చిత్తూరు జిల్లాలో కారు ప్రమాదం
ఇద్దరు మృతి, ఐదుగురికి తీవ్రగాయాలు
బాధితులు దొడ్డబళ్లాపురవాసులు
బంగారుపాళెం: గృహప్రవేశం కోసం కారులో పట్టు చీరలు కొనేందుకు వెళ్తున్న ఓ కుటుంబం శనివారం చిత్తూరు జిల్లా బంగారుపాళెం వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. పోలీసుల కథనం మేరకు, బెంగళూరు వద్ద దొడ్డబళ్లాపురానికి చెందిన గంగరాజయ్యగౌడ్ కుటుంబ సభ్యులు సుచిత్ర, ధరణి, శ్రీనివాసమూర్తి, లక్ష్మి, తనూజ, ఉష ఇన్నోవా కారులో తమిళనాడులోని కాంచీపురానికి బయలుదేరారు.
కారు నుజ్జు నుజ్జు
కారు బంగారుపాళ్యం వద్ద కొత్తపల్లె బైపాస్ రోడ్డు చైన్నె–బెంగళూరు హైవేలో పైవంతెన పక్క గోడను అదుపుతప్పి ఢీ కొంది. ఈ ప్రమాదంలో గంగరాజయ్యగౌడ్ (56), లక్ష్మి (35) అక్కడికక్కడే చనిపోయారు. శ్రీనివాసమూర్తి(51), తనూజ (36), సుచిత్ర (48), ఉషా (39), ధరణి (22) తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం బంగారుపాళెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కోలారు ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బంగారు పాళెంలోని మార్చురీకి తరలించారు. కాగా, కారు అతి వేగంగా వెళ్తుండగా ఒక చక్రం ఊడిపోవడంతో కారు అదుపుతప్పి అనేక పల్టీలు కొట్టిందని స్థానికులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment