ventilator
-
ఇది కదా అసలైన ప్రేమంటే..
కర్నూలు (టౌన్): కర్నూలు అబ్బాయికి జపాన్ అమ్మాయికి ప్రేమ చిగురించింది. ఇరువురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావడంతో పరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్లితో సుఖాంతమైంది. కర్నూలు నగర శివారులోని లక్ష్మీపురంలో ఎతిక్స్ హోమ్స్లో కోరకోల కిషోర్కుమార్, కడపటింటి ప్రేమమ్మ దంపతులు నివసిస్తున్నారు. వీరి కుమారుడు కొరకోల కీర్తి కుమార్ ముంబై ఐఐటీలో చదువుకున్నాడు. మూడేళ్ల క్రితం జపాన్లో అమెజాన్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఇతనికి అదే కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న టోక్యో పట్టణానికి చెందిన మట్ సుమోటో రియోకో, మట్ సుమోటో తఢాక దంపతుల కూతురు మట్ సుమోంటో రింకతో పరిచయం ఏర్పడింది. మూడున్నరేళ్ల వీరి పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చింది. రింక అబ్బాయిని తన తండ్రికి పరిచయం చేసింది.ఇరు కుటుంబాలు అంగీకరించడంతో శనివారం కర్నూలులోని సీఎస్ఐ క్రైస్ట్ చర్చిలో పెళ్లి తంతు నిర్వహించారు. చదవండి: మాధవీలతపై వ్యాఖ్యలు..క్షమాపణ చెప్పిన జేసీ ప్రభాకర్రెడ్డి -
ఎంజీఎంలో విద్యుత్ అంతరాయం.. పేషెంట్ మృతి
హన్మకొండ: వరంగల్ ఎంజీఎం అస్పత్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ అంతరాయంతో చికిత్స పొందుతున్న ఓ పేషెంట్ మృతి చెందిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. శుక్రవారం రాత్రి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో విద్యుత్ అంతరాయంతో వెంటిలేటర్ పనిచేయక బొజ్జ బిక్షపతి (45) అనే పేషెంట్ మృతి చెందాడు. నర్సంపేట మండలం రాజేశ్వరపల్లి గ్రామానికి చెందిన బిక్షపతి ఆర్ఐసీలో చికిత్స పొందుతున్నాడు. ఆయన శ్వాస సంబంధిత వ్యాధితో ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. అయితే నిన్న (శుక్రవారం) విద్యుత్ అంతరాయంతో ఆయనకు అమర్చిన వెంటిలేటర్ కాసేపటి వరకు పనిచేసి ఆగిపోయింది. అదే సమయంలో ఎంజీఎం ఆస్పత్రి సిబ్బంది వెంటనే స్పందించి జనరేటర్ ఆన్ చేశారు. కానీ, దురదృష్టవశాత్తు ఆ జనరేటర్ పని చేయకపోవటంతో ఒక్కసారి వెంటిలేటర్ ఆఫ్ అయి రోగి బిక్షపతి మృతి చెందాడు. చదవండి: తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం -
అంతర్జాతీయస్థాయిలో ‘టిమ్స్’ నిర్వహణ
సాక్షి, హైదరాబాద్: టిమ్స్ (తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఆస్పత్రులను అంతర్జాతీయస్థాయిలో నిర్వహిస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న టిమ్స్ ఆస్పత్రుల్లో వెయ్యి పడకలు ఉంటాయని, ఎయిమ్స్(ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్), నిమ్స్(నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) తరహాలోనే ‘టిమ్స్’పనితీరు ఉంటుందన్నారు. ప్రతి ఆస్పత్రికి ప్రత్యేకంగా పాలకమండలి ఉంటుందని మంత్రి తెలిపారు. వీటన్నింటిని కలిపి ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేస్తామని, దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి చైర్మన్గా వ్యవహరిస్తారని చెప్పారు. టిమ్స్ ఆస్పత్రులకు స్వయంప్రతిపత్తి ఉంటే త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని, ప్రస్తుతం నిమ్స్కు ఈ హోదా కల్పించడంతో వేగంగా అభివృద్ధి సాధించిందన్నారు. ఆదివారం ఆయన శాసనమండలిలో ‘టిమ్స్ బిల్లు– 2023’ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో టిమ్స్ ఆస్పత్రుల ఏర్పాటుతో దాదాపు 10వేల సూపర్ స్పెషాలిటీ బెడ్స్ అందుబాటులోకి వస్తామన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణలో 10వేల బెడ్స్ మాత్రమే అందుబాటులో ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య 34వేలకు చేరిందన్నారు. అతిత్వరలో వీటి సంఖ్య 50వేలకు చేరనుందని మంత్రి సభలో వెల్లడించారు. టిమ్స్ ఆస్పత్రుల్లో 16 స్పెషాలిటీ, 15 సూపర్ స్పెషాలిటీల్లో పీజీ కోర్సులు ఏర్పాటవుతాయని, సూపర్ స్పెషాలిటీల్లో నర్సింగ్, పారామెడికల్ కోర్సులతో పాటు గుండె, మూత్రపిండాలు, లివర్, ఊపిరితిత్తులు, కేన్సర్, ట్రామా, ఎండోక్రైనాలజీ, ఎలర్జీ, రుమటాలజీ తదితర 30 విభాగాలుంటాయన్నారు. 200 మంది ఫ్యాకల్టి, 500 మంది వరకు రెసిడెంట్ వైద్యులు, 26 ఆపరేషన్ థియేటర్లు, గుండెకు సంబంధించి క్యాథ్ ల్యాబ్, కిడ్నీలకు డయాలసిస్, కేన్సర్కు రేడియేషన్, కీమోథెరపీతో పాటు సీటీస్కాన్, ఎంఆర్ఎస్ఐ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రతి ఆస్పత్రిలో 300 ఐసీయూ పడకలతోపాటు వెంటిలేటర్ బెడ్లు కూడా ప్రత్యేకంగా ఉంటాయన్నారు. మంత్రి హరీశ్ మండలిలో ప్రవేశపెట్టిన టిమ్స్ బిల్లు–2023ని సభ ఆమోదించింది. వీటితో పాటు కర్మాగారాల సవరణ బిల్లు–2023, జైనులను మైనార్టీలుగా గుర్తిస్తూ మైనార్టీ కమిషనర్ సవరణ బిల్లు, తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లు, పంచాయతీ సవరణ బిల్లుల్ని కూడా శాసనమండలి ఆమోదించింది. -
సౌండ్ వినలేక పేషెంట్ వెంటిలేటర్నే ఆపేసింది! నివ్వెరపోయిన పోలీసులు
వెంటిలేటర్పై పేషెంట్ ఉన్నాడంటే ప్రతిక్షణం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు లెక్క. ఐతే అదే గదిలో ఉన్న మరో మహిళా పేషెంట్ తన సహ పేషెంట్ వెంటిలేటర్ శబ్దాన్ని భరించలేక ఆపేసింది. దీంతో ఆమె హత్యానేరం కింద జైలుపాలైంది. వివరాల్లోకెళ్తే...72 ఏళ్ల జర్మన్ మహిళ తన రూమ్మేట్ వెంటిలేటర్ని స్విచ్ఆఫ్ చేసింది. ఆమెకి మెషిన్ శబ్ధం చికాకు కలిగించిందని ఆపేసింది. ఇలా రెండు సార్లు వెంటిలేటర్ని స్విచ్ ఆఫ్ చేసింది. ఈ ఘటన నవంబర్ 29న జర్మన్లోని మాన్హీమ్ నగరంలోని ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ఐతే వైద్యులు సదరు మహిళకి పేషెంట్కి వెంటిలేటర్ ఎంత కీలకమో చెప్పినా కూడా మళ్లీ ఆపేసిందని వైద్యులు చెబుతున్నారు. అంతేగాదు వెంటిలేటర్పై ఉన్న పేషెంట్ ప్రమాదంలో లేడని, ఇంకా ఇంటిన్సెవ్ కేర్లో ఉంచి చికిత్స అందిచాల్సి ఉండటంతో ఆ పేషెంట్ని అలా ఉంచినట్లు తెలిపారు. దీంతో పోలీసులు సదరు వృద్ధ మహిళను కావలనే ఇలా చేసి సదరు రోగిపై హత్యయత్నానికి పాల్పడి ఉండవచ్చని అనుమానించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆమెను బుధవారం న్యాయస్థానం ముందు హాజరుపరిచి జైలుకి తరలించారు. -
స్ట్రోక్తో కోమాలోకి నటి.. ఆస్పత్రిలో వెంటిలేటర్పై!
పొట్టి జుట్టు.. చందమామ లాంటి రూపంతో కనిపించే ఆ ముద్దుగుమ్మ.. మామూలు యోధురాలు కాదు. ప్రాణాంతక క్యాన్సర్ను జయించింది. అదీ ఒక్కసారి కాదు.. రెండుసార్లు!. పూర్తిగా కోలుకుని నటనలోకి మళ్లీ అడుగుపెట్టి అభిమానులను అలరిస్తోందనగా.. పిడుగులాంటి వార్త. ఆమె ఆరోగ్యం మరోసారి తిరగబడింది. ఈసారి పరిస్థితి విషమించి ప్రాణాంతక స్థితికి చేరుకుంది. ప్రముఖ బెంగాలీ నటి ఐంద్రీలా శర్మ.. చక్కని రూపం, హోమ్లీ క్యారెక్టర్లతో ఇంటిల్లిపాదిని అలరిస్తూ విశేష అభిమానుల్ని సంపాదించుకుంది. జుమూర్, భోలే, బాబా పర్ కరేగా లాంటి పలు చిత్రాలతో విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. మరోవైపు సీరియల్స్లోనూ నటిస్తూ బుల్లితెర గుర్తింపూ దక్కించుకుంది. క్యాన్సర్ సోకపోయి ఉంటే ఆమె ఖాతాలో ఇప్పటికే ఎన్నో చిత్రాలు ఉండేవే. రెండుసార్లు క్యాన్సర్ను జయించిన ఐంద్రీలా శర్మ.. తాజాగా స్ట్రోక్ రావడంతో ఆస్పత్రిలో చేరింది. క్రమంగా కోలుకుంటోందని వైద్యులు ప్రకటించడంతో.. ఆమె పరిస్థితి మెరుగుపడుతోందని అంతా భావించారు. అయితే ఆమె ఇంకా కోమాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇంట్రా సెరిబ్రల్ హెమరేజ్ కారణంగా ఆమె శరీరంలో కొంత భాగం పక్షవాతానికి గురైందని వైద్యులు అనుమానిస్తున్నారు. అంతేకాదు.. వెంటిలేటర్పై ఆమె పరిస్థితి విషమంగా ఉందని, మెదడులో అక్కడక్కడ రక్తం గడ్డకట్టిందని తెలుస్తోంది. దిగ్గజ నటి సుచిత్ర సేన్ స్ఫూర్తితో సినిమాల్లోకి అడుగుపెట్టిన ఐంద్రీలా శర్మ.. చిన్నవయసులోనే ఇలా ప్రాణాంతక స్థితికి చేరకోవడంపై బెంగాలీ ప్రేక్షకులు, ఆమె అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అద్భుతం జరిగి ఆమె కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. గతంలో కీమోథెరపీల ద్వారా, సంక్లిష్టమైన సర్జరీల ద్వారా ఆమె క్యాన్సర్ నుంచి రెండుసార్లు కోలుకున్నారు. బెంగాలీలో పలు చిత్రాలతో పాటు ఓటీటీ ప్రాజెక్టులతోనూ ఆమె అలరించారు. టీవీ షోలతోనూ అలరించిన ఈ ముద్దుగుమ్మ.. తోటి నటుడు(జుమూర్ సీరియల్లో లీడ్ పెయిర్) సవ్యసాచి చౌదరితో డేటింగ్ చేస్తోంది. క్యాన్సర్ నుంచి కోలుకుని మళ్లీ ఓటీటీ ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్న సమయంలో ఇలా ఒక్కసారిగా ఆస్పత్రి పాలైంది. ఇదీ చదవండి: వీ ఆర్ జస్ట్ ఫ్రెండ్స్: జాన్వీ కపూర్ -
Salman Rushdie: వెంటిలేటర్పై రష్దీ.. ఒక కన్ను కోల్పోయే ప్రమాదం
న్యూయార్క్: భారత మూలాలున్న ప్రముఖ రచయిత, బుకర్ బహుమతి విజేత సల్మాన్ రష్దీ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ది సతానిక్ వర్సెస్ రచన తర్వాత దశాబ్దాలుగా ఇస్లామిక్ బెదిరింపులను ఎదుర్కొంటున్న రష్దీపై ఓ ఆగంతకుడు అమెరికాలో చర్చావేదికపైనే కత్తితో విచక్షణారహితంగా దాడిచేసిన విషయం విదితమే. రక్తసిక్తమైన రష్దీకి వాయవ్య పెన్సిల్వేనియాలోని యూపీఎంసీ హ్యమాట్ సర్జరీ సెంటర్ ఆస్పత్రి వెంటిలేటర్పై అత్యవసర చికిత్స అందిస్తున్నారు. 20 సెకన్ల వ్యవధిలో ఆగంతకుడు వెనుక 15 సార్లు కత్తితో పొడిచినట్లు తెలుస్తోంది. ‘గంటలపాటు ఆయనకు శస్త్రచికిత్స కొనసాగింది. మెడ భాగంలో కత్తిపోట్ల కారణంగా మెడ నుంచి చేతిలోకి వచ్చే నరాలు తెగిపోయాయి. ఒక కన్ను కోల్పోయే ప్రమాదం ఉంది. పొత్తికడుపుపై కత్తిగాటుతో కాలేయం దెబ్బతింది’ అని సల్మాన్ రష్దీ ప్రతినిధి ఆండ్రూ విలే న్యూయార్క్ టైమ్స్ వార్తాసంస్థతో చెప్పారు. పశ్చిమ న్యూయార్క్లోని చౌటాకా ఇన్స్టిట్యూట్లో రష్దీపై దాడి చేసిన వ్యక్తిని 24 ఏళ్ల హదీ మతార్గా గుర్తించారు. అతడిపై హత్యాయత్నం, దాడి సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. 150 ఏళ్ల చరిత్రలో తొలి దారుణం ‘150 ఏళ్ల లాభాపేక్షలేని విద్యా సంస్థ చరిత్రలో ఇలా దాడి జరగడం ఇదే తొలిసారి’ అని చౌటౌకా ఇన్స్టిట్యూట్ అధ్యక్షుడు మైఖేల్ హిల్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. సంస్థలో జరిగే కార్యక్రమాలకు భద్రత పెంచాలంటూ గతంలోనే విజ్ఞప్తులు వచ్చాయన్న వార్తలను ఆయన కొట్టేపారేశారు. అయితే, కార్యక్రమ నిర్వాహకులు అక్కడ ఎలాంటి సెక్యూరిటీ సెర్చ్ చేయలేదని, మెటల్ డిటెక్టర్లు లేవని, బ్యాగుల తనిఖీ విధానం లేదని ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పడం గమనార్హం. ‘ఇరాన్ నేత అయోతొల్లా హత్య ఆదేశాలిచ్చినా రష్దీ తన స్వేచ్ఛా గళాన్ని వినిపించారు. ఈ కష్టకాలంలో రష్దీ ధైర్యాన్ని, అంకిత భావాన్ని వేనోళ్లా పొగడాల్సిన సమయమిది’ అని కౌంటర్ ఎక్స్ట్రీమిజమ్ ప్రాజెక్ట్ సీఈవో మార్క్ వ్యాఖ్యానించారు. ఉగ్రసంస్థల ఆర్థికమూలాలను దెబ్బతీయాలంటూ కౌంటర్ ఎక్స్ట్రీమిజమ్ ప్రాజెక్ట్ అనే లాభాపేక్షలేని ప్రభుత్వేతర సంస్థ పనిచేస్తోంది. దాడిపై ఇరాన్ మౌనం రష్దీని చంపాలంటూ దాదాపు దశాబ్దం క్రితం దేశ సుప్రీం లీడర్ అయోతొల్లా ఇచ్చిన ఫత్వాను ఇన్నాళ్లకు ఓ ఆగంతకుడు అమలుకు యత్నించాడన్న వార్తలపై ఇరాన్ పెదవి విప్పలేదు. ‘ఫత్వాను అమలుచేసే ప్రయత్నం జరిగింది’ అంటూ పొడిపొడిగా ఒక ప్రకటనను మాత్రం శనివారం ఇరాన్ అధికారిక మీడియా వెలువరించింది. ‘ ఇలాంటి ఘటనలు ఇరాన్ను అంతర్జాతీయ సమాజం నుంచి దూరం చేస్తాయి’ అని ఇరాన్ మాజీ దౌత్యవేత్త మాషల్లా సెఫాజదీ అన్నారు. దాడిపై వెల్లువెత్తిన నిరసనలు ఘటనను భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడిగా సాహిత్యలోకం అభివర్ణించింది. రచయితల గొంతు నొక్కే, హింసాత్మక, అణచివేత ధోరణులపై ముక్తకంఠంతో తమ తీవ్ర నిరసనను వ్యక్తంచేశారు. అత్యంత హేయమైన చర్యగా బుకర్ ప్రైజ్ విజేత, రచయిత్రి గీతాంజలి శ్రీ వ్యాఖ్యానించారు. నీల్ గైమన్, అమితవ్ ఘోష్, స్టీఫెన్ కింగ్, జీన్ గెరీరో తదితరులు దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు. రష్దీ త్వగా కోలుకోవాలని కోరుకున్నారు. జాగర్నాట్ బుక్స్, పెంగ్విన్ రాండమ్ హౌస్ ఆఫ్ ఇండియా వంటి పలు పబ్లిషింగ్ సంస్థలూ ఘాటుగా స్పందించాయి. ఎవరీ హదీ మతార్? న్యూజెర్సీలోని ఫెయిర్వ్యూ ప్రాంతంలో మతార్ నివసిస్తున్నాడు. మతార్ ఎందుకు దాడి చేశాడనే కారణాలను వెతికే పనిలో అమెరికా ఎఫ్బీఐ, స్థానిక దర్యాప్తు సంస్థలు నిమగ్నమయ్యాయి. ‘ఘటనాస్థలిలోని బ్యాక్ ప్యాక్, ఎలక్ట్రానిక్ వస్తువులు తదితరాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు సెర్చ్ వారెంట్ తీసుకునే పనిలో అధికారులు ఉన్నారు. దాడి ఘటన వెనుక ఎవరూ ఉండకపోవచ్చని, మతార్ ఒక్కడికే ఇందులో ప్రమేయముందని అధికారులు ప్రాథమికంగా విశ్వసిస్తున్నారు. లెబనాన్ మూలాలున్న మతార్ నేర చరిత్రపై వివరాలు సేకరిస్తున్నాం’ అని పోలీస్ ట్రూప్ కమాండర్ మేజర్ ఎజీన్ జె. స్టాన్జ్యూస్కీ చెప్పారు. అయితే, అతని సామాజిక మాధ్యమాల ఖాతాలను పరిశీలించగా కొన్ని విషయాలపై స్పష్టత వచ్చింది. షియా ఉగ్రవాదులకు ముఖ్యంగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్కు మతార్ సానుభూతిపరుడని తెలుస్తోందని దర్యాప్తులో భాగంగా ఉన్న ఒక ఉన్నతాధికారి ఎన్బీసీ న్యూస్తో చెప్పారు. మతార్ వాడుతున్న సెల్ఫోన్ మెసేజింగ్ యాప్లో ఇరాన్ కమాండర్ ఖాసిమ్ సులేమానీ ఫొటోను దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. సులేమానీ ఇరాన్లో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్కు సైన్యాధికారిగా ఉన్నాడు. రష్దీ రాసిన రచనను ఇరాన్ 1988లో నిషేధించిన విషయం తెల్సిందే. ఇంత భద్రత అవసరమా? గతంలో రష్దీ వ్యాఖ్య హత్యా బెదిరింపుల నేపథ్యంలో ఆయనకు కల్పించిన అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లపై ఒకానొక దశలో అసహనం వ్యక్తంచేశారని న్యూయార్క్ పోస్ట్ ఒక కథనం ప్రచురించింది. చెక్ రిపబ్లిక్లోని ప్రేగ్లో ఒక సారి రచయితల సదస్సు జరిగింది. ఆ కార్యక్రమానికి వచ్చిన రష్దీ మాట్లాడారు. ‘ఇంత మందితో నాకు భద్రత కల్పించడం నిజంగా అవసరమా? నాకైతే చాలా ఇబ్బందికరంగా అనిపిస్తోంది. నాకు ఇంతగా అదనపు భద్రత అవసరమని నేనెప్పుడూ అడగలేదు. గతంలో ఎలాంటి భద్రతా లేకుండానే ఇక్కడొకొచ్చాను. ఇప్పుడు ఇదంతా వృథా ప్రయాస. అయినా, భద్రత అవసరమైన రోజులను నేనెప్పుడో దాటేశాను’ అని ఆనాటి సభలో అన్నారు. -
దేశంలోనే తొలిసారి... కుక్కలకు వెంటిలేటర్ సౌకర్యం..
గాంధీనగర్: సాధారణంగా శునకాన్ని విశ్వాసానికి గుర్తుగా భావిస్తారు. యజమానులు కుక్కని తమ కుటుంబ సభ్యుల్లో ఒకదానిలా చూసుకుంటారు. ఒకవేళ తమ పెంపుడు కుక్కకు ఏమైనా జరిగితే యజమానులు విలవిల్లాడిపోతారు. కుక్కలు కూడా తమ యజమానిపట్ల అదే విధంగా ప్రేమను, విశ్వాసాన్ని కనబరుస్తుంటాయి. ఇక్కడ ఒక యజమాని.. తన పెంపుడు కుక్క పట్ల తన ప్రేమను గొప్పగా చాటుకున్నాడు. వివరాలు.. గుజరాత్లోని అహ్మదాబాద్ నగరానికి చెందిన శైవల్ దేశాయ్ అనే వ్యక్తి ఒక కుక్కను పెంచుకున్నాడు. అది ఏడాది క్రితం అనారోగ్యంతో చనిపోయింది. దీంతో.. శైవల్ తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. తన కుక్కకు సరైన వైద్యం దొరికితే.. బతికేదని భావించాడు. ఈ క్రమంలో తన మిత్రులతో కలిసి ఒక కొత్త ఆలోచన చేశాడు. మనిషి మాదిరిగానే కుక్కలకు కూడా వెటర్నరీ ఆస్పత్రిలో అత్యవసర విభాగాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఆ తర్వాత.. అతను కొన్నిరోజులకు అహ్మదాబాద్లో.. వెటర్నరీ బెస్ట్ బడ్స్ పెట్ పేరుతో ఆస్పత్రిని ప్రారంభించాడు. దీనిలో అన్నిరకాల సదుపాయాలతోపాటు.. వెంటిలేటర్ కూడా ఏర్పాటు చేశాడు. భారత్లో మూగజీవాలకు వెంటిలేటర్ సౌకర్యం ఉన్న తొలి ఆస్పత్రిగా ఇది రికార్డులకెక్కింది. ఈ ఆస్పత్రిలో మూగజీవాలన్నింటికి ఉచితంగా వైద్యం అందిస్తారని శైవల్ దేశాయ్ తెలిపారు. ఈ ఆస్పత్రి సీనియర్ వైద్యుడిగా దివ్వ్యేష్ కేలవాయ పనిచేస్తున్నారు. కొంత మంది కుక్కల నుంచి కరోనా సోకుతుందని పుకార్లు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిలో ఎలాంటి నిజంలేదని తెలిపారు. -
నటుడు కైకాల ఆరోగ్య పరిస్థితి మరింత విషమం
Kaikala Satyanarayana Health Condition: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో ఈ రోజు ఉదయం ఆయన అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం విషమంగా ఉండటంతో వైద్యులు వెంటిలెటర్పై చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు అపోలో వైద్యులు కైకాల ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఈ రోజు ఉదయం 7.30 గంటలకు ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యారని, ఆయన ఆరోగ్యం విషమంగానే ఉంది. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే కైకాల ఆరోగ్యం మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నామని అపోలో వైద్యులు తమ ప్రకటనలో వెల్లడించారు. చదవండి: బ్రేకప్లు, విడాకులు మన స్టార్ హీరోయిన్స్కు కలిసోచ్చాయా?! -
Corona: కొవిడ్ పేషెంట్లకు ఎమర్జెన్సీ టైంలో..
కరోనా చికిత్స సమయంలో పేషెంట్ల పరిస్థితి ఒక్కసారిగా తిరగబడిన సందర్భాలు ఉంటున్నాయి. ఆ టైంలో అప్రమత్తం అయ్యే లోపే ప్రాణాల మీదకు వస్తోంది. ఈ తరుణంలో పేషెంట్ల ప్రాణాలను కాపాడగలిగే అత్యాధునిక సాంకేతికతను రూపొందించారు భారత సంతతికి చెందిన అనంత్ మాడభూషి. ఓహియో క్లీవ్లాండ్లోని కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్సిటీలో ‘కంప్యూటేషనల్ ఇమేజింగ్ అండ్ పర్సనలైజ్డ్ డయగ్నోస్టిక్స్’ ఎక్స్పర్ట్గా అనంత్ మాడభూషి. ఈయన డెవలప్ చేసిన ఏఐ టెక్నాలజీ ఇప్పుడు కొవిడ్ పేషెంట్లకు ఎమర్జెన్సీ టైంలో ఉపయోగపడనుంది. కొవిడ్ పేషెంట్కు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది తలెత్తినప్పుడు.. ఈ ఏఐ టూల్ వెంటనే అప్రమత్తం చేస్తుంది. పేషెంట్కు వెంటిలేటర్ అవసరమని సూచిస్తుంది. తద్వారా పేషెంట్ల ప్రాణాలు కాపాడొచ్చని ఆయన చెప్తున్నారు. డీప్ లెర్నింగ్, ఏఐ టెక్నాలజీల సాయంతో ఈ టూల్ను రూపొందించారు ఆయన. అమెరికా, వుహాన్(చైనా)లో 2020లో నమోదు అయిన 900 మంది కొవిడ్ పేషెంట్ల సీటీ స్కాన్లను ఆధారం చేసుకుని ఈ టెక్నాలజీని డెవలప్ చేశారు. ‘‘ఈ టెక్నాలజీ.. కొవిడ్ 19 పేషెంట్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలో ఫిజిషియన్స్ను అప్రమత్తం చేస్తుంది. పేషెంట్కు, వాళ్ల కుటుంబ సభ్యులకు పరిస్థితి అప్డేట్ అందిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఆస్పత్రికి ఎన్ని వెంటిలేటర్స్ అవసరం అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఎర్లీ స్టేజ్లోనే గుర్తించి అప్రమత్తం చేస్తోందని, 84 శాతం సక్సెస్ రేటు చూపిస్తున్న ఈ టూల్ను త్వరలోనే వినియోగంలోకి తేనున్నామని పరిశోధకులు వెల్లడించారు. ముందుగా యూనివర్సిటీ ఆస్పత్రుల్లో, లూయిస్ స్టోక్స్ క్లీవ్లాండ్ వీఏ మెడికల్ సెంటర్లో వీటిని రియల్ టైంలో ఉపయోగించనున్నారు. క్లౌడ్ బేస్డ్ యాప్ఎమర్జన్సీ యూనిట్లకు వీటిని అనుసంధానిస్తారు. చదవండి: డ్రైవింగ్ సీట్లో నిద్ర..రోడ్డు ప్రమాదాలపై అప్రమత్తం చేసే డివైజ్ -
వెంటిలేటర్పై బిగ్బాస్ బ్యూటీ అరియానా.. ఫోటో వైరల్
Ariyana on Ventilator : బిగ్బాస్ షో అనంతరం అరియానా గ్లోరీ క్రేజ్ అమాంతం పెరిగిపోయిందన్న సంగతి తెలిసిందే. హౌజ్ నుంచి బయటకు వచ్చాక కూడా అరియానా పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదు. రీసెంట్గా ఆర్టీజీవో చేసిన ఇంటర్వ్యూతో అరియానా పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కెరీర్పై ఫోకస్ చేసిన అరియానా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ ఫోటో అభిమానులను షాక్కి గురిచేసింది. వెంటిలేటర్పై అరియానాను చూసి ఆమె ఫ్యాన్స్కి గుండె ఆగినంత పని అయ్యింది. అయితే ఇది రియల్ లైఫ్లో జరిగింది కాదు. సినిమా షూటింగ్లో భాగంగా అరియానా అలా వెంటిలేటర్పై కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను స్వయంగా అరియానా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. మెగాస్టార్ అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా చేస్తున్న సినిమాలో అరియానా ఓ రోల్లో కనిపించనున్నట్లు తెలిసిందే. షూట్లో భాగంగా వెంటిలేటర్పై కనిపించి అరియానా షాకిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. -
మా చిన్నమ్మ ఐసీయూలో ఉంది.. వెంటిలేటర్ బెడ్ కావాలి :నటి
దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కోరలు చాస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యులు సహా పలువురు సెలబ్రిటీలు కోవిడ్ బారిన పడుతున్నారు. కోవిడ్ తీవ్రత దృష్ట్యా లక్షలు వెచ్చించినా పలు ప్రాంతాల్లో వెంటిలేటర్లు, బెడ్లు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. తాజాగా బాలీవుడ్ నటి భూమి ఫడ్నేకర్కు సైతం ఇలాంటి పరిస్థతే ఎదురైంది. వెంటిలేటర్ కావాలని, ఎవరికైనా వివరాలు తెలిస్తే అందజేయాలని సోషల్ మీడియాలో విన్నవించుకుంది. 'ఇది చాలా కష్టతరమైన సమయం. డిల్లీలోని ఎన్సీఆర్ ఆసుపత్రిలో మా చిన్నమ్మ ఐసీయూ ఉంది. తక్షణమే ఆమెకు వెంటిలేటర్పై చికిత్స అందించాలి. దయచేసి మీలో ఎవరికైనా వెంటిలేటర్ బెడ్ సమాచారం తెలిస్తే ఆ వివరాలు నాకు పంపండి' అని సోషల్ మీడియాలో ఓ పోస్టును షేర్ చేసింది. కాగా భూమి ఫడ్నేకర్ షేర్ చేసిన కొద్ది గంటల్లోనే ఆమెకు సహాయం అందడంతో ఆ పోస్టును డిలీట్ చేస్తున్నట్లు పేర్కొంది. ఇక ఒక సెలబ్రిటీ అయ్యిండి భూమి ఫడ్నేకర్ లాంటి వాళ్లే వెంటిలేట్ దొరకడం లేదంటే ఇక సామాన్యుల పరిస్థితి ఇంకెలా ఉందో అర్థం చేసుకోవచ్చని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇటీవలె భూమి ఫడ్నేకర్ కరోనా నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె కరణ్ జోహార్ రూపొందిస్తున్న తఖ్త్ సినిమాలో నటిస్తుంది. She has gotten the help 🙏 Deleting tweet thank you https://t.co/NyTk8bnuKZ — bhumi pednekar (@bhumipednekar) May 3, 2021 View this post on Instagram A post shared by Bhumi 🌻 (@bhumipednekar) చదవండి : దీపికా ఫ్యామిలీని తాకిన కరోనా, ఆసుపత్రిలో ప్రకాష్ పడుకోనే యాంకర్ అనసూయ భర్త జాబ్ ఏంటో తెలుసా? -
దారుణం: వెంటిలేటర్ లేక సీనియర్ వైద్యుడు మృతి
సాక్షి,లక్నో: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో రోజుకు మూడున్నర లక్షలకుపైగా వణికిస్తోంది. రోజుకు రోజుకుపెరుగుతున్న బాధితులతో దేశ రాజధానిలో కరోనా ఉగ్రరూపాన్నిదాల్చింది. తీవ్ర ఆక్సిజన్ కొరత మృత్యు ఘంటికలను మోగిస్తోంది. అటు ఉత్తర ప్రదేశ్లో కరోనా కల్లోలం కానసాగుతోంది. ఈ క్రమంలో వెంటిలేటర్ లభ్యంకాక ఒక సీనియర్ డాక్టర్ ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రయాగ్రాజ్ ఆసుపత్రిలో 50 ఏళ్లపాటు ఎనలేని సేవలదించిన సీనియర్ సర్జన్ డాక్టర్ జెకె మిశ్రా (85) సమయానికి వెంటిలేటర్ అందుబాటులోకి రాక అదే ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కోవిడ్తో బాధపడుతున్న ఆయన భార్య, ప్రముఖ గైనకాలజిస్ట్ రామ మిశ్రా (80) కళ్లముందే ఆయన ప్రాణాలు విడిచారు. దీంతో మిశ్రా కుటుంబ సభ్యులతో పాటు, ఆసుపత్రి సిబ్బంది,ఇతరులు విచారంలో మునిగి పోయారు. అలహాబాద్లోని స్వరూప్ రాణి నెహ్రూ (ఎస్ఆర్ఎన్) ఆసుపత్రిని తరువాతి కాలంలో ప్రయాగ్రాజ్ అని పేరు మార్చారు. ఈ ఆసుపత్రిలో మొట్టమొదటి రెసిడెంట్ సర్జన్లలో మిశ్రా ఒకరు. ఆయన భార్య డాక్టర్ రామ మిశ్రా అధ్యాపక సభ్యురాలు.ఇద్దరు పదవీ విరమణ చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రాథమిక వైద్య సదుపాయాలు లేకపోవడంవల్లే తమ బంధువులను కోల్పోయామని బాధిత కుటుంబాలు ఇప్పటికే ఆరోపణలు గుప్పించాయి. దాదాపు 50 ఏళ్లపాటు విశేష సేవలందించిన మిశ్రాకు వెంటిలేటర్ దొరకక ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. ఈ నేపథ్యం సీనియర్ వైద్యులుగా తమకెదురైన భయంకరమైన అనుభవాలను మీడియాతో షేర్ చేశారు. (కోవిడ్ సంక్షోభం: సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల సాయం) ‘‘ఆ హాస్పిటల్ ఆయనకు రెండో ఇల్లు... ఈ హాస్పిటల్ తమను కాపాడుతుందని భావించాం.. కానీ కానీ అదే తాము చేసిన పెద్ద తప్పయిపోయింది. తీవ్ర అనారోగ్యంతో ఆక్సిజన్ స్థాయి లెవల్స్ పడిపోయి స్థితిలో ఏప్రిల్ 13న ఆసుపత్రిక వచ్చాం..నొప్పితో బాధపడుతూ, చికిత్స కోసం ఎదురుచూస్తూ, బెడ్స్ దొరక్క ఒక రాత్రంతా గడిపాల్సి వచ్చిందదంటూ రామ మిశ్రా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు హాస్పిటల్ సిబ్బంది మిశ్రాకోసం బెడ్ సమకూర్చారు. కానీ, నేను మాత్రం నేలపైనే పడుకున్నా. ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవు. బీపీ మానిటర్ లాంటి కనీస సౌకర్యాలు లేవు. ఆయనకు మొదటి రెండు రోజుల్లో ఇంజక్షన్లుఇచ్చారు. కానీ అవేమిటో అడిగినా చెప్పలేదు. అసలు అక్కడ రోగులను పట్టించుకునేనాధుడేలేదు.. ఈ క్రమంలో ఏప్రిల్ 16 మధ్యాహ్నం నుంచి తన భర్త పరిస్థితి అకస్మాత్తుగా క్షీణించింది. వెంటిలేటర్లో ఉంచమని వైద్యులను వేడుకున్నాను. కానీ కీలకమైన (లారింగోస్కోప్, ఎండోట్రాషియల్ (ఇటి) ట్యూబ్) పరికరాలు వెంటనే అందుబాటులో లేవు. మరోవైపు ఆయనకు విపరీతమైన దగ్గు, రక్తం పడుతోంది. క్షణ క్షణానికి పరిస్థితి విషమిస్తోంది. హాస్పిటల్ సిబ్బందిని గట్టిగా అరిచేసరికి ఆక్సిజన్ సపోర్ట్ లేకుండానే ఆయన్ను పై అంతస్తులో ఐసీయూలోకి తరలించారు. దీంతో పరిస్థితి మరింత విషమించింది. తాను పైకి వెళ్లేసరికే ఆయన ఊపిరి ఆగిపోయిందంటూ ఆమె కన్నీంటి పర్యంతమయ్యారు. రెండో ఆలోచన లేకుండా.. ఆదుకుంటుందనే ఆశతో ఈ ఆసుపత్రికి వచ్చాం...కానీ ఈ ఆసుపత్రే తన భర్త ప్రాణాలను బలి తీసుకుందంటూ ఆమె ఆవేదన వెలిబుచ్చారు. అయితే ఈ ఆరోపణలను ఆసుపత్రి యాజమాన్యం తిరస్కరించింది. 25-30 కంటే తక్కువ ఆక్సిజన్ స్థాయిలతో 500 మంది రోగులు ఉన్నారు. వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉంది. రోగులందరినీ కాపాడటానికి చేయగలిగిందంతా చేస్తున్నాం.. అన్ని రకాల వ్యాధులకు చికిత్స చేయగల సామర్థ్యం తమకు ఉందని తెలిపింది. అలాగే డాక్టర్ జెకె మిశ్రా గుండెపోటుతో మరణించారని కూడా వెల్లడిండంచింది. కాగా రికార్డు స్థాయి కేసులతో దేశవ్యాప్తంగా కరోనా సెకండ్వేవ్ ప్రకంపనలు తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. దీంతో పలువురు వైద్యులు తమ ప్రాణాలకు తెగించి మరీ కరోనా రోగులకు సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో అనేకమంది వైద్యులు,ఇతర సిబ్బంది కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే. చదవండి :ఆక్సిజన్ కొరత: సింగపూర్ భారీ సాయం పీరియడ్స్ టైంలో మహిళలు వ్యాక్సిన్ తీసుకోవచ్చా? -
వెంటిలేటర్పై ఉన్నా నీ పాడు బుద్ధి వదులుకోలేవా..
సాధారణంగా మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏది కూడ తినే పరిస్థితి ఉండదు. ఏది కూడా తినాలనిపించదు. అయితే, ఈ వీడియోలోని సదరు వ్యక్తి మాత్రం ఐసీయూలో వెంటిలేటర్పై ఉండికూడా తన చెడు వ్యసనాన్ని వదులుకోలేక పోయాడు. ఇతడు చేసిన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఒక వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో వెంటిలేటర్పై ఉన్నాడు. అతడు గాలి కూడా పీల్చుకోలేని పరిస్థితుల్లో బాధపడుతున్నాడు. అతని శరీరానికి అన్ని పైపులే ఉన్నాయి. కాగా, ఒక నర్సు వచ్చి అతని ఆరోగ్య పరిస్థితిని చూస్తొంది. మరోక వ్యక్తి అతని పాదాల వద్ద ఉండి అతడిని గమనిస్తుంది. ఆ సదరు వ్యక్తి మాత్రం తీరిగ్గా.. తన చేతుల్లో ఖైనీ ( తంబాకు) తీసుకొని, చేతిలో వేసుకొని రుద్దుతు తంబాకు తయారు చేయడం చేస్తున్నాడు. ఈ వీడియో.. ఇప్పుడు ఇది నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్నిచూసిన నెటిజన్లు ఆసుపత్రిలో ఇదేం పాడుపని.. ప్రాణాలు పోతున్నా, చెడు వ్యసనం మాత్రం వదులుకోలేకున్నాడు’ అంటూ ఘాటుగా కామెంట్లు పెడుతున్నారు. -
వెంటిలేటర్పై 30% యువకులే.. జాగ్రత్త
రోనా బారిన పడిన అందరికీ ఆక్సిజన్ అవసరం పడదు. కానీ అనేక మంది భయంతో అనవసరంగా వాడుతున్నారు. మా వద్దకు వచ్చే రోగుల్లో 30 శాతం మంది అవసరం లేకపోయినా ఆక్సిజన్ కోసం వస్తున్నారు. అందువల్లనే అవసరమైన వారికి కూడా ఆక్సిజన్ దొరకని పరిస్థితి. గాంధీలో వెంటిలేటర్పై ఉన్న వారిలో 30% మంది యువకులే ఉన్నారు. అంటే 30–45 ఏళ్ల వయస్సు వారన్నమాట. సెకండ్ వేవ్లో యువకులు కూడా ఎక్కువగా వైరస్ బారినపడుతున్నారు. అలాగే చిన్నపిల్లల ద్వారా పెద్దలకు సోకుతోంది. పిల్లలకు వైరస్ కనిపించదు కానీ వారు పెద్దలకు వ్యాపింపజేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: రెమిడెసివిర్, తుసిలిజు మాబ్... ఇప్పుడు వీటికున్న క్రేజే వేరు. వీటిని కరోనా రోగులపాలిట అపర సంజీవనిగా అందరూ భావి స్తున్నారు. ఇదే కరోనా సీరియస్ రోగులను కాపాడే గొప్ప మందుగా తలపోస్తున్నారు. కానీ ఇలాంటి యాంటీ వైరల్ డ్రగ్స్తో ప్రాణాలు నిలపడం సాధ్యం కాదని, వాటిని వాడాల్సిన అవసరమే లేదని తేల్చి చెబుతున్నారు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు. వాటికోసం పిచ్చెక్కినట్లు బ్లాక్లో కొంటూ వేలు లక్షల రూపాయలు వృథా చేసుకుంటున్నారని అంటున్నారు. సెకండ్ వేవ్లో పిల్లలతోపాటు యువకులు కూడా ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారని చెప్పారు. గాంధీలో 30 శాతం మంది యువకులే వెంటిలేటర్పై ఉన్నారన్నారు. కరోనా చికిత్సకు సంబంధించి వివిధ అంశాలపై ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే... అవసరం లేకున్నా భయంతో ఆక్సిజన్... కరోనా బారిన పడిన అందరికీ ఆక్సిజన్ అవసరం పడదు. అనేక మంది భయాందోళనతో అనవసరం గా వాడుతున్నారు. మా వద్దకు వచ్చే రోగుల్లో 30 శాతం మంది అవసరం లేకపోయినా ఆక్సిజన్ కోసం వస్తున్నారు. వాస్తవంగా ఆక్సిజన్ శాచురేషన్ స్థాయిలను బట్టి వాడాలా లేదా అనే నిర్ధారణకు వస్తాం. ఆక్సిజన్ శాచురేషన్ లెవెల్స్ 85 శాతం కంటే తక్కువగా ఉంటే అత్యంత విషమమైన పరి స్థితుల్లో రోగి ఉన్నట్లు లెక్క. 85–89 మధ్య ఉంటే విషమం, 90–93 శాతం శాచురేషన్ ఉంటే మధ్య స్థాయి, 93–95 వరకు ఉంటే మైల్డ్గా ఉన్నట్లు లెక్క. 95 అంతకంటే ఎక్కువగా శ్యాచురేషన్ ఉంటే సాధారణం కింద లెక్క. కానీ శాచురేషన్ స్థాయి 100 శాతం రావడంలేదని, 95 మాత్రమే ఉందని.. ఆక్సిజన్ పెట్టాలని అనేక మంది ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. అందువల్లనే అవసర మైన వారికి కూడా ఆక్సిజన్ దొరకని పరిస్థితి. చాలామంది దమ్ము అని ఆస్పత్రికి వస్తుంటారు.. కానీ వారిని చూస్తే సాధారణంగానే ఉంటారు. వెంటిలేటర్పై 30 శాతం మంది యువకులే... గాంధీలో వెంటిలేటర్పై ఉన్న వారిలో 30 శాతం మంది యువకులే ఉన్నారు. అంటే 30–45 ఏళ్ల వయస్సు వారన్నమాట. సెకండ్వేవ్లో యువకులు కూడా ఎక్కువగా వైరస్ బారినపడుతున్నారు. ఇక గతం కంటే ఇప్పుడు డాక్టర్లు ఎక్కువగా వైరస్కు గురవుతున్నారు. అలాగే చిన్నపిల్లల ద్వారా పెద ్దలకు సోకుతోంది. పిల్లలకు వైరస్ కనిపించదు కానీ వారు పెద్దలకు వ్యాపింపజేస్తున్నారు. అందుకే ప్రభుత్వం పాఠశాలు, కాలేజీలను మూసేసింది. సీరియస్ కేసులను తగ్గించలేదు రెమిడెసివిర్, తుసిలిజుమాబ్, ప్లాస్మాలు వాడితే కరోనా తగ్గుతుందన్న రుజువు లేనేలేదు. రెమిడెసివిర్ను వాడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) చెప్పింది. సీరియస్ రోగులను అది ఏమాత్రం సాధారణ స్థితికి తీసుకురాలేదు. రెమిడెసివిర్ కావాలని రోగులే ఎక్కువగా అడుగుతున్నారు. అది ఇస్తేనే సరైన వైద్యంగా భావిస్తున్నారు. దీనిపై జనాల్లో పిచ్చి అభిప్రాయాలు ఉన్నాయి. ఈ ఇంజెక్షన్ ప్రాణాలను ఏమీ కాపాడదు. యాంటీ వైరల్ డ్రగ్స్ అయిన రెమిడెసివిర్, తుసిలిజుమాబ్, ఫావిపిరావిర్లతో ప్రయోజనం లేదు. తుసి లిజుమాబ్ను డాక్టర్ నిర్ణయం మేరకు అత్యంత అరుదైన కేసుల్లోనే వాడాలి. ఈ మందు ఒక శాతం మందిలో కూడా అవసరం పడదు. అయితే రోగుల సంతృప్తి కోసం మాత్రమే ఇస్తున్నారు. సివియర్ కేసుల్లో స్టెరాయిడ్ చికిత్స... కరోనా లక్షణాలను బట్టే చికిత్స ఉంటుంది. సాధారణ కేసుల్లో డాక్టర్ సూచనల మేరకు మందులు వాడితే సరిపోతుంది. సీరియస్ కేసుల్లో స్టెరాయిడ్స్, యాంటీ ప్లేట్లెట్ డ్రగ్స్, యాంటీ కోయాగ్లెన్స్ మందులు అవసరాన్ని బట్టి వాడాలి. ఏ సమయంలో ఇవ్వాలో వాటిని అప్పుడు ఇస్తేనే సరిగా పనిచేస్తాయి. సెకండ్ వేవ్లో వైరస్ విజృంభణ అధికం... మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంది. ట్రిపుల్ మ్యుటేషన్ రాష్ట్రంలో గుర్తించలేదు. డబుల్ మ్యుటెంట్ వైరస్లైతే ఉన్నాయి. దీంతో వైరస్ ఇన్ఫెక్షన్ రేటు అధికంగా ఉంది. కుటుంబంలో ఒకరికి వస్తే ఇతరులకు వేగంగా వ్యాపిస్తుంది. దీంతో చాలామంది వైరస్ బారిన పడుతున్నారు. వందలో 80 మందికి ఇంట్లోనే రికవరీ అవుతుంది. మిగిలిన వారిలో ఐదుగురికి మాత్రమే ఆక్సిజన్ అవసరం పడుతుంది. వైరస్ విజృంభణ వల్ల అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ ఇప్పుడు కరోనా చికిత్సలకు అనుమతి వచ్చింది. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు పడకలు నిండుతున్నాయి. కేసుల సంఖ్య ఎక్కువుంది కాబట్టి అందులో సివియర్ కేసులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మూడు వారాల్లో వైరస్ తగ్గుముఖం పడుతుందని భావిస్తున్నాం. టీకా వేసుకోండి... జాగ్రత్తలు పాటించండి అనవసరంగా బయటకు పోవద్దు. సినిమాలు, పబ్స్, రెస్టారెంట్లు, బార్లకు వెళ్లొద్దు. అత్యవసరమైతే తప్ప శుభకార్యాలకు వెళ్లొద్దు. బర్త్డే పార్టీలు చేసుకోవద్దు. పండుగలను తక్కువ మందితో జాగ్రత్తలు తీసుకొని చేసుకో వాలి. ముక్కు, నోరు పూర్తిగా మూసుకునేలా మాస్క్ పెట్టుకోవాలి. తరచుగా చేతులు శుభ్రం చేసుకోవాలి. ఏ కంపెనీ వ్యాక్సిన్ అని చూడకుండా ఏది అందుబాటులో ఉంటే దాన్ని వేసుకోవాలి. కరోనా నియంత్రణలో ఇవే కీలకమైన అంశాలు. -గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావుతో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ -
ఎంజీఎంలో విషాదం: నిర్లక్ష్యానికి ‘ఊపిరి ఆగింది’!
సాక్షి,వరంగల్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఓ కరోనా రోగి మృతి చెందాడు. కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో వెంటిలేటర్పై ఉన్న రోగి ఊపిరాడక మృత్యువాత పడ్డాడు. ఇది ముమ్మాటికీ వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాలు.. కరోనా బాధితుడు గాంధీ.. గత నెలాఖరులో ఎంజీఎం ఆస్పత్రిలో చేరాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో డాక్టర్లు వెంటిలేటర్పై ఉంచి వైద్యం అందిస్తున్నారు. అయితే, శనివారం ఆస్పత్రిలో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీంతో వెంటిలేటర్ పనిచేయకపోవడంతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై అతను ప్రాణాలు కోల్పోయాడు. కాగా, వెంటిలేటర్ తీసేసి సాధారణ బెడ్పై వేయడంతో గాంధీ ప్రాణాలు కోల్పోయాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఎంజీఎం సూపరింటెండెంట్ నాగార్జునరెడ్డి వివరణ ఇస్తూ... ఆస్పత్రిలో అందుబాటులో జనరేటర్లు ఉన్నాయని, మరో వెంటిలేటర్ మార్చే క్రమంలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగానే కరోనా బాధితుడు ప్రాణాలు కోల్పోయాడని స్పష్టం చేశారు. -
వెంటి లేటర్పైకి వెళ్లినా రోగి వెనక్కిరావచ్చు!
ఒకసారి వెంటిలేటర్పైకి వెళ్తే రోగి తిరిగి కోలుకోవడం కష్టమనే అపోహ చాలామంది రోగుల్లో, వారి రోగి బంధువుల్లో ఉంటుంది. సాధారణంగా రోగులను డాక్టర్లు.. సాధారణ పరిస్థితులోనే మొదట ట్రీట్మెంట్ అందిస్తారు. అయితే ఒక్కొసారి వారి శరీరం, మాములు స్థితికి సహకరించకపోతే ఆసమయంలోనే వారిని వెంటిలేటర్పైన ఉంచి వైద్యం చేస్తారు..ఒకసారి రోగిని వెంటిలేటర్పై పెట్టాక... ఏ పరిస్థితి కారణంగా రోగిని వెంటిలేటర్పై పెట్టారో, అది మెరుగయ్యే వరకు వెంటిలేటర్పైనే ఉంచాల్సి వస్తుంది. ఇక రోగి కోలుకోవడం అన్నది, అతడికి ఉన్న జబ్బు తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు పేషెంట్ కండిషన్ చాలా సీరియస్ గా ఉన్నప్పుడు చివరి ప్రయత్నంగా వెంటిలేటర్ పై ఉంచుతారు. కొన్ని రోజుల గడిచిన తర్వాత వాళ్ళు సాధారణ స్థితిలోకి చేరుకుంటారు. కాబట్టి వెంటిలేటర్పై పెట్టిన రోగులంతా కోలుకోరని భావించడం సరికాదు. తక్కువ మంది మాత్రమే పరిస్థితి విషమించి, ప్రమాదకరమైన పరిస్థితికి వెళ్తున్నారు. కాబట్టి వెంటిలేటర్ అనగానే ఆందోళన అక్కర్లేదు. చదవండి: సిజేరియన్ తర్వాత మహిళల ప్రధాన సమస్య ఇదే! -
వెంటిలేటర్పై మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య
కోల్కతా: సీపీఎం సీనియర్ నేత, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య (76) అనారోగ్యానికి గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో బుధవారం మధ్యాహ్నం ఆయనను కోల్కతాలోని ఉడ్ల్యాండ్ ఆస్పత్రికి తరలించారు. బుద్ధదేవ్కు కోవిడ్ పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. కరోనా నెగెటివ్గా వచ్చినట్టు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని, వెంటిలేటర్పైనే చికిత్స కొనసాగుతోందని హెల్త్ బులిటెన్లో వైద్యులు వెల్లడించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో రక్తంలో ఆక్సిజన్, పీహెచ్ స్థాయిలు తగ్గి కార్బన్ డయాక్సైడ్ శాతం ఎక్కువయ్యిందన్నారు. న్యుమోనియా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని సీటీ స్కాన్లో తేలిందన్నారు. -
కేరళ నర్సు ఆడియో వైరల్, విచారణకు ఆదేశం
తిరువనంతపురం: కేరళలో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఒక వ్యక్తి చనిపోయాడంటూ నర్సు మాట్లాడిన ఆడియో క్లిప్ ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీని మీద ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనావైరస్ సోకిన ఒక వ్యక్తికి వెంటిలేటర్ ట్యూబ్స్ తారుమారుగా పెట్టడం వల్ల చనిపోయాడని ఒక నర్సు ఆమె సహచరులకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసింది. ఆ మెసేజ్ సామాజిక మాద్యమాలలో వైరల్గా మారింది. దీంతో మృతుడి తరుపు బంధువులు ఈ విషయంపై విచారణ చేపట్టాలని ఫిర్యాదు చేశారు. దీనిపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందిస్తూ ప్రభుత్వం కరోనాను అన్ని విధాలుగా ఎదుర్కొంటుందని, ఇలాంటి సమయంలో కొంతమంది నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు రావడాన్ని సహించబోమని ఈ విషయంపై విచారణకు ఆదేశించారు. ఇక ఆసుపత్రి వర్గాలు మాట్లాడుతూ, ఇవన్నీ ఆధారం లేని ఆరోపణలు అంటూ దీనిని ఖండించారు. కరోనాతో చనిపోయిన వ్యక్తి హై బీపీ, డయాబెటీస్, ఊబకాయంతో బాధపడుతున్నాడని పేర్కొన్నారు. అతనికి మాన్యువల్ వెంటిలేటర్ పెట్టలేదని, ఎన్ఐవీ వెంటిలేటర్ పెట్టామని దానిలో ట్యూబ్లు తారుమారు అయ్యే అవకాశాలు లేవని పేర్కొన్నారు. ఇవన్నీ కావాలని చేస్తున్న ఆరోపణలు అని తెలిపారు. చదవండి: కరోనాతో కొత్తముప్పు ! -
వెంటిలేటర్ ప్లగ్ తీసి కూలర్ పెట్టారు
కోట : రాజస్తాన్లోని కోటలో శుక్రవారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. సాకెట్లో నుంచి వెంటిలేటర్ ప్లగ్ తీసి, ఎయిర్కూలర్ ప్లగ్ పెట్టడంతో ఒక రోగి మరణించాడు. వివరాలు.. కరోనా వైరస్ అనే అనుమానంతో ఒక 40 ఏళ్ల వ్యక్తిని రాజస్తాన్లోని మహారావు భీమ్ సింగ్ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డ్లో చికిత్స అందిస్తున్నారు. అయితే ఐసోలేషన్ వార్డులో బాగా వేడిగా ఉండటంతో, రోగి కుటుంబ సభ్యులు బయటి నుంచి ఎయిర్ కూలర్ తీసుకువచ్చారు. కూలర్ను ఆన్ చేసేందుకు.. వెంటిలేటర్ కనెక్ట్ అయి ఉన్న సాకెట్లో వెంటిలేటర్కు సంబంధించిన ప్లగ్ను తీసి, కూలర్ ప్లగ్ను పెట్టారు. అరగంట తరువాత వెంటిలేటర్లో చార్జింగ్ అయిపోవడంతో ఆ వ్యక్తి మృతి చెందారు. పొరపాటున రోగి కుటుంబ సభ్యులే వెంటిలేటర్ ప్లగ్ను తీసేశారని ఎంబీఎస్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.(కరోనాతో నాగిరెడ్డి మనవడు మృతి) అయితే ఆ వ్యక్తికి కరోనా పరీక్షలు నిర్వహించగా రిపోర్టులో నెగెటివ్ అని తేలిందని ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో జూన్ 15న సదరు వ్యక్తిని ఐసీయూ నుంచి ఐసోలేషన్ వార్డుకు మార్చినట్లు వెల్లడించారు. ఇంతలోనే కుటుంబసభ్యుల పొరపాటు వల్ల ఇలా జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించామని, వారు దర్యాప్తు జరుపుతున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. -
కోవిడ్తో మెదడుకు నష్టం?
బెర్లిన్: కోవిడ్ కారణంగా మెదడు దెబ్బతింటుందా? అవునంటున్నారు స్వీడన్లోని గొథెన్బర్గ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. వ్యాధి చికిత్సకు ఆసుపత్రిలో చేరిన కొందరిలో తాము మెదడు దెబ్బతిన్న ఆనవాళ్లను గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. తేలికపాటి, ఒక మోస్తరు, తీవ్ర లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన 47 మందిపై తాము పరిశోధనలు చేశామని వారి రక్త నమూనాలను పరిశీలించినప్పుడు మెదడు దెబ్బతినేందుకు సూచికలైన కొన్ని రసాయనాలను గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతోపాటు మెదడు నాడుల కొనలలో ఉండే ఎన్ఎఫ్ఎల్ అనే మరో ప్రొటీన్ కూడా రక్తంలో కనిపించిందని చెప్పారు. కోవిడ్ –19 కారణంగా వెంటిలేటర్పై చికిత్స అందించాల్సిన రోగుల్లో ఈ ఎన్ఎఫ్ఎల్ చాలా ఎక్కువగా కనిపించిందని, దీనికి వ్యాధి తీవ్రతకు సంబంధం ఉందన్న విషయాన్ని ఇలా తెలుసుకోవచ్చునని చెప్పారు. -
వెంటిలేటర్పై ఉన్న కరోనా బాధితులకు..
లండన్: వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న కరోనా వైరస్ బాధితులకు డెక్సామెథాసోన్ అద్భుతంగా పనిచేస్తుందని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అత్యంత చౌకగా లభించే ఈ ఔషధం కరోనా బాధితుల్లో మూడింట ఒక వంతు మరణాలను తగ్గించినట్లు, ఆక్సిజన్ సపోర్టుపై ఉన్న బాధితుల్లో ఐదింట ఒక వంతు మరణాలను తగ్గించినట్లు తమ అధ్యయనంలో తేలిందని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ పరిశోధకులు పేర్కొన్నారు. యూకేలోని వివిధ ఆసుపత్రుల్లో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న 11,500 మందికిపైగా బాధితులపై డెక్సామెథాసోన్ను ప్రయోగించి, ఈ మేరకు నిర్ధారణకు వచ్చారు. వెంటిలేటర్ లేదా ఆక్సిజన్ సపోర్టు అవసరం లేని బాధితులకు డెక్సామెథాసోన్తో పెద్దగా ఉపయోగం ఉండదని పరిశోధకులు చెబుతున్నారు. కోవిడ్ రోగుల్లో సానుకూలమైన ఫలితాలు చూపిన తొలి ఔషధం డెక్సామెథాసోన్ మాత్రమేనని, అది ఆహ్వానించదగ్గ పరిణామమని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ చీఫ్ ఇన్వెస్టిగేటర్ పీటర్ హార్బీ చెప్పారు. -
కరోనా: రోజుల తరబడి కోమాలో శిశువు
రియో డి జనీరో: చిన్నాపెద్దా తేడా లేని కరోనా ఐదు నెలల వయసున్న శిశువును వదల్లేదు. ఆ మహమ్మారి వల్ల కోమాలోకి కూడా వెళ్లిన ఆ శిశువు అంతిమంగా వైరస్నే జయించిన ఘటన బ్రెజిల్లో చోటు చేసుకుంది. బ్రెజిల్కు చెందిన ఐదు నెలల చిన్నారి డామ్కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించింది. దీంతో శిశువు తల్లిదండ్రులు బాబును స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. డామ్ను పరీక్షించిన వైద్యులు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్గా భావించి మందులు రాసిచ్చారు. కానీ మందులు వాడినప్పటికీ బాబు ఆరోగ్య పరిస్థితి కుదుటపడలేదు. పైగా రోజురోజుకూ మరింత క్షీణిస్తుండటంతో కలవరపడ్డ తల్లిదండ్రులు రియో డి జనీరోలోని ప్రొ కార్డికో ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు బాబుకు పరీక్షలు నిర్వహించి కరోనా సోకినట్లుగా నిర్ధారించారు. (అమెరికాను బ్రేక్ చేయనున్న బ్రెజిల్!) అనంతరం చికిత్స అందించే సమయంలో బాబు కొన్ని రోజుల పాటు కోమాలోకి వెళ్లాడు. దీంతో వైద్యులు అతడిని రక్షించేందుకు వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు. సుమారు 54 రోజుల తర్వాత ఆ శిశువు కరోనా బారి నుంచి బయటపడటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ విషయం గురించి ఆ చిన్నారి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. "ఇది నిజంగా అద్భుతం" అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. కాగా బ్రెజిల్లో 12 నెలల లోపు వయసు ఉన్న చిన్నారులు 25 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్రకారం అమెరికాలో 5,14,849 కేసులు నమోదవగా 29,300 మంది మరణించారు. (చనిపోతే బతికించారు.. మళ్లీ ‘చంపేశారు’!!) -
మనకూ.. వైటల్ వెంటిలేటర్లు!
నాసా అభివృద్ధి చేసిన వైటల్ వెంటిలేటర్ను తయారు చేయడానికి మూడు భారతీయ కంపెనీలు లైసెన్సులు పొందాయి. కోవిడ్-19 రోగులకు క్లిష్టమైన పరిస్థితుల్లో చికిత్సనందించే ఈ వెంటిలేటర్లను తయారు చేసేందుకు ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, భారత్ ప్రాగ్ లిమిటెడ్, మేధా సర్వ్ డ్రైవ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అనుమతి పొందినట్లు నాసా ఒక ప్రకటనలో తెలిపింది. ఇండియన్ కంపెనీలతోపాటు మరో 18 కంపెనీలకు ఈ అనుమతి లభించింది. వీటిలో 8 అమెరికన్ కంపెనీలు, 3 బ్రెజీలియన్ కంపెనీలు కూడా ఈ అనుమతులు పొందినట్లు నాసా వెల్లడించింది. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా) క్యాలీఫోర్నియాలోని జెట్ ప్రపల్షన్ ల్యాబొరేటరీ(జేపీఎల్)లో ప్రత్యేకమైన వెంటిలేటర్లను అభివృద్ధి చేసింది. జేపీఎల్ ఇంజినీర్లు కరోనా రోగులకు సమర్థవంతంగా చికిత్సనందించే వైటల్ అనే వెంటిలేటర్ను రూపొందిచారు. అత్యవసర పరిస్థితులో ఈ వెంటిలేటర్ను వాడేందుకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ ఏప్రిల్ 30న ఆమోదం తెలిపింది. డాక్టర్లు, మెడికల్ పరికరాల తయారీదారులను సంప్రదించి నాసా ఈ వైటల్ను అభివృద్ధి చేసింది. సంప్రదాయ వెంటిలేటర్ల కంటే అతితక్కువ వ్యయంతో వీటిని తయారు చేయవచ్చని నాసా పేర్కొంది. సాధారణ వెంటిలేటర్ తయారిలో వాడే పరికరాలలో 7 వంతు మాత్రమే వినియోగించి ఈ వైటల్ వెంటిలేటర్ను తయారు చేసినట్లు తెలియచేసింది. అయితే ఇది సమర్థవంతంగా పనిచేస్తుండడంతో అధిక మొత్తంలో వీటిని తయారు చేసేందుకు వివిధ కంపెనీలకు నాసా ఆనుమతులను మంజూరు చేస్తోంది. -
‘నా నిర్లక్ష్యం వల్లే కరోనా సోకింది’
ముంబై: నిర్లక్ష్యపూరిత ధోరణి వల్లే తాను కరోనా వైరస్ బారిన పడ్డట్లు వెల్లడించారు మహారాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జితేంద్ర అవద్. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోన్న సమయంలో ఆయన థానే జిల్లాకు పర్యవేక్షకుడిగా వ్యవహరించారు. ఈ క్రమంలో అధికారులతో సమీక్ష సందర్భంగా ఓ పోలీసు అధికారి నుంచి మంత్రికి వైరస్ సోకిన సంగతి తెలిసిందే. దాంతో ఈ నెల ప్రారంభంలో కొన్ని రోజుల పాటు ఆస్పత్రిలో ఉండి చికిత్స పొందారు. రెండు రోజులు వెంటిలేటర్ మీద కూడా ఉన్నారు. కరోనా నుంచి కోలుకుని ఇటివలే డిశ్చార్జ్ అయ్యారు జితేంద్ర అవద్. ఈ క్రమంలో తాజాగా డెవలపర్స్ లాబీ బీడీఏ నిర్వహించిన ఓ ఆన్లైన్ సెమినార్లో పాల్గొన్నారు జితేంద్ర అవద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నా నిర్లక్ష్యం కారణంగానే కరోనా వ్యాధి సోకింది. నేను ప్రజల సలహాలు పాటించలేదు. అందుకే కరోనా వలలో చిక్కాను. కానీ నా సంకల్ప బలంతో త్వరగానే వ్యాధి నుంచి కోలుకున్నాను. ఇతర ఐఏఎస్ అధికారులతో పోల్చుకుంటే నేను చాలా అదృష్టవంతుడుని. ప్లాస్మా థెరపీ, ఇంపోర్టెడ్ మందుల అవసరం లేకుండానే వ్యాధి నుంచి కోలుకున్నాను. ప్రస్తుతం నా హిమోగ్లోబిన్ లెవల్ బాగానే పెరిగింది. ఇందుకోసం కఠిన ఆహార నియమాలు పాటిస్తున్నాను’ అన్నారు జితేంద్ర. (మహారాష్ట్రలో మంత్రిని కూడా వదల్లేదు..) -
చౌకైన వెంటిలేటర్
వాషింగ్టన్: కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు అమెరికాలోని భారతీయ దంపతులు ఓ వినూత్నమైన, చౌకైన వెంటిలేటర్ను తయారు చేశారు. మూడు వారాల వ్యవధిలోనే ఈ వెంటిలేటర్కు ఆలోచన చేయడంతోపాటు నమూనా యంత్రాన్ని తయారు చేసిన దేవేశ్ రంజన్, కుముదా రంజన్..దీనిని భారత్తోపాటు, పలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దేవేశ్ రంజన్ జార్జియా టెక్ వర్సిటీలోని జార్జ్ డబ్ల్యూ వుడ్రఫ్ స్కూల్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్లో అధ్యాపకుడిగా పనిచేస్తూండగా, కుముదా రంజన్ అట్లాంటాలో వైద్యురాలిగా సేవలందిస్తున్నారు. ‘‘ఈ యంత్రాన్ని వాణిజ్యస్థాయిలో ఉత్పత్తి చేస్తే ఒక్కోదానికి రూ. 7,600 (వంద డాలర్లు) వరకూ అవుతుంది. ఐదు రెట్లు ఎక్కువ ధరకు అమ్మినా తయారీదారుకు మంచి లాభాలే వస్తాయి’’అని దేవేశ్ రంజన్ పీటీఐతో చెప్పారు. అమెరికాలో సాధారణ వెంటిలేటర్ ఖరీదు ఏడెనిమిది లక్షల వరకూ ఉంటుందని చెప్పారు. ఊపిరితిత్తులు బలహీనపడిన సందర్భాల్లో శ్వాసను అందించేందుకు వెంటిలేటర్లు ఉపయోగిస్తారన్నది తెలిసిన విషయమే. శ్వాస వేగం, ఉచ్ఛ్వాస, నిశ్వాసాల్లో గాలి మోతాదు, ఊపిరితిత్తులపై పీడనం వంటి అన్ని అంశాల నిర్వహణకు దేవేశ్, కుముద్ రంజన్లు ఎలక్ట్రానిక్ సెన్సర్లు, కంప్యూటర్ నియంత్రణలను ఉపయోగించారు. దీన్ని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో మాత్రం వాడే అవకాశం లేదని, అది మరింత అత్యాధునికమైందని వారు స్పష్టం చేశారు. దేవేశ్ స్వస్థలం బిహార్లోని పట్నా కాగా, కుముద్ రాంచీకి చెందిన వారు. భారత్తోపాటు ఆఫ్రికా దేశం ఘనాలో ఈ వెంటిలేటర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు జార్జియా టెక్ పూర్వ విద్యార్థులు తమను సంప్రదించినట్లు దేవేశ్ తెలిపారు. సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న రిన్యూ గ్రూపు ఈ యంత్రాన్ని మరింత అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉందని ఆ సంస్థ అధ్యక్షుడు ఉత్తరాఖండ్కు చెందిన రవీ సజ్వాన్ తెలిపారు. -
కరోనా చికిత్సకు ‘ఐకో వెంట్’ వెంటిలేటర్
సాక్షి, హైదరాబాద్: కరోనా రోగుల కోసమే దేశీయ పరిజ్ఞానంతో ప్రత్యేకంగా రూపొందించిన వెంటిలేటర్.. ‘ఐకో వెంట్’ పేరుతో మార్కెట్లోకి రానుంది. అందుబాటులో ఉన్న పరికరాలు, తక్కువ ఖర్చుతో రూపొందించిన ఈ వెంటిలేటర్ కరోనా బారినపడిన రోగులపై బాగా పనిచేస్తుందని దీని రూపకర్త, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి చెప్పారు. మంగళవారం ఆయన దీని పనితీరు, ప్రత్యేకతలను మీడియా కు వివరించారు. ప్రస్తుతం డిమాండ్కు తగ్గ సరఫరా లేదని, తమ ఐకో వెంట్ వెంటిలేటర్లు ఆ కొరతను తీర్చబోతున్నాయని చెప్పారు. అన్ని వెంటిలేటర్లు కరోనాను ఎదుర్కోలేవని, మెకనైజ్డ్ అంబు బ్యాగులు, సీపాప్, బైపాప్ మిషన్లు మాత్రమే ఈ వైరస్ చికిత్సకు అనుగుణంగా పనిచేస్తాయన్నారు. వెంటిలేటర్ల తయారీకి వివిధ దేశాలు వైద్యపరంగా నిర్దేశించిన ప్రమాణాలకు లోబడి దీనిని రూపొందించామన్నారు. ఇప్పుడున్న చాలా వరకు వెంటిలేటర్ల ద్వారా కరోనా రోగులకు ఎటువం టి క్లినికల్ ప్రయోజనాలు అందకపోగా, అవి ఊపిరితి త్తుల్లో గాయం ఏర్పడడాని కి కారణమవుతున్నాయన్నారు. ఐకో వెంట్ను కరోనా, న్యుమోనియా, ఏఆర్డీఎస్ (ఆక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిం డ్రోమ్) రోగుల కోసమే రూపొందించామన్నా రు. ఊపిరితిత్తుల సాధారణ సామర్థ్యం ఆధారంగా ఆక్సిజన్ను కచ్చిత పరిమాణంలో ఊపిరితిత్తుల్లోకి పంపి, బయటకు వదిలే క్రమంలో కచ్చితమైన ప్రెషర్ను ఇది అనుమతిస్తుందన్నా రు. దీనికి పేటెంట్ పొందినట్టు చెప్పారు. ఆరున్నర వారాల పాటు శ్రమించి.. ఆరున్నర వారాల పాటు శ్రమించి ఐకో వెంట్ను రూపొందించినట్టు విశ్వేశ్వర్రెడ్డి తెలిపారు. లాక్డౌన్ కారణంగా ముడి ఉత్పత్తుల సేకరణ కష్టమైందని, హైదరాబాద్లో అందుబాటులో ఉన్న ఉత్పత్తులనే పోలీసుల సాయంతో సేకరించి, దీ నిని తయారుచేసినట్లు చెప్పారు. ఐకో వెంట్ను 3 మోడల్స్లో అందుబాటులోకి తెస్తున్నామన్నా రు. హైదరాబాద్లో లభ్యమయ్యే ముడి ఉత్పత్తు ల ఆధారంగా రూపుదిద్దికునే మోడల్కు రూ. 1.20లక్షల నుంచి రూ.1.40లక్షల ధర నిర్దేశించామన్నారు. వరంగల్ వంటి పట్టణాల్లో లభ్యమ య్యే ముడి ఉత్పత్తులతో తయారయ్యే వెంటిలేట ర్ రూ.90 వేలు, అంతకంటే చిన్న పట్టణాల్లో ల భ్యమయ్యే ముడి వస్తువులతో తయారైన మోడ ల్ ధరను రూ.40–50వేలుగా నిర్ణయించామన్నా రు. మరో 2 – 3 వారాల పాటు కృత్రిమ ఊపిరితిత్తులపై దీనిని ప్రయోగించి అం దుబాటులోకి తీసుకువస్తామన్నారు. సీఎస్ఆర్ కింద 300 వరకు ప్రభుత్వాస్పత్రులకు అందిస్తా మన్నారు. వీటి తయారీలో భాగస్వామ్యానికి విదేశీ కంపెనీలు ముందుకొచ్చాయన్నారు. -
ఈ వెంటిలేటర్ చిన్నదీ, చవకైనదీ!
ఈ కథనంలో ఉన్న చిత్రంలో మీరు చూస్తున్న వెంటిలేటర్ అతి చిన్నదీ... చాలా చవకైనది. ‘ఏ–సెట్ రొబోటిక్స్’ అనే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన ప్రొఫెసర్ దివాకర్ వైష్ దీన్ని రూపొందించారు. ఈయన గతంలో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో మొట్టమొదటి 3–డీ ప్రింటెడ్ హ్యూమనాయిడ్ రోబోనూ (దీని పేరు మానవ్), మన మనసు ఆజ్ఞలతో నడిచే వీల్ చైర్నూ తయారు చేశారు. పూర్తిగా దేశీయంగా... తయారవుతున్న ఈ వెంటిలేటర్ల ప్రత్యేకతలు ఎన్నో ఎన్నెన్నో. ఉదాహరణకు కొన్ని చూద్దామా? ప్రపంచంలోనే అత్యంత చిన్న వెంటిలేటర్ ఇది. ఇది ఎంత చిన్నదంటారా? మన హాస్పిటళ్లలో ఉపయోగించే మామూలు వెంటిలేటర్ల సైజులో దీనిది 450వ వంతు. అంటే ఓ సాధారణ వెంటిలేటర్ స్టాండ్తో కలిపి దాదాపుగా ఓ చిన్న పిల్లాడి సైజ్ అంత ఉంటే... ఇది మాత్రం వాడి జేబులో పట్టేంత చిన్నదిగా ఉంటుంది. మరో పోలిక చెప్పాలంటే... మన ఇళ్లలో వాడే ‘ఫ్లెక్స్ బాక్స్’ అంత ఉంటుంది. చూడ్డానికి దాదాపూ అలాగే ఉంటుంది. ఈ వెంటిలేటర్ను బ్లూటూత్తో, మన స్మార్ట్ఫోన్లోని ఒక ఆప్ సహాయంతో ఇంట్లోనూ వాడుకోవచ్చు. దీన్ని వాడటానికి ఆక్సిజన్ సిలెండర్ కూడా అక్కర్లేదు. ఎటూ కదలలేకుండా ఉంటే పక్షవాతం రోగులు దీన్ని కొని ఇంట్లోనే వాడుకోవచ్చు. దీని ఖరీదూ, సైజూ చిన్నదైనందున పెద్ద పెద్ద నగరాల్లోని హాస్పిటల్స్ మాత్రమే కాదు... చిన్న చిన్న పట్టణాలూ, పల్లెల్లోని డాక్టర్లు సైతం దీన్ని వాడుతూ... సంక్లిష్టమైన స్థితిలో ఉన్న రోగిని నగరానికి చేర్చే వరకు ప్రాణాలను కాపాడవచ్చు. మామూలు వెంటిలేటర్ ధర దాదాపు ఐదారు లక్షల రూపాయల నుంచి రూ. 15 లక్షల వరకు ఉంటుంది. కానీ దీని ధర అటు ఇటుగా దాదాపుగా పదిహేనువేల రూపాయలు మాత్రమే. అంటే మామూలు పెద్ద వెంటిలేటర్ల ధరలో వందో వంతు. రేయింబవళ్లూ కష్టపడి నెల రోజుల్లోపల కనీసం 20,000 వెంటిలేటర్లను మన హాస్పిటల్స్కు అందిస్తానని గత నెల 22న ప్రొఫెసర్ దివాకర్ వైష్ ట్వీట్ చేశారు. అంటే... మరో పదిహేను రోజుల్లో ఈ కొత్త వెంటిలేటర్లను మనం వాడటమే కాదు... అతి త్వరలోనే... మొన్నటి హైడ్రాక్సీ క్లోరోక్విన్లాగే ప్రపంచానికీ అందించగలం. అదీ మన సత్తా!! -
పోర్టబుల్ వెంటిలేటర్
సాక్షి, హైదరాబాద్/సంగారెడ్డి టౌన్: కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స అందించేందుకు అవసరమైన మాస్క్లు, వెంటిలేటర్ల తయారీకి సం బంధించిన నమూనాలపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఇటీవల తక్కువ ఖర్చుతో తయారయ్యే ‘బ్యాగ్ వాల్వ్ మాస్క్’ను డిజైన్ చేసిన ఐఐటీ హైదరాబాద్.. తాజాగా అత్యవసర సమయాల్లో ఉపయోగించే వెంటిలేటర్ను తయారు చేసింది. ఐఐటీ అనుబంధ సెంటర్ ఫర్ హెల్త్కేర్ ఎంట్రప్రెన్యూర్షిప్ (సీఎఫ్హెచ్ఈ)కి చెందిన ఏరోబయోసిస్ ఇన్నోవేషన్స్ అనే స్టార్టప్ కంపెనీ ఈ వెంటిలేటర్ను రూపొందించింది. తక్కువ ఖర్చుతో తయారయ్యే ఈ ఎమర్జెన్సీ వెంటిలేటర్లో అనేక అత్యాధునిక ఫీచర్లు ఉన్నట్లు ఏరోబయోసిస్ చెబుతోంది. ‘జీవన్లైట్’గా పిలిచే ఈ వెంటిలేటర్.. ఇంట ర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఆధారంగా పనిచేస్తుంది. దీంతో విద్యుత్ సౌకర్యం లేని మారుమూల ప్రాంతాల్లోనూ బ్యాటరీ ద్వారా వాడొచ్చు. వైద్యులు, కుటుంబ సభ్యులకు రక్షణ కరోనా వైరస్కు శరవేగంగా వ్యాపించే లక్షణం ఉండటంతో ఈ జీవన్లైట్ ఎమర్జెన్సీ వెంటిలేటర్ వెద్యులు, రోగుల కుటుంబ సభ్యులకు రక్షణ కల్పిస్తుంది. ఇది లక్ష రూపాయలకే అందుబాటులోకి వస్తుందని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ మూర్తి వెల్లడించారు. ప్రస్తుతం ఏరోబయోసిస్కు రోజుకు 50 నుంచి 70 యూనిట్లు తయారు చేసే సామర్థ్యం ఉందన్నారు. వెంటిలేటర్లను పెద్ద ఎత్తున తయారు చేసేందుకు పారిశ్రామిక సంస్థలు, ప్రభుత్వం ముందుకు రావాలని బయో మెడికల్ ఇంజనీరింగ్ విభాగం అధిపతి ప్రొఫెసర్ రేణు జాన్ కోరారు. కాగా, రోగి శ్వాస తీసుకునే తీరును రికార్డు చేసి, వైద్యుడికి యాప్ ద్వారా సమాచారం అందజేసే ఫీచర్తో పాటు, ఆక్సిజన్ సిలిండర్ను కూడా జత చేసి జీవన్లైట్ను రూపొందించారు. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, డీఆర్డీవో, ఐసీఎంఆర్ తదితర సంస్థల ప్రామాణికాలకు అనుగుణంగా దీన్ని తయారుచేసినట్లు ఏరో బయోసిస్ వెల్లడించింది. ఏకబిగిన 5 గంటలపాటు హృద్రోగులు, టైప్–2 మధుమేహం ఉన్న వారు కరోనా వైరస్ బారిన పడితే శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇలాంటి వారికి అత్యవసర సమయాల్లో ఈ జీవన్ లైట్ రక్షణ కవచంలా పనిచేస్తుంది. కరోనా సోకిన వారికే కాకుండా ఇతర సందర్భాల్లో చిన్న పిల్లలు, వృద్ధులకు తలెత్తే శ్వాస సంబంధ సమస్యలకు కూడా ఈ ఎమర్జెన్సీ వెంటిలేటర్ను వాడొచ్చు. జీవన్లైట్లో ఉండే లిథియం అయాన్ బ్యాటరీని సెల్ఫోన్ తరహాలో రీచార్జి చేసుకోవచ్చు. ఇందులో ఉండే బ్యాటరీని ఒకసారి చార్జ్ చేస్తే 5 గంటలపాటు ఏకబిగిన పనిచేస్తుందని దీన్ని డిజైన్ చేసిన ఏరోబయోసిస్ ఇన్నోవేషన్ చెబుతోంది. ఈ పరికరానికి వైర్లెస్ కనెక్టివిటీ ఫీచర్ ఉండటంతో రిమోట్ మానిటరింగ్ విధానంలో రోగులను తాకకుండానే వాడే వీలుంది. -
కరోనా విలయం : ఈమె త్యాగం మహోన్నతం
కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో ప్రపంచమంతా వణికిపోతోంది. ఈ మహమ్మారి కరోనా వైరస్కు వ్యాక్సిన్ లేకపోవడంతో వేలమంది ప్రాణాలు కోల్పోగా, లక్షలమంది ఈ వైరస్ బారిన పడ్డాయి. అయితే ఇంతటి మహా విలయంలో ఒక పెద్దావిడ అపూర్వమైన త్యాగం చేశారు. వైరసె సోకి ఆరోగ్యం విషమించిన పరిస్థితుల్లో కూడా తనకు వెంటిలేటర్ వద్దని నిరాకరించారు. తనకు బదులుగా తనకంటే వయసులో చిన్న వారికి దాన్ని ఉపయోగించమని చెప్పారు. చివరకు కరోనా కాటుకు బలైపోయారు. బెల్జియంకు చెందిన సుజాన్ హోయలార్ట్స్(90) ఈ మహమ్మారి బారిన పడ్డారు. వ్యాధి ముదరడంతో ఆకలి మందగించడంతోపాటు, శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారింది. దీంతో ఆమెకు వెంటిలేటర్ అమర్చేందుకు వైద్యులు సిద్ధపడ్డారు. ఇక్కడే ఆమె పెద్దమనసును చాటుకున్నారు. ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న ఆమె తనకు కృత్రిమ శ్వాసక్రియను ఉపయోగించడం ఇష్టం లేదనీ, ఇప్పటికే చాలా మంచి జీవితాన్ని గడిపాను కనుక తనకు ఉపయోగించే ఆ పరికరాన్ని వేరే ఎవరైనా చిన్న వయసున్న రోగులకు ఉపయోగించండి అని వైద్యులతో చెప్పారు. దురదృష్టవశాత్తు ఆ తరువాత కొన్ని రోజులకే ఆమె కన్నుమూశారు. దీంతో ఆమె త్యాగం మరువలేనిదంటూ ఆమెకు చికిత్స అందించిన వైద్యులు సహా పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. కాగా కరోనా వైరస్ కారణంగా పంచవ్యాప్తంగా ప్రస్తుతం 8,56,579పాజిటివ్ కేసులు నమోదు కాగా, 42,089 మంది మృతి చెందారు. ఈ మహమ్మారికి కచ్చితమైన మందు, వ్యాక్సిన్ ఏదీ అందుబాటులో రాకపోవడం మరింత ఆందోళన పుట్టిస్తోది. దీనికితోడు వేగంగా పెరుగుతున్న రోగుల సంఖ్య కారణంగా చాలా ప్రాంతాల్లో వెంటిలేటర్ల కొరత వేధిస్తోంది. చదవండి : అమెరికాను వణికించిన భూకంపం -
వెంటిలేటర్కు ప్రత్యామ్నాయం.. బ్యాగ్ వాల్వ్ మాస్క్
సాక్షి, హైదరాబాద్: అంబ్యు బ్యాగ్ పరికరం డిజైన్లో కొన్ని మార్పులు చేయడం ద్వారా వెంటిలేటర్కు ప్రత్యామ్నాయాన్ని తయారు చేయొచ్చని ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ల బృందం కేంద్రానికి సూచించింది. అంబ్యు బ్యాగ్ డిజైన్ను కొద్దిగా మార్చేసి కొత్తగా తయారుచేసే ‘బ్యాగ్ వాల్వ్ మాస్క్’ పరికరం ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని కోరింది. బ్యాగ్ వాల్వ్ మాస్క్ పరికరానికి సంబంధించి ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తితో పాటు మెకానికల్, ఏరోస్పేస్ విభాగం ప్రొఫెసర్ ఈశ్వరన్ ఇటీవల పలు ప్రతిపాదనలు చేశారు. వెంటిలేటర్లకు ప్రత్యామ్నాయంగా ఈ మాస్కుల తయారీకి కార్యాచరణ సిద్ధం చేసేందుకు డీఆర్డీవో లేదా కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం నిపుణులతో అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. 130 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో కరోనా ద్వారా శ్వాస సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉందనే విషయాన్ని ప్రొఫెసర్ బృందం గుర్తు చేసింది. తక్కువ ఖర్చుతోనే.. రోగులకు కృత్రిమ శ్వాస అందించే వెంటిలేటర్ల కొరత, వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని తక్కువ ఖర్చుతో తయారయ్యే వెంటిలేటర్ల నమూనాలపై ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పలు డిజైన్లపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఐఐటీ హైదరాబాద్ బృందం ప్రతిపాదిస్తున్న బ్యాగ్ వాల్వ్ మాస్క్లను విద్యుత్ సౌకర్యం లేని మారుమూల ప్రాంతాల్లోనూ ఉపయోగించొచ్చు. కారులోని బ్యాటరీ వంటి వాటికి ఈ మాస్క్లను అనుసంధానం చేసి నడిపించొచ్చు. వెంటిలేటర్ తరహాలో భారీ మెషీన్ కాకపోవడంతో దీనికి ఒకచోట నుంచి మరో చోటకు తీసుకెళ్లడం చాలా సులువు. దీని తయారీకి కేవలం రూ.5 వేల లోపు ఖర్చు అయ్యే అవకాశం ఉందని ఐఐటీ హైదరాబాద్ బృందం అంచనా వేస్తోంది. త్రీడీ ప్రింటర్ల ద్వారా తయారు చేసే బ్యాగ్ వాల్వ్ మాస్క్ల నమూనాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే త్రీడీ ప్రింటు సాంకేతికత ద్వారా పరిమిత సంఖ్యలోనే తయారుచేసే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. కాగా, ఇవి నిరంతరాయంగా పనిచేయకపోవచ్చనే అనుమానాలనూ ఈ బృందం వ్యక్తం చేసింది. 40 లక్షల మందికి అవసరం మన దేశ జనాభాలో దాదాపు 6 శాతం మందికి అంటే.. 8 కోట్ల మందికి కరోనా వైరస్ సోకుతుందని అంచనా.. చికిత్సలో భాగంగా ఇందులో కనీసం 40 లక్షల మందికి వెంటిలేటర్లు అవసరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే దేశంలో కేవలం 40 వేల వెంటిలేటర్లు మాత్రమే అందుబాటులో ఉండగా, వచ్చే 10 నెలల్లో మరో 60 వేల వెంటిలేటర్లు మాత్రమే తయారుచేసే సామర్థ్యం మన దేశీయ కంపెనీలకు ఉంది. ఇందుకు దాదాపు రూ.3,600 కోట్లు అవసరం కానున్నాయి. పైగా కంప్యూటర్ సాయంతో నడిచే అత్యాధునిక వెంటిలేటర్ ధర రూ.40 లక్షల మేర పలుకుతుండగా, సాధారణ రకం విదేశీ వెంటిలేటర్కు రూ.15 లక్షల వరకు పలుకుతుండగా, దేశీయ వెంటిలేటర్కు రూ.6 లక్షల వరకు ఉంది. ‘అంబు బ్యాగ్’అంటే.. అత్యవసర సమయాల్లో రోగులకు శ్వాస అందించే సంచిలాంటి పరికరాన్ని వైద్య పరిభాషలో అంబ్యు బ్యాగ్ అంటారు. దీన్ని విద్యుత్ అవసరం లేకుండా చేతి ద్వారానే పనిచేయిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో దీని డిజైన్లో కొన్ని మార్పులు చేయడం ద్వారా ‘బ్యాగ్ వాల్వ్ మాస్క్’ను తయారుచేయాలని ఐఐటీ హైదరాబాద్ సూచిస్తోంది. 60 వేల వెంటిలేటర్ల తయారీకి అయ్యే ఖర్చుతో దాదాపు 60 లక్షల బ్యాగ్ వాల్వ్ మాస్కులను త యారు చేయొచ్చని చెబుతోంది. -
మదురై ఆస్పత్రిలో దారుణం
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని మదురై ప్రభుత్వ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న ఐదుగురు రోగులు ఒకరి తరువాత మరొకరు ప్రాణాలు విడిచిన విషాదకర సంఘటన మంగళ, బుధవారాల్లో జరిగింది. మదురైలో మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా బలమైన గాలులు వీయడంతోపాటు భారీ స్థాయిలో వర్షం కురిసింది. దీంతో సుమారు రెండు గంటలపాటు ఆ ప్రాంతమంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆస్పత్రికి కూడా కరెంటు సరఫరా నిలిచిపోవడం, జనరేటర్ల ద్వారా విద్యుత్ సరఫరా ఆలస్యం కావడంతో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న రోగులు ఆక్సిజన్ అందకపోవడంతో విలవిల్లాడారు. ఈ నేపథ్యంలో మదురై జిల్లా మేలూరుకు చెందిన మల్లిక (55), దిండుగల్లు జిల్లా ఒట్టనసత్రంకు చెందిన పళనియమ్మాళ్ (60), విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూరుకు చెందిన రవీంద్రన్ (52) ప్రాణాలు విడిచారు. బుధవారం ఉదయం మదురై సెల్లూరుకు చెందిన చెల్లత్తాయ్ (55), తిరుప్పూరు జిల్లా పల్లడంకు చెందిన ఆర్ముగం (48) కూడా మృతి చెందారు. అయితే వెంటిలేటర్ పనిచేయక పోవడం వల్ల కాదని, వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెంచారని ఆస్పత్రి డీన్ వనిత చెప్పారు. -
మృత్యుఘోష
సాక్షి, గుంటూరు: వెంటిలేటర్పై ఉన్న పసికందును ఎలుకలు పీక్కుతిన్నాయి.. బతికున్న పసికందు చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారిస్తే స్మశానం వద్ద కదిలాడాడని కుటుంబ సభ్యులు వెనక్కు తెచ్చారు.. డబ్బు కోసం బిడ్డల్ని మార్చారంటూ ఆరోపణలు.. బాలింత చనిపోతే పది గంటల వరకూ చూడనేలేదు.. స్కానింగ్ కోసం వెళ్లిన గర్భిణిని పట్టించుకోకపోవడంతో గంటల కొద్దీ నిరీక్షించి స్కానింగ్ కేంద్రం వద్దే కిందపడిపోయి అక్కడే ప్రసవించింది. ఆ నెత్తుటి మరకలను గర్భిణి తల్లితోనే తుడిపించారు. బతికుండగానే స్ట్రెచర్తో సహా ఓ వృద్ధుడ్ని బయటకు గెంటేశారు. సూదిమందు డ్యూటీ తమది కాదంటే తమది కాదంటూ వైద్యులు, స్టాఫ్ నర్సులు ఓ రోజంతా వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి పూనం మాలకొండయ్య సోదరికే సూది మందు ఇవ్వకుండా ఉంచిన విచిత్ర ఘటన.. మానవత్వానికే మచ్చ తెచ్చేలా ఉన్న ఇవన్నీ మారుమూల పీహెచ్సీలో కాదు.. నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగరంగా ఉన్న గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జీజీహెచ్)లో జరుగుతున్న వరుస దారుణాలు.. ఇక్కడ నిత్యం 20 మందికిపైగా మృత్యువాత పడుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రైవేటు క్లినిక్లకే అధిక సమయం అధికారికంగా 1177 పడకలు, అనధికారికంగా 1700కుపైగా పడకలతో అతి పెద్దదిగా పేరొందిన గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి పరిస్థితి ఊరుగొప్ప.. పేరుదిబ్బలా తయారైంది. అత్యవసర వైద్యసేవలు పొందాలంటే రోగులకు కష్టంగా మారింది. ఫలితంగా ఈ ఆసుపత్రిలో మరణాల రేటు రోజురోజుకూ పెరుగుతోంది. వైద్య ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆస్పత్రిలో అందుబాటులో ఉండటం లేదు. ప్రైవేటు క్లినిక్లకే వారు అధిక సమయం కేటాయిస్తున్నారు. క్యాజువాల్టీ, ట్రామాకేర్, ఐసీయూ, ఇతర ఎమర్జెన్సీ, గైనిక్ వార్డుల్లో రోగులకు సకాలంలో వైద్యసేవలందక మరణాలు పెరుగుతున్నాయి. కొందరు వైద్యాధికారుల తప్పిదాల కారణంగా ఆస్పత్రి మొత్తానికే చెడ్డ పేరు వస్తోంది. నాలుగు వేలకుపైగా అవుట్ పేషెంట్లు గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి గుంటూరుతోపాటు చుట్టుపక్కల ఆరు జిల్లాల ప్రజలు వస్తారు. రోజుకు దాదాపు 3, 500 నుంచి 4,000 వరకు అవుట్ పేషెంట్లు ఉంటారు. ఆస్పత్రిలోని వివిధ వార్డుల్లోకి రోగులు, వారి వెంట సహాయకులు కలిపి మొత్తం రోజుకు 10 వేల మంది వస్తుంటారు. ఇటీవల ఆస్పత్రి వైద్యుల సేవల తీరుపై భారీగా ఫిర్యాదులందుతున్నాయి. ఏ వార్డులోనూ సంబంధిత వైద్యాధికారులు అందుబాటులో ఉండటం లేదు. ఉన్నతాధికారులు తనిఖీల పేరుతో వార్డులు తిరుగుతున్నా వైద్య సిబ్బంది వ్యవహారశైలిని మాత్రం గాడిలో పెట్టలేకపోతున్నారు. జీజీహెచ్లోని పలు వార్డుల్లో గుండెల్ని పిండేసే ఘటనలు రోజుకొకటి కనిపిస్తున్నాయి. పెరుగుతున్న మరణాల సంఖ్య జీజీహెచ్లో 2017 జనవరి నుంచి సెప్టెంబర్ వరకూ తొమ్మిది నెలల్లో 5, 321 మంది మృతి చెందినట్లు అధికారిక లెక్క చెబుతున్నాయి. ఇంకా ఇక్కడ సరైన వైద్యం అందక వేరే ఆసుపత్రులకు తరలిస్తున్న సమయంలో జరిగిన మరణాలు చాలానే ఉన్నాయి. అత్యవసర వార్డుల్లో చేరిన రోగులే సకాలంలో వైద్యసేవలు అందక ప్రాణాలొదులుతున్నట్లు తెలుస్తోంది. క్యాజువాల్టీ , ట్రామాకేర్, ఎక్యుట్మెడికల్ కేర్ యూనిట్ (ఏఎంసీ), ఇంటెన్సివ్ మెడికల్ కేర్ యూనిట్ (ఐసీయూ)ల మరణాల రేటు ఎక్కువగా నమోదవుతోంది. తీరుమార్చుకోని జీజీహెచ్ అధికారులు ఆస్పత్రిలో అత్యవసర వైద్య చికిత్సల తీరును నిత్యం పర్యవేక్షించాల్సిన రెసిడెంట్ మెడికల్ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో పనిచేసే వైద్యులు ఎంత మంది ప్రైవేట్ ప్రాక్టీసులు చేస్తున్నారు, వారు ఆసుపత్రిలో ఉంటున్నారా.. మధ్యలోనే వెళ్తున్నారా అనే విషయాలపై ఇంటిలిజెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడం, ప్రభుత్వం కొందరిపైనే చర్యలు తీసుకోవడం తెలిసిందే. ఒక్కోమారు రాత్రిళ్లు కనీసం ఇంజెక్షన్లు చేయడానికి కూడా సిబ్బంది అందుబాటులో ఉండడం లేదు. దీంతో అత్యవసర వార్డుల్లో మరణాల సంఖ్య అధికంగా నమోదవుతోంది గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్, గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ పోస్టులు అనేక ఏళ్లుగా సీనియర్లను కాదని రాజకీయ ఒత్తిళ్లతో తమకు ఇష్టమొచ్చిన వారిని కూర్చోబెడుతున్నారు. దీంతో సీనియర్ వైద్యులెవరూ వీరి మాటలు లెక్క చేయడం లేదు. ఇన్ఛార్జిలు కావడంతో వీరు సైతం వైద్యులు, సిబ్బందిపై సీరియస్గా దృష్టి సారించలేకపోతున్నారు. దీంతో జీజీహెచ్లో మరణాల సంఖ్య తగ్గడం లేదు. -
సౌత్కి సై!
అంటే ప్రియాంకా చోప్రా సౌత్ సినిమాలో కథానాయికగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనుకుంటున్నారా? అది కాదు. అసలు విషయం వేరే ఉంది. కథానాయికగా సక్సెస్ఫుల్గా కొనసాగుతోన్న ప్రియాంకా చోప్రా భోజ్పురి, మరాఠీ, పంజాబీ భాషల్లో సినిమాలు నిర్మిస్తున్నారు. మరాఠీలో ఆమె నిర్మించిన ‘వెంటిలేటర్’ కథ సౌత్కి తగ్గట్టుగా ఉంటుందని, మలయాళంలో రీమేక్ చేస్తే బాగుంటుందనీ ఫ్రెండ్స్ సలహా ఇస్తే, ప్రియాంక ‘సై’ అన్నారట. ‘‘మల యాళంలో కంటెంట్ బేస్డ్ మూవీస్ వస్తుంటాయి. ‘వెంటిలేటర్’ రీమేక్ పనులన్నీ నిర్మాతగా నేను దగ్గరుండి చూసుకోబోతున్నా. ఇంకా దర్శకుడు, నటీ నటులను ఖరారు చేయలేదు’’ అని ప్రియాంక తల్లి మధు చోప్రా పేర్కొన్నారు. -
తెల్లకోటులో తడిగుండె!
సందర్భం: నేడు డాక్టర్స్ డే రెండు తనువులు ఒకటే కాలేయం కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రీనివాస్, సంధ్య భార్యాభర్తలు. వాళ్లకు ఇద్దరు పిల్లలు. తొమ్మిదేళ్ల అబ్బాయి. నాలుగేళ్ల అమ్మాయి. ఇద్దరూ టీచర్లే. వేర్వేరు చోట్ల పోస్టింగ్. దాంతో పిల్లలు తల్లి దగ్గర ఉంటున్నారు. వీకెండ్లో, సెలవుల్లో అందరూ కలుస్తారు. అంతా హ్యాపీ. మూడు నెలల కిందట శ్రీనివాస్కు కామెర్లు వచ్చాయి. ఏదో నాటు మందు తీసుకోవడంతో ఒళ్లూ, కళ్లూ పచ్చగా మారాయి. కాలేయం పూర్తిగా దెబ్బతిని, పరిస్థితి విషమించింది. మరింత మంచి చికిత్స కోసం మే 25న మా దగ్గరికి తీసుకొచ్చారు. రోగి హెపాటిక్ కోమా అంచున ఉన్నాడు. వెంటనే వెంటిలేటర్పై పెట్టాం. అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ కండిషన్లో తక్షణం కాలేయ మార్పిడి జరగకపోతే మెదడు వాచిపోయి పూర్తిగా దెబ్బతింటుంది.ఎంతమాత్రమూ చక్కదిద్దలేని పరిస్థితి అది. కాలేయం కోసం వెతుకుతూ ఉండగా అదృష్టవశాత్తు భార్య సంధ్య కాలేయం శ్రీనివాస్కు సరిపడుతుందని తేలింది. భర్తను కాపాడుకోడానికి సంధ్య వెంటనే సన్నద్ధం అయ్యింది. ఆఘమేఘాల మీద ఆపరేషన్కు అంతా సిద్ధమైంది. ఆసుపత్రిలో భావోద్వేగ వాతావరణం. ఆ భార్యభర్తలకోసం, ఆ పిల్లల కోసం అంతా ప్రార్థిస్తున్నారు. మే 26 సాయంత్రం మేజర్ సర్జరీ. అన్ని సన్నద్ధాలు జరిగాయి. ఎన్నో విభాగాలకు చెందిన నిపుణులు, ఇతరత్రా వైద్య, వైద్యేతర సిబ్బంది ప్రాణరక్షణ యాగంలో నిమగ్నమయ్యారు. నా నేతృత్వంలో సర్జరీ జరిగింది. విజయవంతంగా ముగిసింది. బాగా కోలుకొని సంధ్య ముందుగా డిశ్చార్జ్ అయ్యారు. అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ చాలా సంక్లిష్టమైనది. హెచ్చరికలు లేకండా వచ్చేస్తుంది. చాలా కష్టమైనదీ, సంక్లిష్టమైనదీ, ఖర్చుతో కూడినది. అయితే శ్రీనివాస్ అదృష్టానికి, మా అందరి సమష్టికృషి తోడైంది. ఆపరేషన్ జరిగిన 13వ రోజున సరికొత్త జీవితంతో శ్రీనివాస్ మళ్లీ ఈ లోకంలోకి వచ్చారు. డాక్టర్ మనీశ్ సి. వర్మ, హెడ్ – లివర్ ట్రాన్స్ప్లాంట్ అండ్ హెపాటోబిలియరీ పాంక్రియాటిక్ యూనిట్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్ కల్పన కంటే చిత్రమైనది వాస్తవం! ‘‘శశిధర్గారిని ఎమర్జన్సీకి తీసుకొచ్చారు సర్’’ ఒక రోజు రాత్రి పదకొండు గంటలకు భోజనం చేస్తుండగా వచ్చిన ఫోన్లో చెప్పాడు మా హాస్పిటల్ ఎమర్జెన్సీ డాక్టర్ ప్రసాద్. ‘‘ఛాతీలో నొప్పి. తీవ్రమైన హార్ట్ ఎటాక్. వెంటనే రండి’’ చెప్పాడు. భోజనం మధ్యలోనే ముగించి బయల్దేరాను. శశిధర్ను కాథ్ల్యాబ్కు తరలించమని మధ్యదారిలోనే సూచించాను. సిస్టర్స్, ఇతర టెక్నీషియన్స్ను తయారుగా ఉండేలా ఏర్పాటు చేశాను. మా కొలీగ్ డాక్టర్ ప్రేమ్చంద్ను కూడా నాతో రమ్మని కోరాను. సరిగ్గా పావుగంటలో ఆసుపత్రికి చేరుకున్నాను. శశిధర్కు వచ్చిన గుండెపోటు చాలా తీవ్రమైనది. అత్యవసరంగా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ చేసినా బతికే అవకాశాలు 25 శాతం మాత్రమే. శశిధర్గారి భార్య, ముగ్గురు కొడుకులు, కూతురూ ఆయనను కాపాడమని ప్రాధేయపడడంతో ఎలాగైనా ఆయనను బతికించాలని నేనూ, ప్రేమ్చంద్ రంగంలోకి ఉరికాం. యాంజియోగ్రామ్ చేసి గుండె రక్తనాళాల్లోని అడ్డంకిని గుర్తించాం. దాన్ని తొలగించే ప్రయత్నాలు మొదలుపెట్టాం. గంట పాటు క్యాథ్లాబ్లోని పరిస్థితి యుద్ధవాతావరణాన్ని తలపించింది. ఎట్టకేలకు శశిధర్ గుండె మళ్లీ కొట్టుకోవడం మొదలైంది. ఈలోగా పిడుగులాంటి ఓ వార్త. ‘‘ఇప్పుడే ల్యాబ్ నుంచి ఫోన్ సర్. శశిధర్కు హెచ్ఐవీ పాజిటివ్ అట’’. వణికిపోయాను. శశిధర్ ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో నాకూ, నా సహచరుడైన ప్రేమ్చంద్కూ ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉండవచ్చు. శశిధర్ కుటుంబాన్ని పిలిచి పరిస్థితిని వివరించాను. ‘‘ఆసుపత్రికి రావడంలో పదినిమిషాలు ఆలస్యం చేసినా, ఆయన దక్కేవారు కాదు’’ అంటూ కొడుకుకు విషయం చెప్పాం. తండ్రి అంటే కొడుకుకు అవ్యాజమైన ప్రేమ. కానీ ఆ ప్రేమను ప్రాక్టీకాలిటీ కమ్మేసి ఆ కొడుకు అన్న మాటలు నా గుండెను నొక్కేశాయి. ‘‘సార్ పది నిమిషాలు ఆలస్యం అయితే మా నాన్న ప్రాణాలు దక్కేవి కావని మీరన్నారు. కానీ నాకిప్పుడనిపిస్తోందీ... ఆ పది నిమిషాలు ఆలస్యం ఎందుకు కాలేదా అని.’’ అంటూ రోదించాడు. అనంతమైన ప్రేమసముద్రం... ప్రాక్టికాలిటీ అనే సూర్యుడి వేడికి ఆవిరైపోతున్న దృశ్యం కనిపించింది. నాలుగోరోజున శశిధర్ కోలుకోవడం మొదలైంది. వారంరోజుల్లో డిశ్చార్జ్ చేశాం. నెల తర్వాత ఫాలో అప్కు వచ్చినప్పుడు ‘‘నా వాళ్ల కళ్లలో కనిపించే నిర్లిప్తత చూస్తే చనిపోవడమే మంచిదనిపిస్తోంది సర్’’ అన్నాడు. ఐసీయూలో మృత్యువుతో పోరాడిన శశిధర్లో ఇప్పుడు యుద్ధం ఓడిన సైనికుడు కనిపిస్తున్నాడు. మూడు నెలల తర్వాత నేనూ, నా కొలీగ్ ప్రేమ్చంద్ హెచ్ఐవీ టెస్ట్ చేయించాం. ఏమీ కాదని నమ్మకం ఉన్నా మనసులో మూలన ఏదో భయం. ఆ మర్నాడు రెండు వార్తలు నాకు తెలిశాయి. మొదటిది... నాకూ, ప్రేమ్చంద్కు హెచ్ఐవీ సోకలేదు. ఇక రెండోది... రక్తంలో షుగర్ తగ్గడంతో శశిధర్ మరణించారు. అవును... కొన్ని ఆత్మహత్యలకు రుజువు లుండవు. సమాజం చేసే హత్యలకు సాక్ష్యాలుండవు. డాక్టర్లూ రాగద్వేషాలకు, భయాలకు అతీతులు కారు. డాక్టర్ ఎమ్.ఎస్.ఎస్. ముఖర్జీ, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, మాక్స్క్యూర్ హాస్పిటల్స్, మాదాపూర్ ఆపారమైన ఆ అమ్మ ప్రేమకు నా చికిత్స కాస్త తోడయ్యిందంతే!! చిన్నారి నాజ్మీన్ శోడియాల్కు జస్ట్ 14 ఏళ్లు. ఎక్కడో అస్సాం రాష్ట్రంలోని మారుమూల మధుబన్ అనే చిన్న పల్లెటూరు ఆమెది. ఆడీ పాడీ అలసీ సొలసీ సేదదీరుతూ ఆనందంగా గడపాల్సిన వయసాపాపది. కానీ కిడ్నీలు రెండూ చెడిపోవడంతో ఆమెకు ప్రాణగండం ఏర్పడింది. దాదాపు మరణం అంచున ఉన్న ఆ పాపను ఎలాగైనా రక్షించుకోవాలనుకున్నారు ఆమె తల్లిదండ్రులు. అక్కడ ఎవరో నా పేరు చెప్పారట. అంతే... అస్సాం నుంచి ఇక్కడికి వచ్చి నన్ను సంప్రదించారు. ఆమెకు మూత్రపిండం మాత్రమే ప్రాణగండం కాదు. తండ్రి ఖుఖాన్ శోడియల్ నెలసరి వేతనం కేవలం రూ. 12000. ఆపరేషన్కు కనీసం రూ. ఏడు లక్షలైనా కావాలి. ఇక రెండో అవసరం ఎవరైనా మూత్రపిండం ఇవ్వాలి. డబ్బు సమకూర్చడం కోసం అందరమూ ఎంతో కష్టపడ్డాం. దాతలు, వదాన్యులతో పాటు కేర్ ఫర్ యువర్‡ కిడ్నీ ఫౌండేషన్ (సీఎఫ్వైకేఎఫ్) చేయూత ఇచ్చింది. స్టార్ హాస్పిటల్స్ ఎన్నో రాయితీలు ఇచ్చి తన పూర్తి సహకారం అందించింది. అపార ప్రేమాస్పదమూర్తి అయిన తన అమ్మ హిరామణి మూత్రపిండాన్ని నవ్వుతూ ఇచ్చింది. గత ఏడాది ఆగష్టులో ఇక్కడికి వచ్చిన ఆ అమ్మాయికి అక్టోబరులో శస్త్రచికిత్స చేశాం. ఆపరేషన్ పూర్తయ్యింది. అదీ అందరి సహకారంతో, కేవలం మూడు లక్షల ఖర్చుతోనే. ఇప్పుడా చిన్నారి అందరు పిల్లల్లాగే ఆనందంగా స్కూల్కు వెళ్తోంది. ఆపరేషన్ పూర్తయ్యాక అద్భుతంగా తన చేత్తో అల్లిన ఊల్ శాల్ను నాకు బహూకరించిందా చిన్నారి. అంతటి మంచి కానుక నాకు ఇచ్చింది గానీ ఆమె ప్రాణాలు రక్షించడానికి ఆ తల్లి తన కూతురికి ఇచ్చిన వరంతో పోలిస్తేæ నేను చేసిన వైద్యం ఏపాటిది? – డాక్టర్ రాజశేఖర్ చక్రవర్తి, సీనియర్ నెఫ్రాలజిస్ట్, స్టార్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ ఈ చిన్నారికి చేసిన ఆపరేషన్ చరిత్రలోనే తొలిసారి! ఈ లోకంలోకి వచ్చి అందమైన ఈ ప్రపంచాన్ని చూడాలని ఆ చిన్నారి ఎంతగా త్వరపడిందంటే తన ఊపిరితిత్తులు మాత్రమే కాదు... ముక్కురంధ్రాలు కూడా ఏర్పడకముందే ఆమె పుట్టేసింది. అందునా కేవలం 1100 గ్రాముల బరువుతో. అది కూడా అసలు వ్యవధి కంటే మూడు వారాల ముందుగా. ముక్కురంధ్రాలూ లేని ఈ కండిషన్ను వైద్య పరిభాఫలో ‘కంజెనిటల్ కొయానల్ యాస్ట్రీషియా’ అంటారు. తక్షణం గాలి పీల్చుకోడానికి నోటిలో ఒక తాత్కాలిక మార్గం ఏర్పరచకపోతే వీళ్లు వెంటనే చనిపోతారు. ఆ మార్గాన్ని ఏర్పాటు చేసి, నోటి ద్వారా వెంటిలేటర్ అమర్చి మా దగ్గరికి తీసుకువచ్చారు. నిజానికి ఇదో ఛాలెంజ్. అంతకు మునుపు అప్పుడే పుట్టిన పిల్లలకు ముక్కురంధ్రాలు ఏర్పాటు చేశారు గానీ... ఇలా ప్రీ–మెచ్యుర్గా పుట్టిన బేబీకి ముక్కు రంధ్రాలు ఏర్పాటు చేయడం అన్నది నాకు తెలిసనంత వరకు వైద్య చరిత్రలోనే ఇది మొదటిసారి. అప్పటికే రెండు గర్భస్రావాల తర్వాత పుట్టిన చిన్నారి కావడంతో ఆ పాప చాలా అపురూపం. అలాంటి ప్రెషియస్ బేబీకి లంగ్స్ అభివృద్ధి చెందడానికి వారం టైమిచ్చాం. అసలు ఆపరేషన్ ముందుంది. కేవలం ఒక మిల్లీమీటరు వ్యాసం కలిగి ఉన్న స్కీటర్ అనే వజ్రపు డ్రిల్తో ఎండోస్కోపిక్ విధానంలో ముక్కు రంధ్రాలను నిర్మించాం. అవి వెంటనే మూసుకుపోకుండా స్టెంట్స్ ఏర్పాటు చేశాం. అలా ఆరువారాల టైమ్ ఇచ్చాం. అప్పటికి ముక్కు రంధ్రాలు మళ్లీ మూసుకుపోకుండా ఏర్పడ్డాయి. ఒక ఉచ్ఛ్వాస... ఆ చిన్నారి తనంతట తానే గాలి పీల్చుకుంది. మేం శ్వాసబిగబట్టుకున్నాం. నిశ్శా్వస... ఆమె మళ్లీ గాలి వదిలింది. హా... అంటూ హాయిగా నిట్టూరుస్తూ మేమూ ఆమెతో పాటు బిగబట్టిన ఊపిరి వదిలాం. ముక్కురంధ్రాలు ఏర్పాటు చేసిన చిన్నారితో డాక్టర్ విష్ణుస్వరూప్రెడ్డి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఈఎన్టీ, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్ అంటుకట్టిన గుండె వికసించిన వేళ! అరుణ(24)ది కాకినాడ. గోపాలకృష్ణతో వివాహం తర్వాత ఆమె పూణేలో స్థిరపడ్డారు. కొడుకు కార్తీక్కు రెండున్నర ఏళ్లు. అందమైన కుటుంబం. అంతలోనే కల్లోలం. 2015లో సొంత ఊరికి వెళ్లినప్పుడు ఆమె అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. వైద్యపరీక్షలు చేసి ఆమెకు కార్డియోమయోపతి అని తేల్చారు. పూణే డాక్టర్ల సూచన మేరకు ఆమె మా హాస్పిటల్కు వచ్చారు. పరీక్షల్లో గుండె సామర్థ్యం కేవలం 15 శాతం మాత్రమేనని తేలింది. వెంటనే గుండెమార్పిడి శసచికిత్స చేస్తే తప్ప బతకదు. ఆ విషయం అరుణ భర్తకి చెప్పి జీవన్దాన్ సంస్థలో పేరు నమోదు చేయించుకొమ్మని సూచించాం. కిందటి ఏడాది జూన్ నెల అది. కొద్దిరోజుల్లోనే స్కూళ్లూ కాలేజీల ప్రారంభం. కాబట్టి బంధువులూ, స్నేహితులతో విహారయాత్రలకు ప్లాన్ చేసుకున్నాం. జూన్ 14న అరుణ ఆరోగ్యం మరోసారి విషమించింది. ఆమె మృత్యువుతో పోరాడుతోంది. అలాంటి సమయంలో మా వినోదాలూ, విహారాల కంటే పేషెంట్ ప్రాణాలే ముఖ్యమనుకున్నాం. మా సరదాలను వాయిదా వేసుకున్నాం. అప్పుడు ఒక వ్యక్తి దురదృష్టం అరుణ పాలిట అదృష్టమైంది. రోడ్డు ప్రమాదానికి గురైన ఒక వ్యక్తి బ్రెయిన్డెడ్ కావడంతో అరుణకు గుండె లభ్యమైంది. దాదాపు తొమ్మిదిగంటల కఠోర శ్రమతో కూడిన సర్జరీ చేశాం. అందరిలోనూ ఉత్కంఠ. ఎట్టకేలకు ఆపరేషన్ సక్సెస్. పదిరోజుల్లో అరుణ కోలుకొని ఇంటికి వెళ్లారు. భర్త, కొడుకుతో ఇప్పుడామె ఆనందంగా ఉన్నారు. ఆమె ఆనందం చూస్తే నాలోకి సర్జన్ పట్ల కించిత్ గర్వం.అకుంఠిత దీక్షతో పనిచేసే అద్భుతమైన నా టీమ్ పట్ల అపారమైన గౌరవం. కోలుకున్న అరుణతో డాక్టర్ పి.వి. నరేశ్కుమార్, సీనియర్ కార్డియోథొరాసిక్ అండ్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
పిగ్గీ చాప్స్.. ట్రిపుల్ హ్యాపీనెస్!
ప్రియాంకా చోప్రా నిర్మించిన మొదటి మరాఠీ చిత్రం ‘వెంటిలేటర్’ దర్శకుడు రాజేశ్, ఎడిటర్ రామేశ్వర్ ఎస్. భగత్, సౌండ్ మిక్సింగ్ టెక్నీషియన్ అలోక్... ముగ్గురికీ జాతీయ అవార్డులు వచ్చాయి. ఉమ్మడి కుటుంబం కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. వినాయక చవితికి కొన్ని రోజుల ముందు... ఓ పెద్దాయన అనారోగ్యానికి గురి కావడంతో వెంటిలేటర్పై పెడతారు. అప్పుడు ఉమ్మడి కుటుంబం, బంధువులు... వాళ్ల మధ్య జరిగే వాదోపవాదనలు, గొడవలే సినిమా కథ. ‘లగాన్’, ‘స్వదేశ్’, ‘జోధా అక్బర్’ వంటి చిత్రాలు తీసిన ప్రముఖ హిందీ దర్శకుడు, నటుడు, నిర్మాత అశుతోష్ గోవారికర్ ప్రధానపాత్ర పోషించిన ఈ సినిమాలో సుమారు వందమంది కీలక పాత్రల్లో కనిపించారు. ప్రేక్షకుల ప్రశంసలతో పాటు మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రానికి 3 నేషనల్ అవార్డులు రావడంతో పిగ్గీ చాప్స్ (ప్రియాంకా చోప్రా) ట్రిపుల్ హ్యాపీగా ఉన్నారు. నిర్మాతగా ఆమెకిది రెండో సినిమా. దీనికి ముందు భోజ్పురిలో ఓ సినిమా తీశారు. ‘‘ఐయామ్ స్పీచ్లెస్. నేను దర్శకత్వం వహించిన మొదటి మరాఠీ చిత్రానికి నేషనల్ అవార్డు వచ్చిందోచ్! నా కల నిజమైంది. ‘వెంటిలేటర్’ సినిమా యూనిట్కి, ముఖ్యంగా నాపై నమ్మకంతో ఈ సినిమా నిర్మించిన ప్రియాంకా చోప్రా, మధు చోప్రా (ప్రియాంక తల్లి)లకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ – ‘వెంటిలేటర్’ దర్శకుడు రాజేశ్ -
వెంటిలేటర్పైనే చిన్నారి సంజన
-
ఆడపడుచుకు అనుకోని ఆపద
♦ అరుదైన వ్యాధికి గురైన మమత ♦ చికిత్సకు రూ. 25 లక్షలు అవసరం ♦ దాతల కోసం ఎదురుచూపులు మోత్కూరు : నిరుపేద ఆడపడుచుకు పెద్ద కష్టం వచ్చింది. పండంటి బిడ్డను కని ఆనందంగా జీవి తం గడపాలనుకున్న ఆ మహిళకు అనుకోని ఆపద వచ్చింది. అరుదైన వ్యాధి బారినపడింది. మోత్కూరు మండలం మానాయికుంటకు చెందిన కొమ్ము వెంకటయ్య-పద్మ దంపతుల కూతురు మమతకు ఏడాది క్రితం తిరుమలగిరికి చెందిన వీరయ్యతో వివాహమైంది. 3 నెలల క్రితం మమత గర్భవతిగా ఉన్న సమయంలో జ్వరం, ఫిట్స్ రావడంతో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రి, అక్కడి నుంచి హైదరాబాద్ కొత్తపేటలోని ఓమ్నీ ఆస్పత్రిలో చేర్పించారు. అబార్షన్ చేసి 3 నెలలుగా వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. యాంటీఎన్ఎండీ యాంటీబాడీ ఎన్సెఫలిటీస్ వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. చికిత్సకు 25 లక్షలు అవసరమని చెప్పారు. దేశంలో ఈ వ్యాధి సోకినవారు కేవలం 15 మంది ఉన్నట్లు డాక్టర్లు సందీప్రెడ్డి, వెంకట్రెడ్డి వివరించారు. అత్తింటివారు పట్టించుకోవడంలేదని, దాతలు ఆపన్నహస్తం అందించాలని తండ్రి వేడుకుంటున్నాడు. దాతలు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్: 9948050134, స్టేట్బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అకౌంట్ నెంబర్ 62406934756 -
విషమించిన విఠల్ ఆరోగ్యం
► వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న వైనం ► మెరుగైన వైద్యం కోసం ప్రైపెవేట్ ఆస్పత్రికి తరలింపు అనంతపురం : నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలో ప్రభుత్వాస్పత్రిలో చేరిన ఎస్కేయూ రిటైర్డ్ డెప్యూటీ రిజిస్ట్రార్ కె.విఠల్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. శుక్రవారం సాయంత్రం నుంచి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నా శనివారం సాయంత్రం వరకు ఆయన తేరుకోలేదు. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. అయితే మెరుగైన చికిత్స కోసం ఆయన కుటుంబ సభ్యులు అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విఠల్ కుమారుడు వీఎస్ సాయిచైతన్య నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసకున్న సంగతి తెలిసిందే. ఆ జంట ఆజ్ఞాతంలోకి వెళ్లడంతో వారి సమాచారం చెప్పాలంటూ యువతి బంధువులు విఠల్ దంపతులపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెచ్చారు. దీంతో మనస్థాపానికి గురైన విఠల్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి విదితమే. కలకలం రేపుతోన్న వేలిముద్రల సేకరణ ప్రభుత్వాస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్న విఠల్ వద్దకు శుక్రవారం రాత్రి కొందరు వ్యక్తులు వెళ్లి ఖాళీ తెల్లటి కాగితాలపై విఠల్ వేలిముద్రలు తీసుకోవడం కలకలం రేపుతోంది. వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న తన భర్త నుంచి బలవంతంగా వేలిముద్రలు తీసుకున్నారంటూ ఆయన భార్య వాపోయారు. -
అంత్యక్రియలు చేస్తుండగా.. కదిలిన బిడ్డ!
మంబై: ఈ బిడ్డ బతికే అవకాశం లేనే లేదని డాక్టర్లు చెప్పడంతో.. కొడుకు చనిపోయాడని అంత్యక్రియలకు తీసుకెళ్లిన తల్లిదండ్రులకు షాక్ తగిలింది. ఐదు నిమిషాల్లో మరణిస్తాడనుకున్న బిడ్డ మృత్యుంజయుడిగా బయటపడిన ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి చెందిన భాగ్య శ్రీ, నాగోజీ రావు దంపతులు కొన్నాళ్లుగా గుజరాత్లోని భరుచ్ ప్రాంతంలో ఉంటున్నారు. వాళ్లకు మూడు రోజుల కిందట పండంటి కొడుకు పుట్టాడు. బిడ్డ పుట్టుకతోనే శ్వాససంబంధ వ్యాధితో ఇబ్బంది పడుతుండటంతో సర్ సాయాజీరావు జనరల్ ఆసుపత్రి డాక్టర్లు వెంటిలేటర్పై ఉంచి చికిత్సను అందించారు. బిడ్డ చికిత్సకు ఎంతకూ స్పందించకపోతుండటంతో వెంటిలేటర్ పై నుంచి తీసిన ఐదు నిమిషాల్లో మరణిస్తాడని తల్లిదండ్రులకు చెప్పారు. దాంతో.. ఇక తమ కొడుకు చనిపోయాడని భావించిన ఆ తల్లిదండ్రులు అంత్యక్రియలు నిర్వహించబోయారు. ఆ సమయంలో బిడ్డ కదలడం గమనించిన తండ్రి హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లాడు. దీంతో ఆశ్చర్యపోయిన వైద్యులు బిడ్డను మళ్లీ వెంటిలేటర్ మీద ఉంచారు. ఆ తర్వాత బిడ్డ చికిత్సకు క్రమంగా స్పందించడంతో వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇలాంటి కేసులు చాలా అరుదుగా కనిపిస్తాయని.. బిడ్డ ఇప్పుడు సొంతంగా ఊపిరి తీసుకుంటున్నాడని డాక్టర్ పాండే తెలిపారు. -
వెంటిలేటర్పై ఎప్పుడు, ఎందుకు..?
జనరల్ హెల్త్ కౌన్సెలింగ్ వెంటిలేటర్పై ఎప్పుడు, ఎందుకు..? మా అమ్మగారి వయసు 68 ఏళ్లు. ఇప్పుడు ఆమె వెంటిలేటర్ మీద ఉన్నారు. ఇక ఆమె బతకడం కష్టమని అందరూ అంటున్నారు. వెంటిలేటర్ మీద ఉన్నవారు బతకడం కష్టమా? అసలు వెంటిలేటర్ ఎందుకు అమర్చుతారు? ఒకవేళ ఆమె ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంటే, ఇలా ఆమె ఇంకెన్ని రోజులు వెంటిలేటర్పై ఉండాల్సి ఉంటుంది? - దయాకర్రావు, హైదరాబాద్ వెంటిలేటర్పై పెట్టిన పేషెంట్ మళ్లీ క్షేమంగా తిరిగి రారు అని అనుకోవడం పూర్తిగా అపోహ మాత్రమే. వెంటిలేటర్పైకి వెళ్లిన పేషెంట్లు మళ్లీ కోలుకునే అవకాశాలే ఎక్కువ. వెంటిలేటర్ అంటే కృత్రిమశ్వాస. దీనిపై పెట్టాలంటే ముందుగా శ్వాసనాళంలోకి ఒక గొట్టాన్ని అమర్చి దాన్ని వెంటిలేటర్ పరికరం ట్యూబులతో కలుపుతారు. రోగి పరిస్థితి మరీ విషమంగా ఉంటే అనేర రకాల గొట్టాలను అమర్చాల్సి అవసరం ఉంటుంది. ఈ ప్రక్రియను అనుసరించేప్పుడు శరీర సహజసిద్ధమైన రక్షణ విధానాన్ని అతిక్రమించినట్లు అవుతుంది. కాబట్టి ఇన్ఫెక్షన్ సోకకుండా రోగిని ఐసీయూలో ఉంచి వెంటిలేటర్ అమర్చుతారు. ఇక మీ ప్రశ్నల్లో ఒకటైన వెంటిలేటర్ ఏ పరిస్థితుల్లో అమర్చుతారు అనే విషయానికి వస్తే... రోగి రక్తంలో ఆక్సిజన్ పాళ్లు చాలా తక్కువగా ఉన్నా, కార్బన్ డై ఆక్సైడ్ పాళ్లు ఎక్కువగా ఉన్నా, ఆయాసం ఎక్కువైనా, అపస్మారక స్థితిలో ఉన్నా, ఊపిరి సరిగా తీసుకోలేకపోతున్నా, ఊపిరి తీసుకోడానికి అవసరమయ్యే కండరాల పనితీరులో లోపం ఏర్పడి, అవి సరిగా పనిచేయలేకపోతున్నా వెంటిలేటర్ను అమర్చుతారు. అంతేగాక... శరీరంలోని కీలకమైన మిగతా అవయవాలు సరిగా పనిచేయకపోవడం వల్ల ఆ ప్రభావం శ్వాసవ్యవస్థపై పడినప్పుడు, ఊపిరితిత్తులకు న్యుమోనియా వంటి ఇన్ఫెక్షన్స్ సోకి శ్వాస సరిగా తీసుకోలేకపోతున్నప్పుడు కూడా వెంటిలేటర్ను అమర్చుతారు. ఇక క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీఓపీడీ) వంటి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి ప్రభావంతో ఉబ్బసం ఎక్కువైనప్పుడు అది సెప్సిస్కు దారి తీస్తుంది. అలాంటప్పుడు రోగికి పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు వెంటిలేటర్ అమర్చుతారు. ఇక మీ అమ్మగారిని ఎన్నాళ్లు వెంటిలేటర్పై అమర్చుతారనే ప్రశ్న విషయానికి వస్తే... ఆమెను ఏ కారణంపై వెంటిలేటర్పై ఉంచారో మీరు తెలియపరచలేదు. కాబట్టి ఆమె రోగ తీవ్రతను అనుసరించి, ఆమెను వెంటిలేటర్పై ఉంచుతారు. ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ పెరిగిన యూరిక్ యాసిడ్తో కీళ్లనొప్పి..! నా వయసు 25 ఏళ్లు. ఇంకా పెళ్లికాలేదు. గత మూడు నెలలుగా తీవ్రమైన మోకాళ్లనొప్పులతో బాధపడుతున్నాను. ఒక డాక్టర్గారికి చూపిస్తే, ఆయన పరీక్షలు చేయించి, నా యూరిక్ యాసిడ్ పాళ్లు 6.8 ఎంజీ/డీఎల్ ఉన్నాయని చెప్పారు. పైగా నేను విసర్జనకు వెళ్లినప్పుడు కూడా మూత్రం నుంచి దుర్వాసన వస్తోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - తేజస్విని, ఈ-మెయిల్ మీరు చెబుతున్న వివరాలను బట్టి చూస్తే మీరు ‘గౌట్’ అనే కీళ్లవ్యాధితో బాధపడుతున్నారు. రెండు ఎముకల మధ్యభాగాల్లో (కీళ్లలో) రక్తంలోని యూరిక్ యాసిడ్ పాళ్లు పెరగడం వల్ల, అవి స్ఫటికాలుగా మారుతాయి. అలా స్ఫటికాల్లా (క్రిస్టల్స్) మారిన యూరిక్ యాసిడ్రాళ్లతో ఎముకల చివరలు ఒరుసుకుపోవడం వల్ల కీళ్లవాపు, కీళ్ల వద్ద తీవ్రమైన నొప్పి వస్తుంది. సాధారణంగా స్థూలకాయం (ఒబేసిటీ), ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, రెడ్మీట్, సీఫుడ్ వంటి మాంసాహారం తీసుకోవడడం, నిమ్మజాతి పండ్లు ఎక్కువగా తీసుకోవడం వంటి కుటుంబచరిత్ర ఉన్నవారిలో ఈ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఇక కొంతమందిలో సాధారణంగానే యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నా లక్షణాలు ఏవీ కనిపించకుండానే ‘గౌట్’ వ్యాధి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాంటివారికి చికిత్స అవసరం ఉండదు. కానీ కీళ్లలో నొప్పి, వాపు వంటి లక్షణాలు కనిపిస్తే చికిత్స అవసరమవుతుంది. మీరు వెంటనే మీకు దగ్గర్లోని ఆర్థోపెడిక్ సర్జన్ను కలిసి తగిన చికిత్స తీసుకోండి. నా వయసు 24 ఏళ్లు. మార్కెంటింగ్ జాబ్లో ఉన్నాను. నా బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, నా ఎడమ మణికట్టులో కొద్ది నెలలుగా తీవ్రమైన నొప్పి వస్తోంది. దాంతో ఎలాంటి పనీ చేయలేకపోతున్నాను. దాన్ని కొద్దిపాటి ఒత్తిడితో వంచినప్పుడు క్లిక్మనే శబ్దం వచ్చి నొప్పి వస్తోంది. మాకు దగ్గర్లోని డాక్టర్కు చూపిస్తే ఎక్స్రే తీసి, బెణికినట్లు చెబుతున్నారు. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. - కె. సందీప్, కోదాడ మణికట్టు బెణికితే వచ్చే సమస్యలు సాధారణంగా కొద్దివారాలపాటు ఉంటాయి. అయితే మణికట్టులో 15 ఎముకలు ఉంటాయి. ఎన్నో లిగమెంట్లతో కూడిన సంక్లిష్టమైన నిర్మాణమది. కొన్ని చిన్న ఎముకలు విరిగినట్లుగానే మనకు తెలియదు. ఉదాహరణకు స్కాఫాయిడ్ అనే ఎముక మనం మణికట్టును గుండ్రగా తిప్పడానికి ఉపయోగపడుతుంది. దీంతోపాటు కొన్ని రకాల ఎముకలు విరిగిన విషయం సాధారణ ఎక్స్రేలో తెలియపోవచ్చు కూడా. అయితే కొన్నిసార్లు రెండు, మూడు వారాల తర్వాత చేసే రిపీటెడ్ ఎక్స్రేలో తెలుస్తాయి. మీరు చెబుతున్న లక్షణాలు స్కాఫాయిడ్ ఎముక విరిగినట్లు సూచిస్తున్నాయి. లేదా మీ సమస్య టీనోసైనోవైటిస్ లేదా రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజ్యురీ కూడా కావచ్చు. కాబట్టి ఒకసారి ‘ఆర్థోపెడిక్ సర్జన్’ను కలిసి తగిన ఎక్స్-రే పరీక్షలు చేయించుకోండి. ఫెర్టిలిటీ కౌన్సెలింగ్ ఎండోమెట్రియాసిస్ సాధారణ సమస్యే! నా వయసు 35 ఏళ్లు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. పెళ్లయి ఏడేళ్లు అవుతోంది. పీరియడ్స్ సమయంలో తీవ్రమైన నొప్పి వస్తుంటే ఇటీవలే డాక్టర్ను కలిశాను. డాక్టర్గారు నాకు ‘ఎండోమెట్రియాసిస్’ ఉందని నిర్ధారణ చేసి, లాపరోస్కోపిక్ ఆపరేషన్ చేశారు. నాకు పిల్లలు పుట్టే అవకాశాల గురించి వివరించండి. అలాగే పీరియడ్స్ సమయంలో మళ్లీ నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయా? - ఒక సోదరి, హైదరాబాద్ మీలా ఎండోమెట్రియాసిస్ రావడం అన్నది చాలామంది మహిళల్లో కనిపించే చాలా సాధారణమైన విషయం. కొంతమందిలో ల్యాపరోస్కోపిక్ శస్త్రచికిత్స తర్వాత ఈ నొప్పి పూర్తిగా తగ్గుతుంది. ఇక కొంతమందిలో మళ్లీ రావచ్చు. నొప్పి తీవ్రత తక్కువగా ఉంటే జీవనశైలిలో చిన్న చిన్న మార్పులతో అంటే... తేలికపాటి వ్యాయామాలు చేయడం, యోగా వంటి రిలాక్సేషన్ ప్రక్రియలతో పాటు చాలా తక్కువ మోతాదుల్లో నొప్పినివారణమాత్రలు వాడుతూ నొప్పిని నియంత్రణలో ఉంచవచ్చు. కానీ కొందరిలో నొప్పి తీవ్రత చాల ఎక్కువగా ఉంటుంది. అలాంటివారిలో మళ్లీ గర్భధారణను కోరుకోని వారికి హార్మోన్లలో మార్పులు తీసుకువచ్చే మందులను డాక్టర్లు సూచిస్తారు. నొప్పి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటే మాత్రం మళ్లీ శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం రావచ్చు. అయితే దాదాపు 60 శాతం నుంచి 80 శాతం మందిలో మళ్లీ గర్భధారణ వచ్చేలాగే శస్త్రచికిత్స చేసి, నొప్పిని నియంత్రించవచ్చు. మీ లేఖను బట్టి మీరు గర్భధారణను కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ మీరు గర్భధారణను కోరుకుంటుంటే మాత్రం ‘ఫెర్టిలిటీ ఇవాల్యుయేషన్’ (అంటే గర్భధారణకు అవకాశాలను పరీక్షించే కొన్ని రకాల పరీక్షలు) చేయించాల్సి ఉంటుంది. మీరు రాసినదాన్ని బట్టి మీకు మినిమల్/మైల్డ్ ఎండోమెట్రియాసిస్ ఉండటం వల్ల లాపరోస్కోపిక్ చికిత్స జరిగినట్లు తెలిపారు. కాబట్టి కొన్ని రకాల మందులతో మీలో అండం విడుదల అయ్యేలా (ఒవ్యులేషన్)/ ఐయూఐ (ఇంట్రా యుటెరైన్ ఇన్సెమినేషన్) వంటి ప్రక్రియలతో గర్భధారణకు తగిన అవకాశాలే ఉన్నట్లుగా భావించవచ్చు. కాకపోతే తీవ్రమైన ఎండోమెట్రియాసిస్ (సివియర్ ఎండోమెట్రియాసిస్) కేసుల్లో మాత్రం ఐవీఎఫ్ వంటి ఆధునిక ప్రక్రియలకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజుల్లో సంతానసాఫల్యానికి తగిన ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. సంతాన సాఫల్య చికిత్స చేసే నిపుణులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి. -
నిర్లక్ష్యం ఖరీదు ఓ పసిప్రాణం..!
వెంటిలేటర్పై ఉన్న శిశువుపై ఎలుకల దాడి వైద్యుల నిర్లక్ష్యంతో మృత్యు ఒడిలోకి.. ఎలుకలకు మేం కాపలా కాయాలా..అంటూ తల్లిపై వైద్యుల ఆగ్రహం గుంటూరు: జబ్బుతో ఉన్న బిడ్డను వైద్యం కోసం ప్రభుత్వాస్పత్రికి తీసుకువస్తే.. అక్కడి వైద్యులు అసలు ప్రాణాలు లేకుండానే చేశారు.ఐసీయూలో వెంటిలేటర్పై ఉంచిన శిశువును ఎలుకల బారి నుంచి కాపాడేందుకు కనీస చర్యలు తీసుకోలేదు. అప్పటికే ఓసారి శిశువుపై ఎలుకలు దాడిచేశాయని ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి అధికారులు, వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ నిండు పసిప్రాణం బలైంది. పది గంటల తర్వాత తీరుబడిగా డెత్ డిక్లేర్ (మరణ ధ్రువీకరణ)కు వైద్యులు రావడంతో తట్టుకోలేని ఆ తల్లి హృదయం వైద్యులను నిలదీసింది.ఎలుకలకు మేం కాపలా ఉండాలా అని ఓ వైద్యుడు... ఇంకో బిడ్డ ఉన్నాడుగా ఈ బిడ్డపై ఆశలు వదులుకోమంటూ సిబ్బంది ఉచిత సలహా ఇవ్వడం వారి కర్కశత్వానికి అద్దం పట్టింది. విజయవాడ కృష్ణలంక కు చెందిన చావలి నాగ, లక్ష్మి దంపతులకు ఈ నెల 17న విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో రెండో సంతానంగా మగబిడ్డ జన్మించాడు. శిశువుకు మూత్రసంచి, మూత్రనాళాలు బయటకు రావడంతో మెరుగైన వైద్యసేవల నిమిత్తం ఈ నెల 18న గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలోని శిశు శస్త్ర చికిత్సా విభాగానికి తరలించారు. వైద్యులు ఈ నెల 20న శిశువుకు ఆపరేషన్ నిర్వహించి ఐసీయూలోని వెంటిలేటర్పై ఉంచారు. ఈ దశలోనే శిశువుపై ఈ నెల 24న ఎలుకలు దాడిచేసి కుడి చేయితోపాటు కాలి వేళ్లను కొరికివేశాయి.తీవ్ర ఆందోళనకు గురైన తల్లి లక్ష్మి వైద్యులు, ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేసింది. వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇలా బుధవారం తెల్లవారుజామున 4గంటల వేళ రెండోసారి ఎలుకలు పసికందుపై దాడిచేసి ఛాతీ, ఎడమ కణిత, బుగ్గ భాగాలతోపాటు చేతివేళ్లు, కాలివేళ్లు కొరుక్కుతిన్నాయి. తీవ్ర రక్తస్రావం కావడం గమనించిన లక్ష్మి కదలలేని స్థితిలోనూ కేకలు వేస్తూ ఎలుకలను తోలే ప్రయత్నం చేసింది. వైద్యులుగానీ, సిబ్బందిగానీ స్పందించలేదు. పది గంటలపాటు చికిత్స చేసేందుకు వైద్యులెవరూ అక్కడకు రాకపోవడంతో మృత్యువుతో పోరాడిన శిశువు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సీనియర్ ప్రొఫెసర్తో విచారణ కమిటీ... ఆసుపత్రిలో శిశువు మృతి చెందడం దురదృష్టకరమని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వేణుగోపాలరావు చెప్పారు. దీనిపై సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ సుబ్బారావుతో విచారణ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. 24గంటల్లో కమిటీ నివేదిక అందిస్తుందని, దీని ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఆరా తీశారు. ఆస్పత్రికి వెళ్లి తల్లిదండ్రులు చావలి లక్ష్మి, నాగ దంపతులను పరామర్శించారు. సిగ్గుతో తలదించుకుంటున్నా..: కామినేని గుంటూరు: గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల(జీజీహెచ్)లో ఎలుకలు కొరికి శిశువు మృతిచెందడంపై సిగ్గుతో తలదించుకుంటున్నానని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. బుధవారం రాత్రి గుంటూరు జీజీహెచ్లో శిశువు మృతిచెందిన వార్డుతోపాటు, మార్చురీలో శిశువు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో మళ్లీ ఇలాంటి సంఘటన జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండేతో మెజిస్టీరియల్ విచారణ, గుంటూరు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠత్రిపాఠితో పోలీసుల విచారణ, వైద్యారోగ్య శాఖ పరమైన విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. సంఘటన జరిగేందుకు కారకులైన శానిటేషన్ కాంట్రాక్టును పూర్తిగా తొలగించినట్లు చెప్పారు. పారిశుద్ధ్య విభాగం ఇన్చార్జి ఆసుపత్రి ఆర్ఎంఓతోపాటు, శానిటరీ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆసుపత్రిలో శానిటేషన్ను మున్సిపల్ కార్పొరేషన్కు అప్పగించి మున్సిపల్ కమిషనర్ అనురాధ నేతృత్వంలో పారిశుధ్యం మెరుగు పరుస్తామన్నారు. ఎలుకలు కరిచిన అనేక గంటల వరకు వైద్యులు స్పందించకపోవడంపైనా విచారణ నిర్వహించి, వైద్యుల ప్రమేయం ఉంటే వారిపైనా చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు ఉన్నారు. -
ఎస్ఐ సిద్దయ్య కుమారుడికి సర్జరీ
-
స్వైన్ సైరన్
హైదరాబాద్లో ముగ్గురి మృతి అప్రమత్తమైన నగర వైద్యులు వ్యాధి లక్షణాలు కనిపిస్తే సంప్రదించాలని సూచన మందుల కొనుగోలుకు సిద్ధం లబ్బీపేట : ఐదేళ్ల కిందట గడగడలాడించిన స్వైన్ఫ్లూ మళ్లీ తెరపైకి వచ్చింది. భయూనకమైన ఈ వ్యాధి సోకి హైదరాబాద్లో ముగ్గురు మృత్యువాత పడిన విషయం తెలుసుకున్న నగర వైద్యులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యూరు. చలికాలం కావడం, నిత్యం వేలాదిమంది హైదరాబాద్-విజయవాడ మధ్య ప్రయాణిస్తుండటంతో నగరానికి కూడా ఈ వ్యాధి ప్రబలే అవకాశం ఉందని చెబుతున్నారు. స్వైన్ లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యులను సంప్రదించాలని నగరవాసులకు సూచిస్తున్నారు. చలికాలం కావడం, ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటంతో హెచ్1 ఎన్1 ఇన్ఫ్లూయెంజా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా సోకే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఈ వ్యాధికి సంబంధించి మందులు అవసరం లేదనుకున్నా.. ఇప్పుడు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వాస్పత్రి వైద్యులు ఇండెంట్ సిద్ధం చేస్తున్నారు. స్వైన్ఫ్లూ లక్షణాలివీ.. స్వైన్ఫ్లూ సోకిన వారిలో జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు, తలనొప్పులతో పాటు డయేరియూ, వాంతుల లక్షణాలు కనిపిస్తారుు. ఈ వ్యాధి సోకిన వారిని గుర్తించి తొలిదశలో చికిత్స అందించకపోతే శ్వాస తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి స్థితిలో వెంటిలేటర్పై చికిత్స అందించాల్సి ఉంటుంది. వ్యాధి లక్షణాలను తొలిదశలో గుర్తించడం ఎంతో ముఖ్యం. ఆందోళనలో వైద్య సిబ్బంది స్వైన్ఫ్లూ సోకకుండా ఇన్ఫ్లూయెంజా వ్యాక్సిన్ ఉన్నా ధర ఎక్కువ కావడంతో అందరికీ అందుబాటులోకి రాలేదు. మూడేళ్ల కిందట ఈ వ్యాక్సిన్ను ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బందికి ప్రభుత్వం ద్వారానే వేయించారు. రెండు డోసులుగా ఈ వ్యాక్సిన్ వేయాల్సి ఉంటుంది. అరుుతే, ఆ తరువాత వ్యాధి ఆనవాళ్లు కనిపించకపోవడంతో దాని గురించి అంతా మరిచిపోయూరు. తాజాగా మళ్లీ స్వైన్ సైరన్ మోగడంతో ప్రజలతో పాటు వైద్య సిబ్బందీ అప్రమత్తమవుతున్నారు. జ్వరం, తల నొప్పితో వచ్చే వారిలో ఎవరికైనా స్వైన్ఫ్లూ లక్షణాలు ఉంటే తమ పరిస్థితి ఏమిటని వైద్యులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం చొరవ చూపి వైద్య సిబ్బందికి స్వైన్ఫ్లూ సోకకుండా వ్యాక్సిన్ వేయడంతో పాటు ప్రజలకు అందుబాటులోకి తేవాలని పలువురు కోరుతున్నారు. మందులకు ఇండెంట్ పెట్టాం.. హైదరాబాద్లో స్వైన్ఫ్లూ కేసులు నమోదవడంతో పల్మనాలజీ విభాగంలోని స్వైన్ఫ్లూ వార్డును సిద్ధం చేస్తున్నాం. ఆ వ్యాధికి సంబంధించిన మందులు కొనుగోలు చేసేందుకు ఇండెంట్ పెట్టాం. ప్రసుత్తం స్వైన్ఫ్లూ వార్డులో ఉన్న వెంటిలేటర్ రిపేరుకు గురవడంతో దానిని తొలగించి మరో వెంటిలేటర్ ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించాం. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. - డాక్టర్ జి.రవికుమార్ -
ఇంకా వెంటిలేటర్ మీదే అంబరీష్
కర్ణాటక గృహనిర్మాణ శాఖ మంత్రి, ప్రముఖ నటుడు అంబరీష్ పరిస్థితి బాగానే ఉందని, అయితే ఆయన మరో రెండు రోజుల పాటు వెంటిలేటర్ మీదే ఉండాలని ఆయనకు వైద్యం చేస్తున్న ఓ వైద్యుడు తెలిపారు. 61 ఏళ్ల అంబరీష్ను ఈనెల 21న ఆస్పత్రిలో చేర్చారు. ఆయనకు ఊపిరి అందని స్థితిలో తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయనకు యాంటీబయాటిక్స్, నెబులైజర్లు, ఫీడింగ్ ఇస్తున్నామని, నొప్పి తెలియకుండా పూర్తిగా మత్తులోనే ఉంచుతున్నట్లు విక్రమ్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ కేఎస్ సతీష్ తెలిపారు. రాబోయే రెండు రోజుల్లో ఆయనకు ఊపిరి సాధారణంగానే అందుతుందని ఆశిస్తున్నామని, అప్పుడు వెంటిలేటర్ సపోర్ట్ తీసేస్తామని అన్నారు. ఆయన పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని, వెంటిలేటర్ తీసేయాలో వద్దో రేపు ఉదయం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.