Vinayaka Chavithi 2024
-
vinayakachavithi 2024: గరికతో కొలిచినా వరాలే
ఏ దైవాన్ని పూజించాలన్నా, ఏ కార్యాన్నిప్రారంభించాలన్నా ముందుగా ఆయననే పూజించాలి. అప్పుడే ఆ కార్యం శుభప్రదం, శోభస్కరం.. ఆ తర్వాత జయప్రదం అవుతుంది. తల్లిదండ్రులను మించిన దైవం లేడని, నారాయణ మంత్రానికి మించిన మంత్రం లేదని నిరూపించి విఘ్నాధిపత్యాన్ని చేజిక్కించుకున్న సూక్ష్మగ్రాహి ఆయన. తండ్రిలాగానే ఈయన ఆకారాన్ని కల్పించటమూ, పూజించటమూ, ప్రసన్నం చేసుకోవటమూ ఎంతో సులువు.ఓం గణానాతాం త్వా గణపతిగ్ం హవామహేకవిం కవీనాముపమశ్రవస్తమంజ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతఅనశృణ్వన్నూతి భిస్సీద సాధనమ్రాజులలో జ్యేష్ఠుడు, కవులలో కవి, గణాలకు అధిపతి, బ్రహ్మణస్పతి అని వేదాలు ఆయనను స్తుతిస్తే, మంత్రశాస్త్రాలు సుముఖుడనీ ఏకదంతుడనీ, కపిలుడనీ, గణాధ్యక్షుడనీ, గజకర్ణికుడనీ, వికషుడనీ, ఫాలచంద్రుడనీ, ధూమకేతువనీ, గజకర్ణికుడనీ విష్వక్సేనుడనీ, శూర్పకర్ణికుడనీ అన్నాయి. అంతగా ఆరాధించాయి. ఇక ఉపనిషత్తులయితే వాఙ్మయమూర్తిగా.. గణపతిగా... బ్రహ్మణస్పతిగా.. శ్రీ మహాగణాధిపతిగా విశ్వసించాయి. నిండుగా కొలిచాయి. గణపతి అంటే జ్ఞానమోక్షప్రదాత అని అర్థం. మనిషిని సన్మార్గంలో పయనింపజేసేది జ్ఞానమైతే, మరుజన్మ లేకుండా చేసేది మోక్షం. గణపతి ఆవిర్భావం, రూపురేఖా విలాసాల గురించి అనేక పురాణేతిహాసాలు అనేక విధాలుగా వర్ణించినప్పటికీ సకలశాస్త్రాలూ ఆయనను పరబ్రహ్మస్వరూపంగానూ, భవిష్యద్బ్రహ్మగానూ పేర్కొన్నాయి. సామాన్యులకు మాత్రం గణపతి విఘ్నసంహారకుడు. ఆయనను స్తుతిస్తే సర్వ విఘ్నాలూ ఉపశమిస్తాయి. అంతేకాదు ఆయన భక్త సులభుడు కూడా. బంకమట్టిని తెచ్చి దానికి గణపతి రూపు కల్పించి,ప్రాణప్రతిష్ఠ చేసిన అనంతరం గరికతోటీ, రకరకాల పుష్పాలు, పత్రాలతోటీ పూజించి, అరటిపళ్లు, కొబ్బరికాయలు, ఉండ్రాళ్లు, వెలగ పళ్లు, పానకం, వడపప్పు, కుడుములు నివేదించి, అపరాధ క్షమాపణగా ఐదు గుంజిళ్లు తీస్తే చాలు – మన కోర్కెలన్నింటినీ తీర్చే మహా ప్రసన్న గణపతి... వల్లభ గణపతీ ఆయన. ఎలా పూజించాలి?ఏ పూజలోనైనా ముందుగా హరిద్రాగణపతిని (పసుపుతో గణపతి ప్రతిమను చేసి, తమలపాకులో ఉంచాలి) పూజించడం మంచిది. వినాయక చవితినాడు తప్ప తక్కిన రోజుల్లో తులసి దళాలతో పూజించరాదు. 21 రకాల పత్రి లభ్యం కానప్పుడు గరిక దొరికినా ప్రసన్నుడవుతాడు. రక రకాల నైవేద్యాలు సమర్పించలేకున్నా నారికేళం, అరటిపండ్లు, ఉండ్రాళ్లు, కుడుములు, వడపప్పు ఉంటే చాలంటాడు. ఈ కింది శ్లోకం చదివితే చతుర్థీ చంద్ర దర్శన దోషం పరిహారమవుతుంది.సింహః ప్రసేనమవధీః సింహా జాంబవతా హతేఃసుకుమారక మారోదీః తవహ్యేషçశ్యమంతకఃఏమి నివేదించాలి?వినాయకచవితిరోజు గణపతిని షోడశోపచారాలతో పూజించి, శక్తికొద్దీ ఉండ్రాళ్లు, కుడుములు, పిండివంటలు, నారికేళాలు, కదళీఫలాలు, పానకం, వడపప్పులను నివేదిస్తే సకల కార్యసిద్ధి కలుగుతుంది.పాలవెల్లి ఎందుకు..?ఆకాశంలో గ్రహాలూ నక్షత్రాలూ ఉంటాయనే యథార్థాన్ని గుర్తింపజేసేందుకే, భాద్రపదమాసంలో విరివిగా లభించే పాలవెల్లికి నిండుగా మొక్కజొన్న ΄÷త్తులూ, వెలక్కాయలూ, బత్తాయిలూ... వీటన్నింటినీ కడతారు.నిమజ్జనమెందుకు?భూమి నీటిలో నుంచి పుట్టింది. ఆ భూమితోనే అంటే బంకమట్టితో విగ్రహం చేసి, దానికిప్రాణప్రతిష్ఠ, ధ్యానావాహనాది షోడశోపచార పూజలు చేసిన అనంతరం ఉద్వాసన చెప్పి, తిరిగి ఆ నీటిలోనే నిమజ్జనం చేయడం సంప్రదాయం. ఈ వినాయక చవితి మీ అందరి విఘ్నాలనూ దూరం చేయాలని, కోరిన కోరికలన్నీ నెరవేర్చాలని కోరుకుందాం. అన్నట్లు పూజకు మట్టి వినాయకుడినే తెస్తున్నారు గదా!పత్రి అంటే ఎందుకంత ప్రీతి?కన్యారాశికి అధిపతి బుధగ్రహం. ఈయన ఆకుపచ్చగా ఉంటాడు కాబట్టి, వినాయకునికి పత్రిపూజ ఇష్టమని చెప్పవచ్చు. అంతేకాదు... మునుల కోరిక మేరకు అగ్నితత్త్వం గల అనలాసురుడనే రాక్షసుని ఉండలా చేసి గుటుక్కున మింగాడాయన. లోపల చేరిన ఆ రాక్షసుడు తన మంటలతో ఆయన ఉదరాన్ని బాధించకుండా చల్లదనాన్ని చేకూర్చడం కోసమే మునులు ఆయనను అనేక రకాల ఔషధ విలువలు గల పత్రితోటీ, పుష్పాలతోటీ పూజించి, మరింత ఉపశమనాన్ని కలిగించడం కోసం గరికతో తాళ్లలా పేని ఆయన ΄÷ట్ట చుట్టూ పట్టీలా కట్టారు. ఆ ఉపచారాలన్నీ ఆయనకు అమితంగా నచ్చి, ఆ నాటినుంచి ప్రతియేటా తనను పత్రితోటీ, పుష్పాలతోటీ, ముఖ్యంగా గరిక΄ోచలతో పూజించిన వారికి కోరిన వరాలనిచ్చే వేల్పు అయ్యాడాయన. -
vinayakachavithi 2024: ప్రతి భాగం ఓ పాఠం... ..ప్రకృతికి పీఠం
భువనచంద్ర వినాయకచవితి అనేది కేవలం ఒక పండుగ కాదు.. ఈ పండుగ నుంచి ఎన్నో విషయాలు మనం నేర్చుకోవాల్సి ఉంది. ఏనుగు తలకాయ.. అంటే పెద్దది. అంటే గొప్పగా ఆలోచించు.. పెద్ద పెద్ద చెవులు ఉంటాయి అంటే... ‘నాయనా నీ శక్తినంతా మాట్లాడుతూ మాట్లాడుతూ వేస్ట్ చేయకు, ఇతరులు చెప్పేది శ్రద్ధగా విను.. ఆ విన్నదాన్ని చక్కగా నీ మెదడుతో ఆలోచించు..’ అని అర్థం. ఇక ఆయన పొట్టకు నాగబంధం కట్టేశారు.. అంటే అర్థమేంటీ? జాగ్రత్తగా గమనిస్తే.. నాయనా నువ్వు ఎక్కువ గనుక తిన్నట్టయితే.. అది విషంతో సమానం. అందుకే మితంగా భుజించడం నేర్చుకో.. అందుకే తినే ముందు నీళ్లు జల్లి అమృతమస్తుః అంటాం.. అమృతం ఎప్పుడు అవుతుంది? మితంగా తిన్నప్పుడు అమృతం.. అపరిమితంగా తిన్నప్పుడు అది విషం. మనం తినేటటువంటి ఆహారం ఎలుకలు గనుక తినేస్తే.. ఎలుకలను గనుక కంట్రోల్లో పెట్టక΄ోతే మనిషికి గింజ కూడా దొరకదు. అందు గురించే ఆయనకు వాహనంగా పాదాల దగ్గర ఎలుకను ఉంచి ఎలుకలను కంట్రోల్లో పెట్టుకున్నావో నీ ఆహారం సేవ్ అవుతుంది అని సూచిస్తున్నారు.వినాయకుడి చేతిలోని అంకుశం... దేన్నైనా కంట్రోల్ చేసుకునే పవర్.. ఏ బంధమైనా.. స్నేహం కావచ్చు.. ఏదైనా నిర్ణయం కావచ్చు.. అంకుశం ఏంటంటే.. నువ్వు ఏది చేయాలనుకున్నా ఆ చేస్తున్నది కరెక్టా కాదా అనేది మన చేతుల్లో ఉండాలి. తర్వాత పాశం.. రిలేషన్స్.. ఇలా వినాయకుడి శరీరంలో ఉండే ప్రతి భాగమూ మనకు ఒక పాఠం లాంటిది. జీవిత పాఠం అది. గ్రామాల్లో స్థానికంగా ఉండే దేవతల్లో లక్ష్మీ, వినాయకుడు ఇద్దరూ ఉంటారు. ఆహార ఉత్పత్తి, పొదుపు వల్ల సమృద్ధి. నాకు ఒకరు గొప్ప మాట చె΄్పారు. ఆరోజుల్లో జీతాలు తక్కువ వచ్చేవి కదా.. అప్పుడు ఒకరు చె΄్పారు. అది చాలా మంచి మాట. ‘ఏమండీ.. మా ఇంట్లో చింతపండు, ఉప్పు, ఎండు మిరిపకాయలు, బియ్యం కచ్చితంగా ఎప్పుడూ ఉంచుతానండీ... జీతం రాగానే మొట్టమొదట ఎక్కువ మోతాదులో అవే తీసుకుంటానండి’ అని. ‘అదేంటీ?’ అన్నాను. ‘మన ఇంటికి పది మంది అప్పటికప్పుడు వచ్చారనుకోండి.. ఆ నాలుగు పదార్థాలుంటే కనీసం చారన్నం అయినా పెట్టొచ్చు కదా?’ అని సమాధానం ఇచ్చారు. అంటే మిగిలినవన్నీ లగ్జరీ ఐటమ్స్.ఇక తర్వాత లేఖిని.. వ్యాసుడు చెబుతుంటే మహాభారతం రాయడం. ఇక్కడ లేఖిని అంటే అక్షరం రాయడం మాత్రమే కాదు.. ఏ విద్యైనా సిద్ధింపచేయాలంటే మొట్టమొదట చెవులు కరెక్ట్గా ఉండాలి.. బుర్ర కరెక్ట్గా ఉండాలి. అందుచేత సిద్ధి వినాయకుడు.. ఏది మొదలుపెట్టినా ‘అయ్యా ఇది నేర్చుకోదలిచాను.. నన్ను సిద్ధింపచేసే శక్తి నీలో ఉంది గనుక ఈ సిద్ధి నాకు ్రపాప్తించేలా చూడు’ అని నమస్కరిస్తాం. చిన్నతనంలో కూడా అందుకే వినాయకచవితి వచ్చిందంటే.. పుస్తకాలు, అట్టలు.. పెన్నులు అన్నీ స్వామి వారి ముందు ఉంచి పూజ చేసుకుంటాం. ఏ పని మొదలుపెట్టినా.. ఇల్లు కట్టినా.. పెళ్లి చేసినా వినాయకుడికి మొట్టమొదటి స్థానం ఎందుకు ఇస్తారంటే.. ఆయన సిద్ధి కావాలంటే శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ లేనిదే సిద్ధి లేదు. నిజానికి కుమారస్వామితో ఆయన ΄ోటీ పడినప్పుడు కూడా ఆయన బుద్ధిని ఉపయోగించాడు.. అందుకే ఆయన భార్యలను సిద్ధి బుద్ధి అంటాం.. నీ బుద్ధిని గనుక సక్రమంగా వినియోగించినట్లు అయితే ఆటోమేటిక్గా సిద్ధి లభిస్తుంది. వినాయకచవితి ఏం చెబుతుందంటే.. ఏది చేసినా శ్రద్ధతో చెయ్.. చక్కటి ఆలోచనలతో ఉండాలి. ఆయన కళ్లు చాలా చిన్నగా ఉంటాయి. చిన్నగా అంటే అర్థం ఏంటీ? సూక్ష్మమైనదాన్ని కూడా చూడగలగాలి. చీమ కన్ను ఎంత చిన్నగా ఉంటుంది? దానికి కూడా ఆహారం దొరుకుతుంది కదా? అట్లాగే ఏనుగు కళ్లు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి. కానీ అతి సూక్ష్మమైన కదలికలను కూడా అది పట్టుకుంటుంది. ఇంకో విషయం ఏంటంటే.. జంతువులు అన్నింటిలోనూ చక్కటి బ్రెయిన్ ఉన్న జంతువు ఏనుగు. అదే నెంబర్ వన్ . మానవుడికి ఎంత శక్తి ఉంటుందో అంత పవర్ దానికి ఉంది. పత్రి అనేది మనం ఎందుకు కోసుకొస్తాం? వెలగ, వాక్కాయ్ వంటివన్నీ ఎందుకు తీసుకొస్తాం పూజకి? ఎందుకంటే ఈ సీజన్ లో వాక్కాయ్ పచ్చడి తినమంటే ఎవరూ తినరు..? అందుకే వాక్కాయ్ – కొబ్బరికాయి, కొబ్బరికాయ – వెలగ కలిసి చేసుకుంటాం. నిజానికి ఈ సీజన్ లో ఇవి తింటేనే రోగనిరోధక శక్తి అద్భుతంగా పని చేస్తుంది. రెండొవది ఆకులు దూసిన తర్వాత కొత్త ఆకులువస్తాయి. అలా కాకుండా ఆ ఆకులు మొక్కకే ముదిరి΄ోతే అక్కడితో ఎండ్ అయి΄ోతుంది. ప్రతి ఔషధ మొక్కలను సజీవంగా ఉంచాలంటే పాత ఆకుల్ని పీకాలి. ఇక కామెర్లకు నేల ఉసిరి బెస్ట్ మెడిసిన్ . ప్రకృతిని రక్షించేవాడు దేవత.. ప్రకృతిని రక్షిస్తూ.. ప్రకృతి మీద ఆధారపడేవాడు మానవుడు. ప్రకృతిని నాశనం చేసేవాడు రాక్షసుడు. ప్రకృతితో సహజీవనం చెయ్ అని చెప్పే ఏకైక పండుగ వినాయకచవితి.సుద్దాల అశోక్తేజ వినాయచవితి పట్ల నా పరిశీలన ఏంటంటే పురాణాలు కానివ్వండి.. ప్రబంధాలు కానివ్వండి.. కల్పనలు కావచ్చు.. యదార్థంగా జరిగినవి కావచ్చు.. ఏవైనా.. ఏవైనా సరే.. ప్రజాశ్రేయస్సు కోసం, ప్రకృతి శ్రేయస్సు కోసం రాసినవే.. పుట్టించినవే.. శంకరుడు.. పార్వతమ్మ ఉన్న ఇంట్లోకి వెళ్లబోతుంటే ఒక పిల్లోడు అడ్డుకుంటాడు.. అతడిపై ఆగ్రహించి శిరచ్ఛేదం చేశాడు. ఇది కదా కథ? తర్వాత పార్వతమ్మ వచ్చి.. బాగా ఏడ్చి.. భర్త మీద కోప్పడితే.. మళ్లీ బతికించాడు.. ఫస్ట్ ఏంటంటే.. తొందరపాటుతనం మనుషులకే కాదు.. దేవతలమైన మాకు కూడా ఉంటుందని చెప్పడమే ఆ పసివాడ్ని చంపడం.. ఒక తొందరపాటులో ఇన్ని అనర్థాలు జరగుతాయి అని చెప్పడానికి ఈ కథ ఏర్పడింది అనుకుంటాను.. శివుడు సహనంగా ఉండి ఉంటే చంపేవాడు కాదు కదా.. నంబర్ 2– ఎంత పరమేశ్వరుడైనా భార్యకు శరీరంలో సగభాగం ఇచ్చాడు.. అదొక ఆదర్శమైతే.. భార్య అతడు చేసిన పొరబాటు గురించి చెప్పగానే.. ఎక్కడా పురుషాధిక్యత లేకుండా తన పొరబాటు తాను గ్రహించాడు.. అంటే ఇక్కడ స్త్రీలను ద్వితీయశ్రేణి పౌరుల్లా భావించడం తప్పు అని తన ఈ చర్య ద్వారా తెలిపాడు.. ‘నేను భర్తను, నువ్వు భార్యవి.. అవును చంపేశాను.. నా ఇష్టం..’ అని ఉంటే ΄ోయేది కదా..? కానీ అలా అనలేదు.. పొరబాటు గ్రహించడమే కాదు.. భార్య చెప్పిన దిద్దుబాటు చర్యకు పూనుకున్నాడు. తనకన్నా చిన్నవాళ్లు చెప్పినా.. భార్య చెప్పినా.. మంచి చెప్పినప్పుడు మనం దాన్ని సవరించుకోవాలి.. వీలైతే ఆచరించుకోవాలి.. అనేది రెండో ఘటన.మూడవది ఇది చాలా చిత్రం అనిపిస్తుంది నాకు. తలను తీసేశాడు.. భార్య వచ్చి ఏడవగానే ఉన్న తలను అతికించొచ్చు కదా? ఎన్నో మాయలున్నవాడు.. పైగా నరికిన తల పక్కనే ఉంటుంది కదా? ఆ తలను అతికించకుండా ఏనుగు తల తీసుకుని రావడం ఎందుకు? ఎందుకు అంటే.. మనిషికి ఎంత ్రపాధాన్యత ఉందో.. దేవతలకు ఎంత ్రపాధాన్యత ఉందో.. జంతువులకు కూడా అంతే ్రపాధాన్యత ఉంది అని చెప్పడానికన్నమాట. అంటే ప్రకృతిని గౌరవించడం అనిమాటే. ‘‘నువ్వు జీవించు మిగతా వాటిని జీవించనివ్వు’’ అని చెప్పడం కోసం ఒక జంతువుకి అపారమైన ్రపాధాన్యత ఇవ్వడం కోసం ఏనుగు తలకాయ పెట్టి ఉంటాడా? ఇవన్నీ నా ఆలోచనలే.. నా వ్యక్తిగతమైనవి.తర్వాత శంకరుడి దగ్గర కైలాసంలో పరస్పర శత్రువులైన జంతువులన్నీ ఒకే దగ్గర ఉంటాయి. ఎలుకలను తినే పాము పక్కనే ఉంటుంది. పాముని తినే నెమలి పక్కనే ఉంటుంది. మూడు పరస్పర వైషమ్యాలు కలిగిన జీవరాశులకు కూడా సమానమైన గౌరవం ఇస్తూ సమానమైన జీవితావకాశాన్ని ఇచ్చిన వాడు శివుడు. కైలాసంలో జాతీయ జంతువు ఎవరో తెలుసా..? ఎద్దు. ఎద్దుని వాహనం చేసుకున్నవాడు శివుడు. బ్రహ్మ కమలం మీద ఉంటాడు. విష్ణువు ఆదిశేషువు మీద ఉంటాడు. కాని శివుడు రైతుకి, వ్యవసాయానికి దగ్గరగా ఉన్న ఎద్దును వాహనంగా ఎంచుకున్నాడు. ఇక వినాయకుడిని పూజించే దగ్గర.. సాధారణంగా మనం లక్ష్మీదేవిని పూజిస్తే మన దగ్గర ఉన్నవో లేనివో నాణాలు తెచ్చిపెడతాం.. లేదా ఆరోజు బంగారం ఏదొకటి కొనుక్కుని పెడతాం. కానీ వినాయకుడికి అవేం ఉండవు. చెరకు, పత్రి, గరిక ఇలా అతి చౌక ఆకులు.. సులభంగా ప్రకృతిలో దొరికే వాటిని తెచ్చి పెడతాం. ప్రకృతి, ప్రకృతిలోని జీవులు, పరమాత్మ మూడు సమానమే అని చెప్పేందుకు గుర్తుగా ఈ వినాయకచవితి కొనసాగుతోంది. దీన్నే అందుకోవాలి సమాజం. దీన్ని అందుకోవాలన్నదే ప్రధానమైన ఉద్దేశం. అందుకే బాలగంగాధర తిలక్ దైవభక్తిలో దేశభక్తిని రంగరించి.. వినాయకచవితిని మొట్టమొదటిసారి ఘనంగా జరిపించారు. అందుకే అప్పటి స్వాతంత్య్ర ఉద్యమంలో గొప్ప శక్తిని నింపింది ఈ పండుగ. మా చిన్నప్పుడు వినాయకచవితికి ఇంత క్రేజ్ లేదు..ఇప్పుడు ఇంత ఘనంగా జరుగుతున్నదంటే దానికి కారణం తిలక్. ఆ గొప్పతనం ఆయనదే. ఆ తర్వాత గణపతితో ఏం చేయించినారు.. ప్రపంచ పరుగు పందెం ΄ోటీ పెట్టేస్తే ఎలుక మీదున్న వాడు ఏం గెలుస్తాడులే అని కుమారస్వామి నెమలి మీద వెళ్లి΄ోతుంటే.. వినాయకుడు అమ్మానాన్నలను మించి ప్రపంచం భూగోళంలో ఏముంటుందని చెప్పి మూడు చుట్లు తిరిగితే.. అందరూ కలసి ఎవరు మొదలు వచ్చారంటే.. వినాయకుడే మొదట వచ్చాడు కాబట్టి ఆయన ప్రధాన దేవుడు అయ్యాడు.. ప్రథమ దేవుడు అయ్యాడు.. ఇక్కడ తల్లిదండ్రుల ్రపాధాన్యత కనిపిస్తుంది. ఇది గ్రహించాల్సింది. -
ఐదు పురాణాల్లో వినాయక గాథ..!
వినాయక చవితి పండుగ గురించి, ఈ పండుగ మహాత్మ్యాన్ని గురించిన గాథలు ప్రముఖంగా ఐదు పురాణాల్లో కనిపిస్తాయి. అవి: 1. శివ పురాణం 2. బ్రహ్మవైవర్త పురాణం 3. ముద్గల పురాణం 4. స్కాంద పురాణం 5. పద్మ పురాణం.శివపురాణం: శివ పురాణం గణేశుడి జన్మ వృత్తాంతం, గణేశుడు గణ నాయకుడిగా మారిన వైనం, మానవ జీవితంలో గణనాథుని ప్రాముఖ్యత విపులంగా చెబుతుంది.బ్రహ్మవైవర్త పురాణం: బ్రహ్మవైవర్త పురాణం గణేశుడి జన్మ వృత్తాంతంతో పాటు వినాయక చవితి రోజున గణేశుని పూజించే విధానం, ఈ పూజ ద్వారా మానవ జీవితంలో కనిపించే ప్రభావం చెబుతుంది.ముద్గల పురాణం: ముద్గల పురాణం గణనాథునికి చేయవలసిన పూజలు, వాటి ప్రాముఖ్యత, గణనాథుని వివిధ అవతారాల గాథలను, వివిధ సందర్భాల్లో వినాయకుడు భక్తులను అనుగ్రహించిన సందర్భాలు, ప్రదర్శించిన మహిమల గాథలను చెబుతుంది.స్కాంద పురాణం: స్కాంద పురాణం కూడా గణేశుడి జన్మ వృత్తాంతం, వినాయక చవితి పండుగ ప్రాముఖ్యత, గణేశుడికి సంబంధించిన పూజా విధానాలు విపులంగా చెబుతుంది.పద్మ పురాణం: పద్మ పురాణం వినాయక చవితి విశేషాలను చాలా విస్తృతంగా వివరిస్తుంది. ప్రతేకించి వినాయక చవితి పూజలో ఉపయోగించవలసిన పూజా పత్రీ వివరాలను విపులంగా చెబుతుంది.(చదవండి: తెలుగునాట ప్రసిద్ధిగాంచిన గణపతి ఆలయాలివే..!) -
ఐకానిక్ లాల్బాగ్చా రాజా వినాయకుడికి, అనంత్ అంబానీ బంగారు కానుక
గణేష్ ఉత్సవాలకు మహారాష్ట్రలోని ముంబై నగరం పెట్టింది పేరు. అందులోనూ ముంబైలోని ఐకానిక్ లాల్బాగ్చా రాజా వినాయక ఉత్సవం మరింత స్పెషల్గా ఉంటుంది. ఇప్పటికే లాల్బాగ్చా రాజా వినాయకుడి ఫస్ట్లుక్ను విడుదల చేశారు. తాజాగా పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ, గణనాథునిపై తమ భక్తిని, గౌరవాన్ని మరోసారి ఘనంగా చాటుకున్నారు. ముఖ్యంగా అనంత అంబానీ, రాధిక వివాహం తర్వాత తొలి వినాయక చవితి కావడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.నవ వరుడు అనంత్ అంబానీ ముంబైలోని వినాయకుడికి ఘనమైన కానుకను బహూకరించారు. 20 కేజీల బంగారు కిరీటాన్ని గణేషుడికి బహుమతిగా ఇచ్చారు. దీని విలువ రూ.15 కోట్లు. ఈ కిరీటాన్ని దాదాపు 2 నెలల కష్టపడి తయారు చేసినట్లు కమిటీ వెల్లడించింది. సంప్రదాయ మెరూన్ కలర్ దుస్తుల్లో విలువైన ఆభరణాలకు తోడు ఈ ఏడాది బంగారు కిరీటంతో భక్తుల పూజలందుకోనున్నాడు గణేశుడు.కాగా 'కింగ్ ఆఫ్ లాల్బాగ్' అని పిలిచే లాల్బాగ్చా రాజా ముంబైలో అత్యధికంగా సందర్శించే గణేష్ మంటపం. ప్రతీ సంవత్సరం వేలాది మంది భక్తులు తరలివస్తారు. గత పదిహేనేళ్లుగా అనంత్ అంబానీ లాల్బాగ్చా రాజా కమిటీకి మద్దతుగా నిలుస్తున్నారు అనంత్ అంబానీ.लालबागचा राजाचे, प्रसिद्धी माध्यमांसाठी फोटो सेशन गुरुवार दिनांक 5 सप्टेंबर 2024 रोजी संध्याकाळी ठिक 7 वाजता करण्यात आले आहे. त्या वेळेची क्षणचित्रे.#lalbaugcharaja Exclusive live on YouTube :https://t.co/XAHhCLjBM6 pic.twitter.com/fg07hI096z— Lalbaugcha Raja (@LalbaugchaRaja) September 5, 2024 -
తెలుగునాట ప్రసిద్ధిగాంచిన గణపతి ఆలయాలివే..!
మన తెలుగునాట ఎన్నో ప్రసిద్ధి గాంచిన గణిపతి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. వాటి మహిమ అంతా ఇంతా కాదు. కోరిన కోరికలు తీర్చే మహా వినాయకుడిగా పూజలందుకుంటున్నాడు. ఆ మహిమాన్వితమైన ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందామా..!బిక్కవోలు గణపతి ఆలయంతూర్పుగోదావరి జిల్లాలోని బిక్కవోలులో నెలకొని ఉన్న గణపతి ఆలయం క్రీస్తుశకం 848 – 891 మధ్య ఆంధ్రదేశాన్ని పాలించిన తూర్పు చాళుక్య ప్రభువు మూడవ విజయాదిత్యుడు బిక్కవోలును రాజధానిగా చేసుకుని పాలన సాగించాడు. ఇతనికి గణుగ మహారాజు, త్రిపురమర్త్య, మహేశ్వర, వల్లభ అనే బిరుదులతో పాటు బిరుదాకరామభీమ అనే బిరుదు కూడా ఉంది. ఈ బిరుదు ఆధారంగానే ఈ గ్రామానికి బిరుదాంకరాయపురం అని పేరు వచ్చింది. కాలక్రమంలో బిరుదాంకనవోలుగా మారి ప్రస్తుతం బిక్కవోలుగా వ్యవహారంలో స్థిరపడింది.చారిత్రక ఆధారాలను బట్టి తూర్పుచాళుక్య రాజులలో రెండవ విజాదిత్యుడు జైనులైన రాష్ట్రకూటులతో 108 యుద్ధాలు చేశాడు. ఇతడు నరేంద్ర మృగరాజుగా పేరు పొందాడు. యుద్ధాలు చేసినందుకు పాప పరిహారంగా ఒకొక్క యుద్ధభూమిలో ఒక్కొక్కటిగా మొత్తం 108 శివాలయాలను నిర్మించాడు. మూడవ విజయాదిత్యుడు కూడా అనేక యుద్ధాలు చేసి విజయాలు సాధించి, విఘ్నేశ్వరాలయాలను కట్టించాడు. అందులో ఒకటి ఈ ప్రసిద్ధ బిక్కవోలు గణపతి ఆలయం. చాళుక్యుల తరువాత వివిధ రాజవంశీయులతో పాటు పెద్దాపురం సంస్థానాధీశులు ఈ ఆలయం కోసం అనేక దానధర్మాలు చేశారు. బిక్కవోలు గణపతిని దర్శిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని, కష్టాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. కాణిపాక వరసిద్ధి వినాయక క్షేత్రంచిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో వెలసిన శ్రీవరసిద్ధి వినాయక క్షేత్రం ఎంతో ప్రాచీనమైన పుణ్యక్షేత్రం. పూర్వం దీనిని విహారపురిగా వ్యవహరించేవారు. 11వ శతాబ్దంలో కుళోత్తుంగ చోళుడు బ్రహ్మహత్యా పాతక నివృత్తి కోసం వరసిద్ధి వినాయకస్వామి ఆలయం కట్టించినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. 1336లో విజయనగర రాజులు దీనిని అభివృద్ధి చేశారు. బహుదా నది ఒడ్డున ఉన్న ఈ ఆలయ సింహద్వారం వద్ద చోళరాజ శిలాప్రతిమ ఉంది. ఆలయానికి ఎదురుగా కోనేరు, మండపం ఉన్నాయి. ఈ ఆలయానికి వాయవ్యంలో మరకతాంబికా సమేతుడైన మణికంఠేశ్వరాలయం ఉంది. ఒకసారి బహుదా నదికి వరదలు రావటం వల్ల ఆ వరదల్లో ఇక్కడ ఉన్న విఘ్నేశ్వరాలయలోని వినాయకుడు జరిగి దగ్గరలో ఉన్న బావిలో పడిపోయాడు. ఆ వినాయకుడే మరల తన ఉనికి వరసిద్ధి వినాయకునిగా పూర్వం గుడ్డి, చెవిటి, మూగ అయిన ముగ్గురు వికలాంగులు తమ పొలంలోని బావిని లోతు చేయటం కోసం తవ్వుతుండగా స్వామివారు స్వయంభువుగా ప్రకటితమయ్యారు. ప్రతియేటా వినాయక చవితి మొదలు 21 రోజుల పాటు ఈక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. చివరి రోజున తెప్పోత్సవం జరుపుతారు. ఈ ఉత్సవాలలో కాణిపాకం గ్రామస్థులే కాకుండా, చుట్టుప్రక్కల గ్రామస్థులు రోజుకొక వాహనసేవలో పాల్గొనటం విశేషం.కొలనుపాక గణపతి ఆలయంయాదాద్రి భువనగిరి జిల్లాలోని కొలనుపాక వీరశైవ మతానికి సంబంధించి గొప్ప చారిత్రక ప్రదేశం. 11వ శతాబ్దంలో ఈ ప్రాంతం చాళుక్యుల వశం అయ్యింది. ఇక్కడ సోమేశ్వరాలయం ఉంది. వీరశైవ మతానికి చెందిన రేణుకాచార్య ఈ ప్రాంతంలోనే జన్మించినట్లు వివిధ ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. ఈ ఆలయ ప్రాగణంలోనే వినాయక, కార్తికేయ విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడి గణపతి విగ్రహం చాళుక్యుల శిల్పకళా చాతుర్యంతో కూడుకుని ఉంది. పశ్చిమ చాళుక్యుల కాలమైన పదకొండవ శతాబ్దంలో చెక్కబడిన సర్వాభరణ భూషితుడైన వినాయకుడు చతుర్భుజాలతో పీఠంపై ఆసీనుడైనట్లుగా ఉంటాడు. రెండు చేతులలో అంకుశం ధరించి ఉంటాడు. ఎడమచేతిలో మోదకం ఉంటే, కుడిచేయి మోకాలుపై ఆధారంగా ఉంటుంది. ఈ వినాయకుడి ఉదరానికి ఉన్న సర్పబంధం అద్భుతంగా కనపడుతుంది. తొండం ఎడమవైపు వంగి ఉంటుది. ఇక్కడి గణపతికి ముడుపులు కట్టి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. అయినవిల్లి సిద్ధివినాయక ఆలయంకోనసీమజిల్లా అమలాపురానికి చేరువలోని అయినవిల్లి సిద్ధివినాయక ఆలయం అత్యంత పురాతనమైనది. పవిత్ర గోదావరి నదీపాయ ఒడ్డున ఉన్న ఈ వినాయక ఆలయాన్ని తొలుత దేవతలు నిర్మించారని ఇక్కడి స్థలపురాణం. వ్యాసమహర్షి దక్షిణ యాత్ర ప్రారంభించటానికి ముందు ఈ వినాయకుని ప్రతిష్ఠించాడని ప్రతీతి. అయినవిల్లి ఆలయాన్ని పెద్దాపురం సంస్థానాధీశులు పునర్నిర్మించి, పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అయినవిల్లి వినాయకునికి శైవాగమం ప్రకారం విశేషార్చనలు, నారికేళఫలోదకాలతో అభిషేకాలు చేస్తారు. భక్తులు 1,116 కొబ్బరికాయలతో స్వామివారికి అభిషేకం చేయించి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ ఆలయంలో వినాయక చవితితోపాటు, ప్రతినెలా ఉభయ చవితి తిథులలో పూజ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. దశమి, ఏకాదశి రోజుల్లోనూ విశేష పూజలు చేస్తారు.చోడవరం స్వయంభూ వినాయక ఆలయంఅనకాపల్లి జిల్లా చోడవరంలోని గౌరీశ్వరాలయం, వినాయక ఆలయాలకు స్వయంభువులుగా అనేక వందల సంవత్సరాల చరిత్ర ఉంది. చోడవరం గ్రామానికి తూర్పుముఖంగా ఉన్న ఈ ఆలయాన్ని సుమారు 600 సంవత్సరాల క్రితం మత్స్యవంశ రాజులు నిర్మించినట్లు చెబుతారు. ఆ ఆలయంలోని గర్భగుడి ద్వారంపై ఉన్న చేప చిహ్నాల వల్ల ఇక్కడి స్వామివారిని మత్స్య గణపతిగా పేర్కొంటారు. శ్రీ గౌరీశ్వరుడు మత్స్యవంశ రాజుకు కలలో కనిపించి చోడవరం కోట తూర్పు దిక్కున తాను వెలుస్తున్నానని ఆ ప్రదేశం చెమ్మగా ఉంటుందని చెప్పటంతో ఆలయం ఉన్నచోట తవ్వకాలు జరపగా, చుట్టూ నీటితో కూడిన శివలింగం బయల్పడటంతో అక్కడే ఆలయ నిర్మాణం చేశారు.తురుష్కుల దాడిలో ఆలయంలోని గౌరీశ్వరస్వామి లింగాకృతి ఛిన్నాభిన్నమైంది. అప్పటి నుంచి ఆ ఆలయంలో గౌరీశ్వరుడు పుట్ట ఆకృతిలో దర్శనమిస్తున్నాడు. చోళవంశ రాజులు ధ్వంసమైపోయిన శివలింగం స్థానంలో కాశీ నుంచి కొత్త లింగాన్ని తెచ్చి ప్రతిష్ఠించదలచారు. కాని, స్వయంభువుగా వెలసిన వినాయక విగ్రహానికి మాత్రమే పూజలు జరిపించాలని స్వామి కలలో కనిపించి చెప్పటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. చోడవరం స్వయంభూ వినాయకుడు చిన్నపాటి నీట ఊటలో నల్లని రాతివిగ్రహం మూడు అడుగులకు పైగా పొడవు, వెడల్పులతో ఛాతీభాగం వరకే స్వామివారు దర్శనమిస్తారు. మిగతా భాగం భూమి లోపలే ఉండటం విశేషం. తొండం చివరి భాగం కూడా కనిపించదు.శ్రీశైల సాక్షిగణపతిప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలానికి మూడు కిలోమీటర్ల దూరంలో సాక్షిగణపతి ఆలయం పరమ పవిత్ర స్థలంగా అనాదిగా పూజలందుకుంటోంది. శ్రీశైల మల్లికార్జునుని దర్శించటానికి వచ్చిన భక్తుల వివరాలను గణపతి ఇక్కడ నమోదు చేస్తాడని ప్రతీతి. అందుకే ఈ గణపతిని సాక్షిగణపతి అని పేరు. సాక్షిగణపతి విగ్రహం వైవిధ్యంగా ఉంటుంది. ఇక్కడి విగ్రహం ఎడమచేతిలో ఒక పుస్తకాన్ని పట్టుకుని కుడిచేతిలో ఘంటంతో భక్తుల పేర్లు రాస్తున్నట్లుగా ఉంటుంది. శ్రీశైలాన్ని దర్శించి వెనక్కు వెళ్ళే భక్తులు మార్గమధ్యంలో ఉన్న ఈ సాక్షి గణపతి ఆలయాన్ని దర్శిస్తారు. తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించి ఇక్కడి స్వామివారికి గోత్రనామాలు విధిగా చెప్పుకోవాలని పెద్దలు చెబుతారు.రాయదుర్గం దశభుజ శ్రీమహాగణపతిఅనంతపురం జిల్లా రాయదుర్గంలో మూడు గణపతి ఆలయాలు ఉన్నాయి. అందులో రాయదుర్గం కొండపైకి వెళ్ళే మార్గంలో కోట మెట్ల కింద ఆత్మకూరు వీథిలో దశభుజ గణపతి ఆలయం ప్రముఖమైనది. నాలుగు మీటర్ల కొండరాయిపై మలచిన వినాయకుని రూపం ఎంతో ఆకర్షిస్తుంది. సుమారు పదిహేను అడుగుల ఎత్తుగల వినాయకుని రూపం చూడటానికి రెండుకళ్ళూ చాలవు. భారీశిలపై పదిచేతులు గల వినాయకుడిని ఎంతో నేర్పుగా మలచినట్లు కనిపిస్తుంది. ఈ విగ్రహంలో వినాయకుని తొండం కుడివైపు తిరిగి ఉంటుంది. కూర్చుని ఉన్న ఈ వినాయక విగ్రహం ఎడమ తొడపై ఒక స్త్రీరూపు చెక్కబడి ఉంది. విజయనగర సామ్రాజ్యకాలంలో విజయనగర రాజుల ఏలుబడిలో దశభుజ గణపతి ఆలయం నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.రాయదుర్గం దశభుజ వినాయకరూపం షోడశగణపతి రూపాలలో ఒకటి. ఇది శ్రీమహాగణపతి రూపం. ఈయన సమగ్రమూర్తి. కుడివైపు తిరిగిన తొండంతో ఎడమచేతితో తొడపై కూర్చున్న అమ్మవారిని ఆలింగనం చేసుకున్నట్లు ఉంటుంది. పదిబాహువులతో కుడిచేత చక్రం, ఓషధి, కలువపువ్వు, నిధి« ధరించి ఉంటాడు. ఎడమచేత పాశం, చెరకుగడ, పద్మం, గద ధరించి ఉంటాడు. కిరీటంపై అర్ధచంద్రుడి అలంకారం అలరారుతుంటుంది.యానాం సిద్ధిగణపతి (పిళ్ళైయార్) ఆలయంపుదుచ్చెరిలోని పూర్తి తెలుగు ప్రాంతమైన యానాంలో వెలసి పరమ భక్తుల సేవతో విరాజిల్లుతున్న సిద్ధిగణపతి పిళ్ళైయార్ స్వామి నమ్మిన భక్తులకు కోరిన కోర్కెలు తీరుస్తూ అనుగ్రహిస్తున్నాడు. పురాణరీత్యా గోహత్యా పాపవిమోచన కోసం గంగానది సహా ఇతర తీర్థాలలో స్నామాచరిస్తూ గౌతమ మహర్షి గోదావరి నదిని గోష్పాదక్షేత్రం (కొవ్వూరు) వరకు తీసుకురాగా సప్తమహర్షులు ఆ నదిని ఏడుపాయలుగా విభజించి సాగరాన సంగమం గావించారు. సప్తఋషులలో ఒకరైన భరద్వాజ మహర్షి గోదావరి శాఖను యానాంకు కొద్దిదూరంలో ఉన్న చొల్లంగి వద్ద సముద్రంలో సంగమింప చేశాడు.ఈ ప్రదేశం కోరంగికి సమీపంలో ఉంది. కురంగి సంచరించిన ప్రదేశం కాలక్రమంలో కోరంగిగా మారింది. కురంగం అంటే కృష్ణ్ణజింక అని అర్థం. ఆ యానాం పావని వృద్ధగౌతమీనదీ తీరం. ఈ ఆలయం 11వ శతాబ్దంలో చాళుక్య రాజుల కాలంలో ప్రతిష్ఠించినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. అప్పటి విగ్రహ శిల్పకళా సౌందర్యం దీనికి తార్కాణం. గజరాజుల మధ్య లక్ష్మీదేవిని ద్వారంపై చెక్కి ఉండటం చాళుక్యుల దేవాలయ నిర్మాణ చిహ్నం. ఈ సిద్ధి గణపతిని ఆనాడు విజయ గణపతిగా కొలిచేవారు. తీరప్రాంతం అవటంతో ఉప్పెనలు, వరదలు, తుపానుల కారణంగా, భౌగోళిక మార్పుల వల్ల ఈ స్వామి పుట్టలతో కప్పివేయబడ్డాడు.1723 నాటికి మోటుపల్లి యానం ఫ్రెంచివారి పాలనలోకి చేరింది. కోరంగి కాలువ ద్వారా వారు వ్యాపారాలు నిర్వహించేవారు. పుదుచ్చేరి, కారైకాల్, మాహే, యానాం, చంద్రనాగూరు ఫ్రెంచివారి అధీనంలో ఉండేవి. ఈ ప్రాంతాలకు 13 జూన్ 1954న స్వాతంత్రం లభించింది. సరిగా ఆ సమయలోనే తమిళుడైన రెడ్డియార్ పట్టిస్వామి అనే వైద్యుడు యానాం చేరాడు. ప్రస్తుతం ఉన్న ఆలయ సమీపంలోని రావిచెట్టు కింద వైద్యం చేసేవాడు. ఒకనాడు స్వామివారు ఆయనకు కలలో కనిపించి రావిచెట్టు వద్ద ఉన్న పుట్టలో తానున్నట్లు చెప్పాడు. అప్పటి నుంచి స్వామివారి ఉనికి తిరిగి బహిర్గతమైంది. లభించిన పురాతన ప్రాకారాలతో, స్తంభాలతో ఆలయాన్ని పునర్నిర్మించారు. ఇక్కడి స్వామివారికి 108 ప్రదక్షిణలు చేయటం, 108 టెంకాయలు కొట్టడం, స్వామివారి ఎదుట భక్తులు గుంజిళ్లు తీయడం ఆచారంగా ఉంది.రుద్రారం సంకష్టహర సిద్ధివిద్యాగణపతి ఆలయంసంగారెడ్డిజిల్లా పటాన్చెరువుకు అతి చేరువలోని రుద్రారంలో స్వయంభువుగా వెలసిన శ్రీ సంకష్టహర సిద్ధివిద్యాగణపతి ఆలయం ఉంది. వందల ఏళ్ళనాటి ఈ ఆలయం భక్తులకు కొంగు బంగారం. రుద్రారం గణపతిని శివరాంభట్ అనే ఆధ్యాత్మిక గురువు ప్రేరణతో నిర్మితమైంది. ఈయన రుద్రారం ప్రాంతం నుంచి రేజింతల వరకు గల ప్రాంతంలో ఐదు వినాయక ఆలయాలను నిర్మించారు. అవి చింతలగిరి, చీకుర్తి, మల్కల్–పాడు, మల్కల్–గుట్ట (రేజింతల్) కాగా, చివరిది ఈ రుద్రారం గణపతి ఆలయం.రుద్రారం గణపతి చతుర్భుజాలతో ఉంటారు. ఉదరానికి నాగబంధం ఉంటుంది. ఈ వినాయకునిపై శ్రీచక్ర బీజాక్షరాలు ఉండటంచేత ఆ శక్తిని సామాన్యులు తట్టుకోవటానికి స్వామివారికి ప్రతిరోజూ సింధూర లేపనం పూస్తారు. ఈ ప్రాంతంలో నెలకొని ఉన్న పంచ వినాయక ఆలయాలలో స్వామివారికి సింధూర లేపనం పూస్తారు. ఇక్కడి స్వామి విద్యాగణపతి కావటంతో విద్యార్థులు వచ్చి స్వామివారికి ప్రదక్షిణలు చేసి, దర్శనం చేసుకుంటూ ఉంటారు. సంకష్టహర చతుర్థినాడు ఈ ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి.రేజింతల సిద్ధివినాయక ఆలయంసంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు పదమూడు కిలోమీటర్ల దూరంలోని రేజింతల గ్రామంలో నెలకొని ఉన్న స్వయంభూ సిద్ధివినాయక స్వామి రెండువందల సంవత్సరాలకు పైగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఈ ఆలయం కర్ణాటక రాష్ట్ర సరిహద్దుకు అతి చేరువలో ఉంది. జహీరాబాద్కు ఉన్న పూర్వనామం పెద్దమొక్కహెల్లి. జహీరాబాద్ నుంచి బీదర్ వెళ్ళే మార్గంలో ఈ ఆలయం ఉండటంతో తెలుగు ప్రజలే కాకుండా, కన్నడ ప్రజలూ అధికసంఖ్యలో వచ్చి ఈíసిద్ధివినాయక స్వామివారిని దర్శించుకుంటారు.శివరాంభట్ అనే ఆధ్యాత్మిక గురువు తన శిష్యగణంతో తిరుమలకు ప్రయాణమవుతూ రేజింతల గ్రామంలో ఆగారు. ఆయనకు రేజింతల కొండ వద్ద వినాయకుని రూపంలో ఒక శిల కనబడింది. అదే ఈ స్వయంభూ వినాయక విగ్రహం. కోరిన కోర్కెలు తీర్చడం వల్ల సిద్ధివినాయకుడిగా ప్రసిద్ధి చెందాడు.సికింద్రాబాద్ గణపతి ఆలయంసికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు అతి చేరువలో ఉన్న ఈ గణపతి ఆలయం బహు ప్రసిద్ధమైనది. పూర్వం ఈ ప్రాంతం సైనిక నివాస ప్రాంతంగా ఉండేది. 1824లో సైనికులు మంచినీటి కోసం బావి తవ్వగా ఈ వినాయక విగ్రహం బయట పడింది. అప్పుడు చిన్న గుడిగా ఉండేది. 1932లో ఈ ఆలయ ప్రాంగణంలోనే వల్లీదేవసేనా సమేత సుబ్రహ్మన్యస్వామి ఆలయం, శివాలయం, అమ్మవారి ఆలయం, ఆంజనేయ ఆలయం నర్మించారు. 1960లో ఆలయ ప్రాంగణంలోని బావి పూడ్చి ఆలయానికి నూతన రూపం కల్పించారు. ఈ ఆలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.విశాఖ సంపత్వినాయగర్ ఆలయంవిశాఖ నగరంలో శ్రీసబంధన్ అండ్ కంపెనీవారి కార్యాలయ ప్రాంగణంలో 1962లో వినాయకుడిని ప్రతిష్ఠించారు. అప్పుడు ఆ కార్యాలయ యాజమాన్యం మాత్రమే పూజలు చేస్తుండేది. ఆ తరువాతి కాలంలో భక్తజనానికి దర్శనం అనుమతించారు. ఈ ఆలయాన్ని 1967లో సందర్శించిన కంచి పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతి ఇక్కడ గణపతి యంత్రాన్ని ప్రతిష్ఠించారు.1971లో పాకిస్తాన్తో మనదేశానికి యుద్ధం వచ్చినప్పుడు అప్పటి తూర్పు నౌకాదళాధిపతి కృష్ణన్ ఈ వినాయక స్వామిని దర్శించుకురు. యుద్ధంలో భాగంగా పాకిస్తాన్ సముద్రం మార్గంలో విశాఖ నగరాన్ని ముట్టడి చేయాలన్న ఉద్దేశంతో ఘాజీ అనే జలాంతర్గామిని పంపింది. ఈ జలాంతర్గామిని మన దేశ నౌకాదళాలు ముంచేశాయి. ఆ వెంటనే మన నౌకాదళాధిపతి కృష్ణన్ ఈస్వామివారిని దర్శించుకుని, 1001 కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు. విశాఖ సంపత్వినాయగర్ ఆలయాన్ని ప్రతిరోజూ వేలసంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. ఇక్కడి వినాయకునికి ప్రతిరోజూ పంచామృతాభిషేకం చేస్తారు. వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.కాజీపేట శ్వేతర్కమూల గణపతి ఆలయంహనుమకొండ జిల్లా కాజీపేట రైల్వేప్రాగణంలో శ్వేతార్కమూల గణపతి ఆలయం ఉంది. ఇక్కడి వినాయకమూర్తి తెల్ల జిల్లేడువేరు మొదలు నుంచి ఉద్భవించింది. ఈ విగ్రహన్ని చెక్కడంగాని, మలచటంగాని చేయలేదు. స్వయంగా భూమి నుంచి పుట్టిన శ్వేతార్క గణపతికి నేత్రాలు, నుదురు, మోచేయి, అరచేయి, సుఖాసనము, తల్పము, ఎలుక అన్నీ స్పష్టంగా కనపడతాయి.నారద పురాణంలో తెల్ల జిల్లేడు చెట్టు వందేళ్ళు పెరిగితే ఆ చెట్టుమూలంలో గణపతి రూపం తయారవు తుందని చెప్పారు. వినాయకుడు ప్రకృతి స్వరూపుడు అని పురాణాలు చెబుతున్నాయి. శ్వేతార్కమూలాన్ని వెలికితీసి, మట్టిని కడిగివేసి, నీళ్ళల్లో నానబెట్టి, జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆ వేరు మీద గణపతి ఆకృతి కనిపిస్తుందని చెబుతారు.1999లో నల్లగొండ ప్రాంతంలోని మాడా ప్రభాకరశర్మ ఇంటి పరిసరాల్లో ఈ శ్వేతార్క గణపతిని అయినవోలు అనంత మల్లయ్యశర్మ గుర్తించారు. ఈ శ్వేతార్కమూల విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి, పూజలు మొదలు పెట్టారు. 2002లో దేవాలయాన్ని నిర్మించారు. 2008లో ఆలయాన్ని విస్తరించారు. ప్రతినెలా కృష్ణపక్షంలో వచ్చే సంకష్టహర చతుర్థికి ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి.- కప్పగంతు వెంకటరమణమూర్తి(చదవండి: వినాయక విజయం: విచిత్ర వినాయకుడు..!) -
వినాయక విజయం: విచిత్ర వినాయకుడు..!
వాతాపి నగరానికి సాధువుల గుంపుతో కలసి ఒక పద్నాలుగేళ్ల కుర్రవాడు వచ్చాడు. ఆ కుర్రవాడు వాతాపి గణపతి ఆలయాన్ని విడిచిపెట్టకుండా అక్కడే ఉండిపోయాడు. అతడి ఊరేదో పేరేదో అతడికే తెలియదు. అతడి నుదుటి మీద గాయం మానిన మచ్చ చూసిన జనాలు, పాపం ఏదో దెబ్బ తగిలి గత స్మృతి అంతా పోగొట్టుకున్నాడని అనుకున్నారు. ఆ కుర్రవాడు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. ఎంతసేపూ వాతాపి ఆలయ మంటపం రాతి పలకల మీద, గోడల మీద సుద్దతో బొమ్మలు గీస్తూ ఉండేవాడు. బొమ్మలు గీస్తున్నంత సేపూ అతడి ముఖం చిరునవ్వుతో వెలుగుతూ ఉండేది. బొమ్మలు గీస్తూ ఆనందం పొందుతుండే ఆ బాలుడిని వాతాపి వాసులు చిత్రానందుడు, చిత్రముఖుడు అని పిలవసాగారు. అతడు ఎక్కువగా వినాయకుడి బొమ్మలే గీస్తుండటంతో వినాయక చిత్రకారుడనే పేరును సంక్షిప్తంగా మార్చి విచిత్రుడు అని పిలవసాగారు. కాలక్రమంలో ఆ బాలుడికి విచిత్రుడు అనే పేరు స్థిరపడింది.వాతాపి నగరంలో గణపతి భక్తుడైన గజానన పండితుడు రోజూ సాయంత్రం ఇంటి వద్ద పిల్లలకు వినాయక కథలు చెబుతుండేవాడు. మిగిలిన పిల్లలతో కలసి విచిత్రుడు కూడా గజానన పండితుడు చెప్పే కథలను అరుగు మీద కూర్చుని శ్రద్ధగా ఆలకించేవాడు. కథ విన్న మర్నాడు ఆ కథలోని సన్నివేశాలను గోడల మీద చిత్రించేవాడు. విచిత్రుడు చిత్రించే వినాయకుని బొమ్మలు చూసి గజానన పండితుడు మురిసిపోయేవాడు. విచిత్రుడికి ఎన్నో విఘ్నేశ్వరుడి కథలను ప్రత్యేకంగా చెబుతుండేవాడు.విచిత్రుడి వెంట ఎప్పుడూ పిల్లలు గుంపులు గుంపులుగా ఉండేవారు. అతడు చిత్రించే బొమ్మలను వారు అబ్బురంగా చూస్తుండేవారు. కొందరు అతడిలాగా బొమ్మలు గీయడానికి ప్రయత్నిస్తూ చిత్రకళా సాధన చేస్తుండేవారు. విచిత్రుడి ప్రభావంతో వాతాపి నగరంలోని పిల్లలకు చిత్రకళ అబ్బింది.విచిత్రుడు పగలంతా గోడల మీద బొమ్మలు వేస్తూ, వాతాపి గణపతి ఆలయంలో పంచే ప్రసాదంతో కడుపు నింపుకొనేవాడు. రాత్రిపూట ఆలయం మెట్ల మీద ఒక మూలనో, ఊరి చివరనున్న వాడలో ఏ ఇంటి అరుగు మీదనో నిద్రపోయేవాడు. వాడలోని కుమ్మరులు, చర్మకారులు విచిత్రుడంటే ప్రాణం పెట్టేవారు. అతడు ఏ రాత్రి వచ్చినా, అతడి కోసం దాచిపెట్టిన భోజనం తినిపించి, అతడి పడకకు ఏర్పాట్లు చేసి మరీ నిద్రపోయేవారు. అలా విచిత్రుడు పెరిగి పెద్దవాడయ్యాడు.కాలం ఇలా గడిచిపోతుండగా, వాతాపి నగరంలో వినాయక నవరాత్రుల కోలాహలం పండుగకు కొద్ది రోజుల ముందు నుంచే మొదలైంది. ఉత్సవాల సందర్భంగా ఒక శిల్పకళా ప్రదర్శన ఏర్పాటు జరిగింది. ప్రదర్శనలో అత్యుత్తమంగా నిలిచిన విగ్రహాన్ని ఉత్సవ నిర్వాహకులు వెయ్యి బంగారు కాసులు ఇచ్చి కొంటారు. ఆ విగ్రహాన్ని మలచిన కళాకారుడిని నగరపాలకులు రత్నఖచిత స్వర్ణకంకణంతో ఘనంగా సత్కరిస్తారు.ఆ పోటీ ప్రదర్శనలో చుట్టుపక్కల రాజ్యాల ఆస్థాన చిత్రకారులు సహా ఎందరో పేరుగాంచిన శిల్పులు, చిత్రకారులు తమ తమ విగ్రహాలను తీసుకొచ్చారు. విదేశాల నుంచి తెప్పించిన రంగులు, బంగారు పూతలతో, రంగురాళ్లతో ఒకరిని మించి మరొకరు కళ్లు మిరుమిట్లు గొలిపేలాంటి వినాయక విగ్రహాలను రూపొందించి, ప్రదర్శనకు పెట్టారు.తాను రూపొందించిన విగ్రహాన్ని కూడా ప్రదర్శనలో పెట్టాలని విచిత్రుడు ఉబలాటపడ్డాడు. అతడికి ఒక కుమ్మరి మిత్రుడు ఉన్నాడు. విచిత్రుడు తీర్చిదిద్దిన రూపురేఖలతో అతడు బంకమట్టిని ఉపయోగించి విగ్రహం తయారు చేశాడు. సున్నం, బొగ్గుమసి, జేగురు, పచ్చమట్టి, ఆకుపసర్లు ఉపయోగించి విచిత్రుడు ఆ విగ్రహానికి చక్కగా రంగులు వేశాడు. ప్రదర్శనలో పెట్టడానికి విచిత్రుడు ఆ విగ్రహాన్ని తీసుకువెళ్లాడు. అక్కడి పెద్దలందరూ విచిత్రుడి విగ్రహాన్ని ప్రదర్శనలో పెట్టనివ్వలేదు. తన విగ్రహాన్ని చిట్టచివరనైనా ఉంచాలని విచిత్రుడు ఎంతగా ప్రాధేయపడినా, వారు కనికరించలేదు. ‘కులగోత్రాలు లేనివాడివి, ఊరూ పేరూ లేనివాడివి, కడజాతుల వారితో కలసి తిరిగేవాడివి. అలాంటి నీ చేతుల్లో తయారైన విగ్రహానికి వంశప్రతిష్ఠలు గల సుప్రసిద్ధ చిత్రకారుల విగ్రహాల సరసన ప్రదర్శించే అర్హత లేదు’ అని నిర్దాక్షిణ్యంగా అతడి కోరికను తిరస్కరించారు.విచిత్రుడు చాలా బాధపడ్డాడు. అతడి బాధను చూసిన కుమ్మరి మిత్రుడు ‘ప్రదర్శన పందిట్లో పెట్టకపోతే పోయారు. మనం వేరే చోట ఈ విగ్రహాన్ని అందరికీ కనిపించేలా పెడదాం, పద!’ అని నచ్చచెప్పాడు. ప్రదర్శన పందిరికి ఎదురుగా కొంత దూరంలో ఉన్న ఒక చెట్టు మొదట్లో విగ్రహాన్ని పెట్టి, విచిత్రుడిని తనతో పాటు కూర్చోబెట్టుకున్నాడు. పెద్దలందరూ పందిరిలో ప్రదర్శించిన విగ్రహాలను తిలకిస్తుంటే, పిల్లలు మాత్రం గుంపులు గుంపులుగా విచిత్రుడు రంగులద్దిన విగ్రహం ముందు గుమిగూడారు.ఒకవైపు పందిట్లోని ప్రదర్శనలో పెద్దల సందడి, మరోవైపు చెట్టుకింద విగ్రహం వద్ద పిల్లల కోలాహలం కొనసాగుతుండగా, ఎక్కడి నుంచో ఇద్దరు యువతులు వచ్చారు. మెరుపుతీగల్లాంటి వారిద్దరూ నిండుగా విలువైన నగలు ధరించి కళకళలాడుతూ ఉన్నారు. జనం వారిని ఆశ్చర్యంతో చూస్తుంటే, వారిలోని పెద్దామె ‘అయ్యలారా! మాది కళానంద నగరం. మాకు నచ్చిన వినాయక విగ్రహం కోసం పదివేల వరహాలు పట్టుకొచ్చాం’ అంటూ చేతిలోని బంగారు అల్లిక జలతారు సంచిని గలగలలాడించింది. ప్రదర్శనలో పిచ్చాపాటీ మాట్లాడుతూ కాలక్షేపం చేస్తున్న చిత్రకారులందరూ ఆమె మాటలతో అప్రమత్తమయ్యారు. ఎవరి విగ్రహాల దగ్గరకు వారు చేరి, గంభీరంగా నిలుచున్నారు.‘మా అక్క ప్రసన్నవదన గొప్ప గాయనీమణి. విగ్రహపుష్టి మాత్రమే కాదు, గొప్ప తిండిపుష్టి, గాత్రపుష్టి ఉన్నది. గొంతు విప్పిందంటే, ఆమె పాటకు ఎంతటి వారైనా మైమరచిపోవాల్సిందే!’ అంటూ ఇద్దరిలోనూ చిన్నది కాలి గజ్జెలను మోగిస్తూ, అక్కడున్న అందరి వంకా ఓరచూపులు విసిరింది.‘మా చెల్లి మోహన గొప్ప వాగుడుకాయ. అంతకు మించి గొప్ప నర్తకీమణి. చూడటానికి నాజూకు చిన్నదిలా ఉన్నా, నాట్యమాడుతూ నన్నే ఎత్తి తిప్పేస్తుంది. నాట్యంలో దాని చురుకుదనం చూడటానికి రెండు కళ్లు చాలవు. మాతో ఆడించడం, పాడించడం సాక్షాత్తు ఇంద్రుడికి, కుబేరుడికే సాధ్యం కాదు. అయితే, ఇక్కడ మాకు నచ్చిన విగ్రహం ముందు ఆటపాటలను ప్రదర్శిస్తామని వినాయకుణ్ణి మొక్కుకున్నాం’ అని చెప్పింది ప్రసన్నవదన. వారి మాటలకు మంత్ర ముగ్ధులైన జనాలు, వారు విగ్రహాలు చూడటానికి వీలుగా పక్కకు తొలగి, దారి ఇచ్చారు.అక్కా చెల్లెళ్లిద్దరూ ఒక్కొక్క విగ్రహం దగ్గర ఆగి, వాటిని పరిశీలనగా చూస్తూ ముందుకు సాగారు. అన్ని విగ్రహాలనూ చూసినా, ఏదీ నచ్చకపోవడంతో పెదవి విరిచి బయటకు మరలుతుండగా, ప్రదర్శన పందిరి ఎదురుగా పిల్లల కోలాహలం కనిపించింది. ‘అక్కడ పిల్ల వెధవలెవరో తయారు చేసిన తక్కువరకం విగ్రహం ఉంది లెండి’ అని గుంపులోంచి ఎవరో అనడం వాళ్లకు వినిపించింది. అది విని మోహన, ‘పదవే అక్కా! అక్కడేదో విగ్రహం తక్కువలోనే దొరికేటట్లుంది’ అంటూ ప్రసన్నవదన చేయి పట్టుకుని అటువైపుగా దారితీసింది. ప్రదర్శనశాలలోని జనాలంతా వాళ్లనే అనుసరిస్తూ బయటకు వచ్చారు. ప్రదర్శనశాలలో ఒక్కరూ మిగల్లేదు.ప్రసన్నవదన చెట్టు కిందనున్న విగ్రహం వద్దకు వెళ్లి, ఆ విగ్రహం ముందు వరహాల సంచి పెట్టింది. తన మెడలోని రత్నహారాన్ని తీసి, విచిత్రుడి చేతికి కంకణంలా తొడిగింది. అది చూసిన జనం ‘వీళ్లకేదో పిచ్చి ఉన్నట్లుంది! గొప్ప విగ్రహాలను కాదని వచ్చి, ఈ నాసిరకం విగ్రహం ముందు డబ్బు ధారపోస్తున్నారు’ అన్నారు.వాళ్ల మాటలు విన్న ప్రసన్నవదన జనాల వైపు చూసి, ‘ఇక్కడున్న విగ్రహంలోని ఏ విశేషాన్ని చూసి పిల్లలందరూ మురిసి ముచ్చటపడుతున్నారో, ఆ విశేషమే మమ్మల్ని కూడా ఆకట్టుకుంది. బాల దీవెనలు బ్రహ్మ దీవెనలు.అందుకే ఈ పిల్లల ఎంపికను శిరసావహిస్తున్నాము’ అని చెప్పింది.‘మట్టిశిల్పంలో లేని రూపసౌందర్యాన్ని సామాన్యమైన జేగురు వంటి రంగులతోనే తీర్చిదిద్దిన ఈ చిత్రకారుడి ప్రతిభ అమోఘం, అద్వితీయం. ఈ విగ్రహానికి మా బహుమానం అతిస్వల్పం’ అంది మోహన.‘మా కోరిక నెరవేరింది. ఇక్కడే మా మొక్కు చెల్లించుకుంటాం’ చెప్పింది ప్రసన్నవదన.వినాయక విగ్రహాన్ని అంటిపెట్టుకుని కూర్చుని, ప్రసన్నవదన తాళాలు మోగిస్తూ, ‘తాండవ నృత్యకరీ గజానన’ అంటూ కీర్తన మొదలుపెట్టింది. ఆ వెంటనే మోహన విద్యుల్లతలా నాట్యం ప్రారంభించింది. జనాలందరూ విస్మయచకితులై ఆ ప్రదర్శనను తిలకించసాగారు.ప్రసన్నవదన గానం ఇంట్లో ఉన్న గజానన పండితుడి చెవిన పడింది. అప్పటికే శతాధిక వృద్ధుడైన ఆయన ఇల్లు కదల్లేని స్థితిలో ఉన్నాడు. అయితే, ప్రసన్నవదన గానానికి ఆయనకు ఎక్కడలేని జవసత్త్వాలూ వచ్చాయి. మంచం మీద నుంచి లేచి, ఒక్క పరుగున ప్రదర్శన జరుగుతున్న చోటుకు చేరుకున్నాడు. ప్రసన్నవదనను చూసి, చేతులెత్తి జోడించి, సాగిలబడి, ధ్యాన ముద్రలో అలాగే ఉండిపోయాడు.నృత్యం చేస్తూ, చేస్తూ మోహన అంత పెద్ద వినాయక విగ్రహాన్నీ భుజం మీదకెత్తుకుంది. అది చూసిన జనం ‘అంత బరువు మోయలేవమ్మా! పడిపోతావు!’ అని కేకలు వేశారు. ‘నాకు అలవాటేగా!’ అని చెబుతూ ఆమె విగ్రహాన్ని భుజాన పెట్టుకునే నాట్యం చేస్తూనే పరుగులాంటి నడకతో బయలుదేరింది. జనం ఆమెను పరుగు పరుగున అనుసరించారు. ఈ సందడిలో ప్రసన్నవదన ఎప్పుడు అదృశ్యమైపోయిందో కూడా ఎవరూ గుర్తించలేదు.మోహన ఆలయ తటాకం వద్దకు చేరుకుంది. నాట్యం చేస్తూ, ఒక్కొక్క మెట్టే దిగుతూ తటాకంలో మునిగి అదృశ్యమైంది. కొద్ది క్షణాల్లో ఒక చిట్టెలుక విగ్రహాన్ని వీపున మోసుకుంటూ, నీటిలోకి మాయమైంది. ఆ రోజే వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే రోజు. జనాలు ఈ దృశ్యాన్ని చూసి, దిగ్భ్రాంతులయ్యారు.గజాననుడు ధ్యానముద్ర నుంచి తేరుకునే సరికి చెట్టు కింద విచిత్రుడు, అతడి కుమ్మరి మిత్రుడు, బంగారు జలతారు వరహాల సంచి తప్ప మరేమీ కనిపించలేదు. గజాననుడు లేచి, విచిత్రుడి వద్దకు వెళ్లి, అతడి తలమీద చేయివేసి ‘వాతాపి గణపతి ఆలయాన్ని నీ కళతో చిత్రశోభితం చేయి. కావలసిన ధనాన్ని ఆ విఘ్ననాయకుడే అనుగ్రహించాడు కదా! నీ వల్ల వాతాపి నగరం పావనమైంది. ఇక నుంచి నువ్వు పావనమిశ్రుడిగా ప్రఖ్యాతి పొందుతావు’ అని ఆశీర్వదించాడు. – సాంఖ్యాయన(చదవండి: దూర్వాయుగ్మపూజ అనగా..? గరికతోనే ఎందుకంటే..?) -
వినాయకుడి పెళ్ళి కథ ఆంతర్యం తెలుసుకుందాం!
వినాయకుని వివాహం గురించి చక్కటి పౌరాణిక గాథ. ప్రళయవేళ శ్రీ మహావిష్ణువు నాభినుండి వచ్చిన తామరపువ్వుపై బ్రహ్మ అవతరించాడు. ప్రళయానంతరం విష్ణువు మేల్కొని జీవనసృష్టి కార్యకలాపాన్ని ప్రారంభించమని తన కొడుకైన బ్రహ్మను ఆదేశించాడు. బ్రహ్మ సృష్టి ఆరంభిచాడు. కానీ అంతా వక్రంగా వుంది. అప్పటికి ఎన్నో కల్పాలలో సృష్టి చేస్తూ వస్తున్న బ్రహ్మకు ఈ పరిణామం ఆశ్చర్యం కలిగించింది. ఆలోచనలో పడ్డాడు. అప్పుడు నారదుడు కార్యారంభానికి ముందు వినాయక పూజ చేయనందువల్లే ఈ వైకల్పికము వచ్చిందని గణేశ అర్చనం చేయమని బ్రహ్మకు బోధించాడు. బ్రహ్మ వినాయకునికై కఠోర తపస్సు చేశాడు. ప్రత్యేక్షమైన వినాయకుడు బ్రహ్మ ఆంతర్యాన్ని గ్రహించి జ్ఞానం, క్రియలనే శక్తులను ఉపాసించమని బోధించాడు. బ్రహ్మ ఆ ఉపాసన చేశాడు.అప్పుడు ఆ రెండు శక్తులు సిద్ధి, బుద్ధి అనే రూపాలతో ప్రత్యక్షమయ్యాయి. బ్రహ్మ కోరిక మేరకు వారిరువురూ ఆయన కుమార్తెలుగా జన్మించారు. ఆ తరువాత బ్రహ్మ చేసిన సృష్టి సక్రమముగా కొనసాగింది. సిద్ధిబుద్ధులు యౌవనవతులయ్యారు. వారి వివాహం చేయాలని బ్రహ్మ సంకల్పించాడు. ఈలోగా నారదుడు కథ నడిపి సిద్ధిబుద్ధులు గణేశుని కోరుతున్నారని ఆయనకు చెప్పాడు. వినాయకుడు అంగీకరించాడు. తరువాత గణేశుడు మిమ్మల్ని కోరుతున్నాడని వారిద్దరికీ చెప్పాడు..బ్రహ్మ సమక్షంలో వినాయకుడికి పెళ్ళి జరిగింది. నూతన వధూవరులను ఆశీర్వదించి నారదుడు వినాయకునివైపు ఆశ్చర్యంగా చూశాడు. అతని ఆంతర్యాన్ని గ్రహించిన వినాయకుడు నారదా! మా మధ్య కలహం వస్తుదని నీవు భావించావు. ఈ సిద్ధిబుద్ధి ఎవరోకాదు, నా ఆంతరంగిక శక్తులైన జ్ఞానం, క్రియ. అందుకే మేము మళ్ళీ ఒకటయ్యాం.నీ కలహ చింతన లోకోపకారమైంది. భవిష్యత్ మానవుడు సిద్ధిబుద్ధి సమేతుడనైన నన్ను ఆరాధిస్తే వారికి సమస్త విఘ్నాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయని చెప్పాడు. ఇది వినాయకుడి పెళ్ళి కథ ఆంతర్యం.శ్రీలక్ష్మీ గణపతి వైభవం..మన భారతీయ సంప్రదాయం ముఖ్యంగా మూడు నవరాత్రుల పండుగలను చెప్పింది. 1)వసంత నవరాత్రులు, 2) గణపతి నవరాత్రులు, 3) దేవీ నవరాత్రులు. వినాయక నవరాత్రులనకుండా గణపతి నవరాత్రులనటంలోనే గణపతి వైభవం మనకు స్పష్టంగా అర్థమౌతున్నది. వేదం కూడా వినాయకుణ్ణి గణపతిగానే కీర్తించింది. ఏ శుభకార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా ‘‘ఓమ్ గణానాం త్వా గణపతిగ్ం హవామహే‘‘ అనే వేదమంత్రంతోనే వినాయక పూజ ప్రారంభిస్తారు, గణపతులు మహాగణపతి, వాతాపిగణపతి, విద్యాగణపతి, విజయగణపతి, నృత్యగణపతి, సంగీత గణపతి, ఉచ్ఛిష్ట గణపతి ఇలా చాలా రకాలుగా ఉన్నారు. అందరికీ అవసరమైన వానినందిస్తూ అందరిచేత పూజలందుకొనే వాడు లక్ష్మీగణపతి. ఈనాడు చదువులు, వ్యాపారాలు, ఆరోగ్యాలు, ఆరాధనలు, అన్నదానాలు అన్నీ ధనంతోనే ముడిపడి ఉన్నాయి. అందువల్ల లక్ష్మీగణపతిని ఆరాధిస్తే విద్యా, విజయం, ధనం అన్నీ కైవసం అవుతాయి. ఈ లక్ష్మీగణపతి వృత్తాంతం గణేశ జననం అనే పేరుతో బ్రహ్మవైవర్త పురాణంలో గణపతి ఖండంలో పూర్వాపరాలతో చాలా వివరంగా ఉంది.పార్వతీ పరమేశ్వరులు ఏర్పాటు చేసిన ఒక ఉత్సవంలో దేవతలందరితో పాటుగా హాజరైన లక్ష్మీదేవి ఆ సందర్భంలో గణేశుని ఉద్దేశించి మమ స్థితిశ్చ, దేహే తే గేహే భవతు శాశ్వతీ! (నీ శరీరంలో, నీవు ఉన్న ఇంటిలో శాశ్వతంగా నా స్థితి ఉంటుంది. అంటే నేను నివసిస్తాను) అని లక్ష్మీదేవి ప్రత్యేకంగా చెప్పినందువల్ల ఈ స్వామి లక్ష్మీగణపతి అయినాడు. వైభవం అంటే విశేషమైన పుట్టుక. ఆ పుట్టుక ఈ లక్ష్మీ గణపతిది."శ్రీకృష్ణాంశేన సంభూతం సర్వ విఘ్ననివారకమ్ ‘పార్వతీశ్వరయోః పుత్రం లక్ష్మీగణపతిం భజే ‘‘అనే ఈ శ్లోకాన్ని జపిస్తూ లక్ష్మీగణపతి స్వామిని ఆరాధిస్తే అఖండంగా ఆయుర్లక్ష్మి, ఆరోగ్యలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి కలుగుతాయి. ప్రపంచమంతా సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. -
భక్తులకు ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రసాదం మాత్రమే : కర్ణాటక నిర్ణయంపై వివాదం
కర్ణాటక ప్రభుత్వం భక్తులకు నాణ్యమైన 'ప్రసాదం' అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. గణేష్ మండపాల వద్ద 'ఎఫ్ఎస్ఎస్ఏఐ-ధృవీకరించిన ప్రసాదాలను మాత్రమే పంపిణీ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఆగస్టు 31న ఆదేశాలు జారీ చేసింది. దీంతో సరికొత్త దుమారం రేగింది. కర్నాటక ప్రభుత్వ నిర్ణయం హిందూ వ్యతిరేక నిర్ణయమని బీజేపీ అభివర్ణించింది. అయితే, గణేష్ చతుర్థి పండుగ సీజన్లో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. గణేష ఉత్సవ నిర్వాహకులకు జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికేట్ పొందిన వారిని మాత్రమే గణేష్ పందిళ్లలో ప్రసాదం తయారు చేయడానికి అనుమతిస్తారు. పందిళ్లలోఅందించే ప్రసాదానికి ఎఫ్ఎస్ఎస్ఏఐ ధృవీకరణ తప్పనిసరి అని బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP)కి రాసిన లేఖలో ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. అంతేకాదు అనుమతి లేకుండా ప్రసాదం పంపిణీ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎఫ్ఎస్ఎస్ఏఐ హెచ్చరించింది. అనుమతులు తప్పనిసరిబెంగళూరులోని గణేశ మంటప నిర్వాహకులు ఎఫ్ఎస్ఎస్ఏఐ ధృవీకరణతో పాటు, బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు పోలీసు, నగర పాలక సంస్థ, విద్యుత్ లాంటి స్థానిక అధికారుల అనుమతులను పొందాలి. నిర్వాహకులు పాండల్స్ కోసం కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించిన నిర్దిష్ట పర్యావరణ నిబంధనలను కూడా పాటించాలి. తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు, అగ్నిమాపక యంత్రాలు, అత్యవసర భద్రతా చర్యల్లో భాగంగా వేదిక వద్ద అత్యవసర సంప్రదింపు నంబర్లను ప్రదర్శించాలి.మరోవైపుగణేష్ చతుర్థి ఉత్సవాలకు అనుమతిస్తూ కర్నాటక హైకోర్టు, అధికారుల నిర్ణయాన్ని సమర్థించడంతో బుధవారం హుబ్బళ్లి-ధార్వాడ్లోని ఈద్గా మైదాన్లో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. -
దూర్వాయుగ్మపూజ అనగా..? గరికతోనే ఎందుకంటే..?
వినాయక చవితి వ్రతవిధానంలో దూర్వాయుగ్మపూజ విశేషమైనది. గరికతో వినాయకుని ప్రత్యేకంగా పూజించటమే దూర్వాయుగ్మపూజ. ఏకవింశతిపత్ర పూజలో భాగంగా, వినాయకచవితి వ్రతవిధానంలో దూర్వాయుగ్మంతో పూజ తప్పనిసరి. గణనాథుని దశనామాలను స్మరిస్తూ గరికను దేవునికి అర్పించటం ఈపూజలో భాగం.వంద యజ్ఞాలు ఇవ్వలేని ఫలితాన్ని ఒక్క గరికపోచ ఇస్తుంది. గరికలేని వినాయక పూజ వ్యర్థమని సాక్షాత్తు ఆ గణపతే పేర్కొన్నాడు. అందుకే, వినాయక చవితినాడు గరికకు అంతటి ప్రాధాన్యం. గరిక మహిమను తెలిపే కథలు మనకు గణేశ పురాణంలో కనిపిస్తాయి.పూర్వం సులభుడనే ఒక గంధర్వరాజు ఉండేవాడు. ఆయన భార్య సముద్ర. ఒకసారి ఆ దంపతులు పురాణశ్రవణంలో ఉండగా, అక్కడకు మధుసూదనుడనే పేద బ్రాహ్మణుడు వచ్చాడు. అతనిని చూడగానే సులభుడికి పేద, గొప్ప అనే తారతమ్యం గుర్తొచ్చి నవ్వాడు. పేదవాడైన మధుసూదనుడి అహం దెబ్బతినటంతో కోపగించిన అతను, గంధర్వరాజును చూసి ‘రాజా! గర్వాంధుడవైన నీవు పొలం దున్నే ఎద్దుగా జన్మిస్తావు’ అని శపించాడు. అతని శాపాన్ని విని కోపగించిన గంధర్వరాజు భార్య సముద్ర ‘దరిద్రుడా! నువ్వు చెత్తాచెదారం తినే గాడిదగా జన్మించు‘ అని మధుసూదనుడికి ప్రతిశాపం ఇచ్చింది. ఆమె శాపానికి ఆగ్రహోదగ్రుడైన మధుసూదనుడు ఆమెను ‘చండాలురాలివి కమ్ము’ అని శపించాడు.ఆవిధంగా శాపగ్రస్తులైన ఆ ముగ్గురూ, శాపకారణాన శరీరాలను త్యజించారు. చండాలినిగా మారిన సముద్ర దిక్కుతోచక అటు ఇటు తిరుగుతూ గణపతి ఆలయాన్ని చూసింది. ఆరోజు చతుర్థి. గుడిలో గణేశారాధన జరుగుతోంది. బయట కుండపోతగా వర్షంకురుస్తోంది. వానకు తట్టుకోలేని చండాలిని ఇళ్ళవైపుకు పోగా, అక్కడివాళ్ళు ఆమెను తరిమారు. వేరే గత్యంతరంలేని ఆమె గణేశాలయ ప్రాకారం కిందకు వచ్చి, గడ్డీగాదం పోగుచేసి మంటవేసి చలి కాచుకోసాగింది. ఇంతలో శాపానికి గురైన ఎద్దు, గాడిదలు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె పోగుచేసిన గడ్డిని తినసాగాయి. గడ్డి కోసం ఎద్దు, గాడిదలు కుమ్ములాడుకోగా, కొన్ని గడ్డిపరకలు గాలికి కొట్టుకెళ్ళి గుడిలోని వినాయకుని శిరస్సుపై పడ్డాయి. ఇంతలో చండాలిని తన చేతిలోని దుడ్డుకర్రతో వాటిని బాదసాగింది. అవి రెండూ పరుగెత్తుకుంటూ, గుడిలోకి ప్రవేశించి అక్కడున్న ఖాద్య వస్తువులన్నిటినీ తినసాగాయి. అక్కడున్న పూజారులు వాటిని తరమసాగారు. ఈ కలకలం చెవినబడ్డ చండాలిని ఏమిటన్నట్టుగా ఆలయంలోకి ప్రవేశించింది. అప్పుడామె చేతిలోని గడ్డిపోచలు వినాయకుని తలపై పడ్డాయి. అటుగా వచ్చిన భక్తులు ఆమెను అక్కడి నుంచి తరిమి, తలుపులు మూసేశారు. అలా బయటపడిన ఆ మూడు జీవుల పరిస్థితి దుర్భరంగా మారింది. అయితే, తెలియక వారు వినాయకునికి సమర్పించిన గడ్డిపోచలు తన శిరస్సును అలంకరించినందుకు సంతసించిన గణపతి వారిని కరుణించాడు.వెంటనే గణపతి భృత్యులు విమానంలో దిగివచ్చి వారు ముగ్గురినీ ఉత్తమ లోకాలకు తీసుకువెళ్లసాగారు. ఆ వింతదృశ్యం చూసిన ఋషులు చేతులు జోడించి, ఓ దేవతలారా! వీరికి ఎలా శాశ్వత గతులు లభించాయి. ఈ జీవులు పూజలు పునస్కారాలు చేసినవారు కారే! ఇందుకు ఏదైనా సులభోపాయం ఉంటే సెలవివ్వగలరు’ అంటూ వినమ్రంగా ప్రశ్నించారు. వారి ప్రశ్నలను ఆలకించిన గణేశ దూతలు గరిక మహిమను తెలియచేసే ఇంద్ర–నారద సంవాదంలోని ఆసక్తికరమైన కథను ఇలా వివరించారు:పూర్వం స్థావరం అనే పట్టణంలో కౌండిన్యుడు అనే ముని పరమ గణేశ భక్తుడు. ఆయన భార్య ఆశ్రమ. ఆమె ఒకరోజు తన భర్తను, ‘స్వామీ! మీరు గణపతి విగ్రహం శిరస్సు మీద గరిక పెట్టి పూజించటంలో ఆంతర్యమేమిటి?’ అని ప్రశ్నించింది.అందుకు కౌండిన్యుడు ఈవిధంగా చెప్పాడు. పూర్వం ధర్మ అనే నగరంలో జరిగిన ఒక మహోత్సవానికి, సిద్ధులు, చారులు, యక్షులు, నాగులు, మునులు అంతా విచ్చేశారు. అక్కడ తిలోత్తమ నాట్యమాడుతుండగా, ఆమె ధరించిన పైవస్త్రం జారి కిందపడింది. అప్పుడు ఆ సభలో ఉన్న యముడు ఆమెను చూసి మదన తాపానికి గురై ఆమెను కౌగిలించుకునేందుకు ప్రయత్నించాడు. ఆయన అలా ప్రవర్తించటం సభా గౌరవానికి భంగం అని అందరూ భావించటంతో ఆ విషయాన్ని గ్రహించిన యముడు సభ నుంచి బయటకు వచ్చాడు. అలా వచ్చిన యముని రేతస్సు స్ఖలితమై భూమిపై పడింది. ఆ రేతస్సు నుంచి వికృతాకారుడైన రాక్షసుడు ఉద్భవించాడు. ఆ రాక్షసుడి జటలు ఖగోళాన్ని ఆక్రమించినట్లుగా ఉన్నాయి. ఆ రాక్షసుడు పెద్దపెద్ద అరుపులతో అందరినీ భయపెట్టసాగాడు. అప్పుడు దేవతలు, ఋషులు విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి శరణు వేడగా, ఆయన వారిని గణపతి వద్దకు వెళ్లమని సూచించాడు. దాంతో వారందరూ గణపతి వద్దకు వెళ్ళి వివిధ స్తోత్రాలు చేశారు. అప్పుడు పద్మంవంటి నేత్రాలతో కోటిసూర్యుల తేజస్సుతో మల్లెపువ్వుల కంటే తెల్లనైన పలువరుసతో, శంఖంవంటి కంఠంతో, నానాలంకారాలతో దివ్యాంబరాలను ధరించి రత్నసింహాసనంపై కూర్చొని దేవతలకు బాలగణపతిగా దర్శనమిచ్చాడు. దేవతల కోరిక మేరకు బాలగణపతి ఆ అనలాసురుడనే రాక్షసుడిని చంప నిశ్చయిస్తాడు. బాలగణపతిని చూసిన అనలాసురుడు కాలాగ్నిలా మండిపడుతూ ముందుకురాగా, తన యోగమాయా బలంతో అనలాసురుడిని మింగుతాడు. కాని అనలాసురుడు కడుపులోకి వెళితే, తన కడుపులో ఉన్న భువనాలు దగ్ధమవుతాయని తలచిన స్వామి, ఆ రాక్షసుడిని తన కంఠంలోనే నిలుపుకున్నాడు. ఆ తాపాన్ని ఉపశమింప చేయటానికి ఇంద్రుడు చంద్రకళను గణపతికి ప్రసాదించాడు. అప్పటి నుంచి స్వామివారు ఫాలచంద్రుడయ్యాడు. బ్రహ్మదేవుడు సిద్ధి, బుద్ధి అనే మానవకన్యలను సృష్టించి స్వామికి ప్రసాదించాడు. వారిని ఆలింగనం చేసుకోవటం వల్ల స్వామివారి తాపం కొంతమేరకు శాంతించింది. విష్ణువు పద్మాలను ప్రసాదించటంతో స్వామి పద్మహస్తుడు అయ్యాడు. అప్పటికీ అగ్నిని శాంతింప చేయడానికి వరుణదేవుడు నీటితో స్వామిని అభిషేకించాడు. పరమేశ్వరుడు ఆదిశేషుడిని ప్రసాదించాడు. దానితో స్వామివారి ఉదరం బంధింపబడటం వల్ల ఆయనకు వ్యాళబద్ధుడనే పేరు వచ్చింది. అప్పటికీ తాపం శాంతించలేదు. అప్పుడు ఎనభైవేలమంది ఋషులు వచ్చి ఒకొక్కరు, ఇరవై ఒక్క దుర్వాంకురాలు (గరికపోచలు) చొప్పున స్వామికి ప్రసాదించటంతో స్వామివారి తాపం పూర్తిగా ఉపశమించింది. అందుకే గణపతికి గరిక ప్రీతిపాత్రమైనది. అప్పటి నుంచి గణపతి పూజలో గరికకు విశిష్ట స్థానం దక్కింది. – కప్పగంతు వెంకటరమణమూర్తి(చదవండి: పూరి జగన్నాథుడిని గణనాథుడిగా ఆరాధిస్తారని తెలుసా..!) -
వినాయక పూజాపత్రిలో ఆయుర్వేద విశేషాలు..
ప్రకృతిలో ఎన్నో రకాల వృక్ష జాతులు ఉండగా, వాటిలో కొన్నింటిని మాత్రమే వినాయక పూజలో పత్రిగా ఉపయోగించడంలోని ఆంతర్యమేమిటో,ఆయుర్వేద శాస్త్ర రీత్యా ఈ పండుగ ప్రాధాన్యమేమిటో తెలుసు కుందాం.వినాయక చవితి వర్షాకాలంలో వస్తుంది. ఎగువ ప్రాంతాలలో కురిసే వర్షాల వలన నిండిన నదులు, కాలువలలో నీరు దిగువ ప్రాతాలలోని చెరువులు, కుంటలు, దిగుడు బావులలోకి ప్రవహించే మార్గంలో అనేక మలినాలతో కూడిన చెత్తను కూడా మోసుకు వస్తుంది. ఆ నీటిని అలాగే తాగిన ప్రజలు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. అందుకే ముందుచూపు కలిగిన మన మహర్షులు ప్రతి సంప్రదాయంలోనూ ప్రజలకు హితవు కలిగించే కొన్ని ప్రత్యేకమైన ఆచారాలను సూచించారు. వాటిలో భాగంగా వినాయక చవితి పర్వదినం రోజున పూజలో ఉపయోగించడానికి కొన్ని ప్రత్యేకమైన ఔషధ జాతులకు సంబంధించిన మొక్కలు, వృక్షాల ఆకులను పూజాపత్రిగా సూచించారు. ఈ పూజాపత్రిని నిమజ్జన సమయంలో ఆయా చెరువులు, కుంటలలో వెయ్యడం వల్ల వాటిలోని నీరు శుభ్రంగా మారుతుంది. తద్వారా క్రిమివ్యాధులు వ్యాపించకుండా ఉంటాయి. వర్షాకాలంలో సాధారణంగా వచ్చే జ్వరాలు, శ్వాసకోశ, జీర్ణకోశ వ్యాధులు, చర్మవ్యాధులు వంటి సమస్యలకు విరుగుడుగా పనిచేసే ఆకులను మన పూర్వీకులు పూజాపత్రిలో భాగంగా చేశారు. పూజాపత్రి ఔషధ గుణాలను చెప్పుకోవాలంటే, ఉదాహరణకు మాచీపత్రం (దవనం ఆకు) రసాన్ని తీసుకోవడం ద్వారా దగ్గు, ఉబ్బసం నుంచి ఉపశమనం కలుగుతుంది. బృహతీపత్రం (వాకుడు ఆకు) వాపులను తగ్గిస్తుంది. బిల్వపత్రం (మారేడు ఆకు) చర్మ సమస్యలను తగ్గిస్తుంది. దుర్వాయుగ్మం (గరిక) శరీరానికి బలం చేకూరుస్తుంది. ఇలాగే, వినాయక పూజలో ఉపయోగించే ప్రతి పత్రికి విశేష ఔషధ లక్షణాలు ఉన్నాయి. అందుకే, వీటిని మన మహర్షులు, ఆయుర్వేద పండితులు సంప్రదాయంలో భాగంగా చేశారు. – ఆచార్య రాఘవేంద్ర వాస్తు జ్యోతిష సంఖ్యా శాస్త్ర నిపుణులు, ఒంగోలు -
పూరి జగన్నాథుడిని గణనాథుడిగా ఆరాధిస్తారని తెలుసా..!
భారతదేశంలో అత్యం ప్రసిద్ధి గాంచిన పూరీ క్షేత్రంలో జగన్నాథుడిని, బలభద్రుడిని ఏకదంతుడి రూపంలో ముస్తాబు చేసి మరీ పూజలు చేస్తారు. ఈ వేడుకనే ‘హాథీబేష’ (ఏనుగు వేషం) అని పిలుస్తారు. ఇలా ఆషాడ మాసంలో గణపతి రూపంలో ముస్తాబు చేసి మరీ జగన్నాథుడిని పూజిస్తారు. ఈ వేడు జేష్ట పౌర్ణమి రోజున జరగుతుంది. ఇలా పూరీ జగన్నాథుడుని పూజించడానికి కారణం ఉందంటూ.. మంచి ఆసక్తికర గాథ ఒకటి చెబుతుంటారు పండితలు. అదేంటంటే..పూర్వం రోజులలో పూరి రాజు దగ్గరికి గణపతి భక్తుడు అయిన గణపతి బప్ప అనే పండితుడు వచ్చాడు. ఆ సమయంలో పూరిలో జగన్నాథుడిని స్నాన యాత్ర వేడుకకు సిద్ధం చేస్తున్నారు. ఆ వేడుకలో పాల్గొనవల్సిందిగా గణపతి బట్టను రాజు ఆహ్వానిస్తాడు.దానికి ఆయన తాను గణపతిని మాత్రమే పూజిస్తానని, ఆయన తనకు అన్నీ అని చెబుతాడు. అయితే రాజు ఒత్తిడి చేయడంతో అయిష్టపూర్వకంగానే జగన్నాధుడి స్నాన యాత్రకు గణపతి బప్ప రావడం జరగుతుంది. అయితే అక్కడికి వెళ్లేసరికి ఊహకే అందని లీలా వినోదం సృష్టిస్తాడు ఆ దేవాదిదేవుడు జగన్నాథుడు. ఆ పూరీ క్షేతంలోని జగన్నాథుడు, పండితుడి గణపతి బప్ప కంటికి ఏకదంతుడి రూపంలో రూపంలో కనిపిస్తాడు. ఇదేంటి జగన్నాథుడు గణనాథుని రూపంలో కనిపించడం ఏంటని ఆశ్చర్యపోతాడు. ఇది కల మాయా అని గందరగోళానకి లోనవ్వుతాడు. విచిత్రంగా బలభద్రుడు కూడా ఏకందంతుడి రూపంల కనిపించడంతో మరంత విస్తుపోతాడు. అప్పుడు గణపతి బప్పకి తన అజ్ఞానానికి కన్నీరుమున్నీరుగా విలపిస్తాడు. తనకు బుద్ధి చెప్పాలనే ఆ చిలిపి కృష్ణుడు ఇలాంటి మాయ చేశాడని గ్రహిస్తాడు. భగవంతుడు ఏ రూపంలో ఉన్న పరమాత్మ అనేది ఒక్కటే అనే విషయం తెలుసుకుంటాడు. ఆనాటి నుంచే పూరి జనన్నాథుని రథయాత్రకు ముందు అనగా జేష్ట పౌర్ణమి రోజు జరిపే స్నాన యాత్ర సమయంలో ఆలయ పూజరులు జగన్నాథ, బలభద్రుల ముఖాలకు ఏనుగు తొడుగులు ధరింపజేస్తారు.బలరాముడు తెల్ల ఏనుగు రూపంలో, జగన్నాథుడు నల్ల ఏనుగు రూపంలో భక్తులకు కన్నుల పండుగగా దర్శనమిస్తాడు. దీన్ని పూరి దేవాలయా సంప్రదాయంలో హాథిబేష అని పిలుస్థారు. ఇలా పూరీ జగన్నాథుని ఏకదంతుడి రూపంలో ధరిస్తే తమకు మంచి జరగుతుందని భక్తలు ప్రగాఢ నమ్మకం.(చదవండి: సకలకార్యాల సిద్ధికై.. తొలిపూజ మహాగణపతికే!) -
ఆచరించిన వారికి అండాదండా.. సంకటహర చతుర్థీ వ్రతం!
వినాయకుని అనుగ్రహం పొందేందుకు మనం ప్రతియేటా భాద్రపద శుద్ధ చవితినాడు వినాయక చవితి పర్వదినం జరుపు కుంటాం. అయితే తలపెట్టిన ఏ పనీ ముందుకు సాగక, జీవితంలో అన్నింటా విఘ్నాలు ఎదురవుతూ, అశాంతి, శారీరక, మానసిక రుగ్మతలు, రుణబాధలు వంటి కష్టాలు కలుగుతూ ఉన్నప్పుడు, దుష్టగ్రహాల పీడతో నానా బాధలు అనుభవించే వారు ప్రతి మాసంలోనూ సంకటహర చతుర్థినాడు యథాశక్తి విఘ్నేశునికి పూజలు జరిపితే ఈ కష్టాలన్నీ తొలగి సుఖ సంతోషాలతో పాటు కార్యజయం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది.వేదకాలం నుంచి ఆధునిక కాలం వరకు గణపతి ఆరాధన విస్తృతంగా జరగటం తెలిసిందే. వినాయక శబ్దానికి విశిష్టమైన వాడని, నాయకులు లేనివాడని అర్థం. గణపతి గురించి గణేశ పురాణం, స్కాంద పురాణం, ముద్గల పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, శివ పురాణంలో కనిపిస్తుంది. ఋగ్వేదంలో సైతం గణపతి ప్రస్తావన ఉంది. గణపతిని జ్ఞానానికి అధిదేవత అని ఋగ్వేదం కొనియాడింది. గణాల అధిపతిగా గణపతి పేరు సార్థకమయ్యింది. మానవులందరికీ మంచి చేసేవారిని గణపతి అని అంటారు. మానవునిలోని చెడును హరించే వాడికి గణపతి అని, వినాయకుడని పేరు. వినాయకునికి రోగహర శక్తి ఉందని గణేశ పురాణం చెబుతోంది.గణపతితో సమానమైన పేరుగల బ్రాహ్మణస్పతిలేదా బృహస్పతి గురించి ఋగ్వేదంలో ప్రస్తావన కనిపిస్తుంది. తనను ఆరాధించేవారిని గణపతి ఎల్లవేళలా కాపాడుతుంటాడని ఋగ్వేదం వివరించింది. బ్రహ్మచర్యం అవలంబించి, వేద వేదాంగ శాస్త్రాలను అధ్యయనం చెయ్యవలసిన విద్యార్థులకు గణేశుడు ఆశ్రయ దాత, పోషకుడు.సంకట విమోచక గణపతి స్తోత్రం..నారద ఉవాచప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకంభక్తావాస స్మరేన్నిత్యం ఆయుఃకామార్థ సిద్ధయేప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకంతృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకంలంబోదరం పంచమం చ షష్టం వికటమేవచసప్తమం విఘ్నరాజంచ ధూమ్రవర్ణం తథాష్టమం నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకంఏకాదశం గణపతిం ద్వాదశాంతు గజాననంద్వాదశైతాని నామాని యః పఠేత్ శ్రుణుయాన్నిత్యంనచ విఘ్నభయం తస్యసర్వసిద్ధికరం ప్రభోఃవిద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం పుత్రార్థీ లభేత్ పుత్రం మోక్షార్థీ లభేత్ గతింజపేద్గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయఃఅష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చః లిఖిత్వాయత్సమర్పయేత్తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతఃసంకటహర చతుర్థి ఎప్పుడు వస్తుంది?ప్రతిమాసంలోనూ వచ్చే బహుళ చతుర్థి (బహుళ చవితి)ని సంకటహర చతుర్థి లేదా సంకట విమోచక చతుర్థిగా పిలుస్తారు. జాతకంలో కేతు మహర్దశ నడుస్తున్నవారు, కష్టాలను అనుభవించేవారు, తరచు కార్యహానితో చికాకులకు లోనవుతున్నవారు ఈ వ్రతం చేయడం మంచిది. ఆ రోజున పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం గుడికెళ్లి గరికపై ప్రమిదనుంచి దీపారాధన చేసి, గరికపోచలు, పుష్పాలు, పత్రితో గణపతిని పూజించి, లడ్డూలు లేదా ఉండ్రాళ్లు నివేదించి ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. ప్రతి మాసంలోనూ వచ్చే సంకటహర చతుర్థినాడు ఇదేవిధంగా ఆచరించగలిగితే సకల దోషాలూ పోయి, కార్యజయం కలుగుతుంది. ప్రతి బహుళ చతుర్థినాడూ వినాయక చవితిరోజు చేసినట్లే పత్రితోనూ, పుష్పాలతోనూ గణపతికి పూజ చేస్తే అన్నివిధాలుగా అభివృద్ధి చెందుతారు. కష్టాలతోనూ, సమస్యలతోనూ బాధపడేవారు సంకటహర చతుర్థి వ్రతంతోపాటు సంకట విమోచక గణపతి స్తోత్రాన్ని విడవకుండా ఆరుమాసాలపాటు పఠించడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. వ్రతాన్ని ఆచరించలేనివారు కనీసం సంకటహర గణపతి స్తోత్రాన్ని నాలుగుసార్లు పారాయణ చేసినా మంచిదే. ఈ వ్రతాచరణ వల్ల విఘ్నాలు తొలగి, పనులు సజావుగా సాగుతాయి. కేతుగ్రహ బాధలు తొలగుతాయి. -డి.వి.ఆర్. భాస్కర్ -
ఇండోనేషియా నగదు నోటుపై గణపతి చిత్రం
హిందువుల తొలిపూజలు అందుకునే గణపతి చిత్రం ఇతర దేశాల నగదు నోటుపై ముద్రించడం విశేషమే. ఇండోనేషియా దేశంలోని రూ. 20 వేల నోటుపై గణపతి చిత్రం ముద్రించి ఉండటం మనకు ఆసక్తి కలిగించే అంశమే. ఆ దేశం ఒక ఇస్లామిక్ దేశం. ఇప్పటి వివరాల ప్రకారం ఆ దేశంలో 88 శాతంపైగా ముస్లింలు ఉండగా మూడు శాతం మంది మాత్రమే హిందువులు ఉన్నారు. కానీ కొన్ని వేల సంవత్సరాల ముందు ఆ దేశం హిందూ మతానికి చాలా ప్రాముఖ్యమైన ప్రదేశంగా వెలుగొందింది. అక్కడవున్న ఎన్నో పురాతన దేవాలయాలు ఇప్పటికీ దేశ, విదేశీయులకు ప్రముఖ దర్శనీయ స్థలాలుగా వెలుగొందుతున్నాయి.ఒకటవ శతాబ్దం నుంచి ఆ దేశంలో ఎక్కువగా హిందూ మతం ఉన్నదని భావిస్తారు. ఆ దేశానికి చెందిన రూ. 20వేల (రూపియా) కరెన్సీ నోటు మీద జ్ఞానాన్ని ప్రసాదించే విజ్ఞాన గణపతి చిత్రాన్ని చిహ్నంగా ముద్రించబడి ఉంటుంది. అదే నోటు మీద ఆ దేశంలోని పిల్లలందరికీ విద్య అందించడానికి విశేష కృషి చేసిన ఇండోనేషియా జాతీయ విద్యా పితామహుడిగా పిలువబడిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు హజర్ దేవంతర చిత్రం ప్రచురించబడి వుంటుంది. తదనంతర క్రమంలో (1950) ఆయన ఆ దేశ విద్యాశాఖ మంత్రిగాను పనిచేశారు. ఆయన విద్యాభివృద్ధికి చేసిన కృషికి ఫలితంగా ఆయన పుట్టినరోజును జాతీయ విద్యాదినోత్సవంగా జరుపుకుంటున్నారు.ఈ విధంగా ఆ నోటుపై జ్ఞానాన్ని అందించే విద్యాగణపతి, విద్యాభివృద్ధికి కృషి చేసిన ప్రముఖుని చిత్రాలతోపాటు, ఆ నోటు వెనుక తరగతి గదిలో వున్న పిల్లల చిత్రం ముద్రించబడి వుండటం విశేషం.