బంగ్లా ఫీల్డ్‌ సెట్‌ చేసిన పంత్‌.. కెప్టెన్‌ రియాక్షన్‌ ఇదే! | Ind vs Ban: Pant Does MS Dhoni 'Sets' Bangladesh's Field Rivals Do This | Sakshi
Sakshi News home page

Ind vs Ban: బంగ్లా ఫీల్డ్‌ సెట్‌ చేసిన పంత్‌.. కెప్టెన్‌ రియాక్షన్‌ ఇదే!

Published Sat, Sep 21 2024 12:21 PM | Last Updated on Sat, Sep 21 2024 12:41 PM

Ind vs Ban: Pant Does MS Dhoni 'Sets' Bangladesh's Field Rivals Do This

టెస్టు క్రికెట్‌ పునరాగమనంలో టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ ఆకట్టుకుంటున్నాడు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 39 పరుగులతో ఫర్వాలేదనిపించిన.. రెండో ఇన్నింగ్స్‌లో 88 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. మైదానంలో పంత్‌ ఎంత యాక్టివ్‌గా ఉంటాడో తెలిసిందే.

ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు కవ్విస్తే కయ్యానికి కాలుదువ్వే పంత్‌.. అదే సమయంలో తన సరదా చేష్టలతో వారికి ఉడికించడానికీ వెనుకాడడు. భారత్‌- బంగ్లా మధ్య శనివారం నాటి మూడో రోజు ఆట సందర్భంగా బజ్‌బాల్‌ తరహా దూకుడుతో శుబ్‌మన్‌ గిల్‌తో కలిసి పంత్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

ఈ క్రమంలో పంత్‌.. బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ నజ్ముల్‌ షాంటోను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘భాయ్‌.. ఇక్కడ ఒకరు ఉండాలి. ఒక ఫీల్డర్‌ను ఇక్కడ సెట్‌ చెయ్‌’’ అంటూ ఆన్‌సైడ్‌ ఫీల్డింగ్‌ గురించి సలహాలు ఇచ్చాడు. ఇందుకు స్పందించిన షాంటో.. మిడ్‌ వికెట్‌ వద్ద ఫీల్డర్‌ను సెట్‌ చేయడం విశేషం.

కాగా 2019 వన్డే వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ సందర్భంగా మహేంద్ర సింగ్‌ ధోని సైతం ఇదే విధంగా వ్యవహరించాడు. ఫీల్డర్‌ సబ్బీర్‌ రహ్మాన్‌ను కాస్త జరగమని చెప్పగా.. అతడు అదే ఫాలో అయ్యాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement