wild animals
-
ఔరా ఇదేమి చిత్రం.. హైదరాబాద్ రోడ్లపై అబ్బురపరిచేలా జంతువులు (ఫొటోలు)
-
సింహాల ఆవాసంలో 5 రోజులు
అడవి మధ్యలో చిన్న పిల్లాడు.. చుట్టూ గర్జించే సింహాలు.. ఘీంకరించే ఏనుగులు. జంగిల్ బుక్లోని మోగ్లీ గుర్తొస్తున్నాడు కదూ! అది కల్పిత కథ. నిజ జీవితంలో అంతకు మించిన సాహసాన్ని చేశాడు జింబాబ్వేకు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు. ఐదురోజులపాటు క్రూర మృగాల ఆవాసంలో బతికాడు. ఈ ఆధునిక మోగ్లీ పేరు.. టినోటెండా పుదు. పండ్లు తింటూ.. చెలిమల్లో నీళ్లు తాగుతూ.. జింబాబ్వేలోని మాటుసడోనా గేమ్ పార్క్.. టెనోటెండా పుదు ఇంటికి 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎందుకు? ఎలా? వెళ్లాడో తెలియదు. ఒక్కసారి అడవిలోకి వెళ్లాక బయటపడటానికి మార్గం తెలియలేదు. అయితేనేం అధైర్య పడలేదు. బతికేందుకు అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. అడవి పండ్లు తింటూ ఆకలి తీర్చుకున్నాడు. ఎండిపోయిన నదీ తీరాల వెంబడి.. కర్రలతో చిన్న చిన్న చెలిమెలు తవ్వి వచ్చిన నీటితో దాహం తీర్చుకుని ప్రాణాలు నిలుపుకొన్నాడు. రాత్రిపూట రాతి బండలపై నిద్రపోయాడు. మరోవైపు కనిపించకుండా పోయిన బాలుని కోసం ఊరంతా వెదికిన తల్లిదండ్రులు చివరకు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. స్థానిక బృందాలతో కలిసి సెర్చ్ పార్టీ ప్రతిరోజూ డ్రమ్ములు మోగిస్తూ బాలుడిని పట్టుకోవడానికి విఫల ప్రయత్నాలు చేసింది. నాలుగురోజులపాటు వెదికి ఆశలు వదులుకుంది. చివరి అవకాశంగా 5వ రోజు పార్క్ రేంజర్లు వాహనంపై అడవిమొత్తం గాలించడం మొదలుపెట్టారు. వాహనం శబ్దం విన్న బాలుడు అరుస్తూ పరుగెత్తుకుంటూ వచ్చాడు. కానీ అప్పటికే అక్కడినుంచి దూరంగా వచ్చేశారు. చివరకు తడిగా ఉన్న ఓ ప్రాంతంలో చిన్న చిన్న తాజా పాదముద్రలు కనిపించడంతో బాలుడు ఇక్కడే ఉంటాడని భావించారు. వాహనాన్ని వెనక్కి తిప్పి వెళ్లారు. ఎట్టకేలకు పుదుని కనిపెట్టగలిగారు. ప్రశంసల వర్షం.. జింబాబ్వే పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ మేనేజ్ మెంట్ అథారిటీ ప్రకారం ఆఫ్రికాలో అత్యధిక సింహాలున్న పార్క్ అదే. ప్రస్తుతం అక్కడ 40 సింహాలున్నాయి. 1,470 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఉద్యానవనం సింహాలతోపాటు జీబ్రాలు, ఏనుగులు, హిప్పోలు, జింకలకు నిలయంగా ఉంది. అలాంటి పార్క్ నుంచి ప్రాణాలతో బయటపడటం అసాధ్యం. కానీ ఎంతో ధైర్యంతో ప్రాణాలతో బయటపడ్డ బాలుని స్టోరీని.. స్థానిక ఎంపీ ముట్సా మురోంబెడ్జి ఎక్స్లో పంచుకున్నారు. పుదు ధైర్యసాహసాలపై సోషల్ మీడియాలో ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వన్యప్రాణులకు స్మగ్లింగ్ ముప్పు
వన్యప్రాణుల అక్రమ రవాణా మన దేశంలో అంతకంతకూ పెరిగిపోతోంది. ఈశాన్య రాష్ట్రాల్లోని సరిహద్దులు, ఎయిర్పోర్టుల ద్వారా వన్యప్రాణుల అక్రమ రవాణా జరుగుతున్నట్టు గుర్తించారు. దీనికి చెన్నై, ముంబై ఎయిర్పోర్టులు కీలక హబ్లుగా మారాయని వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో చెబుతోంది. ఈ ఏడాదిలో అక్రమ రవాణాకు సంబంధించి 40కిపైగా కేసులు నమోదయ్యాయి. వన్యప్రాణుల దంతాలు, విడిభాగాలు, చర్మానికి అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉండటంతో అక్రమ రవాణా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా జరుగుతోంది. ప్రధానంగా రైనో (ఖడ్గమృగం) కొమ్ము, పులి శరీర భాగాలు సంప్రదాయ ఔషధాల తయారీకి వినియోగిస్తారు. వాటి మాంసాన్ని కొన్నిచోట్ల తింటారు కూడా. అతిపెద్ద వ్యవస్థీకృత నేరాల్లో నాలుగోదిఅడవి జంతువుల అక్రమ రవాణా వల్ల ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం దెబ్బతినడంతోపాటు జీవవైవిధ్యం సమతుల్యత లోపిస్తోంది. ఆరి్థక వ్యవస్థలపైనా దీని ప్రభావం పడుతోంది. అక్రమ రవాణా అనేక దేశాలలో విస్తరించింది. రక్షిత వన్యప్రాణులను వేటాడటం, స్మగ్లింగ్ చేయడం, చట్టవిరుద్ధంగా సేకరించడం, పట్టుకోవడం వంటివి నిరాటంకంగా జరుగుతోంది. డ్రగ్స్, మానవ అక్రమ రవాణా, నకిలీల తర్వాత నాలుగో అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరంగా వన్యప్రాణుల అక్రమ రవాణా కొనసాగుతున్నట్టు గుర్తించారు. ఈ అక్రమ రవాణా విలువ సంవత్సరానికి రూ.1,500 కోట్లు ఉంటుందని వైల్డ్ లైఫ్ నిపుణులు చెబుతున్నారు. వన్యప్రాణుల అక్రమ రవాణా జరుగుతున్న టాప్–20 దేశాల్లో మన దేశం ఒకటి. విమానాల ద్వారా అక్రమ రవాణా జరుగుతున్న టాప్–10 దేశాల్లో మన దేశం కూడా ఉండటం గమనార్హం. ఏనుగుదంతాలదే మొదటి స్థానంస్మగ్లింగ్ ఇన్ ఇండియా నివేదిక ప్రకారం భారతదేశం నుంచి అత్యధికంగా అక్రమ రవాణా అవుతున్నవి ఏనుగు దంతాలు. ఆ తర్వాత తాబేళ్లు. వీటిలో నక్షత్ర తాబేళ్ల స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతోంది. ఖడ్గమృగం కొమ్ముల వ్యాపారం కూడా పెరిగింది. ఇటీవల కాలంలో పాంగోలిన్ వేట, అక్రమ రవాణాకు మన దేశం ప్రధాన కేంద్రంగా మారింది. పులుల శరీర భాగాల వ్యాపారం కూడా యథేచ్ఛగా కొనసాగుతోంది. స్నేక్హెడ్ ఫిష్, జీబ్రా లోచ్ వంటి అలంకార చేపలను లైవ్ అక్వేరియంలో ఉంచడం కోసం అక్రమ రవాణా చేస్తుండడంతో వాటి సహజ ఆవాసాలు అంతరించిపోతున్నాయి. వీటితోపాటు నక్కలు, ఎలుగుబంట్లు, చిరుతలు, ముంగిసలు, కప్పలను అక్రమంగా రవాణా చేసి వాటి శరీర భాగాలను ఔషధాల తయారీలో వినియోగిస్తున్నారు.రవాణా జరిగే రూట్లుమనదేశంలోనూ, మన దేశం నుంచి ఇతర దేశాల్లోకి వన్యప్రాణుల అక్రమ రవాణా ప్రధానంగా రెండు మార్గాల ద్వారా జరుగుతున్నట్టు గుర్తించారు. ఈశాన్య ప్రాంతంలోని పొడవైన అంతర్జాతీయ సరిహద్దు ద్వారా ఎక్కువ రవాణా జరుగుతుండగా, విమానాశ్రయాల ద్వారా రెండో మార్గంలో జరుగుతోంది. దిమాపూర్, గౌహతి, ఇంఫాల్ వంటి ఈశాన్య నగరాల నుంచి నేపాల్, మయన్మార్, చైనా సరిహద్దుల్లో ఖడ్గమృగాల కొమ్ములు, పులి భాగాలు, పాంగోలిన్ పొలుసుల అక్రమ రవాణా విపరీతంగా జరుగుతున్నట్టు గుర్తించారు. ఇండియా–బంగ్లాదేశ్ సరిహద్దులో పక్షులు, సరీసృపాల అక్రమ రవాణా కూడా చాలా ఎక్కువగా ఉంది. నక్షత్ర తాబేళ్లు ప్రపంచంలోనే అత్యధికంగా రవాణా అవుతున్న వన్యప్రాణులు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల నుంచి వీటిని థాయ్లాండ్, సింగపూర్, మలేషియాకు విమానాల ద్వారా సరఫరా చేస్తున్నారు.విమానాల్లో తీసుకెళ్లే లగేజీల రూపంలో 50 శాతానికిపైగా రవాణా ఎక్కువగా జరుగుతోంది. మరో 15 శాతం రవాణా ఎయిర్ కార్గో ద్వారా జరుగుతోంది. చెన్నై, కోల్కతా, ముంబై, ఢిల్లీ ఎయిర్పోర్టుల్లో తరచూ ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి. ఇవీ కారణాలు ప్రపంచంలో 8 శాతం వన్యప్రాణులు మన దేశంలో ఉండగా.. అధిక జనాభా వల్ల వన్యప్రాణుల ఉత్పత్తులు మన మార్కెట్లలోకి సులభంగా ప్రవేశిస్తున్నాయి. ఒకసారి మార్కెట్లలోకి వచి్చన తర్వాత వాటిని గుర్తించడం అసాధ్యంగా మారుతోంది. చైనా, మయన్మార్, పలు ఆగ్నేయాసియా దేశాలతో సరిహద్దులు ఉండడం, పెరుగుతున్న విమానయాన మార్కెట్, వేగంగా విస్తరిస్తున్న విమానాశ్రయాలు, సోషల్ మీడియాను కూడా ఆన్లైన్ మార్కెట్లుగా ఉపయోగిస్తుండడంతో అక్రమ రవాణా పెరిగిపోతోంది.– సాక్షి, అమరావతి -
‘బాహుబలి’ ఏనుగులకు పెద్ద కష్టం.... భూమాతకు తీరని శోకం!
భూమండలంపై అత్యంత భారీకాయంతో సంచరించే శాకాహార బాహుబలిగా ఏనుగు మనందరికీ చిరపరిచితం. ఆఫ్రికా ఖండంలోని పీఠభూముల్లో సర్వసాధారణంగా కనిపించే ‘సవన్నా’, ‘అటవీ’జాతి ఏనుగులు అత్యంత వేగంగా అంతర్థానమవుతున్నాయి. అటవీప్రాంతాల్లో విచ్చలవిడిగా పెరిగిన మానవ కార్యకలాపాలు, విస్తరిస్తున్న వ్యవసాయం, విజృంభిస్తున్న అక్రమ వేటతో ఏనుగుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. తాజాగా జరిపిన అధ్యయనం ప్రకారం గత యాభై సంవత్సరాల్లో.. సర్వేచేసిన ప్రాంతాల్లో సవన్నా జాతి ఏనుగుల సంఖ్య 70 శాతం తగ్గిపోయింది. ‘ఫారెస్ట్’జాతి ఏనుగుల సంఖ్య ఏకంగా 90 శాతం క్షీణించడం ఏనుగుల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఏనుగుల సంఖ్య పెరగడం ఒకింత ఉపశమనం కల్పిస్తోంది.అత్యంత తెలివి అత్యంత తెలివితేటలతోపాటు మానవునిలా సామూహికంగా జీవించే నైపుణ్యమున్న వన్యప్రాణిగా ఏనుగు పేరొందింది. 1964 నుంచి 2016 సంవత్సరం దాకా ఆఫ్రికా ఖండంలోని 37 దేశాల్లోని 475 భిన్న ప్రదేశాల్లో ఏనుగుల జాడపై విస్తృతస్థాయి గణన, పరిశోధన చేశారు. ఇటీవలి దశాబ్దాల్లో ఇంతటి విస్తృత సర్వే చేపట్టడం ఇదే తొలిసారి. సంబంధిత నివేదిక సోమవారం వెల్లడైంది. దీనిలో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగుచూశాయి. సవన్నా, ఫారెస్ట్ జాతి ఏనుగుల సంఖ్య సగటున ఏకంగా 77 శాతం తగ్గిపోయింది. విడిగా చూస్తే సవన్నా జాతి 70 శాతం, ఫారెస్ట్ జాతి సంఖ్య 90 శాతం తగ్గిపోయింది. ఒకప్పుడు గుంపులగుంపులుగా కనిపించిన కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు అవి ఒక్కటికూడా లేవని సర్వేలో తేలింది. అయితే కొన్ని చోట్ల స్థానిక ప్రభుత్వాల పరిరక్షణ చర్యలతో వాటి సంఖ్య పెరిగిందని నివేదిక పేర్కొంది. ‘‘తగ్గిపోయిన సంఖ్యను ఎలాగూ పెంచలేము. ఉన్న ఏనుగుల సంఖ్యా వేగంగా క్షీణిస్తోంది. మాలి, చాద్, నైజీరియా వంటి దేశాల్లో మరీ దారుణంగా పడిపోయింది’’ అని కొలరాడో స్టేట్ వర్సిటీలో వైల్డ్లైఫ్ కన్జర్వేషన్ విభాగ ప్రొఫెసర్ జార్జ్ విటెమర్ చెప్పారు.కొన్ని చోట్ల మెరుగైన పరిస్థితులు ఆఫ్రికా ఖండం దక్షిణ దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో ఎంతో శ్రమకోర్చి ఏనుగుల సంతతిని కాపాడుతున్నారు. ప్రభుత్వాల చొరవ, స్థానికుల అండతో ఏనుగుల సంఖ్య అక్కడ పెరిగింది. బొట్సావా, జింబాబ్వే, నమీబియాలో ఇప్పటికే వాటి సంఖ్య భారీగానే ఉంది. ‘‘కొన్ని చోట్ల మనం విజయం సాధించాం. ఈ విషయంలో మనకు మనం శెభాష్ చెప్పకోవాల్సిందే. అయితే ఇంకా ఏఏ ప్రాంతాల్లో విజయావకాశాలు ఉన్నాయో కనిపెట్టి కార్యసాధకులం కావాల్సిన తరుణమొచ్చింది’’అని ప్రొఫెసర్ జార్జ్ విటెమర్ అన్నారు.ఏనుగు దంతాలపై మోజుతో.. చాలా పొడవుండే ఆఫ్రికన్ ఏనుగుల దంతాలకు అంతర్జాతీయ మార్కెట్లో చాలా విలువ ఉంది. వీటి కోసమే వేటగాళ్లు ఏనుగులను చంపేస్తున్నారు. వేటగాళ్లను అడ్డుకోగలిగితే ఈ వన్యప్రాణులను కాపాడవచ్చని జంతుప్రేమికులు చెబుతున్నారు. అడవుల్లో పెరుగుతున్న వ్యవసాయం కారణంగా ఏనుగులు తమ ఆవాసాలను, ఆహార వనరులను కోల్పోతున్నాయి. చదవండి: అడవిలో అమ్మప్రేమ.. జంతువులు, పక్షుల్లో అరుదైన మమకారం!‘‘అడవుల విస్తరణకు ఏనుగులు మూలాధారం. ఎన్నో రకాల చెట్ల కాయలు, పండ్లను తింటూ వాటి గింజలను జీర్ణంచేయకుండా వేర్వేరు చోట్ల విసర్జించి కొత్త మొక్కల అంకురార్పణకు ఆజ్యం పోస్తాయి. నిత్యం వనవృద్ధి కార్యం చేసే ఏనుగుల సంఖ్య తగ్గడం భూమాతకు తీరని శోకం’’ అని సౌత్ ఆఫ్రికాలోని నెల్సన్ మండేలా యూనివర్సిటీలోని ఆఫ్రికన్ కన్జర్వేషన్ ఎకాలజీ అధ్యయనకారుడు, నివేదిక సహరచయిత డేవ్ బల్ఫోర్ ఆందోళన వ్యక్తంచేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అదుపులోకి కర్ణాటకకు చెందిన ముగ్గురు స్మగ్లర్లు
-
జంతువుల గురించి మీకు తెలియని పది అద్భుతమైన విషయాలు
-
అడవిలో ఉండాల్సినవి.. ఇంట్లో పెంచుకుంటున్నారు
-
అంతరిస్తున్న తోడేళ్లు! ఉమ్మడి అనంతపురంలో భారీగా తగ్గిన వన్యప్రాణులు
సాక్షి ప్రతినిధి అనంతపురం: క్రూర జంతువుగా పేరున్న తోడేళ్లు పొదలు, గుట్టలను ఆవాసాలుగా చేసుకుని జీవిస్తాయి. ఒకప్పుడు అటవీ ప్రాంతంలో ఎక్కడ చూసినా కనిపించేవి. గొర్రెలు, మేకల మంద సంచరించే ప్రాంతాల్లో తిరిగేవి. ముఖ్యంగా జీవాలు ఎక్కువగా ఉండే అనంతపురం జిల్లాలో భారీగా ఉండేవి. కానీ ప్రస్తుతం వాటి జాడ మచ్చుకైనా కనిపించడం లేదు. తాజాగా అటవీశాఖ అధికారులు వీటిని అంతరించిపోతున్న జంతువుల జాబితాలో చేర్చారు. రెండేళ్లుగా ఎక్కడా కనిపించడం లేదని వెల్లడిస్తున్నారు. వేటలో పటిష్టమైన వ్యూహం తోడేళ్లు గుంపులుగా సంచరిస్తాయి. వేటలో పటిష్టమైన వ్యూహాన్ని అమలు చేస్తాయి. ఒకటి ముందుగా డెకాయ్ ఆపరేషన్ చేస్తుంది. ఆ తర్వాత మిగతా వన్నీ వస్తాయి. మేక లేదా గొర్రెను తీసుకెళ్లేటప్పుడు గొంతును నోట కరచుకుని, తన ముళ్లతోకతో వెనుక కొడుతూ ఉంటుంది. దీంతో ఆ జీవం దానితో పాటు పరిగెడుతుంది. దీని వల్ల ఈడ్చుకెళ్లే శ్రమ వాటికి తగ్గుతుంది. ఒక తోడేలు ఉందంటే రెండు మూడు నక్కలు కూడా దాని సమీపంలోకి పోలేవు. రెండు లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతం ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో 30కి మించి తోడేళ్లు ఉండేవని అంచనా. కాగా, ఒకప్పుడు ప్రతి జిల్లాలోనూ గుంటనక్కలు కనిపించేవి. ఇప్పుడు వాటి జాడ కూడా లేదు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో నాలుగేళ్లుగా మచ్చుకు కూడా కనిపించడం లేదు. ఈ క్రమంలోనే పునుగుపిల్లి కూడా కనుమరుగైనట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. అటవీ విస్తీర్ణం తగ్గడం వల్లే.. జనావాసాలు పెరిగాయి. అడవులు వ్యవసాయ భూములుగా మారాయి. దీంతో వన్యప్రాణుల ఆవాసానికి ఇబ్బందిగా మారింది. కొండలు ఎక్కువగా ఉన్న అనంతపురం లాంటి జిల్లాలే తోడేళ్లకు మంచి ఆవాసాలు. ఇక్కడే వీటి జాడ లేదంటే మిగతా చోట్ల అసలే కనిపించవు. వీటిని కాపాడుకునేందుకు సర్వశక్తులా యతి్నస్తున్నాం. –సందీప్ కృపాకర్, జిల్లా ఫారెస్టు అధికారి, అనంతపురం చదవండి: కొరమీను, ఇంగిలాయి, జల్ల, బొమ్మిడాయి, గొరక, వాలుగ.. ఇక్కడ పుట్టినవే! -
అతిథులతో అంతా ఓకేనా?
దక్షిణాఫ్రికాలోని నమీబియా నుంచి మన దేశానికి వచ్చిన 8 ఆఫ్రికన్ చీతాలు ఇక్కడ అంతరించిన వన్యప్రాణి జాతిని పునరుద్ధరించడానికి పనికొస్తాయా? భారత ప్రధాని మోదీ తన జన్మదినం సందర్భంగా శనివారం మధ్యప్రదేశ్లోని కూనో జాతీయోద్యానంలోకి వదిలిపెట్టిన ఈ ‘అతిథుల’ గురించి అంతటా ఆసక్తిగా సాగుతున్న చర్చ ఇది. భారత భూభాగంపై ఆసియా ప్రాంత చీతాలు అంతరించిన 70 ఏళ్ళ పైచిలుకు తర్వాత జరుగుతున్న ఈ సాహసోపేత ప్రయోగంపై సహజంగానే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఖండాంతర చీతాల దిగుమతిని పలువురు సానుకూల ప్రయత్నంగా భావిస్తుంటే, కొందరు దీనిలోని ప్రతికూల అంశాలు, ప్రభావాలను ప్రస్తావిస్తున్నారు. గత శతాబ్దపు మొదట్లో ప్రపంచవ్యాప్తంగా లక్ష చీతాలుంటే, 2016లో చివరిసారిగా లెక్కలు వేసినప్పుడు 7100 వన్యప్రాణులే మిగిలాయి. వాటిలోనూ అధిక భాగం ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో, అతి కొద్దిగా వందలోపు చీతాలు ఇరాన్లో ఉన్నాయి. ఒకప్పుడు మన దేశంలో తమిళనాడులోని తిరునల్వేలి నుంచి సువిశాల ఉత్తరాది పచ్చిక మైదానాల దాకా చీతాలు వేలల్లో ఉండేవట. మహా రాజుల మృగయా వినోదం, జనాభా విస్ఫోటనంతో తగ్గిన పచ్చిక బయళ్ళ లాంటి కారణాలతో అవి కనుమరుగయ్యాయి. అంతరించిన వన్యప్రాణి జాతిగా 1952లో భారత అధికారిక ప్రకటన నుంచి మన దేశంలో వీటి కథ ఓ గత చరిత్ర. ఒకానొక కాలంలో 6 నుంచి 18 రూపాయలకు వేటాడిన చీతాలను మళ్ళీ పెంచి పోషించి, శతాబ్దాల విధ్వంసాన్ని చక్కదిద్దే యత్నమే ‘ప్రాజెక్ట్ చీతా’. ఈ ప్రయోగానికి తగ్గ అటవీ ప్రాంతం కోసం ఏళ్ళ తరబడి అన్వేషించి, చివరకు కూనోను ఎంపిక చేశారు. వాయవ్య మధ్యప్రదేశ్లోని కూనో జాతీయోద్యానం ఒకప్పుడు సమీప గ్వాలియర్ సింధియా మహారాజులకు ఇష్టమైన వేటస్థలం. ప్రపంచంలో ప్రస్తుతం అత్యధికంగా చీతాలున్న నమీబియా నుంచి తెచ్చినవాటిని సెప్టెంబర్ 17న ప్రాథమికంగా ప్రధాని కూనోలోనే విడుదల చేశారు. నెల రోజుల ఏకాంతం తర్వాత 750 చదరపు కి.మీ.ల కూనో సవన్నా అటవీ భూముల్లోకి స్వేచ్ఛగా వదిలేస్తారు. అయితే, ఒకప్పుడు మన దేశంలో సంచరించిన ఏషియాటిక్ రకం చీతాలకు భిన్నమైనవి ఈ ఆఫ్రికన్ చీతాలు. వీటిని ఇలా తమ సహజ ఆవాసాల నుంచి భారత్కు తరలించడం సరైనది కాదని కొందరు నిపుణుల భావన. అయిదేళ్ళకు రూ. 39 కోట్ల ఖర్చుతో కూడిన ఈ చీతాల తరలింపు, నూతన ఆవాస ప్రక్రియ ఆకర్షణీయమే తప్ప, ఆశించిన ఫలితాలివ్వదన్నది వారి వాదన. గంటకు 120 కి.మీ.ల వేగంతో, భూతలంపై అత్యంత వేగవంతమైన ప్రాణి అయిన చీతా స్వేచ్ఛగా సంచరించాలంటే సువిశాల ప్రాంతం కావాలి. అలా ఆఫ్రికన్ చీతాలకు తగిన ఆవాసం కానీ, అవి ఆహారంగా తినే రకం ప్రాణులు కానీ భారత్లో లేవు. గడ్డిభూములు పెంచాలనే లక్ష్యమూ దీనితో సాధ్యం కాదనేది విమర్శకుల అభిప్రాయం. మరికొందరు మాత్రం ఎక్కడ ఉంటే అక్కడ అలవాటు పడే స్వభావం చీతాలది గనక అతి నిరాశ అవసరం లేదంటున్నారు. నిజానికి, ఇండియన్ టైగర్లు, సింహాల పరిరక్షణ కోసం స్వాతంత్య్రానంతరం భారత్లో చేసిన రెండు ప్రధాన వన్యప్రాణి సంరక్షణ పథకాలూ విజయవంతమయ్యాయి. అయితే, అప్పటికే మన దగ్గరున్న పులులు, సింహాల సంతతిని పెంచడంతో అది సాధ్యమైంది. కానీ, ఈసారి ప్రపంచంలో మునుపెన్నడూ లేని విధంగా ఖండాంతర వన్యప్రాణి దిగుమతి చేపట్టాం. అందుకే, ప్రపంచవ్యాప్త జీవ్యావరణవేత్తలు, జంతు ప్రేమికులు ఈ ప్రయోగాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. వన్యప్రాణి పరిరక్షణ సాగాలంటే, వాటి సంఖ్య కన్నా ముందు పెరగాల్సింది అటవీ ప్రాంతం. దేశంలో ప్రస్తుత జాతీయోద్యానాలు, వన్యప్రాణి కేంద్రాలు ఏ మేరకు జీవకోటి పరిరక్షణకు సరిపోతు న్నాయో తెలుసుకొనే అధ్యయనాలు ఈమధ్యే మొదలయ్యాయి. హైవేల నిర్మాణం సహా అనేకం వన్యప్రాణి ఆవాసాల పరిధిని కుదించేస్తున్నాయి. తగినంత ఆహారం దొరకక దగ్గరలో ఉన్న జనావాసాలపై అటవీ మృగాల దాడులు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. వన్యప్రాణుల కోసమంటూ ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ చేయిస్తున్న ప్రభువులు, వారి పరివారం తీరా తమ హెలిప్యాడ్, గుడారాల కోసం కూనో ఉద్యానంలో పెద్ద సంఖ్యలో చెట్లు కొట్టేశారు. ప్రకృతిపై ప్రేమతోనే చీతాలు తెచ్చామన్న పాలకుల మాటలకూ, ఈ చేతలకూ పొంతన లేదు. మనుషులకూ, వన్యప్రాణులకూ మధ్య ఘర్షణకు దారి తీస్తున్న ఈ జీవ్యావరణ అసమతౌల్యంపై తక్షణం దృష్టి పెట్టాలి. దేశంలోని గడ్డిభూముల్లో 2005 –15 మధ్య దశాబ్దిలోనే 31 శాతాన్నీ, ఇప్పటికి మొత్తం 95 శాతాన్నీ నాశనం చేసుకున్న భారత్లో చీతాలు ఎక్కడ స్వేచ్ఛగా తిరుగుతాయి? విదేశీ చీతాలను తెచ్చుకొని సాకే కన్నా ఇక్కడ అంతరిస్తున్న అడవి పిల్లి జాతులనూ, బట్టమేక పక్షులనూ పరిరక్షించడం మేలు. అసలైతే గుజరాత్ గిర్ అడవి సింహాల తరలింపునకు కూనో జాతీయోద్యానం సరైనది. లెక్కకు మించి సింహాలున్నా వాటిని తరలించడానికీ, సదరు ఆసియా సింహాలున్న ఏకైక ప్రాంతమనే కీర్తి కిరీటాన్ని పోగొట్టుకోవడానికీ గుజరాత్ నిరాకరిస్తోంది. ఆ సింహాల తరలింపునకు అడ్డుకట్టగానే ఇక్కడ చీతాలు పెట్టారనే ఆరోపణలూ లేకపోలేదు. ఇలాంటి అశాస్త్రీయ ధోరణులే వన్యప్రాణి సంరక్షణకు కీడు. ప్రాణులన్నిటినీ ఒకే ప్రాంతానికి పరిమితం చేస్తే, ఏదైనా మహమ్మారి తలెత్తితే మొదటికే మోసం వస్తుందని నిపుణుల హెచ్చరిక. నిపుణుల సూచనలు ప్రభుత్వం పట్టించుకోకుంటే ఏ ‘ప్రాజెక్ట్ చీతా’ వల్ల ఏం ప్రయోజనం? -
గోల్ఫ్ కోర్సులో క్రూర మృగాల వేట.. ఆటకు బ్రేక్
ఓ భారీ జిరాఫీని అప్పుడే వేటాడిన నాలుగు యువ సింహాలు, రెండు శివంగులు.. ఆ ‘ఆహారాన్ని’ సొంతం చేసుకొనేందుకు కదన రంగంలోకి దిగి వాటిని తరుముతున్న 20 హైనాలు. తమ వేటను తిరిగి చేజిక్కించుకొనేందుకు ఎదురుదాడికి ప్రయత్నిస్తున్న ఆడ సింహాలు.. ఆ ఇందులో పెద్ద వింత ఏముంది.. ఆఫ్రికా అడవుల్లో ఇలాంటి దృశ్యాలన్నీ సర్వసాధారణమేగా అనుకుంటున్నారా? కానీ ఇదంతా జరిగింది అడవిలో కాదు.. అడవి మధ్య ఉన్న ఓ గోల్ఫ్ కోర్స్లో! దక్షిణాఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్క్ నడిమధ్యన ఉన్న స్కుకుజా గోల్ఫ్ క్లబ్లో తాజాగా కొందరు ఆటగాళ్లు గోల్ఫ్ ఆడుతుండగా వారి ఆటకు ఈ క్రూర మృగాలు ఇలా బ్రేక్ వేశాయి! ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్గా మారింది. అడవికి, గోల్ఫ్కోర్స్కు మధ్య ఎటువంటి రక్షణ కంచె లేకపోవడంతో జంతువులు తరచూ ఇలా లోపలకు దూసుకొస్తాయట. గోల్ఫ్కోర్స్లో ఏర్పాటు చేసిన కృత్రిమ నీటి గుంటల్లో దప్పిక తీర్చుకొనేందుకు జిరాఫీలతోపాటు చిరుత పులులు, ఖడ్గ మృగాలు, ఏనుగులు, అడవి దున్నలు తరచూ అక్కడకు వస్తుంటాయట!! అందుకే ఇక్కడ గోల్ఫ్ ఆడాలనుకొనే ఆటగాళ్లకు ఎంతో గుండెధైర్యం కావాలట! అదొక్కటే కాదు.. అడవి జంతువులేవైనా దాడి చేసి చంపేస్తే క్లబ్ నిర్వాహకుల బాధ్యతేమీ లేదంటూ అగ్రిమెంట్పై సంతకం చేసిన వారినే ఇందులోకి అనుమతిస్తారట!! క్రూగర్ నేషనల్ పార్క్ సిబ్బంది కోసం 1972లో ఈ గోల్ఫ్కోర్స్ను తొలుత ఏర్పాటు చేయగా ఆ తర్వాత క్రమంగా స్థానికులతోపాటు పర్యాటకులకు కూడా ఇందులో ఆడేందుకు అవకాశం కల్పించారు. అందుకే దీన్ని ప్రపంచంలోకెల్లా అత్యంత కఠినమైన, క్రూరమైన గోల్ఫ్కోర్స్గా పిలుస్తున్నారు. చదవండి: రణరంగంలా మారిన బాగ్ధాద్.. కాల్పుల్లో 15మంది మృతి -
వన్యప్రాణులకు ఆయుష్షు పోసే కృత్రిమ మేధస్సు!
జన్నారం(ఖానాపూర్): వన్యప్రాణుల సంరక్షణ, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగేసింది. టీ అటల్ ఇన్నొవేషన్ మిషన్ (ఎయిమ్) ఆధ్వర్యంలో కార్యాచరణకు పూనుకుంటోంది. వన్యప్రాణుల అభివృద్ధి, కదలికలు, సంతతి అంశాల క్రోడీకరణకు సాంకేతికత రూపొందించడం, కృత్రిమ మేధస్సు(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ద్వారా వివరాలు సేకరించడానికి రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద మంచిర్యాల జిల్లా కవ్వాల్ టైగర్ జోన్లోని జన్నారం అటవీ డివిజన్ను ఎంపిక చేసింది. 59 కంపెనీల దరఖాస్తులు కృత్రిమ మేధస్సుతో వన్యప్రాణులపై అధ్యయనం చేసే ప్రాజెక్టును చేపట్టడానికి దేశవ్యాప్తంగా టీ ఎయిమ్స్కు 59 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. ఈ నెల 8న ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, అటవీశాఖ పీసీసీఎప్ డోబ్రియాల్, క్యాప్ జెమిని ఇండియా వైస్ ప్రెసిడెంట్ అనురాగ్ ప్రతాప్ సమక్షంలో నిర్వహించిన సదస్సులో థింక్ ఎవాల్వ్ కన్సల్టెన్సీ కంపెనీ విజేతగా నిలిచి ప్రాజెక్టును దక్కించుకుంది. ఈ కంపెనీ చేపట్టబోయే ప్రాజెక్టుకు క్యాప్ జెమిని కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద(సీఎస్ఆర్) ప్రోత్సాహకంగా రూ.20 లక్షలు అందజేసింది. అధ్యయనం చేసే అంశాలు థింక్ ఎవాల్వ్ కన్సల్టెన్సీ కంపెనీ కృత్రిమ మేధస్సు ద్వారా వన్యప్రాణుల కదలికలు, వాటి ఆహార అలవాట్లు, సంతతి, వాటి సంఖ్య, అవి ఏ ప్రదేశంలో సంచరిస్తాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి, వన్యప్రాణుల సంఖ్య పెరగడానికి, తగ్గడానికి కారణాలను విశ్లేషిస్తుంది. తాను రూపొందించిన సాంకేతికతను వినియోగించి అటవీ శాఖ అధికారుల సహకారంతో అధ్యయనం చేస్తుంది. ఇదీ చదవండి: డాక్టర్ లాస్యసింధుకు జాతీయ హెల్త్కేర్ అవార్డు -
జనావాస పరిసరాల్లోకి గొరగేదెలు.. భయపడుతున్న జనం
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో గొరగేదెలు జనావాస ప్రాంతాల్లోకి వచ్చేస్తుండటంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. పైడిపనుకుల, మంప, సూరేంద్రపాలెం పరిసర ప్రాంతాల్లో ఇవి సంచరిస్తున్నట్టుగా వారు చెబుతున్నారు. వేసవి తీవ్రత, అటవీప్రాంతంలో తాగునీరు అందుబాటులో లేకపోవడమే అవి బయటకు రావడానికి కారణంగా చెబుతున్నారు. కొయ్యూరు: అటవీ ప్రాంతంలో ఉండాల్సిన గొరగేదెలు (బైసన్స్) గ్రామాల సమీపంలోకి వచ్చేస్తున్నాయి. దీంతో వాటిని చూసిన గిరిజనులు భయపడుతున్నారు. వేసవి కావడంతో దాహం తీర్చుకునేందుకు, చల్లదనం కోసం కాలువల వెంబడి ఉంటున్నాయి. గత ఐదేళ్లక్రితం వరకు ఒడిశాకు చెందిన వేటగాళ్లు వీటిని వేటాడేందుకు వచ్చేవారు. నెల రోజుల పాటు కాలువల వెంబడి కాసి నాటు తుపాకులతో వాటిని వేటాడి చంపేవారు.ఆ మాంసాన్ని ఎండిబెట్టి గ్రామాలకు తరలించేవారు. 2016 ఫిబ్రవరిలో ఎం.భీమవరం పంచాయతీ పుట్టకోట సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో నాటు తుపాకులు కలిగి ఉన్న ఇద్దరు ఒడిశా గిరిజనులను మావోయిస్టులుగా అనుమానించి అప్పటిలో పోలీసులు కాల్చి చంపారు. అప్పటి నుంచి ఒడిశా వేటగాళ్లు రావడం తగ్గించేశారు. ఈ ప్రాంతంలో గతంలో రెండు పులులు ఉన్నట్టు అటవీశాఖ నిర్ధారించింది. తరువాత జరిగిన జంతు గణనలో వాటి జాడ తెలియలేదు. దీంతో గొరగేదెల సంఖ్య పెరిగి ఉంటుందని భావిస్తున్నారు. గొరగేదెలు ఎక్కువగా గూడెం,చింతపల్లి, కొయ్యూరు సరిహద్దు గ్రామాల్లో తిరుగుతుంటాయి. మర్రిపాకల రేంజ్లో ఫారెస్టు చాలా దట్టంగా ఉంటుంది. దీంతో ఈ ప్రాంతంలో వీటి మంద ఎక్కువగా ఉంటాయి. వర్షాకాలం, శీతాకాలంలో మేత, నీరు అందుబాటులో ఉంటుంది. అందువల్ల ఇవి అటవీ ప్రాంతాన్ని వదిలి బయటకు రావు. వేసవి వచ్చేసరికి అటవీ ప్రాంతంలో చిన్న చిన్న ఊట కాలువలు ఎండిపోతాయి. వాటి చర్మం పలుచగా ఉన్నందున వేడిని తట్టుకోలేవు. అందువల్ల ఎక్కువగా ఇవి నీటిలోనే ఉండేందుకు ఇష్టపడతాయి. పెద్ద కాలువల వద్దనే ఉంటాయి.అక్కడే నీళ్లు తాగి తిరుగుతాయి. వేటగాళ్లు కూడా కాలువల వెంబడే ఉంటారు.అవి నీరు తాగుతున్న సమయంలో తుపాకీతో వేటాడుతారు. లేదంటే సంప్రదాయ ఆయుధాలతో చంపేందుకు ప్రయత్నిస్తారు. గాయపడిన గేదెలు కనిపించిన వారిని చంపేందుకు చూస్తాయి. ఇలాంటి సమయంలోనే వీటి నుంచి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మందతో ప్రమాదం లేదు గొరగేదెలు మందలుగా ఉన్నప్పుడు ఎవరిని ఏమీ అనవు. ఒంటరిగా ఉన్న గేదెలు మాత్రమే దాడులు చేసేందుకు చూస్తాయి. అవి దాడులు చేస్తే ప్రాణాలతో బయటపడడం కష్టంగానే ఉంటుంది. ఒంటరిగా ఉన్న గేదె, గాయపడిన వాటితోనే ప్రమాదం ఉంటుందని గిరిజనులు తెలిపారు. పైడిపనుకుల, మంపకు అటువైపున ఉన్న కొండ, సూరేంద్రపాలెం ప్రాంతాల్లోకి వచ్చేస్తున్నాయి. గాయపడిన గేదె ఒకటి తిరుగుతుందని తెలుసుకున్న పరిసర ప్రాంతీయులు భయపడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి దట్టమైన అడవిలోనే గొరగేదెలుంటాయి. వాటిపై ఎలాంటి లెక్కలు లేవు. అంచనాగా చెప్పడం తప్ప అవి ఎన్ని ఉంటాయో గణన చేయలేదు. వేసవి కావడంతో అవి నీటి వనరులున్న ప్రాంతాలకు వస్తాయి.అవి ఏయే ప్రాంతాల్లో తిరుగుతున్నాయో అటవీ సిబ్బందిని పంపించి పరిశీలన చేయిస్తాం. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువగా మర్రిపాకల రేంజ్లోనే ఉన్నట్టుగా సమాచారం ఉంది. – సూర్యనారాయణ పడాల్, నర్సీపట్నం డీఎఫ్వో -
తెలుసా..! ఈ దేశంలో రైళ్లు కుక్కల్లా మొరుగుతాయట.. ఎందుకంటే..
ప్రపంచవ్యాప్తంగా రైల్వే నెట్వర్క్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జపాన్.. రైలు కూతలకు కుక్క అరుపులు జోడించిందనే వార్త హాస్యస్పదమే. కానీ ఇది నిజం. భూకంప పరిస్థితుల్లో సైతం ప్రత్యేక ఆటోమేటిక్ లాకింగ్ వ్యవస్థలు కలిగిన జపనీస్ ట్రైన్ టెక్నాలజీకి.. 2018 వరకూ ఆ దేశ వన్యప్రాణులే బ్రేక్స్ వేసేవి. సూపర్ ఫాస్ట్ షింకన్సేన్ (బుల్లెట్ ట్రైన్) సైతం దూసుకుపోగలిగే జపాన్ రైల్వే ట్రాక్స్పై వందలాదిగా జింకలు ప్రాణాలు కోల్పోవడం, ఆ కారణంగా రైల్వే ప్రయాణికులు ఆలస్యంగా గమ్యాన్ని చేరుకోవడం.. ఇలా జపాన్కి పెద్ద సమస్యే వచ్చిపడింది. ట్రాక్స్కి, హిల్స్కి జరిగే యాక్షన్లో కొన్ని ఐరన్ ఫిల్లింగ్స్ ఆకర్షించే రుచిని కలిగి ఉండటంతో.. వాటిని నాకేందుకు జింకలు భారీగా రైల్వే ట్రాక్స్ మీదకు వస్తున్నాయని అధ్యయనాలు తేల్చాయి. అలా వచ్చిన జింకలు రైలు కిందపడి చనిపోయేవి. దాంతో రంగంలోకి దిగిన రైల్వే టెక్నికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఆర్టీఆర్ఐ) పరిష్కారం దిశగా అడుగులు వేసింది. సింహం పేడను తెచ్చి ట్రాక్ పొడవునా జల్లి ఓ ప్రయోగం చేశారు. ఆ వాసనకి అక్కడ సింహాలు ఉన్నాయేమోనన్న భయంతో జింకలు ట్రాక్ మీదకి వచ్చేవి కావట. అయితే వర్షం పడి సింహం పేడ కొట్టుకుపోవడంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది. శాశ్వత పరిష్కారం కోసం రైలు కూత శబ్దానికి కుక్క అరుపులను జోడించారు. 20 సెకన్ల పాటు కుక్క అరుపులు వినిపిస్తుంటే.. జింకలు ట్రాక్ మీద నుంచి తుర్రుమనడం గమనించిన అధికారులు.. ఇదే పద్ధతిని అవలంబించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం వన్యప్రాణులు అధికంగా సంచరించే ప్రాంతాల్లో జపాన్ రైళ్లు కుక్కల్లా మొరుగుతున్నాయి. ఐడియా అదుర్స్ కదూ. చదవండి: Facts About Hair: ఒక వెంట్రుక వయసు దాదాపుగా ఇన్నేళ్లు ఉంటుందట!! -
తగలబడుతున్న బంగారు నేల.. ఊళ్లోకి క్రూరమృగాలు?
ఎటు చూసినా గుంపులుగా జనం, దొపిడీలు, తగలబడుతున్న కాంప్లెక్స్, మిగిలిపోయిన శిథిలాలు.. బంగారు నేల దక్షిణాఫ్రికా అల్లకల్లోలంగా తయారైంది. కరోనాతో దీనావస్థకు చేరిన జనాల్లో, మాజీ అధ్యక్షుడు జాకోబ్ జుమా అరెస్ట్తో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నిరసనకారులు కొందరు రొడ్డెక్కి విధ్వంసం సృష్టిస్తుండగా.. ఇదే అదనుగా దొపిడీలకు పాల్పడుతున్నారు అక్కడి జనాలు. ఈ క్రమంలో క్రూరమృగాల సంచారం వార్తలు మరింత కలవరపాటుకు గురి చేస్తున్నాయి. సాక్క్షి, వెబ్డెస్క్: తర్గత సంక్షోభంతో దక్షిణాఫ్రికా పరిస్థితి అధ్వానంగా తయారైంది. కరోనా మూడో వేవ్ మధ్యలో కొట్టుమిట్టాడడం, మునుపెన్నడూ లేనంతగా పెరిగిన నిరుద్యోగం-పేదరికం రేటు జనాలకు నిరసనలు బలాన్నిచ్చాయి. ఒక్కసారిగా రోడ్ల మీద పడి దొపిడీలకు పాల్పడ్డారు. వయసు భేధాల్లేకుండా ఆహారం, లిక్కర్, డబ్బులు, మందులు.. ఇలా అన్నీ దొంగతనం చేస్తున్నారు. పనిలో పనిగా కాంప్లెక్స్లను తగలబెడుతున్నారు. ఇప్పటిదాకా 212 మంది ప్రాణాలు పొగొట్టుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీళ్లలో చాలామంది దొపిడీలకు పాల్పడినప్పుడు తొక్కిసలాటలోనే చనిపోయారని తెలిపింది. డర్బన్, పీయెటెర్ మార్టిజ్బర్గ్ల్లో జుమా గతంలో పోటీ చేసిన క్వాజులు నాటల్, గౌటెంగ్లలో ఈ విధ్వంసం భారీగా కొనసాగుతోంది. ఈ రెండు ప్రావిన్స్ల్లో ఇప్పటిదాకా సుమారు 2500 మందిని అరెస్ట్ చేశారు. వీధుల్లోకి మృగాలు ఇక ఆగ్రహంతో ఉన్న నిరసనకారులు క్వాజులు-నాటల్ ప్రావిన్స్లోని హ్లూహ్లూవే రిజర్వ్ కంచెను తెంచేయడంతో.. సింహాలు, ఖడ్గమృగాలు, ఏనుగులు, చిరుత పులులు రోడ్ల మీదకు దూసుకొచ్చినట్లు కొన్ని వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వాటిలో చాలావరకు పాతవని అధికారులు అంటున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం.. ‘‘జంతువులు సంచరించిన మాట వాస్తవమేనని, అది తరచూ జరిగేదేనని, కానీ, సంబంధం లేకుండా కొందరు వాటిని అల్లర్లతో ముడిపెడుతున్నారని, సౌతాఫ్రికాలో ఏదో జరిగిపోతోందన్న ప్రచారం చేస్తున్నారని మండిపడుతోంది. Protesters have pulled down the fence at the Hluhluwe Game Reserve to let the animals out. Watch out for lions, etc. pic.twitter.com/uOQGTrQ4cA — The Duke (@TheDukeofOndini) July 11, 2021 Please note that the video currently circulating showing that Hluhluwe Park’s fence has been destroyed is an old video. It was taken on 12th May 2021 following the community protest by the community of Biliya community. So far we have not experienced any damage to our property. — EZEMVELO KZNWildlife (@EZEMVELOKZNWild) July 12, 2021 వారం దాటేసి.. దక్షిణాఫ్రికాకు తొమ్మిదేళ్లపాటు అధ్యక్షుడిగా పని చేశాడు జాకబ్ జుమా. అయితే పేదల పెన్నిధిగా పేరున్న జుమాపై సంచలనమైన ఆరోపణలు వచ్చాయి. 12 నేరాల జాబితాలో ఎట్టకేలకు కటకటాల వెనక్కి పంపగలిగింది రామఫోసా ప్రభుత్వం. దీంతో పెద్ద ఎత్తున్న వ్యతిరేక ఉద్యమం మొదలైంది. జనాలు భారీ ఎత్తున్న దొపిడీలకు పాల్పడుతుండడంతో దక్షిణాఫ్రికా ప్రభుత్వం అప్రమత్తమైంది. అయితే నిరసకారుల్ని, ప్రజల్ని అదుపు చేయడం పోలీస్ దళాలకు వల్ల కాలేదు. దీంతో జులై 12 నుంచి సైన్యం రంగంలోకి దిగింది. ఈ లోపు జుమా దాఖలు చేసిన రీ-పిటిషన్ను కోర్టు కొట్టేసింది. ఈ పరిణామంతో జుమాకు పట్టున్న ముఖ్యపట్టణాల్లో నిరసనలు తారాస్థాయికి చేరాయి. ఇక ఇదంతా ప్రణాళికబద్ధంగా జరుగుతున్న దాడులేనని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సైరిల్ రామఫోసా ఆరోపిస్తున్నారు. అల్లర్ల అదుపునకు మరో వారం పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. -
సాసర్వెల్స్ సక్సెస్; వన్యప్రాణులు ఖుష్
వేసవిలో వన్యప్రాణులకు తాగునీటి ఇబ్బంది రాకుండా తెలంగాణ అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ సాసర్వెల్స్ (నీటి తొట్టీలు) సత్ఫలితాలిస్తున్నాయి. మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజన్లోని జన్నారం, ఇందన్పల్లి, తాళ్లపేట అటవీ రేంజ్లలో సుమారు 90 వరకు నీటితొట్టీలను ఏర్పాటు చేశారు. సంబంధిత బీట్ అధికారి, బేస్క్యాంపు సిబ్బంది నీటితొట్టీల్లోని నీటిని పర్యవేక్షిస్తూ.. అయిపోగానే ట్యాంకర్ల ద్వారా నింపుతారు. రెండు స్క్వైర్ కిలోమీటర్లకు ఒక నీటితొట్టీని ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రాంతంలోని వన్యప్రాణులు నీరు తాగడానికి అనుకూలంగా ఉంటోంది. అడవిలో వాగులు, కుంటల్లో నీరు ఎండిపోతున్న నేపథ్యంలో నీటితొట్టీలు వన్యప్రాణుల దాహం తీరుస్తున్నాయి. గతేడాదివి 60 నీటితొట్టీలుండగా ఈ సంవత్సరం మరో 30 కొత్తవి నిర్మించారు. కాగా, నీరు తాగడానికి వచ్చిన వన్యప్రాణులు అధికారులు అమర్చిన సీసీ కెమెరాకు చిక్కాయి. ఈ దృశ్యాలను పరిశీలిస్తే సాసర్వెల్స్ సత్ఫలితాలిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎఫ్డీవో మాధవరావును సంప్రదించగా ఎప్పటికప్పుడు నీటితొట్టీలను పరిశీలిస్తున్నామని, సిబ్బంది వారానికి రెండు రోజులు నీటిని పోసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. – జన్నారం(ఖానాపూర్) -
తల్లి పక్కన ఉండగానే అడవి జంతువుల దాడి!
తుర్కపల్లి: అడవి జంతువులు ఓ చిన్నారిని చిదిమేశాయి. వాటి దాడిలో నాలుగేళ్ల బాలుడు చనిపోయాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామశివారులో గురువారం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా వాపన్ పల్లి కాలనీకి చెందిన శివ, అతని కుమారుడు హరీశ్ కుటుంబం సహా నెలరోజుల క్రితం వాసాలమర్రికి వలసవచ్చారు. హరీశ్కు భార్య గంగోత్రి, కుమారుడు మునేశ్వర్రావు(4) ఉన్నారు. రోజుమాదిరిగానే బుధవారం సాయంత్రం వరకు కోళ్లు అమ్ముకొని వచ్చి రాత్రి భోజనం చేసి నిద్రపోయారు. అటవీప్రాంతం కావడంతో పాములు, తేళ్ల భయానికి మునేశ్వర్రావు పక్కన తల్లి గంగోత్రి, ఆమెకు రక్షణగా భర్త హరీశ్, మరోపక్కన తాత శివ పడుకున్నారు. అర్ధరాత్రి బాలుడు ఏడవడంతో తల్లి గంగోత్రి నిద్రలేచి పాలిచ్చింది. ఉదయం 5 గంటల ప్రాంతంలో తల్లి లేచి చూడగా కొడుకు తలను కొరికివేసినట్టుగా ఉండటం చూసి గట్టిగా కేకలేయడంతో భర్త, మామ నిద్రలేచారు. బాలుడి తల రక్తమడుగులో ఉంది. తీవ్రగాయాలపాలై కళ్లు బయటికి వచ్చాయి. రాత్రి 2.30 గంటల సమయంలో బాలుడి తలను అడవిజంతువులు కొరికివేసి ఉంటాయని అనుమానిస్తున్నారు. కాగా, బాలుడి తలను కొరికివేసింది కుక్కలా.. అడవిజంతువులా అనేది తేలాల్సి ఉంది. పోస్టుమార్టం నివేదిక వచ్చాక అసలు విషయం బయటపడుతుందని పోలీసులు తెలిపారు. -
బెజవాడ పరిసరాల్లో అరుదైన వన్యప్రాణులు
సాక్షి, అమరావతి: విజయవాడ పరిసర ప్రాంతాల్లో పలు కొత్త వన్యప్రాణుల ఉనికి పర్యావరణవేత్తల్లో ఆశలు చిగురింపజేస్తోంది. వాతావరణ మార్పులు, కరువవుతున్న పచ్చదనంతో జీవవైవిధ్యం దెబ్బతిన్న పరిస్థితుల్లోనూ కృష్ణా జిల్లాలో కొండపల్లి అటవీ ప్రాంతం, మరికొన్నిచోట్ల అరుదైన వన్యప్రాణుల్ని గుర్తించారు. ఇంతవరకు ఈ ప్రాంతంలో ఎప్పుడూ చూడని కొత్త రకం చుంచు (మద్రాస్ ట్రీష్రూ), ఐదు చారల తాటి ఉడత, పెద్ద రెక్కల గద్ద (స్టెప్పీ ఈగిల్)ను ఐఐఎస్ఈఆర్ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) కనుగొంది. కొన్నేళ్ల నుంచి కొండపల్లి రిజర్వు ఫారెస్టులోని మూలపాడు అటవీ ప్రాంతంలో జీవవైవిధ్యం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ ఉన్న చెట్లు, వాతావరణం వల్ల అటవీ ప్రాంతం అభివృద్ధి చెందడంతో వన్యప్రాణుల మనుగడ పెరిగింది. ఈ నేపథ్యంలోనే పలు కొత్త వన్యప్రాణుల ఉనికి బయటపడినట్లు ఐఐఎస్ఈఆర్ అంచనా వేస్తోంది. పెద్ద రెక్కల గద్ద (స్టెప్పీ ఈగిల్) శీతాకాలంలో భారత ఉపఖండంలో అరుదుగా కనిపించే అతిపెద్ద గద్ద ఇది. మధ్య ఆసియా, మంగోలియా నుంచి చలికాలంలో ఈ పెద్ద రెక్కల గద్దలు మనదేశానికి వస్తాయి. అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉంది ఈ గద్ద. ఇటీవల విజయవాడ రూరల్ మండలం అంబాపురంలో ఒక వ్యక్తి పొలంలో దీన్ని ఫొటో తీయడంతో వీటి ఉనికి బయటపడింది. ఇవికాకుండా శీతాకాలంలో పలు వలస పక్షులు ఈ ప్రాంతానికి ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించారు. వాటిలో అరుదుగా ఉండే కోకిల, పలు రకాల గద్దలు కూడా ఉన్నాయి. కొత్త రకం చుంచు (మద్రాస్ ట్రీష్రూ) కృష్ణా జిల్లా మూలపాడు సీతాకోక చిలుకల పార్కులో సెప్టెంబర్ 10న దీన్ని గుర్తించారు. కీటకాలు, విత్తనాలు తిని జీవించే ఈ చుంచు జాతి ప్రాణులు రాతి ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. ఉడతల మాదిరిగా ఉండే ఇవి నడుస్తున్నప్పుడు తోకపైకి వంగి ఉంటుంది. 1850లో నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల మధ్య కొండల్లో మొదటిసారిగా వీటిని కనుగొన్నారు. అంతకుముందు విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లా అటవీ ప్రాంతాల్లోనూ సంచరించినట్లు గుర్తించారు. ఐదు చారల తాటి ఉడుత మన ఇళ్ల వద్ద కనిపించే సాధారణ ఉడుత శరీరంపై మూడు చారలు మాత్రమే ఉంటాయి. ఐదు చారల తాటి ఉడుతలున్నా అవి అంతరించిపోయినట్లు భావించారు. కానీ సెప్టెంబర్ 10న మూలపాడు అడవిలో, 11న విజయవాడ రూరల్ మండలం నున్న సమీపంలో వీటిని గుర్తించారు. ఈ ప్రాంతంలో వీటి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కొత్త జాతులు చాలా ఉన్నాయి మూలపాడు ప్రాంతంలో జీవవైవిధ్యం బాగుండటంతో కొత్త వన్యప్రాణులు ఇక్కడ కనిపిస్తున్నాయి. విజయవాడ పరిసరాల్లో ఇప్పటివరకు 630 జాతుల (పక్షులు, కీటకాలు, సాలె పురుగులు, క్షీరదాలు మొదలైనవి)ను రికార్డు చేశాం. 260కి పైగా పక్షి జాతుల సమాచారం మా వద్ద ఉంది. ఈ ప్రాంతంలో ఇంకా ఎక్కువ జీవజాతులు ఉన్నాయని భావిస్తున్నాం. ఐఐఎస్ఈఆర్ బయాలజీ విభాగం, దులీప్ మాథై నేచర్ కన్జర్వేషన్ ట్రస్ట్ సహకారంతో తిరుపతి, విజయవాడలో సర్వే చేస్తున్నాం. – రాజశేఖర్ బండి, సిటిజన్ సైన్స్ కో–ఆర్డినేటర్, ఐఐఎస్ఈఆర్ -
ముప్పు ముంగిట వన్యప్రాణులు
వన్యప్రాణులు ముప్పు ముంగిట మనుగడ సాగిస్తున్నాయి. వాటికి సహజ ఆవాసాలైన అడవులను స్వార్థపరులైన మనుషులు ఆక్రమించుకుంటూ ఉండటంతో అవి ఆవాసాన్నే కాదు, అర్ధంతరంగా ఆయువునూ కోల్పోతున్నాయి. గడచిన యాభయ్యేళ్ల కాలంలో భూమ్మీద మనుషుల జనాభా రెట్టింపును మించి పెరిగింది. ఇదే కాలంలో వన్యప్రాణుల జనాభా మూడింట రెండు వంతులకు పైగా తగ్గిపోయింది. కొన్ని జాతుల వన్యప్రాణులు పూర్తిగా కనుమరుగైపోయాయి. ఇంకొన్ని అంతరించిపోయే దశలోకి చేరుకున్నాయి. ఇదే రీతిలో వన్యప్రాణులు మరింతగా కనుమరుగైతే, పర్యావరణ సమతుల్యత దారుణంగా దెబ్బతిని, ఆ పరిస్థితి మనుషుల మనుగడకే ముప్పుగా మారే ప్రమాదం లేకపోలేదు. వన్యప్రాణుల మనుగడకు సంబంధించి ఇటీవల విడుదలైన ‘లివింగ్ ప్లానెట్ ఇండెక్స్’ నివేదిక ఆందోళన కలిగించేదిగా ఉంది. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) ఇంటర్నేషనల్, జువాలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్ సహకారంతో ‘లివింగ్ ప్లానెట్ ఇండెక్స్’–2020 తన నివేదికను రూపొందించింది. భూగోళంపై నివసించే సమస్త వన్యప్రాణులనూ ఇందులో లెక్కలోకి తీసుకోకపోయినా, వెన్నెముక గల 4000 వేల వన్యజంతువుల జాతులను పరిగణనలోకి తీసుకుంది. వీటి సంఖ్య 1970 నాటితో పోల్చితే 2016 నాటికి సగటున 68 శాతం మేరకు తగ్గిపోయింది. వ్యవసాయ విస్తరణ, అడవుల నరికివేత పెరగడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తినట్లు ‘లివింగ్ ప్లానెట్ ఇండెక్స్’ వెల్లడించింది. కోట్లాది సంవత్సరాలుగా భూమిపై మనుగడ సాగిస్తున్న వన్యజీవులు కేవలం అర్ధశతాబ్ది వ్యవధిలోనే ఈ స్థాయిలో తగ్గిపోవడమంటే, ఈ పరిణామాన్ని రెప్పపాటు కాలంలో సంభవించిన మార్పుగా పరిగణించాలని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ జనరల్ మార్కో లాంబెర్టిని అభిప్రాయపడ్డారు. బార్బరీ లయన్, బాక్ట్రియన్ ఒంటె ఎందుకు ఈ పరిస్థితి..? గడచిన అర్ధశతాబ్ది కాలంలోనే వన్యప్రాణుల సంఖ్య ఇంత దారుణంగా తగ్గిపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఇదే కాలంలో మనుషుల జనాభా రెట్టింపును మించి పెరిగింది. మనుషుల వినిమయం అంతకు మించి పెరిగింది. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇంటర్నేషనల్ చెబుతున్న ప్రకారం– భూమికి గల తన సహజ వనరుల పునరుత్పాదక శక్తితో పోలిస్తే, 1970 సంవత్సరానికి ముందు వరకు మానవుల పర్యావరణ అడుగుజాడలు తక్కువగానే ఉండేవి. అందువల్ల మనుషులు అటవీ సంపదను వాడుకుంటూ వచ్చినా, అప్పట్లో అంతగా ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడైతే మనుషులు భూమికి గల సహజ వనరుల పునరుత్పాదన సామర్థ్యానికి మించి ఒకటిన్నర రెట్లు ఎక్కువగా సహజ వనరులను ఇష్టానుసారం వాడేసుకుంటున్నారు. గడచిన యాభై ఏళ్లలో భారీగా పెరిగిన పరిశ్రమలు అడవులను, గడ్డిభూములను వ్యవసాయ క్షేత్రాలుగా మార్చేయడం గణనీయంగా పెరిగింది. దీనికి తోడు పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం, తరచుగా అడవుల్లో చెలరేగుతున్న కార్చిచ్చులు వన్యప్రాణులను వేగంగా హరించేస్తున్నాయి. ప్రస్తుతం భూమిపైనున్న స్థలభాగంలో మూడోవంతు, మంచినీటి వనరుల్లో నాలుగింట మూడువంతులు కేవలం ఆహార ఉత్పాదన కోసమే వినియోగమవుతున్నాయి. మనుషులు మనుగడ సాగిస్తున్న భూమిపై ఈ పరిస్థితి ఉంటే, సముద్రాల పరిస్థితి మరీ దారుణంగా మారింది. సముద్రాల్లోని మత్స్యవనరులను మనుషులు వినియోగించుకోవాల్సిన దాని కంటే 75 శాతం అదనంగా వినియోగించుకుంటున్నారు. కరీబియన్ మాంక్ సీల్, టాస్మానియన్ టైగర్ కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణం భూమిపైనున్న వన్యప్రాణులు కొన్ని ప్రాంతాల్లో మరింత వేగంగా కనుమరుగైపోతున్నాయి. ముఖ్యంగా మధ్య అమెరికా, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. ఈ ప్రాంతాల్లో గడచిన యాభై ఏళ్లలో వన్యప్రాణుల సంఖ్య ఏకంగా 94 శాతం మేరకు తగ్గిపోయింది. ఇలాంటి పరిణామం కచ్చితంగా మన ప్రపంచంపై ప్రభావం చూపుతుందని లాంబెర్టిని హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న నలభై స్వచ్ఛంద సంస్థలు, విద్యా పరిశోధన సంస్థలు వేర్వేరుగా జరిపిన అధ్యయనాల్లోని సమాచారాన్ని క్రోడీకరించుకుని, ‘లివింగ్ ప్లానెట్’ తన నివేదికలోని సమాచారాన్ని సవరించుకుని, ఇటీవలే దానిని విడుదల చేసింది. ఈ నివేదికను ‘ద నేచర్’ జర్నల్ ప్రచురించింది. ఇందులో వన్యప్రాణుల పరిరక్షణ కోసం ప్రపంచ దేశాలన్నీ తక్షణమే చేపట్టవలసిన చర్యలను కూడా సూచించింది. ‘‘ఈ పరిస్థితిపై మనం తక్షణమే స్పందించాలి. జీవ వైవిధ్యం నాశనమవుతున్న వేగంతో పోల్చుకుంటే, ప్రభుత్వాలు చేపడుతున్న చర్యల వల్ల మొదలైన జీవ వైవిధ్య పునరుద్ధరణ వేగం చాలా తక్కువగా ఉంటోంది. ఇక ఏమాత్రం జాప్యం చేసినా మానవాళి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. జీవ వైవిధ్యాన్ని తిరిగి యథాస్థితికి తీసుకురావాలంటే కొన్ని దశాబ్దాల కాలం పట్టవచ్చు’’ అని ‘లివింగ్ ప్లానెట్’ అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకుడు డేవిడ్ లీక్లీర్ ఆందోళన వ్యక్తం చేశారు. వేటాడి చంపేస్తున్నారు అరుదైన వన్యప్రాణులను సైతం వేటగాళ్లు వేటాడి చంపేస్తున్నారు. ఇదివరకటితో పోలిస్తే, మాంసం కోసం వన్యప్రాణుల వేట గత యాభయ్యేళ్లలో గణనీయంగా పెరిగింది. సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా 60 లక్షల టన్నుల వన్యప్రాణుల మాంసం అక్రమ మార్కెట్లకు తరలుతోంది. కేవలం బ్రెజిల్లోని అమెజాన్ అడవుల నుంచి 2 వేల కోట్ల డాలర్ల (రూ.1.47 లక్షల కోట్లు) విలువ చేసే వన్యప్రాణుల మాంసం ఇతర దేశాలకు అక్రమంగా ఎగుమతి అవుతోంది. వ్యక్తిగత లగేజీల్లో దాచి ఇలా తరలిస్తుండగా పారిస్ ఎయిర్పోర్టులో ఏటా పట్టుబడే వన్యప్రాణుల మాంసం 260 టన్నుల వరకు ఉంటోంది. ఇక మిగిలిన అంతర్జాతీయ విమానాశ్రయాలకు, నౌకాశ్రయాలకు చేరుతున్న మాంసం ఏ పరిమాణంలో ఉంటుందో ఊహించుకోవాల్సిందే! ఇవి ఇప్పటికే అంతరించాయి అడవుల నరికివేత, కార్చిచ్చులు, కాలుష్యం, వేట తదితర కారణాల వల్ల ఇప్పటికే చాలా వన్యప్రాణులు పూర్తిగా కనుమరుగై పోయాయి. గడచిన వందేళ్లలో దాదాపు 500 జాతులకు చెందిన జంతువులు, పక్షులు అంతరించిపోయాయి. గోల్డెన్ టోడ్ (బంగారు వన్నె కప్ప), రామచిలుకల జాతికి చెందిన కరోలినా పారాకీట్, కోడి జాతికి చెందిన హీత్ హెన్, కంగారు తరహా జాతికి చెందిన టాస్మానియన్ టైగర్, పెద్దపులుల్లో ఒక జాతి అయిన కాస్పియన్ టైగర్, కరీబియన్ మాంక్ సీల్, ఖడ్గమృగం జాతికి చెందిన వెస్టర్న్ బ్లాక్ రినో, పింటా ఐలాండ్ తాబేలు, సింహాల జాతిలో అరుదైన బార్బరీ లయన్, షోంబర్క్ జింకలు వంటివి గత వందేళ్లలోనే ఉనికిలో లేకుండా పోయాయి. క్లౌడెడ్ చిరుతపులి, పంగోలిన్ భారత్లో వన్యప్రాణుల పరిస్థితి గడచిన శతాబ్ద కాలంలో మన భారత్లో కూడా కొన్ని జంతువులు పూర్తిగా కనుమరుగైపోయాయి. వాటిలో చిరుత జాతికి చెందిన ఇండియన్ చీతా, అడవి దున్నల జాతికి చెందిన ఇండియన్ అరోక్, సుమత్రా ఖడ్గమృగాలు, శివాతెరియం (దీనిని శివుడి వాహనంగా భావించేవారు) వంటి భారీ జంతువులు సైతం అంతరించిపోయాయి. భారత్లో నెలకొన్న పరిస్థితులు వన్యప్రాణుల మనుగడకు నానాటికీ ప్రమాదకరంగా మారుతున్నాయి. వన్యప్రాణుల పరిరక్షణ కోసం ప్రభుత్వం 1972లో వన్యప్రాణుల పరిరక్షణ చట్టాన్ని అమలులోకి తెచ్చినా, మాంసం కోసం, జంతు శరీర భాగాల కోసం వన్యప్రాణుల వేట జరుగుతూనే ఉంది. చట్ట ప్రకారం వన్యప్రాణుల వేట, తరలింపు వంటి చర్యలను శిక్షార్హమైన నేరాలుగా పరిగణిస్తున్నా, వేటగాళ్లు వీటిని బేఖాతరు చేస్తూ, యధేచ్ఛగా వన్యప్రాణులకు ముప్పు తెచ్చిపెడుతున్నారు. జీవవైవిధ్యం గల దేశాల్లో భారత్ ఒకటి. ప్రపంచంలోని 6.5 శాతం వన్యప్రాణులు భారత్లోనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా గల స్తన్యజీవుల్లో 7.6 శాతం, పక్షిజాతుల్లో 12.6 శాతం భారత్లో కనిపిస్తాయి. భారత్లో ఎక్కువగా వేటగాళ్ల బారిన పడుతున్న వాటిలో పెద్దపులులు, ఖడ్గమృగాలు, ఏనుగులు, నక్షత్ర తాబేళ్లు వంటివి ఉంటున్నాయి. చర్మం కోసం, పంజా, గోర్లు, ఇతర శరీర భాగాల కోసం వేటగాళ్లు పెద్దపులులను వేటాడుతున్నారు. చైనీస్ సంప్రదాయ వైద్యంలో పెద్దపులి శరీర భాగాలకు విపరీతమైన గిరాకీ ఉంది. దంతాల కోసం ఏనుగులను, కొమ్ముల కోసం ఖడ్గమృగాలను పొట్టన పెట్టుకుంటున్నారు. వీటిని గృహాలంకరణలుగా వాడటంపై రకరకాల నమ్మకాలు ప్రచారం ఉండటంతో వీటికీ గిరాకీ ఎక్కువగానే ఉంటోంది. ఫెంగ్షుయి నమ్మకాల కారణంగా కొన్ని దేశాల్లో నక్షత్ర తాబేళ్లను పెంచుకుంటున్నారు. సాధారణంగా వీటిని సజీవంగానే విదేశాలకు తరలిస్తుంటారు చైనా, మలేసియా, ఇండోనేసియా వంటి దేశాల్లో పులులు, ఖడ్గమృగాల శరీర భాగాలకు విపరీతమైన గిరాకీ ఉండటంతో అక్రమ మార్గాల గుండా వీటిని తరలిస్తున్నారు. ఇదివరకటి కాలంలో అడవి జంతువుల వేట కోసం వేటగాళ్లు ఉచ్చులు, మామూలు తుపాకులు ఎక్కువగా వాడేవారు. ఇటీవలి కాలంలో భారీ జంతువులను వేటాడటానికి అధునాతనమైన తుపాకులతో పాటు కొందరు పశువైద్యులు జంతువులకు శస్త్రచికిత్సలు చేసేటప్పుడు వాడే మత్తుమందులు, విషం సైతం వినియోగించి, జంతువులను మట్టుబెడుతున్నారని ‘ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) వెల్లడించింది. భారతీయ ఖడ్గమృగాలు (ఇండియన్ రినో) ఒకప్పుడు పాకిస్తాన్, భారత్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ భూభాగాల్లో విరివిగా కనిపించేవి. ప్రస్తుతం వాటి సంఖ్య 2,500 లోపే ఉండటంతో అతి అరుదుగా మాత్రమే కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని అడవుల్లో వేటగాళ్లు వేటాడిన జంతు శరీర భాగాల స్మగ్లింగ్ ఉత్తర భారత రాష్ట్రాలు కేంద్రంగా సాగుతోంది. ఈ రాష్ట్రాల్లోని కొనుగోలుదారులు వేటగాళ్ల నుంచి వీటిని కొనుగోలు చేసి, నేపాల్కు తరలించి, అక్కడి నుంచి వివిధ మార్గాల్లో చైనా, మలేసియా, ఇండోనేసియా తదితర దేశాలకు తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. వన్యప్రాణుల వేటను, అక్రమ తరలింపును కట్టడి చేసేందుకు ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకుంటే, మరిన్ని వన్యప్రాణులు పూర్తిగా కనుమరుగైపోయే పరిస్థితులు ఉన్నాయని ఐయూసీఎన్ వంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ప్రమాదం అంచున ఉన్న జంతుజాతులు ‘భూమిపై నివసించే స్తన్యజీవుల్లో 301 జాతులకు చెందిన జంతువులు ప్రమాదం అంచున ఉన్నాయి. వీటి పరిరక్షణ కోసం తక్షణ చర్యలు తీసుకోకుంటే త్వరలోనే ఇవి అంతరించిపోయే ప్రమాదం ఉంది. ప్రమాదం అంచుల్లో ఉన్న ఈ జంతుజాతుల్లో లోలాండ్ గొరిల్లా, మాండ్రిల్ సహా 168 జాతులకు చెందిన వానరాలు, జడల బర్రె, బాక్ట్రియన్ ఒంటె సహా 73 జాతులకు చెందిన గిట్టలు గల జంతువులు, 27 జాతులకు చెందిన గబ్బిలాలు, క్లౌడెడ్ చిరుతపులి, కొన్నిరకాల ఎలుగుబంట్లు సహా 12 జాతులకు చెందిన మాంసాహార జంతువులు, ఎనిమిది జాతులకు చెందిన పంగోలిన్, కంగారూ జాతికి చెందిన 26 రకాల జంతువులు, ఆల్పైన్ వూలీ ర్యాట్ సహా ఎలుక జాతికి చెందిన 21 రకాల జంతువుల సంఖ్య గడచిన యాభై ఏళ్లలో గణనీయంగా క్షీణించింది. ప్రస్తుతం ఇవి దాదాపు కనుమరుగయ్యే స్థితికి చేరుకున్నాయని ‘ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్’ వెల్లడించింది. ఈ జంతువులను తన ‘రెడ్లిస్ట్’లో చేర్చింది. గణనీయంగా వీటి తరుగుదలకు అడవులు తరిగిపోవడమే కాకుండా, ఇష్టానుసారం సాగిస్తున్న వేట కూడా కారణమవుతోందని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డేవిడ్ మెక్డొనాల్డ్ చెబుతున్నారు. మాంసం కోసం, జంతువుల శరీర అవయవాల కోసం వీటిని వేటాడటం గత యాభై ఏళ్లలో బాగా ఎక్కువైందని, ఇదే పరిస్థితి కొనసాగితే ‘రెడ్లిస్ట్’లో ఉన్న వన్యప్రాణులు పూర్తిగా కనుమరుగవడానికి ఎంతోకాలం పట్టదని ఆయన హెచ్చరిస్తున్నారు. -
అటవీశాఖ కార్యాలయంపై రాళ్ల దాడి
ఖానాపూర్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీశాఖ కార్యాలయంపై సోమవారం పలువురు రాళ్లతో దాడి చేశారు. ఈ నెల 6న మండలంలోని అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడుతున్న యువకుడిని అటవీ అధికారులు పట్టుకున్నారు. విచారణ పేరుతో రెండు రోజులుగా చిత్రహింసలు పెట్టడంతో ప్రాణాపాయ స్థితికి చేరాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు కార్యాలయంపై దాడి చేశారు. రేంజ్ కార్యాలయంతో పాటు ఎఫ్డీవో గెస్ట్హౌస్ అద్దాలు, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. పలువురు అధికారులు, సిబ్బంది కార్యాలయ తలుపులు వేసుకుని లోపలే ఉండటంతో ప్రాణాపాయం తప్పింది. కాగా పలు వన్యప్రాణులను వేటాడిన యువకుడు చిరుతను హతమార్చేందుకు యత్నించాడని, తమ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. కేసులు నమోదు చేస్తామనే భయంతో యువకుడు స్పృహ కోల్పోయాడని ఎఫ్డీవో కోటేశ్వర్, ఎఫ్ఆర్వో వినాయక్ తెలిపారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. (చెప్పుతో కొట్టిన సర్పంచ్.. యువకుడి ఆత్మహత్య) -
ఫీల్.. కూల్
ఠారెత్తిస్తున్న ఎండలతో ఇళ్ల నీడన ఉంటున్న మనుషులే తల్లడిల్లుతున్నారు. మరి వేడి సెగలు, వడగాలుల మధ్య తిరుగాడే వన్యప్రాణులు ఇంకెంత విలవిలలాడాలి. నాలుగైదు రోజులుగా నగరం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఈ క్రమంలో వేసవి తాపం నుంచి మూగజీవాలను కాపాడేందుకు నెహ్రూ జూలాజికల్ పార్కులో చర్యలకు ఉపక్రమించారు. జూలో ఉన్న వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చింపాంజీ, కోతులు, పులులు, సింహాలు, చిరుత పులుల ఎన్క్లోజర్ లోపల 50కిపైగా కూలర్లను ఏర్పాటు చేసి చల్లదనాన్ని కల్పిస్తున్నారు. నిశాచర జంతుశాల(నైట్ హౌజ్)లో ఎయిర్ కండిషనర్లు, ఎగ్జాస్ట్ ఫ్యాన్లను పెట్టారు. బహదూర్పురా :సూరీడు సుర్రుమంటున్నాడు.. ఉదయం నుంచే ఎండలు మండిపోతున్నాయి.. నగరంలో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. మార్చి, ఏప్రిల్లో కాస్త తక్కువగా ఉన్నా.. లాక్డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లలోనే ఉండటంతో కాస్త రక్షణ పొందారు. గత నాలుగైదు రోజులుగా నగరం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. దీంతో ప్రజలతో పాటు మూగజీవాలు అల్లాడుతున్నాయి. వేసవి తాపం నుంచి జీవులను కాపాడేందుకు నెహ్రూ జూలాజికల్ పార్కులో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేసవి ప్రారంభంలోనే జూలోని వన్య ప్రాణుల సంరక్షణకు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు ప్రస్తుతం మరింత శ్రద్ధ పెట్టారు. జంతువులు ఉండే చోట్ల స్ప్రింక్లర్లు, చిన్న రెయిన్గన్స్లను ఏర్పాటు చేసి నీటిని విరజిమ్ముతున్నారు. పక్షులు ఇతర వన్యప్రాణుల ఎన్క్లోజర్లో ఫాగర్లను ఏర్పాటు చేసి నీటి బిందువులను పొగమంచు వలే విరజిమ్ముతున్నారు. వన్యప్రాణుల ఎన్క్లోజర్ల పైకప్పుపై తుంగ గడ్డిని ఏర్పాటు చేసి ఎండ వేడిమి నుంచి ఉపశమనం కల్పిస్తున్నారు. చింపాంజీ, కోతులు, పులులు, సింహాలు, చిరుతపులుల ఎన్క్లోజర్ లోపల 50పైగా కూలర్లను ఏర్పాటు చేసి చల్లదనాన్ని కల్పిస్తున్నారు. నిశాచర జంతుశాల(నైట్ హౌజ్)లో ఎయిర్ కండిషనర్లు, ఎగ్జాస్ ఫ్యాన్లను ఏర్పాటు చేశారు. వెటర్నరీ వైద్య సిబ్బందితో పర్యవేక్షణ.. వన్యప్రాణులను జూపార్కు వెటర్నరీ వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వేసవిలో పుట్టిన వన్యప్రాణుల కూనలపై మరింత శ్రద్ధ తీసుకుంటూ అన్ని రకాల చర్యలను చేపడుతున్నామని జూపార్కు క్యూరేటర్ క్షితిజ తెలిపారు. ఓపెన్ ఎన్క్లోజర్లోని ఏనుగులు, తాబేలు, నీటిగుర్రం, ఖడ్గమృగంతో పాటు ఆస్ట్రిచ్ పక్షి ఇతర వన్యప్రాణుల ఎన్క్లోజర్లలో నీటిని నేరుగా వన్యప్రాణులపైకి విరజిమ్ముతున్నట్లు వారు వివరించారు. వేసవి తాపాన్ని తట్టుకునేలా... వేసవిని తట్టుకునేందుకు వన్యప్రాణులకు పుచ్చకాయలు, కర్బూజ వంటివి అందిస్తున్నారు. గ్లూకాన్డీ, ఎలక్ట్రాల్ పౌడర్, విటమిన్–సీ, బీ కాంప్లెక్స్ సప్లిమెంట్లను అందిస్తూ వేసవి తాపాన్ని తట్టుకునేందుకు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతున్నారు. సూర్యకాంతి నేరుగా వన్యప్రాణులపై పడకుండా కిటికీలు, వెంటిలేటర్లు, తలుపులకు గోనె సంచులను కప్పి వాటిని నీటితో ఎప్పటికప్పుడు తడుపుతున్నారు. పక్షుల ఎన్క్లోజర్ల పైకప్పులు, చుట్టుపక్కల ఆకుపచ్చని నీడ వలయాలను ఏర్పాటు చేశారు. వన్యప్రాణులకు సురక్షితమైన నీటిని అందిస్తున్నారు. లోపల ఫ్యాన్లు, కూలర్లను ఏర్పాటు చేశారు. ఎండ వేడిని తట్టుకునే శక్తి వేటికిఎంత..? ♦ రాష్ట్రవ్యాప్తంగా ఎండలు 44 డిగ్రీలకు పైగా పెరగడంతో కొన్ని వన్యప్రాణులు, పక్షులు పిట్టల్లా రాలిపోతున్నాయి. మనుషులతో పాటు వన్యప్రాణులు ఎండ వేడిని కొంతమేర తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి. 38–40 డిగ్రీల ఎండను కొన్ని వన్యప్రాణులు ఓర్చుకుంటాయి. క్రూర జంతువులైన పులులు, సింహాలు, నక్కలు, తోడేళ్లు, చిరుతపులులు, ఎలుగుబంట్లు 40 డిగ్రీల ఎండను సైతం తట్టుకుంటాయి. భారీ జంతువైన ఏనుగు 44 డిగ్రీల ఎండను సైతం ఓర్చుకోగలుగుతుంది. ఆస్ట్రిచ్ పక్షులు 45–47 డిగ్రీల ఎండలో హాయిగా జీవిస్తాయి. చిన్న పక్షులైతే 40 డిగ్రీలలోపు ఎండ వేడిమికే సతమతమవుతాయి. ♦ రామచిలుకలు, అడవి కోళ్లు, బాతులు, ఇతరత్ర చిన్న చిన్న పక్షులు జూలో 500కు పైగా ఉన్నాయి. సహజ సిద్ధమైన జూ వాతావరణంలో ఎండ తీవ్రత కూడా తక్కువగానే ఉంటుంది. 40 డిగ్రీల వరకు ఎండ వేడిమిని అతికష్టం మీద ఈ పక్షులు తట్టుకోగలుగుతాయి. రాత్రివేళ సంచరించే నిశాచర జంతువు, దేవాంగ పిల్లి, గబ్బిలాలు, ముళ్ల పంది, రాటేల్, అడవి పిల్లులు 40 డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకుంటాయి. -
వన్యప్రాణులను చంపి టిక్టాక్లో పోస్టు..
అనంతపురం, కంబదూరు: వన్యప్రాణులను చంపి టిక్టాక్లో పోస్టు చేసిన ఓ వ్యక్తిని అటవీ అధికారులు అరెస్ట్ చేశారు. వివరాలిలా ఉన్నాయి.. రామగిరి మండలం పేరూరుకు చెందిన నాగార్జున అనే యువకుడు కంబదూరు మండలం అయ్యంపల్లికి చెందిన బోయ నరసింహులు అనే వ్యక్తి వద్ద జీతగాడిగా ఉన్నాడు. రోజూ గొర్రెలను మేపడానికి పొలాల్లోకి వెళ్లేవాడు. అయితే ఇటీవల నాగార్జున ఓ జింక పిల్లను పట్టుకొని దానిని అడిస్తూ మేక పాలను తాపడం, కుందేళ్లను చంపి దాని మాంసాన్ని కుక్కలను వేయడం వంటి పనులు చేస్తూ వీడియో తీసి టిక్టాక్లో పోస్ట్ చేశాడు. వీడియోలను జిల్లా ఫారెస్ట్ అధికారి జగన్నాథం చూసి వెంటనే నిందితుడిపై కేసు నమోదు చేయాలని కళ్యాణదుర్గం అటవీ అధికారులను ఆదేశించారు. సెల్ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు సెక్షన్ ఆఫీసర్ రామచంద్రనాయక్ తెలిపారు. -
నెహ్రూ జూపార్కులో జూనియర్ ఫ్రెండ్స్
బహదూర్పురా: లాక్డౌన్ అనంతరం నెహ్రూ జూలాజికల్ పార్కులో సింహాలు, పులులు, నక్కలు, ఆస్ట్రిచ్ పక్షులు జూ సందర్శకులను అలరించనున్నాయి. ఇటీవల జూపార్కులోని ఆదిసన(రాధ), మాధవ్లకు రెండు సింహపు కూనలు జన్మించాయి. వాటిని డార్క్ రూమ్లో నుంచి డే క్రాల్లోకి విడుదల చేశారు. ప్రస్తుతం సింహపు కూనలు సమ్మర్ హౌజ్లో ఉన్నాయి. 2013లో సౌదీ అరేబియా ప్రిన్స్ సింహాలను జూకు బహుమతిగా అందించారు. జూలో వీటికి రాధ, మాధవ్లుగా పేర్లు పెట్టారు. ఇటీవల రెండు కూనలు జన్మించడంతో అధికారులు హర్షం వ్యక్తం చేశారు. రెండు నెలల క్రితం రాయల్ బెంగాల్ టైగర్(ఆశ) మూడు పులి కూనలకు జన్మనిచ్చింది. ఇటీవల ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన నక్కలు కూడా రెండు నక్క కూనలకు జన్మనిచ్చాయి. జూపార్కులో ఉన్న ఆస్ట్రిచ్ పక్షులు మూడు పిల్లలకు జన్మనిచ్చాయి. మొత్తం మీద లాక్డౌన్లో జూపార్కులో 10 కొత్త వన్యప్రాణులు సందర్శకులను అలరించనున్నాయి. బుడిబుడి నడకలతో జూపార్కు యానిమల్ కీపర్లను కూడా ఆకట్టుకుంటున్నాయి. ఈ నెలాఖరు వరకు జూపార్కులో మరిన్ని కొత్త వన్యప్రాణులు పురుడు పోసుకునే అవకాశాలు ఉన్నాయి. జూలోని వన్యప్రాణులకు కరోనా వ్యాధి సోకకుండా పెద్దఎత్తున జాగ్రత్త చర్యలను జూ అధికారులు తీసుకుంటున్నారు. -
వాల్గొండ అటవీప్రాంతంలో కలకలం
మల్లాపూర్(కోరుట్ల): వాల్గొండ అటవీ ప్రాంతంతో మంగళవారం రాత్రి వన్యప్రాణులకోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్తీగలతో ట్రాక్టర్ దగ్ధమవగా, చుక్కల జింక మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని వాల్గొండ అటవీప్రాంతంలో ఆదే గ్రామానికి చెందిన ఇస్లావత్ శరినాయక్ కౌలుకు తీసుకున్న పొలంలో మొరం మట్టి పోసేందుకు ట్రాక్టర్ డ్రైవర్ చెట్పల్లి రాజు వెళ్లాడు. ఈ సమయంలో విద్యుదాఘాతానికి గురైన ట్రాక్టర్లో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. విషయాన్ని గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు ఘటనస్థలికి వెళ్లగా వన్యప్రాణుల కోసం అమర్చిన విద్యుత్తీగలు గుర్తించారు. సంఘటన జరిగిన కొంతదూరంలో చుక్కల జింక కరెంట్షాక్కు గురై మృతిచెంది కనిపించింది. ప్రజాప్రతినిధులు వెంటనే పోలీస్, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు, అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి చుక్కల జింక మృతదేహాన్ని, దుండగులు వదిలి వెళ్లిన బైక్లను స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. -
పులి వచ్చిందా.. అయితే పట్టేయొచ్చు..!
సాక్షి, హైదరాబాద్: వన్యప్రాణుల ట్రాకింగ్కు ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ను వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ) శాస్త్రవేత్తలు రూపొందించారు.కోవిడ్ –19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో సుదీర్ఘ లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో దేశవ్యా ప్తంగా పలుప్రాంతాల్లో అడవుల్లోంచి వన్యప్రాణులు, జంతువులు రోడ్లపైకి, జనావాసాలకు దగ్గరగా వస్తున్న విషయం తెలిసిందే.ఎక్కడికక్కడ వాటిని ట్రాక్ చేయడంతో పాటు, వాటి ఆనుపానులు తెలుసుకునేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని చెబుతున్నారు.అదేవిధంగా దేశంలోని వివి ధ రాష్ట్రాల్లో మనుషులు,జంతువులు తారసపడుతున్న ప్రాంతాలు, అక్కడున్న పరిస్థితులను తెలుసుకునేందుకు అవసరమైన ము ఖ్యమైన సమాచారాన్ని దీని ద్వారా పొందవచ్చునంటున్నారు ఆండ్రాయిడ్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా ‘లాక్డౌన్ వైల్డ్లైఫ్ ట్రాకర్’ను వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ) రూపొందించింది. దేశవ్యాప్తంగా అడవులు, దగ్గర్లలోని గ్రామా లు, పట్టణాల్లో ఎక్కడెక్కడ ఏ రకమైన వ న్యప్రాణులు, జంతువులు కనిపించాయో రికార్డ్ చేసేందుకు వీలుగా ఇందులో టూ ల్స్ను వినియోగిస్తున్నారు. లాక్డౌన్ సందర్భంగా ఇక్కడ పులి కనిపించింది, అక్కడ ఏనుగులు రోడ్లపైకి వచ్చాయి, మరోచోట చిరుతపులి ఊళ్లోకి వచ్చింది అంటూ వస్తు న్న వార్తలు, వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్న కథనాలు, ఫోటోలు కేవలం ఆ మేరకే పరిమితం కాకుండా, దీనికి సంబంధించిన డేటాను సమీకృతంగా సేకరించి వన్యప్రాణులకు చెందిన ఆసక్తికరమైన సమాచారాన్ని నమోదు చేయొచ్చనే ఆలోచనతో డబ్ల్యూఐఐ శాస్త్రవేత్తలు ఈ యాప్ను రూపొందించారు. ఎప్పుడైనా రికార్డు చేయవచ్చు... పట్టణప్రాంతాలతో పాటు మనుషులు ఎక్కువగా లేని చోట్లకు జంతువులు కూడా వస్తున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో తమకు కనిపించిన వాటి గురించి ఈ యాప్ ద్వారా తెలియజేయొచ్చని ఈ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ మోహన్ తెలిపారు. వన్యప్రాణులు కనిపిస్తే అదే సమయంలో లేకుంటే ఆ తర్వాతైనా తెలియజేయొచ్చని, వాటి ఫొటోలను అప్లోడ్ చేయొచ్చని డబ్ల్యూఐఐ సీనియర్ సైంటిస్ట్ డా.బిలాల్ హబీబ్ తెలిపారు. ఈ యాప్ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని, దీనిద్వారా తమకు కనిపించిన జంతువు ల చిత్రాలను ఎక్కడినుంచైనా, ఏ సమయం లోనైనా రికార్డ్ చేసి పంపొచ్చునని తెలియజేశారు.ఈ రికార్డింగ్లను సులభంగా చేయడంతో పాటు జీపీఎస్ ద్వారా తెలుసుకునే వీలుంటుందన్నారు.ఈ సమాచారం, ఫొటోలను సంబంధిత రాష్ట్రాల అటవీశాఖలకు పంపించి, వాటి పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణను చేపట్టేందుకు వీలవుతుందని మోహన్ వెల్లడించారు. -
కోతులకు సోకితే అంతే
సాక్షి, హైదరాబాద్: కోతులకి మనుషుల ద్వారా కరోనా వైరస్ వ్యాపించే అవకాశాలున్నాయని జీవ శాస్త్రవేత్తలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో వాటికి మనుషులు ఆహారం, పండ్లు నేరుగా అందించడం ప్రమాదకరమని చెబుతున్నారు. మనుషుల నుంచి లేదా వారు పెట్టే ఆహారం నుంచి ఈ వైరస్ కోతులకు సోకితే సార్స్–సీవోవీ–2 వైరస్ మ్యుటేటయ్యేందుకు దోహదపడటంతో పాటు అడవు ల్లోని ఇతర జంతువులకు ఇది వ్యాపిస్తే దీర్ఘకాలం దుష్పరిణామాలు ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు. తాజాగా తమిళనాడులోని సలీం అలీ సెంటర్ ఫర్ ఒరింతోలజీ, నేచురల్ హిస్టరీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ హోన్నవల్లి ఎం.కుమార తమ అధ్యయన పత్రంలో ఆయా అంశాలను ప్రస్తావించారు. వైరస్లు, ఎండో పారాసైట్లు మనుషులు, జంతువుల మధ్య సోకే, వ్యాప్తి చెందే అవకాశాలున్నాయ ని ఆయన స్పష్టం చేశారు. కోతులు, అడవి జంతువులకు మనుషులు నేరుగా ఆహారం పెట్టే అలవాటును మార్చుకోవాల్సి ఉందని మరో శాస్త్రవేత్త పేర్కొన్నారు. ఒకవేళ సార్స్–సీవో వీ–2 వైరస్ మ్యుటేట్ అయ్యి ఇతర జం తువులకు సోకితే మొత్తం వన్యప్రాణులపైనే దాని ప్రభావం పడుతుందని తమిళనాడుకు చెందిన మరో జీవశాస్త్రవేత్త హెచ్చరిస్తున్నా రు. ఈ క్రమంలో గతంలో కోతులపై పరిశోధనతో పాటు వివిధ అంశాలపై అధ్యయనం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్ సైం టిస్ట్, ఆల్ఇండియా నెట్వర్క్ ప్రాజెక్ట్ ఆన్ వెర్టేట్రేట్ పెస్ట్ మేనేజ్మెంట్ హెడ్ డాక్టర్ వి.వాసుదేవరావు ‘సాక్షి’కి పలు విషయా లు వెల్లడించారు. ‘జంతువుల కు, ముఖ్యంగా కోతులకు రెడీమేడ్ ఆహారం అందించాల్సిన అవసరం లేదు. పబ్లిక్ ఫీడిం గ్ వల్ల వాటికి ఇన్ఫెక్షన్లు వ్యాపించే అవకా శాలున్నాయి. వాటికి ఆహారం, పండ్లు పెట్టి ఇన్ఫెక్షన్లను వ్యాప్తి చెం దేలా చేయడం సమంజసం కాదు. వైరస్ ఎలా మ్యుటేట్ అవుతుందో తెలియదు. కాబట్టి జాగ్రత్త అవసరం. జంతువుల నుంచి వైరస్లు, బ్యాక్టీరియా వ్యాపించే అవకాశాలెక్కువ. పైగా అవి స్వతహాగా ఆహారం సంపాదించుకోవాలన్న గుణాన్ని మార్చుకుని, ఆహారం పెట్టనపుడు దాడులకు దిగుతాయి. పైగా కోతుల్లో టీబీ లక్షణాలు ఎక్కువ. అవి మనుషులకు సోకే ప్రమాదం ఉంది’. అడవుల్లోకి తిరిగి వెళ్లేలా చేయాలి సమన్వయ చర్యలతో కోతులకు ఫీడింగ్ కంట్రోల్ చేయాలి. అవి తమంతట తామే అడవుల్లోకి తిరిగెళ్లేలా చూడాలి. ఇందుకు ప్రభుత్వ పరంగా చర్యలు చేపడుతున్నాం. మంకీ ఫుడ్కోర్టుల ఏర్పాటు ద్వారా కోతులకు పండ్లు అం దుబాటులోకి వచ్చేలా చూస్తున్నాం. ప్రస్తుతం అడవుల్లో వాటికి పండ్లు,ఫలాలు దొరకట్లేదు. కోతుల జనాభా నియంత్రణకు ఆపరేషన్ల ద్వారా అడ్డుకట్ట వేసేందుకు నిర్మల్లో సంతాన నిరోధక కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. – వైల్డ్లైఫ్ ఓఎస్డీ శంకరన్ -
లాక్డౌన్: మాకు చాన్సొచ్చింది
పులి గాండ్రిస్తుంది. సింహం గర్జిస్తుంది. ఏనుగు ఘీంకరిస్తుంది. మనిషి? మనిషి.. ‘హారన్’ కొడతాడు! గాండ్రించే పులి కూడా గర్జించే సింహం కూడా ఘీంకరించే ఏనుగు కూడా ‘హారన్’కు అదిరిపడతాయి. లాక్డౌన్తో ఇప్పుడు హారన్ సౌండ్ లేదు. వన్యప్రాణులకు పీస్ ఆఫ్ మైండ్! మనిషి ‘లోపల’ ఉన్నాడు కదా. ఇప్పుడు వాటికి చాన్సొచ్చింది. లోపల్నుంచి బయటికొస్తున్నాయి! జలంధర్ నుంచి కనిపిస్తున్న ధౌలాధర్ కొండలు ఒక్క జంతువులు, పక్షులేనా! నింగి నాట్యమాడుతోంది. నేల విహంగమౌతోంది. చంద్రుడు తెల్లటి గడ్డ పెరుగు. సూర్యుడు మరికొన్ని ఎల్యీడీల వెలుగు. అద్దం తుడిచినట్లు నదులు. కడిగి బోర్లించిన గిన్నెల్లా కనుచూపు కొండలు. బాగుంది కవిత్వం. బ్యాంకుల్లో డబ్బులేవి? బియ్యం డబ్బాల్లో నిల్వలేవి? ఆఫీస్లలో కొలువులేవి? వేసవికి సెలవులేవి? కరువు, కవిత్వం ఎప్పుడూ ఉండేవే. లౌక్డౌన్కు ముందు మాత్రం.. జీవితంలో అది లేదని, ఇది లేదని నోరు చప్పరించలేదా? ఇన్నాళ్లూ ప్రకృతిని బోనులో ఉంచి మనం విహరించాం. ఈ కొన్నాళ్ల బందిఖానా నుంచి ప్రకృతి వింతలను వినోదిద్దాం. పునుగుపిల్లి, కోళికోడ్ మార్చి 25 అర్ధరాత్రి నుంచి మన దగ్గర లాక్డౌన్ మొదలైంది. దేశానికి 1947లో అర్ధరాత్రి స్వాతంత్య్రం వచ్చినట్లే.. నేచర్కీ ఇది అర్ధరాత్రి స్వతంత్రం! పది రోజులు గడిచాయి. స్వాతంత్య్రం ఎంత స్వేచ్ఛను ఇస్తుందో ఒక్కో ప్రాణీ మనకు చూపించడం మొదలైంది. ఉత్తరాఖండ్లో మూడు సంబార్ జాతి జింకలు వీధిల్లోకి వచ్చాయి. తప్పిపోయినట్లు రాలేదు. తాపీగా రొడ్డెక్కాయి. నోయిడాలో నీలంరంగు ఎద్దు (నీల్గాయ్) తోకను ఆడించుకుంటూ, చేతులు వెనక్కు పెట్టుకుని నెమ్మదిగా.. ‘దారంతా నాదే’ అని నడుస్తున్న మనిషిలా తిరిగింది. డెహ్రాడూన్లో గజరాజు షికారు కొట్టింది. కోళికోడ్లో చిన్న పునుగుపిల్లి.. ‘ఏమైపోయారు ఈ మనుషులంతా..’ అనో ఏమో.. వెనక్కు చూసుకుంటూ ముందుకు వెళ్లింది. ఆలివ్ ‘రిడ్లే’ తాబేళ్లు ఒడిశా బీచ్ అలలపై జారుడుబండ ఆడాయి! కర్ణాటకలో ఒక అడవి దున్న మార్కెట్లోకి వచ్చింది. ముంబై వీధుల్లో నెమళ్లు నాట్యమాడాయి. పాట్నా దగ్గరి వైమానిక స్థావరంలో చిరుత ఒకటి తిండి మాని మరీ ఆటలు ఆడింది. తిరుపతి ఘాట్రోడ్లలో లేళ్లు గంతులేశాయి. ఏటూరు నాగారంలో ఎలుగుబంట్లు అభయారణ్యం నుంచి కంచె దాకా వచ్చి ‘వాటీజ్ హ్యాపెనింగ్! డప్పుల్లేని లోకంలోకి వచ్చిపడ్డామా’ అని జిల్లా పారెస్టు ఆఫీసర్ల వైపు చూశాయి. సంబార్ జింకలు, ఉత్తరాఖండ్ లాక్డౌన్తో బయటికి వస్తున్న వాటిలో కొన్ని అరుదైన జీవులు. కొన్ని అంతరించిపోతున్న జీవులు. సంబార్ జాతి జింకలు బలంగా ఉంటాయి. సంఖ్యలో మాత్రం బలహీనం. ‘రెడ్ లిస్ట్’లో ఉన్నాయి. పులుగులు, ఎలుగులు, రిడ్లే తాబేళ్లు కదలికలు ఉండేవీ కానీ అస్తమానం కనిపించేవి కావు. అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, పోలండ్, ఇంగ్లండ్లోనూ అడవుల నుంచి జంతువులు బయటికి వస్తున్నా.. ఇంత పెద్ద దేశంలోని నూటా ముప్పై కోట్ల జనాభా ఒక్కసారిగా ఇళ్లలోనే లాక్ అయిపోవడంతో, మన మూగజీవులకు పెద్ద బ్లాక్ తొలగిపోయింది. ఎం.ఎస్.రామారావు గారు పాడినట్లు.. ‘ఈ విశాల, ప్రశాంత, ఏకాంత..’ లాక్డౌన్లో మనుషులు నిదురిస్తుంటే.. జంతు ప్రపంచం ఒళ్లు విరుచుకుని లేస్తోంది. నీల్గాయ్, నోయిడా జలంధర్లో ఈమధ్య ఉదయాన్నే నిద్రలేచి బాల్కనీలోకి వచ్చినవాళ్లు దూరంగా కనిపిస్తున్న ధౌలాధర్ కొండల్ని చూసి షాక్ తిన్నారు. రాత్రికి రాత్రి ఇంటి ముందుకు కొండ వచ్చేస్తే అలాగే ఉంటుంది మరి. గత ముప్పై ఏళ్లుగా పరిశ్రమల కాలుష్యంలో మసకబారి క్రమంగా అదృశ్యం అయిపోయిన ఆ కొండలు ఈ లాక్డౌన్లో క్లీన్ అయి కళ్లముందుకు వచ్చాయి. దేశంలో ఇంకా చాలా కాలుష్యాలు తగ్గిపోయాయి. ఢిల్లీ, మిగతా మెట్రో నగరాలు వానొచ్చి కడిగేసినట్లుగా అయ్యాయి. బెంగళూరులో ప్రాణవాయువు నాణ్యత పెరిగింది. గంగా యమునా నదీ జలాలు తేటపడ్డాయి. ‘ఆశ్చర్యం’ అంటున్నారు డాక్టర్ పి.కె.మిశ్రా. వారణాసిలోని ఐఐటిలో కెమికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ ఆయన. ‘యమున’ గురించైతే ‘అన్బిలీవబుల్.. బట్ ట్రూ’ అంటుంటోంది కేంద్ర ‘జలశక్తి’ మంత్రిత్వశాఖ. పరిశమ్రలు, కర్మక్రియలు ఆగిపోయి నదులు ప్రక్షాళన అయ్యాయి. అంతా మన మంచికే అనుకోవడం నిర్వేదం కాదు, జీవనవేదం కాదు. వాస్తవం. పరుగుల జీవితంలోని ఈ తాత్కాలిక విరామంలో మన ఇళ్లూ, ఒళ్లు కూడా శుభ్రం అవుతున్నాయి. అవనిద్దాం. అవని చోటును అవనికే ఉంచేద్దాం. తేటపడిన ‘యమున’ : వజీరాబాద్ బ్యారేజ్, నార్త్ ఢిల్లీ -
లాక్డౌన్: 128 ఏళ్లనాటి వాతావరణం..!
సాక్షి, తిరుమల: నిత్యం భక్తుల గోవింద నామాలతో మారుమోగే తిరుమలగిరుల్లో లాక్డౌన్తో రెండు వారాలుగా నిశ్శబ్ద వాతావరణం నెలకొనడంతో వన్యమృగాలు జన సంచారంలోకి వచ్చేస్తున్నాయి. మనుషుల అలికిడి లేకపోవడంతో శేషాచల అడవుల్లోని జంతువులు తిరుమల వీధుల్లోకి వచ్చి స్థానికులను, ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న కల్యాణ వేదిక, శ్రీవారి సేవ సదన్ వద్ద చిరుత, ఎలుగు బంట్లు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. మ్యూజియం వెనుక భాగంలో ఉన్న అటవీ ప్రాంతంలో రేసు కుక్కలు దుప్పిలపై దాడికి దిగిన ఘటనలతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. స్థానికులు నివాసం ఉంటున్న బాలాజీ నగర్, ఈస్ట్ బాలాజీ నగర్లలో సైతం చిరుతలు, అడవి పందులు, దుప్పి, పాముల సంచారం అధికంగా ఉంటోంది. ఇక పాపవినాశనం మార్గంలో గజరాజుల గుంపు సంచరిస్తోంది. ఘాట్ రోడ్డులో అధికం.. ముఖ్యంగా రెండు ఘాట్ రోడ్లలో చిరుతల సంచారం పెరిగింది. నాలుగు రోజుల క్రితం రెండు ఘాట్ రోడ్లను అనుసంధానం చేసే లింక్ రోడ్డులో చిరుత కనపడింది. దీంతో అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది భయభ్రాంతులకు గురి అయ్యారు. మొదటి ఘాట్ రోడ్డుపై జింకలు, కణితి, దుప్పిలు సైతం గంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. వన్య మృగాలు జనావాసంలోకి వస్తుండడంతో సాయంత్రం తరువాత బయట తిరగరాదని టీటీడీ, పోలీసు అధికారులు స్థానికులకు గట్టి ఆంక్షలు విధించారు. 128 ఏళ్లనాటి వాతావరణం..! 1900 తర్వాత నుంచి తిరుమలకు భక్తుల రాక క్రమంగా పెరుగుతూ రావడంతో వన్యమృగాలు జనసంచారంలోకి రావడంతో క్రమంగా తగ్గిపోతూ వచ్చింది. ఇప్పుడు ఏకంగా రెండు వారాలుగా ఆలయం మూత, ఘాట్రోడ్లపై రాకపోకల నిషేధంతో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. దీంతో వన్యమృగాలు స్వేచ్ఛగా తిరుమల వీధుల్లోకి ఘాట్ రోడ్లపైకి వచ్చేశాయి. 128 ఏళ్ల క్రితం మాత్రం ఒకసారి రెండు రోజుల పాటు గుడి మూతపడిన సమయంలో ఇలాంటి పరిస్థితి కనిపించింది. అప్పట్లో ఆలయం చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం కావడం, శ్రీవారి ఆలయం మాత్రమే తిరుమలలో ఉండడంతో ఉదయం తిరుపతి నుంచి గుర్రాలపై అర్చకులు తిరుమలకు చేరుకునేవారు. సంధ్యా సమయం మొదలు కాకముందే తిరుపతికి తిరుగు ప్రయాణం అయ్యేవారు. ఇప్పుడు మళ్లీ అలాంటి వాతావరణం కనిపిస్తోంది. -
యాంకర్ ఇంటిగేటుకు జంతువుల కళేబరాలు
లండన్ : వన్యప్రాణుల సంరక్షణ కోసం పాటు పడుతున్న ఓ బీబీసీ యాంకర్ మీద కొందరు దుండగులు కక్ష గట్టారు. అతడ్ని భయపెట్టడానికి చనిపోయిన జంతువుల కళేబరాలను ఇంటి గేటుకు వేలాడదీస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్ హాంప్షేర్లోని మార్చ్వుడ్కు చెందిన ప్రముఖ బీబీసీ యాంకర్ క్రిష్ పాక్హామ్ వన్యప్రాణుల సంరక్షణ కోసం గత కొన్ని సంవత్సరాలుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పాక్హామ్ చేస్తున్న ప్రచారం నచ్చని కొందరు అతడిపై కక్ష కట్టారు. బాడ్జర్ కలేబరంతో పాక్హామ్ చనిపోయిన అడవి జంతువుల కళేబరాలను అతడి ఇంటి గేటుకు వేలాడ దీయటం ప్రారంభించారు. కొద్దిరోజుల క్రితం చనిపోయిన రెండు కాకుల మెడకు తాడుకట్టి వాటిని అతడి ఇంటి గేటుకు వేలాడదీశారు. ఆ తర్వాత ఓ చనిపోయిన నక్కను ఇంటి ఆవరణలో పడేశారు. గత గురువారం అర్థరాత్రి కూడా ప్రమాదంలో చనిపోయిన ఓ ఆడ బాడ్జర్ను( జంతువు) అతడి ఇంటి గేటు మధ్యలో వేలాడదీశారు. ఆ రాత్రి ఇంటికి వచ్చిన అతడు గేటుకు వేలాడదీసి ఉన్న బాడ్జర్ కళేబరాన్ని చూసి ఆవేదన వ్యక్తం చేశాడు. గేటుకు వేలాడుతున్న కాకులు అతడికి ఏడుపు తెప్పించిన మరో విషయం ఏంటంటే ఆ బాడ్జర్ ఇదివరకే ప్రసవించింది. పిల్లల తల్లిని వేలాడదీసిన క్రూరులపై అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాక్హామ్ మాట్లాడుతూ.. ‘‘ నేనిది తట్టుకోలేకపోతున్నాను. ఈ సంఘటననుంచి త్వరగా కోలుకుంటానని అనుకుంటున్నా. వీటికంతా నేను భయపడేది లేదు. చాలా స్పష్టంగా చెప్పాను ఇలాంటి చెత్తపనులు చేసి నన్ను మీరు ఆపలేరని. చుట్టుప్రక్కలవారే ఈ పనిచేస్తున్నారని అర్థమవుతోంది. వాళ్లకు తెలుసు నేనెక్కడ ఉంటానో. ఎట్టిపరిస్థితుల్లోనూ నేను చేసేపనిని ఆపను. ఎందుకంటే నేను చేస్తున్న పని మంచిదని నాకు తెలుస’ని అన్నారు. -
మూఢ నమ్మకాలు..వన్యప్రాణుల అమ్మకాలు
సాక్షి, హైదరాబాద్: అరుదైన వన్యప్రాణులను ఈశాన్య రాష్ట్రాల నుంచి తీసుకువచ్చి పాతబస్తీ కేంద్రంగా అక్రమంగా విక్రయిస్తున్న ఇద్దరు అన్నదమ్ముల గుట్టును దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. నిందితుడి నుంచి 4 స్లోలోరిస్లతో పాటు నక్షత్ర తాబేలు, మరో అరుదైన తాబేలును స్వాధీనం చేసుకున్నామని అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మి ఆదివారం వెల్లడించారు. కేసును అధీనంలోకి తీసుకున్న అటవీ శాఖ అధికారులు వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. పాతబస్తీలోని బార్కస్కు చెందిన అన్నదమ్ములు సాలెహ్ బిన్ మహ్మద్ బదామ్, అలీ బిన్ మహ్మద్ బదామ్ మందుల షాపు నిర్వహిస్తున్నారు. ఈ ఆదాయం చాలకపోవడంతో అదనపు రాబడి మార్గాలు అన్వేషించారు. ఏడాది క్రితం పావురాల అమ్మకం మొదలెట్టారు. ఆపై కొన్ని రకాలైన పిల్లులు, కోళ్లను విక్రయించేవారు. వీరి వద్దకు వచ్చే కస్టమర్లలో అనేకులు అరుదైన జంతువులు కావాలని కోరడంతో వీరి దృష్టి వాటిపై పడింది. ఈశాన్య రాష్ట్రాల నుంచి తెచ్చి.. కొందరు కస్టమర్లలో ఉన్న మూఢనమ్మకాల నేపథ్యంలో కొన్ని అరుదైన జంతువులకు నగరంలో డిమాండ్ ఉందని అలీ బిన్ గుర్తించాడు. ఈశాన్య రాష్ట్రాల్లో దొరికే వాటిని అక్రమ మార్గంలో తెచ్చి విక్రయించడం ద్వారా తేలిగ్గా భారీ మొత్తం సంపాదించవచ్చని అన్నదమ్ములు పథకం వేశారు. అలీ బిన్ ఈశాన్య రాష్ట్రాల్లో జంతువులను స్మగ్లింగ్ చేసే వారిని సంప్రదించాడు. వారి సహకారం తో ప్రైవేట్ వాహ నాల్లో వాటిని సిటీకి తీసుకు వస్తున్నాడు. వీటిని కొన్నాళ్ల పాటు తమ ‘కబూతర్ ఖానా’లోనే ఉంచి ఆపై కోరిన వారికి మూడు రెట్ల ధరకు అమ్ముతున్నారు. వీరి దందాపై సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలో సిబ్బంది నిందితుల ఇంటిపై దాడి చేశారు. సాలెహ్ బిన్ను అదుపులోకి తీసుకుని నాలుగు స్లో లోరిస్లు, స్టార్ తాబేలు, డొప్ప తాబేలును స్వాధీ నం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం జంతువులతో సహా నిందితుడిని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. పరారీలో ఉన్న అలీ బిన్ చిక్కితే ఈ కేసులో కీలకాంశాలు వెలుగులోకి రావచ్చు. స్లో లోరిస్.. రూ.50 వేలు లోరిస్కు చెందిన కొన్ని అవయవాలను సంప్రదాయ వైద్యంలో ఔషధాల తయారీకి వాడుతున్నారు. దీని మాంసం తింటే పటుత్వం పెరుగుతుందని, సజీవంగా తమ ప్రాంగణంలో పాతి పెడితే అదృష్టం పడుతుందనే మూఢనమ్మకాలున్నాయి. ►క్షీరదాల జాతికి చెందిన స్లో లోరిస్ జంతువు నిశాచరి. నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్లో కూడా ఇది లేదు. ఇవి ఈశాన్య రాష్ట్రాలతోపాటు బంగ్లాదేశ్, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్లో ఉంటాయి. ►శాకాహారి అయిన స్లో లోరిస్ చెట్లపై నివసిస్తూ బొప్పాయి సహా కొన్ని రకాలైన పళ్లను తింటుంది. దీనికి ఆహారం నిమిత్తం రోజుకు రూ.300 వరకు వెచ్చిస్తున్నారు. ►దీనిని రూ.15 వేలకు ఖరీదు చేసి రూ.50 వేలకు అలీ సోదరులు విక్రయిస్తున్నారు. నక్షత్ర తాబేలు రూ.40 వేలు.. స్టార్ టార్టాయిస్ ఇంట్లో ఉంచుకున్నా, పెంచుకున్నా భవిష్యత్తు బాగుంటుందని, అదృష్టం వరిస్తుందనే నమ్మకం ఉంది. మెత్తడి డొప్ప తాబేలు ఇంట్లో ఉంటే అదృష్టం వరిస్తుందని నమ్మకం పలువురిలో ఉంది. ►స్టార్ టార్టాయిస్గా పిలిచే నక్షత్ర తాబేళ్లు పొడి ప్రాంతాలు, కొన్ని అడవుల్లో జీవిస్తుంటాయి. ఇవి భారీ సంఖ్యలో విదేశాలకు స్మగ్లింగ్ అవుతుంటాయి. ►సుదీర్ఘ సమయం నీటి అడుగున ఉండగలిగే మెత్తడి డొప్ప తాబేలు దేశంలోని గంగ, సింధు, మహానదుల్లో మాత్రమే దొరుకుతుంది. ►నక్షత్ర తాబేళ్లను రూ.10 వేలకు కొని.. రూ.40 వేలకు, మెత్తని డొప్పతో ఉండే తాబేళ్లను రూ.5 వేలకు ఖరీదు చేసి రూ.20 వేలకు విక్రయిస్తున్నారు. -
గజరాజులకు పునరావాసం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్ర సరిహద్దుల్లో ఏనుగుల సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. విజయనగరం జిల్లాలో ఆ మేరకు అవసరమైన స్థలాలను అధికారులు అన్వేషిస్తున్నారు. 1,315 ఎకరాల్లో ఎలిఫెంట్ శాంక్చ్యురీని పెట్టి రెండు జిల్లాల్లో సంచరిస్తున్న 10 ఏనుగులకు ఆవాసం కల్పించాలని భావిస్తున్నారు. గజరాజుల సంరక్షణతోపాటు, వాటి దాడినుంచి ప్రజలు, పంటలను రక్షించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఎలిఫెంట్ జోన్లు ఏర్పాటుచేసి ఏనుగులకు అవసరమైన ఆహారం, తాగునీటి సౌకర్యాలు కల్పించాలనే ప్రతిపాదనలు చాలా కాలంగా ఉన్నాయి. అయితే అడవినే నమ్ముకుని బతుకుతున్న గిరిజనులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. గిరిజనుల భయాందోళనలను దృష్టిలో పెట్టుకుని శాశ్వత ప్రాతిపదికన ఎలిఫెంట్ జోన్ ఏర్పాటు చేసే అంశాన్ని పక్కనపెట్టి ఏనుగుల పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాలూరు అటవీ రేంజ్ పరిధిలోని జంతికొండ ప్రాంతాన్ని దీనికోసం ఎంపిక చేశారు. సరిహద్దులో ఏనుగులు–ఆందోళనలో ప్రజలు ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లో ఏనుగులు ఏడాది కాలంగా తిష్టవేశాయి. విజయనగరం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం, జియ్మమ్మవలస, కురుపాం, సాలూరు గిరిజన ప్రాంతాల్లోకి గతేడాది సెప్టెంబర్ 7వ తేదీన ప్రవేశించాయి. కొండ చరియల ప్రాంతంలో నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పటికీ గిరిజనులు ఎంతో కష్టపడి పంటలను సాగుచేస్తున్నారు. ఆ సమయంలో ఏనుగులు దాడిచేయగా 1,368 ఎకరాల్లో వరి, చెరకు, అరటి, టమాట పంటలు దెబ్బతిన్నాయి. 1,138 మంది రైతులు రూ.89.50 లక్షల పంటను నష్టపోయారు. ఇద్దరు చనిపోయారు. రెండు ఏనుగులు కూడా చనిపోయాయి. 2007 సంవత్సరంలో కూడా ఏనుగులు జిల్లాలో ప్రవేశించి ఆస్తి, ప్రాణనష్టం కలిగించాయి. అప్పట్లో జియ్యమ్మవలస మండలానికి చెందిన ముగ్గురిని పొట్టన పెట్టుకున్నాయి. ఒక ఏనుగును చంపేశారు. ఏనుగుల సంచారంతో విజయనగరం జిల్లాతో పాటు శ్రీకాకుళం జిల్లా, ఒడిశా రాష్ట్ర ప్రజలు కూడా భయంతో బతుకుతున్నారు. గతంతో ఏనుగులు విరుచుకుపడినప్పుడు ఆపరేషన్ జయంతి, అపరేషన్ గజ పేరుతో నాలుగు ఏనుగులను బంధించి ఒడిశా రాష్ట్రంలోని లఖేరీ అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. అందులో ఒక ఏనుగు మరణించడంతో జంతు సంరక్షణ కమిటీ అభ్యంతరం తెలిపింది. దాంతో ఆ ఆపరేషన్ ఆగిపోయింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పునరావాస కేంద్రం ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. వన్యప్రాణుల సంరక్షణకు కూడా... రాష్ట్రంలో మొత్తం 13 అభయారణ్యాలు ఉన్నాయి. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్ట్ ఏరియాలో పులుల అభయారణ్యం ఉంది. వాటిలో 55 వరకూ పులులు ఉన్నాయి. 40 ఏళ్ల క్రితం శేషాచలం అడవులు...అంటే తిరుపతి దిగువన ఉన్న ప్రాంతాల్లో పులులు ఉండేవి. ఈ ఏడాది మార్చిలో అక్కడ పులుల జాడ కనిపించింది. రానున్న మూడేళ్లలో వన్యప్రాణుల కోసం నీటి కుంటలు, చెరువులు సైంటిఫిక్గా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. వన్యప్రాణులు నీరు, ఆహారం కోసం అడవులు దాటి, ప్రజల ఆవాసాలపైకి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రతి 5 చదరపు కిలోమీటర్లకు చెరువులు/కుంటలు ఏర్పాటు చేయనున్నారు. ఏడాదంతా నీరు ఉండేందుకు సోలార్ పంప్ సెట్లను కూడా ఏర్పాటు చేస్తారు. త్వరలోనే పునరావాసం ఏనుగుల పునరావాస కేంద్రాన్ని 1,315 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ ప్రాంతం చుట్టూ ఏనుగుల సంచారానికి, నివాసానికి అనుకూల పరిస్థితులు కల్పిస్తాం. అవి బయటకు రాకుండా తగిన రక్షణ ఏర్పాట్లు చేస్తాం. ఆహారం, నీటి సౌకర్యాలు అందుబాటులో ఉంచుతాం. –లక్ష్మణ్, డీఎఫ్ఓ (టెరిటోరియల్), విజయనగరం. -
పట్టుబడిన అడవి జంతువుల వేటగాళ్లు
వైఎస్ఆర్ జిల్లా , అట్లూరు: అడవి జంతువులను వేటాడి, భక్షించే వ్యక్తులను సిద్దవటం రేంజ్ అధికారులు సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. లంకమల్లేశ్వర అభయారణ్యం కొండూరు బీటు పరిధిలో అటవీ జంతువులను వేటాడుతున్న ఐదుగురు వేటగాళ్లను అరెస్టు చేసి, వారి నుంచి వలలు, రెండు ద్విచక్రవాహనాలు, ఒక కొండకోడిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారు బద్వేలు పట్టణం రిక్షాకాలనీకి చెందినవారిగా సమాచారం. గతంలో వీరు పలు దొంగతనాలకు పాల్పడినట్లు తెలిసింది. అట్లూరు మండలంలోని దేవనగర్ దగ్గర పొట్టేళ్లను కూడా ఎత్తుకెళ్లిన కేసులో పోలీసులు వీరికోసం గాలిస్తున్నట్లు తెలిసింది. అయితే అటవీ అధికారుల అదుపులో ఉన్న వేటగాళ్లను ఈ కోణంలో విచారించినట్లు తెలిసింది. పట్టుబడిన వారిని నేడో, రేపో కోర్టులో హాజరు పరచనున్నట్లు సమాచారం. అయితే వేటగాళ్లు వాడుతున్న ద్విచక్రవాహనాలు దొంగిలించినవా? లేక సొంత వాహనాలా ? అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. దీనిపై సిద్దవటం రేంజ్ అధికారి ప్రసాద్ను ‘సాక్షి’వివరణ కోరగా వేటగాళ్లు పట్టుబడిన విషయం వాస్తవమేనని తెలిపారు. విచారణ చేస్తున్నామని పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలపారు. -
నిప్పుల కొలిమి
కర్నూలు(అగ్రికల్చర్): సూరీడు ప్రతాపం చూపుతున్నాడు. రోజురోజుకూ ‘సెగ’ పెంచుతున్నాడు. వాతావరణాన్ని నిప్పుల కొలిమిలా మార్చేస్తున్నాడు. దీంతో జనం బయట అడుగు పెట్టలేని పరిస్థితి. ఇంట్లో ఉన్నా ఉక్కపోతతోఉక్కిరిబిక్కిరి కావాల్సి వస్తోంది. రెక్కాడితే గానీ డొక్కాడని కష్టజీవుల పరిస్థితి దయనీయంగా మారింది. వడదెబ్బకు గురై మృత్యువాత పడుతున్నారు. పశుపక్ష్యాదుల పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. ఎండల తీవ్రతకు తోడు ఎక్కడా నీళ్లు దొరక్క, ఆహారం సైతంభారమై నేలరాలుతున్నాయి. నెమళ్లు వంటి పెద్ద పక్షులు సైతం మృత్యువాత పడుతుండడం ఆందోళన కల్గించే విషయం. వేసవి తీవ్రత పెరుగుతున్నా కనీస ఉపశమన చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలమవుతున్నారు. చలివేంద్రాలు భారీగా ఏర్పాటు చేసినట్లు కాగితాల్లో చూపుతున్నా..క్షేత్రస్థాయిలో మాత్రం కన్పించడం లేదు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గత ఏడాది ఇదే సమయంలో ఉష్ణోగ్రతలు 41 నుంచి 42 డిగ్రీల వరకు ఉండేవి. కానీ ఈ సారి 43 నుంచి 44 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. దీన్నిబట్టే వేసవి తీవ్రత ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. ఆదివారం ఉయ్యాలవాడ, సంజామల మండలాల్లో గరిష్టంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే కర్నూలు, దొర్నిపాడు, రుద్రవరం, మంత్రాలయం, బనగానపల్లె, నంద్యాల, కొలిమిగుండ్లలో 43 డిగ్రీలు, దేవనకొండ, తుగ్గలిలో 42 డిగ్రీలు, మహానందిలో 40 డిగ్రీల ప్రకారం నమోదు కావడంతో జనం అల్లాడిపోయారు. రాత్రి ఉష్ణోగ్రతలు సైతం 29 డిగ్రీలు ఉంటున్నాయి. వడదెబ్బ మరణాలు కావట! బతుకు దెరువు కోసం పనులకు వెళుతున్న కూలీలు వడదెబ్బకు గురవుతున్నారు. ఇప్పటి వరకు వడదెబ్బ కారణంగా జిల్లా వ్యాప్తంగా దాదాపు 25 మంది మరణించారు. ఈ ఒక్క నెలలోనే ఐదుగురు ‘ఉపాధి’ కూలీలు చనిపోయారు. అయితే వీటిని వడదెబ్బ మరణాలుగా గుర్తించడం లేదు. వివిధ కారణాల వల్ల మరణించారంటూ కలెక్టరేట్కు తప్పుడు రిపోర్టులు వస్తున్నాయి. అధికారికంగా ఇంతవరకు ఒక్క వడదెబ్బ మరణాన్ని కూడా ప్రకటించలేదు. ఉపశమన చర్యలేవీ? వేసవి ఉష్ణోగ్రతల నుంచి ప్రజలకు తక్షణం ఉపశమనంకల్పించే చర్యలు ఈ సారి నామమాత్రమయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే 20 శాతం కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారిక లెక్కలు మాత్రం మరోలా ఉన్నాయి. జిల్లాలో దాదాపు 5,500 చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చూపుతున్నారు. ఇప్పటిదాకా ఏర్పాటు చేసిన చలివేంద్రాల్లోనూ అత్యధికం స్వచ్ఛంద సంస్థలకు చెందినవే. ఉపాధి పనులు జరిగే ప్రదేశాల్లో నీడ కల్పించడంతో పాటు తాగునీటి సదుపాయం ఏర్పాటు చేయాల్సి ఉన్నా అధికారులు ఏమాత్రమూ పట్టించుకోవడం లేదు. ఎండ తీవ్రతకు నెమలి మృతి డోన్ : మండల పరిధిలోని రేకులకుంట గ్రామ శివారులో శనివారం ఎండవేడిమి కారణంగా అస్వస్థతకు గురైన నెమలి మృత్యువాత పడింది. వేసవి నేపథ్యంలో ఎండలు అధికంగా ఉండడం, పరిసరాల్లో నీరు లేకపోవడంతో దాహార్తి తీర్చుకునేందుకు జనావాసాల్లోకి వచ్చిన నెమలి అస్వస్థతకు గురైంది. స్థానికులు సపర్యలు చేసి అటవీ అధికారులకు అప్పగించారు. కొద్దిసేపటి తర్వాత అది మృతి చెందింది. ఫారెస్టు రేంజర్ నాసిర్జా ఆధ్వర్యంలో నెమలికి స్థానిక పశువైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టారు. వైద్యం కోసం వచ్చి... ఆళ్లగడ్డ టౌన్: మండలంలోని బాచేపల్లికి చెందిన నరసింహుడు (33) వడదెబ్బకు గురై చనిపోయాడు. ఇతను ఆదివారం వైద్యం కోసం ఆళ్లగడ్డ వైద్యశాలకు వచ్చాడు. తిరిగి వెళ్లే క్రమంలో ఎండ తీవ్రత కారణంగా అస్వస్థతకు గురై ఆర్టీసీ బస్టాండు ఆవరణలో మృతి చెందాడు. పట్టణ పోలీసులు మృతుడి బంధువులకు సమాచారం ఇవ్వడంతో వారు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. -
వన్యప్రాణులు విలవిల..!
జిల్లాలో ఉన్న అభయారణ్యాలలో వన్యప్రాణులు నీటి కోసం అలమటిస్తున్నాయి. చుక్కనీరు లభించికదాహంతో తట్టుకోలేక జనారణ్యంలోకి పరుగులు తీస్తున్నాయి. అటవీ ప్రాంతంలో నీటి కుంటలుఎండిపోయాయి. భగభగ మండే ఎండలకు దాహంతో అలమటిస్తున్నాయి. అటవీ శాఖ అధికారులుప్రత్నామ్నాయ చర్యలు తీసుకొని ట్రాక్టర్ల ద్వారా సాసర్ పిట్లలోకి నీరు నింపుతున్నారు. వైఎస్ఆర్ జిల్లా, రాజంపేట : జలకళతో ఉట్టిపడాల్సిన శేషాచలం, లంకమల అభయారణ్యం, పెనుశిల అభయార ణ్యాలలో ఈ యేడాది మాత్రం పరిస్థితి భిన్నంగా మారింది. వర్షాకాలం సీజన్తో అటవీ ప్రాంతంలో జలపాతాలు, నీటి కుంటలు, చెక్డ్యాంలు, సాసర్పిట్లలో నీళ్లు సమృద్ధిగా ఉండటం సహజం. వర్షాకాలంలో వర్షాలు సక్రమంగా కురవలేదు. ప్రకృతి ప్రకోపంతో కరువు తెచ్చిపెట్టింది. అటవీ ప్రాంతంలో వన్యప్రాణులకు దాహార్తిని తీర్చే వనరులు వట్టిపోయాయి. జిల్లాలో రాజంపేట, కడప, ప్రొద్దుటూరు ఫారెస్టు డివిజన్లు ఉన్నాయి. ప్రధానంగా శేషాచలం, లంకమల, పెనుశిల, నల్లమల అభయారణ్యాలున్నాయి. మండుటెండలకు అల్లాడుతూ... అటవీ ప్రాంతంలో మండుటెండలకు వన్య ప్రాణులు అల్లాడిపోతున్నాయి. చుక్క నీరు లేక వన్యప్రాణులు గ్రామాలవైపు పరుగులు పెడుతున్నాయి. అటవీ ప్రాంతంలో జింకలు, దుప్పిలు, కొండ గొర్రెలు, అడవి బర్రెలు, అడవిపందులు, నెమళ్లు, చిరుతలు, పెద్దపులి, హనిబాడ్జర్,మనుబోతు, కణుజు, రోషకుక్కలు, తోడేళ్లు, నక్కలు, ఎలుగుబంట్లుతోపాటు ఇతర జంతువులు, పక్షలు నీటి కోసం జననివాసాల్లోకి వస్తున్నాయి. వీటికి అవి సంచరించే ప్రాంతంలో దాహార్తిని తీర్చుకునేందుకు అవసరమైన పరిస్థితులు లేకపోవడంతోనే అవి అడవి దాటుతున్నాయి. రాత్రుల్లో నీటికోసం.. అటవీ ప్రాంతంలో ఉన్న వన్య ప్రాణులు పగలుకన్నా..రాత్రుల్లోనే నీటికోసం అటవీ గ్రామాల శివారుల్లోకి వచ్చేస్తున్నాయి. రాత్రి వేళలో తోటల్లోకి వచ్చి నీటి కోసం పరుగులు తీయడం కనిపిస్తోందని ప్రత్యక్షంగా చూసిన రైతులు అంటున్నారు. వీటి వల్ల తోటలకు ఎటువంటి హానీ ఉండదని, ఏనుగులతో హానీ ఉంటుందని చెప్పుతున్నారు. తెల్లవారుజాము వరకు మైదాన ప్రాంతంలోనే దాహార్తీ తీర్చుకొని సేదతీరుతుంటాయి. గుక్కెడ నీటì కోసం నీటి చలమలను వెతుకొంటూ వస్తున్నాయి. వన్యప్రాణుల దాహార్తికి ప్రత్యామ్నాయ చర్యలు శేషాచలం,పెనుశిల అభయారణ్యం, లంకామల్ల అభయారణ్యాలు ఉన్నాయి.ఈ అభయారణ్యాలలో ఉన్న వన్యప్రాణులకు దాహార్తిని తీర్చేందుకు ప్రత్యామ్నాయ చర్యలను అటవీశాఖ చేపట్టింది. అటవీ ప్రాంతంలో ఏర్పాటుచేసిన సాసర్పిట్స్లో ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నారు. అలాగే రాజంపేట డివిజన్ మొబైల్ సాసర్పిట్స్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అభయారణ్యాలలో దట్టమైన ప్రాంతంలోని అక్కడక్క చిన్నపాటి కొలనులో నీరు ఉన్నట్లుగా చెప్పుతున్న ఇప్పుడు అవి ఆవిరికావడంతో వన్యప్రాణాలు జనారణ్యంలోకి వస్తున్నాయనే వాదన వినిపిస్తోంది. డివిజన్లు : 3 అభయారణ్యాలు : 4 సాసర్పిట్లో నీరు నింపుతున్నాం సాసర్పిట్లలో ట్రాక్టర్ల ద్వారా నీటిని నింపుతున్నాము. వన్యప్రాణులు దా హార్తి తీర్చేందుకు అవసరమైన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకోవడం జరుగుతోంది. అంతేగాకుండా రాజంపేట ఫారెస్టు డివిజన్ పరిధిలో తాత్కలిక సాసర్పిట్స్ను అందుబాటులోకి తీసుకొచ్చాం. – ఖాదర్వల్లి, డీఎఫ్ఓ, రాజంపేట -
అయ్యో ! పాపం
కన్నడనాట అడవులను కార్చిచ్చు దహించి వేస్తోంది. అరుదైన వన్యజీవులు, వృక్ష సంపద కాలి బూడిదవుతోంది. రెండు రోజులుగా తగలబడుతున్న బండీపుర జాతీయ ఉద్యానవనంలో చెలరేగిన కార్చిచ్చు ఇప్పట్లో చల్లారేలా లేదు. కర్ణాటక, మైసూరు : కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో విస్తరించిన బండీపుర జాతీయ ఉద్యానవనంలో చెలరేగిన కార్చిచ్చు ఇప్పట్లో శాంతించేలా లేదు. గురువారం అంటుకున్న మంటలు రోజురోజుకూ బండీపుర జాతీయ ఉద్యానవనంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తుండడంతో వేల ఎకరాల విస్తీర్ణంలో అటవీప్రాంతంలోని విలువైన వృక్షసంపద, పక్షులు, ప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి.అటవీప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు, వాలంటీర్ల యువకుల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పడానికి తీవ్రంగా శ్రమిస్తున్నా ఎక్కడోఒకచోట మంటలు చెలరేగుతున్నాయి. దీంతో మూడు రాష్ట్రాల అగ్నిమాపక దళం సిబ్బంది, అటవీశాఖ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు బండీపురలో ప్రజలకు సఫారీ నిషేధించారు. దీంతోపాటు బండీపుర జాతీయ ఉద్యానవనంలోని గోపాలస్వామి బెట్టపైనున్న ప్రాచీన దేవాలయంలోకి కూడా అధికారులు ప్రవేశాన్ని నిషేధించారు. మంటల్లో కాలిపోయిన కోతి -
వన్యప్రాణులకు రక్ష
మెదక్జోన్: జిల్లాలో కరువు విలయతాండవం చేస్తుండటం, మరో వైపు వేసవి సమీపిస్తుండటంతో అటవీప్రాంతంలోని చెట్లు చేమలు, పచ్చనిగడ్డి ఎండిపోయింది. దీంతో వన్యప్రాణులకు ఆహారం దొరకని పరిస్థితి నెలకొంది. అటవీశాఖ అధికారులు ప్రత్యేకంగా మూగజీవాల కోసం ప్రత్యేకమైన దాణాను అందిస్తూ వాటిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. మెదక్ – కామరెడ్డి జిల్లాల సరిహద్దులోని హవేళిఘణాపూర్ మండల పరిధిలోని పోచారం శివారు బోధన్ రహదారి పక్కన మెదక్ పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో అభయారణ్యం ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా జింకల ప్రత్యుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో రెండు డీర్ బీడింగ్(డీబీసీ)లు ఉన్నాయి. డీబీసీ–1లో 125 హెక్టార్ల అడవి ఉండగా డీబీసీ–2లో 39 హెక్టార్ల అడవి ఉంది. వీటిచుట్టూ కంచెను సైతం ఏర్పాటు చేసి వాటిలో జింకలను పెంచుతున్నారు. జింకలతో పాటు మరికొన్ని రకాల శాఖాహర జంతువులున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం జింకలు 450, నీల్గాయిలు 45, సాంబార్లు 25, అడవిపందులు 1500, నెమళ్లతో పాటు అనేకరకాల పక్షులున్నాయి. కాగా ఇందులోని జంతువులు మొత్తం శాఖాహరం జంతువులే. వర్షాకాలంలో చెట్ల ఆకులతో పాటు అడవిలో సహజసిద్ధంగా పెరిగే గడ్డిని ఆహారంగా తీసుకుంటాయి. వేసవికాలం రాగానే అడవిలోని చెట్లకు ఆకులు రాలిపోవటంతో పాటు గడ్డి ఎండిపోతోంది. డీబీసీల చుట్టూ కంచె వేయడంతో అవి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంటోంది. దీంతో ప్రతి సంవత్సరం వేసవిలో సుమారు 5 నుంచి 6 మాసాల వరకు వీటికి దాన (మేత) పెడతారు. ఇది ప్రతిఏటా మార్చి మొదటి వారంలో ప్రారంభిస్తారు. కానీ ఈయేడు ఫిబ్రవరి 2వ తేదీ నుంచే అందిస్తున్నారు. ఈ ఏడాది చెప్పుకోదగ్గ వర్షాలు లేకపోవటంతో చెట్ల ఆకులతోపాటు గడ్డిసైతం త్వరగా ఎండిపోయింది. దీంతో ప్రతిరోజు 2.5 క్వింటాళ్ల దాన పెడుతున్నారు. అంతే కాకుండా డీబీసీ–1లో 3 హెక్టార్లలో గడ్డిని పెంచుతున్నారు. అభయారణ్యంలోనే.. అభయారణ్యంలో డీబీసీల్లోనే జంతువులకు తాగునీటికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అడవిలో చెక్డ్యాంలతో పాటు కుంటలను తవ్వించి అందులో బోర్లు వేయించారు. బోరునీటిని చెక్డ్యాంలు, కుంటల్లో నింపుతున్నారు. ఇవి కాకుండా సాసర్ ఫీట్లు సైతం నిర్మించారు. తాగునీటికి ఇబ్బంది రాకుండా వాటిలో నీటిని నింపుతున్నారు. అడవిలోని ఒక్క బోరు మోటార్కు సోలార్(పవర్)ను ఏర్పాటు చేశారు. డీబీసీ–1 పక్కనే పోచారం ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు నిండితే బ్యాక్వాటర్ డీబీసీ–1లోకి కొంతమేర వస్తుంది. ఆ నీటిని సైతం అటవీశాఖ అధికారులు జంతువుల తాగునీటి కోసం ఉపయోగిస్తుంటారు. పర్యాటకుల తాకిడి... పోచారం అభయారణ్యం(జింకల ప్రత్యుత్పత్తికేంద్రం) హైదరాబాద్కు కేవలం 80 కిలోమీటర్ల దూరం ఉండటంతో వీకెండ్లో పర్యాటకులు పెద్ద ఎత్తున వచ్చి జంతువులకు తిలకిస్తున్నారు. ముఖ్యంగా డీబీసీ–1లో జింకల గుంపులు అధికం ఇందులో 4.5 కిలోమీటర్ల మట్టిరోడ్డును వేశారు. పర్యాటకులు ఇందులో పర్యటించాలంటే వాహనానికి రూ. 100 చెల్లించి ఒక్కో వ్యక్తికి రూ. 20 చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. వారివెంట ఒక గైడ్ను లోపలికి పంపిస్తారు. అభయారణ్యంలో కాలుపెట్టగానే చంగుచంగున దుముకుతూ జింకలు కళ్లముందే కదలాడుతుంటే పొరవిప్పి నాట్యం చేసే నెమళ్ల వయ్యారం, గుర్రం కన్నా ఎత్తులో ఉండే నీల్గాయిల గాంభీరం, పొదలమాటున నక్కినక్కి చూసే కొండగొర్ల దాగుడు మూతలతో అభయారణ్యం నిండా జంతువుల సందడి కనిపిస్తాయి. కాగా వీటిని తిలకించేందుకు చాలా జిల్లాల నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుంటారు. అంతేకాకుండా ఈ అభయరణ్యానికి ఆనుకుని పోచారం ప్రాజెక్టు సైతం చుట్టూ కొండలు, గుట్టల మధ్య ఉన్న ఈ ప్రాజెక్టు ఎంతో సహజ సిద్ధంగా ఉంది. ముందుగానే ఇస్తున్నాం.. అభయారణ్యంలోని జింకల ప్రత్యుత్పత్తి కేంద్రంలోని జింకలకు 2వ తేదీ నుంచి దాన పెడుతున్నాం. గడ్డినిసైతం పెంచి మేతగా వేస్తున్నాం. ఈయేడు వర్షాకాలంలో సరైన వర్షాలు లేకపోవడంతో చెట్ల ఆకులతో పాటు గడ్డి ఎండిపోవటంతో కాస్త ముందుగానే దాన ఇవ్వాల్సి వస్తోంది. రెండు డీబీసీల్లో నిత్యం 2.5 క్వింటాళ్ల దాన అవసరం పడుతోంది. –కృష్ణమూర్తి , బీట్ ఆఫీసర్ -
జలం.. బహుదూరం
ఆకలేసినా, దప్పికేసినా చెప్పుకోలేని మూగజీవాలు అడవుల్లో విలవిలలాడిపోతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో అడవుల్లో చుక్కనీరు దొరక్క మూగజీవాల గొంతెండుతోంది. చర్యలు తీసుకోవాల్సినఅధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో నీటి కోసం జనావాసాల్లోకి వస్తున్న వన్యప్రాణులు వేటగాళ్ల ఉచ్చులో చిక్కి, వాహనాలుఢీకొని మృత్యువాత పడుతున్నాయి. వన్యప్రాణుల సంరక్షణ కోసంవిడుదలవుతున్న నిధులు ఏమవుతున్నాయో అంతుపట్టడం లేదు. వైఎస్ఆర్ జిల్లా, బద్వేలు అర్బన్ : బద్వేలు నియోజకవర్గంలో లంకమల అభయారణ్యం, పెనుశిల అభయారణ్యం, నల్లమల అభయారణ్యాలు విస్తరించి ఉన్నాయి. సుమారు 30 వేల హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ అడవుల్లో వివిధ రకాల జంతుజాలం నివసిస్తోంది. వీటిలో అత్యంత అరుదైన కలివికోడి, పెద్దపులి, హనీబ్యాడ్జెర్ వంటి జంతువులు కూడా ఉన్నాయి. వణ్యప్రాణి సంరక్షణ చట్టం కింద ఆయా అడవుల్లోని జంతువులను సంరక్షించేందుకు ఏటా ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుంది. ఆ నిధులతో అడవుల్లో సాసర్పిట్లు ఏర్పాటు చేసి అందులో నీటిని నింపడం, అడవుల చుట్టూ వన్యప్రాణులు బయటికి రాకుండా కందకాలు తవ్వించడం వంటి పనులు చేపట్టాలి. అయితే ప్రభుత్వం సకాలంలో నిధులు కేటాయించకపోవడం, అటవీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా చర్యలు చేపట్టడం లేదు. జనావాసాల్లోకి .. అడవుల్లో వన్యప్రాణులకు నీరు అందించేందుకు గాను లంకమల, పెనుశిల, నల్లమల అభయారణ్యాలలో సుమారు 65కు పైగా సాసర్పిట్లు ఏర్పాటు చేశారు. అయితే సాసర్పిట్లలో నీటిని నింపి జంతువుల దాహార్తిని తీర్చాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో చేసేది లేక నీటి కోసం వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఈ సమయంలో వాహనాలు ఢీకొని చనిపోవడం, వేటగాళ్ల ఉచ్చులో చిక్కి మరణించడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి. బద్వేలు రేంజ్ పరిధిలోని జంగంరాజుపల్లె బీటులో బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ వెనుకజల్లాల్లో ఉన్న ముత్తూటిసెల అటవీ ప్రాంతాల్లో నీటి కోసం వస్తున్న వన్యప్రాణులను నీటిలో విషపు గుళికలు కలిపి వేటాడుతున్నారు. అంతేకాకుండా జిల్లా సరిహద్దులోని గోపవరం మండల సమీపంలో, అట్లూరు మండల సమీపంలో వేటగాళ్లు పేట్రేగిపోతున్నారు. ఉచ్చులు వేసి వన్యప్రాణులను వేటాడి వాటి మాంసాన్ని విక్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో అట్లూరు మండల పరిధిలో సుమారు నాలుగైదు పొడదుప్పిలు మృత్యువాతపడ్డాయి. అలాగే కాశినాయన మండలంలోని వరికుంట్ల గ్రామసమీపంలో తాగునీటి కోసం జనసంచారంలోకి వచ్చిన రెండు చిరుతలు విద్యుత్షాక్కు గురై మరణించాయి. ఇలా చెప్పుకుంటూపోతే నిత్యం ఎక్కడో ఒక చోట వన్యప్రాణులు మృత్యువాత పడుతూనే ఉన్నాయి. చర్యలు తీసుకుంటాం వన్యప్రాణుల సంరక్షణ కోసం అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నాం. అడవుల్లోని సాసర్పిట్లలో తక్షణమే నీరందించే ఏర్పాట్లు చేస్తాం. అలాగే వన్యప్రాణుల వేటగాళ్లను గుర్తించి కఠినంగా శిక్షిస్తాం. – గురుప్రభాకర్, ప్రొద్దుటూరు డీఎఫ్ఓ -
గజేంద్ర విలాపం!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: అడవులను కొల్లగొట్టేస్తున్నారు.. అడవి జంతువులకు నిలువ నీడలేకుండా చేస్తున్నారు.. ఫలితంగా మూగజీవాలు ఆవాసాలు కోల్పోయి జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి. అక్కడ మనుగడ సాగించలేక మృత్యువాత పడుతున్నాయి. జిల్లాలో కొన్ని నెలలుగా తిరుగుతున్న ఎనిమిది ఏనుగుల్లో ఒక్కొక్కటిగా మృత్యువాత పడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం విద్యుత్ షాక్తో ఓ గజరాజు చనిపోతే.. తాజాగా విషాహారం తిని, నదిలో మునిగి మరో ఏనుగు మరణించింది. అడవుల్లోకి గజరాజులను తరలించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవ్వడంవల్లే ఈ దుస్థితి ఏర్పడింది. మిగిలిన ఆరు ఏనుగులను కూడా అడవిలోకి పంపే ప్రయత్నాలు కనిపించడంలేదు. మరోవైపు.. తమ రాష్ట్ర పరిధిలోని అటవీ ప్రాంతంలోకి తరలించడానికి ఒడిశా సర్కార్ అంగీకరించడంలేదు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం సైతం దీనిపై నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుండడంతో అధికారులు ప్రేక్షకపాత్రకు పరిమితమవుతున్నారు. ఏనుగు ఎలా చనిపోయిందంటే.. ఏనుగుల గుంపులో నుంచి రెండు రోజుల క్రితం ఓ ఏనుగు తప్పిపోయింది. మొక్కజొన్న పంటకు వాడే గుళికలను తిన్న ఆ గజరాజు వెంటనే అపస్మారక స్థితికి చేరుకుంది. అనంతరం స్పృహలోకి వచ్చి మిగిలిన గుంపును కలుసుకునేందుకు రెండ్రోజులపాటు అది ఎంత తిరిగినా ఫలించలేదు. అప్పటికే అవి నాగావళి నదిని దాటేశాయి. కానీ, మూడు కిలోమీటర్లలోపు ఉన్న తమ సహచరులను ఏనుగులు పసిగట్టగలవు. అలా కూడా గుర్తించలేకపోవడంతో ఏనుగు ఆ ప్రాంతంలోనే ఉండిపోయింది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం నుంచి దాని ఆచూకీ లేకుండాపోయింది. దీంతో అటవీ శాఖ సిబ్బంది దానిని వెతకడం ప్రారంభించారు. గుంపులో కలపాలని ప్రయత్నించారు. ఆచూకీ లభించలేదు. నాగావళి నదిలో సోమవారం ఉదయం తేలింది. ఏనుగు ఊబిలో చిక్కుకుని గట్టుపైకి రాలేక మరణించినట్లు తెలుస్తోంది. అధికారులు దాన్ని వెలికి తీశారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించి అంత్యక్రియలు జరిపించారు. పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం ఏనుగులు జిల్లాలో ప్రవేశించి నాలుగు నెలలవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఇటీవల ఓ వ్యక్తిపై అవి దాడిచేసి చంపేసిన తర్వాత విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అటవీశాఖ ఉన్నతాధికారులతో పాటు ఒడిశా అధికారులు విజయనగరంలో సమావేశమయ్యారు. కానీ, వాటిని తరలించలేమనే నిర్ధారణకు వచ్చినట్లు ప్రకటించారు. ఇప్పుడు ఒడిశాలోని అటవీ ప్రాంతంలోకి మళ్లీ ఈ ఏనుగులను విడిచిపెట్టడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేదు. ఇప్పుడు వీటిని శ్రీకాకుళం జిల్లా అడవులకు తరలించడమే ఏకైక మార్గం.కానీ ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం. -
జీవన్మరణ సమస్య!
శ్రీకాకుళం, వీరఘట్టం: జిల్లాలో ఏటా వేసవిలో వన్యప్రాణులకు జీవన్మరణ పోరాటం తప్పడం లేదు. ఇవే అడవుల్లో గత కొన్నేళ్లుగా సంచరిస్తున్న ఏనుగులు.. దాహార్తిని తీర్చుకునేందుకు మైదాన ప్రాంతాలకు వచ్చినప్పుడు వీటి వల్ల ప్రజలకు ముప్పు తప్పడంలేదు. ఇటువంటి వింత పరిస్థితుల మధ్య వన్యప్రాణులు మత్యువాత పడుతుంటే.. ఏనుగుల గుంపు వల్ల ప్రాణ భయంతో పాటు ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇంత జరుగుతున్నా వన్యప్రాణులకు నీటి వసతి కల్పిం చడంలో అటవీశాఖ నిర్లక్ష్యం వహించడంతో జాతీ య సంపద అంతరించిపోతోంది. ప్రస్తుతం వేస వి సమీపిస్తున్న తరుణంలో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఏటా వేసవి తాపంతో దుప్పులు, జింకలు, అడవి పందులు దాహార్తిని తీర్చుకునేందుకు మైదాన ప్రాంతాలకు వచ్చి తరుచూ మత్యువాత పడుతున్నాయి. అలాగే వేటగాళ్ల తూటాలకు బలైపోయిన ఘటనలు ఉన్నాయి. వన్యప్రాణులు నిలయమైన వీరఘట్టం మండలం తూడి, వండువ కొండల్లో వీటి సంరక్షణకు అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టకపోవడం కూడా మరో కారణంగా పేర్కొనవచ్చు. రూ.1.62 కోట్లు వృథా జంతువుల దాహార్తిని తీర్చేందుకని గతేడాది జిల్లా వ్యాప్తంగా రూ.1.62 కోట్లతో 55 కిలోమీటర్లు పొడవునా అటవీ ప్రాంతంలో కందకాలు తవ్వా రు. అయితే వీటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని ప్రజలు చెబుతున్నారు. వేసవిలో ఎండల తీవ్రతకు నదులు, గెడ్డలు, పెద్ద పెద్ద జలపాతాలే ఎండిపోతుంటే కందాకాల్లో నీరు ఎంతవరకు నిల్వ ఉంటుందనేది వారి వాదన. ఈ పరిస్థితుల్లో నీటి సౌలభ్యత లేక మైదాన ప్రాంతాలకు వస్తున్న మూగజీవాలు బలైపోతున్నాయి. మరోవైపు జిల్లా విస్తీర్ణం 5,837 చదరపు కిలోమీటర్లు కాగా.. ఇందులో అటవీ విస్తీర్ణం 616 చదరపు కిలోమీటర్లు. దీనిలో 70,350 హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయి. వాస్తవానికి భూభాగంలో 33 శాతం అడవులు ఉంటే అక్కడ ప్రకృతి సంపదతో పాటు మానవాళి మనుగడకు ఎటువంటి ముప్పు ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే జిల్లాలో మాత్రం అడవులు కేవలం 10.55 శాతం మాత్రమే ఉన్నాయి. ఫలితంగా అడవుల విస్తీర్ణం తగ్గుతుండడంతో వన్యప్రాణులు మృతి చెందుతుండగా, ఏనుగుల భయంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పై గణాంకాల ప్రకారం అటవీ సంపదను మరింత పెంచాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఇదీ పరిస్థితీ... జిల్లాలోని పాతపట్నం–టెక్కలి అటవీ ప్రాంతంలో ఎక్కువగా దుప్పి, జింక, గొండగొర్రె, కొండ మేక ఇలా నాలుగు రకాల జింకలు ఉన్నాయి. పాతపట్నంనకు సమీపంలో ఆంధ్రా–ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో ఎక్కువగా దుమ్మలగుండు(తోడేళ్లు) సంచారం ఉంది. అలాగే ఇదే అటవీ రేంజ్లో రేసు కుక్కల సంచారం కూడా ఉంది. మొళియాపుట్టి మండలం జాడుపల్లి అటవీ ప్రాంతంలో కనుజులు ఎక్కువగా సంచరిస్తున్నాయి. అలాగే వీరఘట్టం మండలంలో 300 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తూడి, వండువ కొండల్లో వందలాది వన్యప్రాణులు ఉన్నాయి. దుప్పి, అడ వి పందుల గుంపులు ఎక్కువగా ఉన్నాయి. ఇవి సమీపంలో ఉన్న జీడి తోటలు, వరి చేలల్లో ఆహా రం కోసం తరుచూ వస్తుంటాయి. వర్షాకాలం, శీతాకాలంలో కొండలపైనే ఉన్నా.. వేసవి వచ్చిం దంటే మైదాన ప్రాంతాలకు నీటి కోసం వస్తుంటాయి. ఇటువంటి సమయాల్లో కొంతమంది వేటగాళ్లు మాటు వేసి, వన్య ప్రాణులను ప్రాణాలను హరిస్తున్నారు. గత నాలుగేళ్లలో... ♦ 2014లో వీరఘట్టం మండలం బొడ్లపాడు సమీపంలోని తోటల్లో వరి కంకులు తినడంతో దుప్పి మృతి చెందింది. ♦ 2015 నవంబర్లో తూడి తోటలో వరి కంకులు తిని, నీరందక మరో దుప్పి మృతి చెందింది. ఇవన్నీ స్ధానికులు గుర్తించినప్పుడు బయటపడినవి. అదే ఏడాది అడారులో మర్రి చెట్టు తొర్రలో నాటు బాంబులు కలకలం రేపాయి. ఈ నాటు బాంబులు వన్యప్రాణుల వేటకేననే అరోపణలు వ్యక్తమయ్యాయి. ♦ 2016 మార్చి 30న తలవరంలో దాహార్తిని తీర్చుకునేందుకు వచ్చిన ఓ జింక కుక్కల బారినపడి గాయాల పాలయ్యింది. పరిస్థితిని గమనించిన గ్రామస్తులు జింకను రక్షించి, అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ♦ 2017 ఏప్రిల్ 4న తూడి కొండ నుంచి దాహార్తి కోసం మైదాన ప్రాంతానికి వచ్చి రోడ్డు ప్రమాదంలో దుప్పి మృత్యువాత పడింది. ♦ అదే ఏడాది పాతపట్నం, మొళియాపుట్టి, సారవకోట ప్రాంతాల్లో అనేక దుప్పులు మృతిచెందాయి. ♦ 2018లో మొళియాపుట్టి వద్ద ఓ ఎలుగుబంటి అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. ♦ పాతపట్నం మండలం జోడికొండ నుంచి దాహార్తిని తీర్చుకునేందుకు వచ్చిన చుక్కల దుప్పి మృతి చెందింది. కందకాల వల్ల ఎద్దడి తగ్గుతుంది గతేడాది కొండ ప్రాంతాల్లో తవ్విన కందకాలలో చాలా చోట్ల నీటి తడులు చేరాయి. వీటి వల్ల వన్య ప్రాణులకు వేసవిలో దాహార్తి తీరుతుంది. ఏనుగులు సంచారంపై అప్రమత్తంగా ఉన్నాం. తూడి–వండవ కొండల్లో నీటి తొట్టెల ఏర్పాటుపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపించాం.– డి.జగదీష్, అటవీశాఖ రేంజ్ అధికారి, పాలకొండ -
తల్లి చూస్తుండగానే బాలుడిని ఈడ్చుకెళ్లిన..
సాక్షి, న్యూఢిల్లీ : ముక్కపచ్చలారని మూడేళ్ల బాలుడిపై చిరుతపులి పంజా విసిరింది. అతి దారుణంగా హతమార్చింది. తల్లితో పాటు వంటగదిలో ఉన్న వసీం అక్రమ్ (3)ను ఇంట్లోకి ప్రవేశించిన చిరుత ఆమె కళ్లెదుటే పిల్లాడ్ని నోట కరుచుకుపోయింది. ఇంటి సమీపంలోని దట్టమైన అడవిలోకి తీసుకెళ్లి విగతజీవుడిని చేసింది. అటవీశాఖ సిబ్బంది చిరుతను వలపన్ని పట్టుకుందామని చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. బాలుడు అదృశ్యమైన 15 గంటల తర్వాత అతని శవం మాత్రం కనుగొన్నారు. తల, మొండెం వేరుచేసి ఉన్న చిన్నారి శవం చూసి ఆ గ్రామమంతా కన్నీరుమున్నీరైంది. ఈ ఘటన రియాజీలోని మహోర్ ప్రాంతంలో మంగళవారం చోటుచేసుకుంది. అలసత్వం ప్రదర్శించిన అటవీ సిబ్బందిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. బాలుడిని చంపిన చిరుత ఆచూకీ ఈ ఉదయం లభించిందనీ, కానీ దాన్ని పట్టుకోలేకపోయామని జమ్మూ ప్రాంతీయ వన్యప్రాణి అధికారి తాహిర్ అహ్మద్ షాల్ తెలిపారు. క్రూర జంతువుల దాడుల నుంచి రక్షించుకునేందుకు ప్రజల్ని అప్రమత్తం చేశామని అన్నారు. అయితే, వాటి (వన్య ప్రాణులు) ఆవాసమైన అడవిలోకి ప్రవేశించడమే ఈ అనర్థానికి మూలమని వ్యాఖ్యానించారు. కాగా, గడచిన రెండు నెలల్లో ఇది మూడో ఘటన. డిసెంబర్ 7న ఎనిమిదేళ్ల బాలుడిని ఓ చిరుత పొట్టనబెట్టుకుంది. గతవారం యోగా చేసుకుంటున్న ఓ బౌద్ధ గురువుపై చిరుత దాడి చేసి హతమార్చింది. అభివృద్ధి పేరుతో ఇష్టారాజ్యంగా అడవులను నరికివేయడంతోనే ఈ దుస్థితి దాపురించిందనీ, అడవుల్లో ఉండాల్సిన వన్యప్రాణులు ప్రజల ప్రాణాలను తీసేవి కావని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సంరక్షణ తక్షణావసరం
కడప అగ్రికల్చర్ : మానవుడు వేగంగా అభివృద్ధి సాధించాలన్న తపనతో ప్రకృతిని నాశనం చేస్తున్నారు. తనతోపాటు భూమిపై నివసించే ఇతర ప్రాణులకు హాని తలపెడుతున్నాడు. పర్యావరణం దెబ్బతింటుండడంతో చిక్కుల్లో పడుతున్నాడు. తను విలాసవంతంగా జీవించడానికి అడవులను నరికి వేస్తున్నాడు. దీంతో ఆవాసాలను కోల్పోయి కృ త్రిమ స్థావరాల్లో జీవించలేక వన్యప్రాణులు అంతరించి పోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అరుదుగా ఉండే పక్షుల, జంతువుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. కనుమరుగయ్యే స్థితిలో ఉన్నాయని వన్యప్రాణి సంరక్షణ నిపుణులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. జిల్లాలో అంతరించి పోయే జాతులు ఎక్కువగనే ఉన్నాయని చెప్పవచ్చు. వీటి గురించి తెలుసుకోవడానికి,వాటిని కాపాడడానికి ప్రతి ఏటా అక్టోబర్ 4వ తేదీన ప్రపంచ జంతు సంరక్షణ దినోత్సవం జరుపుకుంటున్నట్లు జిల్లా పశుసంవర్ధకశాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ జయకుమార్ చెబుతున్నారు. కృష్ణ జింక... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువుగా గుర్తింపు పొందింది. భారత దేశంలో సువిశాల పచ్చిక మైదానాల్లో స్వేచ్ఛగా జీవిస్తుంటాయి. సాధారణంగా ఈ జింకలు 15–20 కలిసి ఒక గుంపులుగా మందగా తిరుగుతుంటాయి. రాను రాను మానవుడు మాంసం కోసం, చర్మం కోసం, సరదా కోసం వేటాడడం వల్ల అంతరించి పోతున్నాయి. పునుగు పిల్లి... ఒక రకమైన జంతువు. ఈ పిల్లి గ్రంధుల నుంచి జవాది లేదా పునుగు అనే సుగంధ ద్రవం లభి స్తుంది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వెంకటేశ్వర స్వామికి ప్రతి శుక్రవారం అభిషేకం తరువాత కాసింత పునుగు తైలాన్ని విగ్రహానికి పూస్తారు.ఈ పిల్లి కేవలం ఎర్రచందనం, సుగంధం, శ్రీ గంధపు చెట్లకు తన శరీరాన్ని తాకించి ఒక విధమైన ద్రవాన్ని వదులుతుంది. ఒకప్పుడు ఈ పిల్లులు వందల సంఖ్యలో కనిపిస్తూ ఉండేవి. వేటగాళ్లు వీటిని వలలు వేసి ప్రాణాలతో పట్టుకుని విక్రయిస్తూ వచ్చారు. దీంతో వీటి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఎలుగు బంట్లు.. సాధారణ, పెద్ద అడవుల్లోను నివసించే ఎలుగుబంట్లు ఎక్కువగా ఉండేవి, అటవీ సంపదను ఎప్పుడైతే కొల్లగొడుతూ వచ్చారో, అప్పటి నుంచి ఎలుగుబంట్లు ఒక అడవి నుంచి మరో అడవికి పారిపోతువచ్చాయి. మన ప్రాంతాల్లో వీటి మనుగడ లేకుండా పోయింది. కనిపించని చిరుత పులుల జాడ జిల్లాలోని అడవుల్లో అప్పుడప్పుడు కనిపించే చిరుతపులుల జాడ కనిపించకుండా పోయింది. అడవుల్లో ఎప్పుడైతే జన సంచారం పెరిగిందో అప్పటి నుంచి ఇవి కూడా కనిపించకుండా పోయాయి. వేటగాళ్లు గోర్లు, చర్మాల కోసం వేటాడడం వల్ల వాటి మనుగడకే కష్టంగా మారింది. కొండముచ్చు కోతులు: గండిలో మాత్రమే కని పించే కొండ ముచ్చు కోతులు దాదాపుగా కనుమరుగయ్యే స్థితికి వచ్చాయి. కొందరు వీటిని వేటాడి చంపడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని గండి క్షేత్రంలోని భక్తులు,స్థానికులు చెబుతున్నారు.చిన్న జంతువులైన ఉడతలు, తొండలు, బల్లులు కూడా దాదాపుగా అంతరించి పోయే దశకు చేరుకున్నాయని పర్యావరణ శాస్త్రవేత్తల సర్వేలో తేలింది.అంతరించి పోతున్న జంతువులను కాపాడుకునేలా ఉద్య మం చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వన్యప్రాణులనుకాపాడేందుకు చర్యలు జిల్లాలోని అటవీ ప్రాంతంలో కొన్ని రకాల జంతువులు అంతరించిపోకుండా చెట్ల పెంపకాన్ని చేపట్టాం. జంతువుల తాగునీటికి, గడ్డికి కొదువలేకుండా కార్యక్రమాలు చేశాం. జనారణ్యంలోకి రాకుండా చర్యలు తీసుకుంటాం. –శివప్రసాద్, అటవీ అధికారి, జిల్లా అటవీశాఖ -
వన్య ప్రాణికి కరువైన రక్షణ
ఒకప్పుడు ఎటూ చూసిన అడవులే. అంతటా పచ్చిక బయళ్లే. వాటిలో స్వేచ్ఛగా సంచరించే జంతువులు కనువిందు చేసేవి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వేటగాళ్లు సాధు జంతువులను వేటాడుతున్నారు. వల వేసి పడుతున్నారు. గ్రామాల్లోని ప్రధాన అడ్డాలైన కల్లు దుకాణాలు, అంగళ్లు, బస్టాండ్లు వంటి ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. కొందరికైతే మరీ ముందస్తు సమాచారం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా అటవీశాఖాధికారులు మాత్రం చీమకుట్టు కూడా చలించలేకపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వేటగాళ్ల బారి నుంచి సాదు జంతువులను కాపాడాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. ఇక వారు ఏ మేరకు స్పందిస్తారో..! నస్రుల్లాబాద్(బాన్సువాడ): రోజు రోజుకు వన్య ప్రాణులకు రక్షణ లేకుండా పోతోంది. శాఖాహార జీవాలను వేటగాళ్లు వలలు వేసి మరీ పట్టుకుని కాల్చుకుతింటున్నారు. కాపాడాల్సిన వారు పట్టించుకోకపోవడంతో వారికి అడ్డు అదుపూ లేకుండా పోతోంది. ఇటీవలే మండలంలో వేటగాళ్లు వేసిన ఉచ్చులో ఓ చిరుత పులి చిక్కుకున్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో దానికి శస్త్ర చికిత్స చేసి రాజధాని జూకు తరలించారు. అయినా కూడా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. మండలంలోని వివిధ గ్రామాల పరిధిలో ఉన్న అటవీ ప్రాంతాల్లో వేటగాళ్లు పెద్ద ఎత్తున వేట సాగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా అటువైపు అధికారులు మాత్రం కన్నెత్తి చూడడంలేదు. ప్రతి నెల వచ్చే వేతనాలను తీసుకోవడంలో ఉన్న ఆతృత ఉద్యోగం చేయడంలో చూపించడంలేదని వన్య ప్రేమికులు వాపోతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బిచ్కుంద, గాంధారి, సిరికొండ, మాచారెడ్డి, వర్ని, నస్రుల్లాబాద్, బాన్సువాడ, నిజాంసాగర్, భీమ్గల్ తదితర మండలాల్లో గతంలో దట్టమైన అడవులు ఉండేవి. అయితే అవి కాస్త ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో వేటగాళ్లు అటవీ జంతువులను వేడాడి వాటి మాంసాన్ని పాళ్లుగా వేస్తున్నారు. దీంతో వారికి ‘మూడు పాళ్లు.. ఆరు వేలు’గా ఆదాయం సమకూరుతోంది. వేటగాళ్లు ప్రధానంగా గ్రామాల్లోని కల్లు దుకాణాలు, వైన్సులను అడ్డాలుగా మార్చుకుని మరీ విక్రయిస్తున్నారు. కన్నెత్తి చూడని అటవీ అధికారులు.. ‘ఒకవైపు వన్య ప్రాణులను కాపాడాలి’ అన్న నినాదంతో శాకాహార జంతువుల పెంపకం కోసం వన సంపద పెంచాలని ప్రభుత్వం హరితహారం నిర్వహించి మరీ మొక్కలను పెంచుతోంది. వేటగాళ్ల చేతులకు సాదు జీవులు బలై పోతున్నాయి. దీంతో రాబోయో రోజుల్లో సాదు జీవాలను జంతు ప్రదర్శన శాలలో మాత్రమే చూడాల్సి వస్తోంది. ఇలా ఇష్టారీతిన జంతువులను చంపుకు తింటూ ఉంటే మాత్రం రానురాను వన్య ప్రాణులు మాత్రం అంతరించి పోతున్నాయి. ఐదేళ్ల క్రితం నస్రుల్లాబాద్ మండలంలోని అటవీ ప్రాంతంలో సంచరించే అటవీ జీవుల సంఖ్యతో పోలిస్తే ప్రస్తుతం 90 శాతం తగ్గిపోయింది. వర్ని–నస్రుల్లాబాద్ మధ్య ఉన్న గండిలో సాయంత్రం అయితే జన సంచారం ఉండేది కాదు. అయితే నేటి జనాలు క్రూర మృగాలుగా మారి కనుమరుగు చేస్తున్నారు. ప్రాణాలను కాపాడాల్సిన అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. గ్రామాల్లోని పంట పొలాలు, పచ్చిక బయల్లు వంటి ప్రాంతాల్లో వలలు, ఉర్లు వంటివి పెట్టి యథేచ్ఛగా పెడుతున్నారు. ముందస్తు సమాచారంతోనే... పచ్చిక బయల్లు, అడవి ప్రాంతాల్లో పట్టిన శాఖాహార జంతువులు కుందేళ్లు, అడవి పంది, దుప్పి, కొండ గొర్రె, అడవి పక్షులు, కంజు పిట్టలు, పావురాలు వంటి వాటిని పట్టుకు వచ్చి సమీపంలోని కల్లు దుకాణాల్లో, అంగట్లో, బస్టాండ్ ప్రాంతంలో యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. దీనికితోడు కొన్ని గ్రామాల్లో ముందస్తుగానే చెప్పి మరీ వేటకు వెళుతున్నారు. పెద్ద మొత్తంలో మద్యం వ్యాపారం జరిగే గ్రామాల్లో కల్లు దుకాణాల్లో ప్రతి రోజు వివిధ రకాల వన్య ప్రాణులు లభిస్తాయని సమాచారం. ఇంతగా వన్యప్రాణులు విక్రయాలు జరుగుతున్నా అధికారులు మాత్రం తమకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని వన్య ప్రాణులను కాపాడాలని వన ప్రేమికులు కోరుతున్నారు. -
వన్యప్రాణుల దాహం తీర్చేలా..
మార్కాపురం: గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో వేలాది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో జంతువుల తాగునీటి సమస్యకు అటవీ శాఖాధికారులు శాశ్విత పరిష్కారం చూపారు. ఏటా వేసవి ప్రారంభం నుంచి జంతువులకు తాగునీటి సమస్య ఏర్పడేది. అధికారులు ట్యాంకర్ల ద్వార కొన్ని ప్రాంతాల్లో సిమెంట్ తొట్లు(సాసర్ పిట్స్)ను ఏర్పాటు చేసినప్పటికీ వేసవి తీవ్రతకు నీరు ఆవిరి కావటం, కొన్ని ప్రాంతాల్లో ట్రాక్టర్ యజమానులు నీళ్లు పోయకపోవటంతో జంతువులు దప్పికతో అలమటించేవి. సమీపంలోని గ్రామాలకు వెళ్తే ప్రజలు దాడులు చేసే వారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ ఉన్నతాధికారులు నల్లమలలోనే శాశ్వితంగా నీటి వనరులు ఏర్పాటు చేసినట్లయితే జంతువులకు ఇబ్బంది ఉండదని భావించారు. 100కు పైగా చిరుతలు... టైగర్ రిజర్వు ఫారెస్ట్లో ప్రస్తుతం 100కు పైగా చిరుత పులులు, దాదాపు 70 పెద్ద పులులు, సుమారు 3 వేల జింకలు, దుప్పులు, ఇంకా రేచు కుక్కలు, కణతులు, ఎలుగుబంట్లు లెక్కలేనన్ని ఉన్నాయి. వీటి నీటి సమస్య తీర్చేందుకు నల్లమలలో అధికారులు కొన్ని ప్రాంతాల్లో డీప్బోర్లు వేసి సోలార్ సిస్టం ద్వారా మోటార్లు ఏర్పాటు చేసి శాశ్వితంగా నీటి సమస్యకు పరిష్కారం కనుగొన్నారు. గతంలో ఏటాఫిబ్రవరి నుంచి జూన్ వరకు అటవీ జంతువులకు నీటి సరఫరా కోసం రూ.10 లక్షల వరకు ఖర్చు చేసే వారు. 95 సాసర్ పిట్లను ఏర్పాటు చేశారు. ప్రధానంగా కొండ అంచు, మిట్ట ప్రాంతాల్లో సాసర్పిట్స్ను ఏర్పాటు చేశారు. దోర్నాల, యర్రగొండపాలెం, పుల్లలచెరువు, శ్రీశైలం సరిహద్దు, తదితర మండలాల్లో ఉన్న అటవీ ప్రాంతాల్లో పిట్లు ఏర్పాటు చేశారు. గత ఏడాది అటవీశాఖ ఉన్నతాధికారులు శాశ్విత పరిష్కారం కోసం ప్రయోగాత్మకంగా దోర్నాల మండలం పులిచెరువు, యర్రగొండపాలెం మండలం తంగెడివాగు, గుంటూరు జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతమైన బొంకులపాడు వద్ద మూడు డీప్బోర్లు వేసి సోలార్ ప్యానళ్లను పెట్టి పైపులైన్లు వేసి ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నీటి కుంటలకు ఇంజిన్ల ద్వారా నీటిని పంపింగ్ చేశారు. ఇందు కోసం సుమారు రూ.10 లక్షలు ఖర్చు చేశారు. ఈ ఏడాది ఇలా... ఈ ప్రయోగం విజయవంతం కావటంతో ఈ ఏడాది రూ.5 లక్షలు ఖర్చు పెట్టి నల్లగుంట్ల 2, కొమరోలు, నారుతడికల, బటుకులపాయ ప్రాంతాల్లో ఒక్కొక్క డీప్బోరు మోటార్లు ఏర్పాటు చేసి పైపు లైన్ల ద్వారా నీటి సరఫరా చేశారు. ఇందుకోసం గిరిజన యువకులను ఎంపిక చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క బోరుకు రూ.45 వేలు ఇవ్వగా, నెడ్ క్యాప్ ద్వారా సోలార్ సిస్టంకు రూ.55 వేలు కేటాయించారు. ఈ విధంగా గత ఏడాది మూడు ప్రాంతాల్లో, ఈ సంవత్సరం ఐదు ప్రాంతాల్లో డీప్బోర్లు వేసి నీటి సరఫరా చేయటంతో పెద్ద పులులు, చిరుతలు, జింకలు, రేచు కుక్కలు, ఎలుగు బంట్లు, కణతులకు నీటి సమస్య తీరింది. దీని వలన అవి అటవీ ప్రాంతంలోనే హాయిగా సంచరిస్తుంటాయి. నీటి కోసం అడవి నుంచి బయటకు వచ్చి వేటగాళ్ల బారి నుంచి ప్రమాదాలను తప్పించుకుంటున్నాయి. ఇప్పటికే నల్లమలలోని బేస్ క్యాంప్లో ఉన్న పెద్ద చేమ, చిన్న మంతనాల, పులిబోను ప్రాంతాల్లో ఉన్న డీప్బోర్లకు మోటార్లు బిగించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. మార్కాపురం డీఎఫ్ఓ పరిధిలో గుంటూరు జిల్లా సాగర్, రెంటచింతల, గురజాల, దోర్నాల అటవీ ప్రాంతాలు ఉన్నాయి. నీటి సమస్య తీరినట్లే..జయచంద్రారెడ్డి, డీఎఫ్ఓ, మార్కాపురంనల్లమలలో శాశ్వితంగా జంతువులకు నీటి సమస్య తీర్చాలనే ఉద్దేశంతో గత ఏడాది మూడు ప్రాంతాల్లో, ఈ ఏడాది ఐదు ప్రాంతాల్లో డీప్ బోర్లు వేశాం. సోలార్ సిస్టం ద్వారా మోటార్లను ఆన్చేసి పైపు లైన్ల ద్వారా సాసర్పిట్ ప్రాంతాలకు నీటి సరఫరా చేస్తున్నాం. దీనితో అటవీ ప్రాంతంలో జంతువులు ఈ ప్రాంతాలకు వచ్చి నీరు తాగి వెళ్తున్నాయి. గతంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉండటంతో జంతువులు తీవ్రంగా ఇబ్బంది పడేవి. ఇప్పుడు ఆ సమస్య తీరింది. బేస్ క్యాంప్ల్లో కూడా ఉన్న డీప్బోర్ల వద్ద మోటార్లను బిగించాలన్న ఆలోచన ఉంది. -
జూలో అరుదైన మూగజీవాల మృత్యువాత
బహదూర్పురా: నెహ్రూ జూలాజికల్ పార్కులో వరుసగా అరుదైన వన్యప్రాణులు మృత్యువాత పడుతున్నాయి. సంవత్సరం పొడవునా వన్యప్రాణుల జననం 10 వరకు ఉంటే.. మృతిచెందుతున్నవి మాత్రం 70– 100 ఉంటున్నాయి. ఎక్కువ శాతం అనారోగ్యం, వృద్ధాప్యంతో మృతి చెందినట్లు జూ ఉన్నతాధికారులు పేర్కొంటూ చేతులు దులుపుకొంటున్నారు. గత నవంబర్లో ఏడాదిన్నర వయసున్న బహిస్మతి సింహం అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఇది పిల్లకూన కావడంతో అనారోగ్యాన్ని సాకుగా చూపకుండా జూ అధికారులు దీని మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ బహదూర్పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఓ వ్యక్తి పులి ఎన్క్లోజర్లోకి ప్రవేశించి సాకి అనే పులిని చంపిన కేసు మొదటిది కాగా... సింహం కూన అనుమానంపై కేసు రెండోది. మొత్తంగా జూపార్కులో అరుదైన వన్యప్రాణుల మృతికి జూ అధికారుల నిర్లక్ష్యం, యానిమల్ కీపర్ల సలహాలు, సూచనలను పాటించకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటూ వన్యప్రాణుల బలిగొంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కారణాలేమిటి.. నెహ్రూ జూలాజికల్ పార్కులో వరుసగా మృతి చెందుతున్న వన్యప్రాణులకు అసలు కారణాలను ఆదిలోనే గుర్తించడంలో జూ వెటర్నరీ వైద్యులు విఫలం చెందడం ప్రధానమైన కారణం. సీజనల్గా వచ్చే వ్యాధుల పేరుతో తీసుకుంటున్న ముందస్తు చర్యలు నిర్ణీత ప్రమాణాల కంటే ఎక్కువగా తీసుకోవడం. ఆయా వన్యప్రాణుల ఎన్క్లోజర్లో నీటి మోడ్ను పరిశుభ్రపరచకపోవడం, బ్యాక్టీరియా వ్యాపించకుండా సున్నం కలిపిన బ్లీచింగ్ పౌడర్ను 15 రోజులకోసారి చల్లడం, మోడ్లోకి కొత్త నీరు విడుదల చేయకపోవడంతో చల్లిన బ్లీచింగ్ పౌడర్, సున్నం మరింత కలుషితం కావడంతో ఆ నీటిని తాగి వన్యప్రాణులు కాలేయం, ఊపిరితిత్తులతో పాటు గుండె సంబంధిత వ్యాధులతో మృత్యువాత పడుతున్నాయి. వైద్య సేవలు అంతంతే.. జూలోని ఆయా ఎన్క్లోజర్లో ఉన్న వన్యప్రాణులను పరిశీలిస్తూ వైద్య సేవలను జూ అధికారులు అంతంత మాత్రంగానే అందిస్తుండటంతో వన్యప్రాణులు మృత్యు చెందుతున్నట్లు తెలుస్తోంది. అనారోగ్యానికి గురైన వన్యప్రాణులకు వైద్యం అందించాలంటే జూ కన్సల్టెంట్, విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ నవీన్ కుమార్ సూచనలు, సలహాలు తీసుకోవాల్సింది. ఆయా వన్యప్రాణుల నీటి నమునాలను సేకరించి కాలుష్యాన్ని గుర్తించే చర్యలు చేపట్టకపోవడం, యానిమల్ కీపర్లు వన్యప్రాణులకు నివేదికలను జూ వెటర్నరీ వైద్యులు బుట్టదాఖలు చేయడంతో ఎక్కువ సంఖ్యలో వన్యప్రాణులు మృత్యువాత పడుతున్నాయి. వన్యప్రాణులకు అందిస్తున్న ఆహారాన్ని పూర్తిగా పరిశీలించడంలోనూ వెటర్నరీ వైద్యులు విఫలం చెందడంతో వన్యప్రాణులు అనారోగ్యానికి గురవుతున్నాయి. నివేదికలేవీ.. జూపార్కులో మృతి చెందిన వన్యప్రాణులకు పోస్టుమార్టం నిర్వహించి నమునాలను సేకరించి మృతికి కారణాలను తెలియజేయాల్సిన జూ అధికారులు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. సింహం కూన మృతి నివేదికను ఇప్పటి వరకు వెల్లడించలేదు. గత నెల 29న మృతి చెందిన సింహం నివేదికను రెండు రోజుల్లోనే జూ అధికారులు పత్రికలకు విడుదల చేయడం గమనార్హం. గత ఏడాది అడవిదున్న, నీటి గుర్రం, ఐనా, నీటి కుక్క, సారస్ క్రేన్ పక్షి, చింపాంజీ, ఎలుగుబంటి, మూషిక జింకలు, నామాల కోతులు, చిరుత పులులు, పెద్ద పులులు, సింహాలు, ఏనుగు, వివిధ రకాల కోతులతో పాటు ఇతర వన్యప్రాణులకు పోస్టుమార్టం నిర్వహించిన సీసీఎంబీ, వీబీఆర్ఐ, జూ వెటర్నరీ, రాజేంద్రనగర్ వెటర్నరీ వైద్యులు, శాస్త్రవేత్తలు మృతికి కారణాలపై ఇచ్చిన నివేదికలను ఇప్పటి వరకు వెల్లడించకపోవడం జూ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. పదుల సంఖ్యలో మూషిక జింకల మృతి.. సెంట్రల్ జూ అథారిటీ సహకారంతో అంతరించిపోతున్న మూషిక జింకల సంతానోత్పత్తిని జూలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. అనతి కాలంలోనే మూషిక జింకల సంతానోత్పత్తిలో సత్ఫలితాలను సాధించారు. మూషిక జింకల సంతానోత్పత్తి ఒక్కసారిగా పెరిగిపోవడంతో వాటికి వేరే ఇతర ప్రదేశాలను కేటాయించకపోవడంతో మూషిక జింకలు అంతర్గతంగా పోట్లాకు దిగి 12 వరకు మృతి చెందడం గమనార్హం. -
అలరించే అడవి అందాలు
చింతలమానెపల్లి(సిర్పూర్): జిల్లాలో అలరించే ప్రకృతి అందాలు ఎన్నో ఉన్నాయి. కాగజ్నగర్ అటవీ డివిజన్ పరిధిలోని కాగజ్నగర్, కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్, పెంచికల్పేట్, దహెగాం మండలాల్లోని దట్టమైన అటవీ ప్రాంతం ఎన్నో రకాల వన్యప్రాణులకు నెలవు. డివిజన్లోని అడవులలో ప్రవహించే ప్రాణహిత నది, పెద్ద వాగు (బీబ్రానది) అందాలు పర్యాటకంగా ప్రకృతి ప్రేమికుల మనసును దోస్తున్నాయి. వివిధ ప్రాంతాల్లో వన్యప్రాణులు సందడి చేస్తూ అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో చిక్కాయి. మరికొన్ని చిత్రాలను అధికారులు ప్రత్యేక కెమెరాలతో చిత్రీకరించారు. ఈ చిత్రాలను కాగజ్నగర్ అటవీ అధికారుల వద్ద నుంచి ‘సాక్షి’ సేకరించింది. -
వన్యప్రాణుల గణన
ఖానాపురం(నర్సంపేట): అడవులతోపా టు వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లకోసారి అటవీ జంతువుల గణన చేపడుతోంది. అందులో భాగంగా జిల్లాలో సోమవారం నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు అటవీ ప్రాంతాలపై పట్టున్న అధికారులు, స్వచ్ఛంధ సంస్థల బాధ్యులు రంగంలోకి దిగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 14వేల హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉం ది. మొత్తం 16 బీట్లు ఉండగా తొమ్మిది బీట్ల పరి« దిలోనే అడవులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వన్యప్రాణుల వివరాలు సేకరించడానికి ఫారెస్ట్ అధికారులతోపాటు స్వచ్ఛంధ సంస్థల బాధ్యులను కలుపుకుని తొమ్మిది బృందాలు రంగంలోకి దిగనున్నాయి. ఇందులో ఎఫ్ఆర్వో, సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్లతోపాటు స్వచ్ఛంధ సంస్థల బాధ్యులు వలంటీర్లుగా పాల్గొంటారు. ఈ బృందాలు శాఖాహార, మాంసాహార జంతువుల గణన, అవి నివసించే స్థలాల గుర్తింపు కార్యక్రమాన్ని రెండు విడతలుగా ఈనెల 29 వరకు చేపట్టనున్నారు. అలాగే వృక్ష జాతులు, మానవులు సంచరిస్తున్న ప్రాంతాల వివరాలు సైతం సేకరించనున్నట్లు ఫారెస్ట్ అధికారుల ద్వారా తెలిసింది. ప్రత్యేక యాప్ వినియోగం అటవీ జంతుల గణన కోసం ప్రత్యేక విధానాన్ని వినియోగించనున్నారు. ముఖ్యంగా పులుల గుర్తింపునకు ఎంస్ట్రైప్స్(మానిటరింగ్ సిస్టం ఫర్ టైగర్స్–ఇంటెన్సివ్ పెట్రోలింగ్ అండ్ ఎకోలాజికల్ స్టాటస్) యాప్ను ఉపయోగించనున్నారు. దీని ద్వారా పులుల సంఖ్య కచ్చితంగా తెలిసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. పులుల కాలి అడుగుల ఆనవాళ్లు, వాటి మూత్ర విసర్ణ అవశేషాలు, వెంట్రుకల ఆధారంగా గుర్తించనున్నట్లు సమాచారం. పులుల సంఖ్య తెలుసుకోవడానికి తొమ్మిది బీట్ల పరిధిలో మూడు సీసీ కెమెరాలను త్వరలో ఏర్పాటు చేయనున్నారు. తొలి మూడు రోజుల్లో మాంసాహార జంతువులు, ఆ తర్వాత మూడు రోజులు శాఖాహార జంతుల వివరాలు సేకరించనున్నారు. 22, 23, 24 తేదీ ల్లో క్రూర మృగాలు, మాంసాహార జంతువుల పై, 27, 28, 29 తేదీల్లో శాఖాహార జంతువులు, వాటి నివాసాలు, వృక్ష జాతుల గణన చేపడతారు. ఏర్పాట్లు పూర్తి చేశాం ప్రభుత్వ ఆదేశానుసారంగా సోమవారం నుంచి వన్యప్రాణుల గణన చేపట్టనున్నాం. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశాం. గణన రెండు దఫాలుగా సాగుతుంది. ఇందులో ఫారెస్ట్ సిబ్బందితోపాటు స్వచ్ఛంధ సంస్థల బాధ్యులు పాల్గొంటారు. ఆరు రోజుల పాటు లెక్కింపు ప్రక్రియ చేపట్టి వివరాలను ప్రత్యేక వెబ్సైట్లో పొందుపరుస్తాం. – పురుషోత్తం, డీఎఫ్ఓ -
పాడి పశువులకూ ‘ఆధార్’
- ఐదేళ్లలో అన్నింటికీ యూనిక్ నంబర్ - రేపటి నుంచి జిల్లాలో ‘పశుసంజీవని’ అనంతపురం అగ్రికల్చర్ : మనుషుల మాదిరిగానే పాడి పశువులకూ ‘ఆధార్’ నంబర్ ఇవ్వనున్నారు. ‘పశుసంజీవని’ పేరుతో రేపటి (జూన్ 1) నుంచి ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పాలిచ్చే ఆవులు, గేదెలను గుర్తించి వాటికి యూనిక్ నంబర్ ఇవ్వనున్నారు. రాష్ట్రీయ గోకుల్ మిషన్ (ఆర్జీఎం) పథకం కింద వచ్చే ఐదేళ్లలో అంటే 2022 నాటికి దేశవ్యాప్తంగా వంద శాతం పశుసంపదకు యూనిక్ నంబర్లు కేటాయించనున్నారు. ఈ కార్యక్రమం దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ జూన్ ఒకటిన లాంఛనంగా ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ (డీఎల్డీఏ), పశుసంవర్ధక శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమానికి జిల్లాలో శ్రీకారం చుట్టనున్నాయి. ఈ విషయాన్ని డీఎల్డీఏ చైర్మన్ అల్లు రాధాక్రిష్ణయ్య, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) డాక్టర్ ఎన్.తిరుపాలరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఒక పశువుకు ఇచ్చిన నంబర్ దేశంలో మరెక్కడా ఇంకో పశువుకు కేటాయించకుండా అత్యంత పకడ్బందీగా ఆన్లైన్ చేయనున్నట్లు వారు వెల్లడించారు. గ్రామాల వారీగా సిబ్బంది సర్వే చేసి పశువులతో పాటు రైతుల వివరాలనూ నమోదు చేసుకుని వాటికి యూనిక్ నంబరు, ట్యాగ్ ఇస్తారన్నారు. వివరాలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడంతో పాటు పశువులకు ఇచ్చే మేత వివరాలు, టీకాలు, వైద్య చికిత్సకు సంబంధించిన వివరాలను కంప్యూటరీకరణ చేయనున్నట్లు తెలిపారు. పశువులను అమ్మినా, కొన్నా వాటి వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తామని చెప్పారు. యూనిక్ నంబర్ కేటాయించడం వల్ల పశుసంపదకు సంబంధించిన పక్కా గణాంకాలు అందుబాటులోకి వస్తాయన్నారు. దీనివల్ల పశు పథకాల అమలు, బడ్జెట్ కేటాయింపులు సులభతరమవుతాయన్నారు. మేలు జాతి పశుసంపద అభివృద్ధి, అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులను అదుపులో ఉంచడం, చికిత్సా విధానంలో మార్పులు తీసుకొచ్చి ప్రాణాంతక వ్యాధులను సమూలంగా నివారించడం, పాల ఉత్పత్తి రెట్టింపు చేయడం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని వైద్య సదుపాయాలు మెరుగుపరచడం, ఈ–మార్కెటింగ్ను ప్రోత్సహించడం వంటి వాటికి కూడా ఈ గణాంకాలు దోహదపడతాయన్నారు. -
వన్యప్రాణులు స్వాధీనం
- తర్తూరు తిరునాలలో ప్రదర్శనకు ఉంచిన వాటిపై అధికారులు దాడులు - పునుగు పిల్లి, కొండ చిలువ, తాబేళ్లు స్వాధీనం - ప్రదర్శనకు ఉంచిన వారి అరెస్టు ఆత్మకూరురూరల్: తర్తూరు తిరనాలలో ప్రదర్శన కోసం ఉంచిన వన్యప్రాణులను ఆదివారం ఆత్మకూరు అటవీ డివిజన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ప్రదర్శనకు పెట్టిన హుసేన్ను అదుపులోనికి తీసుకుని నందికొట్కూరు మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. జూపాడుబంగ్లా మండలం తర్తూరు తిరునాలలో కర్నూలుకు చెందిన హుసేన్, ఆయన కుటుంబ సభ్యులు కొన్ని వన్యప్రాణులను ప్రదర్శనకు పెట్టి జనం టికెట్ వసూలు చేసుకుంటున్నారు. ఇందులో అరుదైన పునుగు పిల్లి, కొండచిలువ, రెండు కోతులు, రామచిలుకలు, కంజులు, తాబేలు, ముంగీసలున్నాయి. విషయం తెలుసుకున్న వైల్డ్లైఫ్ క్రైం కంట్రోల్ బ్యూరో దక్షిణ ప్రాంతీయ విభాగం చెన్నై వారు వాటిని స్వాధీనం చేసుకోవడంతోపాటు అందుకు బాధ్యలైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆత్మకూరు డీఎఫ్ఓ సెల్వంను ఆదేశించారు. ఈ మేరకు వెలుగోడు ఇన్చార్జ్ రేంజర్ శంకరయ్య సిబ్బందితో వెళ్లి బోన్లలో ఉంచిన వన్యప్రాణులను స్వాధీనం చేసుకుని ఆత్మకూరులోని బైర్లూటి రేంజ్ క్యాంపు కార్యాలయానికి తరలించారు. వాటిని ప్రదర్శనకు పెట్టిన హుసేన్ను అదుపులోనికి తీసుకున్న అధికారులు నందికొట్కూరు మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా ఆయన 15 రోజుల రిమాండ్కు ఆదేశించారు. వన్యప్రాణులను అధికారుల ఆదేశాల మేరకు అడవిలో వదిలిపెడతామని రేంజర్ శంకరయ్య తెలిపారు. దాడుల్లో డీఆర్ఓ రంగన్న, ఎఫ్బీఓలు మహబూబ్ బాషా, మదన్ కుమార్, టి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
మూడో కన్ను..అడవికి దన్ను
-నల్లమలలో 600 కెమెరాల ఏర్పాటు - ఎర్రచందంనం అక్రమ రవణాకు చెక్ - 66 పెద్ద పులుల గుర్తింపు - చిమ్మచీకట్లోనూ ఇన్ఫ్రారెడ్ రేస్తో చిత్రాలు సేకరణ కల్లూరు (రూరల్): వన్యప్రాణుల రక్షణ కోసం..అటవీ సంపద పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఇన్ఫ్రారెడ్ కెమెరాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. జిల్లాలోని నల్లమల అడవిలో వరల్డ్ వైల్డ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్)తో వీటిని ఏర్పాటు చేశారు. నంద్యాలలోని చెలమ రేంజ్, బీచ్, బసాపురం, పెద్దకంబలూరు, పచ్చర్ల, దొంగబావి, అహోబిలం, రుద్రవరం, గుండ్ల బ్రహ్మేశ్వరం, బైరేనీ, ఎన్ఆర్ కుంట, ఓంకారం వంటి ప్రాంతాల్లో..600 కెమెరాలను అమర్చారు. చిమ్మచీకట్లోనూ ఇన్ఫ్రారెడ్ రేస్తో ఇవి చిత్రాలను తీయగలవు. కెమెరా ఏదైనా జంతువు నిల్చుంటే చాలు ఆటోమేటిక్గా ఇవి చిత్రాలను తీస్తాయి. అటవీ జంతువులు వర్షాకాలంలో ఎత్తయిన ప్రదేశాల్లో, ఎండాకాలంలో చల్లని నీటి కుంటల వద్ద సంచరిస్తూ ఉంటాయి. టైగర్ ప్రాజెక్టు ప్రాంతంలో సుమారు 66 పెద్ద పులులను అటవీ శాఖ అధికారులు కనుగొన్నారు. జిల్లాలోని అటవీ ప్రాంత విస్తీర్ణం 355 చదరపు కిలో మీటర్లు ఉంది. ప్రత్యేక చిప్.. ఇన్ఫ్రారిడ్ కెమెరాల్లో ప్రత్యేక చిప్ ఉంటుంది. వాటి ముందు నిల్చుంటే చాలు ఇన్ఫ్రారిడ్ రేస్ ఇట్టే పట్టేస్తాయి. జంతువు/మనిషి ప్రతిబింబం ఇన్ఫ్రారిడ్ రేస్ క్యాప్చర్ చేసేస్తాయి. ఆ కెమెరాల్లో అమర్చిన చిప్తో చిత్రాలను అటవీ శాఖ అధికారులు డౌన్లోడ్ చేసుకుంటూ అటవీ ప్రాంతంలో ఎప్పుడు ఎలాంటి జంతువులు సంచరించాయి, డేట్, టైమ్తో పాటు ఫోటోలో క్చాప్చర్ అవుతోంది. వీటి ద్వారా అటవీ ప్రాంతంలో ఎవరెవరూ గుట్టు చప్పుడు కాకుండా సంచరిస్తుంటారో తెలుసుకోవచ్చు.. రూ.కోట్లు విలువ చేసే ఎర్రచందనం సీజ్ ఇప్పటి వరకు గుట్టుగా తరలిపోతున్న రూ.కోట్లు విలువ చేసే ఎర్రచందనం అక్రమ తరలింపుకు చెక్ పడినట్లైంది. అర్థరాత్రి వేళలోనూ ఇన్ఫ్రారెడ్ కాంతి కిరణాల ద్వారా స్పష్టంగా ఛాయాచిత్రాలు, అనుమతి లేకుండా సంచరించే వారిని ఈ కెమెరాలు ఇట్టే పడేయడంతో అక్రమ వ్యాపారానికి కొంత చెక్ పడింది. అందులో భాగంగానే రూ.కోట్లు విలువ చేసే ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల అటవీ ప్రాంతంలో రూ.241 లక్షలు విలువ చేసే 366 టన్నుల ఎర్ర చందనాన్ని అటవీ శాఖ అధికారులు సీజ్ చేశారు. మొత్తం 548 కేసులు నమోదు చేసి, 719 మందిని అరెస్ట్ చేసి, 235 వాహనాలను సీజ్ చేశారు. అలాగే కడప–పొద్దుటూరులో రూ.26 కోట్లు విలువ చేసే 3,800 టన్నుల ఎర్ర చందనాన్ని సీజ్ చేశారు. 3,600 కేసులు నమోదు చేసి 50,300 మందిని అరెస్ట్ చేసి, 1900 వాహనాలను సీజ్ చేశారు. తిరుపతిలోని సెంట్రల్ గోడౌన్కు ఎర్రచందనాన్ని తరలించారు. అక్కడ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వేలం వేసి అమ్మేస్తారు. అటవీప్రాంతంలో గట్టి నిఘా : జేఎస్ఎన్ మూర్తి, ఫారెస్ట్ కన్సర్వేటర్, కర్నూలు ఎర్రచందనం అక్ర రవాణాపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. వన సంపద కొల్లగొట్టే అక్రమార్కులపై కొరడా ఝుళిపించనున్నాం. వన్యప్రాణుల పరిరక్షణ మా బాధ్యత..ఇందుకు ఇన్ప్రారెడ్ కెమెరాలతో గట్టి నిఘా ఉంచాం. -
లివింగ్ ప్లానెట్ రిపోర్ట్-2016
మానవ జనిత విపత్తుల వల్ల 2020 నాటికి మూడింట రెండొంతుల సకశేరుకాలు విలుప్తత చెందే ప్రమాదమున్నట్లు గిగిఊ (World Wide Fund for Nature) విడుదల చేసిన లివింగ్ ప్లానెట్ రిపోర్ట్-2016 పేర్కొంది. ప్రపంచ వన్య మృగాల పరిస్థితులను సమీక్షిస్తూ గిగిఊ ప్రతి రెండేళ్లకోసారి ఈ నివేదికను విడుదల చేస్తుంది. 1970 నుంచి ప్రపంచ వన్య ప్రాణుల సంఖ్య 58 శాతం మేర తగ్గినట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. భూమిపై మనిషి పరిణామం చెందక ముందే జీవుల విలుప్తత కనిపిస్తుంది. చివరి సారిగా భారీ స్థాయిలో రాక్షస బల్లులు అంతరించాయి. ప్రకృతి కారణాల వల్ల జీవులు అంతరించడం సాధారణ విషయం. అయితే ప్రస్తుతం మనిషి ప్రభావాలు తీవ్ర స్థాయిలో పెరుగుతున్న ఆంథ్రోపోసిన్ అనే ఈ యుగంలో ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా, అతి వేగంగా జీవులు అంతరిస్తున్నాయని ఈ నివేదికను బట్టి అర్థమవుతోంది. జీవ వైవిధ్య విలుప్తత వల్ల మనిషి ఆహార, ఆరోగ్య, పోషణ భద్రత తగ్గడమే కాకుండా చివరకు మానవ మనుగడకే ముప్పు వాటిల్లుతుంది. ఒక జాతి జీవుల్లోని జన్యు వైరుధ్యం; విభిన్న జాతులు, ఆవరణ వ్యవస్థల మధ్య ఉన్న వైరుధ్యమే జీవవైవిధ్యం. వ్యవసాయ విస్తరణ, కలప, మానవ నివాసాలు, డ్యాంలు, రోడ్లు, రైల్వే మార్గాల నిర్మాణం కోసం ఇంతకుముందు జరిగిన, ప్రస్తుతం కూడా కొనసాగుతున్న అడవుల క్షీణత, నష్టమే వన్యప్రాణులకు ప్రధాన ముప్పుగా పరిణమించింది. దీనికి అదనంగా బయటి జాతుల ప్రవేశం కూడా స్థానీయ జీవవైవిధ్యానికి పెద్ద సవాలుగా మారింది. ఉద్దేశపూర్వకంగా లేదా ప్రమాదవశాత్తూ బయటి జాతులు ప్రవేశించినప్పుడు వాటి అనూహ్య విస్తరణ ద్వారా స్థానీయ జాతులు అంతరించే ప్రమాదముంది. ఉదా: పొలాల్లో ఎలుకల బెడదను నియంత్రించడానికి ఆస్ట్రేలియా ఉద్దేశపూర్వకంగానే అమెరికన్ కేన్ టోడ్ అనే కప్పను తమ దేశంలోకి ప్రవేశపెట్టింది. ఈ భారీ కప్ప ఎలుకలతోపాటు స్థానిక కప్ప, సర్ప జాతులను పూర్తిగా నాశనం చేసే స్థాయికి వేగంగా విస్తరించింది. ఆవాసాల నష్టం, క్షీణత, కొత్త జాతుల ప్రవేశంతోపాటు పర్యావరణ కాలుష్యం, శీతోష్ణస్థితి మార్పు, ఆహారం, ఔషధాలు, శరీర భాగాల కోసం వేట మొదలైనవి కూడా వన్యప్రాణుల జనాభా తగ్గుదలకు కారణమవుతున్నట్లు ఈ నివేదిక గుర్తించింది. ఆహారం, ఔషధాల కోసం.. వాజాల కోసం సొర చేపలను, ఆహారం కోసం తిమింగలాలు, డాల్ఫిన్లు, ఉడుములు, జింకలు, ఇతర వన్య పక్షులను, కొమ్ముల కోసం ఖడ్గ మృగాలను, పొలుసుల కోసం పిపీలకాహారులను, తైలం కోసం పునుగు పిల్లులు, కస్తూరి జింకలను, శరీర భాగాల కోసం పులులను మానవుడు వేటాడటం వల్ల వీటి సంఖ్య తగ్గిపోతోంది. చైనా సంప్రదాయ వైద్య విధానంలో పులుల శరీర భాగాలను వినియోగించడంపై ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో నిరసనలు వెల్లువెత్తున్నాయి. అయినా ఈ విధానాన్ని చైనా నిషేధించలేక పోతోంది. చమురు, క్రిమిసంహారకాలు.. చమురు వెలికితీత, రవాణాలో జరిగే ప్రమాదాల ద్వారా తరచూ సముద్ర కాలుష్యం సంభవిస్తోంది. సముద్ర ఉపరితలంపై చమురు పొర పేరుకుపోయి నీటిలో ఆక్సిజన్ కరిగే ప్రక్రియకు అవరోధం ఏర్పడుతోంది. ఫలితంగా సముద్ర జలచరాలు ఆక్సిజన్ అందక మరణిస్తున్నాయి. 2010లో గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో బ్రిటిష్ పెట్రోలియానికి చెందిన చమురు బావి ప్రమాదంలో దాదాపు 11,500 చ.కి.మీ. మేర సముద్ర ఉపరితలంపై మందంగా చమురు పేరుకుపోయింది. వ్యవసాయ రంగంలో నియంత్రణ లేకుండా వినియోగిస్తున్న క్రిమి సంహారక అవశేషాలు కూడా ఆహార శృంఖలాల ద్వారా వన్యప్రాణుల్లోకి చేరుతున్నాయి. పశువులకు వాడే డైక్లోఫినాక్ అవశేషాలు వాటిలో పేరుకుపోతున్నాయి. మరణించిన ఈ పశువులను తినడం వల్ల రాబందుల సంఖ్య గణనీయంగా తగ్గింది. శీతోష్ణస్థితి మార్పు.. ప్రస్తుతం శీతోష్ణస్థితి మార్పు ఒక ప్రధాన ముప్పుగా మారిందని కూడా నివేదిక పేర్కొంది. మానవులపై మాత్రమే కాకుండా ఇతర జీవ జాతులపై కూడా దీని ప్రభావాలను ఇప్పటికే గుర్తించారు. శీతోష్ణస్థితి మార్పు వల్ల వన్యప్రాణుల వలసలు, ప్రజననం అస్తవ్యస్తమై వాటి సంఖ్య తగ్గిపోతోంది. భూమి ఉపరితల సగటు ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరిగేకొద్దీ 20-30 శాతం మేర జీవవైవిధ్యం నష్టపోయే ప్రమాదముందని ఇదివరకే ఐ్కఇఇ (Intergovernmental Panel on Climate Change) తన నివేదికలో పేర్కొంది. కేవలం సకశేరుకాలకే.. లివింగ్ ప్లానెట్ ఇండెక్స్ (ఔ్కఐ) ఆధారంగా ఈ నివేదికను గిగిఊ సంస్థ తయారు చేసింది. జువాలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్ (ోఔ), గ్లోబల్ ఫుట్ప్రింట్ నెట్వర్క్, స్టాక్హోం ఎన్విరాన్మెంట్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థలు కూడా ఈ నివేదిక రూపకల్పనలో పాల్గొన్నాయి. 3,706 సకశేరుక జాతుల (చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు)కు చెందిన 14,152 పరిశీలన జనాభా (monitored populations)కు సంబంధించిన శాస్త్రీయ సమాచారం ఆధారంగా ఈ సూచీని రూపొందించారు. 1970 నుంచి 2012 వరకు సకశేరుక జనాభాలో 58 శాతం తగ్గుదల నమోదైనట్లు దీనిద్వారా తెలుస్తోంది. 2014 నివేదిక ప్రకారం 1970-2010 మధ్య కాలంలో 52 శాతం మేర సకశేరుకాల జనాభా తగ్గింది. అయితే స్వాదుజల జీవ జాతుల జనాభా గణనీయంగా తగ్గినట్లు తాజా నివేదిక స్పష్టం చేసింది. 2014 నివేదికతో పోల్చితే ఈ నివేదిక 668 జాతులు, 3,772 భిన్న జనాభాలను అదనంగా అధ్యయనం చేసింది. అయితే ఈ నివేదికను కేవలం సకశేరుక జాతుల సమాచారం ఆధారంగానే రూపొందించారు. భవిష్యత్లో అకశేరుక, మొక్క జాతులను కూడా అధ్యయనంలోకి తీసుకోనున్నారు. -
వన్యప్రాణుల వేట
హతమవుతున్న జింకలు, నెమళ్లు, ఇతర జంతువులు వేటాడుతున్న దుండగులు.. చట్టాలు అమలుకాని వైనం మెదక్: వన్యప్రాణులకు రక్షణ లేకుండా పోయింది. అమాయక ప్రాణులను దుండగులు వేటాడుతున్నా శిక్షించే వారే లేకుండా పోయారు. చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా అమలు చేసే దిక్కులేకుండా పోయింది. దుండగులు తుపాకులు, ఉర్లు, విషపు గుళికలతో చంపుతున్నారు. రెండు నెలల క్రితం నాలుగు జింకలను పచ్చటి అడవిలో వేటాడి చంపారు. ఈ నెత్తుటి మరకలు తుడిచిపెట్టుక పోకముందే తాజాగా మారో జాతీయ పక్షిని చంపేశారు. గడచిన ఐదేళ్లలో జిల్లాలో పదుల సంఖ్యలో వన్యప్రాణులు వేటగాళ్ల బారిన పడి ప్రాణాలు కోల్పోయాయి. అయినా ఇప్పటివరకు ఏ ఒక్కరిపై కూడా కఠిన శిక్షలు పడిన దాఖలాలు లేవు. ఇందులో కొందరు వినోదం కోసం తుపాకులతో జంతువులను హతమారుస్తుండగా, మరికొందరు అవగాహన రాహిత్యంతో వాటిని మట్టుబెడుతున్నారు. జోరుగా మాంసం విక్రయాలు వన్యప్రాణుల మాంసం విక్రయాలు సైతం యథేచ్ఛగా సాగుతున్నాయి. ముఖ్యంగా జాతీయ రహదారులపై దాబాలు, హోటళ్లలో పిట్టలు, నెమళ్లు, జింకలు, దుప్పులు, అడవి పందుల మాంసాన్ని విక్రయిస్తున్నారు. అసలు ఈ మాంసం ఎక్కడినుంచి వస్తుందోనని ఇప్పటివరకు అధికారయంత్రాంగం ఆరా తీసిన పాపాన పోలేదు. సుమారు ఐదేళ్లలో జిల్లాలో పదుల సంఖ్యలో జంతువులను వేటాడి పట్టుపడ్డ వారెందరో ఉన్నారు. గతంలో జహీరాబాద్, రామాయంపేట, మెదక్ ప్రాంతాలతోపాటు అనేక చోట్ల వేటగాళ్లు వన్యప్రాణులను చంపిన ఘటనలున్నాయి. ఘటనలు మచ్చుకు కొన్ని... 2014లో మెదక్ మండలం బ్యాతోల్ అడవుల్లోకి హైదరాబాద్ నుంచి జీపులో వచ్చిన కొందరు ప్రముఖ వ్యక్తులు తుపాకులతో జింకలను వేటాడగా అందులో ఒకటి చనిపోయింది. అప్పట్లో ఈ కేసును రామాయంపేట ఫారెస్ట్ అధికారులు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. 2011లో రామాయంపేటకు చెందిన ఓ వ్యక్తి జింక మాంసాన్ని అమ్ముతుండగా అటవీ అధికారులు పట్టుకొని కేసు నమోదు చేశారు. మెదక్ మండలం ఔరంగాబాద్ శివారులో నాలుగేళ్ల క్రితం వేటగాళ్లు విషంపెట్టి 10 నెమళ్లను చంపేశారు. అప్పట్లో ఈ కేసు జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితులను నేటికీ అటవీ అధికారులు అరెస్ట్ చేయకపోవడం గమనార్హం. ఇందులో పరోక్షంగా రాజకీయ నాయకుల పలుకుబడిని ఉపయోగించి నిందితులను తప్పించినట్టు సమాచారం. మూడేళ్ల క్రితం జహీరాబాద్ ప్రాంతంలో కొందరు వేటగాళ్లు అడవిలోకి వెళ్లగా అప్పట్లో అటవీ అధికారులు వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నాలుగేళ్ల క్రితం తూప్రాన్ సమీపంలో ఓ ముఠా అటవీ అధికారులకు చిక్కింది. వారినుంచి ఉడుము, తాబేళ్లతోపాటు వేట పరికరాళ్లను స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది మునిపల్లి మండలం కంకోల్ వద్ద ప్రమాదానికి గురైన ఓ వాహనంలో తుపాకులు, తూటాలు లభించటంతో సదరు వ్యక్తులు అడవుల్లో వేటకోసం వచ్చినట్లు అప్పట్లో అధికారులు భావించారు. ఈ ఏడాది జూలై 22న నాలుగు జింకలను మెదక్ మండలం రాయిన్పల్లి అడవిలో వేటాడి దారుణంగా చంపి ఓ ఆటోలో తరలిస్తుండగా గ్రామస్థులు పట్టుకోగా డ్రైవర్ ఆటోను వదిలి పరారయ్యాడు. తాజాగా ఈనెల 3న మెదక్ మండలం తొగిట శివారులో ముగ్గురు వ్యక్తులు నెమలిని చంపి కాల్చడంతో అటవీ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. వధించకూడదు వన్యప్రాణుల రక్షణకు ప్రధాన రహదారులకు ఇరువైపులా బోర్డులు ఏర్పాటు చేశాం. వాటిని వధించకూడదని హెచ్చరించాం. అడవి జంతువులను చంపితే కఠిన చర్యలు తీసుకుంటాం. బీట్ ఆఫీసర్లతో మరింత అవగాహన కల్పిస్తాం. - జోజి, డీఎఫ్ఓ, (వన్యప్రాణి విభాగం) మెదక్ -
తన భర్తే అని తెలియక...
ఏటూరునాగారం(వరంగల్): అడవి జంతువులను వేటాడేందుకు విద్యుత్ తీగలు అమర్చే క్రమంలో ఓ వ్యక్తి షాక్కు గురై చనిపోయాడు. దారి పక్కనే పడి ఉన్న ఆ మృతదేహాన్ని అతని భార్య గుర్తించలేకపోయింది. పొలానికి వెళ్లి పనిచేసుకుంటుండగా చనిపోయిన వ్యక్తి భర్తేనని స్థానికులు చెప్పటంతో ఆమె నిర్ఘాంతపోయింది. ఈ ఘటన వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం సర్వాయి పంచాయతీ చిట్యాల కొత్తగుంపు గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నయి.. గ్రామానికి చెందిన వాసం కేశవరావు (35) వ్యవసాయ కూలీ. అతనికి భార్య శారద, పిల్లలు శరణ్య, శ్వేత, చరణ్ ఉన్నారు. ఇంటి కలప నరికేందుకు కరీంనగర్ జిల్లా మహదేవపూర్ మండలం నీలంపల్లికి చెందిన వాసం రమేష్, మహాముత్తారం మండలం సింగంపల్లికి చెందిన బందం బాబును వారం క్రితం పిలిపించాడు. బుధవారం రాత్రి ముగ్గురూ కలిసి సమీపంలోనే ఉన్న చిట్యాల అడవికి వేటకు వెళ్లారు. వన్యప్రాణులను ట్రాప్లో పడేసేందుకు గాను హైటెక్షన్ వైర్కు విద్యుత్ తీగెలు అమర్చుతుండగా షాక్కు గురై కేశవరావు అక్కడికక్కడే చనిపోయాడు. గమనించిన రమేష్, బాబు.. కేశవరావు మృతదేహాన్ని భూపతిపూర్ ప్రధాన రోడ్డుపై పడేసి పరారయ్యారు. భర్త మృతదేహాన్ని చూసుకుంటే కూలీ పనికి.. కేశవరావు భార్య శారద గురువారం ఉదయం 7 గంటలకు అదే మార్గంలో కేశవరావు మృతదేహాన్ని చూసుకుంటూనే కూలీ పనులకు వెళ్లింది. చేతివేళ్లు తెగి, ముఖం, కళ్లు, చెవులు.. శరీరం అంతా కాలి ఉండటంతో భర్తేనని గుర్తించలేకపోయింది. కొద్దిసేపటి తర్వాత అది కేశవరావు మృతదేహమని స్థానికులు తెలపటంతో ఆమె రోదిస్తూ అక్కడికి చేరుకుంది. తన భర్త మరణానికి రమేష్, బాబు కారణమంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
శేషాచలంలో మూగవేదన...
ప్రమాదాల్లో అరుదైన జాతుల మృత్యువాత ఏటా పెరుగుతున్న ప్రమాదాలు వన్యప్రాణి సంరక్షణ పట్టని టీటీడీ ఫారెస్ట్ విభాగం తిరుమల : ‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అన్న సామెత తిరుమల శేషాచలానికి చక్కగా సరిపోతుందేమో?. అరుదైన జంతుజాతులకు శేషాచలం ఆవాసమని అధికారులు ఊదరగొడుతున్నా.. ఆ స్థాయిలో వాటి సంరక్షణ గురించి పట్టించుకోవడంలేదు. ఫలితంగా తిరుమలకొండ రెండు ఘాట్లలో రోజూ అనేక జంతువులు మృత్యువాత పడుతున్నాయి. క్రమంగా ఈ జంతుజాతులు క్షీణదశకు చేరుకుంటున్నాయన్న సత్యాన్నీ అధికారులు గుర్తించలేకపోతున్నారు. మృత్యువాత తిరుమల కొండ రెండు ఘాట్ రోడ్లలోనూ శ్రీవారి దర్శనం కోసం రోజూ 10 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. వేకువజాము 3 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటలవరకు వాహనాలు క్షణం కూడా సమయం ఇవ్వకుండా ప్రయాణిస్తుంటాయి. మిగిలిన మూడు గంటలూ టీటీడీ, ప్రభుత్వ వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. మలుపులతో కూడిన ఈ రెండు ఘాట్రోడ్లలోనూ ఆహారాన్వేషణ కోసం అటుఇటు రోడ్లు దాటుతున్న జంతుజాతులు వాహనాలు ఢీకొని మృత్యువాత పడుతున్నాయి. ఇందులో చిరుతలు, జింకలు, దుప్పులు, పునుగు, పందులు, ముళ్లపందులు, గండ్రంగులు (కొండముచ్చులు) ఉన్నాయి. రోజూ 0.5 నుంచి 1 శాతం వరకు జంతువులు ప్రమాదాల బారినపడుతున్నట్లు నిపుణులు గతంలోనే లెక్కగట్టారు. రక్షణ చర్యలపై టీటీడీ ఫారెస్ట్ తీవ్ర నిర్లక్ష్యం టీటీడీ పరిధిలోని జంతుజాతుల రక్షణపై సంబంధిత విభాగం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల రక్షణకు పెద్దపీట వేస్తున్న అధికారులు జంతువుల విషయంలో మాత్రం శీతకన్ను ప్రదర్శిస్తున్నారు. ‘ఆ.. జంతువులే కదా.. ఒకటి చనిపోతే మరొకటి పుట్టుకొస్తుందిలే?’ అన్నధోరణితో వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. అటకెక్కిన సిఫారసులు జంతు మరణాలు తగ్గించేందుకు రెండు ఘాట్రోడ్లలోనూ ఇనుప కంచె నిర్మించాలని నిర్ణయించారు. అదే సందర్భంలో రోడ్లు కింది భాగంలో జంతువులు అటుఇటు తిరిగేలా ప్రత్యేకంగా కల్వర్టులు కూడా నిర్మించాలని నిర్ణయించారు. వీటిలో ఏ ఒక్కటి అమలు కాలేదు. దీనివల్ల జంతు మరణాలు పెరుగుతున్నాయి. జీవ వైవిధ్య పరిరక్షణతోపాటు అరుదైనజంతుజాతుల భవిష్యత్ మనుగడ కోసమైన ప్రస్తుత టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు అయినా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రకృతి ప్రేమికులు విజ్ఞప్తి చేశారు. అమలుకాని వన్యప్రాణి చట్టం ఐదున్నర హెక్టార్ల విస్తీర్ణంలోని తిరుమల శేషాచల అటవీ ప్రాంతమంతా శ్రీవేంకటేశ్వర అభయారణ్యం పరిధిలోకి వస్తుంది. ఇక్కడ అరుదైన జంతుజాతులు ఉన్నాయి. దేవాంగపిల్లి, పునుగుపిల్లి, బంగారు బల్లి, చుక్కల జింక, కృష్ణజింక, అడవిగొర్రె, కణితి, దుప్పులు, రేసుకుక్కలు, ఎలుగుబంట్లు, చిరుతపులులు ఉన్నాయి. వీటితోపాటు నెమళ్లు, పాలపిట్ట, తోక పిట్టలు, అడవి కోళ్లు వంటి వేలాది రకాల ఎన్నెన్నో అరుదైన జాతులకు ఈ అటవీప్రాంతం కేంద్రంగా ఉంది. వీటిలో చాలావరకు అంతరించే దశలో ఉన్నాయి. వీటి సంరక్షణ కోసం ఫారెస్ట్ విభాగం కృషి అంతంత మాత్రమే. అడవుల పరిరక్షణకు అనేక చట్టాలున్నా అవి టీటీడీ పరిధిలోని అడవుల్లో అమలు కావటం లేదు. భక్తుల పేరుతో టీటీడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే ఫారెస్ట్ విభాగానికి ప్రధానంగా అడ్డుపడుతున్నాయి. భక్తుల ముసుగులో దట్టమైన అటవీ ప్రాంతాన్ని దశలవారీగా నాశనం చేస్తున్నా నిలువరించే దాఖలాలు కనిపించడం లేదు. -
చింపాంజీలు మానవ ఆధిపత్యాన్ని అధిగమిస్తాయ్!
లండన్: సాధారణంగా అడవి జంతువులేవైనా మానవులు నివసించే ప్రాంతాలకు సమీపంలో మనుగడ సాగించలేవు. వాటి జీవనానికి అటవీ ప్రాంతమే అనుకూలంగా ఉంటుంది. కానీ చింపాంజీలు మాత్రం మానవుల ఆధిపత్యం కొనసాగే ప్రాంతాలకు సమీపంలోనూ మనగలవని తాజాగా నిపుణులు గుర్తించారు. మానవుల కార్యకలాపాలు కొనసాగే ప్రాంతం అడవి జీవులకు అనుకూలం కాదు. ఇక్కడ వాటికి మానవుల వల్ల వనరుల కొరత ఏర్పడవచ్చు. తక్కువ సంఖ్యలో మాత్రమే అడవి జంతువులు ఇలాంటి ప్రదేశాల్లో జీవిస్తాయి. కానీ చింపాంజీలు ఈ పరిస్థితులకు అలవాటు పడగలవని, అవరోధాల్ని అధిగమించి వాటి సంఖ్యను వృద్ధి చేసుకోగలవని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా పరిశోధకులు తెలిపారు. ఉగాండాలోని మానవులు అధికంగా నివసించే ప్రాంతాల్లో వీటి సంఖ్య భారీగా వృద్ధి చెందడమే ఇందుకు నిదర్శనమని వారు అన్నారు. ఉగాండోలోని బుడోంగో, బుగోమాల్లోని అభయారణ్యాల్లో గతంతో పోలిస్తే చింపాంజీల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. పైగా ఈ అభయారణ్యానికి సమీపంలోనే మానవ కార్యకలాపాలు అధికంగా ఉంటాయి. వ్యవసాయ క్షేత్రాలు, మైదానాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి చోట్ల కూడా చింపాంజీల జనాభా పెరగడం పరిశోధకుల్ని ఆశ్చర్యపరిచింది. -
క్రూర మృగాలకు 63 మంది బలి
రాయ్పూర్: ఒక్కరూ ఇద్దరూ కాదు అడవులకు సమీపంలో ఉండే గ్రామాలపై దాడిసిన క్రూర మృగాలు ఏకంగా 63 మందిని పొట్టనపెట్టుకున్నాయి. ఛత్తీస్ గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా 2014- 2015 సంవత్సరంలో మృగాల దాడిలో చనిపోయినవారి సంఖ్యను రమణ్ సింగ్ ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రకటించింది. ఈ మరణాల్లో ఎక్కువ శాతం దట్టమైన అడవులున్న ఉత్తర ఛత్తీస్గఢ్లోనే సంభవించడం గమనార్హం. క్రూర మృగాల దాడులను ఏ విధంగా నివారిస్తున్నారన్న ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యుడి ప్రశ్నకు అటవీ శాఖ మంత్రి మహేశ్ గోగ్డా బదులిస్తూ ప్రజలను అప్పమత్తులను చేసేందకు సర్కార్ చేపట్టిన చర్యలను వివరించారు. ఏనుగులే ఎక్కువ సంఖ్యలో గ్రామాలపై దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో వాటిని బెదరగొట్టేడం ఎలాగో ప్రజలకు తర్ఫీదునిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఆయా గ్రామాల్లో సుశిక్షితులతో శిక్షణా కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు. -
అన్నదాతల ఉసురు తీస్తున్న అడవి పందులు
మెదక్ రూరల్: వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి పంటలను సాగుచేస్తే అడవి జంతువులు పెరిగిన పంటలను పెరిగినట్లే తింటున్నాయి. పంటలను రక్షించుకునేందుకు రాత్రివేళలో చేల వద్దకు కాపలాగా వెళ్లిన అన్నదాతలపై అడవి పందులు దాడి చేసి చంపేస్తున్నాయి. దీంతో పంటలను సాగుచేయాలంటేనే రైతులు జంకుతున్నారు. మెదక్ మండలంలో గాజిరెడ్డిపల్లి, బూర్గుపల్లి, కప్రాయిపల్లి, రాజిపేట, కొత్తపల్లి, శమ్నాపూర్, గంగాపూర్, పాతూరు, బి తిమ్మాయిపల్లి, బ్యాతోల్, జక్కన్నపేట, పోచమ్మరాల్, బొగుడభూపతిపూర్, శాలిపేట, ముత్తాయిపల్లి, పోచారం తదితర గ్రామాలను ఆనుకొని అడవులు విస్తరించి ఉన్నాయి. కాగా ఈ గ్రామాల రైతులు పంటలు సాగు చేయాలంటేనే జంకుతున్నారు. అప్పు చేసి పంటలను సాగు చేస్తే పంటలను అడవి జంతులు పాడు చేస్తున్నాయి. వాటి నుంచి పంటలను రక్షించుకునేందుకు కాపలాగా వెళితే రైతులపై దాడులు చేసి ప్రాణాలు తీస్తున్నాయి. దీంతో అడవులను ఆనుకుని ఉన్న గ్రామాల రైతులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పంటలు సాగు చేస్తున్నారు. రెండేళ్ల క్రితం బొగుడభూపతిపూర్ గ్రామానికి చెందిన కాసాల గోపాల్రెడ్డి తన మూడెకరాల పొలంలో చెరకు సాగు చేశాడు. పందులు నిత్యం పంటచేనుపై దాడి చేసి ధ్వంసం చేస్తుండడంతో కాపలాగా వెళ్లాడు. దీంతో పందులు గుంపుగా వచ్చి చెరక పంటను పాడు చేస్తుండగా గమనించి వాటిని వెళ్లగొట్టే ప్రయత్నం చేశాడు. దీంతో ఒక పంది అతనిపై దాడిచేసింది. విషయం గమనించిన చుట్టుపక్కల రైతులు గోపాల్రెడ్డిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. కాని అప్పటికే ఆలస్యం కావడంతో రైతు మృతిచెందాడు. ఫారెస్టు అధికారులు నష్టపరిహారంగా మృతుడి కుటుంబానికి రూ.1.50 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. పందుల దాడిలో గత రెండేళ్లుగా ఎంతో మంది రైతులు గాయపడ్డారు.ఈనెల 5న, మండల పరిధిలోని శమ్నాపూర్ గ్రామానికి చెందిన మిజ్జెని కిష్టయ్య మక్కజొన్న పంటకు కాపలాగా వెళితే అడవిపంది దాడిచేసి గొంతు కొరికిన విషయం విదితమే. ప్రస్తుతం ఆయన చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఇటీవల రాజిపేట గ్రామానికి చెందిన బోల మల్లేశం రూ. 30 వేల అప్పులు చేసి మక్కపంటను సాగు చేశారు. మరో 20 రోజుల్లో పంటచేతికి అందుతుందనగా వారం రోజుల క్రితం పందుల గుంపు దాడి చేసి ఒక్క మక్కబుట్ట కూడా మిగలకుండా పూర్తిగా తినేశాయి. దీంతో ఆయన బోరున విలపిస్తున్నాడు. ఇలా పంటలకు కాపలాగా వెళ్లిన రైతులను పందులు చంపేస్తున్నాయి. పంటలను ధ్వంసం చేస్తే నామమాత్రపు పరిహారం ఇచ్చి అధికారులు చేతులు దులుపుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
వేట
ఎక్కడో అడవిలో తలదాచుకుంటున్న వన్యప్రాణులు పలువురు మానవ మృగాల చేతిలో ప్రాణాలు వదులుతున్నాయి. జల్సాలకు అలవాటుపడ్డ వారు అటవీ జంతువులను హతమారుస్తున్నారు. తమ సరదాల కోసం మూగజీవాలను బలితీసుకుంటున్నారు. ఇందుకు జన్నారం పరిధిలోని టైగర్జోన్ను ఎంచుకుంటున్నారు. నిత్యం ఏదో ఒక జీవి ప్రాణాలు తీస్తూ.. ఎంజాయ్ చేస్తున్నారు. అటవీ అధికారులేమో పలుచోట్ల బాధితులను పట్టుకుంటున్నా.. వారిపై కఠిన చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా వన్యప్రాణుల వేట మాత్రం ఆగడం లేదు. ఉట్నూర్ : జన్నారం వైల్డ్లైఫ్ అటవీ డివిజన్ (వన్యప్రాణి సంరక్షణ విభాగం) పులుల సంరక్షణ కేంద్రం వేటగాళ్లకు నిలయంగా మారింది. కేంద్ర ప్రభుత్వం కవ్వాల్ అటవీ ప్రాంతాన్ని 42వ టైగర్ జోన్గా గుర్తించింది. కవ్వాల్ అభయారణ్యం వన్యప్రాణి విభాగంలో అధికారిక లెక్కల ప్రకారం 673 రకాల మొక్కలు, పది రకాల ఉభయచర జంతువులు, 34 రకాల సరిసృపాలు, 270 రకాల పక్షి జాతులు, 75 రకాల క్షీరజాతులు మనుగడ సాగిస్తున్నాయి. అడవులు వేగంగా అంతరిస్తుండడంతో వాటికి మనుగడ లేకుండాపోతోంది. పదుల సంఖ్యలో వేటగాళ్ల ఉచ్చుకు బలవుతున్నాయి. కవ్వాల్ అభయారణ్యంలో వన్యప్రాణుల రక్షణకు అటవీ అధికారుల నిఘా అంతంత మాత్రంగానే ఉండడంతో నిత్యం ఏదో ఒక చోట అటవీ జంతువుల బలవుతున్నాయి. మామూళ్లకు కక్కుర్తి పడి కొంత మంది కిందిస్థాయి అటవీ సిబ్బంది వేటగాళ్లకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రిళ్లు బ్యాటరీలు, బరిసెలు, వలలు, విద్యుత్ వైర్లు, బైండింగ్ తీగలు తదితర సామగ్రితో వేటగాళ్లు అడవుల్లోకి వెళ్లి వాటిని వెంటాడుతున్నారు. రాత్రి వేళ జంతువులు దాహార్తి తీర్చుకోడానికి సాసర్వెల్స్, గ్రామాల సమీపంలో ఉండే చెరువులు, ఇతర నీటి వనరుల ప్రాంతాలకు వస్తుంటారు. ఆ సమయంలో వేటగాళ్లు మాటువేసి వాటిని వేటాడుతున్నారు. జంతువులకు తాగునీరందించేందుకు అటవి శాఖ వారు ఏర్పాటు చేసిన సాసర్వెల్స్ను వేటగాళ్లు వేటకు అనుకూలంగా మలచుకుంటున్నారు. అభయారణ్యంలోని బీర్సాయిపేట, తాళ్లపేట, జన్నారం, ఇందన్పల్లి అటవీ రేంజ్ల్లోని పలు బీట్లలో జంతువుల వేట ముమ్మరంగా సాగుతోంది. ఆదివారం వచ్చిందంటే.. వీకెండ్ అయిన ఆదివారం వచ్చిందంటే చాలు ఉట్నూర్, జన్నారం పట్టణ ప్రాంతాలతోపాటు ఇందన్పల్లి, ఖానాపూర్, బీర్సాయిపేట తదితర గ్రామాలు వన్యప్రాణుల మాంసంతో నిండిపోతున్నాయి. వేటగాళ్లు నేరుగా ఇళ్లలోకి మాంసాన్ని సరఫరా చేస్తున్నారు. ఇందుకోసం పలువురిని ఏజెంట్లుగా కూడా పెట్టుకుంటున్నారు. ముందుగానే ఎవరెవరికి ఏ మాంసం ఎంత కావాలో వివరాలు తీసుకుంటూ.. లేదా గ్రామానికి చెందిన వారే పలువురు వేటగాళ్లతో నేరుగా ఫోన్లో కోడ్ భాషలో మాట్లాడుతూ మాంసాన్ని తెప్పించుకుంటున్నారు. ఇదంతా ఉదయం నాలుగు గంటల నుంచి 6 గంటలలోపే జరిగిపోతోంది. మరికొందరేమో ఆడవారిని రంగంలోకి దింపి వన్యప్రాణుల మాంసాన్ని ఆటో, జీప్ ప్రయాణాల ద్వారా మంచిర్యాల, లక్సెట్టిపేట, నిర్మల్, ధర్మపురి, జగిత్యాల, కరీంనగర్, గోదావరిఖని ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. పలు వ్యాధులున్న వారికి ఫలానా జంతువు మాంసం తింటే తగ్గిపోతుందని ప్రచారంలో ఉండడంతో వాటికి సంబంధించి ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు. ఒక్కో వన్యప్రాణి మాంసం కిలో ధర రూ.400 నుంచి రూ.1200 వరకు పలుకుతోంది. దీంతో ఈ అక్రమ దందా రూ.లక్షల్లోనే జరుగుతోంది. ఈ వ్యవహారంలో సంబంధిత శాఖకు చెందిన పలువురు అధికారులకు హస్తం ఉండడంతో దందా గుట్టుచప్పుడు కాకుండా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. నిఘా అంతంతే.. 1965లో కవ్వాల్ను అటవి ప్రాంతంగా గుర్తించిన ప్రభుత్వాలు 1972లో వన్యప్రాణి సంరక్షణ విభాగంగా గుర్తింపునిచ్చింది. ఆ తర్వాత 2011లో కవ్వాల్ అభయారణ్యంలో 892.23 చదరపు కిలోమీటర్లు కోర్ ఏరియాగా.. 1,119.68 చదరపు కిలోమీటర్లు బఫర్ ఏరియాగా గుర్తిస్తూ 42వ పులుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించింది. దీంతో వన్యప్రాణులను అన్నిరకాలు రక్షించేందుకు వేట నిరోధక దళాలు అటవీ సెక్షన్ అధికారి పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలనూ నియమించింది. ఈ బృందాలు నిరంతరం అడవుల్లో తిరుగుతూ వన్యప్రాణులను సంరక్షించాలి. కానీ.. వన్యప్రాణులను కాపాడడంలో వారు విఫలమవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న వారిలో కొంత మంది ఎనిమల్ ట్రాకర్స్, బేస్ క్యాంపుల్లోని వారు వేటగాళ్లకు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఉన్నత స్థాయి అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. కింది స్థాయి సిబ్బంది నిఘా లోపంతో అడవుల్లో యథేచ్ఛగా వేటా సాగుతోంది. దీనికితోడు అడవులు వేగంగా అంతరిస్తుండడంతో వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది..!! కేసులు సరే.. చర్యలేవీ..? జన్నారం వైల్డ్లైఫ్ డివిజన్లోని ఇందన్పల్లి, తాళ్లపేట, బీర్సాయిపేట, జన్నారం అటవీ రేంజ్ల పరిధిలో జనవరి 2011 నుంచి ఇప్పటివరకు ఏడు నీలుగాయిలు, మూడు దుప్పిలు, ఐదు అడవి పందులు, ఒక కొండగొర్రె, రెండు సాంబర్లు, ఒక చిరుత, ఐదు చుక్కల దుప్పిలు, ఒక సింగోళి, నాలుగు జింకలు వేటగాళ్ల ఉచ్చుకు బలయ్యాయి. ఇందుకు దాదాపు 86 మంది వేటగాళ్లపై కేసులు నమోదైనట్లు సమాచారం. గత నెల ఐదో తేదీన జన్నారం అటవీ రేంజ్ పరిధిలోని అడవిలో నీలుగాయిని వే టాడి మాంసం విక్రయిస్తున్న వారిని అటవీ అధికారులు పట్టుకున్నారు. అల్లినగర్కు చెందిన 19 మందిపై కేసులు నమోదు చేశారు. అదీకాక వెలుగులోకి రాకుండా మరెన్నో వన్యప్రాణులు బలి అవుతూనే ఉన్నాయి. అయితే.. వేటగాళ్లపై కేసులు నమోదు చేస్తున్న అధికారులు ఆ తదుపరి చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వేటగాళ్లపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
అది చిరుతే..!
కెమెరాకు చిక్కిన ఆనవాళ్లు.. చిరుతతోపాటు హైనా కూడా.. సంగారెడ్డి: మెదక్ జిల్లా సంగారెడ్డి మండల పరిధిలోని జనారణ్యంలో కల కలం సృష్టిస్తున్న చిరుత ఆనవాళ్లను అటవీఅధికారులు ఎట్టకేలకు గుర్తించారు. ఇంద్రకరణ్ గ్రామ శివారు పంటపొలాల్లో సంచరిస్తున్న చిరుత సీసీ కెమెరాలకు చిక్కింది. చిరుతతోపాటు మరో రెండు అటవీ జంతువులు కూడా ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే పాదముద్రలు సేకరించిన అధికారులు.. వీటి ఆధారంగా ఇక్కడ సంచరిస్తున్నది చిరుతపులి అని అంచనాకు వచ్చి ఆ ప్రాం తంలో సీసీ కెమెరాలు అమర్చారు. రెండు చోట్ల బోన్లు పెట్టి వాటిలో ఎరగా సజీవం గా మేక పిల్లను ఉంచారు. గురువారం ఉదయం మల్లారెడ్డి చెరకు తోట వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరా చిరుతపులి చిత్రాలను తీసింది. నరహరిరెడ్డి గొర్రెల ఫాం వద్ద ఏర్పాటు చేసిన రెండో సీసీ కెమెరాకు బుధవారం రాత్రి 9.08 గంటలకు హైనాను పోలిన జంతువు చిక్కింది. బోను ముందు నుంచే నడుచుకుంటూ వెళ్తున్న జంతువు చిత్రాలను సీసీ కెమెరా తీసింది. ఇంతకు ముందు లభించిన పాదముద్రలను, తాజా గా దొరికిన చిత్రాలను అటవీ అధికారులు విశ్లేషిస్తున్నారు. అయితే పొలాల్లో తిరగుతున్నది చిరుతే అని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మిగిలిన జంతువును ఇంకా నిర్ధారించాల్సి ఉంది. త్వరలోనే వాటిని బంధిస్తామని, ప్రజలు భయపడొద్దని, పొలాల్లోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని డీఎఫ్వో శివయ్య తెలిపారు. -
అదిగో చిరుత.. ఇదిగో వచ్చే..!
నిజాంసాగర్, న్యూస్లైన్: జిల్లాలో అటవీ ప్రాంతం విస్తరించిన ప్రాంతాల్లో చిరుతల సంచారంతో గ్రామీణులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. చిరుత పులులు వరుసగా పంజా విసురుతుండటంతో మూగజీవాలు వాటికి బలి అవుతున్నాయి. వన్యప్రాణుల దాడులతో ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లుతోంది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వపరంగా ఎలాంటి సాయం అందడం లేదు. ఇటీవల జిల్లాలో చిరుతపులులు వరుస దాడులుచేసి గొర్రెలు, మేకలు, పశువులు, గేదెలు, కుక్కపిల్లలను హతమార్చాయి. ఏ పొద నుంచి, ఎక్కడి నుంచి వచ్చి చిరుతలు దాడి చేస్తాయోనని రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారులు భయాందోళన చెందుతున్నారు. అడవుల నుంచి జనారణ్యంలోకి... దట్టమైన అడవులకు నిలయంగా ఉన్న జిల్లాలో వన్యప్రాణు లు అధికంగా ఉన్నాయి. చిరుత పులలతో పాటు ఎలుగుబంట్లు, అడవి పందులు, నీల్గాయ్, నక్కలు, కొండగొర్రె లు, నెమల్లు వంటి వన్యప్రాణులు వందల సంఖ్యలో ఉన్నా యి. దట్టమైన గుట్టలు, వృక్షాలతో ఉన్న అడవులు అంతరిస్తుండటంతో వన్యప్రాణులకు ఆహారం కరువవుతోంది. తాగునీరు, పచ్చిగడ్డి కోసం వన్యప్రాణులు జనారణ్యం బాటపడుతున్నాయి. అడవుల్లో సంచరించాల్సిన వన్యప్రాణులు జనారణ్యంలోకి వచ్చి మూగజీవాలను పొట్టనబెట్టుకుంటున్నాయి. పగలు, రాత్రి అన్న తేడాలేకుండా గ్రామీణ ప్రజలకు వన్యప్రాణుల బెడద పట్టుకుంది. ఆరుగాల శ్రమించి పండిస్తున్న పంట చేనుల కాపల కోసం వెళ్లడానికి రైతులు జంకుతున్నారు. మేత కోసం వెళ్తున్న మూగజీవాలపైనా చిరుత వరుస దాడులు చేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా పలు గ్రామాల్లో చిరుత పులులు పంజా విసురుతున్నా అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. అలాగే వన్యప్రాణుల వల్ల పంట నష్టంతో పాటు మూగజీవాలు బలవుతున్నా రైతులకు మాత్రం అటవీ శాఖ అధికారులు పరిహారం చెల్లించడం లేదని బాధితులు వాపోతున్నారు. గ్రామాల్లోకి వస్తున్న వన్యప్రాణుల దాడి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా అటవీ శాఖ అధికారులు అన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వరుస సంఘటనలు.. జిల్లాలోని నిజాంసాగర్, ఎల్లారెడ్డి, గాంధారి, లింగంపేట, నాగిరెడ్డిపేట, బిచ్కుంద, పిట్లం, భీంగల్, ఇందల్వాయి, మాచారెడ్డి, భిక్కనూర్, బాన్సువాడ, వర్ని, సిరికొండ మండలాల్లో చిరుత సంచారం నెలకొంది. బిచ్కుంద మండలం పెద్దకొడప్గల్ గ్రామ శివారులో ఏప్రిల్ నెల 2వ తే దీన పంట చేను కాపలా కోసం వెళ్లిన కుర్మబాలయ్య అనే రైతుపై చిరుత దాడి చేసి హతమార్చింది. గాంధారి మండలం ఇటీవల మాతు సంగెం గ్రామంలో ఆరునెలల కిందట గొర్రెల మందపైన చిరుత దాడి చేసి 8 జీవాలను పొట్టన బెట్టుకుంది. ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ గ్రామంలో గతంలో అవుల మందపైన నాలుగైదు సార్లు చిరుత దాడులు జరిగాయి. నిజాంసాగర్ ప్రాజెక్టు హెడ్స్లూయిస్ వద్ద సబ్స్టేషన్లోకి చిరుత రావడంతో సిబ్బంది బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల గ్రామ శివారులోని అటవీ ప్రాంతానికి మేత కోసం వెళ్లిన పశువులపై చిరుత దాడి చేయడంతో ఒక పశువు మృత్యువాతకు గురైంది. నిజాంసాగర్ మండలం హసన్పల్లి గ్రామానికి చెందిన కుర్మబాలయ్య మేకల మందపై చిరుత దాడి చేసి రెండు మేకలను హతమార్చింది. తాజాగా బిచ్కుంద మండలం వాజిద్నగర్ గ్రామానికి చెందిన సాయిలు అనే వ్యక్తి మేకల మందపై ఆదివారం చిరుత దాడిచేసి మేకను హతమార్చింది.