలీనివ్వకపోవడం విశేషం. చదవండి: 'తగ్గేదేలే' డైలాగ్తో అదరగొట్టిన టీమిండియా ఓపెనర్ -
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి గారాల పట్టి వామిక బర్త్డే స్పెషల్
-
Virat Kohli: ఒక్కో ఇన్స్టా పోస్టుకు 5 కోట్లు... మరి వామిక ఫొటోకు..
సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత సెలబ్రిటీలు.. వారి అభిమానులకు మరింత చేరువయ్యే అవకాశం లభించింది. ట్విటర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి ప్రధాన సామాజిక మాధ్యమాల్లో ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన అప్డేట్లు పంచుకోవడం సులువైంది. తద్వారా ఫ్యాన్స్ను అలరించడంతో పాటు అదనపు ఆదాయాన్ని ఆర్జించే మార్గం కూడా దొరికింది. యాడ్స్, ప్రమోషన్స్తో చేతినిండా సంపాదిస్తున్నారు. రోజురోజుకూ ఫాలోవర్లను పెంచుకుంటూ.. ఒక్కో పోస్టుకు కోట్లాది రూపాయాలు వసూలు చేసే ప్రముఖులు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా ఫొటో, వీడియో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ వారిపై కాసుల వర్షం కురిపిస్తోంది. మరి క్రీడా విభాగానికి సంబంధించి ఇన్స్టా పోస్టులతో అత్యధికంగా సంపాదించిన, గతేడాది టాప్-20లో ఉన్న సెలబ్రిటీల్లో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఒక్కడికే చోటు దక్కింది. కోహ్లి ఒక్కో పోస్టుకు సుమారు 680,000 డాలర్లు(మన కరెన్సీలో దాదాపు 5.08 కోట్లు) అందుకుంటున్నాడు. మరి వామిక ఫొటోకు... ఇక ఇప్పటి వరకు తన ఆట, యాడ్స్.. ప్రమోషన్లు... భార్య, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మతో ఉన్న ఫొటోలు షేర్ చేసిన కోహ్లి... తన గారాల పట్టి వామిక ఫొటోను మాత్రం రివీల్ చేయలేదు. జనవరి 11 వామిక తొలి పుట్టిన రోజు నేపథ్యంలో ఇప్పటికైనా చిన్నారి రూపాన్ని తమకు చూపిస్తాడని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లి గారాల పట్టి వామిక ఫొటోలకు కోట్లలో లైకులు రావడం ఖాయమని, ఫాలోవర్లు కూడా భారీగా పెరుగుతారంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా కోహ్లికి ఇన్స్టాగ్రామ్లో ఇప్పటివరకు 177 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక చివరిసారిగా తన తల్లి పుట్టినరోజు సందర్భంగా ఆమెతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశాడు కోహ్లి. ప్రస్తుతం అతడు దక్షిణాఫ్రికా టూర్లో ఉన్నాడు. గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన కోహ్లి.. మూడో మ్యాచ్కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఒక్కో ఇన్స్టా పోస్టుతో ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రోనాల్డో 1,604,000 అమెరికన్ డాలర్లు సంపాదిస్తూ ప్రపంచంలోనే నెంబర్ వన్గా ఉన్నాడు. అతడికి 387 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇక ఫాలోవర్ల ఆధారంగా సెలబ్రిటీలు చేసే పోస్టుకు లభించే ఆదాయంలో వ్యత్యాసాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. చదవండి: Ashes: రెండేళ్ల తర్వాత రీ ఎంట్రీ.. వరుస సెంచరీలు.. యాషెస్లో అన్స్టాపబుల్ ఖవాజా! View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) View this post on Instagram A post shared by Cristiano Ronaldo (@cristiano) -
Vamika Kohli: మ..మ్మా అంటున్న వామిక.. ఫొటో కూడా షేర్ చేయండి!
టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి- బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ దంపతుల గారాల పట్టి వామిక మరికొన్ని రోజుల్లో మొదటి పుట్టినరోజు జరుపుకోబోతోంది. జనవరి 11న రెండో వసంతంలో అడుగుపెట్టబోతోంది. అయితే, ఇప్పటి వరకు ఈ చిన్నారి రూపం ఎలా ఉంటుందో చూడాలన్న విరుష్క అభిమానుల ఆశ మాత్రం తీరలేదు. ఎప్పుడెప్పుడు ఆమెను తమకు పరిచయం చేస్తారా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో... వామికతో కలిసి ఉన్న ఫొటోలను అప్పుడప్పుడు షేర్ చేసే అనుష్క.. న్యూ ఇయర్ సందర్భంగా బుజ్జాయి గొంతును ఫ్యాన్స్కు వినిపించారు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా కోహ్లి తన భార్యాబిడ్డలతో కలిసి అక్కడికి చేరుకున్న సంగతి తెలిసిందే. సెంచూరియన్లో చారిత్రాత్మక విజయం తర్వాత అనుష్క, వామికాతో కలిసి సరాదాగా గడిపాడు. ఈ క్రమంలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.. ‘‘2021లో చివరి సాయంత్రం ఎంతో అందంగా గడిచింది’’ అంటూ అనుష్క తన ఇన్స్టా స్టోరీలో ఓ వీడియో షేర్ చేశారు. ఇందులో వామిక.. మమ్మా అంటూ ముద్దుముద్దుగా పలుకుతున్న మాటలు రికార్డయ్యాయి. ఇక ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విరుష్క అభిమానులు సందడి చేస్తున్నారు. ‘‘వామికా... మమ్మా అంటోంది.. సో క్యూట్.. డాడీ అని ఎప్పుడు పిలుస్తావు మరి.. నీ రూపం చూసేందుకు మేమంతా వెయిటింగ్.. వామిక తల్లి ఫొటో షేర్ చేయండి వదినా’’ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కాగా జనవరి 3 నుంచి ఆరంభం కానున్న రెండో టెస్టుకు కోహ్లి సిద్ధమవుతున్నాడు. చదవండి: IPL 2022 Auction: ఆంధ్రా క్రికెటర్కు వేలంలో మంచి ధర పలకడం ఖాయం! View this post on Instagram A post shared by Anushka Sharma ❤️💫 (@anushkasharma.instaa) -
Virat Kohli: ‘చిట్టితల్లి... నాన్న గెలిచాడోచ్’... వీడియో వైరల్
టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో ఘోర పరాభవం... పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీకి గుడ్బై చెప్పిన తర్వాత... వన్డే క్రికెట్ సారథ్య బాధ్యతల నుంచి తొలగింపు.. వెరసి విరాట్ కోహ్లికి దక్షిణాఫ్రికా టూర్ సవాల్గా మారింది. ముఖ్యంగా సఫారీ గడ్డపై ఒక్క టెస్టు సిరీస్ విజయం కూడా సాధించని నేపథ్యంలో ఎలాగైనా ఆ ఘనత సాధించిన కెప్టెన్గా చరిత్ర సృష్టించాలని అతడు భావించడం సహజం. ఈ నేపథ్యంలో సఫారీలకు కంచుకోటలాంటి సెంచూరియన్లో వారిని మట్టికరిపించి ఘన విజయం నమోదు చేసింది కోహ్లి బృందం. ముఖ్యంగా పేసర్లు అద్భుతంగా రాణించడంతో 113 పరుగుల తేడాతో తొలి టెస్టులో గెలుపొంది 1-0తో సిరీస్లో ముందంజలో నిలిచింది. దీంతో టీమిండియా సంబరాలు అంబరాన్నంటాయి. కెప్టెన్ కోహ్లి సైతం అంతులేని సంతోషంలో మునిగిపోయాడు. ఈ సంతోషాన్ని తన భార్యాబిడ్డలతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. కాగా తన గారాల పట్టి వామిక మొదటి పుట్టినరోజు నేపథ్యంలో కుటుంబంతో కలిసి సౌతాఫ్రికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోహ్లి సతీమణి అనుష్క శర్మ తమ ముద్దుల కూతురు వామికతో కలిసి మ్యాచ్ వీక్షించేందుకు స్టేడియానికి వచ్చారు. ఈ క్రమంలో మ్యాచ్ గెలిచిన అనంతరం కోహ్లి భార్యాబిడ్డలను చూస్తూ ‘‘గెలిచాం’’ అన్నట్లుగా సిగ్నల్స్ ఇస్తూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందుకు స్పందించిన అభిమానులు.. ‘‘డాడీ గెలిచాడు చిట్టితల్లీ... అన్నట్లు కోహ్లి భాయ్ ముఖంలో వెలకట్టలేని ఆ సంతోషం చూడండి.. నిజంగానే వామికా అదృష్టదేవత’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక వామిక జనవరి 11న తన మొదటి బర్త్డే జరుపుకోబోతున్న సంగతి తెలిసిందే. చదవండి: IND Vs SA: భారత్తో ఓటమి.. దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం! First match of vamika in the stands. Virat gesturing this to his family. God, protect them 🧿🥺 Do it for your girls, Virat! Do it for them. VC - @StarSportsIndia#ViratKohli #INDvSA #AnushkaSharma #Virushka pic.twitter.com/QyEHree6NL — Siddhi 🌻 (@Sectumsempra187) December 30, 2021 Daddy kohli waving at her princess 💗🥺#AnushkaSharma #ViratKohli #virushka pic.twitter.com/3scbHcwZJ7 — S💫 (@veenushkie) December 30, 2021 -
వాటిని పోస్ట్ చేయనందుకు మీడియాకు ధన్యవాదాలు చెప్పిన అనుష్క శర్మ
సాధారణంగా సెలబ్రిటీలలో కొందరి పిల్లలకు పుట్టగానే సెలబ్రిటీ స్టేటస్ వచ్చేస్తుంది. ఇక అప్పటి నుంచి ఆ చిన్నారులు ఏం చేసిన సోషల్మీడియాలో వైరల్గా మారుతుంటాయి. దీనికి భిన్నంగా టీమిండియా టెస్ట్ సారధి విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల ముద్దుల కూతురు వామికా కోహ్లీ అసలు ఎలా ఉంటుందని కూడా ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. పైగా ఆ చిన్నారి పుట్టినప్పటి నుంచి వామికాకు సంబందించిన ఏ ఫోటో కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు విరుష్క జంట. తాజాగా ఇందుకు సంబంధించి బాలీవుడ్ నటి అనుష్క శర్మ తన కుమార్తె వామిక ఫోటోలను ప్రచురించనందుకు మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల కోహ్లీ, అనుష్క, వామికాతో కలిసి బయటకు రాగా వామిక ఫోటోని తీశారన్న వార్తలు వచ్చాయి. దీంతో వామిక ఫోటోలను పోస్ట్ చేయకండని ఈ జంట మీడియాని అభ్యర్థించారు. దీనిపై స్పందిస్తే అనుష్క తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఈ నటి తన ఇన్స్టాగ్రామ్లో .. వామికా ఫోటోలు/వీడియోలను పోస్ట్ చేయనందుకు మీడియా వాళ్లకు కృతజ్ఞతలు తెలుపూతూ.. మేము మా చిన్నారి గోప్యతను కాపాడాలనుకుంటున్నాము. ఎందుకుంటే భవిష్యత్తులో ఆమె జీవితాన్ని స్వేచ్ఛగా జీవించడానికే మేము మీడియాకు దూరంగా ఉంచుతున్నాము. అందుకు మా వంతు కృషి చేస్తున్నాము. కాబట్టి దయచేసి ఈ విషయంలో సంయమనం పాటించాలని అనుష్క ఆ పోస్ట్లో తెలిపింది. అంతకుముందు, ముంబై నుంచి దక్షిణాఫ్రికాకు జట్టు బయలుదేరే సమయంలో వామికా ఫోటోలు తీయవద్దని విరాట్ కోహ్లీ ఫోటోగ్రాఫర్లను అభ్యర్థించాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో.. "బేబీ కా ఫోటో మాట్ లీనా (దయచేసి పాప ఫోటోలు క్లిక్ చేయకండి)" అని కోహ్లి ఆ వీడియోలో చెప్పాడు. ఏదైమైనా వామిక ప్రైవసీ విషయంలో విరుష్క జంట చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చదవండి: Sushmita Sen: సుస్మితా సేన్ ఎమోషనల్ పోస్ట్.. అందుకు 27 ఏళ్లు పట్టిందట -
Virat Kohli- Vamika: ఎట్టకేలకు మీడియా కంట పడ్డ వామికా? కోహ్లి సీరియస్!
Vamika Kohli: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి గారాల పట్టి వామికా కోహ్లి రూపం ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాప మొదటి పుట్టినరోజైనా ఆమెను తమకు చూపించండి అంటూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే, మీడియాకు ఆమెను దూరంగా ఉంచాలనుకున్న విరుష్క దంపతులు ఆమె ఫొటోను బయటకు రానివ్వడం లేదు. కానీ, పాపరాజీలు మాత్రం ఈ జంట ఎక్కడికి వెళ్తే అక్కడ పాపాయి ఫొటోను క్లిక్మనిపించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో ఎయిర్పోర్టుకు బయల్దేరుతున్న సమయంలో మరోసారి ఇలాగే చేశారు. దీంతో రంగంలోకి దిగిన కోహ్లి.. ‘‘దయచేసి.. పాప ఫొటో మాత్రం తీయకండి’’ అని మర్యాదపూర్వకంగానే స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు.. కోహ్లి హెచ్చరించే సమయానికే ఫొటోగ్రాఫర్లు.. వామిక ఫొటో క్లిక్మనిపించారంటూ కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, అందులో ఉన్నది వామికేనా అన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు. Social Media: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో కాగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో కుటుంబాలతో కలిసి సౌతాఫ్రికా వెళ్లేందుకు బీసీసీఐ అనుమతించలేదని సమాచారం. అయితే, తన ముద్దుల తనయ మొదటి పుట్టినరోజున భార్యాపిల్లలతో కలిసి సమయం గడపాలని భావించిన కోహ్లి.. ప్రత్యేక అనుమతితో వాళ్లిద్దరినీ తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే టీ20 కెప్టెన్సీని వదిలేసిన కోహ్లిని.. వన్డే సారథ్య బాధ్యతల నుంచి తప్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో కేవలం టెస్టు కెప్టెన్సీకే అతడు పరిమితమయ్యాడు. ఇక కోహ్లి నేతృత్వంలో మూడు మ్యాచ్ల సిరీస్ కోసం దక్షిణాఫ్రికాకు చేరుకున్న భారత జట్టు ఈసారి ఎలాగైన ట్రోఫీ గెలిచి సఫారీ గడ్డపై తొలి సిరీస్ విజయం నమోదు చేయాలని ఉవ్విళ్లూరుతోంది. చదవండి: Virat Kohli: 'కోహ్లి వివాదం ముగించే వ్యక్తి గంగూలీ మాత్రమే' View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
టీమిండియాకు మరో షాక్.. వన్డే సిరీస్కు అందుబాటులో ఉండనని చెప్పిన కోహ్లి!
Virat Kohli set to Miss a ODI series: దక్షిణాఫ్రికాతో త్వరలో జరగనున్న వన్డే సిరీస్కు టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి దూరం కానున్నట్లు తెలుస్తోంది. కాగా దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు టీమిండియా వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లిని తప్పించి రోహిత్ శర్మకు బీసీసీఐ బాధ్యతలు అప్పజెప్పిన సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్ తర్వాత టీ20 కెప్టెన్సీ బాధ్యతలు నుంచి తప్పుకున్న కోహ్లి.. వన్డే, టెస్ట్లకు సారధి కొనసాగుతానని తెలిపాడు. ఈ క్రమంలో అనూహ్యంగా బీసీసీఐ తీసుకున్న నిర్ణయం విరాట్ను తీవ్ర నిరాశకు గురిచేసినట్లు తెలుస్తోంది. దీంతో సాఫారీ గడ్డపై జరిగే వన్డే సిరీస్కు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరో వైపు జనవరిలో తన కుమార్తె వామిక బర్త్డే ఉండడంతో.. కోహ్లి తన కుటుంబంతో కలిసి హాలిడే ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. కాగా టెస్ట్ సిరీస్ అనంతరం జనవరి 19 నుంచి మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ జరగనుంది. అదే సమయంలో తన గారాల పట్టి వామిక తొలి పుట్టిన రోజు ఉండడంతో కోహ్లి సిరీస్ నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. అంతేగాక ఈ విషయం గురించి బీసీసీఐకి సమాచారం ఇచ్చాడని.. వన్డే సిరీస్కు తాను అందుబాటులో ఉండనని చెప్పినట్లు సమాచారం. ఓ నెటిజన్ స్పందిస్తూ.."ఇది నిజంగా వినడానికి చాలా షాకింగ్గా ఉంది. టెస్ట్ సిరీస్కు రోహిత్ దూరం కాగా, ఇప్పుడు విరాట్ కూడా వన్డే సిరీస్కు దూరం కానున్నాడు. విరాట్ తన కుటుంబంతో కలిసి హాలిడే ప్లాన్ చేసుకున్నాడు. జనవరిలో తన కుమార్తె వామికా మెదటి బర్త్డే ఉంది. అందుకే కోహ్లి వన్డేలకు దూరం ఉండాలని భావిస్తున్నాడు"అని ట్విటర్లో పేర్కొన్నాడు. కాగా గాయం కారణంగా రోహిత్ శర్మ దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్కు దూరమయ్యాడు. చదవండి: Trolls On Rohit Sharma: వైస్ కెప్టెన్ కాదు.. ముందు ఫిట్గా ఉండు.. కోహ్లితో పెట్టుకున్నావు.. ఇదో గుణపాఠం! అయినా ఆ స్కోర్లేంటి బాబూ! -
జనవరి 11, 2022.. ఆ రోజు కోహ్లికి చిరకాలం గుర్తుండిపోనుంది.. ఎందుకంటే..?
Virat Kohli To Celebrate Daughter First Birthday And 100th Test On Jan 11, 2022: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి వచ్చే ఏడాది(2022) జనవరి 11వ తేదీ ప్రత్యేకమైన రోజు కానుంది. ఆ రోజు కోహ్లి, అనుష్క దంపతుల గారాలపట్టి వామిక మొదటి జన్మదినం కావడంతో పాటు కెరీర్లో కోహ్లికి వందో టెస్ట్ కావడం విశేషం. క్రికెట్ కెరీర్తో పాటు వ్యక్తిగత జీవితంలోనూ చిరకాలం గుర్తుండిపోయే ఆ రోజు కోసం కోహ్లి సహా అతని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా ఈ ఏడాది డిసెంబర్ 26న తొలి టెస్టు ఆడనున్న భారత్.. రెండో టెస్టు వచ్చే ఏడాది జనవరి 3న, సిరీస్లో ఆఖరుదైన మూడో టెస్ట్ జనవరి 11న ఆడాల్సి ఉంది. ఇప్పటివరకు కెరీర్లో 97 టెస్ట్లు ఆడిని ఈ రన్ మెషీన్.. మరో మూడు మ్యాచ్లు ఆడితే తన కెరీర్లో మరో అరుదైన మైలరాయిని చేరుకుంటాడు.విరాట్ తన టెస్ట్ కెరీర్లో 50.65 సగటుతో 7,801 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో వారం రోజుటు వాయిదా పడిన దక్షిణాఫ్రికా పర్యటనలో టీ20 సిరీస్ వాయిదా పడగా.. టెస్ట్, వన్డే సిరీస్లు యధావిధిగా జరగనున్న సంగతి తెలిసిందే. మరోవైపు కోహ్లి తన ముద్దుల తనయ వామికకు సంబంధించిన ఫోటో కాని వీడియో కాని ఇప్పటివరకు బహిర్గతం చేయకపోవడంతో.. ఆ రోజు కోహ్లి ఖచ్చితంగా తన కూతురును ప్రపంచానికి పరిచయం చేస్తాడని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. చదవండి: అందుకే విరాట్ను ప్రపంచపు అత్యుత్తమ కెప్టెన్ అనేది: పాక్ మాజీ సారధి -
Virat kohli: కోహ్లీ కుమార్తెపై అసభ్యకర వ్యాఖ్యల కేసు.. నిందితుడికి బెయిల్
సాక్షి, హైదరాబాద్: టీ–20 ప్రపంచ కప్ మ్యాచ్లో పాకిస్తాన్పై కోహ్లీ సేన ఓటమి తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు చేసి, అరెస్టు అయిన సంగారెడ్డి వాసి రాంనగేశ్కు బెయిల్ లభించింది. ముంబైలోని మేజిస్ట్రేట్ న్యాయస్థానం షరతులతో శనివారం అతనికి బెయిల్ మంజూరు చేసింది. సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రకరణ్ ప్రాంతానికి చెందిన రాంనగేశ్ తండ్రి శ్రీనివాస్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఫిట్టర్గా పనిచేస్తున్నారు. రాంనగేశ్ కందిలో ఉన్న హైదరాబాద్ ఐఐటీ నుంచి ఉన్నత విద్యనభ్యసించాడు. బెంగళూరు కేంద్రంగా పని చేసే ఓ ఫుడ్ డెలివరీ సంస్థల్లో ఉద్యోగం చేసిన నగేశ్... ఎంఎస్ కోసం అమెరికా వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు. ప్రస్తుతం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ క్వార్టర్స్లో తల్లిదండ్రులతో కలసి ఉంటున్నాడు. ట్విట్టర్ ద్వారా అతను గతనెలలో ఈ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఈ నెల 9న ముంబై పశ్చిమ రీజియన్ సైబర్ క్రైమ్ పోలీసులు రాంనగేశ్ను అరెస్టు చేసి తీసుకువెళ్లారు. రాంనగేశ్ బెయిల్ పిటిషన్ను విచారించిన కోర్టు రూ.50 వేలకు పర్సనల్ బాండ్, అంతే మొత్తానికి సెక్యూరిటీ బాండ్ సమర్పించాలని ఆదేశించింది. నెల రోజుల వరకు ప్రతి సోమ, గురువారాల్లో ముంబై వెస్ట్ రీజియన్ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో హాజరుకావాలని షరతులు విధించింది. -
ఏ పాత్ర కూడా తనను పూర్తిగా నిర్వచించలేదంటున్న అనుష్క
బాలీవుడ్ నటి, క్రికెటర్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ జనవరి 2021లో అమ్మగా ప్రమోట్ అయ్యారు. అప్పటినుంచి ఆమె జీవితంలో ప్రతి క్షణం తన కుమార్తె వామికతో గడిపేలా చూస్తోంది. తల్లిదండ్రులుగా విరాట్, అనుష్క సోషల్ మీడియాలో తమ చిట్టి పాపాయి గ్లింప్స్ను పెడుతున్నారు. ఇటీవల ఒక మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుష్క తన జీవితంలో రూపాంతరం చెందుతున్న ఆమె గుర్తింపు గురించి చెప్పింది. గ్రాజియా ఇండియాతో జరిగిన చాట్లో వామికకు తల్లి కాకముందే తను గ్రహించిన అతిపెద్ద విషయం గురించి షేర్ చేసుకుంది. 'గత కొన్నేళ్లుగా, నేను తల్లి కాకముందే, జీవితంపై నాకున్న అతిపెద్ద అవగాహన ఏంటంటే.. మీరు మీ ఏ గుర్తింపుతో జతకట్టలేరు, ఎందుకంటే ఇది చాలా చంచలమైనది. నేను నటి, తల్లి అయినప్పటికీ ఏ పాత్ర కూడా నా గుర్తింపును పూర్తిగా మార్చలేదు. నేను ఒక నటిని, తల్లిని. ఈ రెండూ నా జీవితంలో గణనీయమైన సమయాన్ని తీసుకున్నాయి. కానీ ఏ పాత్ర కూడా నన్ను పూర్తిగా నిర్వచించలేదు. ఈ అవగాహన నాకు ఎలా వచ్చిందంటే, నా స్టార్డమ్ వల్ల వచ్చే నేనేవరో నిర్వచించే ఈ తాత్కాలిక స్వభావాన్ని నేను అనుమతించను కాబట్టి.' అని అనుష్క శర్మ తెలిపింది. ఇంకా అనుష్క మాట్లాడుతూ, 'ఇండస్ట్రీలో ఒకరిలా పని చేస్తున్నందున ఆ స్వభావం నుంచి దూరంగా ఉన్నానని అనుకున్నాను. నా దినచర్య రోజు పనికి వెళ్లడం, తిరిగి రావడం, నాతో నేను గడపడం. కానీ నేను ఒక సెలబ్రిటీని, నేను ఒక స్టార్, నా దగ్గర సక్సెస్, ప్రతిభ ఉందన్న ఆధారంగా నా స్వీయ విలువను నేను నిర్వచించుకుంటున్నాను అని నాకు అర్థమైంది. అది నాకు అసాధారణంగా తోచింది. నేను అలాగే అనుకున్నట్లయితే ఏదో ఒక రోజు సమస్యలో చిక్కుకుపోతాను. అప్పుడు వాటినుంచి ఎదుర్కోవడం కష్టమన్న విషయాన్ని నేను గుర్తించాను.' ప్రస్తుతం అనుష్క, విరాట్లు టీ20 ప్రపంచకప్లో భాగంగా యూఏఈలో ఉన్నారు. ఈ జంట గత రెండు వారాలుగా యూఏఈలో కలిసి గడుపుతున్నారు. వామిక, ఇతర క్రికెటర్లు, వారి కుటుంబ సభ్యులతో హాలోవీన్ జరుపుకుంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనుష్క తన బ్యానర్లో వస్తున్న ప్రొడక్షన్ వెంచర్స్తో బిజీగా ఉంది. 'మై అండ్ ఖ్వాలా' ఆమె నిర్మిస్తున్న తదుపరి చిత్రం. -
వారిని క్షమించు.. జట్టును కాపాడుకో.. కోహ్లికి బాసటగా నిలిచిన రాహుల్ గాంధీ
Rahul Gandhi Tweets In Support Of Virat Kohli: టీ20 ప్రపంచకప్-2021లో దాయాది పాకిస్థాన్ చేతిలో ఘోర పరాజయం అనంతరం భారత పేసర్ మహ్మద్ షమీని టార్గెట్ చేస్తూ.. కొందరు దురభిమానులు సోషల్మీడియా వేదికగా అసభ్యకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా మంది ప్రస్తుత, మాజీ క్రికెటర్లతో పాటు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సైతం షమీకి అండగా నిలిచాడు. అయితే, కోహ్లి.. షమీకి అండగా నిలబడటాన్ని జీర్ణించుకోలేని కొందరు దుర్మార్గులు విరుష్క దంపతుల గారాలపట్టి వామికను ఉద్దేశించి సోషల్మీడియా వేదికగా అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. Dear Virat, These people are filled with hate because nobody gives them any love. Forgive them. Protect the team. — Rahul Gandhi (@RahulGandhi) November 2, 2021 ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ టీమిండియా కెప్టెన్కు బాసటగా నిలిచారు. కోహ్లి సంపూర్ణ మద్దతు తెలుపుతూ ట్విటర్ వేదికగా స్పందించారు. 'డియర్ విరాట్.. కొందరు మనుషులు పూర్తిగా ద్వేషంతో నిండిపోయి ఉంటారు. ఎందుకంటే వారికి ఎవ్వరూ ప్రేమను పంచరు. వాళ్లను క్షమించు. జట్టును కాపాడుకో' అంటూ మంగళవారం ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరలవుతోంది. కాగా, అభం శుభం తెలియని చిన్నారి వామికను టార్గెట్ చేస్తూ అసభ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని నెటిజన్లు ఖండిస్తున్నారు. ఆటగాళ్లు రాణించకపోతే వారి కుటుంబసభ్యులను దూషించడం, వారిని టార్గెట్ చేయడం మంచిది కాదని హితవు పలుకుతున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోహ్లికి అండగా నిలబడటాన్ని పలువురు అభినందిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ అంశంపై మహిళా కమీషన్ ఇవాళ ఢిల్లీ పోలీసులకు నోటీసులు పంపింది. కేసుకు సంబంధించిన పురోగతిపై ఆరా తీసింది. నిందితులను త్వరలోనే పట్టుకోవాలని ఆదేశించింది. కోహ్లి కుటుంబానికి బెదిరింపులు వచ్చినట్లు మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా సుమోటో కేసు నమోదైంది. చదవండి: Virat Kohli- Vamika: కోహ్లి కూతురిపై విషం చిమ్మిన నెటిజన్.. ఛీ ఇంతకు దిగజారుతారా? -
Virat Kohli- Vamika: కోహ్లి కూతురిపై విషం చిమ్మిన నెటిజన్.. ఛీ ఇంతకు దిగజారుతారా?
Troll On Virat Kohli Daughter: భారత్లో క్రికెట్కు ఉన్నంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెటర్లను దేవుళ్లలా ఆరాధించే వీరాభిమానులు కోకొల్లలు. ఆరాధ్య ఆటగాళ్లు గెలిస్తే.. దానిని తమ విజయంగా భావించడం సహా.. ఓడినపుడు వారికి మద్దతుగా నిలిచి అభిమానం చాటుకుంటారు. కానీ కొంతమంది ‘‘అభిమానం’’ పేరిట వెర్రి వేషాలు వేస్తూ.. హద్దులు దాటి కామెంట్లు చేస్తూ నీచపు బుద్ధిని బయటపెట్టుకుంటారు. జట్టు ఓడితే దానిని ఓ ఒక్కరికో పరిమితం చేసి విషం చిమ్ముతారు. సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఈ విపరీత ధోరణి మరింత ఎక్కువైంది. టీ20 వరల్డ్కప్-2021 టోర్నీలో టీమిండియా వరుస పరాజయాల నేపథ్యంలో కెప్టెన్ విరాట్ కోహ్లి భార్యాబిడ్డలను ఉద్దేశించి చేసిన కామెంట్లే ఇందుకు నిదర్శనం. ఈ మెగా ఈవెంట్లో తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో కనీవిని ఎరుగని రీతిలో భారత్ 10 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అదే విధంగా... అక్టోబరు 31 నాటి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో 8 వికెట్ల తేడాతో పరాజయం పాలై... సెమీస్ చేరే అవకాశాలను దూరం చేసుకుంది. ఈ నేపథ్యంలో కివీస్తో ఓటమి అనంతరం కొంతమంది నెటిజన్లు విరాట్ కోహ్లి- అనుష్క శర్మ దంపతుల చిన్నారి కూతురు వామికాను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. సిగ్గు పడు అనుష్క... వామికా ఫొటోలు ఎప్పుడెప్పుడు బయటపెడతారా అని చూస్తున్నాం. అలా అయితేనే కదా తనను గుర్తించి ...... దాడి చేయగలం అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ ట్వీట్ ఓ అమ్మాయి పేరిట.. అది కూడా దాయాది దేశపు క్రికెట్ జెర్సీలో ఉన్న ఫొటో ఉండటం గమనార్హం. దీంతో ఆ అకౌంట్ పాకిస్తాన్కు చెందిన యూజర్ అని కొంతమంది కామెంట్ చేస్తుండగా.. బూమ్ వెబ్సైట్ మాత్రం ఇది అబద్ధమని తేల్చింది. ఫాక్ట్చెక్లో భాగంగా.... సదరు యూజర్ భారత్కు చెందిన వారేనని పేర్కొంది. ఈ విషయం గురించి ట్విటర్ ప్రతినిధులను సంప్రదించినట్లు పేర్కొంది. కాగా పాకిస్తాన్తో ఓటమి నేపథ్యంలో కొంతమంది మహ్మద్ షమీని ఉద్దేశించి ట్రోల్ చేయగా... సచిన్, సెహ్వాగ్ సహా కోహ్లి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే కోహ్లి కూతురుపై ఈ రకంగా విషం చిమ్మారని తెలుస్తోంది. ఏదేమైనా ఆటను ఆటలా చూడకుండా.. గెలుపోటములు సహజం అని తెలుసుకోకుండా.. వ్యక్తిగతంగా ఆటగాళ్లపై మాటల దాడి చేయడం సరికాదని నిజమైన అభిమానులు అంటున్నారు. కాగా విరుష్క దంపతులకు ఈ ఏడాది జనవరిలో కూతురు వామిక జన్మించగా.. ఆమె ఫొటోలను ఇంతవరకు రివీల్ చేయలేదు. చదవండి: ధోని, రవిశాస్త్రి మధ్య ఏం జరిగింది.. కోహ్లినే కారణమా! -
Virushka: వామికా విషయంలో ఓవరాక్షన్!
ఢిల్లీ: సెలబ్రిటీల వ్యక్తిగత వ్యవహారంపై మీడియా చొరవతో జనాలకు ఆసక్తి పెరగడం.. అదే టైంలో తమ ప్రైవసీని గౌరవించండంటూ సెలబ్రిటీలు రిక్వెస్టులు చేస్తుండడం తెలిసిందే. అయితే తాజాగా విరాట్ కోహ్లీ-అనుష్క విషయంలో ఇలాంటి వివాదమే ఒకటి చెలరేగింది. కూతురి ముఖం మీడియా కంటపడకుండా అనుష్క జాగ్రత్త పడగా.. కొందరు ఆమె తీరును తప్పుబడుతున్నారు. మరోవైపు ఫొటోజర్నలిస్టుల తీరుపైనా సోషల్ మీడియాలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంగ్లాండ్ టూర్ కోసం ముంబైలో 14 రోజుల క్వారంటైన్లో ఉన్న టీమిండియా ప్లేయర్, స్టాఫ్, క్రికెటర్ల ఫ్యామిలీ మెంబర్స్ బుధవారం రాత్రి ఇంగ్లండ్ బయలుదేరారు. ఈమేరకు విరాట్ కోహ్లి, అనుష్క శర్మ తమ కూతురు వామికతో కలిసి ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న ఫొటోలు వైరల్గా మారాయి. ఈ క్రమంలో ఫొటో జర్నలిస్టుల కంట తన బిడ్డ ముఖం పడకుండా వామికా ముఖాన్ని గట్టిగా అదిమిపట్టుకుని లోపలకి వెళ్లింది అనుష్క. దీంతో.. విరుష్క జోడీపై కొందరు నెటిజన్స్ మండిపడుతున్నారు. కనీసం బిడ్డకు ఊపిరి పీల్చుకునే స్వేచ్ఛనైనా ఇవ్వూ అంటూ కామెంట్లు పెడుతున్నారు. #TeamIndia pic.twitter.com/mhmyJFc0H8 — BCCI (@BCCI) June 2, 2021 ముందే చెప్పినా కూడా.. అయితే తమ కూతురి విషయంలో విరుష్కలు ముందే ఓ నిర్ణయం తీసుకున్నారు. ఇన్స్టాగ్రామ్ ‘ఆస్క్ మీ’ సెషన్లో విరాట్.. సోషల్ మీడియా అంటే ఏమిటో అర్థం చేసుకునే వరకు, ఆమె సొంతంగా ఆలోచించే వరకు మా బిడ్డను సోషల్ మీడియాకు బహిర్గతం చేయకూడదని, దూరంగా ఉంచాలను మేము నిర్ణయించుకున్నాం”అని తేల్చి చెప్పాడు. ఈ స్టేట్మెంట్ ప్రముఖంగా అన్ని మీడియా హౌజ్లకు చేరింది. అయినా కూడా ఫొటో జర్నలిస్టులు అత్యుత్సాహం ప్రదర్శించి వాళ్ల ప్రైవసీకి భంగం కలిగించారనే విమర్శ కూడా సోషల్ మీడియాలో వినిపిస్తోంది. చదవండి: మాట తప్పిన కోహ్లీ! ఏం చేశాడంటే.. -
బిడ్డతో ఎయిర్ పోర్టులో కోహ్లీ దంపతులు
-
ఏందిది కోహ్లీ.. ఇంకెన్నాళ్లు దాచి పెడతావ్!
గాంధీనగర్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ-అనుష్క శర్మలు ఈ ఏడాది తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. పాప పుట్టి ఇప్పటికి రెండు నెలలకు పైగానే అయినప్పటికి తనకు సంబంధించి ఇంత వరకు ఒక్క ఫోటో కూడా షేర్ చేయలేదు కోహ్లీ దంపతులు. బిడ్డను ఎత్తుకుని ఉన్న ఫోటోలను షేర్ చేశారు తప్ప.. పాప పూర్తిగా కనిపించేలా ఉన్న ఒక్క ఫోటోను కూడా ఇప్పటి వరకు షేర్ చేయలేదు. వామికా ఫోటో కోసం దంపతులిద్దరి ఫ్యాన్స్ చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కోహ్లీ-అనుష్క దంపతులు ఆదివారం బిడ్డతో కలిసి అహ్మాదాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. ఇంగ్లండ్తో జరగబోయే మూడు వన్డే మ్యాచ్ల కోసం ఈ జంట భారత క్రికెట్ జట్టులోని ఇతర ఆటగాళ్లతో కలిసి పుణెకు వెళ్లడం కోసం అహ్మాదాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ ఫోటోల్లో విరాట్ లగేజ్ తీసుకెళ్తుండగా.. అనుష్క శర్మ బేబీ వామికాను ఎత్తుకుని ఉన్నారు. చిన్నారిముఖం కనిపించకుండా కవర్ చేశారు అనుష్క. ఇక వీరితో పాటు మరో జంట హర్దిక్ పాండ్యా దంపతులు కూడా తమ బేబీ అగస్త్యతో కలిసి విమానాశ్రయంలో కనిపించారు. ఇక కోహ్లీ దంపతుల ఫోటోలు చూసిన నెటిజనులు మరో సారి నిరాశకు గురయ్యారు. ‘‘ఏందిది కోహ్లీ భయ్యా.. ఇంకెన్నాళ్లు నీ చిన్నారిని దాచి పెడతావ్.. ఒకసారి వామికాను మాకు కూడా చూపించు’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. ఇంగ్లండ్తో ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్ను భారత్ 3–2తో గెలుచుకున్న విషయం తెలిసిందే. చదవండి: అనుష్క, కూతురు ఫోటోతో కోహ్లి భావోద్వేగం -
అనుష్క, కూతురు ఫోటోతో కోహ్లి భావోద్వేగం
సెలబ్రిటీ కపుల్స్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ముందు వరుసలో ఉంటారు. విరుష్క జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయాలనూ తెలుసుకోవాలనే ఉత్సుకత అభిమానుల్లో ఉంటుంది. ఇక ఇటీవల విరాట్, అనుష్కలకు పాప జన్మించడంతో తరుచుగా వార్తలో నానుతున్నారు. తొలిసారి తల్లిదండ్రులు అవ్వడంతో ఆనందంలో మునిగి తేలుతున్నారు. తాజాగా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. కూతురు వామికాను ఎత్తుకున్న అనుష్క ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా మహిళందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ భావోద్వేగానికి లోనయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన కుటుంబం ఫోటోను షేర్ చేసిన కోహ్లి.. ‘పిల్లల పుట్టుకను చూడటం అనేది గొప్ప అనుభూతి. మాటల్లో వర్ణించలేని అదో అద్భుతమైన అనుభవం. దాన్ని ఎవరైనా ప్రత్యక్షంగా చూసిన తరువాత మహిళల నిజమైన బలం, దైవత్వాన్ని అర్థం చేసుకుంటారు. దేవుడు వారి కడుపులో మరో జీవితాన్ని సృష్టించాడు. ఎందుకంటే వారు పురుషుల కంటే బలంగా ఉన్నారు కాబట్టే. నా జీవితంలో ఇది మరిచిపోలేని విషయం. నా కూతురు కూడా ఆమె తల్లిలా ఎదుగుతుందని భావిస్తున్నాను. ప్రపంచంలోని అద్భుతమైన మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.’ అని ఎమోషనల్ అయ్యారు. View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) కాగా ఒక యాడ్ షూటింగులో పరిచయమైన విరాట్, అనుష్క తర్వాత ప్రేమికులుగా మారారు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి 2017 డిసెంబర్ 11న ఇటలీలో వివాహం చేసుకున్నారు. ఈ జంటను ‘విరుష్క’ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునేవారు. అనుష్క శర్మ, కోహ్లీకి జనవరి 11 న కుమార్తెకు జన్మనిచ్చారు. ఈ సంతోషకరమైన వార్తను విరాట్ తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. పాపాయి పుట్టిన 21 రోజుల అనంతరం అనుష్క తన మొదటి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి చిన్నారి పేరును వెల్లడించింది. విరాట్-అనుష్క తన కూతురుకు వామికా అని నామకరణం చేశారు. చదవండి: అనుష్క సెల్ఫీ: ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్ -
కోహ్లి వీరాభిమాని కూతురు పేరు తెలుసా?
సాక్షి, వరంగల్ : టీమిండిమా కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడో వీరాభిమాని. ఎనిమిది నెలలు ఆగి కోహ్లి కూతురికి పెట్టిన పేరునే తన కూతురికి పెట్టాడు. వివరాలు.. రాయపర్తి మండలం, మైలారం శివారు తండాకి చెందిన బానోత్ సంతోష్.. విరాట్ కోహ్లికి వీరాభిమాని. సంతోష్ దంపతులకు గత సంవత్సరం జూన్ 15న అమ్మాయి పుట్టింది. అయితే విరాట్ కోహ్లి- అనుష్క దంపతులకు పుట్టబోయే బిడ్డకు పెట్టే పేరునే తన కూతురికి కూడా పెట్టుకోవాలని అతడు నిశ్చయించుకున్నాడు. అప్పటినుంచి ఎనిమిది నెలలు వేచి చూశాడు. ఈ రోజు(సోమవారం) కోహ్లి దంపతులు తమ బిడ్డకు ‘'వామికా’గా నామకరణం చేయటంతో.. సంతోష్ తన కూతురుకి కూడా ‘వామిక’ అనిపేరు పెట్టాడు. చదవండి : తొలిసారి కూతురి ఫొటో షేర్ చేసిన ‘విరుష్క’ -
మూడోసారి
మలయాళ హీరో పృథ్వీరాజ్ ప్రొడక్షన్లో ఆయనే హీరోగా రూపొందుతోన్న భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘9’. ‘100 డేస్ ఆఫ్ లవ్’ ఫేమ్ జీనస్ మొహమద్ దర్శకుడు. ఈ సినిమాలో హీరోయిన్గా వామికా గబ్బి నటిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి మమతా మోహన్దాస్ కూడా యాడ్ అయ్యారు. ‘అన్నీ’ అనే కీలక పాత్రలో మమతా మోహన్దాస్ ఈ చిత్రంలో కనిపించనున్నారు. పృథ్వీరాజ్తో మమత యాక్ట్ చేయడం ఇది మూడోసారి. ఆల్రెడీ ‘అన్వర్, సెల్యులాయిడ్’ సినిమాల్లో వీళ్లిద్దరూ కలిసి యాక్ట్ చేశారు. ప్రస్తుతం హిమాలయాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానుంది. -
వదలిపోలేని...ప్రేమ
‘7/జి బృందావన్ కాలనీ’ వంటి బ్లాక్బస్టర్కి దర్శక త్వం వహించిన శ్రీరాఘవ కథ, స్క్రీన్ప్లే అందించిన చిత్రం ‘నన్ను వదలి నీవు పోలేవులే’. బాలకృష్ణ కోలా, వామిక జంటగా దర్శకురాలు గీతాంజలీ శ్రీరాఘవ నిర్దేశకత్వంలో కోలా భాస్కర్, కంచర పార్థసారథి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 1న ఈ చిత్రం రిలీజ్. ‘‘చక్కని ప్రేమకథ ఇది. తమిళంలో మంచి విజయం సాధించింది. అమృత్ స్వరపరచిన పాటలకు మంచి స్పందన వచ్చింది. శ్రీరాఘవ కథ, స్క్రీన్ప్లే ఇందులో హైలైట్. తెలుగు ప్రేక్షకుల్ని కూడా అలరించే చిత్రమిది’’ అని నిర్మాతలు అన్నారు. ఈ చిత్రానికి కెమేరా: శ్రీధర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె. మణికుమార్. -
అందుకే... బాలకృష్ణ పేరు ఉంచేశాం!
- నిర్మాత కోలా భాస్కర్ ‘‘మా అబ్బాయి స్క్రీన్ నేమ్ క్రిష్ అని పెడదామనుకున్నా. డెరైక్టర్ శ్రీ రాఘవగారికి నచ్చలేదు. మా అబ్బాయి నందమూరి బాలకృష్ణగారికి పెద్ద ఫ్యాన్. వాడికి ఆయన పేరు అంటే ఇష్టం కావడంతో కోలా బాలకృష్ణ అనే ఉంచేశాం. ఖర్చుకు వెనకాడకుండా సినిమా తెరకెక్కించడానికి పార్థసారథి గారు అందించిన సహకారం మరువలేనిది’’ అని చిత్ర నిర్మాత కోలా భాస్కర్ తెలిపారు. బాలకృష్ణ కోలా, వామిక జంటగా బీప్టోన్ స్టూడియోస్, శ్రీకామాక్షీ మల్టీమీడియా ఎంటర్టైన్మెంట్స్పై ‘గీతాంజలి’ శ్రీరాఘవ దర్శకత్వంలో కోలా భాస్కర్, కంచర్ల పార్థసారథి నిర్మించిన చిత్రం‘నన్ను వదలి నీవు పోలేవులే’. అమృత్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్లో విడుదల చేశారు. హీరోయిన్ వేద పాటల సీడీ విడుదల చేసి చిత్ర కథానాయిక వామికకు అందించారు. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ- ‘‘కోలా భాస్కర్గారు ఎడిటర్గా అందరికీ తెలుసు. తమిళంలో ఈ సినిమా మంచి విజయం సాధించింది. లవ్ సబ్జెక్ట్గా తెరకెక్కిన ఈ చిత్రం ఇక్కడా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘‘7జి బృందావన్ కాలనీ’కి దర్శకత్వం వహించిన శ్రీరాఘవ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే అందించారు. ఆ చిత్రం లాగానే ‘నన్ను వదలి నీవు పోలేవులే’ మంచి విజయం సాధించాలి’’ అని నిర్మాత సురేశ్ కొండేటి అన్నారు. చిత్ర దర్శకుడు ‘గీతాంజలి’ శ్రీ రాఘవ, దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య, నిర్మాతలు సీవీ రెడ్డి, బీఏ రాజు, హీరోయిన్ పూనమ్ కౌర్, పాటల రచయిత అనంత శ్రీరాం పాల్గొన్నారు. -
ఒక్క హిట్ వస్తే మా బావ స్టారే!
‘‘కొన్ని రోజుల ముందు యూట్యూబ్లో టీజర్ చూశా. కొత్తగా ఉందనిపించింది. ఇప్పుడు ప్రచార చిత్రం చూశా. బాగా నచ్చింది. ఇవాళ ప్రేక్షకులు కొత్తదనాన్నే కోరుకుంటున్నారు’’ అని హీరో మహేశ్బాబు అన్నారు. సుధీర్బాబు, వామిక జంటగా 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో విజయ్కుమార్, శశిధర్ నిర్మించిన చిత్రం ‘భలే మంచి రోజు’. సన్నీ ఎం.ఆర్. స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని మహేశ్బాబు ఆవిష్కరించి హీరో రానాకు అందించారు. ఈ సందర్భంగా మహేశ్ మాట్లాడుతూ -‘‘చిత్ర దర్శకుడి కాన్ఫిడెన్స్ నచ్చింది. సుధీర్ను అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. సుధీర్ అంటే నాకు ఇష్టం. ఎందుకంటే హార్డ్ వర్కింగ్ పర్సన్. ఒక మంచి హిట్ పడితే, స్టార్ అయిపోతాడు. ఈ సినిమాతో ఆ హిట్ వస్తుందని అనుకుంటున్నా’’ అని అన్నారు. ‘‘ఈ సినిమా రిలీజ్ రోజున ప్రేక్షకులకు ‘భలే మంచి రోజు’ అవుతుంది’’ అని రానా వ్యాఖ్యానించారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘సినిమా చేయడం అనే నా కల ఈ చిత్రంతో తీరింది. నేనీ రోజు ఇక్కడ ఉన్నానంటే కారణం నా తల్లిదండ్రులే. యూనిట్ అందరం ఇష్టపడి చేసిన సినిమా ఇది’’ అన్నారు. హీరో సుధీర్బాబు, పరుచూరి గోపాలకృష్ణ పాల్గొన్న ఈ కార్యక్రమంలో అతిథులుగా రెజీనా, సందీప్ కిషన్, ‘దిల్’ రాజు, లగడపాటి శ్రీధర్, అనిల్ సుంకర, దేవా కట్టా, శ్యామ్దత్ తదితరులు పాల్గొన్నారు.