సాక్షి, హైదరాబాద్: రేవంత్రెడ్డి చేసేది చిట్చాట్ కాదు.. చీట్చాట్ అంటూ మాజీ మంత్రి హరీష్రావు ఎద్దేవా చేశారు. ‘‘ఢిల్లీలో చిట్ చాట్ చేస్తూ ఓల్డ్ సిటీ విద్యుత్ బకాయిలను ఆదానీకి అప్పగిస్తామని రేవంత్ అన్నారు. అసెంబ్లీలో మేము అడిగితే మేమెక్కడ అన్నామని అంటున్నారు. అబద్ధాలను, గోబెల్స్ను ప్రచారం చేస్తున్నారు’’ అంటూ హరీష్రావు మండిపడ్డారు.
‘‘రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. రుణమాఫీ విషయంలో ఆయన గజదొంగ. వంద శాతం రుణమాఫీ చేస్తామని మోసం చేశావు. మీ మంత్రులు, ఎమ్మెల్యేలే రుణమాఫీ జరగలేదని అంటున్నారు. రుణమాఫీ కాలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే అధికారులపై పేపర్లు విసిరేశారు. రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతుందని. తుమ్మల చెప్పారు. ఆగస్టు 15లోగా ఎందుకు రుణమాఫీ చేయలేకపోయారు. నేను విసిరిన ఛాలెంజ్ అదే’’ అని హరీష్రావు అన్నారు.
‘‘రూ. 50 లక్షల రూపాయలు ఇస్తూ దొరికిన దొంగ రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితి. ఢిల్లీలో రాహుల్ గాంధీని రేవంత్ తప్పుదోవ పట్టిస్తున్నారు. రాహుల్ గాంధీ ఎప్పుడు హైదరాబాద్ వస్తారో చెప్పాలి. నేను ఎయిర్ పోర్టుకు వెళ్లి రాహుల్ గాంధీని రిసీవ్ చేసుకుని సీఎం స్వంత గ్రామానికి రుణమాఫీ అయిందో లేదో చెప్పడానికి తీసుకువెళ్తా. వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినట్లు 20 లక్షల మందికి రుణమాఫీ కాలేదు’’ అని హరీష్రావు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment