Maharashtra elections
-
కేంద్ర ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
-
Boston: ఈసీపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వ్యవస్థ రాజీ పడినట్లు కనిపిస్తోందని, ఆ వ్యవస్థలోనే ఏదో తప్పు ఉందంటూ వ్యాఖ్యానించారాయన. ఈ క్రమంలో మహారాష్ట్ర ఎన్నికల ప్రస్తావననూ ఆయన తీసుకొచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ(Rahul Gandhi).. ఆదివారం బోస్టన్లో ప్రవాస భారతీయులు పాల్గొన్న ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. ‘‘ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో(Maharashtra Election Fraud) 5.30 గంటల నుంచి 7.30 గంటల మధ్య 65 లక్షల మంది ఓటు వేసినట్లు ఎన్నికల సంఘం చెప్పింది. ఒక్కో ఓటర్ ఓటు వేయడానికి 3 నిమిషాల సమయం పడుతుంది. అలాంటప్పుడు అంత తక్కువ వ్యవధిలో అంతమంది ఎలా ఓటు వేయగలరు?. అక్కడ ఏదో తప్పు జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది’’ అని రాహుల్ అన్నారు.बोस्टन : चुनाव आयोग ने हमें शाम 5:30 बजे तक के मतदान के आंकड़े दिए और शाम 5:30 बजे से 7:30 बजे के बीच 65 लाख मतदाताओं ने मतदान किया. ऐसा होना शारीरिक रूप से असंभव है :राहुल गांधी #RahulGandhi #MaharashtraElection #ElectionCommission #RahulGandhiUSA #Boston pic.twitter.com/8kSVOhZ6BU— Sumit Kumar (@skphotography68) April 21, 2025‘‘ఎన్నికల సంఘం(Election Commission) రాజీ పడినట్లు ఇక్కడే అర్థమవుతోంది. ఆ వ్యవస్థలోనే ఏదో తప్పిదం ఉంది. ఇదే విషయాన్ని నేను చాలాసార్లు ప్రస్తావించాను. మహా ఎన్నికలకు సంబంధించిన వీడియోలు చూపించాలని మేం అడిగాం. అందుకు ఈసీ తిరస్కరించింది. ఇప్పుడు అలా అడగడానికి వీలు లేదంటూ చట్టాన్ని కూడా మార్చేశారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే వేదికగా ఆయన అమెరికా భారత్ మధ్య సంబంధాల గురించి కూడా మాట్లాడారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్.. సోమవారం బ్రౌన్ యూనివర్సిటీలో ప్రసంగించనున్నారు. ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీ ఈసీపై ఈ తరహా ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కాదు. అయితే.. రాహుల్ సహా పలువురు ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలను ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా ఈవీఎంలను మేనేజ్ చేయొచ్చనే ఆరోపణలను కూడా తోసిపుచ్చుతూ వస్తోంది. అయినప్పటికీ వరుసగా ఆయా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ఓటర్ల జాబితాల ఆధారంగా ప్రతిపక్షాలు ఈసీపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. -
మహారాష్ట్ర ఎన్నికల్లో భారీ అక్రమాలు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఎన్నికల్లో భారీ అవకతవకలు(irregularities)చోటుచేసుకున్నాయని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)ఆరోపించారు. రాష్ట్రంలోని వయోజనుల కంటే నమోదైన ఓటర్లే ఎక్కువమంది ఉన్నారన్నారు. అయిదేళ్ల క్రితం కంటే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య ఐదు నెలల కాలంలో ఎక్కువ మంది పేర్లను జాబితాలో చేర్చారని చెప్పారు. 2024లో జరిగిన లోక్సభ ఎన్ని కలు, అసెంబ్లీ ఎన్నికలనాటి ఓటరు జాబి తాను ఇవ్వాలంటూ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్లు, శివసేన(యూబీటీ), ఎన్సీపీ(ఎస్పీ)లు కోరినా ఈసీ ఇప్పటి వరకు స్పందించలేదని ఆయన తెలిపారు. దీనిపై తాము చట్ట ప్రకారం ముందుకెళతామని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ శుక్రవారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్, ఎన్సీపీ(ఎస్పీ)నేత సుప్రియా సూలేలతో కలిసి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చాలా మంది ఓటర్ల పేర్ల తొలగింపు లేక బదిలీ చేశారని, వీరిలో ఎక్కువ మంది దళితులు, గిరిజనులు, మైనారిటీ వర్గాల వారే ఉన్నారని రాహుల్ వివరించారు. కొత్తగా చేర్చిన ఓటర్ల కంటే తొలగింపునకు గురైన పేర్లే ఎక్కువగా ఉన్నాయని ప్రతిపక్ష పార్టీలు అనుమానిస్తున్నాయని ఆయన చెప్పారు.5 నెలల్లోనే 39 లక్షల కొత్త ఓటర్లు‘మహారాష్ట్ర ఎన్నికలకు(Maharashtra election)సంబంధించి ఈసీని పలు ప్రశ్నలు అడిగాం. 2019 విధాన సభ ఎన్నికలు, 2024 లోక్సభ ఎన్నికల మధ్యలో ఐదేళ్ల వ్యవధిలో మహారాష్ట్రలో 32 లక్షల ఓటర్ల పేర్లను చేర్చారు. అయితే, 2024 లోక్సభ ఎన్నికలు, 2024 అసెంబ్లీ ఎన్నికలకు గాను కేవలం ఐదు నెల్ల వ్యవధిలో ఏకంగా 39 లక్షల కొత్త ఓటర్ల పేర్లు చేరాయి’అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత అంత స్వల్ప వ్యవధిలో అంత ఎక్కువ మంది ఓటర్లను కొత్తగా ఎలా చేర్చారు? ఈ 39 లక్షల మంది ఓటర్లు ఎవరు? 39 లక్షల మంది హిమాచల్ ప్రదేశ్ మొత్తం జనాభాతో సమానం. అయిదేళ్లలో కంటే కేవలం ఐదు నెలల్లో మహారాష్ట్రలో ఈసీ ఎక్కువ మంది ఓటర్లు ఎందుకు చేర్చింది?’అని ఆయన ప్రశ్నించారు. కొత్త ఓట్లు బీజేపీ ఖాతాలోకేమహారాష్ట్రలో వయోజనుల జనాభా 9.54 కోట్లు. అసెంబ్లీ ఎన్నికల నాటికి ఓటర్ల సంఖ్య 9.7 కోట్లు. మహారాష్ట్రలోని మొత్తం వయోజనుల కంటే నమోదైన ఓటర్లు ఎక్కువ మంది ఉండటం ఎలా సాధ్యమని ఆయన సందేహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఓటు బ్యాంకు యథాతథంగా ఉండగా కొత్తగా చేరిన ఓటర్లలో ఎక్కువ మంది బీజేపీకే ఓటేశారన్నారు. ఉదాహరణకు కంతీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సాధించిన మెజారిటీ కొత్తగా చేరిన ఓటర్ల సంఖ్యతో సమానంగా ఉందని ఆయన వివరించారు. అదేవిధంగా, లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మూడు ప్రధాన ప్రతిపక్షాలకు పడిన ఓట్ల సంఖ్యలో ఎలాంటి తగ్గుదల నమోదు కాలేదని కూడా ఆయన చెప్పారు. తమ ప్రశ్నలకు ఈసీ ఎందుకు బదులివ్వడం లేదన్నారు. పారదర్శకంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఈసీకుందన్నారు. లేకుంటే తమ తదుపరి చర్య న్యాయస్థానాలను ఆశ్రయించడమేనని స్పష్టం చేశారు.అలాగైతే కేంద్రానికి బానిస అన్నట్లే..శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ...‘ఈసీ సజీవంగా, సొంతంగా పనిచేయగలిగి ఉంటే రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. లేదంటే కేంద్ర ప్రభుత్వానికి అది బానిసగా మారినట్లే భావించాల్సి ఉంటుంది. ప్రభుత్వ సంకెళ్ల నుంచి ఈసీ బయటకు రావాలి’అని అన్నారు. ఎన్నికల్లో గెలిచాక కూడా తమ పార్టీకి చెందిన మల్షిరాస్ ఎమ్మెల్యే ఉత్తమ్ జన్కార్ మళ్లీ ఎన్నికలు జరపాలని, ఈసారి బ్యాలెట్ను వాడాలని డిమాండ్ చేయగా, ప్రభుత్వం అక్కడికి పోలీసులను పంపించిందని ఎన్సీపీ(ఎస్పీ)నేత సుప్రియా సూలే ఆరోపించారు.అన్ని గణాంకాలను వెల్లడిస్తాం: ఈసీమహారాష్ట్ర ఎన్నికల్లో అవకత వకలు జరిగాయంటూ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేసిన పలు ఆరోపణలపై ఈసీ స్పందించింది. పూర్తి గణాంకాలతో లిఖిత పూర్వకంగా సమాధానమిస్తామని స్పష్టం చేసింది. -
మహారాష్ట్ర ప్రజలు గుర్తించి గుణపాఠం చెప్పారు: హరీష్ రావు
-
వయనాడ్ లో భారీ మెజార్టీతో ప్రియాంక గాంధీ విజయం
-
ఏక్నాథ్ షిండే అనే నేను.. రెండోసారి?
-
Kishan Reddy: బీజేపీపై రాహుల్ గాంధీ తప్పుడు ప్రచారం చేశారు
-
మహారాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి ఎవరు?
/telugu-news/national/liveblog/maharashtra-election-2024-counting-result-news-live-updates-2264980
-
Live: ‘మహా’యుతిదే అధికారం.. 25న సీఎం ఎన్నిక?!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మరికాసేపట్లో ఆ ఉత్కంఠకు తెరపడనుంది. -
‘మహా’ పోరు.. ఓటు వేసిన ప్రముఖులు వీరే..
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నేడు పోలింగ్ కొనసాగుతోంది. మహారాష్ట్రలో ఒకే విడతలో మొత్తం 288 నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైన వెంటనే బారామతిలో డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అభ్యర్థి అజిత్ పవార్ ఓటు వేశారు. ముంబైలోని రాజ్భవన్లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే, నాగ్పుర్లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఓటు వేశారు. అలాగే, ఎంపీ సుప్రియా సూలే తన కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముంబైలోని పలు పోలింగ్ బూత్లో క్రికెటర్ సచిన్ సహా ఆయన కుటుంబ సభ్యులు ఓటు వేశారు. బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్, సినీ నటుడు రాజ్ కుమార్ రావ్, నటి గౌతమీ కపూర్, నటులు అక్షయ్ కుమార్, అలీ ఫజల్ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | | Former Indian Cricketer Sachin Tendulkar, his wife and their daughter cast their votes at a polling station in Mumbai#MaharashtraAssemblyElections2024 pic.twitter.com/JX8WASuy4Y— ANI (@ANI) November 20, 2024 #WATCH | Mumbai: Former Indian Cricketer Sachin Tendulkar, his wife Anjali Tendulkar and their daughter Sara Tendulkar, show their inked fingers after casting vote for #MaharashtraAssemblyElections2024 pic.twitter.com/ZjHix46qmb— ANI (@ANI) November 20, 2024 #WATCH | Filmmaker and actor Farhan Akhtar shows his inked finger after casting his vote for #MaharashtraAssemblyElections2024, at a polling booth in Bandra, Mumbai. pic.twitter.com/R9wyvbphFx— ANI (@ANI) November 20, 2024 #WATCH | Mumbai: Actor Ali Fazal shows his inked finger after casting his vote for #MaharashtraAssemblyElections2024 pic.twitter.com/GVspi9nAfA— ANI (@ANI) November 20, 2024 #WATCH | NCP-SCP MP Supriya Sule along with her family show their inked fingers after casting a vote for #MaharashtraAssemblyElections2024NCP has fielded Deputy CM Ajit Pawar and NCP-SCP has fielded Yugendra Pawar from the Baramati Assembly constituency. pic.twitter.com/x22KuN8OEI— ANI (@ANI) November 20, 2024 Superstar #AkshayKumar is among the first voters to cast their vote today.pic.twitter.com/EXKGNWZ0pq— Nitesh Naveen (@NiteshNaveenAus) November 20, 2024 -
బాబాయి Vs అబ్బాయి: ఎన్నికల వేళ అజిత్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతున్న వేళ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సంచలన కామెంట్స్ చేశారు. తన కుటుంబ సభ్యులు బరిలో ఉన్నప్పటికీ ఈసారి గెలుపు మాత్రం తనదే అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తన విజయాన్ని అడ్డుకోలేరని చెప్పారు.మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బారామతిలోని పోలింగ్ బూత్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఇదే సమయంలో బారామతి రాజకీయాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈసారి బారామతిలో గెలుపు నాదే. లోక్సభ ఎన్నికల సమయంలో కూడా, మా కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు పోటీ చేయడం మరియు అందరూ చూశారు. నేను బారామతిలో అందరినీ కలవడానికి ప్రయత్నించాను. ప్రతీ ఒక్కరినీ కలిసి వారితో మాట్లాడాను. ఈసారి బారామతి ప్రజలు నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. అలాగే, ఓట్ల కోసం డబ్బులు పంచిన వ్యక్తులు ఎవరో ప్రజలకు బాగా తెలుసు అంటూ కామెంట్స్ చేశారు.#WATCH | After casting his vote, Maharashtra Deputy CM and NCP candidate from Baramati Assembly constituency, Ajit Pawar says "Even during Lok Sabha, members of our family were contesting against each other and everyone has seen that. I tried to meet everyone in Baramati. I am… pic.twitter.com/jC0JbG7zSO— ANI (@ANI) November 20, 2024ఇదిలా ఉండగా.. బారామతి అసెంబ్లీ స్థానం బాబాయి, అబ్బాయి మధ్య రసవత్తర పోటీ నెలకొంది. పవార్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న బారామతి నియోజకవర్గం ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడి నుంచి శరద్ పవార్, ఆ తర్వాత అజిత్ పవార్ దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1967లో తొలిసారి బారామతి అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికైన శరద్ పవార్ 1990 వరకు ప్రాతినిధ్యం వహించారు. 1991 ఉప ఎన్నిక నుంచి 2019 వరకు అజిత్ పవార్ గెలిచారు.దాదాపు ఆరు దశాబ్దాల నుంచి పవార్ కుటుంబం కంచుకోటగా ఉన్న బారామతి స్థానంలో ఈసారి ఇరువర్గాలు అమీతుమీకి సిద్ధమయ్యాయి. ప్రస్తుతం ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న అజిత్ పవార్ మరోసారి బరిలో నిలిచారు. వరుసగా ఏడుసార్లు గెలిచిన అజిత్ ఈసారి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఎన్సీపీ(ఎస్పీ) తరఫున యుగేంద్ర పవార్ బరిలో నిలిచారు. అజిత్ పవార్ సోదరుడు శ్రీనివాస్ కుమారుడు యుగేంద్ర. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో తొలిసారి పవార్ కుటుంబం మధ్య పోరు జరిగింది. బారామతి లోక్సభ స్థానంలో అజిత్ భార్య సునేత్ర పవార్ ఓడిపోయారు. ఎన్సీపీ(ఎస్పీ) తరఫున పోటీ చేసిన శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే గెలుపొందారు. సునేత్రపై దాదాపు లక్షన్నర ఓట్ల మెజారిటీతో సుప్రియా విజయం సాధించారు.
/telugu-news/national/liveblog/maharashtra-assembly-election-2024-voting-live-updates-2261100
-
‘మహా’ అసెంబ్లీ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పు ఎవరివైపు.. ఓటర్లు తీర్పు... -
రేపే పోలింగ్.. మహారాష్ట్ర చరిత్రలోనే టఫ్ ఫైట్!
రెండు జాతీయ పార్టీలు. నాలుగు ప్రాంతీయ పార్టీలు. పలు చిన్న పార్టీలు. భారీ సంఖ్యలో స్వతంత్రులు, రెబెల్స్. వెరసి మహారాష్ట్ర చరిత్రలోనే అత్యంత సంకుల సమరానికి రంగం సిద్ధమైంది. కనీవినీ ఎరగనంత పోటాపోటీగా సాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోరు చివరి దశకు చేరుకుంది. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని ఆరు ప్రాంతాలకు గాను ఏకంగా నాలుగింట విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ఆధిపత్యమే సాగింది. అధికార మహాయుతి కూటమి కొంకణ్లో మాత్రమే కాస్త పరువు నిలుపుకుంది. అదే జోరును కొనసాగించాలని ఎంవీఏ, మిగతా ప్రాంతాల్లోనూ పాగా వేయాలని మహాయుతి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి.పశ్చిమ మహారాష్ట్ర.. షుగర్ బెల్ట్గా పిలిచే ఈ ప్రాంతం అత్యధికంగా 70 అసెంబ్లీ స్థానాలకు నిలయం. గత అసెంబ్లీ ఎన్నికల్లో అవిభక్త ఎన్సీపీ ఏకంగా 27 స్థానాలు నెగ్గింది. బీజేపీకి 20, కాంగ్రెస్కు 12, అవిభక్త శివసేనకు 5 స్థానాలు దక్కాయి. శివసేన, ఎన్సీపీల్లో చీలిక అనంతరం జరిగిన ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని 10 లోక్సభ స్థానాల్లో ఎంవీఏ ఐదింటిని నెగ్గి స్వల్ప పైచేయి సాధించగా మహాయుతి నాలుగింటితో సరిపెట్టుకుంది. మిగతా స్థానంలో నెగ్గి్గన స్వతంత్ర అభ్యర్థి కూడా కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా లోక్సభ ఫలితాలే పునరావృతం కావచ్చని భావిస్తున్నారు. ఇక్కడ ఎన్సీపీ అజిత్, శరద్ పవార్ వర్గాలు ఏకంగా 20 స్థానాల్లో ముఖాముఖి తలపడుతుండటం విశేషం.లోక్సభ పోరులో పవార్ వర్గం ఏకంగా 3 స్థానాల్లో నెగ్గగా అజిత్ వర్గానికి ఒక్క సీటూ దక్కకపోవడం విశేషం. పవార్ల కంచుకోట బారామతి ఈ ప్రాంతంలోనే ఉంది. ఆ స్థానంపై పట్టు నిలుపుకునేందుకు శరద్ పవార్ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. పార్టీని చీల్చిన అజిత్ పవార్ ఇక్కడ బరిలో ఉండటంతో ఆయన్ను ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకున్నారు. మేనల్లుడు యుగేంద్రను అజిత్పై బరిలో దించారు. పశ్చిమ మహారాష్ట్రలో సహకార సంఘాల హవా నడుస్తుంటుంది. రైతు సమస్యలు ఈసారి ఇక్కడ ప్రధానాంశంగా మారాయి. కొంకణ్.. ఎంవీఏపై పాలక కూటమి స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించిన ఏకైక ప్రాంతం. లోక్సభ ఎన్నికల్లో ఇక్కడి 6 స్థానాల్లో మహాయుతి ఏకంగా ఐదింట నెగ్గింది. దాన్ని నిలుపుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా కొంకణ్కు పోర్టు, మలీ్టమోడల్ కారిడార్, మెగా రిఫైనరీ తదితర భారీ ప్రాజెక్టులను ప్రకటించింది. దాంతో ఎంవీఏ కూటమి తన ప్రచారాన్ని ఈ ప్రాంతంలో శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటన చుట్టే తిప్పుతూ లబ్ధి పొందే ప్రయత్నాల్లో పడింది. కొంకణ్ శివసేన చీఫ్, సీఎం ఏక్నాథ్ షిండే కంచుకోట. ఇక్కడి కోప్రీ–పచ్పాఖడీ నుంచి ఆయన బరిలో దిగారు. షిండేపై ఆయన రాజకీయ గురువు ఆనంద్ డిఘే మేనల్లుడు కేదార్ ప్రకాశ్ను ఉద్ధవ్ సేన పోటీకి నిలిపింది. విదర్భ.. మహారాష్ట్రలో అత్యంత వెనకబడ్డ ప్రాంతాల్లో ఒకటి. లోక్సభ ఎన్నికల్లో ఇక్కడి 10 స్థానాల్లో ఏకంగా ఏడు ఎంవీఏ ఖాతాలో పడ్డాయి. వాటిలో ఐదింటిని కాంగ్రెసే నెగ్గింది. మరాఠాలతో పాటు ఓబీసీలు, దళితులు ఇక్కడ చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటారు. ఒకప్పుడు ఈ ప్రాంతం కాంగ్రెస్ కంచుకోట. కానీ 20 ఏళ్లుగా ఇక్కడ బాగా బలహీనపడుతుండగా బీజేపీ పుంజుకుంటోంది. దీనికి తోడు ప్రత్యేక విదర్భ రాష్ట్ర డిమాండ్కు మద్దతివ్వడం బీజేపీకి ఆదరణను మరింత పెంచింది. అధికారాన్ని నిలుపుకోవాలంటే విదర్భలో వీలైనన్ని ఎక్కువ స్థానాలు నెగ్గడం మహాయుతికి కీలకం. దాంతో పారిశ్రామిక హబ్తో పాటు ఈ ప్రాంతంపై వరాల వర్షం కురిపించింది. ఇక్కడ దాదాపుగా అన్ని పారీ్టలకూ రెబెల్స్ బెడద తీవ్రంగా ఉంది. రైతు సమస్యలు కూడా ఇక్కడ ఓటర్లను బాగా ప్రభావితం చేసేలా కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో బీజేపీ నుంచి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పీసీసీ చీఫ్ నానా పటోలే పోటీ చేస్తున్నారు. మరాఠ్వాడా.. రాష్ట్రంలో అత్యంత వర్షాభావ ప్రాంతం. లోక్సభ ఎన్నికల్లో ఎంవీఏ హవా సాగింది. ఏడింట 6 స్థానాలు విపక్ష కూటమి ఖాతాలోకే వెళ్లాయి. మిగతా ఒక్క స్థానాన్ని షిండే శివసేన గెలుచుకుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బీజేపీ, అవిభక్త శివసేన 46 స్థానాలకు గాను 28 సీట్లను గెలుచుకున్నాయి. మరాఠాలను ఓబీసీ జాబితాలో చేర్చాలంటూ మనోజ్ జరంగే ఉద్యమించిన నేపథ్యంలో ఈసారి మాత్రం ఆ పరిస్థితి లేదు. మరాఠా రిజర్వేషన్లు కీలకంగా మారడం మహాయుతికి ఇబ్బంది కలిగించేదే. మరాఠా ఓట్లపై ఎంవీఏ, ఓబీసీ ఓట్లపై మహాయుతి ఆశలు పెట్టుకున్నాయి. మరాఠాలు, ఓబీసీలతో పాటు ముస్లింలు కూడా ఇక్కడ చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటారు. ఉత్తర మహారాష్ట్ర.. ఇది ప్రధానంగా వ్యవసాయ ప్రాంతం. లోక్సభ ఎన్నికల్లో ఏడింటి ఆరు సీట్లు ఎంవీఏ ఖాతాలో పడగా బీజేపీ ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. ఈ ప్రాంతంలో ఉల్లి రైతులు ఎక్కువ. ఉల్లి ఎగుమతుల నిషేధంతో కేంద్రం తమ పొట్ట కొట్టిందన్న ఆగ్రహం వారిలో కనిపిస్తోంది. ఇది మహాయుతికి బాగా చేటు చేసేలా కనిపిస్తోంది. నాసిక్, పరిసర ప్రాంతాల్లో గణనీయంగా ఉన్న గిరిజనుల ఓట్లు కూడా ఇక్కడ కీలకమే. గత అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇటీవలి లోక్సభ పోరులోనూ వారు ఎంవీఏ కూటమికే దన్నుగా నిలిచారు. ముంబై.. దేశ ఆర్థిక రాజధాని. ముంబైతో పాటు శివారు ప్రాంతాల్లో కలిపి 36 అసెంబ్లీ స్థానాలున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఇక్కడి ఆరు స్థానాల్లో మహాయుతికి దక్కింది రెండే. ముంబైపై బాగా పట్టున్న ఉద్ధవ్ శివసేన 3 స్థానాలు చేజిక్కించుకుంది. ఈసారి షిండే, ఉద్ధవ్ సేనల మధ్య ఇక్కడ హోరాహోరీ సాగుతోంది. వీటికి తోడు మహారాష్ట్ర నవనిర్మాణ సేన కూడా ఇక్కడ గట్టి ప్రభావమే చూపుతుంది.వరాల జల్లులు⇒ రెండు కూటములూ ఈసారి తమ మేనిఫెస్టోల్లో అన్ని వర్గాలపైనా వరాల వర్షం కురిపించాయి.⇒ లడ్కీ బెహన్ యోజన మొత్తాన్ని రూ.1,500 నుంచి రూ.2,100కు పెంచుతామని మహాయుతి ప్రకటించగా తామొస్తే ఏకంగా రూ.3,000 ఇస్తామని ఎంవీఏ పేర్కొంది.⇒ మహాయుతి రైతు రుణ మాఫీ హామీకి పోటీగా తాము ఏకంగా రూ.3 లక్షల దాకా రైతు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది.⇒ 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మహాయుతి హామీ ఇస్తే నిరుద్యోగ యువతకు నెలకు రూ.4,000 ఇస్తామని ఎంవీఏ చెప్పింది. -
పొలిటికల్ ట్విస్టులతో దద్దరిల్లిపోతున్న మహారాష్ట్ర
-
హానికరమైన కొత్త జాతీయవాదం
2024 నవంబర్ 11న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే’ అనే విచిత్రమైన నినాదాన్ని ఇచ్చారు. ఇదొక భాషాపరమైన కొత్త క్రీడ అని చెప్పాలి. మోదీ నినాదం ముస్లింలకు వ్యతిరేకంగా ఉందనుకొని, కొందరు దాన్ని మతపరమైనదిగా వ్యాఖ్యానించారు. కానీ ఈ నినాదం కుల గణన ప్రచారాన్ని వ్యతిరేకించేది. సుప్రీంకోర్టు విధించిన 50 శాతం రిజర్వేషన్ పరిమితిని తొలగించడం లక్ష్యంగా పెట్టుకున్నది. భారతీయ సమాజాన్ని కుల గణన చీల్చుతుందనే ప్రచారం చేస్తున్నారు గానీ, ప్రతి కులం వాస్తవ స్థితి తెలియాలంటే కుల గణనే ఆధారం. కుల గణనతో కూడిన సామాజిక ఆర్థిక గణన ఇప్పటి అవసరం.నరేంద్ర మోదీ ఇచ్చిన ‘ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే’ నినాదంలోని భాషను చూద్దాం. ఏక్ అనేది ఐక్యతకు హిందీ పదం. సేఫ్ అనేది ఆంగ్ల పదం. దీని అర్థం మనకు తెలుసు. మహారాష్ట్రలో ఒక నినాదంలో సేఫ్ అనే ఆంగ్ల పదాన్ని ఎందుకు ఉపయోగించారు? ఆ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆంగ్ల భాష వ్యాప్తి చెందడం వల్లనే. అదే ఉత్తరప్రదేశ్ అయివుంటే, బహిరంగ సభలలో కూడా ఒక ఆంగ్ల పదాన్ని మోదీ తన నినాదంలో ఉపయోగించరు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టడానికి మోదీ, ఆయన పార్టీ వ్యతిరేకం. అదే హిందుత్వ మద్దతుదారులు నిర్వహిస్తున్న అగ్రశ్రేణి కార్పొరేట్ పాఠశాలలు ఆంగ్ల భాషను ధనికులకు అమ్ముతూ అత్యున్నత వ్యాపారాన్ని చేస్తున్న ప్పుడు మాత్రం మౌనంగా ఉంటారు. నిజమైన లక్ష్యంఇంతకుముందు యోగి ఆదిత్యనాథ్ ‘బటేంగే తో కటేంగే’ నినాదం ఇచ్చారు. ఈ నినాదాన్ని ఆర్ఎస్ఎస్ ఆమోదించింది. ఇప్పుడు మోదీ దాన్ని మిశ్రమ భాషతో వాడుతున్నారు. 2014 ఎన్నికల నుండి బీజేపీ, ఇతర వెనుకబడిన తరగతులనుంచి తెలివిగా ఓట్లను రాబట్టుకోవడం ప్రారంభించింది.ఆరెస్సెస్, బీజేపీ 2014 ఎన్నికల నుండి కుల సమీకరణను అంగీకరించాయి. దాంతో గుజరాత్ నుండి ఓబీసీ అయిన మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా తేవడంతో పాటు, చదరంగం లాగా తెలివిగా కుల క్రీడను ఆడటం మొదలెట్టాయి. యూపీలో యాదవుల వంటి శూద్ర అగ్రవర్ణ సమాజం పాలకులుగా ఉన్న రాష్ట్రాల్లో, పాలక కుల నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న దిగువ ఓబీసీలను సమీకరించారు. ఆ విధంగారెండుసార్లు ఆ రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ స్థానాలను, అధికారాన్ని కైవసం చేసుకోగలిగారు.చాలా కాలంగా శూద్ర పాలక కులాలుగా రెడ్డి, వెలమలు ఉన్న తెలంగాణలో 2024 ఎన్నికల్లో ‘ఈసారి బీసీ ముఖ్యమంత్రి’ అనే నినాదంతో మున్నూరు కాపులు, ముదిరాజ్లపై బీజేపీ దృష్టి సారించింది. సాధారణంగా తెలంగాణలో రెడ్లు కాంగ్రెస్తో, వెలమలు బీఆర్ఎస్తో ఉన్న సంగతి తెలిసిందే. మాలలు కాంగ్రెస్లో ఉన్నందున దళితుల్లో మాదిగలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు మాదిగల ఓట్లను రాబట్టేందుకు, ప్రత్యేక మాదిగ బహిరంగ సభలో ప్రధాని స్వయంగా ప్రసంగించారు. ఈ సమావేశంలోనే ఆయన మాదిగలకు సుప్రీంకోర్టులో న్యాయపరమైన అడ్డంకిని అధిగమించేందుకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. అందువల్ల ఎస్సీ రిజర్వేషన్లలో ఉపకులాల విభజన రాజ్యాంగ విరుద్ధం కాదని సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తుల బెంచ్ ముందు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దాంతో రాజ్యాంగబద్ధంగా ఏదైనా సంక్షేమ ప్రయోజనాలు అందించే రిజర్వేషన్ల కోసం ఉపకుల వర్గీకరణను సుప్రీంకోర్టు సమర్థించింది.కుల గణనతోనే రిజర్వేషన్లుఇలాంటి విభజన రాజకీయాలు ప్రమాదకరమని ఆరెస్సెస్, బీజేపీ శక్తులు భావించడం లేదు. వారు తమ కుల ఆధారిత విభజ నలను జాతీయవాదాలుగా ప్రదర్శిస్తారు. అయితే ఆ తీర్పును అమలు చేయాలంటే, అంతకుముందటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, భారత దేశం అంతటా ప్రతి ఉప కులానికి సంబంధించిన వస్తుగతమైన, ధ్రువీకరించదగిన డేటా తప్పనిసరి. ఈ ఉప కుల రిజర్వేషన్ తీర్పు అనేది, రిజర్వేషన్లు వర్తించే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలలో న్యాయమైన వాటాను అడిగే అన్ని ఉప కులాలకూ వర్తిస్తుంది. అందువల్ల రాజ్యాంగ సంస్థ అయిన ‘రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా’ సేకరించిన జాతీయ కుల గణన డేటా లేకుండా సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడం సాధ్యం కాదు.అయినా రాబోయే జాతీయ జనాభా గణనలో కుల గణనను చేపట్టాలని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కోరుకోవడం లేదు. అందుకే సుప్రీంకోర్టు తీర్పు, మోదీ ప్రభుత్వం రెండూ రాష్ట్ర ప్రభుత్వాలకు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టాయి. ఎందుకంటే అనేక ఉపకులాలు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని అడుగు తున్నాయి. కానీ, విశ్వసనీయమైన కుల డేటాను సేకరించడానికికేంద్రం సుముఖంగా లేదు.ఈ నేపథ్యంలోనే కుల గణన భారతీయ సమాజాన్ని చీల్చుతుందనే ప్రచారాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్, ముఖ్యంగా రాహుల్గాంధీ, కుల గణనను సమాజానికి చెందిన సామాజిక ఆర్థిక వివరా లకు సంబంధించిన ఎక్స్రేగా ప్రచారం చేస్తున్నందున, దీన్ని అగ్ర వర్ణాలు వ్యతిరేకిస్తున్నాయి. ఆరెస్సెస్, బీజేపీ ప్రయోజనాలు ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఐదు అగ్ర కులాలతో ముడిపడి ఉన్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు బీజేపీ ‘ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే’ ప్రచారాన్ని ప్రారంభించింది. అయితే, 2024 ఎన్నికలనుంచి మోదీ, అమిత్ షా ఓబీసీ ఓట్లను తామే నిలుపుకోవడం కోసం, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఓబీసీ రిజర్వేషన్లను తగ్గించి ముస్లిం రిజర్వేషన్లు పెంచుతారని ప్రచారం ప్రారంభించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు అన్ని ప్రయో జనాలను కోల్పోతారని బహిరంగంగానే చెబుతున్నారు. వారు భార తీయ ముస్లింలకూ, మిగిలిన జనాభాకూ మధ్య స్పష్టమైన రేఖను గీయాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ముస్లింలు చాలా కాలంగా ఓట్ల పరంగా కాంగ్రెస్తో జతకట్టారు.కుల గణన ముస్లింలకు ఎలా ఉపయోగం?భారతీయ ముస్లిం సమాజం చాలాకాలంగా రిజర్వేషన్ భావ జాలాన్ని అంగీకరించలేదు. వారు తమలో కుల ఉనికిని తిరస్కరించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం సచార్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ నివేదికతో తమ విద్యాపరమైన వెనుక బాటుతనం ఒక తీవ్రమైన సమస్య అని ముస్లింలు గ్రహించారు. వాస్తవానికి, వారి వెనుకబాటుతనానికి వారి మతంతో సంబంధంఉంది. ముస్లింలు కూడా కుల గణనను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు.రిజర్వేషన్ ను వాడుకోవడం తమ సామాజిక స్థాయికి తగనిదని భావించిన శూద్ర అగ్రవర్ణాలు కూడా ఇప్పుడు రిజర్వేషన్ వ్యవస్థలోకి రావాలనుకుంటున్నాయి. జాతీయ రాజకీయాల్లో రిజర్వేషన్ల సిద్ధాంతం ప్రధాన అంశంగా మారింది. అందుకే రెడ్లు, మరాఠాలు కుల గణనకు విముఖత చూపడం లేదు.కుల గణనతో కూడిన సామాజిక ఆర్థిక గణన భారతీయ ముస్లింలలోని ప్రతి కులం వాస్తవ స్థితిని బయటకు తెస్తుంది. ముస్లింలలో ఉన్నత కులాలు ఉన్నాయి. వీరు మొఘల్, మొఘల్ అనంతర భూస్వామ్య వ్యవస్థ నుండి, సాంప్రదాయిక ఇస్లామిజం నుండి ప్రయోజనం పొందారు. ఉదాహరణకు, పేద దిగువ కులాలముస్లింలు వెనుకబడిన మదర్సా ఉర్దూ మీడియం విద్యలోకి నెట్ట బడ్డారు; ధనిక ఉన్నత కుల ముస్లింలు స్వాతంత్య్రానికి ముందు రోజుల నుండీ ఆంగ్ల మాధ్యమ విద్యను పొందారు. ముస్లింల మధ్య ఉన్న ఈ వలయాన్ని కూడా ఛేదించి తీరాలి.కుల గణన, సంక్షేమ పథకాల న్యాయబద్ధమైన పంపిణీ,విద్య– ఉద్యోగాలలో రిజర్వేషన్ ప్రయోజనాల కోసం జాతీయ డిమాండ్ నేపథ్యంలో ‘ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే’ నినాదాన్ని బీజేపీ తెలివిగా ఇచ్చింది. కుల గణన, సంక్షేమ వలయాన్ని అత్యంత అర్హులైన వారికి విస్తరించడం మాత్రమే... ఆధునిక అభివృద్ధి ప్రక్రియను కొనసాగించే భారతీయ మధ్యతరగతిని మరింతగాపెంచుతుంది.- వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త - ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ -
PM Modi: మోదీకి తప్పిన ప్రమాదం ?
-
కంగ్రాట్స్ సార్! మనకు ఈసారి డిపాజిట్ గ్యారంటీనట!!
కంగ్రాట్స్ సార్! మనకు ఈసారి డిపాజిట్ గ్యారంటీనట!! -
Maharashtra Elections: స్కూటర్లో రూ. 1.5 కోట్లు.. కంగుతిన్న పోలీసులు
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ తేదీ మరింత సమీపిస్తోంది. ఈ నేపధ్యంలో ఎన్నికల కోడ్ అమలవుతోంది. దీంతో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తూ, భారీగా నగదును సీజ్ చేస్తున్నారు.తాజాగా మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలో ఆశ్చర్యకర ఉదంతం వెలుగుచూసింది. స్కూటర్పై ఏకంగా రూ.1.5 కోట్లతో వెళ్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంత భారీ మొత్తాన్ని స్కూటర్పై తీసుకువెళ్లడాన్ని చూసిన పోలీసులు తెగ ఆశ్యర్యపోయారు. ఈ భారీ మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనపై పోలీసులు మీడియాకు సమాచారమిచ్చారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘానికి కూడా తెలియజేశామన్నారు. పట్టుబడిన రూ.1.5 కోట్ల నగదును ఏదైనా అక్రమ కార్యకలాపాలకు వినియోగిస్తున్నారా లేదా ఎన్నికల్లో మనీలాండరింగ్కు సంబంధించినదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితుడు యశోధర నగర్కు చెందిన వ్యక్తి అని పోలీసులు గుర్తించారు. అతనిని సెంట్రల్ అవెన్యూ ప్రాంతంలో పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.అనుమానితుడు స్కూటర్ ట్రంక్లో దాచిన రూ.1.5 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఆ వ్యక్తి సమాధానాలు అస్పష్టంగా ఉన్నాయని, దీంతో తమకు అతనిపై అనుమానం పెరిగిందని పోలీసులు తెలిపారు. కాగా మహారాష్ట్రలో నవంబర్ 20న మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.ఇది కూడా చదవండి: ముంబై ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపులు -
మహాయుతికి ఉల్లిమంట
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఉల్లి ధరలు సామాన్యులకు కంటతడి పెట్టిస్తుంటే మరోపక్క ప్రస్తుత మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతిలో భాగమైన అధికార పార్టీ నేతలకు మంట పుట్టిస్తోంది. ఓ పక్క పెరుగుతున్న ధరలతో సామాన్యులు అధికార కూటమి ప్రభుత్వంపై నిప్పులు గక్కుతున్నారు. ఎగుమతులపై నిషేధంతో తమకు గిట్టుబాటు తగ్గిందని రైతులు సైతం గగ్గోలు పెడుతుండటం మహాయుతి కూటమికి సంకటంగా మారింది.దేశీయ అవసరాలకు అవసరమైన ఉల్లిలో 40 శాతం మహారాష్ట్ర నుంచే సరఫరా అవుతుండగా, ప్రస్తుత సీజన్లో భారీ వర్షాల కారణంగా ఉల్లి దిగుబడి గణనీయంగా తగ్గింది. దీంతో మహారాష్ట్రలోని నాసిక్, లాసల్గావ్ మార్కెట్లకు తరలివస్తున్న ఉల్లి సరకు పరిమాణం బాగా తగ్గిపోయింది. గత సంవత్సరం ఉల్లిసీజన్లో ప్రతి రోజూ దాదాపు 2,000 టన్నుల ఉల్లి మార్కెట్వ వచ్చింది. అది ప్రస్తుతం 300–400 టన్నుల మధ్య తచ్చాడుతోంది. దీనికి తోడు గత రబీలో సేకరించి పెట్టిన ఉల్లి నిల్వలు పూర్తిగా అడుగంటడం ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. దీంతో గత నెల రోజుల వ్యవధిలోనే ఉల్లి ధర కిలో రూ.40–50 నుంచి రూ.90–100కి ఎగబాకింది. దీని ప్రభావం మహారాష్ట్ర ఎన్నికలపై నేరుగా పడుతుందని ముందే పసిగట్టిన బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ధరల కట్టడికి రంగంలోకి దిగింది. ధర మరీ పెరిగిపోకుండా కట్టడిచేసేందుకు 4.7లక్షల టన్నుల బఫర్ నిల్వలోంచి 1.50లక్షల టన్నుల మేర విడుదలచేసింది. దీంతో నాసిక్ నుంచి మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లోని విక్రయ కేంద్రాల్లోకి ఉల్లి సరఫరా సాధ్యమైంది. వీటిల్లో కిలో ఉల్లిని రూ.35కే విక్రయిస్తున్నారు. అయినాసరే ధరల పెరుగుదల ఆగడం లేదు. ‘గత రబీ సీజన్లోని పాత స్టాక్ దాదాపు అయిపోయింది. కొత్త స్టాక్ ఇంకా మార్కెట్లోకి రాలేదు. ఈ సరఫరా–డిమాండ్ అసమతుల్యత ధర పెరుగుదలకు కారణం. దీన్ని చక్కదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని మహారాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ధరల ఉరవడిపై మహా వికాస్ అఘాడీ కూటమిలోని కాంగ్రెస్, శివసేన(యూబీటీ) పార్టీలు షిండే సర్కార్పై విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. ఎగుమతుల నిషేధంపై రైతుల్లో ఆగ్రహం ఉల్లి ఎగుమతులపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతుల ఆగ్రహానికి కారణమవుతోంది. గడిచిన లోక్సభ ఎన్నికల సమయంలో డిసెంబర్ 2023 వరకు ఉన్న ఎగుమతులపై నిషేధాన్ని కేంద్రప్రభుత్వం 2024 మార్చినెల వరకు పొడిగించింది. దీనికి తోడు ఎగమతి సుంకాలను 25 శాతం నుంచి 40 శాతానికి పెంచింది. ఎగుమతి ఆంక్షలు తమ జీవనోపాధిని దెబ్బతీశాయని మహారాష్ట్ర రైతుల ఆవేదనవ్యక్తంచేస్తున్నారు. ఉల్లి సాగు అధికంగాఉండే ధూలే, దిండోరి, అహ్మద్నగర్, పుణె, నాసిక్లలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే మహారాష్ట్ర నుంచి ఎగుమతులను నిషేధించిన కేంద్రం తమ పార్టీ ఏలుబడిలో ఉన్న గుజరాత్ నుంచి మాత్రం ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తేయాలని నిర్ణయించడంతో మహారాష్ట్ర రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ కారణంగానే ఇటీవల లోక్సభ ఎన్నికల్లో 12 ఎంపీ స్థానాల్లో మహాయుతి కూటమి ఓటమిని చవిచూసిందని విశ్లేషణలు వెలువడ్డాయి. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సైతం లోక్సభ ఎన్నికల్లో మహాయుతి పేలవ ప్రదర్శన వెనుక ఉల్లి రైతుల ఆగ్రహం ఉందని అంగీకరించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం మహారాష్ట్రలోని ఉల్లి రైతుల కంటే గుజరాత్లోని ఉల్లి రైతుల గురించే పట్టించుకుంటోందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఉల్లి మంట నుంచి బయట పడేందుకు పాలక కూటమి ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందన్న దానిపైనే ఎన్నికల్లో సామాన్యులు, రైతుల సానుకూల, ప్రతికూల ఓటింగ్ సరళి ఆధారపడిఉంటుందని తెలుస్తోంది. -
ఓట్ల వేటలో వాగ్దానవర్షం
మహారాష్ట్రలో ఎన్నికల పర్వం ఇప్పుడు కాక పుట్టిస్తోంది. ఈ 20న జరగనున్న ఎన్నికల కోసం ఇటు బీజేపీ సారథ్యంలో అధికార ‘మహాయుతి’ కూటమి, అటు కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతిపక్ష ‘మహా వికాస్ ఆఘాడీ’ (ఎంవీఏ)... రెండూ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు వరాల జల్లు కురిపిస్తున్నాయి. దేశంలోని అత్యంత సంపన్న రాష్ట్రంలో ఇప్పుడు ఉచితాల పోరు సాగుతోంది. గృహాలకు 100 యూనిట్ల మేర కరెంట్ ఉచితం, గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఆడపిల్లలకు ఉచిత టీకాకరణ, మహిళా ఉద్యోగులకు ప్రతి నెలా రెండు రోజులు ఋతుక్రమ సెలవుల లాంటి గ్యారెంటీలతో ఎంవీఏ ముందుకొచ్చింది. ఫలితంగా మహాయుతి సైతం మరింత ఎక్కువ వాగ్దానాలు చేయక తప్పలేదు. దాంతో, ఎన్నికల మేనిఫెస్టోలు కలకలం రేపుతున్నాయి. ఖజానాపై భారం రీత్యా పథకాల సాధ్యాసాధ్యాలపై చర్చ మొదలైంది. దేశాభివృద్ధికి ఉచితాల సంస్కృతి ప్రమాదకరమన్న మోదీ సొంతపార్టీ బీజేపీ సైతం ‘మహా’పోరులో ప్రతిపక్షం బాట పట్టక తప్పలేదు. అయితే, వైరిపక్షం వాగ్దానాలు సాధ్యం కావంటూ ప్రతి పార్టీ పక్కవారిపై ఆరోపణలు చేయడమే విడ్డూరం.మహిళలు, రైతులు, విద్యార్థులు – నిరుద్యోగులైన యువతరం, సీనియర్ సిటిజన్లు... ఇలా వివిధ వర్గాలను లక్ష్యంగా చేసుకొని ఇచ్చిన పోటాపోటీ హామీలు అనేకం. సమాజంలోని వెనుక బడిన వర్గాలను పైకి తీసుకురావడానికీ, అవసరంలో ఉన్నవారికి చేయూత అందించడానికీ సంక్షేమ పథకాలను హామీ ఇవ్వడం, వాటిని చిత్తశుద్ధితో అమలు చేయడం తప్పు కాదు, తప్పనిసరి కూడా! అయితే, ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అమలు చేయడానికి వీలే కాని వాటిని హామీ ఇచ్చినప్పుడే అసలు సమస్య. అధికారంలో ఉండగా అవసరార్థులను పట్టించుకోకుండా, తీరా ఎన్నికల వేళ మేని ఫెస్టోలతో మభ్యపెట్టాలనుకోవడం మరీ దారుణం. ఎన్నికల వాగ్దానపత్రాలపై విమర్శలు వస్తున్నది అందుకే. ఆర్థికభారం సంగతి అటుంచితే, స్త్రీలకు తప్పనిసరి ఋతుక్రమ సెలవు లాంటివి పని ప్రదేశాల్లో వారికే ప్రతికూలంగా మారే ప్రమాదముందని జూలైలో సుప్రీమ్ కోర్ట్ అభిప్రాయపడింది. అయినా, ఆ అంశాన్ని పార్టీలు చేపట్టడం విచిత్రమే. పని గంటల్లో వెసులుబాటు, వర్క్ ఫ్రమ్ హోమ్ తదితర ప్రత్యామ్నాయాలను పట్టించుకోకుండా, జపాన్, స్పెయిన్, ఇండొనేసియా లాంటి చోట్ల ఆదరణకు నోచుకోని పద్ధతిని తెస్తామని హామీ ఇవ్వడం ఒకింత ఆశ్చర్యకరం. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే బలమైన ఓటరు వర్గంగా మహిళలు మారిన సంగతిని పార్టీలు గుర్తించాయి. స్త్రీలు స్వీయ నిర్ణయంతో ఓట్లేస్తున్న ధోరణి పెరుగుతోందనీ గ్రహించాయి. అందుకే, 4.5 కోట్ల మంది మహిళా ఓటర్లున్న మహారాష్ట్రలో రెండు కూటములూ వారిని లక్ష్యంగా చేసుకున్నాయి. లడకీ బెహిన్ యోజన కింద ఇస్తున్న నెలవారీ భృతిని పెంచుతామనీ, స్వయం సహాయక బృందాల్లోని మహిళా సభ్యులకు ‘లఖ్పతీ దీదీ’ పథకంతో చేయూతనిచ్చి, 2027 కల్లా 50 లక్షల మందిని లక్షాధికారిణుల్ని చేస్తామనీ ‘మహాయుతి’ మాట. ఎంవీఏ కూటమి ఏమో ‘మహా లక్ష్మి పథకం’ ద్వారా నెలవారీ ఆర్థికసాయం, ఆడవారికి ఉచిత బస్సు ప్రయాణం వగైరా హామీలి స్తోంది. నిజానికి, పశ్చిమ బెంగాల్లో కన్యాశ్రీ, మధ్యప్రదేశ్లో లాడ్లీ బెహనా యోజన... ఇలా రక రకాల పేర్లతో మహాలక్ష్మి పథకం లాంటివి ఇప్పటికే కొన్నిచోట్ల ఉన్నాయి. ఈ తీపి మాటల్ని అటుంచితే,, మహారాష్ట్రలోని 288 స్థానాలకు గాను రెండు కూటముల పక్షాన కలసి ఈ ఎన్నికల్లో 56 మంది మహిళలే బరిలో ఉన్నారు. లెక్కలు తీస్తే, మొత్తం అభ్యర్థుల్లో స్త్రీల సంఖ్య 10 శాతమే. వెరసి, ఆడవారికి ఉచితాలిచ్చి ఓటర్లుగా వాడుకోవడమే తప్ప, చట్టసభల్లో సరైన భాగస్వామ్యం కల్పించడంలో పార్టీలకు ఆసక్తి లేదు. మహిళా రిజర్వేషన్లను పైకి ఆమోదించినా, ఆచరణలో ఇదీ దుఃస్థితి.పార్లమెంట్కు అతిపెద్ద సంఖ్యలో రాజ్యసభ సభ్యుల్ని పంపే రాష్ట్రాల్లో రెండోది అయినందున మహారాష్ట్ర ఎన్నికలను బీజేపీ కీలకంగా భావిస్తోంది. బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేక చట్టం చేస్తామంటూ కాషాయపార్టీ హిందూత్వ కార్డును విసురుతుంటే, ఓబీసీలు గణనీయంగా ఉన్న రాష్ట్రమైనందున కులగణన, ఉద్యోగాల రిజర్వేషన్లలో 50 శాతం పరిమితి ఎత్తివేత లాంటి మాటలతో ఎంవీఏ సామాజిక న్యాయం నినాదాన్ని భుజానికి ఎత్తుకుంది. ఇక, విభజనవాద నినాదాలైన ‘బటేంగే తో కటేంగే’ (హిందువులు విడిపోతే నష్టపోతాం), ‘ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే’ (కలసివుంటే భద్రంగా ఉంటాం) మధ్య రైతాంగ సమస్యలు, రైతుల ఆత్మహత్యలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వగైరా అసలు అంశాలు వెనక్కిపోవడమే విషాదం. స్థూలంగా 6 జోన్లయిన మహారాష్ట్రలో ఆర్థికంగా వెనకబడ్డ విదర్భ, మరాఠ్వాడా, ఉత్తర మహా రాష్ట్ర ప్రాంతానికీ – రెండు, మూడు రెట్లు తలసరి ఆదాయం ఎక్కువుండే ముంబయ్, థానే – కొంకణ్, పశ్చిమ మహారాష్ట్రలకూ మధ్య ఆలోచనలో తేడా ఉంటుంది. మొత్తం స్థానాల్లో నాలుగోవంతు పైగా సీట్లలో ఎప్పుడూ హోరాహోరీ పోరే. అలాగే, మూడోవంతు పైగా స్థానాల్లో విజేత మెజారిటీ కన్నా మూడోస్థానంలో నిలిచిన అభ్యర్థి ఓట్ షేర్ ఎక్కువ. కాబట్టి, ఫలితాల అంచనా అంత సులభం కాదు. రాష్ట్రాన్ని పాలించేది ఎవరన్నది ఒక్కటే కాదు... ఉద్ధవ్ ఠాక్రే, శిందే వర్గాలలో ఎవరిది అసలైన శివసేన అన్నదీ ప్రజలు ఈ ఎన్నికల్లో తీర్పునివ్వనున్నారు. వాగ్దానపర్వంలో ఏ పార్టీని ఎంత నమ్మిందీ చెప్పనున్నారు. తక్షణ ఆర్థిక సహాయం పట్ల గ్రామీణ ఓటర్లు ఆకర్షితులయ్యే అవకాశం కనిపిస్తోంది కానీ, వచ్చే ఏడేళ్ళలో రూ. 2.75 లక్షల కోట్ల అప్పు తీర్చాల్సిన రాష్ట్రంలో రేపు ఏ కూటమి అధికారంలోకి వచ్చినా తమ హామీలను అమలు చేయగలుగుతుందా అన్నది ప్రశ్న. -
‘మహా’ ఎన్నికలు: బీజేపీపై నానా పటోలే వివాదాస్పద వ్యాఖ్యలు
ముంబై: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే బీజేపీ నేతలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని పడగొట్టినందుకు బీజేపీపై విరుచుకుపడ్డారు. ఓబీసీ కమ్యూనిటీ విషయంలో బీజేపీ పార్టీ నేతలు కుక్కలా వ్యవహరిస్తారని మండిమండ్డారు. ఓబీసీలంతా తామేంటో బీజేపీకి చూపించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఆయన అకోలాలో జరిగిన ఎన్నికల ప్రచారం ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు.‘‘బీజేపీ నేతుతు తమను తాము ‘దేవుళ్లుగా’గా భావిస్తున్నారు. మిమ్మల్నీ కుక్కలుగా భావించే.. బీజేపీకి అకోలా జిల్లా ఓబీసీ ప్రజలు ఓటేస్తారా?. ఇప్పుడు బీజేపీని మీరు(ప్రజులు) కుక్కలా చేసే సమయం వచ్చింది. మహారాష్ట్ర నుంచి బీజేపీని తరిమికొట్టే సమయం ఆసన్నమైంది. బీజేపీ పార్టీ అబద్ధాలతో అధికారంలోకి వచ్చింది. బీజేపీ నేతలు తమను తాము దేవుళ్లుగా విశ్వగురువుగా భావించుకుంటారు. బీజేపీ నేత ఫడ్నవీస్ తనను తాను దేవుడిగా భావిస్తున్నారు’’ అని మండిపడ్డారు. -
మహారాష్ట్రలో కాంగ్రెస్, బీజేపీ హామీలు
-
Maharashtra Assembly elections 2024: కులగణన, రుణమాఫీ
ముంబై: మహారాష్ట్రలో అధికారంలోకి రాగానే కులగణన ప్రారంభిస్తామని విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) హామీ ఇచి్చంది. 9 నుంచి 16 ఏళ్లలోపు బాలికలకు సరై్వకల్ క్యాన్సర్ వ్యాక్సిన్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో రెండు ఐచి్ఛక సెలవులు మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది. ‘మహారాష్ట్రనామ’ పేరిట ఎంవీఏ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం విడుదల చేశారు. మహిళా స్వయం సహాయక సంఘాల కోసం ప్రత్యేకంగా సాధికారత విభాగం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. శిశు సంక్షేమం కోసం డెడికేటెడ్ మినిస్ట్రీ ఏర్పాటు చేస్తామన్నారు. అర్హులైన మహిళలకు రూ.500 చొప్పున ధరతో ప్రతిఏటా ఆరు వంట గ్యాస్ సిలిండర్లు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఎంవీఏ మేనిఫెస్టోలోని కీలక అంశాలు...→ రూ.3 లక్షల దాకా రైతు రుణమాఫీ. రుణాలు సక్రమంగా చెల్లించేవారికి రూ.50 వేల ప్రోత్సాహకం → 2.5 లక్షల ప్రభుత్వోద్యోగాల భర్తీ → బాలికలకు ఏటా రూ.లక్ష నగదు→ ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాల్లోని వితంతువులు, చిన్నారులకు ఆర్థిక సాయం → యువత సంక్షేమానికి కమిషన్. డిగ్రీ, డిప్లొమా చేసిన నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి → నూతన ఇండ్రస్టియల్ పాలసీ. ఎంఎస్ఎంఈ శాఖ.→ అసంఘటిత కార్మికుల సంక్షేమానికి కార్పొరేషన్ → నిత్యావసరాల ధరల నియంత్రణ→ నెలకు 300 యూనిట్ల దాకా విద్యుత్పై 100 యూనిట్ల రుసుం మాఫీ → ప్రభుత్వోద్యోగులకు మళ్లీ పాత పెన్షన్ విధానంకుల గణనపై బీజేపీ నేతలది తప్పుడు ప్రచారం: ఖర్గేపలు సామాజికవర్గాల స్థితిగతులను సమగ్రంగా తెలుసుకోవడానికే కులగణన తప్ప సమాజాన్ని కులాలవారీగా విభజించడానికి కాదని ఖర్గే చెప్పారు. ఆ వర్గాల సంక్షేమం, అభివృద్ధికి అమలు చేయాల్సిన విధానాల రూపకల్పనకు ఆ డేటా తోడ్పడుతుందన్నారు. కులగణనపై బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మేనిఫెస్టో విడుదల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కులాలవారీగా జనాభా లెక్కల సేకరణతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రదర్శిస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం కాదని, అర్బన్ నక్సలైట్లకు ప్రతీక అని మోదీ, బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఖర్గే మండిపడ్డారు. రాజ్యాంగంపై కనీస అవగాహన కూడా లేని మోదీని మళ్లీ ప్రాథమిక పాఠశాలలో చేర్చాలని ఎద్దేవా చేశారు. 2017 జూలై 16న ఇలాంటి రాజ్యాంగ ప్రతినే అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు మోదీ అందజేశారన్నారు. చదవండి: మహారాష్ట్ర బీజేపీ మేనిఫెస్టో విడుదల.. కీలక హామీలివే.. -
మహా ఎన్నికలు: ‘నన్ను గెలిపిస్తే.. బ్యాచిలర్స్కు పెళ్లిళ్లు జరిపిస్తా’
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసేందుకు పోటీలో నిలబడిన అభ్యర్థుల విచిత్ర హామీలు ఇస్తున్నారు. అయితే.. ఎన్సీపీ(ఎస్పీ) అభ్యర్థి రాజేసాహెబ్ దేశ్ముఖ్ ఇచ్చిన హామీ ఆసక్తికరంగా మారింది. తానను ఎన్నికల్లో గెలిపిస్తే బ్యాచిలర్స్కు పెళ్లిళ్లు చేసి, ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు. బీడ్ జిల్లాలోని పర్లీ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఆయన పర్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు.‘‘యువతకు పని కల్పిస్తాం. పెళ్లి సమయంలో యువకులకు ఉద్యోగం లేదా వ్యాపారం ఉందా? అడుగుతారు. జిల్లా మంత్రి ధనంజయ్ ముండేకే వ్యాపారం లేనప్పుడు, మీరు ఏవిధంగా ఉద్యోగాలు పొందుతారు. ధనుంజయ్ ముండే.. నియోజకవర్గానికి ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు. అందువల్ల ఉద్యోగాలు లేక.. స్థానిక బ్యాచిలర్లు వివాహం చేసుకోవడం కష్టంగా మారింది. నన్ను గెలిపిస్తే.. ఉద్యోగాలు కల్పించి బ్యాచిలర్స్కు పెళ్లిలు చేస్తా’ అని అన్నారు.Unique poll promise@NCPspeaks candidate #RajasahebDeshmukh says on getting elected from Beed district's #Parli assembly constituency, he will get all the bachelors married#Maharashtra #PoliticsToday #MaharashtraAssembly pic.twitter.com/TfRm7kRtO8— Mohammed Akhef TOI (@MohammedAkhef) November 6, 2024 దేశ్ముఖ్ ప్రకటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఎన్సీపీ (అజిత్ వర్గం) నేత ధనుంజయ్ ముండే పరిశ్రమలు తేకపోవడంతో ఉద్యోగాల్లేక పెళ్లిళ్లు జరగక యువత ఇబ్బంది పడుతున్నారని ర రాజేసాహెబ్ దేశ్ముఖ్ ఆరోపణలు చేశారు.చదవండి: నేను వ్యాపార వ్యతిరేకిని కాదు: రాహుల్ గాంధీ క్లారిటీ -
మహారాష్ట్ర ఎన్నికలు.. ఎన్సీపీ మేనిఫెస్టో విడుదల
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. అధికార కూటమి ఉమ్మడి ప్రచారాన్ని ప్రారంభించడానికి కొల్హాపూర్లో నిర్వహించిన మహాయుతి ర్యాలీ సందర్భంగా ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మంగళవారం ప్రకటించిన పది హామీల్లో ఈ హామీలు ఉన్నాయి. వరి రైతులకు హెక్టారుకు రూ. 25,000 బోనస్, వ్యవసాయ రుణాల మాఫీ, లడ్కీ బహిన్ యోజన కింద అర్హులైన మహిళా లబ్ధిదారులకు నెలవారీ ఆర్థిక ప్రయోజనాన్ని రూ.1,500 నుండి రూ.2,100కి పెంపు. 2.5 మిలియన్ల ఉద్యోగాల కల్పన, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం వంటి హామీలు ఇచ్చారు.राष्ट्रवादी काँग्रेस पार्टी घोषणापत्र प्रकाशनाचे थेट प्रक्षेपण https://t.co/aOTUc1UcyS— Ajit Pawar (@AjitPawarSpeaks) November 6, 2024 బారామతి డిప్యూటీ సీఎం అజిత్ పవార్.. ఎన్సీపీ మేనిఫెస్టోలో విడుదల సందర్భంగా మాట్లాడారు. ‘లడ్కీ బహిన్ యోజన అనేది మహారాష్ట్ర చరిత్రలో అతిపెద్ద నెలవారీ డీబీటీ బదిలీ పథకం. 2.3 కోట్ల మంది మహిళలకు (ప్రస్తుతం ఏడాదికి రూ. 18,000) సంవత్సరానికి రూ. 25,000 ప్రయోజనాలను అందజేస్తుంది’ అని అన్నారు. -
అలా అయితే.. జైలుకు వెళ్లడానికైనా సిద్ధం: మహారాష్ట్ర సీఎం
ముంబై: ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'లడ్కీ బహిన్ యోజన' పథకానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కోర్టును ఆశ్రయించడాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఏక్నాథ్ షిండే తప్పుపట్టారు. ఈ పథకం నేరమైతే.. తాను జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘లడ్కీ బహిన్ (ప్రియమైన సోదరీమణులు) కోసం నేను జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా. లడ్కీ బహిన్ యోజనను నిలిపివేయాలని ఒత్తిడి చేస్తున్న మహా వికాస్ అఘాడీని ఓడించడానికి శివసేన, మహాయుతికి మహిళలంతా మద్దతు ఇవ్వాలి. ప్రియమైన సోదరీమణులు లడ్కీ బహిన్ యోజన కింద ప్రతి నెల రూ.1,500 పొందుతారు. లడ్కీ బహిన్ యోజనను మూసివేయాలని ప్రతిపక్షం ప్రయత్నాలు చేస్తోంది.ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారంలో మహిళా ఓటర్ల వద్దకు వస్తే.. లడ్కీ బహిన్ యోజనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో నిలదీయండి...ఆ పథకాన్ని ఆపాలని కోర్టుకు ఎందుకు వెళ్లారని అడగండి. ఇది సామాన్యుల ప్రభుత్వం. కాబట్టి మీ వద్దకు ఎవరు వచ్చినా.. లడ్కీ బహిన్ యోజనను వ్యతిరేకించే వారికి మీరేంటో చూపించండి. అసెంబ్లీ ఎన్నికల్లో లడ్కీ బహిన్ యోజన, ఇతర సంక్షేమ పథకాలను ఆపేయాలనుకువారికి వారికి ఎదురుదెబ్బ తగులుతుంది. ఎన్నికలు ముగిసిన తర్వాత మహారాష్ట్ర నుంచి ముంబైని విడదీస్తారని శివసేన(యూబీటీ) అసత్య ప్రచారం చేస్తోంది’’ అని అన్నారు. -
Maharashtra Assembly Elections 2024: పోలీసు వాహనాల్లో డబ్బు మూటలు
బారామతి: పోలీసు వాహనాల్లో నగదును తరలించి అధికార మహాయుతి కూటమి అభ్యర్థులను అందజేస్తున్నారని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఆరోపించారు. పవార్ శనివారం నాడిక్కడ తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. పోలీసు వాహనాల్లో డబ్బును తరలిస్తున్నారనే అంశంపై తాను చాలా మాట్లాడాలని అనుకున్నా.. తనకు సమాచారమిచ్చిన అధికారుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సంయమనం పాటిస్తున్నట్లు తెలిపారు. చాలా జిల్లాల నుంచి డబ్బు తరలింపుపై అధికారులు సమాచారం అందించారని వివరించారు. అధికార మహాయుతి కూటమిలో శివసేన (షిండే), బీజేపీ, ఎన్సీపీ (అజిత్ పవార్)లు భాగస్వామ్యపక్షాలుగా ఉన్న విషయం తెలిసిందే. లడ్కీ బహిన్ యోజన తదితర జనాకర్షక పథకాలు అధికార కూటమికి అనుకూలిస్తాయని అనుకుంటున్నారా? అని అడగ్గా.. ‘ఈ పథకం కింద నగదును అందుకున్నామని పలువురు మహిళలు చెబుతున్నారు. మీరు సంతోషంగా ఉన్నారా? అని ప్రశ్నించగా.. కిరోసిన్, వంటనూనెల ధరలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక చేతితో ఇచ్చి మరో చేతితో లాక్కొంటున్నారని వాపోయారు’ అని శరద్ పవార్ బదులిచ్చారు. ఇలాంటి పథకాల్లో తర్కం లేదని, ఇవన్నీ వంచనతో కూడినవి పవార్ ఆరోపించారు. కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం మహారాష్ట్ర ర్యాంకింగ్ పడిపోయిందని, ఇది పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని ఆయన అన్నారు. దీనికి ప్రభుత్వాన్ని మార్చడమొకటే పరిష్కారమని పేర్కొన్నారు. మహారాష్ట్రను ఆర్థికంగా బలోపేతం చేయగల మహా వికాస్ అఘాడి (ఎంవీఏ... కాంగ్రెస్, ఎన్సీపీ– ఎస్పీ, శివసేన– యూబీటి)కి అధికారాన్ని కట్టబెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆర్థికరంగాన్ని బలోపేతం చేయడంపై ప్రధాని, ఆయన సహచరులు దృష్టి పెట్టడం లేదని, రాజకీయాలతో సమస్యలకు పరిష్కారాలు లభించవని చురకలంటించారు. -
‘పదవి కోసం కుటుంబం విచ్ఛిన్నం చేస్తావా?’
ముంబై: ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ రాజకీయ పదవుల కోసం తమ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశారని మండిపడ్డారు. బారామతి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్న తన మనవడు యుగేంద్ర పవార్ కోసం నియోజకవర్గంలో మంగళవారం ఆయన ప్రచారం చేశారు. అయితే.. తన ప్రసంగం మధ్యలో రుమాలుతో కళ్లు తుడుచుకున్నట్లు నటిస్తూ అజిత్ పవార్ను అనుకరించారు. శరద్ పవార్ ప్రసంగిస్తూ.. ‘‘నా తల్లిదండ్రులు, సోదరులు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే పాపాన్ని వాళ్లు నాకు ఎప్పుడూ నేర్పించలేదు. చాలా కాలం క్రితం మహారాష్ట్రను నడిపించే బాధ్యతను ప్రజలు నాకు అప్పగించారు. నేను ఇప్పుడు మార్గదర్శకుడిని, కొత్త తరానికి పార్టీ వ్యవహారాలను అప్పగించా. రాజకీయాల్లోని అనిశ్చితిని ఎత్తిచూపుతూ.. అధికారం కోసం సహచరులను విడిచిపెట్టకూడదు. దురదృష్టవశాత్తు.. మేము అధికారంలో లేనప్పుడు మా సహచరులు కొందరు తెల్లవారుజామున అకస్మాత్తుగా మేల్కొని పదవులకు ప్రమాణం చేశారు. ఆ ప్రభుత్వం నాలుగు రోజులు కూడా కొనసాగలేదు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసినవి విషయాన్ని గుర్తు చేశారు....నాలుగు సార్లు డిప్యూటీ సీఎంగా పనిచేసినా ఆ పదవిని దక్కించుకోవడానికి అజిత్ పవార్ ప్రత్యర్థి పార్టీవైపు వెళ్లారు. అజిత్కు ఎక్కువసార్లు ఆ డిప్యూటీ సీఎం పదవి ఇప్పటికే వచ్చింది. అయితే.. ఈ ఒక్కసారి మాత్రమే ఆ పదవిని దక్కించుకోలేకపోతే మీరు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తారా?’’ అని శరద్ పవార్ సూటీగా ప్రశ్నించారు.అయితే.. బారామతి నియోజకవర్గంలో శరద్ పవార్కు మనవడు అయిన యుగేంద్ర పవార్ అభ్యర్థిత్వాన్ని ప్రస్తావిస్తూ.. అజిత్ పవార్ సోమవారం విమర్శలు చేశారు. సీనియర్లు కుటుంబంలో చీలికలు రాకుండా చూసుకోవాలని అన్నారు. అయితే దీనిపై ఇవాళ శరద్ పవార్ పైవ్యాఖ్యలతో కౌంటర్ ఇవ్వటం గమనార్హం.చదవండి: మోదీ.. విమానాల ఫ్యాక్టరీని గుజరాత్ తరలించారు: శరద్ పవార్ -
మహారాష్ట్రలో "మహా" సమరం .. బీజేపీ మూడో జాబితా విడుదల
-
సమతా పథంలో సాగాలంటే...
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ అంబేడ్కర్ జపం చేస్తోంది. దేవేంద్ర ఫడ్నవీస్ రాజ్యాంగం మీద ఎక్కడలేని ప్రేమను కురిపిస్తున్నారు. రాజ్యాంగం తనకు శిరోధార్యం అని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. అంబేడ్కర్ను బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ ఇప్పుడు కొనియాడటంలో మార్మికత ఉంది. వాటిని దళిత బహుజనులు అర్థం చేసుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా రాజ్యాంగాన్ని చేత బూనుతుంది. కానీ కుల నిర్మూలనకు, స్త్రీ విముక్తికి, సంపద అందరికీ పంచడానికి పాటుపడటం లేదు. ఈ కార్పొరేట్ భారతాన్ని మతవాదులు పెంచి పోషిస్తున్నారు. అంబేడ్కర్ ఒక విస్తృతమైన మానవాభ్యుదయం కోసం కృషి చేశారు. సామ్యవాద భారతం కావాలంటే అంబేడ్కర్ మార్గం ఒక్కటే దిక్సూచి.భారతదేశంలో అనేక భావ విప్లవ ఉద్య మాలు, సామాజిక సాంస్కృతిక పరిణా మాలు ఆ యా కాలాల్లో వచ్చాయి. అవి రాజకీయ సిద్ధాంతాలపై ప్రభావం చూపాయి. ముఖ్యంగా భారతదేశంలో 1927వ సంవత్సరం నుండి సామాజిక విప్లవోద్యమం ప్రారంభమైంది. బి.ఆర్. అంబేడ్కర్ మనుస్మృతిని దహనం చెయ్యటంతోనే ఈ సాంస్కృతిక విప్లవం ప్రారంభమైంది. అంబేడ్కర్ పుట్టిన మహారాష్ట్రలో అడుగుపెట్టిన నోబెల్ బహుమతి గ్రహీత వి.ఎస్.నైపాల్ ముంబయి నగరాన్ని చూస్తుంటే అంబేడ్కర్ నగరంగా కనిపిస్తుందని అన్నారు. ఎక్కడ చూసినా అంబేడ్కర్ విగ్రహాలు, అంబేడ్కర్ కాలేజీలు, అంబేడ్కర్ విశ్వవిద్యాలయాలు, అంబేడ్కర్ చైత్యాలు, అంబేడ్కర్ గ్రంథాలయా లతో నిండివుందని నైపాల్ రాశారు. భారతదేశం మొత్తం ఎక్కడ చూసినా– బెంVýæళూరు, చెన్నై, కలకత్తా అన్ని మహనగరాల్లోనూ అంబేడ్కర్ స్ఫూర్తే కనపడుతుంది. నిజానికి ఆర్ఎస్ఎస్కు, విశ్వహిందూ పరిషత్కు భావజాల పరంగా, సిద్ధాంతపరంగా ప్రత్యామ్నాయంగా రూపొందించిందే మన రాజ్యాంగం. భారత రాజ్యాంగం పూర్తిగా మనుస్మృతి భావజాలాన్ని నిరాకరించిన గ్రంథం. అంబేడ్కర్ రాజ్యాంగ ప్రతిని రాజ్యాంగ పరి షత్తులో ప్రవేశపెట్టిన నాటి నుండి ఆర్ఎస్ఎస్ నిరాకరిస్తూనే వచ్చింది. బీజేపీ ద్వారా సంపూర్ణ రాజ్యాధికారమే వస్తే రాజ్యాంగాన్నే మార్చా లనే దుర్వ్యూహం వాళ్ళ దగ్గర వుంది.అంబేడ్కర్ భారతదేశాన్ని సమసమాజ నిర్మాణంలోకి తీసుకు వెళ్ళాలని ఎంతో ప్రయత్నం చేశారు. పెను వృక్షంలాంటి కాంగ్రెస్ బ్రాహ్మణవాదాన్ని ఎదిరించటానికి, అంతర్గతంగా కాంగ్రెస్లో దాగి వున్న హిందూ సాంప్రదాయవాదాన్ని ఎదిరించడానికి ఒక దశలో ఒంటరి పోరాటం చేయవలసి వచ్చింది. తన ప్రజలు కూడా తనకు తోడురాని పరిస్థితుల్లోనూ నిక్కచ్చిగా నిలబడ్డారు. అంబేడ్కర్ దేశ వ్యాప్తంగా తన తాత్విక ముద్ర వేయగలగడానికి కారణం ఆయన బౌద్ధతాత్విక జీవన విధానమే. ఆయన రాజ్యాంగ రచనా రూప కల్పనలో అష్టాంగ మార్గాన్ని ఆదర్శ సూత్రాల్లోకి సమన్వయించ గలి గారు. సమదృష్టి, సత్సంకల్పము, సత్ వచనము, సత్ కర్మ, సత్ జీవనము, సత్ ప్రయత్నము, సత్ కృతి, సత్ సమాధి సూత్రాలను భారత రాజ్యాంగంలో చేర్చిన తరువాత దానికి సామాజిక, తాత్విక జీవన పరిమళం వచ్చింది. భారత రాజ్యాంగం ఒక గొప్ప సమతా మార్గ నిర్దేశంగా నిలబడింది. ఈనాడు మహారాష్ట్ర ఎన్నికల సందర్భంలో బీజేపీ కొత్త ఎత్తు గడతో అంబేడ్కర్ జపం చేస్తోంది. మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ దశాబ్దంలో అనేక మార్పులు వచ్చాయి. బీజేపీ దుర్వ్యూహాల గురించి దళితులు, బహుజనులు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ రాజ్యాంగం మీద ఎక్కడలేని ప్రేమ కురిపిస్తున్నారు. రాజ్యాంగం తనకు శిరోధార్యం అని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. ఫడ్నవీస్ రాజ్యాంగానికి, అంబేడ్కర్కు మోకరిల్లు తున్న పోస్టర్లు మహారాష్ట్రలో విస్తృతంగా దర్శనమిస్తున్నాయి. రాజ్యాంగ రూపకల్పన పూర్తయిన సందర్భంగా, రాజ్యాంగ నిర్ణాయక సభలో 1949 నవంబర్ 25న అంబేడ్కర్ చేసిన రాజ్యాంగం తుది ప్రతి మీద ఆర్ఎస్ఎస్ దుమ్మెత్తి పోసింది. రాజ్యాంగంలో భారతీయత అనేది ఉదాహరణ ప్రాయంగా కూడా లేదని దెప్పి పొడిచింది.దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు పూర్తయినా దళితులపై ప్రతిరోజూ అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్నిసార్లు బహి రంగంగా కొట్టడం, మరి కొన్నిసార్లు గుడిలోకి రానివ్వకపోవడం, చేసిన పనికి జీతం అడిగితే దాడులకు దిగడం, దొంగతనం చేశారన్న అరోపణలతో అకృత్యాలకు పాల్పడటం నిత్యకృత్యాలుగా మారి శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. దళితులను అవమానించడం, సాంఘిక బహిష్కరణ కేసులు నిత్యం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. నేషనల్ క్రైవ్ు రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం, దళితులపై అఘాయిత్యాలకు సంబంధించి ప్రతిరోజూ 150కి పైగా కేసులు నమోదవుతున్నాయి. ఎన్డీయే పాలనలో 2018 నుండి 2022 మధ్య దళితులపై లైంగికదాడులు 35 శాతం పెరిగాయని ఆ నివేదిక తెలిపింది. ఆ నివేదిక ప్రకారం 2018 నుంచి ప్రతి సంవ త్సరం కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. దళితులపై నేరాలకు సంబంధించి 2018లో 42,793 కేసులు నమోదయ్యాయి. 2021లో 50,900 కేసులు, 2022లో 57,582 కేసులు నమోదయ్యాయి. ఆ నివేదిక ప్రకారం ఉత్తరప్రదేశ్లో దళితులపై అఘాయిత్యాల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. 2022లో అక్కడ 15 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఎనిమిదిన్నర వేలకు పైగా కేసులు నమో దైన రాజస్థాన్ రెండో స్థానంలో ఉంది. యోగీ ఆదిత్యనాథ్ ఇలాకాలోని భరూచ్ జిల్లా తాజ్పూర్ తెడియా గ్రామంలో ఇద్దరు కోళ్ల ఫారం యజమానులు దళిత బాలురు దొంగతనం చేశారన్న అనుమానంతో దాష్టీకానికి దిగారు. బాలురను కొట్టి, గుండు గీయించి, ముఖానికి నల్లరంగు పులిమి గ్రామంలో ఊరేగించారు. ఐదు కిలోల గోధుమలు అపహరించారని ఆరోపిస్తూ 12–14 ఏళ్ల వయసున్న ముగ్గురు బాలుర ముంజేతులపై ‘దొంగ’ అని రాసి గ్రామంలో ఊరేగించారు. దళితుల మానవ హక్కుల పోరాటం గురించి అంబేడ్కర్ ఎంతో అధ్యయనం చేశారు. మొదట డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యుడిగా ఎన్నుకో బడిన అంబేడ్కర్ ఆ పిదప 1947 ఆగస్ట్ 29వ తేదీన రాజ్యాంగ రచన సంఘ అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డారు. ఎన్. గోపాల స్వామి అయ్యంగార్, సర్ అల్లాడి కుప్పుస్వామి అయ్యర్, కె.ఎం. మున్షీ, మహ్మద్ సాదుల్లా, ఎన్. మాధవ రావు, డి.పి. ఖైతాన్ యితర సభ్యులు కాగా, బి.ఎన్.రావు రాజ్యాంగ సలహాదారులు. కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ నాయకులను విమర్శించే అంబేడ్కర్ను రాజ్యాంగ రచన సంఘా ధ్యక్షులుగా ఆహ్వానించారు. ఇది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ఔదార్యంగా చెప్పబడినా అంబేడ్కర్ అసాధారణ ప్రతిభ, ఒక చారిత్రక అవసరంగా మాత్రమే పరిగణించబడుతుంది. అంబేడ్కర్ తనపై మోపబడిన ఈ భారాన్ని సమర్థవంతంగా, నిజాయితీగా నిర్వర్తించడానికి కృషి చేశారు. అంబేడ్కర్ అమెరికాలో చదువుతున్న కాలంలో నీగ్రోల చరిత్రను అధ్యయనం చేశారు. నీగ్రోలు తమ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళే క్రమంలో అమెరికా రాజ్యాంగంలోని 14వ అధికరణం ద్వారా ఎలా స్వాతంత్య్రం పొందారో తెలుసుకున్నారు. నీగ్రోల విముక్తి పోరాటంలో ప్రధాన పాత్ర వహించిన బుకర్ టి.వాషింగ్టన్ చరిత్రను అధ్యయనం చేశారు. నీగ్రోల పోరాట చరిత్ర ద్వారా భారతదేశంలో దళితుల్ని ఎలా విముక్తి చేయాలో అర్థం చేసుకొన్నారు.అంబేడ్కర్ ఒక విస్తృతమైన మానవాభ్యుదయం కోసం కృషి చేశారు. ఆయనకు కుల మత బేధాలు లేవు. ఆయన బౌద్ధ జీవన పథికుడు. ఆయన ఆర్థిక, వ్యాపార, రాజకీయ, పరిపాలన, ధర్మ శాస్త్రాల నిపుణుడు. మనుస్మృతిని, యాజ్ఞవల్క్య స్మృతిని, శారదా స్మృతిని అధ్యయనం చేసిన భారతీయుడు. అవి అధర్మశాస్త్రాలని తేల్చిన పరిశోధకుడు. చార్వాకాన్ని, బౌద్ధాన్ని, జైనాన్ని, సాంఖ్యాన్ని అవపో సన పట్టారు. జాన్ డ్యూయీ శిష్యునిగా ప్రజాస్వామ్య శాస్త్రాన్ని ప్రపంచానికి బోధించారు. ఆయన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరి షత్ ఇప్పుడు కొనియాడటంలో మార్మికత ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా రాజ్యాంగాన్ని చేత బూనుతుంది కానీ అస్పృశ్యత నివారణకు, కుల నిర్మూలనకు, స్త్రీ విముక్తికి, సంపద అందరికీ పంచడానికి పాటు పడటం లేదు. ఈ కార్పొరేట్ భారతాన్ని మతవాదులు పెంచి పోషిస్తున్నారు. సామ్యవాద భారతం కావాలంటే అంబేడ్కర్ మార్గం ఒక్కటే దిక్సూచి. ఆయన మార్గంలో నడుద్దాం.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 -
షోలాపూర్ సీటు: కాంగ్రెస్పై మండిపడ్డ సంజయ్ రౌత్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ‘షోలాపూర్ సౌత్’ స్థానంలో అభ్యర్థిని నిలబెట్టటంపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ కాంగ్రెస్పై మండిపడ్డారు. తమ పార్టీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించిందని తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.‘‘ఇటువంటి చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపిస్తే.. మహా వికాస్ అఘాడి (MVA)కి సమస్యలను సృష్టించినట్లు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ తన కొత్త జాబితాలో షోలాపూర్ సౌత్ నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా దిలీప్ మానేను ప్రకటించింది. మేము ఇప్పటికే అదే స్థానం నుంచి మా పార్టీ తరఫున అమర్ పాటిల్ను బరిలోకి దింపాం. అయితే.. ఇది కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన జాబితాలో టైపింగ్ పొరపాటుగా భావిస్తున్నా. .. మా వైపు నుంచి కూడా అలాంటి పొరపాటు జరగొచ్చు. మా సీటు షేరింగ్ ఫార్ములాలో భాగమైన మిరాజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారని విన్నా. మిత్రపక్షాలకు వ్యతిరేకంగా అభ్యర్థులను నిలబెట్టడం రాష్ట్రవ్యాప్తంగా వ్యాపిస్తే.. అది ఎంవీకే సమస్యలను సృష్టించినట్లు అవుతుంది’ అని అన్నారు.ముంబైలో ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ ఆసక్తి చూపడంపై రౌత్ స్పందించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ ముంబైలో మరో సీటు అడుగుతోంది. సాధారణంగా ముంబైలో శివసేన(యూబీటీ) ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తోంది’ అని అన్నారు. మరోవైపు.. షోలాపూర్ సౌత్ స్థానంలో పోటీ చేయాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించిందని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే తెలిపారు. రాష్ట్ర స్థాయిలో మేము దీనిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేం. ఇక.. రేపటితో నామినేషన్ల దాఖలు అంశం ముగుస్తుంది’’ అని అన్నారు.నవంబర్ 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 200కు పైగా స్థానాలకు అభ్యర్థులను ఎంవీఏ కూటమి ప్రకటించింది. అయితే.. శివసేన (యూబీటీ ), కాంగ్రెస్ పార్టీ మధ్య కొన్ని సీట్ల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతుండటం గమనార్హం.చదవండి: ఎంతకు తెగించింది..! భర్త రూ.8 కోట్లు ఇవ్వలేదని, ప్రియుడితో కలిసి -
మహా సంగ్రామంలో విజేతగా నిలిచేదెవరు ?
-
థాక్రే వర్గానిదే ‘అంధేరీ’.. కానీ, ఇక్కడో సర్ప్రైజ్ఉంది!
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతూ ఏక్నాథ్ షిండే వర్గం తిరుగుబాటు చేసిన తర్వాత తొలి విజయాన్ని అందుకుంది ఉద్ధవ్ థాక్రే వర్గం. ముందునుంచి ఊహించినట్లు అంధేరీ నియోజకవర్గాన్ని థాక్రే నేతృత్వంలోని శివసేన కైవసం చేసుకుంది. ముంబైలోని అంధేరీ(ఈస్ట్) నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో శివసేన అభ్యర్థి రుతుజా లాట్కే 66వేల భారీ మెజారిటీతో విజయ ఢంకా మోగించారు. రుతుజా లాట్కేకు మద్దతుగా పలు పార్టీల అభ్యర్థనతో ఈ పోటీ నుంచి బీజేపీ తప్పుకుంది. దీంతో లాట్కే విజయం లాంఛనప్రాయంగానే మారింది. ఊహించినట్లుగానే ఆమెకు భారీ మెజారిటీ కట్టబెట్టారు ఓటర్లు. అయితే, ఇక్కడ ఓటర్లు ఓ సర్ప్రైజ్ ఇచ్చారు. రుతుజా లాట్కేపై పోటీ చేసిన ఆరుగురు అభ్యర్థులకు వచ్చిన మొత్తం ఓట్లకన్నా నోటా(NOTA)కే ఎక్కువ ఓట్లురావటమే సర్ప్రైజ్గా చెప్పాలి. శివసేన ఎమ్మెల్యే రమేశ్ లాట్కే ఈ ఏడాది మే నెలలో మరణించారు. దీంతో అంధేరీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమయ్యాయి. ముందుగా ఇక్కడ బీజేపీ పోటీ చేయాలని భావించింది. అయితే, ఎన్సీపీ సహా పలు పార్టీలు పోటీ నుంచి తప్పుకోవాలని, రమేశ్ లాట్కే భార్యకు అవకాశం ఇవ్వాలని కోరాయి. దీంతో బీజేపీ తప్పుకుంది. బీఎంసీలో క్లర్క్గా పని చేస్తున్న లాట్కే.. ఆమె రాజీనామాను ఆమెదించిన తర్వాతే నామినేషన్ వేసేందుకు కోర్టు అంగీకరించింది. ఇదీ చదవండి: క్రైమ్ షోల ఎఫెక్ట్.. కుటుంబాన్ని గొడ్డలితో నరికి చంపిన బాలుడు -
ఎన్నికల వేళ ఉల్లిబాంబ్
మహారాష్ట్ర, హరియాణా ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ మరోసారి ఉల్లిబాంబు పేలింది. కేంద్రం గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. రాజధాని ఢిల్లీ, ముంబైలలో కేజీ 80 రూపాయలు దాటేసింది. సామాన్యుడి నుంచి కోటీశ్వరుల వరకు ఉల్లి లేనిదే ముద్ద దిగని కుటుంబాలే ఎక్కువ. ఎన్నికల సమయంలో ఉల్లి ధర పెరిగిదంటే ప్రభుత్వాలు కూలిపోయిన ఘటనల్ని గతంలో చూశాం. మహారాష్ట్ర, హరియాణాలో బీజేపీ అధికారంలో ఉండడంతో తమ అధికార పీఠం ఎక్కడ కూలిపోతోందన్న ఆందోళనతో కేంద్రం తక్షణమే చర్యలకు ఉపక్రమించింది. ఉల్లి ధరకు కళ్లెం వేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. కేంద్రం తీసుకుంటున్న చర్యలేంటి ? ►ఉల్లి ఎగుమతుల్ని తక్షణమే నిలిపివేసింది. ►కేంద్ర గిడ్డంగుల్లో నిల్వ ఉంచిన 56 వేల టన్నుల ఉల్లిపాయల్లో తక్షణమే 16 వేల టన్నుల ఉల్లిపాయల్ని మార్కెట్లోకి విడుదల చేసింది. ►కేంద్ర సంస్థలైన నాఫెడ్, జాతీయ సహకార వినియోగదారుల ఫెడరేషన్, మదర్ డైయిరీ సఫాల్ ఔట్లెట్స్ ద్వారా ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లో కేజీ 22 నుంచి 23 రూపాయలకు అమ్ముతోంది. ►కేంద్రం వద్ద ఉల్లిపాయలు సరిపడా ఉన్నాయని, ఏ రాష్ట్రాలకైనా కావాలంటే తక్షణమే పంపిణీ చేస్తామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ట్వీట్చేశారు. ఉల్లి కావాలన్న రాష్ట్రాలకు కేజీ రూ.16 రూపాయల చొప్పున కేంద్రం సప్లయ్చేస్తోంది. వీటిని ఆయారాష్ట్రాలు రూ. 24కి అమ్ముతున్నాయి. ప్రస్తుతానికి మార్కెట్లో గత ఏడాది పండిన పంటనే సప్లయ్ చేస్తున్నారు. నవంబర్ నాటికి కొత్తవి మార్కెట్లోకి వస్తే ధరలు సాధారణ స్థితికి చేరుకుంటాయని అంచనా. అయితే అక్టోబర్లో ఎన్నికలు ఉన్నందున కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి ఉల్లి ధరని దింపడానికి ప్రయత్నాలు చేస్తోంది. ధర ఎందుకు పెరుగుతోంది? ఉల్లి పంట ఎక్కువగా పండే రాష్ట్రాలైన కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, బీహార్లలో ఈ ఏడాది కుంభవృష్టి వర్షాలతో పంట దిగుబడి భారీగా తగ్గిపోయింది. దీంతో ధర ఆకాశాన్నంటింది. పండగ సీజన్ వస్తూ ఉండడంతో కొందరు దళారులు కావాలనే స్టాక్ని దాచేసి కృత్రిమ కొరతను సృష్టించారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఒకానొక దశలో ఢిల్లీ, ముంబై మార్కెట్లలో ఉల్లి ధర కేజీ రూ.70–80 పలికింది. నాలుగేళ్లలో ఉల్లిధర ఈ స్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారి. సాధారణంగా ఈ సీజన్లో ఉండే ధర కంటే ఇది 90శాతం ఎక్కువ. -
విపక్షాలకు మరో షాక్
సాక్షి, ఢిల్లీ: పార్లమెంటు ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన బీజేపీ విపక్షాలకు మరోసారి షాక్ ఇవ్వనుంది. ప్రముఖ నటి, అమరావతి (మహారాష్ట్ర) ఎంపీ నవనీత్కౌర్ రానా, ఆమె భర్త యువ స్వాభిమాన్ పార్టీ అధ్యక్షుడు రవిరాణా బీజేపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. స్వతంత్ర ఎమ్మెల్యే అయిన రవిరాణా దంపతులు శనివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాను ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతుతో నవనీత్ కౌర్ రానా అమరావతి నుంచి గెలిచారు. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి బీజేపీలో చేరుతున్నట్లు వారు చెబుతున్నారు. వారి చేరికలు కాంగ్రెస్, ఎన్సీపీలకు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఇప్పటికే ఆ రెండు పార్టీల నాయకులైన రాధాకృష్ణ పాటిల్, జయదూత్లు బీజేపీలో చేరి మంత్రి పదవులు పొందారు. ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి బీజేపీలోకి వలసలు పెరుగుతుండటం గమనార్హం. రవిరాణా తమ పార్టీలోకి వస్తే తూర్పు విదర్భ ప్రాంతంలో పార్టీ బలం పెరుగుతుందని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. రవిరాణా మాత్రం అమరావతికి ఎయిర్పోర్ట్, మహిళలకు స్వతంత్ర పోలీస్ స్టేషన్ల నిర్మాణం కోసమే కలిశానని చెప్పారు. -
మహారాష్ట్రలో మజ్లిస్–బీబీఎం పొత్తు
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో వచ్చే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఎంఐఎం, భరిపా బహుజన్ మహాసంఘ్ (బీబీఎం) పార్టీల మధ్య పొత్తు చిగురించింది. ఈ రెండు పార్టీలు 2019లో జరిగే లోక్సభ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ శనివారం వెల్లడించారు. బీబీఎం అధ్యక్షుడు ప్రకాశ్ అంబేడ్కర్ అక్టోబర్ 2న ఔరంగాబాద్లో నిర్వహించే ర్యాలీకి తాను హాజరవుతున్నట్లు తెలిపారు. ఆ ర్యాలీలో సంకీర్ణ కూటమి గురించి ప్రకటిస్తామని ఆయన తెలిపారు. -
‘మహా’ అసెంబ్లీలో కరెంటు పోయింది!
నాగ్పూర్: భారీగా కురుస్తున్న వర్షాలకు విద్యుత్ అంతరాయం కలగడంతో శుక్రవారం మహారాష్ట్ర శాసనసభ స్తంభించింది. సభ ప్రారంభం కాకముందే సభను రేపటికి వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో బీజేపీ మిత్రపక్షమైన శివసేనతో పాటు విపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. శుక్రవారం ఉదయం శాసన సభ, మండలి ప్రారంభమైన కొద్ది సేపటికే సభలో చీకటి అలుముకోవడంతో ఒక రోజుకు వాయిదా పడింది. గురువారం రాత్రి నాగ్పూర్లో భారీ వర్షం కురిసింది. దీంతో అసెంబ్లీకి విద్యుత్ సరఫరా చేసే కేంద్రంలోకి భారీగా వర్షపు నీరు చేరడంతో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్, ఎన్సీపీ సభ్యులు మాట్లాడాలని భావించినా విద్యుత్ లేకపోవడంతో మైకులు పనిచేయలేదు. మరమ్మతులు జరుగుతున్నాయని అసెంబ్లీ స్పీకర్ హరిభావ్ బాగ్దే సభను తొలుత గంటపాటు వాయిదా వేశారు. ఆ తర్వాత సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్ని పార్టీల సభ్యులతో సమావేశమై ఒక రోజుకు వాయిదా వేసేలా నిర్ణయం తీసుకున్నారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ.. ‘నగరంలో ఇప్పటికే రెండు మూడు సార్లు వర్షం పడింది. అయితే గురువారం రాత్రి మాత్రం భారీగా వర్షం పడింది. విద్యుత్ సరఫరా చేసే విభాగం సెల్లార్లో ఉండటంతో ఆ ప్రాంతం అంతా వర్షపు నీరు చేరింది. దీంతో విద్యుత్ కు అంతరాయం కలిగింది’అని చెప్పారు. నాగ్పూర్లో తొలిసారి వర్షాకాల సమావేశాలను నిర్వహించారు. -
సింహం, పులి కలిసే పోటీ: సీఎం
ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఎలుకల గురించి బీజేపీ సీనియర్ నేత ఏక్నాథ్ ఖడ్సే చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకే దారితీశాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మండలిలో ఆసక్తికర చర్చ చోటుచేసుకుంది. మండలిలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సింహం, పులి కలిసి 2019 ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని పరోక్షంగా బీజేపీ- శివసేన బంధం గురించి పేర్కొన్నారు. శాసనమండలి ప్రతిపక్ష నేత రాధాకృష్ణ వీకే పాటిల్.. సచివాలయంలో ఎలుకలు ఉన్నాయన్న ఏక్నాథ్ ఖడ్సే వ్యాఖ్యలను ఉటంకిస్తూ ‘ఎలుకలన్నీ కలిసి బీజేపీని సింహాసనం నుంచి కూలదోస్తాయి అంటూ ఎద్దేవా చేశారు. దీనికి స్పందనగా సీఎం మాట్లాడుతూ.. ‘పులి(శివసేన గుర్తు), సింహం కలిసే ఉన్నాయి. ఎలుకలు మమ్మల్ని ఏమీ చేయలేవు. సింహం, పులి కలిసి ఎలుకల్ని నాశనం చేస్తాయంటూ’ ధీటుగా బదులిచ్చారు. స్పందించిన ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ మాట్లాడుతూ.. ‘మాకు పులి గురించి తెలుసుగానీ, సింహం ఎవరనేదీ తెలియడం లేదంటూ’ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ‘ఎలుకలు మీకు దారి ఇవ్వచ్చు. కానీ రాష్ట్ర ప్రజలు 2019 ఎన్నికల్లో జంతువులకు వాటి స్ధానాన్ని తప్పక తెలియజేస్తార’ని ఎద్దేవా చేశారు. సీఎం వ్యాఖ్యలను వీకే పాటిల్ ఉటంకిస్తూ.. ‘సింహం, పులిల మధ్య ఉన్న ప్రేమానురాగాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న వారి బంధం ఎంతటి బలమైందో కూడా వారికి తెలుసు అంటూ’ వ్యాఖ్యానించారు. కాగా, బీజేపీ సీనియర్ నేత ఏక్నాథ్ ఖడ్సే అసెంబ్లీ సమావేశాల్లో... మంత్రాలయంలో(సచివాలయం) ఎలుకల నిర్మూలనకు కాంట్రాక్టు సంస్థ సమర్పించిన బిల్లులలోని లోపాలను ఎత్తి చూపుతూ.. మంత్రాలయంలోని 3,19,400 ఎలుకలు ఉన్నట్టు కాంట్రాక్ట్ సంస్థ చెప్పిందని గుర్తు చేశారు. వాటి నిర్మూలన కోసం ప్రభుత్వం ఆ సంస్థకు ఆరు నెలల సమయం ఇచ్చిందనీ, కానీ ఆ సంస్థ కేవలం ఏడు రోజుల్లోనే 3 లక్షల ఎలుకలను చంపినట్టు ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని చర్చలేవనెత్తిన విషయం తెలిసిందే. -
అసెంబ్లీలో 60 మంది మద్యం ప్రియులు!
సాక్షి, ముంబై : నాగ్పూర్లో ఇటీవల జరిగిన మహారాష్ట్ర శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో అనారోగ్యంతో వైద్యం పొందిన ప్రముఖుల్లో 60 మంది అతిగా మద్యం సేవించడంవల్ల వారి ఆరోగ్యం పాడైనట్లు ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. దీంతో నాయకుల క్వార్టర్స్లో మద్యం నిషేధం అమలులో ఉన్నప్పటికీ మంత్రులు, కార్యదర్శులు, ఉన్నతాధికారులు మద్యం సేవిస్తున్నట్లు స్పష్టమవుతోంది. శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో మహారాష్ట్రకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్షాల నాయకులు నాగ్పూర్లో తిష్ట వేస్తారు. వీరితోపాటు ముంబై, వివిధ ప్రాంతాల నుంచి సంబంధిత శాఖల ప్రభుత్వ అధికారులు, ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు. అత్యవసర సమయంలో లేదా వీరు అనారోగ్యానికిగురైతే వైద్యం అందించడానికి అసెంబ్లీ ప్రాంగణం, ఎమ్మెల్యే క్వార్టర్స్, రవీ భవన్ ఇలా మూడు చోట్ల వైద్య కేంద్రాలు (క్లినిక్లు) అందుబాటులో ఉంచుతారు. అందుకు 48 మంది వైద్యులు విధులు నిర్వహిస్తారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో (కేవలం రెండు వారాల్లోనే) ముఖ్యమంత్రి, మంత్రులతోపాటు కార్యదర్శులు, ఎమ్మెల్యేలు ఇలా మొత్తం 7,016 మంది వివిధ వైద్య సేవలు పొందారు. అందులో 60 మంది అతిగా మద్యం సేవించడం వల్లే అనారోగ్యానికి గురైనట్టు రక్త, మూత్ర పరీక్ష నివేదికలో బయటపడింది. మంత్రులు, ఎమ్మెల్యేలు నివాసముంటున్న రవీ భవన్, ఎమ్మెల్యే క్వార్టర్స్లో మద్యపాణ నిషేధం అమలులో ఉంది. అయినా అక్కడికి మద్యం ఎలా వచ్చిందనేది మిస్టరీగా మారింది. సమావేశాలు ముగిసిన తరువాత వీరు బయట మద్యం సేవించారా..? లేక ఏకంగా గదిలోకే మద్యం తీసుకొచ్చారా...? అనేది మాత్రం తెలియాల్సి ఉంది. -
పగలు, రాత్రి అనే తేడా లేకుండా షాపింగ్!
సాక్షి ముంబై: పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడైనా, ఎక్కడైనా ఏదైనా తినవచ్చు, కొనవచ్చు. మహారాష్ట్ర వ్యాప్తంగా షాపులు, హోటళ్లు, షాపింగ్ మాల్స్ ఇకపై 24 గంటలపాటు తెరిచే ఉండనున్నాయి. రాష్ట్రంలోని షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు 24 గంటలపాటు తెరిచి ఉండేలా చట్టంలో మార్పు చేసిన బిల్లును అసెంబ్లీలో ఆమోదించారు. దీంతో ఇకపై రోజంతా కొనుగోలు చేసేందుకు అవకాశం ఏర్పడనుంది. కాని కొన్ని షరతులతో ఈ బిల్లును ఆమోదించారు. ఒకవేళ 24 గంటలపాటు షాపులు, రెస్టారెంట్లు తెరిచి ఉంచాలనుకునేవారు కచ్చితంగా స్థానిక పోలీసు స్టేషన్ నుంచి అనుమతి తీసుకోవాలి. మరోవైపు 50 మందికిపైగా మహిళలు ఉద్యోగాలు చేసే షాపింగ్ మాల్, రెస్టారెంట్లలో యజమాని తప్పనిసరిగా చైల్డ్ కేర్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. 100 మందికిపైగా సిబ్బంది ఉండే హోటళ్లు, షాపింగ్ మాల్స్లలో క్యాంటీన్ వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలి. నైట్ షిప్లో పనిచేసే మహిళలను సురక్షితంగా ఇంటి చేర్చే బాధ్యత యజమానిదేనని బిల్లులో పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రతి షాపులో తప్పనిసరిగా సీసీటీవీలు ఏర్పాటు చేయాలి. ఈ నిబంధనలతో 24 గంటలపాటు షాపులు, మాల్స్ తదితరాలు తెరిచిఉంచే అవకాశం ఏర్పడింది. -
19 మంది ఎమ్మెల్యేలపై వేటు
ముంబై: మహారాష్ట్ర శాసనసభలో గలాభా సృష్టించిన విపక్ష ఎమ్మెల్యేలపై వేటు పడింది. 19 మంది ఎమ్మెల్యేలను 9 నెలల పాటు సస్పెండ్ చేస్తూ అసెంబ్లీ స్పీకర్ హరిభావ్ బాగాడే తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 31 వరకు సభలో అడుగుపెట్టకుండా సస్పెండ్ చేశారు. ఈ నెల 18న శాసనసభలో రాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ ముంగంటివార్ బడ్జెట్ ప్రవేశపెడుతుండగా కాంగ్రెస్, ఎన్సీపీ తదితర విపక్ష సభ్యులు తీవ్ర గందరగోళం సృష్టించారు. బడ్జెట్ ప్రతులు చదువుతున్న సమయంలో మంత్రిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అక్కడితో ఆగకుండా బడ్జెట్ ప్రసంగం వినపడకుండా గట్టిగా నినాదాలు చేశారు. ప్రతిపక్ష సభ్యుల వ్యవహారశైలిని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తప్పుబట్టారు. ప్రజాస్వామ్య ప్రతిష్టను దిగజార్చేలా ప్రవర్తించారని మండిపడ్డారు. విపక్ష సభ్యుల క్రమశిక్షణారాహిత్యాన్ని సీరియస్ గా తీసుకున్న స్పీకర్ వారిపై వేటు వేశారు. -
కన్హయ్య కుమార్ ఏమైనా ఉగ్రవాదా..?
ఢిల్లీ జేఎన్యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్ను మహారాష్ట్ర అసెంబ్లీ విజిటర్స్ గ్యాలరీలోకి అనుమతించకపోవడంపై కాంగ్రెస్ తీవ్రంగా తప్పుపట్టింది. సభలోకి కన్హయ్యను అనుమతించకపోవడానికి అతనేమైనా ఉగ్రవాదా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే నదీన్ ఖాన్ విమర్శించారు. బుధవారం మహారాష్ట్ర అసెంబ్లీలో నదీన్ ఖాన్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. కన్హయ్య ఉగ్రవాది కాదని, ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభ కార్యకలాపాలను వీక్షించవచ్చని చెప్పారు. అసెంబ్లీలోకి వచ్చేందుకు కన్హయ్యకు పాస్ ఉందని, అతన్ని అనుమతించకపోవడానికి తగిన కారణంలేదని అన్నారు. అసెంబ్లీ స్పీకర్ బగడే స్పందిస్తూ.. మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకుని పరిశీలిస్తానని చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మాట్లాడుతూ కన్హయ్యను అసెంబ్లీలోకి అనుమతించకపోవడం సిగ్గుమాలిన చర్య అని విరుచుకుపడ్డారు. కన్హయ్యను అడ్డుకున్నవారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిన్న విద్యార్థి సంఘం కార్యక్రమంలో పాల్గొనేందుకు కన్హయ్య ముంబై వచ్చాడు. ఈ విషయంపై కన్హయ్య స్పందిస్తూ.. విధాన సభ కార్యకలాపాలు చూడాలని కోరానని, ప్రత్యేకించి సభలో విదర్భపై జరిగే చర్చ వినాలనుకున్నానని, అయితే తనను అనుమతించలేదని చెప్పాడు. -
మహారాష్ట్రలో ‘ద్రవ్య’ బిల్లుపై డివిజన్
2014 ఏప్రిల్ 16న మహారాష్ట్ర అసెంబ్లీలో ఓటింగ్ సాక్షి, హైదరాబాద్: ద్రవ్య వినిమయ బిల్లును కేవలం మూజువాణి ఓటుతోనే సరిపెట్టాలని, డివిజన్ (అనుకూలంగా, వ్యతిరేకంగా ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను స్పష్టంగా నిర్ధారించడానికి వీలుగా సభలో నిర్వహించే ఓటింగ్ ప్రక్రియ)కు అవకాశం లేదంటూ ఏపీ శాసనసభలో బుధవారం అధికార పక్షం చేసిన వాదనలో వాస్తవం లేదని తేలిపోయింది. ఈ బిల్లుపై డివిజన్కు అవకాశం కల్పిం చడం.. దేశ చరిత్రలో ఏ రాష్ట్ర శాసనసభలో నూ జరగలేదని శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పిన దాంట్లోనూ నిజం లేదని తేలింది. 2014 ఏప్రిల్ 15న మహారాష్ట్ర శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుకు సభ మూజువాణి ఓటు తో ఆమోదం తెలిపిన తర్వాత.. అప్పటి ప్రతిపక్షం (బీజేపీ, శివసేన) డివిజన్ కోరింది. అప్పటి స్పీకర్ దిలీప్ వాల్సే పాటిల్.. ప్రతిపక్షం డిమాండ్ కు సానుకూలంగా స్పందించారు. ద్రవ్య వినిమయ బిల్లుపై డివిజన్కు అంగీకరించారు. బిల్లుకు అనుకూలంగా 105, వ్యతిరేకంగా 72 ఓట్లు వచ్చాయి. బిల్లుకు ఆమో దం లభించిందని స్పీకర్ ప్రకటించారు. -
మహారాష్ట్ర అసెంబ్లీలో మజ్లిస్ ఎమ్మెల్యే సస్పెన్షన్
‘భారత్ మాతాకీ జై’ అనేందుకు నిరాకరించిన మజ్లిస్ ఎమ్మెల్యే వారిస్ పఠాన్ను మహారాష్ట్ర అసెంబ్లీ బుధవారం సస్పెండ్ చేసింది. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ పార్టీలకు అతీతంగా ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ముంబై: ‘భారత్ మాతాకీ జై’ అనేందుకు నిరాకరించిన ఏఐఎంఐఎం ఎమ్మెల్యే వారిస్ పఠాన్ను మహారాష్ట్ర అసెంబ్లీ బుధవారం సస్పెండ్ చేసింది. పార్టీలకతీతంగా అతనిపై చర్యలు తీసుకోవాలంటూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. సౌత్ ముంబైలోని బైకుల్లా స్థానం నుంచి గెలిచిన పఠాన్పై సస్పెన్షన్ వేటు ప్రస్తుత బడ్జెట్ సెషన్స్ అయ్యే వరకు అమల్లో ఉంటుందని పేర్కొంది. ‘‘జాతీయ నాయకులను అగౌరవ పరచడంతో పాటు ‘భారత్ మాతాకీ జై’ అనేందుకు పఠాన్ నిరాకరించారు’’ అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి గిరీష్ బపత్ చెప్పారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా ఔరంగాబాద్కు చెందిన ఏఐఎంఐఎం ఎమ్మెల్యే ఇంతియాజ్ జలీల్ వ్యాఖ్యలతో ఈ రగడ మొదలైంది. ‘‘ప్రజలు కట్టే పన్నుల సొమ్మును ‘గొప్ప వ్యక్తుల’ స్మారక చిహ్నాలు కట్టడానికి వెచ్చించడం ప్రభుత్వానికి తగదు’’ అని జలీల్ వ్యాఖ్యానించారు. దీనిపై ఓ శివసేన ఎమ్మెల్యే స్పందిస్తూ... ‘జలీల్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ భారత్ మాతాకీ జై అనేది లేదని ఇటీవల వ్యాఖ్యానించారు’ అని గుర్తు చేశారు. పఠాన్ కలుగజేసుకుని... ‘‘మేం ‘జైహింద్’ అంటాం కానీ ‘భారత్ మాతాకీ జై’ అనం. కచ్చితంగా ఈ నినాదం చెప్పాలని చట్టంలో ఎక్కడా లేదు’’ అన్నారు. దీంతో కోపోద్రిక్తులైన అధికార బీజేపీ, శివసేనతో పాటు కాంగ్రెస్, ఎన్సీపీ, ఇతర పార్టీల ఎమ్మెల్యేలు పఠాన్ను సస్పెండ్ చేయాలంటూ పట్టుబట్టారు. దీంతో హోంమంత్రి రంజిత్ పాటిల్ పఠాన్ సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ‘వాక్స్వాతంత్య్రాన్ని పఠాన్ దుర్వినియోగపరిచారు. సభ సంప్రదాయాన్ని మంటగలిపారు’ అని పాటిల్ చెప్పారు. మజ్లిస్ ఎమ్మెల్యేను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆ పార్టీ చీఫ్ ఎంపీ అసదుద్దీన ఒవైసీ అన్నారు. అసదుద్దీన్పై చర్యలు తీసుకోవాలి: ఆర్ఎస్ఎస్ జమ్మూ: ‘భారత్ మాతాకీ జై’ అనే నినాదం తాను చేయనన్న ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ఎస్ డిమాండ్ చేసింది. భారత్ను తమ మాతృభూమిగా భావించనివారు దేశం వదిలి వెళ్లిపోవాలని సూచించింది. ‘ఒవైసీ అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మాతృభూమికి గౌరవం ఇవ్వనివారు దేశం వదిలి తమకు నచ్చిన చోటుకి వెళ్లవచ్చు. ఇలాంటి వారు పార్లమెంట్కు ఎన్నికవడం దురదృష్టకరం. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం’ అని ఆర్ఎస్ఎస్ జమ్మూ కశ్మీర్ ప్రాంత్ సంగ్ చాలక్ బ్రిగ్ సుచెట్ సింగ్ అన్నారు. ‘తన మెడపై కత్తి పెట్టినా భారత్ మాతాకీ జై అని అనను’ అంటూ అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై ఆయనిలా స్పందించారు. -
'అలా అని కలలో కూడా అనుకోను'
ముంబై: దేశం పట్ల తనకు అపారమైన ప్రేమ ఉందని మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన ఎంఐఎం ఎమ్మెల్యే వారిస్ పఠాన్ అన్నారు. తనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. ఎవరి దేశభక్తినైనా ఒక్క నినాదంతోనే ఎలా అంచనా వేస్తారని ఆయన ప్రశ్నించారు. జై హింద్, జై భారత్, జై మహారాష్ట్ర అంటేనే ప్రేమ ఉన్నట్టా అని అడిగారు. తాను ఇక్కడే పుట్టానని, తుదిశ్వాస వరకు ఇండియాలోనే ఉంటానని స్పష్టం చేశారు. మాతృదేశాన్ని అవమానించాలని కలలో కూడా అనుకోనని పేర్కొన్నారు. అసెంబ్లీలో 'భారత్ మాతాకి జై' అని నినదించేందుకు పఠాన్ నిరాకరించడంతో ఆయనను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ సెషన్ పూర్తయ్యేవరకు సస్పెన్షన్ విధించారు. -
మహారాష్ట్ర సర్కారులోకి శివసేన
మంత్రులుగా పది మంది ప్రమాణం బీజేపీ తరఫున మరో పది మంది మంత్రుల ప్రమాణం 15 ఏళ్ల తర్వాత మళ్లీ బీజేపీ-సేన ప్రభుత్వం సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ఎన్నికల ముందు నుంచి బీజేపీ-శివసేన పార్టీల మధ్య జరిగిన నాటకీయ పరిణామాలకు ఎట్టకేలకు తెరపడింది. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించుకున్న రెండు పార్టీలు తిరిగి ఒక్కటయ్యాయి. దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని మహారాష్ట్ర సర్కారులో శివసేన భాగస్వామిగా చేరింది. శివసేన తరఫు నుంచి ఐదుగురు కేబినెట్ మంత్రులుగా, మరో ఐదుగురు సహాయ హోదాతో మొత్తం పది మందికి మంత్రులుగా అవకాశం లభించింది. దీంతో 15 ఏళ్ల తర్వాత మళ్లీ బీజేపీ-శివసేన నేతృత్వంలోని కాషాయ కూటమి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లయింది. మరో విశేషం ఏమిటంటే ప్రతిపక్ష హోదాలోని పార్టీ ప్రభుత్వంలో చేరడం, అది కూడా ప్రభుత్వం ఏర్పాటైన నెల రోజుల సమయంలో కావడం గమనార్హం. మహారాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు బీజేపీ, శివసేన మంత్రుల పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేల సమక్షంలో ఆ రాష్ట్ర గవర్నర్ సి.హెచ్.విద్యాసాగర్రావు మొత్తం 20 మందితో మంత్రులుగా ప్రమాణం చేయిం చారు. ఇందులో కేబినెట్ మంత్రులుగా బీజేపీ తరఫున గిరీష్ బాపట్, గిరీష్ మహాజన్, చంద్రశేఖర్ బావన్కులే, బబన్రావ్ లోణికార్, రాజ్కుమార్ బడోలేతో పాటు శివసేన తరఫున దివాకర్ రావుతే, సుభాష్ దేశాయ్, రాందాస్ కదం, ఏక్నాథ్ షిండే, దీపక్ సావంత్ ప్రమాణం చేశారు. సహాయ మంత్రులుగా బీజేపీ తరఫున రామ్ షిండే, విజయ్కుమార్ దేశ్ముఖ్, అంబరీష్ రాజే ఆత్రాం, రంజిత్ పాటిల్, ప్రవీణ్ పోటే, శివసేన తరఫున సంజయ్ రాఠోడ్, దాదాజీ భుసే, విజయ్ శివ్తారే, దీపక్ కేసర్కర్, రవీంద్ర వాయ్కర్ ప్రమాణం చేశారు. అయితే ఈ మంత్రివర్గ విస్తరణలో బీజేపీ, శివసేన మినహా మిత్రపక్షాలైన ఆర్పీఐ, శివ్సంగ్రామ్ పార్టీలకు అవకాశమివ్వలేదు. దీంతో వారు కొంత అసంతృప్తికి గురైనట్లు గుర్తించిన ఫడ్నవిస్.. త్వరలో జరిగే రెండో విడత విస్తరణలో అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. -
‘బలనిరూపణ’పై మరో పిటిషన్ దాఖలు
ముంబై: గత వారం జరిగిన ‘బలపరీక్ష’లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నాయకత్వంలోని బీజేపీ మైనారిటీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిందని మంగళవారం బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో ఇప్పటివరకు ఈ విషయమై హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. కేతన్ తిరోడ్కర్, రాజ్కుమార్ అవస్తి అనే ఇద్దరు వ్యక్తులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. బలపరీక్షనాడు బీజేపీ సర్కారు రాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరించిందని వారు తమ పిటిషన్లో ఆరోపించారు. ఓటింగ్ జరిపించాలని ప్రతిపక్ష పార్టీలైన శివసేన, కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేసినా స్పీకర్ ఏమాత్రం పట్టించుకోకుండా మూజివాణి ఓటుతో ప్రభుత్వం బలపరీక్ష నెగ్గిందని ప్రకటించడం అన్యాయమన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో స్పీకర్, సీఎంల పాత్రపై సీబీఐ విచారణ జరిపించాలని కేతన్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 288 కాగా, బీజేపీ ప్రభుత్వానికి 145 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. కాగా, ఆ పార్టీకి 122 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. మిగిలిన 23 మంది సభ్యుల మద్దతుకు గాను ఆ పార్టీ శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీపై ఆధారపడాల్సి వచ్చింది. చిన్నచిన్న పార్టీలు, స్వతంత్రులను కలుపుకుపోదామన్నా వారి బలం తగినంత లేదు. -
మహారాష్ట్ర గవర్నర్పై దాడి
* అసెంబ్లీలోకి రాకుండా విద్యాసాగర్రావును అడ్డుకున్న విపక్షాలు * తోపులాటలో గవర్నర్ చేతికి స్వల్ప గాయాలు * ఐదుగురు కాంగ్రెస్ సభ్యులపై రెండేళ్లపాటు సస్పెన్షన్ * విశ్వాసపరీక్షలో మూజువాణి ఓటుతో నెగ్గిన బీజేపీ సర్కార్ సాక్షి, ముంబై: మహారాష్ర్ట అసెంబ్లీ సాక్షిగా ఆ రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావుపై బుధవారం దాడి జరిగింది. అసెంబ్లీలో జరిగిన తోపులాటలో గవర్నర్ చేతికి స్వల్ప గాయాలయ్యాయి. అంతకుముందు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల సందర్భంగా జరిగిన విశ్వాసపరీక్షలో మూజువాణి ఓటుతో దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం గట్టెక్కింది. అయితే సర్కారు వ్యవహరించిన తీరుపై విపక్ష శివసేన, కాంగ్రెస్ సభ్యుల ఆందోళనలతో అసెంబ్లీ అట్టుడికింది. మరోవైపు గవర్నర్పై దాడికి కారణమైన ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను స్పీకర్ రెండేళ్లపాటు సస్పెండ్ చేశారు. అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు అంతకుముందు అత్యంత నాటకీయ పరిణామాల మధ్య మహారాష్ర్ట కొత్త సర్కారు ఒడ్డునపడింది. తొలుత సభ విశ్వాసాన్ని కోరుతూ బీజేపీ ఎమ్మెల్యే ఆశిష్ శేలార్ ఏకవాక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. శివసేన, కాంగ్రెస్ డివిజన్ ఓటింగ్కు పట్టుబట్టినా మూజువాణి ఓటుతోనే తీర్మానానికి ఆమోదం లభించినట్లు స్పీకర్ హరిభావ్ బాగ్డే ప్రకటించారు. దీంతో శివసేన సభ్యులు తీవ్ర నిరసన తెలిపారు. పోడియంలోకి దూసుకెళ్లి.. డివిజన్ ఓటింగ్కు పట్టుబట్టారు. వీరికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తోడయ్యారు. మూజువాణి ఓటుతో విశ్వాసపరీక్షను నెగ్గి ప్రజాస్వామ్యాన్ని బీజేపీ సర్కారు ఖూనీ చేసిందని ప్రధాన ప్రతిపక్ష నేత ఏక్నాథ్ షిండే మండిపడ్డారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని హితవుపలికారు. దీనికి సీఎం ఫడ్నవిస్ స్పందిస్తూ.. ప్రతిపక్షమైనంత మాత్రాన ప్రతి విషయాన్నీ వ్యతిరేకించకూడదని, ప్రజాక్షేమం కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు మద్దతు తెలపాలని సూచించారు. మరోవైపు బీజేపీ సర్కారుకు బయటినుంచి మద్దతు ప్రకటించిన ఎన్సీపీ ఎమ్మెల్యేలు.. సభలో గొడవ జరుగుతున్నంతసేపూ తమ సీట్లోనే కదలకుండా కూర్చున్నారు. విపక్షాల ఆందోళనతో సభ కొంతసేపు వాయిదా పడింది. నిజానికి డివిజన్ ఓటింగ్ పెట్టినప్పటికీ ప్రభుత్వం సులభంగానే నెగ్గేది. ప్రస్తుతం 287 మంది సభ్యులున్న అసెంబ్లీలో బీజేపీకి 121 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా, మిత్రపక్షం ఆర్ఎస్పీకి ఒక ఎమ్మెల్యే, ఎన్సీపీకి 41 మంది సభ్యులు ఉన్నారు. ఏడుగురు స్వతంత్రులు, చిన్నపార్టీలకు చెందిన పలువురి మద్దతు ఉంది. గవర్నర్ వద్దకు వెళతాం: శివసేన, కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని విపక్షాలు వెల్లడించాయి. మళ్లీ ఓటింగ్ నిర్వహించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్ను కోరనున్నట్లు తెలిపాయి. ప్రజాస్వామ్య ప్రక్రియలో దీన్ని బ్లాక్ డేగా కాంగ్రెస్ నేత, మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ అభివర్ణించారు. డివిజన్ ద్వారా మెజారిటీని నిరూపించుకునే వరకు ఈ ప్రభుత్వం అక్రమంగా కొనసాగుతున్నట్టే భావిస్తామన్నారు. మైనారిటీ ప్రభుత్వం డివిజన్ ద్వారానే బలాన్ని నిరూపించుకోవాలని రాష్ర్ట కాంగ్రెస్ అధ్యక్షుడు మానిక్రావు థాక్రే అన్నారు. కాగా, కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ మద్దతుదారులైన 40 మంది ఎమ్మెల్యేలు విశ్వాసపరీక్షలో సర్కారుకు వ్యతిరేకంగా ఓటు వేసేవారని శివసేన ఎమ్మెల్యే రాందాస్ కదం పేర్కొన్నారు. అందుకే ముందస్తు వ్యూహం ప్రకారమే మూజువాణి ఓటుతో ప్రభుత్వం బయటపడిందని విమర్శించారు. ధైర్యముంటే మరోసారి విశ్వాస పరీక్ష నిర్వహించి మెజారిటీ రుజువు చేసుకోవాలని సవాల్విసిరారు. స్పీకర్కు వ్యతిరేకంగా అవిశ్వా స తీర్మానం ప్రవేశపెట్టే అంశంపై ఇతర పక్షాలతో చర్చిస్తామని కూడా రాందాస్తో పాటు, కాంగ్రెస్ నేత భాయ్ జగ్తాప్ తెలిపారు. అయితే డివిజన్ ఓటింగ్ డిమాండ్ను విపక్షాలు ఆలస్యంగా తనముందుకు తెచ్చాయంటూ.. స్పీకర్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. గవర్నర్ రాకతో తోపులాట విశ్వాసపరీక్ష తర్వాత ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించడానికి గవర్నర్ విద్యాసాగర్రావు అసెంబ్లీ ప్రాంగణానికి రావడంతో ప్రతిపక్షాలు ఆయనకు అడ్డుకున్నాయి. సభలోకి ప్రవేశించకుండా అసెంబ్లీ మెట్ల వద్దే పలువురు సభ్యులు భైఠాయించారు. మరికొందరు ఆయన కారును అడ్డుకున్నారు. విద్యాసాగర్రావు చలే జావ్ అంటూ శివసేన ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. కారు దిగి లోపలికి వెళుతుండగా విద్యాసాగర్రావును చుట్టుముట్టిన కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తోపులాటకు దిగారు. దీంతో భద్రతా సిబ్బంది వారిని బలవంతంగా పక్కకు తీసుకె ళ్లారు. ఈ పెనుగులాటలో గవర్నర్ చేతికి గాయమైంది. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను అధికారపక్షం కోరింది. కాంగ్రెస్కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలను రెండేళ్ల పాటు సస్పెండ్ చేయాలని బీజేపీకి చెందిన ఏక్నాథ్ ఖడ్సే ప్రతిపాదించారు. ఈ వివాదానికి ఇంతటితో తెరదించాలని స్పీకర్ను ప్రతిపక్ష నేత ఏక్నాథ్ షిండే, కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత రాధాకృష్ణ విఖే పాటిల్ కోరారు. అయినా గవర్నర్కు గాయాలవడాన్ని తీవ్రంగా పరిగణించిన స్పీకర్ కాంగ్రెస్ సభ్యులు వీరేంద్ర జగ్తాప్, రాహుల్ బోంద్రే, జైకుమార్ గోరే, అబ్దుల్ సత్తార్, అమర్ కాళేలను రెండేళ్ల పాటు సస్పెండ్ చేశారు. పారదర్శక పాలన అందిస్తాం: గవర్నర్ మహారాష్ట్ర ప్రజలు మార్పును కోరుకున్నట్టు ఇటీవలి ఎన్నికల్లో వెలువడ్డ ప్రజాతీర్పే నిదర్శనమని గవర్నర్ విద్యాసాగర్రావు తన ప్రసంగంలో పేర్కొన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాలను కొత్త ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఆర్థిక లోటు, కరెంటు సరఫరా, మౌలిక వసతుల లేమి తదితర ఎన్నో సవాళ్లను రాష్ట్రం ఎదుర్కొంటోందన్నారు. తమ ప్రభుత్వం నిర్ణీత సమయంలో, పారదర్శక రీతిలో ప్రజలకు సేవలు అందించేందుకు కట్టుబడి ఉందని చెప్పారు. త్వరలోనే ప్రభుత్వ సేవల గ్యారంటీ చట్టాన్ని తీసుకువస్తామని పేర్కొన్నారు. అధికారాలను వికేంద్రీకరించి ప్రజలే కేంద్రంగా పాలన అందిస్తామని చెప్పారు. ఇందులో భాగంగా వంద రోజుల్లో తమ ప్రభుత్వం ‘అపాలే సర్కార్’ పేరుతో ఇ-పోర్టల్కు రూపకల్పన చేస్తుందన్నారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా కూడా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ప్రతిపక్షాలు హోరెత్తించాయి. ఏకగ్రీవంగా స్పీకర్ ఎన్నిక విశ్వాసపరీక్షకు ముందు అసెంబ్లీ స్పీకర్గా బీజేపీ నేత హరిభావ్ బాగ్డేను సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దమ్ముంటే అవిశ్వాసాన్ని పెట్టండి: ఫడ్నవిస్ ప్రభుత్వం విశ్వాస పరీక్షను అక్రమంగా నెగ్గిందన్న విపక్షాల ఆరోపణను సీఎం ఫఢ్నవిస్ తోసిపుచ్చారు. తీర్మాన ఆమోదంలో నిబంధనలన్నీ పాటించామని విలేకర్లతో అన్నారు. కాంగ్రెస్, శివసేనలు సరైన సమయంలో డివిజన్ ఓటింగ్కు డిమాండ్ చేసి ఉంటే అందుకంగీకరించి ఉండేవారిమన్నారు. విపక్షాలకు దుమ్ముంటే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని సవాల్ విసిరారు. తన ప్రభుత్వానికి మెజారిటీ ఉంది కనుక ఆ తీర్మానాన్ని నెగ్గుతామన్నారు. తన ప్రభుత్వం ఎన్సీపీ మద్దతును నిరాకరించడం కానీ స్వీకరించడం కానీ చేయలేదన్నారు. -
విశ్వాస పరీక్షలో నెగ్గిన ప్రభుత్వం
మహారాష్ట్ర అసెంబ్లీలో బుధవారం జరిగిన విశ్వాసపరీక్షలో దేవేంద్ర ఫడ్నవిస్ సర్కారు నెగ్గింది. విడిగా ఓటింగ్ నిర్వహించాలని, మొత్తం సభ్యుల నుంచి ఓటింగ్ తీసుకోవాలని, విడివిడిగా లెక్కించాలంటూ శివసేన పట్టుబట్టింది. డివిజన్ చేయాల్సిందేనని భీష్మించుకుంది. అందుకు స్పీకర్ హరిభావు బాగ్డే నిరాకరించారు. దాంతో శివసేన ఎమ్మెల్యేలు ఒక్కసారిగా వెల్లోకి దూసుకెళ్లారు. అయితే ఆ సమయంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి మద్దతుగా నిలిచింది. దాంతో మూజువాణీ ఓటుతో విశ్వాస పరీక్షలో ఫడ్నవిస్ సర్కారు సులభంగా గట్టెక్కేసింది. -
తొలి పరీక్ష నెగ్గిన ఫడ్నవిస్ సర్కారు
మహారాష్ట్ర అసెంబ్లీలో స్పీకర్ ఎన్నికకు కొన్ని గంటల ముందు ప్రతిపక్ష శివసేన, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ఉపసంహరించుకున్నాయి. దీంతో బీజేపీ అభ్యర్థి హరిభావు బాగ్డే ఏకగ్రీవంగా స్పీకర్ అయ్యే అవకాశం ఏర్పడింది. ఆయన ఔరంగాబాద్ జిల్లా నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో స్పీకర్ ఎన్నిక జరగనుంది. తొలుత శివసేన నుంచి విజయ్ ఔటి, కాంగ్రెస్ నుంచి వర్షా గైక్వాడ్ స్పీకర్ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. అయితే, తర్వాత ఇరుపార్టీలూ అభ్యర్థులను ఉపసంహరించుకున్నాయి. స్పీకర్ ఎన్నిక వరకు సహకరించినా, విశ్వాస పరీక్షలో మాత్రం బీజేపీకి వ్యతిరేకంగానే ఓటేయాలని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే తన ఎమ్మెల్యేలకు సూచించారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తప్ప.. వేరెవరి నుంచి ఎలాంటి ప్రతిపాదన వచ్చినా ఆమోదించేది లేదని ఠాక్రే కుండ బద్దలుకొట్టి చెబుతున్నారు. అయితే.. తమకు స్వతంత్రులు, చిన్న పార్టీల సభ్యులతో కలిపి 138 మంది మద్దతు ఉందని బీజేపీ చెబుతోంది. ఎన్సీపీ కూడా బేషరతుగా మద్దతు ఇచ్చేందుకు ముందుకు రావడంతో ధీమాగా ఉంది. -
అసెంబ్లీలో బలపరీక్ష రేపే!
మహారాష్ట్ర అసెంబ్లీలో కొత్తగా అధికారం చేపట్టిన బీజేపీ సర్కారు తన బలాన్ని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నం అవుతోంది. బుధవారమే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అసెంబ్లీలో తనకు ఎంతమంది మద్దతు ఉందో నిరూపించాలి. మొత్తం 289 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం నిలబడాలంటే కనీసం 145 మంది సభ్యుల మద్దతు అవసరం. బీజేపీకి సొంతంగా 122 మంది, మరో మిత్రపక్షానికి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. అంటే ఎంతలేదన్నా మరో 22 మంది మద్దతు అవసరం అవుతుంది. తాము ప్రతిపక్షంలోనే కూర్చుంటామంటూ శివసేన లేఖ ఇచ్చినా.. ఇప్పటికీ చర్చలకు సిద్ధమేనని మరో ప్రకటన కూడా చేసింది. ఎన్సీపీ నేత శరద్ పవార్ బీజేపీ సర్కారుకు బేషరతుగా మద్దతు ప్రకటించారు. మళ్లీ ఎన్నికలు రాకూడదన్న ఉద్దేశంతోనే తాము మద్దతు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప మరెవరు మద్దతిచ్చినా తీసుకుంటామని కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ చెప్పారు. అసెంబ్లీలో బల నిరూపణకు తాము సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నంలోపే మరాఠా బరిలో ఏం జరిగిందో తెలిసిపోతుంది. -
12న ఫడ్నవీస్ ప్రభుత్వానికి విశ్వాస పరీక్ష!
ముంబై: మహారాష్ట్ర సీఎంగా ఎన్నికైన దేవేంద్ర ఫడ్నవీస్ ఈ నెల 12వ తేదీన విశ్వాస పరీక్ష ఎదుర్కొవడానికి సిద్ధమవుతున్నారు. ఫడ్నవీస్ ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కొవడానికి 24 స్థానాల దూరంలో ఉంది. ఇదిలా ఉండగా నేటినుంచి మూడు రోజుల పాటు మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమవుతోంది. సోమవారం ఉదయం 11 గంటలకు మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే సోమవారం ప్రోటెం స్పీకర్ గా జీవ పండు గావిట్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ రోజు రాజ్ భవన్ లో మహారాష్ట్ర గవర్నర్ సి. విద్యాసాగర్ రావు..గావిట్ చేత ప్రమాణం స్వీకారం చేయించనున్నారు. అనంతరం 12 వ తేదీ విశ్వాస పరీక్ష అంశానికి సంబంధించి ఫడ్నవీస్ స్పీకర్ అనుమతి కోరతారు. ఇప్పటికే విశ్వాస పరీక్ష అంశంపై బీజేపీ ప్రభుత్వానికి బయటనుంచి మద్దతిస్తామని 41 మంది సభ్యులున్న ఎన్సీపీ ప్రకటించిన విషయం తెలిసిందే. 122 శాసనసభా స్థానాలు గెలుచుకొని బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. అయితే 288 స్థానాలు గల సభలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 145 మంది శాసనసభ్యుల మద్దతు అవసరం ఉంది. బీజేపి మిత్రపక్షమైన రాష్ట్రీయ సమాజ్పక్ష ఒక్క స్థానం మాత్రమే గెలుచుకుంది. శివసేన 63, కాంగ్రెస్ 42, ఎన్సీపీకి 41 స్థానాలను సాధించాయి. -
ఎమ్మెన్నెస్లో బీజేపీ ముసలం
సాక్షి, ముంబై: నాసిక్ నగరంలో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పార్టీ నాయకులు, కార్యకర్తలకు బీజేపీ గాలం వేస్తోంది. ఈ మేరకు బీజేపీ నాయకులు చాపకింద నీరులా పని చేసుకుపోతున్నారు. ఇదిలా ఉండగా, ఎమ్మెన్నెస్ ప్రదేశ్ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వసంత్ గీతే సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన బీజేపీ నాయకులతో సంప్రదింపుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న నాసిక్ కార్పొరేషన్లోని 18 మంది కార్పొరేటర్లు కూడా గీతే బాట పట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం నాసిక్ కార్పొరేషన్లో ఎమ్మెన్నెస్ అధికారంలో కొనసాగుతోంది. ఒకవేళ పరిస్థితి ఇలాగే ఉంటే కార్పొరేషన్లో ఎమ్మెన్నెస్ అధికారం కోల్పోయే ప్రమాదం ఉంది. పార్టీకి రాజీనామా చేసిన అనంతరం గీతే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయనతో సంప్రదించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మొన్న జరిగిన లోక్సభ ఎన్నికలు, తాజాగా జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. రాజ్ఠాక్రే పార్టీ స్థాపించిన తర్వాత మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగినప్పుడు 13 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. కాని ఈసారి ఎన్నికల్లో ఆ పార్టీనుంచి ఒక్కరే ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో పార్టీ కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి వాతావరణం నెలకొంది. ఎమ్మెన్నెస్లో ప్రముఖ నాయకుడైన ప్రవీణ్ దరేకర్ కూడా బీజేపీ బాటలో ఉన్నట్లు గత వారం వార్తలు వచ్చాయి. తాజాగా గీతే పదవికి రాజీనామా చేయడం ఆ పార్టీకి గట్టి దెబ్బ తగిలినట్లుగా భావిస్తున్నారు. పార్టీకి రాజీనామా చేసినప్పుడు తన పార్టీ పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నానని, పార్టీని వీడిపోనని ప్రకటించారు. కాని కొద్ది సేపటిలోనే ఆయన బీజేపీతో సంప్రదింపులు జర్పుతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఇదిలా ఉండగా, నాసిక్లోని అనేక మంది కార్పొరేటర్లు, పదాధికారులు, కార్యకర్తలు బీజేపీ బాటలో ఉన్నారని బీజేపీ ఉత్తర మహారాష్ట్ర చీఫ్ విజయ్ సానే అన్నారు. ఈ విషయంపై రాష్ట్రస్థాయి నేతలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని సానే పేర్కొన్నారు. ఇటీవల రాష్ట్ర పర్యటనకు సిద్ధమైన రాజ్ ఠాక్రేతో అనేక మంది కార్యకర్తలు, పదాధికారులు మీకు అండగా మేమున్నామంటూ ఆయనకు మనోధైర్యాన్ని నూరిపోశారు. కాని వారం రోజులైన గడవకముందే వలసలకు సిద్ధం కావడం రాజ్ ఠాక్రేకు జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా, కార్పొరేషన్లో ఎన్నెమ్మెస్కు 40 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అలాగే బీజేపీకి 18, ఎన్సీపీకి 20, కాంగ్రెస్, 13, శివసేన,ఆర్పీఐ కూటమికి 23 మంది సభ్యులున్నారు. -
పరాజయం వెనుక కుట్ర
సాక్షి, ముంబై: ఇటీవల రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) ఘోర పరాజయం వెనక పెద్ద కుట్ర జరిగిందని ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ఆరోపించారు. ఓటమికి గల కారణాలపై విశ్లేషణ పనులు దాదాపు పూర్తికావచ్చయని త్వరలో పూర్తి వివరాలు బయటపెడతానని రాజ్ అన్నారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా మొదటిరోజు శనివారం అహ్మద్నగర్ జిల్లా పాతర్థి తాలూకాలో పర్యటించిన విషయం తెలిసిందే. అనంతరం షిర్డీ సమీపంలో పర్యటించిన తర్వాత విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీ ఓటమికి గల కారణాలు అంతర్గత విబేధాలు కావచ్చని తొలుత భావించామని అన్నారు. కాని ఓటమికి- పదాధికారులు, కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేదని విశ్లేషణలో తేలిందన్నారు. దీని వెనక కుట్ర జరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి ఆదాయం రాకుండా తాము అడ్డుకుంటున్నామని కొన్ని పార్టీలు చేసిన దుష్ర్పచారం చేయడం వల్ల తమ పార్టీ చాలా నష్టపోయిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టోల్ ప్లాజాలను మూసివేయాలని తామెన్నడూ డిమాండ్ చేయలేదన్నారు. ‘రాష్ట్రంలో అనేక రహదారులు బీఓటీ పద్ధతిలో నిర్మించారు.. అందుకు వెచ్చించిన వ్యయాన్ని వాహనదారుల నుంచి వసూలు చేసేందుకు టోల్ ప్లాజాలు ఏర్పాటు చేశారని మాకు తెలుసు.. ఒప్పందం ప్రకారం వెచ్చించిన డబ్బులు వసూలైన టోల్ప్లాజాలను మాత్రమే ఎత్తివేయాలని మేం డిమాండ్ చేశామ’ని ఆయన అన్నారు. ‘ప్రతీరోజు ఎన్ని వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి..? వాటి ద్వారా కాంట్రాక్టర్కు ఎంత మేర ఆదాయం వస్తుంది..తదితరవివరాలు ఎవరి వద్దా లే వు. ప్రభుత్వం వద్ద కూడా వాటికి సంబంధించిన వివరాలు, ఆధారాలు లేవు. దీన్ని దృష్టిలో ఉంచుకుని క్యాష్ లెస్ వ్యవహారాన్ని చేపట్టాల’ని తాముడిమాండ్ చేశామన్నారు. ఈ పద్ధతి ద్వారా రహదారులపై నిత్యం ఎన్ని వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి... వాటి ద్వారా ఎంత మేర డబ్బులు వసూలవుతున్నాయి...అవకతవకలేమైనా జరుగుతున్నాయా... ఇలా అనేక వివరాలు బయటపడతాయని ఆయన వివరించారు. దీన్ని బట్టి సంబంధిత కాంట్రాక్టర్కు గడువు పెంచివ్వాలా..? వద్దా అనేది నిర్ణయించేందుకు వీలుపడుతుందని తాము భావించామని చెప్పారు. ఎన్నికలకు ముందు తమ పార్టీ చేపట్టిన ఆందోళనల వల్ల అనేక టోల్ ప్లాజాలను ప్రభుత్వం మూసివేసిందని గుర్తుచేశారు. కొందరు నాయకులు ఈ ఆందోళనను అడ్డుపెట్టుకుని ప్రజలకు తప్పుడు సమాచారం చేరవేశారని ఆరోపించారు. ఆదాయం లేనిదే అభివృద్ధి పనులు జరగవని, దీన్ని ఎమ్మెన్నెస్ అడ్డుకుంటోందని కొన్ని పార్టీలు పనిగట్టుకుని ప్రచారం చేశాయని, దీని వల్ల తమ పార్టీ ఘోర పరాజయం పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. -
పులి కాస్తా పిల్లి అయింది
అతి విశ్వాసం వమ్మయిన వైనం * సీఎం తానేనన్న ఉద్ధవ్ ఠాక్రేకు భంగపాటు * మోదీ హవాను అంచనా వేయని వైఫల్యం * బీజేపీకి మద్దతు ఇవ్వక తప్పని దుస్థితికి చేరిన శివసేన సాక్షి, ముంబై: మహారాష్ట్ర 2014 అసెంబ్లీ ఎన్నికలు, వాటి ఫలితాలు బీజేపీ, శివసేనలకు మరచిపోలేని అనుభవాలను ఇచ్చాయి. 2014 ఎన్నికల ముందు వరకు కూడా ఈ రెండు పార్టీల్లో మహారాష్ట్రలో సేనది పైచేయి కాగా.. బీజేపీ జూనియర్ భాగస్వామిగానే ఉంది. కానీ 2014 ఎన్నికల్లో ‘మోదీ హవా’ పరిస్థితులను తారుమారు చేసింది. శివసేన ఊహించని స్థాయిలో మహారాష్ట్రలో బీజేపీ బలపడింది. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి తానేనని కలలు కన్న శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే.. ప్రస్తుతం వాస్తవాన్ని జీర్ణం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు, తరువాత ఆయన స్వరంలో మార్పులను కళ్లకు కట్టే కథనం..! పొత్తు చర్చల్లో.. పొత్తు చర్చల సందర్భంగా కూడా శివసేన ఒంటెద్దు పోకడలనే అనుసరించింది. తాము ఇచ్చేవారమే కానీ తీసుకునేవారం కాదంటూ గొప్పలు పోయింది. బీజేపీకి 119 సీట్లకు మించి ఒక్క సీటు కూడా ఎక్కువ ఇవ్వబోమంటూ ఉద్ధవ్ ఠాక్రే మొండిగా వ్యవహరించారు. పోటీకి దిగాక.. పొత్తు చర్చలు విఫలమై.. ఎవరికి వారు పోటీకి దిగిన తరువాత కూడా వ్యూహాత్మకంగా బీజేపీ శివసేనపై ప్రత్యక్ష దాడికి దిగలేదు. ప్రధాని మోదీ కూడా ‘మహా’ ప్రచారంలో బాల్ ఠాక్రేపై తనకున్న గౌరవం దృష్ట్యా శివసేనను విమర్శించబోనన్నారు. కానీ శివసేన మాత్రం బీజేపీ, మోదీలే లక్ష్యంగా ప్రచారం నిర్వహించింది. బీజేపీ తమను వెన్నుపోటు పొడిచిందని ఆరోపించింది. ‘మోదీ హవానే ఉంటే ఆయన ఇక్కడ ఇన్ని సభల్లో ఎందుకు పాల్గొంటున్నారు?’ అంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల అనంతరం.. ఎన్నికలు జరిగిన రోజు దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీదే హవా అంటూ ప్రకటించడంతో సేన స్వరంలో మార్పు ప్రారంభమైంది. తమ మధ్య శత్రుత్వమేమీ లేదని అక్టోబర్ 17న వ్యాఖ్యానించింది. ‘హృదయాలు పగిలాయి. అవి అతకడం కష్టమే అయినా.. మహారాష్ట్రకు ఇప్పుడు స్థిరత్వం, శాంతి అవసరం’ అంటూ పరోక్షంగా పార్టీ పత్రిక ‘సామ్నా’లో బీజేపీకి స్నేహ హస్తాన్ని చాచింది. ఫలితాలు వెలువడ్డాక.. బీజేపీకి మద్ధతిచ్చేందుకు, ప్రభుత్వంలో చేరేందుకు సిద్ధమయింది. మంత్రిత్వ శాఖల విషయంలోనూ బీజేపీ ఎలాంటి మాటివ్వకపోయినా.. బీజేపీ ఎవరిని సీఎం చేసినా మద్ధతిస్తామంటూ ఏకపక్షంగా ప్రకటించింది. -
శివసేన స్వరం మారిందా?
నిన్న మొన్నటి వరకు బీజేపీ మీద కారాలు.. మిరియాలు నూరిన శివసేన ఉన్నట్టుండి గొంతు మార్చినట్లు కనిపిస్తోంది. ఆ పార్టీ అధికార పత్రిక 'సామ్నా'లో సోమవారం ఉదయం రాసిన సంపాదకీయంలో.. మహారాష్ట్రలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో భాగస్వామి కావాలన్న ఆకాంక్షలు స్పష్టంగా కనిపించాయి. మహారాష్ట్రలో బీజేపీ సాధించిన ఘన విజయానికి ప్రధాన కారకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాలేనని అందులో రాశారు. 'మహారాష్ట్ర ప్రయోజనాలు' నెరవేరాలంటే బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వం వల్లే సాధ్యమని చెప్పారు. దాన్ని బట్టి చూస్తే.. ముఖ్యమంత్రిగా బీజేపీ ఎవరిని ఎన్నుకున్నా దానికి శివసేన సరేననేలాగే ఉంది. ఇంతకుముందు సామ్నాలో రాసిన సంపాదకీయాలలో మాత్రం బీజేపీ మీద కారాలు, మిరియాలు నూరారు. ఇప్పుడు ఉన్నట్టుండి ఇలా స్వరం మార్చడం.. ఆ పార్టీ వైఖరిని తెలియజేస్తోందని విశ్లేషకులు అంటున్నారు. అప్పట్లో రాసిన సంపాదకీయాల్లో అయితే.. ప్రధాని తీవ్రంగా ప్రచారం చేసినా కూడా బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధించలేకపోయిందంటూ విమర్శలు గుప్పించారు. తాజా వ్యాసంలో మాత్రం ''రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ నడుపుతున్నందుకు సంతోషంగా ఉంది'' అన్నారు. -
'మహా'లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ కసరత్తు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ఈ నెల 27న బీజేపీ శాసనసభ పక్షం సమావేశం కానుంది. కేంద్ర మంత్రి నితీన్ గడ్కారీ ఇప్పటికే తాను సీఎం పదవికి రేసులో లేనని ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షడు దేవేంద్ర పడ్నవిస్ సీఎం పదవిని చేపట్టే అవకాశం ఉంది. బీజేపీ అగ్ర నాయకత్వం కూడా దేవేంద్ర వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అదికాక కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం ముంబై వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సీఎం ఎంపిక అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ఉపరితల రవాణ శాఖ మంత్రి నితీన్ గడ్కారీని సీఎంగా ఎంపిక చేయాలని మహారాష్ట్రలోని పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ అగ్రనాయకత్వానికి విజ్ఞప్తి చేసినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో తాను కేంద్ర మంత్రిగా న్యూఢిల్లీలోనే ఉండాలని భావిస్తున్నానని... తిరిగి ముంబై వచ్చేందుకు అంత సుముఖుంగా లేనట్లు నితీన్ గడ్కారీ గురువారం వెల్లడించారు. అక్టోబర్ 15న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ 122 సీట్లు సాధించిన అతి పెద్ద పార్టీగా అవతరించింది. అయితే 288 సీట్లు గల మహారాష్ట అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 146 సీట్లు రావాలన్న విషయం తెలిసిందే. -
దేవేంద్ర ఫడ్నవిస్ కే "మహా" పగ్గాలు
-
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్?
ఉత్కంఠ రేపిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి విషయంలో బీజేపీ అధిష్ఠానం ఓ నిర్ణయానికి వచ్చేసింది. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్కే ఈ పగ్గాలు అప్పజెప్పాలని నిర్ణయించుకుంది. క్యాంపు రాజకీయాలతో కలకలం రేపిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఒత్తిడిని ఏమాత్రం పట్టించుకోకుండా.. శివసేన ఒత్తిడికి తలొగ్గకుండా పార్టీని విజయపథంలో నడిపించిన ఫడ్నవిస్నే ఎంచుకుంది. ఎన్నికలకు ముందు దాదాపు రెండు దశాబ్దాల పాటు కొనసాగిన పొత్తును శివసేన తెంచుకోడానికి ప్రయత్నిస్తున్నప్పుడు.. దేవేంద్ర ఫడ్నవిస్ చాలా గట్టిగా నిలబడ్డారు. కనీసం 135 స్థానాల్లో పోటీ చేయాల్సిందేనని అధిష్ఠానానికి చెప్పారు. అయితే శివసేన మాత్రం 119 స్థానాలకు మించి ఇచ్చేది లేదని అన్నప్పుడు, అవసరమైతే పొత్తును తెంచుకోవాలని కూడా అధిష్ఠానం దగ్గర ఫడ్నవిస్ వాదించారు. ఆయన విదర్భ ప్రాంతానికి చెందిన నాయకుడు. సాధారణంగా మహారాష్ట్ర రాజకీయాల్లో మారాఠ్వాడా ప్రాంత నాయకులదే హవా నడుస్తుంటుంది. ఈసారి ఆ ప్రాంతాన్ని కాదని.. కరువు కాటకాలతో రైతు ఆత్మహత్యలలో ముందున్న విదర్భ ప్రాంతం నుంచి వచ్చిన నాయకుడికే కమలనాథులు పట్టంగట్టారు. -
అవినీతిపరుల కోసమే సర్కారుకు మద్దతా?
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైతే తాము బయటనుంచి మద్దతు ఇస్తామంటూ ఎన్సీపీ ప్రకటించడంతో శివసేన ఉలిక్కిపడింది. తమ అవినీతిని కప్పిపుచ్చుకోడానికి, అవినీతిపరులైన నాయకులను కాపాడుకోడానికే బీజేపీ సర్కారుకు మద్దతు ఇస్తామంటున్నారని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. వాస్తవానికి ఎన్నికలకు ముందే బీజేపీతో పొత్తును తెంచుకున్న శివసేన.. తీరా ఎన్నికల్లో ఆశించిన ఫలితం రాబట్టలేకపోయింది. అనుకోకుండా ఎన్సీపీ నాయకులు బీజేపీవైపు మొగ్గు చూపడంతో తమ పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో ఆ పార్టీపై శివసేన మండిపడింది. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో అనేకమంది అవకాశవాదంతో వ్యవహరిస్తున్నారని, అందులో ఎన్సీపీ ముందుందని చెప్పింది. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ 123 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు ఆ పార్టీకి మరో 22 స్థానాలు అవసరం. 41 స్థానాలు గెలుచుకున్న ఎన్సీపీ.. ఫలితాలు రాగానే తాము బేషరతుగా బీజేపీకి మద్దతిస్తామని తెలిపింది. కానీ బీజేపీ ఇంతవరకు దానిపై స్పందించలేదు. శివసేనకు 63 స్థానాలు రావడం, దాదాపు రెండు దశాబ్దాలుగా ఆ పార్టీకి బీజేపీతో సంబంధాలు ఉండటంతో ఎన్నికల అనంతర పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందని కొంతమంది నాయకులు భావిస్తున్నారు. అయితే.. ఎన్నికలకు ముందు శివసేన పెట్టే షరతులను అంగీకరించొద్దంటూ గట్టిగా పట్టుబట్టిన దేవేంద్ర ఫడ్నవిస్ లాంటి నాయకులను ముఖ్యమంత్రి చేయడానికి శివసేన ఎంతవరకు అంగీకరిస్తుందన్నది కూడా అనుమానమే. అవసరమైతే స్వతంత్రులు, ఇతర చిన్న పార్టీల మద్దతు తీసుకుని.. అటు శివసేన, ఇటు ఎన్సీపీ రెండు పార్టీల అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చన్న వాదనలు సైతం వచ్చాయి. ఇలాంటి తరుణంలో మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో.. దీపావళి తర్వాతే ఒక స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. అప్పటికి అందరూ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. -
మహిళా ఎమ్మెల్యేలు 16 మందే!
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహిళలకు సరైన వాటా దక్కలేదు. మొత్తం 16 మంది మహిళలు మాత్రమే గెలిచారు. వీరిలో బీజేపీ నుంచి 10 మంది, కాంగ్రెస్ నుంచి ఐదుగురు, ఎన్సీపీ నుంచి ఒకరు ఉన్నారు. శివసేన, ఎమ్మెన్నెస్లకు మహిళా ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం లేదు. బీజేపీకి చెందిన ఆ పార్టీ దివంగత నేత గోపీనాథ్ ముండే కుమార్తె పంకజ, మరో సిట్టింగ్ ఎమ్మెల్యే మధుశ్రీ మిసాల్లు తమ సీట్లలో తిరిగి గెలిచారు. కొత్తగా ఎన్నికైన మహిళా ఎమ్మెల్యేల్లో మాజీ సీఎం అశోక్ చవాన్ భార్య అమీతా చవాన్ ఉన్నారు. -
‘మహా’ ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్
* బీజేపీ, శివసేనల మధ్య తొలగని ప్రతిష్టంభన * ఎన్సీపీ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకెళ్లనున్న కమలనాథులు! * బీజేపీకి మద్దతు నిర్ణయాన్ని సమర్థించుకున్న శరద్ పవార్ ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాని నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుపై మల్లగుల్లాలు పడుతున్నాయి. అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ.. ఎన్సీపీ ఇచ్చే బేషరతు మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా, లేక బీజేపీ-శివసేనల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందా అన్నది స్పష్టం కావడం లేదు. ఒకప్పటి మిత్రులైన బీజేపీ-శివసేనల మధ్య ప్రతిష్టంభన కూడా తొలగలేదు. సేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే.. బీజేపీ విజయం సాధించినందుకు ప్రధాని మోదీ, ఆ పార్టీ చీఫ్ అమిత్ షాలను అభినందిస్తూ ఫోన్ చేసినప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు. శివసేనను సస్పెన్స్లో ఉంచి ఎన్సీపీ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకెళ్లాలని బీజేపీ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. మంగళవారం బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు అవకాశమివ్వాలని కోరాలని కాషాయదళం యోచిస్తోంది. తమది పెద్ద పార్టీ కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అడిగే హక్కు తమకే ఉందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి రాజీవ్ ప్రతాప్ రూడీ సోమవారం అన్నారు. ముఖ్యమంత్రి పదవిని తీసుకునేది తామేననన్నారు. బీజేపీకి బయటి నుంచి మద్దతు ఇస్తామన్న ఎన్సీపీ ప్రతిపాదనపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఇప్పటికైతే చర్చించలేదన్నారు. తాము అన్ని మార్గాలను తెరిచే ఉంచామని బీజేపీ నేత ఓమ్ మాథుర్ చెప్పారు. తద్వారా సేన మద్దతిస్తే తీసుకోవడానికి సిద్ధమేనని చెప్పకనే చెప్పారు. మరోవైపు.. మహారాష్ట్ర, హర్యానాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు అనుసరించాల్సి వ్యూహంపై పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీతో చర్చించారు. 288 స్థానాలు మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీకి 122, దాని మిత్రపక్షమైన రాష్ట్రీయ సమాజ్పక్షకు ఒకటి, శివసేనకు 63, కాంగ్రెస్కు 42, ఎన్సీపీకి 41 సీట్లు వచ్చాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన145 మేజిక్ మార్కును సాధించాలంటే బీజేపీకి మరో 22 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. శివసేన సస్పెన్స్: మరోపక్క.. కొత్తగా ఎన్నికైన శివసేన ఎమ్మెల్యేలు సోమవారం సమావేశమై తమ శాసనసభాపక్షనేతను ఎన్నుకునే అధికారాన్ని పార్టీ చీఫ్ ఉద్ధవ్కు కట్టబెట్టారు. అయితే బీజేపీతో 25 ఏళ్ల పొత్తు పునరుద్ధరణపై కానీ, బీజేపీకి మద్దతిచ్చే అంశంపై కానీ ఎలాంటి చర్చా జరగలేదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. ఉత్తమ ప్రత్యామ్నాయం: పవార్ ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీకి బయటను నుంచి మద్దతిస్తామని ప్రకటించిన ఎన్సీపీ నిర్ణయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ గట్టిగా సమర్థించుకున్నారు. ఇతర ప్రధాన పార్టీల సీట్లను చూస్తే సుస్థిర ప్రభుత్వానికి అదే ఉత్తమ ప్రత్యామ్నాయమన్నారు. ఎన్సీపీ ఎమ్మెల్యేలు తన బంధువు, మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ను తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న తర్వాత శరద్ పవార్ వారినుద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నేత ఒకరు తనను ఫోన్లో సూచించారని అజిత్ పవార్ వెల్లడించారు. అయితే మూడు పార్టీల ఎమ్మెల్యేల సంఖ్య 146 కనుక ప్రభుత్వం స్థిరంగా ఉండదని చెప్పాననన్నారు. కాగా, కాంగ్రెస్, ఎన్సీపీలు శివసేన మద్దతులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశమూ లేకపోలేదని, వీటికి ఇతర చిన్న పార్టీలూ తోడైతే బీజేపీని అధికారానికి దూరంగా పెట్టగలవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాగా, ‘నేషనలిస్ట్ కరప్ట్ పార్టీ’ అని మోదీ విమర్శించిన ఎన్సీపీతో బీజేపీ ఎలా చేతులు కలుపుతుందని కాంగ్రెస్ నేత రణదీప్ దుయ్యబట్టారు. ముందంజలో ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎం పదవి రేసులో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవీస్ ముందంజలో ఉన్నారు. రద్దుకానున్న అసెంబ్లీలో విపక్ష నేత ఏక్నాథ్ ఖడ్సే, శాసనమండలి విపక్ష నేత వినోద్ థావ్డే, దివంగత పార్టీ నేత గోపీనాథ్ ముండే కుమార్తె పంకజ తదితరుల పేర్లూ చక్కర్లు కొడుతున్నాయి. ఢిల్లీలో అమిత్, మహారాష్ట్రకు చెందిన గడ్కారీతో మంతనాలు జరపడంతో గడ్కారీ కూడా సీఎం రేసులోకి వచ్చే అవకాశముందని ఊహాగానాలు వినిపించాయి. అయితే వీటిని పార్టీ వర్గాలు తోసిపుచ్చాయి. మహారాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష నేత ఎన్నికను పరిశీలించేందు పార్టీ నేత జేపీ నడ్డాతోపాటు నియమితులైన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కేంద్ర కేబినెట్ సమావేశం కారణంగా సోమవారం ముంబై వెళ్లలేకపోయారు. -
మహా ముఖ్యమంత్రి రేసులో ఎవరెవరు?
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుచేసేంత స్పష్టమైన ఆధిక్యం రాకపోయినా.. అత్యధిక స్థానాలు సాధించి, అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేన మద్దతు ఇస్తుందో, లేదా ముందే ప్రకటించిన ఎన్సీపీ మద్దతు తీసుకుంటారో.. ఇవన్నీ కావు ఇండిపెండెంట్ల సాయంతోనే గద్దెనెక్కేస్తామని అంటారో గానీ కమలనాథులు తమ పార్టీ నాయకులే ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. దాంతో పలువురు ఆశావహుల పేర్లు సీఎం పదవికోసం ముందుకు వచ్చాయి. రాష్ట్ర రాజకీయాల్లోకి తాను వెళ్లేది లేదని పార్టీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ చెబుతున్నా, ఆయన పేరుకూడా ప్రముఖంగా వినపడుతోంది. దేవేంద్ర ఫడ్నవిస్, ప్రకాష్ జవదేకర్ పేర్లమీద కూడా చర్చలు జోరుగా సాగుతున్నాయి. గోపీనాథ్ ముండే కుమార్తె పంకజా ముండే పేరునూ సీరియస్గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. బీజేపీ తరఫున కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మహారాష్ట్రకు తదుపరి ముఖ్యమంత్రి కావచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో వందకు పైగా ర్యాలీలు చేసి విజయంలో కీలకపాత్ర పోషించిన గడ్కరీ... తనకు రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి లేదంటున్నారు. మహారాష్ట్ర బీజేపీలో అనుభవజ్ఞుడైన నేతగా మిగతా నేతల మద్దతున్న ఆయన మాత్రం తాను కేంద్రంలోనే ఆనందంగా ఉన్నానని చెబుతున్నారు. మహారాష్ట్ర బిజెపి అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ పేరు కూడా సిఎం రేసులో ప్రముఖంగా వినపడుతోంది. వివాదాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణ గల యువనేతగా పార్టీ అధిష్టానాన్ని ఆయన ఆకర్షించారు. సీఎం రేసులో వినపడుతున్న మరో పేరు వినోద్ తావ్డే. పార్టీ వ్యవహారాలను చక్కబెట్టగలిగే చురుకైన యువనేతగా తావ్డే గుర్తింపు తెచ్చుకున్నారు. తావ్డే అభ్యర్ధిత్వాన్ని పార్టీ అధిష్టానం సీరియస్గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ సారి మహారాష్ట్రకు మహిళా సీఎం రాబోతున్నారంటూ ముంబైలో ఫలితాలకు ముందునుంచే జోరుగా చర్చ జరుగుతోంది. ఈ చర్చంతా పంకజాముండే గురించే. ఇటీవల కన్నుమూసిన కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే కుమార్తె పంకజ. ఉజ్వల భవిష్యత్తు ఉండీ అకస్మాత్తుగా కన్నుమూసిన బీజేపీ నేత ప్రమోద్ మహాజన్కు పంకజ కోడలు. పర్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆమెకు ఐదేళ్ల రాజకీయ అనుభవం మాత్రమే ఉంది. కుటుంబ నేపథ్యం ఆధారంగా చూస్తే ఆమె ముఖ్యమంత్రి కావడానికి ఏ అడ్డంకులూ లేవు. ముండే, మహాజన్ల మరణాల నేపథ్యంలో పార్టీ సెంటిమెంట్కు ప్రాధాన్యం ఇస్తే ఆమె అభ్యర్ధిత్వానికి ఎవరూ అడ్డుచెప్పే అవకాశం లేదు. అయితే కుటుంబ నేపథ్యాలకన్నా అనుభవానికే పార్టీ పెద్దలు ప్రాధాన్యతనిస్తే పంకజకు ప్రస్తుతానికి అవకాశం లేనట్లే. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సోమవారం సమావేశమై.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరన్న విషయం తేలుస్తుంది. -
బీజేపీ హీరో.. ఎంఎన్ఎస్ జీరో!!
ముంబై మహానగరంలో ఒకప్పుడు మహారాష్ట్ర నవనిర్మాణ సమితి అంటే.. బ్రహ్మాండమైన ఫాలోయింగ్ ఉండేది. రాజ్ ఠాక్రే స్థాపించిన ఈ పార్టీ.. ముంబై నగరం మరాఠీలకే సొంతం కావాలన్న నినాదంతో ప్రజల్లో వీరాభిమానాన్ని సంపాదించుకున్న ఎంఎన్ఎస్.. తాజాగా ఆ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో.. ముంఖ్యంగా ముంబై మహానగరంలో పూర్తిగా చతికిలబడిపోయింది. దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో అత్యధికంగా 15 సీట్లను బీజేపీ గెలుచుకుంది. 14 సీట్లతో శివసేన రెండో స్థానంలో నిలవగా, కాంగ్రెస్ మాత్రం ఈ రెండింటికీ చాలా దూరంగా 5 సీట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. చివరకు హైదరాబాదీ పార్టీగా పేరొందిన మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్ (ఎంఐఎం) కూడా అక్కడ బోణీ కొట్టింది గానీ, ఎంఎన్ఎస్ మాత్రం ఒక్క స్థానం కూడా సంపాదించలేకపోయింది. ఎంఎన్ఎస్ ఒక్కసారిగా ఇలా చతికిలబడుతుందని వాస్తవానికి ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఒకరకంగా చెప్పాలంటే ముంబై రాజకీయ చిత్రపటం నుంచి అది పూర్తిగా మాయమైపోయింది. ఒకప్పుడు సేవ్రి, మాహిమ్, మగాథానె లాంటి ప్రాంతాలన్నీ ఎంఎన్ఎస్ కంచుకోటలు. కానీ, వాటిలో ఎక్కడా గెలవలేదు. అలాగే బాలా నందగావ్కర్, నితిన్ సర్దేశాయ్, ప్రవీణ్ దారేకర్ లాంటి మహాయోధులు కూడా మట్టికరిచారు. పైగా కేవలం ఓడిపోవడమే కాదు.. వాళ్ల మెజారిటీలలో తేడాలు కూడా చాలా ఎక్కువ. ఉదాహరణకు నందగావ్కర్ అయితే తన ప్రత్యర్థి, శివసేన అభ్యర్థికి వచ్చిన ఓట్లలో సగం కూడా సంపాదించలేకపోయారు. ఒకప్పుడు ఆయన బ్రహ్మాండమైన నాయకుడు. కానీ ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితులలో ఆయన పరిస్థితి దారుణంగా మారింది. అలాగే ప్రవీణ్ దారేకర్ అయితే ఏకంగా మూడోస్థానానికి పడిపోయారు. ఒక్క మాహిమ్ నియోజకవర్గంలో మాత్రం అక్కడి సిటింగ్ ఎమ్మెల్యే సర్దేశాయ్ కాస్త గట్టి పోరాటం చేశారు. ఆయన కేవలం 6వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. కానీ ఇక్కడి ఓటమి ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రేకు చాలా ఇబ్బందికరమైనది. ఎందుకంటే.. మాహిమ్ స్థానం ఆ పార్టీకి చాలా ముఖ్యం. శివాజీ పార్కు లాంటి కీలక ప్రాంతాలన్నీ ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. బాలఠాక్రే కూడా ఇక్కడినుంచే తన ఉత్తేజపూరితమైన ప్రసంగాలు ఇచ్చేవారు. ఆయన మాటలు వింటేనే మరాఠీల రోమాలు నిక్కబొడుచుకునేవి. అలాంటి స్థానాన్ని కూడా పోగొట్టుకున్న ఎంఎన్ఎస్.. ఇక రాబోయే ఎన్నికల నాటికి ఏమవుతుందోనని అంతా చూస్తున్నారు. -
మహారాష్ట్ర అసెంబ్లీలో పార్టీల బలాబలాలు
ముంబై: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. 288 సీట్లు ఉన్న అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ 122 సీట్లు, శివసేన 63, కాంగ్రెస్ 42, ఎన్సీపీ 41, ఎంఐఎం 2. రాష్ట్రీయ సమాజ్ పక్ష 1, బహుజన్ వికాస్ ఆఘాదీ 03, పీజెంట్స్ వర్కర్ పార్టీ 3, ఎంఎన్ఎస్ 1, సీపీఐ 1, ఇతరులు 8 సీట్లను గెలుచుకున్నాయి. -
బీజేపీ 'సెంచరీ' రికార్డు
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభంజనంతో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సరికొత్త రికార్డు సృష్టించింది. మహారాష్ట్రలో 24 ఏళ్ల తర్వాత 100కు పైగా అసెంబ్లీ సీట్లు సాధించిన ఏకైక పార్టీగా నిలిచింది. అంతకుముందు ఈ రికార్డు కాంగ్రెస్ పేరిట ఉంది. 1990 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 144 సీట్లు సాధించింది. ఆ తర్వాత జాతీయ పార్టీలు గానీ, ప్రాంతీయ పార్టీలు గాని ఇప్పటివరకు వంద సీట్లు దక్కించుకోలేకపోయాయి. తాజా ఎన్నికల్లో బీజేపీ 120 పైగా స్థానాలను బీజేపీ కైవశం చేసుకోనుందని ఎన్నికల ఫలితాల సరళి వెల్లడిస్తోంది. 2009 కంటే మూడు రెట్లు అధిక స్థానాలను బీజేపీ గెల్చుకోనుండడం విశేషం. మహారాష్ట్ర శాసనసభలో 288 సీట్లు ఉన్నాయి. -
'రెండు రాష్ట్రాల్లో మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం'
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానాల్లో తమ పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. రెండు రాష్టాల్లో కాంగ్రెస్ పార్టీకి మూడో స్థానం దక్కిందన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో ఇప్పటివరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదన్నారు. కాంగ్రెస్ నుంచి దేశాన్ని విముక్తి చేయాలన్న తమ ఎన్నికల ప్రచారం ఫలించిందన్నారు. మహారాష్ట్ర, హర్యానాల్లో ప్రజలే విజయం సాధించారని వ్యాఖ్యానించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ పాలన తీరుపై ప్రజలు ఆలోచించారన్నారని అమిత్ షా అన్నారు. ఈ రెండు రాష్టాల్లో విజయంతో తిరుగులేని నాయకుడిగా మోదీ గుర్తింపు పొందారన్నారు. -
మహారాష్ట్రలో ఎంఐఎం సంచలనం
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం సంచలన విజయం సాధించింది. హైదరాబాద్లోనే బలమైన పార్టీగా ఉన్న ఎంఐఎం మరాఠా గడ్డపై ఊహించని ఫలితాలు నమోదు చేసింది. మూడు అసెంబ్లీ సీట్లు కైవసం చేసుకోగా, మరో చోట ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎంఐఎం అభ్యర్థులు వారిష్ యూసుఫ్ పఠాన్ ముంబైలోని బైకులా నియోజకవర్గం నుంచి, ఇంతియాజ్ ఔరంగాబాద్ సెంట్రల్ నుంచి, అబ్దుల్ గఫార్ ఔరంగాబాద్ తూర్పు నియోజకవర్గం నుంచి ఘనవిజయం సాధించారు. నాందేడ్ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎంఐఎం అభ్యర్థి మొయిన్ ఖాన్ ముందంజలో ఉన్నారు. అసదుద్దీన్ ఓవైసీ సారథ్యంలోని ఎంఐఎం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 24 చోట్ల అభ్యర్థులను బరిలో దింపింది. -
నాసిక్ లో కాషాయ జెండా రెపరెపలు
నాసిక్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కషాయ జెండా రెపరెపలాడుతోంది. రాష్టంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించనుంది. నాసిక్ నగరంలో మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎమ్మెన్నెస్) ను బీజేపీ మట్టకరిపింది. ఎమ్మెన్నెస్ సిట్టింగ్ స్థానాల్లో బీజేపీ పాగా వేసింది. ఇక్కడున్న మూడు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. నాసిక్ సెంట్రల్ స్థానంలో బీజేపీ అభ్యర్థి దేవయాని పరాండే గెలుపొందారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎమ్మెన్నెస్ అభ్యర్థి వసంత్ గీతెపై 28,272 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. నాసిక్ వెస్ట్ లో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీమా మహేష్ హిరాయ్ గెలుపొందారు. మాజీ మేయర్, బీజేపీ అభ్యర్థి బాలాసాహెబ్ సనాప్... నాసిక్ ఈస్ట్ నుంచి విజయం సాధించారు. -
బీజేపీకి మద్దతిస్తాం : ఎన్సీపీ
-
బీజేపీకి మద్దతిస్తాం: ఎన్సీపీ
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకపక్క అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఓట్ల లెక్కింపు జరుగుతుండగా మరోపక్క రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. బీజేపీకి బయట నుంచి మద్దతు ఇస్తామని శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ప్రకటించింది. మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలన్నదే తమ ఉద్దేశమని తెలిపింది. ఈ మేరకు ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ ప్రకటించారు. కాంగ్రెస్ తో మైత్రి చెడిపోవడంతో ఈ ఎన్నికల్లో ఎన్సీపీ ఒంటరిగా పోటీ చేసింది. కాగా ఎన్పీపీ మద్దతు బీజేపీ తీసుకుంటుందా, లేదా అనేది ఆసక్తికరంగా మారింది. సహజ మిత్రపక్షమైన శివసేన వైపే బీజేపీ మొగ్గుచూపే అవకాశముందంటున్నారు. మహారాష్ట్రలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం లేదని ఎన్నికల ఫలితాల సరళి వెల్లడిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. -
ఇరు రాష్ట్రాలలో విజయం సాధించిన అభ్యర్థులు
హైదరాబాద్: మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించనుంది. ఓట్ల లెక్కింపులో ఇదే విషయం స్పష్టమవుతోంది. మహారాష్ట్రలో రెండవ స్థానంలో శివసేన, ఆ తర్వాత స్థానాలు వరుసగా కాంగ్రెస్, ఎన్సీపీ నిలిచేలా ఉన్నాయి. హర్యానాలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఇక్కడ రెండవ స్థానంలో ఐఎన్ఎల్డీ, మూడో స్థానంలో కాంగ్రెస్ ఉన్నాయి. ఇరు రాష్ట్రాలలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలలో ఇప్పటివరకు ఆయా పార్టీలు గెలుచుకున్న స్థానాలు: బీజేపీ - 55 శివసేన - 29 కాంగ్రెస్ - 25 ఎన్సీపీ - 21 ఇతరులు - 17 గెలుపొందినవారు: అజిత్ పవర్ (ఎన్సీపీ) వైభవ్ నాయక్ (శివసేన) దేవేంద్ర ఫడ్నవీస్ (బీజేపీ) పృధ్వీరాజ్ చవాన్ (కాంగ్రెస్) ఓడిపోయినవారు: నారాయణ రాణె (కాంగ్రెస్) హర్యానాలోని మొత్తం 90 స్థానాలలో ఇప్పటివరకు ఆయా పార్టీలు గెలుచుకున్న స్థానాలు: బీజేపీ - 45 కాంగ్రెస్ - 14 ఐఎన్ఎల్డీ - 19 హెచ్జేసీ - 2 ఇతరులు - 6 విజయం సాధించినవారు: భూపీందర్సింగ్ హుడా (కాంగ్రెస్) -
మహారాష్ట్రలో ఆధిక్యంలో ప్రముఖులు
హైదరాబాద్: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాల్లో పలువురు ప్రముఖులు ఆధిక్యంలో ఉన్నారు. పర్లీ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి నిలిచిన బీజేపీ అభ్యర్థి, గోపినాథ్ ముండే కుమార్తె పంకజాముండే ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. అలాగే దక్షిణ కరాడ్లో మాజీ సీఎం పృధ్వీరాజ్ చవాన్ (కాంగ్రెస్), నాగ్పూర్లో దేవేంద్ర ఫడ్నవిస్ (బీజేపీ), బారమతిలో అజిత్ పవార్ (ఎన్సీపీ), కుడాల్లో మాజీ సీఎం నారాయణరావు రాణెతోపాటు మాజీ మంత్రులు ఆర్ఆర్ పాటిల్, ఛగన్ బుజబల్, అశోక్ చవాన్ భార్య అమృతా చవాన్ కూడా అధిక్యంలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఎన్నికల ఓట్ల లెక్కింపులో వెనుకంజలో ఉన్న వారు: మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కుమారుడు రావూ షాహెబ్ షెకావత్ కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే కుమార్తె ప్రణీతి షిండే -
ఓటేయలేదని వృద్ధురాలి సజీవదహనం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పార్టీకి ఓటయేనందుకు ఆ పార్టీ అభిమానులు 65 ఏళ్ల వృద్ధురాలిని సజీవదహనం చేశారు. నాసిక్కు 90 కిలోమీటర్ల దూరంలోని బభుల్గావ్ ఖుర్ద్ గ్రామంలో ఈ సంఘటన జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆమెకు 80% కాలినగాయాలు కావడంతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. జెలుబాయ్ జగన్నాథ్ వాబ్లే ఫిర్యాదు మేరకు అశోక్ బొర్నారే, పాండురంగ బొర్నారే, నందకిశోర్ భురక్ అనే ముగ్గురిని హత్యాయత్నం, నేరపూరితంగా బెదిరించడం నేరాల కింద పోలీసులు అరెస్టు చేశారు. ఆ వృద్ధురాలు ఓటు వేసేందుకు వెళ్తున్నప్పుడు ఈ ముగ్గురూ దారిలో ఆమెను ఆపి, మూడో నెంబరు బటన్ ఒత్తాలని చెప్పారు. అది శివసేన అభ్యర్థి శంభాజీ పవార్ది. కానీ బయటకు వచ్చాక ఆమె రెండో నెంబరు బటన్ (ఎన్సీపీ అభ్యర్థి ఛగన్ భుజ్బల్) నొక్కానని చెప్పడంతో ఆమెను చంపేస్తామని బెదిరించారు. తర్వాత రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇంటికొచ్చి, ఆమెను దుర్భాషలాడి, కిరోసిన్ పోసి నిప్పంటించారు. అయితే వాబ్లే కొడుకు రఘునాథ్ మాత్రం అందుకు భిన్నంగా చెబుతున్నాడు. తనను కాపాడేందుకు వచ్చినవాళ్లే తనను చంపడానికి ప్రయత్నించారంటూ తన తల్లి చెబుతోందని అతడు అన్నాడు. ఇంట్లో వంట చేస్తుండగా దీపానికి ఆమె చీర అంటుకుందని అతడు చెబుతున్నాడు. వాస్తవాలేంటో తాము పరిశీలిస్తామని ఎస్పీ సంజయ్ మోహితే తెలిపారు. -
టెన్షన్..టెన్షన్..టెన్షన్!
రేపే ఓట్ల లెక్కింపు చక్రం తిప్పనున్న ఇండిపెండెంట్లు? సాక్షి, ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓట్ల లెక్కింపు ఆదివారం జరగనున్న నేపథ్యంలో ఏ పార్టీ అధికారంలోకి రానుంది...? ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే... విషయంపై అనేక ఊహగానాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఓట్ల లెక్కింపుపైనే కేంద్రీకృతమైంది. ఎగ్జిట్ పోల్స్లో బీజేపీ పెద్ద పార్టీగా అవతరించనుందని తేలడంతో బీజేపీ వర్గాల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. ఆ పార్టీలో ముఖ్యమంత్రి పదవి కోసం అప్పుడే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఒకవేళ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి మెజారిటీ స్థానాలు లభ్యమైతే ముఖ్యమంత్రి పదవి ఎవరికి కట్టబెట్టాలనే విషయంపై ఇప్పటినుంచే రాష్ట్రవ్యాప్తంగా జోరుగా చర్చలు ప్రారంభమయ్యాయి. ఆ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా రోజుకో పేరు తెరపైకి వస్తోంది. ముఖ్యమంత్రి రేసులో ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి, పంకజా ముండే, దేవేంద్ర ఫడ్నవీస్, వినోద్ తావ్డే, ఏక్నాథ్ ఖడ్సేలున్న సంగతి తెలిసిందే. వీరితోపాటు ఇప్పుడు మరో పేరు విన్పిస్తోంది. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్కు ముఖ్యమంత్రి పదవి అప్పగించే అవకాశాలున్నాయంటూ కొందరు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి విషయంపై సుదీర్ఘ చర్చలు జరిగే అవకాశముంది. కీలకంగా మారనున్న ఇండిపెండెంట్లు... ఎవరికీ పూర్తి మెజార్టీ లభించనట్టయితే ఇండిపెండెంట్లు కీలకంగా మారే అవకాశాలున్నాయి. ముఖ్యంగా పాతికేళ్ల తర్వాత పార్టీలన్నీ ఒంటరిగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్నటివరకు మిత్రపక్షాలుగా ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీలతోపాటు శివసేన, బీజేపీల ఓట్లు చీలే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో ఎవరు గెలిచినా చాల స్వల్పమెజార్టీతో గట్టెక్కే అవకాశాలున్నాయి. మరోవైపు గతంలో మాదిరిగా ఓట్లు చీలి ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా పరాజయం పాలయ్యే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఏ పార్టీకీ పూర్తి మెజార్టీరాకుండా హంగు ఏర్పడినట్టయితే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఇండిపెండెంట్లు ప్రధాన పాత్ర పోషిస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,686 మంది ఇండిపెండెంట్లు పోటీచేశారు. వీరిలో ఎంత మంది విజయం సాధిస్తారనేది ఆదివారం వరకు వేచిచూడాల్సిందే. ప్రతిపక్షంలో ఎవరో మరి.. సాక్షి, ముంబై: రాష్ట్రంలో బుధవారం జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలు వెల్లడి కాకముందే కొన్ని ప్రముఖ పార్టీలు తమకు తోచిన విధంగా పదవులపై అంచనాలు వేసుకుంటున్నాయి. ఎగ్జిట్ పోల్స్ సర్వేలో బీజేపీకి భారీ మెజార్టీ వస్తుందని, సొంత బలంపై ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని స్పష్టం కావడంతో ఇక ప్రతిపక్షంలో ఎవరుంటారనే దానిపై ప్రముఖ పార్టీల్లో ఉత్కంఠ రేపుతోంది. ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం మొదటి స్థానంలో బీజేపీ ఉండగా రెండు, మూడు, నాలుగో స్థానంలో నిలిచే పార్టీల మధ్య ఎక్కువ తేడా లేదు. దీంతో ప్రతిపక్షంలో ఎవరు కొనసాగుతారనే దానిపై అంతటా చర్చ జరుగుతోంది. కాగా సర్వే రిపోర్టు ప్రకారం రెండో స్థానంలో శివసేన ఉన్నప్పటికీ ప్రతిపక్ష నాయకుడి పదవి ఎవరిని వరిస్తుందనే దానిపై కూడా పార్టీ వర్గీయుల్లో చర్చనీయంశమైంది. కాని సర్వే రిపోర్టుపై తమకు నమ్మకం లేదని తామే ప్రభుత్వం ఏర్పాటుచేస్తామనే ధీమాతో శివసేన నాయకులు ఉన్నారు. కాని సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేంత మెజార్టీ రాకున్నప్పటికీ కనీసం ప్రతిపక్షంలోనైనా కొనసాగుతామనే ధీమాతో ఉన్నట్లు తెలుస్తోంది. మరోపక్క ప్రభుత్వం ఏర్పాటులో ఎన్సీపీ కీలకపాత్ర పోషిస్తుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు ప్రఫుల్ పటేల్ అభిప్రాయపడిన విషయం తెలిసిందే. ఇలా ఎవరికి వారు ఫలితాల తర్వాత ఎదురయ్యే రాజకీయ పరిణామాలపై బేరీజు వేసుకుంటున్నారు. -
ఆ రెండుచోట్ల మంత్రం పనిచేస్తుందా?
దాదాపు రెండు దశాబ్దాలుగా శివసేనతో ఉన్న చెలిమి చెడిపోయినా.. ఆ రాష్ట్రాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలన్న గట్టి పట్టుదలతో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ఆ రాష్ట్రంలో గట్టిగానే ప్రచారం చేశారు. 288 స్థానాలున్న మరాఠా పీఠాన్ని దక్కించుకుంటే తర్వాత రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో మార్గం సుగమం అవుతుందన్నది ఆయన దీర్ఘకాల ఆలోచన. ఇక 90 స్థానాలున్న హర్యానాను కూడా మోదీ వదల్లేదు. అక్కడ ఏకంగా 11 భారీ బహిరంగ సభలు నిర్వహించారు. ఆ రాష్ట్రాన్ని కూడా వశం చేసుకోవాలని గట్టి ప్రయత్నం చేశారు. ఇంతకీ ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బ్రాండ్ పనిచేసిందా లేదా అనే విషయం తెలియాలంటే మాత్రం ఆదివారం వరకు ఆగాల్సిందే. 19వ తేదీన రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో తాను ప్రతిపాదించిన అభ్యర్థి ఎలాంటి ఇబ్బంది లేకుండా విజయం సాధించాలంటే తగినంత స్థాయిలో అసెంబ్లీల బలం కూడా మోదీకి అవసరం. అందుకే ముందుగా మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో గెలవాలని గట్టి ప్రయత్నం చేశారు. ఒకదశలో గొంతు సహకరించకపోయినా కూడా అలాగే ప్రచారం చేశారు. పాకిస్థాన్ రేంజర్లు కాశ్మీర్ సరిహద్దుల్లో భారత బోర్డర్ ఔట్పోస్టులపై దాడులు చేస్తున్నప్పుడు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం ఏం చేస్తారని ప్రతిపక్షాలు ఎద్దేవా చేసినా కూడా పట్టించుకోలేదు. కానీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తే మాత్రం మహారాష్ట్రలో పూర్తిస్థాయిలో ఫలితాలు రావడం కష్టమనే తెలుస్తోంది. అక్కడ పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవచ్చని, అయితే అతిపెద్ద పార్టీగా మాత్రం బీజేపీయే అవతరిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. -
రెండు రాష్ట్రాల్లో మాదే అధికారం: బీజేపీ
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక శాతం పోలింగ్ నమోదు కావడం పట్ల బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ దుష్పరిపాలనకు వ్యతిరేకంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారని వ్యాఖ్యానించింది. కచ్చితమైన మెజార్టీతో రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. పోలింగ్ సరళి తమ పార్టీకే అనుకూలంగా ఉందని బీజేపీ అధికార ప్రతినిధి జేపీ నద్దా అన్నారు. సుపరిపాలన, అభివృద్ధి, నమ్మకమైన నాయకత్వానికే ప్రజలు ఓటు వేశారని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో తాము ప్రణాళిక ప్రకారం ఎన్నికల ప్రచారం సాగించామన్నారు. -
ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రముఖులు
-
ఓటేసి.. సెల్ఫీ తీసుకున్న సుప్రియ
మహారాష్ట్ర ఎన్నికల్లో పోలింగ్ జోరుగా సాగుతోంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆయన కుమార్తె సుప్రియా సూలే, బీజేపీ ప్రధాన అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవిస్.. ఇలా పలువురు ప్రముఖులు ఉదయాన్నే తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. సుప్రియా సూలే తాను ఓటు వేయడమే కాక.. బయటకు వచ్చిన తర్వాత వేలికి ఇంకు గుర్తు చూపిస్తూ మరికొందరు మహిళా నేతలతో కలిసి సెల్ఫీ తీసుకున్నారు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఏ పార్టీల మధ్యా పొత్తులు లేకపోవడంతో బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ.. అన్నీ విడివిడిగానే పోటీ చేస్తున్నాయి. -
పోలింగ్ కేంద్రంలో పిడుగుపడి.. ఒకరి మృతి
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. మహారాష్ట్రలోని 288 స్థానాలకు, హర్యానాలోని 90 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా, సావనీయ ప్రాంతంలోని పోలింగ్ కేంద్రంలో పిడుగు పడి ఒకరు మృతి చెందారు. తాడ్దేవ్ ప్రాంతంలోని గుజరాతీ పాఠశాలలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. విదర్భ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో పోలింగ్కు అంతరాయం కలిగింది. -
ఎన్నికల వేళ.. శివసేన పత్రికా ప్రకటనలు!
మహారాష్ట్రలో ఒకవైపు పోలింగ్ జరుగుతుండగా.. మరోవైపు శివసేన భారీ పత్రికా ప్రకటనలతో సంచలనం సృష్టిస్తోంది. వాస్తవానికి ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ రోజు ఇలా ప్రకటనలు ఇవ్వకూడదు. కానీ, బాల ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రేల ఫొటోలు, బాణం గుర్తుతో భారీ ప్రకటన ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో తామే ప్రధాన పోటీదారులం అన్నట్లుగా ఈ ప్రకటనలు గుప్పించింది. తమ పార్టీ అధికారిక పత్రికలైన సామ్నా, దోపహర్కా సామ్నా పత్రికల్లో బుధవారం నాటి ఎడిషన్ మొదటిపేజీలో పూర్తి పేజీ ప్రకటనలు ఇచ్చింది. 'ధనుష్య బాణ్ కీ టంకార్ హై, ఆనీ అబ్ అప్నీ సర్కార్ హై' అని ఇందులో నినాదం ఇచ్చింది. ధనస్సు, బాణం శివసేన ఎన్నికల గుర్తు. వాటిని గుర్తు చేసేలా.. ఈసారి మన ప్రభుత్వమే రావాలంటూ ఈ ప్రకటన ఇచ్చింది. అలాగే, ముంబైలోని ఇతర మీడియాకు మరో రకం పెద్ద ప్రకటన ఇచ్చింది. అందులో అయితే.. ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేసుకునేలా ఉంది. ''రావణుడిని హస్తంతో (కాంగ్రెస్ గుర్తు), వాచీతో (ఎన్సీపీ) లేదా పువ్వుతో (బీజేపీ) చంపలేదు. ధనస్సుతో బాణం వేసి చంపారు'' అని ఆ ప్రకటనలో ఉంది. అవినీతి, విద్యుత్ కోతలు, విధాన సంక్షోభం, దుష్పరిపాలన.. వీటన్నింటినీ అరికట్టాలంటే ధనస్సు, బాణాలకు ఓటు వేయాలన్నది ఆ ప్రకటనల సారాంశం. -
మహారాష్ట్రలో నాలుగు స్తంభాలాట
నాలుగు పార్టీల హోరాహోరీ బీజేపీ అతిపెద్ద పార్టీగా ఏర్పడుతుందంటున్న ఒపీనియన్ పోల్స్ ఇటీవలివరకు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై చాలామంది దాదాపు ఒకే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసేవారు. ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి, పరిపాలనాపరమైన నిష్క్రియాపరత్వం.. వీటి కారణంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి దారుణంగా ఓడిపోతుందని.. మోదీ హవా, శివసేనల కేడర్ బలం తో శివసేన-బీజేపీ సంకీర్ణం ఈజీగా మెజారిటీ సీట్లు సాధిస్తుందని అంతా అంచనావేశారు. కానీ ఆ రెండు కూటముల మధ్య సీట్ల పంపకంలో విభేదాలు తలెత్తి.. నాలుగు పార్టీలు వేటికవే సొంతంగా బరిలోకి దిగడంతో ఒక్కసారిగా మహారాష్ట్ర ఎన్నికల ముఖచిత్రం మారింది. 288 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో చతుర్ముఖ పోటీ నెలకొంది. ఏ పార్టీకీ మెజారిటీ రాకుండా హంగ్ అసెంబ్లీకి అవకాశం ఉందని, బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించే పరిస్థితి ఉందని పలు ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. మహారాష్ట్రలో ఆయా పార్టీల ప్రస్తుత పరిస్థితుల విశ్లేషణ.. మోదీనే నమ్ముకున్న బీజేపీ! శివసేనతో విడిపోయిన తరువాత బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పైననే అన్ని ఆశలు పెట్టుకుంది. ప్రచార బాధ్యతలను నెత్తిన వేసుకున్న మోదీ కూడా సాధ్యమైనన్ని ప్రచార సభల్లో పాల్గొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీనే రాష్ట్రంలోనూ గెలిపిస్తే.. అభివృద్ధికి అవకాశం ఉంటుందంటూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. అయితే, రాష్ట్రంలో బలమైన నేత లేకపోవడం బీజేపీకి ప్రతికూలించే అంశం. ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును కూడా ప్రకటించలేని పరిస్థితిలో బీజేపీ ఉంది. రాష్ట్రంలో మంచి పేరున్న దళిత నేత గోపీనాథ్ ముండే మరణం పార్టీకి తీరని లోటుగా మారింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ కూడా మళ్లీ రాష్ట్రానికి రావడానికి ఇష్టపడటం లేదని సమాచారం. మరోవైపు, విదర్భ సహా సంప్రదాయ ఓటర్లు బలంగా ఉన్న అనేక ప్రాంతాల్లో శివసేన, రాజ్ఠాక్రే పార్టీ ఎంఎన్ఎస్, బీజేపీల మధ్య ఆ ఓటు బ్యాంక్ చీలే అవకాశం ఉండటం బీజేపీకి ఆందోళన కలిగించే అంశం. ఈ పరిస్థితుల్లో ఎన్నికల అనంతరం బీజేపీ అతిపెద్ద పార్టీగా ఏర్పడే అవకాశముందని రెండు టీవీ చానళ్ల ఒపీనియన్ పోల్స్లో తేలింది. దాంతో ఎన్నికల అనంతరం బీజేపీ మళ్లీ శివసేనతో జట్టు కడుతుందా? లేక శరద్ పవార్ పార్టీ ఎన్సీపీని అక్కున చేర్చుకుంటుందా? అనేది వేచిచూడాల్సి ఉంది. ‘శివసేన మాకు సహజ భాగస్వామి’ అంటూ బీజేపీ నేత నితిన్ గడ్కారీ ఇటీవల చేసిన వ్యాఖ్యను ఇక్కడ గుర్తు చేసుకోవాల్సి ఉంది. గతమే ఘనమైన శివసేన! బీజేపీతో విడిపోవడం వల్ల ఎక్కువ నష్టం శివసేనకే అని విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ వ్యవస్థాపకుడు దివంగత బాల్ఠాక్రేకున్న చరిష్మా ఈ ఎన్నికల్లో కూడా ఉపయోగపడుతుందని సేన భావిస్తోంది. రాష్ట్రంలో పార్టీకున్న బలమైన కేడర్ను కూడా సేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే నమ్ముకున్నారు. కానీ వాస్తవానికి బాల్ఠాక్రేకున్న జనాదరణ ఆయనకుమారుడు, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ఠాక్రేకు లేదని.. మరోవైపు, పార్టీ కేడర్ చాలావరకు బీజేపీ, శివసేననుంచి విడిపోయి రాజ్ఠాక్రే స్థాపించిన ఎంఎన్ఎస్ల వైపు వెళ్లిందని విశ్లేషకుల భావన. శివసేనకు బీజేపీ కన్నా తక్కువ సీట్లు వస్తే మాత్రం సొంతగడ్డ మహారాష్ట్రలో సేన ప్రాభవం తగ్గుముఖం పట్టినట్లేనని స్పష్టమవుతుంది. అలాగే, బీజేపీ కన్నా తక్కువ స్థానాల్లో గెలిచి.. మళ్లీ బీజేపీతో అధికారం పంచుకున్నా.. సీఎం సీటుపై ఆశలను ఉద్ధవ్ ఠాక్రే వదిలేసుకోవాల్సిందే. మరోవైపు, ఎంఎన్ఎస్ కూడా సేన ఓట్లకు గండికొట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఎంఎన్ఎస్ కనీసం 27 స్థానాల్లో గెలుస్తుందని ఇటీవలి ఒక ఒపీనియన్ పోల్ తేల్చిన విషయం ఇక్కడ గమనార్హం. కాంగ్రెస్.. మునక ఖాయం! మహారాష్ట్రలో కాంగ్రెస్ పరిస్థితి మునిగిపోతున్న నావేనని దాదాపు అందరి నిశ్చితాభిప్రాయం. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్కు వ్యక్తిగతంగా మంచి పేరున్నా ప్రభుత్వ వైఫల్యం, సహచరుల అవినీతి, విధానలోపాలు, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు.. కాంగ్రెస్కు శాపాలుగా మారాయి. 2009 ఎన్నికల్లో 82 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్.. ఈ సారి ఆ సంఖ్యను తిరిగేస్తే వచ్చే 28 స్థానాలైనా గెలుచుకుంటుందా? అనేదే ఇక్కడ ప్రశ్న. ఎన్సీపీ.. పవర్ చూపుతుందా?! రాష్ట్రంలో కాంగ్రెస్తో అధికారం పంచుకున్న ఎన్సీపీకి కాంగ్రెస్ వైఫల్యాల్లోనూ భాగం ఉంది. అయితే మరాఠ్వాడా నేత శరద్ పవార్ ప్రాబల్యం బలంగా ఉన్న ప్రాంతాలపైనే ఎన్సీపీ ప్రధానంగా ఆశలు పెట్టుకుంది. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కన్నా ఎక్కువ సీట్లు సాధించడంతో ఎన్సీపీలో విశ్వాసం పెరిగింది. అయితే, పార్టీ కేడర్ చాలావరకు బీజేపీకి వెళ్లడం, పార్టీ బలంగా ఉన్న దక్షిణ మహారాష్ట్రలో ‘స్వాభిమాని షేత్కారీ పక్ష’ పార్టీ ప్రాబల్యం పెరగడం ఎన్సీపీకి ఆందోళనకరంగా మారింది. - నేషనల్ డెస్క్ -
టార్గెట్.. 165!
మహారాష్ట్ర ఎన్నికలకు సర్వం సిద్ధమైపోయింది. మరికొన్ని గంటలు గడిస్తే అక్కడ పోలింగ్ కూడా జరుగుతుంది. మహారాష్ట్రలో ఎన్నికలు అచ్చంగా రణరంగాన్ని తలపిస్తున్నాయి. అంతకుముందు మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలన్నీ.. ఇప్పుడు పరస్పరం కత్తులు దూసుకుంటున్నాయి. బీజేపీ - శివసేన, కాంగ్రెస్ - ఎన్సీపీ.. ఈ రెండు కూటములూ విచ్ఛిన్నం కావడంతో అక్కడ బహుముఖ పోటీ కనిపిస్తోంది. దాంతో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో, ఎవరు అధికార పగ్గాలను చేపడతారోనన్న విషయం చెప్పడం చాలా కష్టంగా మారింది. అంతకుముందు బీజేపీ- శివసేన కూటమిగా ఉంటే మాత్రం వాళ్లు అధికారంలోకి రావడం ఖాయమని ఎన్నికల పండితులు నిక్కచ్చిగా చెప్పారు. కాంగ్రెస్-ఎన్సీపీ పాలనను ప్రజలు భరించలేకపోయారని, పూర్తిగా విసుగెత్తిపోయారని అన్నారు. అయితే.. సీట్ల పంపకం విషయంలో ఇద్దరి మధ్య అంగీకారం కుదరలేదు. దాంతో ఈ రెండు పక్షాలు విడివిడిగానే పోటీ చేస్తున్నాయి. మరోవైపు ఇలా ప్రధాన కూటమి విడిపోవడాన్ని సొమ్ము చేసుకోవాల్సిన కాంగ్రెస్- ఎన్సీపీ కూడా మరోవైపు విడిపోయాయి. ఆ రెండు పార్టీలు కూడా అధికారం తమకు దక్కుతుందనే ఆరాటంతో విడివిడిగానే పోటీకి దిగాయి. దాంతో.. మొత్తం నాలుగు ప్రధాన పార్టీలు బరిలో నిలిచాయి. ఏది ఎలా ఉన్నా.. మహారాష్ట్రలో అధికారం సొంతం చేసుకోవాలన్న గట్టి పట్టుదలతో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. అక్కడ 165 స్థానాలు దక్కించుకోవాలని స్థానిక నాయకులకు టార్గెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం 288 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీలో అధికారం దక్కించుకోవాలంటే కావల్సిన మేజిక్ నెంబర్.. 145. అయితే, పొరపాటున అటూ ఇటూ అయితే ఇబ్బంది కలగకూడదని, అందువల్ల కనీసం 165 సీట్లు దక్కించుకుని కుర్చీలో కూర్చోవాలని మోదీ మహారాష్ట్ర బీజేపీ నేతలకు నిర్దేశించారు. ఒకవైపు ఆరోగ్యం సహకరించకపోయినా.. గొంతు పూడిపోయినా కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో నరేంద్రమోదీ ప్రచారం చేశారు. పాకిస్థాన్ రేంజర్లు కాశ్మీర్ సరిహద్దుల్లో భారత చెక్పోస్టుల మీద భారీ స్థాయిలో కాల్పులు జరిపి, బాంబుదాడులు చేస్తున్న తరుణంలో మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం ఏంటని శివసేన లాంటి పార్టీలు ఎద్దేవా చేసినప్పుడు.. వాళ్లకు సమాధానం ఇవ్వాల్సింది తాను కాదని, జవాన్ల చూపుడువేళ్లే వాళ్లకు జవాబు చెబుతాయని అన్నారు. ఎవరి జాతకం ఏంటో.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చూడాలంటే మాత్రం... ఆదివారం వరకు ఆగాల్సిందే!! -
కాంగ్రెస్, ఎన్సీపీలకు పదేసి సీట్లే!
ప్రధాని మోదీ జోస్యం ఆ పార్టీలు మహారాష్ట్రను దోచుకున్నాయని ధ్వజం పంధార్పూర్ (మహారాష్ట్ర): మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, ఎన్సీపీలపై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. ఆ రెండు పార్టీలు 15 ఏళ్ల పాలనలో మహారాష్ట్రను దోచుకున్నాయని దుయ్యబట్టారు. అందువల్ల రాష్ట్ర రాజకీయాల నుంచి ఆ పార్టీలను కనుమరుగు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈసారి ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు పదేసి సీట్లకు మించి గెలవలేవని జోస్యం చెప్పారు. ఆదివారం షోలాపూర్ జిల్లాలోని పంధార్పూర్, ఒస్మానాబాద్ జిల్లాలోని తుల్జాపూర్లలో జరిగిన సభల్లో పాల్గొన్న మోదీ...ఎన్సీపీపై విమర్శలకు మరింత పదును పెట్టారు. ఎన్సీపీని నేచురల్లీ కరప్ట్ పార్టీ (అవినీతి సహజమైన పార్టీ)గా అభివర్ణించారు. రాష్ట్రంలో ఎన్సీపీకి మళ్లీ అధికారం అప్పగిస్తే ఆ పార్టీ మరింతగా అవినీతి కార్యకలాపాలు సాగిస్తుందని దుయ్యబట్టారు. ‘‘ఆ పార్టీ చిహ్నమైన గడియారానికి అర్థం ఏమిటో తెలుసా? ఆ గడియారంలో సమయం 10 గంటల 10 నిమిషాలు చూపుతోంది. అంటే ఆ పార్టీ 10 రెట్లకన్నా ఎక్కువ అవినీతికి పాల్పడినట్లు అర్థం. మళ్లీ ఆ పార్టీని గద్దెనెక్కిస్తే ఈసారి 15 రెట్లు అవినీతికి పాల్పడుతుంది’’ అని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీపైనా విమర్శలు ఎక్కుపెట్టారు. 2014తో మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ శకానికి తెరపడుతుందన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీలు రాష్ట్రాన్ని నాశనం చేశాయని, రాష్ట్ర సంపదను దోచుకున్నాయని ఆరోపించారు. -
మోదీకి గొంతు నొప్పి.. ప్రసంగంలో కోత!
గొంతునొప్పితో తీవ్రంగా బాధపడుతున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. తన ప్రసంగాన్ని తొమ్మిది నిమిషాలకు పరిమితం చేశారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. అక్కడ ఎక్కువసేపు మాట్లాడలేకపోయారు. వాస్తవానికి గురువారం నాడు జమ్ము కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ సైనికుల విషయంలో తాను మాట్లాడాల్సిన అవసరం లేదని, జవాన్ల చూపుడువేళ్లే మాట్లాడతాయంటూ ట్రిగ్గర్ నొక్కినట్లు చూపించే సమయంలో కూడా ఆయన తన సహజశైలికి భిన్నంగా.. చాలా లోగొంతుకతో మాట్లాడారు. గతరాత్రి వరకు తన పరిస్థితి బాగానే ఉందని, తెల్లవారుజామున ఉన్నట్లుండి బాగా ఇబ్బంది అయ్యిందని అంటున్నారు. భారీస్థాయిలో వచ్చిన ప్రజలకు, బీజేపీ కార్యకర్తలకు ప్రధాని క్షమాపణలు చెప్పారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మరోసారి తప్పనిసరిగా వచ్చి అందరితో మాట్లాడతానని వాళ్లకు హామీ ఇచ్చారు. -
‘వ్యాపారుల కోసమే మోదీ సర్కారు’
ఫిరోజ్పూర్ జిర్కా (హర్యానా): బడా పారిశ్రామికవేత్తల కోసమే నరేంద్రమోదీ ప్రభుత్వం పని చేస్తోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ ఆరోపించారు. గురువారం హర్యానాలో ఎన్నికల ప్రచా రం సందర్భంగా రాహుల్ ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. ఫిరోజ్పూర్జిర్కా, రివా రీ, గనౌర్లో ఎన్నికల ర్యాలీలు, సభల్లో రాహుల్ ప్రసంగిస్తూ.. ఔషధాల ధరలపై నియంత్రణను ఎత్తేయడం ద్వారా కొన్ని అమెరికా కంపెనీలకు మేలు చేసేందుకు మోదీ ప్రయత్నించారన్నారు. దీంతో కేన్సర్ ఔషధం ధర విపరీతంగా పెరి గిందని, గతంలో రూ. 8 వేలు ఉ న్న కేన్సర్ మందు నియంత్రణ ఎత్తివేయడంతో రూ. లక్షకు చేరిం దన్నారు. ఔషధాల ధరలు పెంచే క్రమంలో నిరుపేద కేన్సర్, మధుమేహ రోగులను మోదీ పట్టించుకోలేదన్నారు. పాక్, చై నా చొరబాట్లకు సంబంధించి కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని రాహుల్ తప్పుపట్టారు. పాక్ కాల్పుల్లో మన పౌరులు చనిపోతుంటే..6 రోజుల తర్వాత స్పందించి అంతా బాగుందని చెపుతున్నారని ఎద్దేవా చేశారు. -
పాక్ కట్టడికి మీరు చేసిందేమిటి?
ప్రధాని మోదీ లక్ష్యంగా రాహుల్ విమర్శల జోరు మహారాష్ట్ర ఎన్నికల ర్యాలీల్లో వ్యాఖ్యలు మహద్ (మహారాష్ట్ర): సరిహద్దులో పాకిస్థాన్ సైన్యం కాల్పులకు తరచుగా పౌరుల ప్రాణాలు బలవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం నేరుగా ప్రధాని నరేంద్ర మోదీపైనే వివుర్శలకు దిగారు. సరిహద్దులో పాకిస్థాన్ పలుసార్లు కవ్వింపు చర్యలకు పాల్పడినా, పాక్ను కట్టడి చేయుడానికి గత ముడునెలల్లో మోదీ ఏమీ చేయులేదన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయ్గఢ్ జిల్లా, మహద్లోను, లాతూరు జిల్లా అవుసాలో జరిగిన ర్యాలీల్లో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ ప్రధాని లక్ష్యంగా తీవ్ర వివుర్శలు చేశారు. పాకిస్థాన్, చైనాలపై తావుు దూకుడుగా వ్యవహరిస్తావుంటూ లోక్సభ ఎన్నికలకు వుుందు నరేంద్ర మోదీ చెప్పేవారని, పాక్ పలుసార్లు కవ్వింపు చర్యలకు దిగినా గత వుూడునెలలుగా ఆయున చేసిందేమీలేదని అన్నారు. ఇటీవల భారత పర్యటనలో ఉన్న చైనా అధ్యక్షుడితో ప్రధాని మోదీ ఒకవైపు ఉయ్యూల ఊగుతూ ఉండగా, వురోవైపు, వేలాదివుంది చైనా సైనికులు లఢక్లోని వున భూభాగంలోకి చొరబడ్డారని అన్నారు. మోదీపై ఓ వైపు విమర్శలు సంధిస్తూనే మరోవైపు యూపీఏ ప్రభుత్వంచేసిన అభివృద్ధి పనుల గురించి రాహుల్ వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని కేన్సర్, వుధుమేహం, హృద్రోగాల మందుల ధరలను పెంచిందని అన్నారు. సామాన్య ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడేలా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యుూపీఏ హయూంలో ఉచితంగా మందులు అందించే పథకాన్ని అమలుచేసినట్టు చెప్పారు. దేశానికి కాంగ్రెస్నుంచి వివుుక్తి కలిగిస్తావున్న మోదీ నినాదం ఎట్టిపరిస్థితుల్లోనూ నిజంకాబోదన్నారు. ఇక, ఎన్నికలకు కాస్త వుుందుగా కాంగ్రెస్తో పొత్తును తెగతెంపులు చేసుకున్న ఎన్సీపీ గురించి రాహుల్ గాంధీ ప్రస్తావించనేలేదు. కాంగ్రెస్కు ఓటువేయుడం అంటే వుహారాష్ట్ర అభివృద్ధికి ఓటువేయుడమే అన్నారు. స్వచ్ఛమైన వ్యక్తిత్వంగల పృధ్వీరాజ్ చవాన్ నేతృత్వంలో వుహారాష్ట్ర ప్రగతిపథంలో వుుందుకెళ్లగలదన్నారు. కాంగ్రెస్కు వుళ్లీ అధికారమిస్తే సీఎంగా చవాన్కే వుద్దతు ఇస్తావుని ఇలా పరోక్షంగా చెప్పారు. ఆయునపై ప్రత్యర్థుల ఆరోపణల్లో వాస్తవంలేదంటూ, ఇతరుల మాదిరిగా మార్కెటింగ్ చేసేవారుకాదని పరోక్షంగా ప్రధాని మోదీపై వ్యంగాస్త్రాలు సంధించారు. మహా రాష్ట్రను ముందుకు తీసుకవెళ్లాలని బీజేపీ నాయకులు చెబుతున్నారని, కానీ మహారాష్ట్ర నేడుకూడా ప్రథమ స్థానంలో ఉందని, ఎప్పుడూ గుజరాత్కం టే ముందే ఉందని రాహుల్ వ్యాఖ్యానించారు. మోదీని ‘ప్రతిపక్షనేత’గా పేర్కొన్న రాహుల్ మహారాష్ట్రలో మహద్లో బుధవారం తన తొలి ఎన్నికల సభలో ప్రసంగించిన రాహుల్ గాంధీ,.. ప్రధాని మోదీని ప్రతిపక్ష నేతగా ప్రస్తావించారు. ‘గత అరవై ఏళ్లుగా దేశంలో ఏమీ జరగలేదన్నట్టు ఒక ‘ప్రతిపక్షనేత’ చెబుతూ వస్తున్నారు’ అంటూ, ప్రధాని మోదీని ప్రతిపక్ష నేత అన్నట్టుగా పరోక్షంగా ప్రస్తావించారు. కేవలం ఒక వ్యక్తిమత్రమే దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలరనే రీతిలో వారి ధోరణి కొనసాగుతోందన్నారు. వారి ఆలోచనా ధోరణితో, అంబేద్కర్, మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్, నెహ్రూ వంటివారు దేశానికి ఏమీచే యులేదన్న భావం, దానితోపాటుగా సామాన్య ప్రజలూ, వారి పూర్వీకులు కూడా ఏమీ చేయులేదన్న భావం వ్యక్తమవుతోందన్నారు. ‘మీరూ, మీరు చిందించిన చెవుటా, రక్తం కారణంగానే వునదేశం ఈ స్థితిలో ఉంది.’ అని రాహుల్ ప్రజలనుద్దేశించి అన్నారు. దేశాన్ని అరవైఏళ్లు పాలించిన వారు ఏంచేశారన్న ప్రధాని మోదీ ప్రశ్నకు సమధానంగా రాహుల్ ఈవ్యాఖ్యలు చేశారు. -
పవార్ వాహానంలో భారీగా నగదు పట్టివేత
ముంబై: మహారాష్ట్రలో శాసనసభకు ఎన్నికల గడువు సమీపిస్తున్న నేపథ్యంలో వాహానాల తనిఖీలను పోలీసులు ముమ్మరం చేశారు. అందులోభాగంగా బుధవారం... మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత, శరద్ పవార్ సోదరుడు అజిత్ పవార్కు చెందిన కారు నుంచి రూ. 4.85 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పర్బినీ జిల్లా ఎస్పీ అనంత్ రొక్డే వెల్లడించారు. మరో రెండు బ్యాగ్లలో విజిటింగ్ కార్డ్స్తోపాటు భారీగా చీరలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఆ కారు డ్రైవర్ కృష్ణ హజారేను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా... కారు అజిత్ పవార్దని వెల్లడించారన్నారు. పర్బనీ నుంచి లాతురు వెళ్తుండగా కారును పట్టుకున్నట్లు వివరించారు. దీనిపై ఇంకా కేసు నమోదు చేయలేదని... ఎన్నికల సంఘానికి సమాచారం అందించామని అనంత్ తెలిపారు. అయితే ఈ విషయంపై స్పందించేందుకు ఆ పార్టీ నేతలు ఎవరు అందుబాటులో లేని చెప్పారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 15వ తేదీన జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఓటర్లకు పంచేందుకు తరలిస్తున్న రూ. 5 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
నాయకుడు లేని పార్టీ
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నాయకత్వం వహించేందుకు బీజేపీకి నాయకుడెవరూ లేరని, తమ బలహీనతను కప్పిపుచ్చుకునేందుకు ప్రధాని నరేంద్ర మోడీపై ఆధారపడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ విమర్శించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మోడీ ఎన్నికల ప్రచారం అసాధారణమని పేర్కొన్నారు. ఇంతవరకూ ఏ ప్రధాన మంత్రి కూడా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇన్ని బహిరంగసభల్లో పాల్గొనలేదని చెప్పారు. ఇది బీజేపీకి ఉన్న బలహీనత అని చవాన్ మంగళవారం ఇక్కడ పలు టీవీ చానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రమోద్ మహాజన్, గోపీనాథ్ ముండే మరణంతో బీజేపీకి చెప్పుకోదగిన నాయకుడే లేకుండా పోయారని అన్నారు. ఆ బలహీనతను దాచేందుకు మోడీని రాష్ట్రమంతటా తిప్పుతున్నారని విమర్శించారు. లోక్సభ ఎన్నికల్లో విజయం తరువాత బీజేపీ దురహంకారిగా మారిందని ఆరోపించారు. ప్రచారం చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి నాయకులను దిగుమతి చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాజ్నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, వెంకయ్య నాయుడుతో పాటు రాజస్థాన్, గోవా ముఖ్యమంత్రులను ప్రచారం చేసేందుకు పిలుస్తున్నారని అన్నారు. దీనిని బట్టి స్థానిక నాయకత్వంపై బీజేపీకి విశ్వాసం లేనట్లు తెలుస్తోందని వ్యాఖ్యానించారు. ఎన్నికల ముంగిట తన ప్రభుత్వానికి మద్దతునుపసంహరించిన ఎన్సీపీపై విమర్శలు గుప్పిస్తూ, రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా దొడ్డిదారిలో మోడీకి అధికారం అప్పగించేందుకు చేసిన కుట్ర అనిఅన్నారు. ఆచరణ సాధ్యం కాని షరతులను విధించడం వల్లనే ఎన్సీపీతో పొత్తు కుదేలైందని చవాన్ చెప్పారు. బీజేపీకి సహకరించేందుకు ఎన్సీపీ తమ నుంచి విడిపోయిందని ఆరోపించారు. ప్రత్యేక విదర్భకు కట్టుబడి ఉన్నాం..: బీజేపీ నేతలు ఫడ్నవిస్,జవదేకర్ సాక్షి, ముంబై: ప్రత్యేక విదర్భ ఏర్పాటుకు తాము కట్టుబడి ఉన్నామని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్, ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. ధులేలో జరిగిన పార్టీ ప్రచారసభలో తానున్నంత వరకు మహారాష్ట్రను ఎవరూ ముక్కలు చేయలేరనిప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన అనంతరం రాష్ట్రానికి చెందిన అదే పార్టీ నాయకులు ఇలా మాట్లాడడం విస్మయం కలిగించింది. మోడీ సభ అనంతరం ముంబైలో జరిగిన విలేకరుల సమావేశంలో జవదేకర్, ఫడ్నవిస్లు మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా ప్రత్యేక విదర్భ ఏర్పాటుకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. నరేంద్ర మోడీ చెప్పింది ముంబైని మహారాష్ట్ర నుంచి ఎవరు విడగొట్టలేరని చెప్పారని, ఆయన వ్యాఖ్య విదర్భ గురించి కాదని వారు వివరణ ఇచ్చారు. -
నేనేం తప్పుగా మాట్లాడలేదు: గడ్కరీ
న్యూఢిల్లీ: తన చేసిన లంచం వ్యాఖ్యల్లో తప్పేంలేదని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. తానేం తప్పుగా మాట్లాడలేదని ఆయన సమర్థించుకున్నారు. ఓటర్లను లంచం తీసుకోవాలని గడ్కరీ వ్యాఖ్యానించడంతో ఎన్నికల సంఘం(ఈసీ) ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఎన్నికల సమయంలో నేతలు ఇచ్చే డబ్బుల(లంచాలను)ను కాదనకుండా తీసుకోవాలంటూ ఓటర్లకు సూచించారు. ఆదివారం మహారాష్ట్రలోని లాతూరులో జరిగిన సభలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. -
అప్పుడు మీకు ఆయన గుర్తుకు రాలేదా?
ముంబై: బాల్ ఠాక్రేకు నివాళిగా ఆ పార్టీని విమర్శించనని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై శివసేన తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. హిందుత్వ విలువల ఆధారంగా కుదిరిన పాతికేళ్ల బీజేపీ-శివసేనల పొత్తును తెంచుకోకుండా కొనసాగించి ఉంటే బాల్ ఠాక్రేకు అసలైన నివాళి అయ్యేదని సోమవారం తన అధికార పత్రిక ‘సామ్నా’ సంపాదకీయంలో పేర్కొంది. ‘బాలాసాహేబ్పై గౌరవంతో శివసేనను విమర్శించనని మోదీ అన్నారు. మాకు కూడా ప్రధాని అంటే గౌరవముంది. అయితే ఎన్నికలకు కొన్నిరోజుల ముందు చిన్న విషయమైన సీట్ల పంపకంలో మీరు మాకు వెన్నుపోటు పొడిచినప్పుడు బాల్ ఠాక్రేపై గౌరవం ఎక్కడికి పోయింది? పొత్తును తెంచుకునే ముందుకు మీకు ఆయన గుర్తుకు రాలేదా?’ అని ప్రశ్నించింది. కాంగ్రెస్, ఎన్సీపీలు మహారాష్ట్రను లూటీ చేశాయని, ఈ విషయంలో బీజేపీ కూడా వాటి దారిలో నడుస్తోందని వ్యాఖ్యానించింది. ‘గుజరాత్ సీఎం ఆనందీబెన్ మహారాష్ట్రకు ఎందుకొచ్చారు? అన్ని పరిశ్రమలను గురుజాత్లోనే పెట్టాలని ఆమె పారిశ్రామికవేత్తలను అడగడం మహారాష్ర్టను లూటీ చేయడం కిందికే వస్తుంది’ అని విమర్శించింది. విదర్భను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసి మహారాష్ట్రను చీల్చేందుకు బీజేపీ యత్నిస్తోందని మండిపడింది.ప్రస్తుతం మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీని బీజేపీ ఎన్నికలకు వాడుకోవాలని చూస్తోందని శివసేన విమర్శించింది. గతంలో ఎప్పుడూ శివాజీ వార్షికోత్సవాన్ని జరపని బీజేపీ తాజాగా ఆయన పేరును తెరపైకి తీసుకురావడంపై ఆంతర్యం ఏమిటని ప్రశ్నించింది. -
అభివద్ధికి ఓటు వేయండి: చవాన్
నాసిక్: మహారాష్ట్రలో అభివద్ధికి ఓటు వేయాలని ఓటర్లకు మాజీ ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్ పిలుపునిచ్చారు. ఈనెల 15న జరగనున్న ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టాలని ఆయన కోరారు. 15 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే నాటికి మహారాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని తెలిపారు. కాంగ్రెస్ ఏలుబడిలో రాష్ట్రం ఆర్థిక స్థిరత్వం సాధించిందని అన్నారు. ప్రజల కోసం తమ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. పలు సాగునీటి ప్రాజెక్టులు నిర్మించామని చవాన్ తెలిపారు. -
బాల ఠాక్రే అంటే గౌరవం లేదా?
దివంగత నాయకుడు బాలా సాహెబ్ ఠాక్రే అంటే తనకెంతో గౌరవమని, అందుకే తాను శివసేనకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా సాంగ్లి జిల్లాలోని టాస్గావ్-లో జరిగిన సభలో ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. మరాఠా యోధుడు బాలఠాక్రే లేకుండా జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవేనని ఆయన గుర్తు చేశారు. ఇంతకుముందు సభల్లోకూడా ఆయన శివసేన గురించి ఏమీ మాట్లాడకుండా కేవలం కాంగ్రెస్, ఎన్సీపీల మీద మాత్రమే తన దాడి కొనసాగించారు. కొత్తతరం నాయకులు బీజేపీలో చీలిక తెచ్చారంటూ సేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే చేసిన విమర్శలకు సమాధానంగా తాజా విషయం చెప్పారు. మరోవైపు ఉద్ధవ్ కొడుకు ఆదిత్య ఠాక్రే కూడా విమర్శలు గుప్పించారు. శివసేనతో పొత్తు తెంచుకోవడం ద్వారా బీజేపీ నాయకులు బాలాసాహెబ్కు వెన్నుపోటు పొడిచారన్నారు. అయితే.. ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం శివసేన ఎన్ని విమర్శలు చేసినా ఆ పార్టీని నోరెత్తి మాట్లాడకుండా, పొత్తుల శకం ముగిసిపోయిందని, లోక్సభ ఎన్నికల తరహాలో స్పష్టమైన తీర్పు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. మహారాష్ట్ర పురోగతి సాధించాలంటే సంకీర్ణ ప్రభుత్వాలు ఉంటే కుదరదని, పూర్తి మెజారిటీ ఇవ్వాల్సిందేనని ఆయన గోండియాలో నిర్వహించిన ర్యాలీలో కూడా చెప్పారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్కు అసలు వ్యక్తిత్వం లేదని, యూపీఏలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి.. దేశంలో రైతుల ఆత్మహత్యలు నివారించడానికి ఏమీ చేయలేదన్నారు. ''ముఖ్యమంత్రిగా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా వ్యవహరించిన పవార్ జీ.. మీరు ప్రజలకు ఏం చేశారు? కనీసం నీళ్లయినా ఇవ్వగలిగారా?'' అంటూ సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి మహారాష్ట్రను సర్వనాశనం చేశాయని ఈ రెండింటినీ శిక్షించి తీరాల్సిందేనని ఆయన చెప్పారు. -
శివసేనపై విమర్శలకు దూరం: మోదీ
సంగ్లీ: మహారాష్ట్రలో బీజేపీకి పూర్తి ఆధిక్యం కట్టబెట్టాలని ఓటర్లను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి పట్టం కట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్రను అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకునేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని చెప్పారు. బాల్ థాకరే అంటే తమకెంతో గౌరవమని, అందువల్లే శివసేనపై విమర్శలకు దూరంగా ఉన్నట్టు మోదీ తెలిపారు. బాల్ థాకరే మరణించిన తర్వాత మహారాష్ట్రలో జరుగుతున్న మొదటి అసెంబ్లీ ఎన్నికలివని గుర్తు చేశారు. నర్మదా ప్రాజెక్టును యూపీఏ ప్రభుత్వం ఆపేసిందన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రధాని హామీయిచ్చారు. -
బీజేపీ స్థానిక నాయకత్వంపై ఉద్ధవ్ వ్యంగ్య వ్యాఖ్యలు
ముంబై: ‘రాష్ట్ర బీజేపీ నాయకులకు సొంతంగా సీట్లు గెలుచుకునే దమ్ములేదా.. ప్రధాని మోడీతో సాధ్యమైనన్ని ఎక్కువ ప్రచార సభలు నిర్వహించేందుకు వారు ఏర్పాట్లు చేసుకోవడం చూస్తుంటే మాకే కాదు.. సామాన్య ఓటరుకు సైతం ఇదే అనుమానం వస్తుంది..’ అంటూ శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘రాష్ర్టంలో మోడీ హవా ఉందని వారు అంటున్నారు.. ఇది గుజరాత్ కాదు.. ఒకవేళ అలాంటి హవా ఉందని వారు భావిస్తే తిరిగి ప్రత్యేకంగా ప్రధాన మంత్రితో రాష్ర్ట ఎన్నికల్లో ప్రచారసభలు నిర్వహించడం ఎందుకు.. ? అంటూ ప్రశ్నించారు. తనకు మోడీపై వ్యక్తిగతంగా ఎటువంటి వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ బహిరంగసభలకు హాజరు కావాల్సిందిగా స్థానిక బీజేపీ నాయకులు ప్రధానిని ఆహ్వానించడం తనను ఆశ్చర్యపరిచిందన్నారు. వాస్తవానికి మోడీ ఎన్ని పార్టీ సభల్లో పాల్గొనబోతున్నారనేది ఇప్పటివరకు స్పష్టం కాలేదు. అయితే ఆయనను నాలుగు నుంచి 22 సభల్లో మాట్లాడించేవిధంగా రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఉద్ధవ్ మాట్లాడుతూ.. తమ 25 ఏళ్ల అనుబంధాన్ని బీజేపీ ఎందుకు వదులుకుందో ఇప్పటికీ తనకు అర్ధం కాలేదన్నారు. ‘మేం ఎప్పుడూ పొత్తును వదులుకోవాలని ఆలోచించలేదు. మేం మొదటినుంచి కూటమిని కొనసాగించాలనే ప్రయత్నించాం.. అయితే వాళ్లు మాతో తెగతెంపులు చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.. ఈ విషయాలన్నింటి మీద మేం రాష్ర్ట ప్రజల ముందు విశదపరచదలుచుకున్నామంటూ ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. మోడీ అమెరికా పర్యటన పూర్తి చేసుకునిరాగానే కేంద్ర మంత్రివర్గం నుంచి అనంత్ గీతే తొలగాలా వద్దా అనే విషయమై స్పష్టత వస్తుంది. అసలు తమ కూటమి విడిపోవడానికి కారణమేంటనే విషయమై ఆయనతోనే చర్చించి తేల్చుకుంటాం..’ అని చెప్పారు. ‘సేన’ దసరా ర్యాలీ సీదాసాదాగానే.. సాక్షి, ముంబై: నాలుగు దశాబ్దాలకు పైగా శివాజీపార్క్లో శివసేన పార్టీ నిర్వహిస్తూ వస్తున్న దసరా ర్యాలీని ఈ ఏడాది ఎలాంటి ఆర్భాటం లేకుండా సీదాసాదాగా నిర్వహించాలని ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే నిర్ణయించారు. మాతోశ్రీ బంగ్లాలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సుమారు 45 యేళ్ల నుంచి ఏటా దసరా రోజున బాల్ ఠాక్రే కార్యకర్తలకు మార్గదర్శనం చేశేవారన్నారు. కాని ఈసారి ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అనవసరంగా ఇబ్బందుల్లో చిక్కుకోవడం ఎందుకని, ప్రసంగం లేకుండానే కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆ రోజు కేవలం ఆయుధ పూజ, రావణుడి దిష్టి బొమ్మ దహనం లాంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఠాక్రే స్పష్టం చేశారు. -
మహారాష్ట్ర ఎన్నికల్లో మోదీ ప్రచారం
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ఒంటరి పోరాటం చేస్తుండటంతో.. పార్టీ తరఫున ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రచారం చేయనున్నారు. దాదాపు పాతికేళ్ల తర్వాత ఆ రాష్ట్రంలో శివసేనతో పొత్తు లేకుండా బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. దాంతో బీజేపీ విజయం కోసం నేరుగా ప్రధానమంత్రే ప్రచార పర్వంలోకి దిగనున్నారు. ఆయన దాదాపు 24 ర్యాలీలు నిర్వహిస్తారని సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ఇప్పుడు మహారాష్ట్రలో కూడా విజయం సాధించాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. అయితే.. ఈసారి మహారాష్ట్రలో చతుర్ముఖ పోటీ ఉంది. బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ లాంటి ప్రధాన పార్టీలన్నీ విడివిడిగా పోటీ చేస్తున్నాయి. దాంతో అక్కడ ఏ పార్టీ విజయం సాధిస్తుందన్నది ఎవరూ చెప్పలేని పరిస్థితి. మహారాష్ట్రలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా మోడీ ప్రభావంతో బీజేపీ భారీ స్థాయిలో విజయాలు సాధించింది. దాంతో ఇప్పుడు కూడా అదే గాలి ప్రభావంతో ఈదుకు రావాలని కమలనాథులు భావిస్తున్నారు. దాంతో అమెరికా పర్యటన నుంచి తిరిగొచ్చిన వెంటనే ప్రధానమంత్రి మోడీ మహారాష్ట్ర ఎన్నికల మీద దృష్టి సారించాలని భావిస్తున్నారు. ముందుగా ఆయన ముంబై, కొల్హాపూర్ నగరాల్లో ర్యాలీలు ప్రారంభిస్తారు. జాతీయస్థాయిలో లోక్సభ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తర్వాత ప్రధానమంత్రి ఒక రాష్ట్రంలో పర్యటించడం, ఎన్నికల ప్రచారం చేయడం ఇదే తొలిసారి అవుతుంది. -
సీఎం రేసులో ఉన్నా..
సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంగళవారం రాజ్ ఠాక్రే ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమపై విశ్వాసం ఉంచి మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్)ను గెలిపిస్తే రాష్ట్రానికి నేతృత్వం వహించడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని రాజ్ ఠాక్రే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర తాజా మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్పై రాజ్ ఠాక్రే తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తారు. ఆయనను ఢిల్లీ నుంచి తీసుకువచ్చిన ఓ దిష్టిబొమ్మ అంటూ అభివర్ణించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో తనదైన శైలిలో దాదాపు అన్ని పార్టీలపై మండిపడ్డారు. ఎన్నికల సమయంలో టీవీలలో ‘కాంగ్రెస్ ఇచ్చిన ప్రకటనలో మహారాష్ట్ర నెంబర్ వన్ అని పేర్కొనడంపై ఘాటుగా స్పందించారు. అభివృద్ధి, సంక్షేమంలో కాకుండా నిరుద్యోగం, అవినీతి, రైతుల ఆత్మహత్యలు తదితర విషయాల్లో మహారాష్ట్ర నెంబర్ వన్గా ఉందని ఎద్దేవా చేశారు. ఇజ్రాయిల్లోని ఎడారి భూములను ఎలా సాగుచేస్తున్నారో తెలుసుకునేందుకు నేతలు ఇజ్రాయిల్ వెళ్లారు. కాని రాష్ట్రంలోని సాగుకు అనుకూలమైన భూములను వీరు ఎడారులుగా మార్చారని, వాటి సంగతేమిటని నిలదీశారు. ఎమ్మెన్నెస్ రూపొందించిన బ్లూప్రింట్ గురించి మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వస్తే అందరినీ ఆదుకుంటామన్నారు. ‘అధికారం మాకివ్వండి.. యువతకు ఉపాధి కల్పిస్తామ’ని హామీ ఇచ్చారు. అదే విధంగా పోలీసు భర్తీ ప్రక్రియలో కూడా మార్పులు చేస్తామన్నారు. ఒక్కసారి తమకు అధికారమిచ్చి చూడంటంటూ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతి పార్టీలోనూ తిరుగుబాట్లు, జంప్ జిలానీలతో రాజకీయాలస్థాయి దిగజారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఎప్పుడు ఎవరు ఏ పార్టీలోకి వెళ్తున్నారో .. అసలు ఏ పార్టీలో ఎవరున్నారో తెలియకుండా పోతోంద’ని వ్యాఖ్యానించారు. -
నువ్వూ నేనూ.. భాయీ భాయీ!
ఒకప్పుడు ఆ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే ఎవరూ అంటించాల్సిన అవసరం లేకుండానే భగ్గుమనేది. ఒకరికొకరు ఎదురుపడితే చాలు.. చంపుకోవాలన్నంత కోపం ఇద్దరి మధ్య ఉండేది. అలాంటిది ఉన్నట్టుండి ఇద్దరూ ఆప్త మిత్రులు అయిపోయారు. ఆరోగ్యం ఎలా ఉంది అన్నా అంటూ తమ్ముడు పలకరించాడు. నీలాంటి తమ్ముడు ఉండగా నాకు ఢోకా ఏముంది అంటూ అన్న సంతోషించాడు. ఇప్పుడు ఇద్దరూ ఒకటైపోయే లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. అవును.. మహారాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటివరకు వేరుకుంపట్లు పెట్టుకుని కూర్చున్న రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే ఇప్పుడు ఒకటే గూటికి చేరారు. బీజేపీ - శివసేన పార్టీల మధ్య పొత్తు చెడిపోవడంతో మహారాష్ట్ర నవనిర్మాణ సేన పేరిట ఇప్పటికే వేరుకుంపటి పెట్టుకున్న రాజ్ ఠాక్రే.. తనకు వరుసకు అన్నయ్య అయ్యే ఉద్ధవ్ ఠాక్రేకు చాలా రోజుల తర్వాత దగ్గర అయ్యారు. 2012లో బాలాసాహెబ్ ఠాక్రే మరణించినప్పుడు మాత్రమే ఒకేచోట కనిపించిన ఈ ఇద్దరు సోదరులు మళ్లీ ఇన్నాళ్లకు కలిశారు. అన్నదమ్ములిద్దరి మధ్య వారంలో రెండుసార్లు ఎస్ఎంఎస్లు షేర్ అయ్యాయట. ఎటూ కాంగ్రెస్-ఎన్సీపీల మధ్య కూడా పొత్తు లేదు కాబట్టి, మహారాష్ట్రలో బాల్ ఠాక్రేకు ఉన్న పేరు ప్రఖ్యాతులను క్యాష్ చేసుకోడానికి ఇద్దరూ చేతులు కలపాలని యోచిస్తున్నట్లు తెలిసింది. అయితే.. మహారాష్ట్ర కేవలం మరాఠీలదేనంటూ అక్కడున్న బీహారీలు, ఇతర ఉత్తర భారతీయులను తరిమి కొట్టడానికి కూడా ఎంఎన్ఎస్ కార్యకర్తలు ఒకప్పుడు గట్టిగానే ప్రయత్నాలు చేశారు. వాస్తవానికి మహారాష్ట్రలో.. అందునా ముంబైలో అన్ని ప్రాంతాల వాళ్లు ఉంటారు. కేవలం మరాఠీలను మాత్రమే నమ్ముకున్నా.. వాళ్ల ఓట్లన్నీ గంపగుత్తగా శివసేన-ఎంఎన్ఎస్లకు పడతాయన్న నమ్మకం కూడా లేదు. ఇలాంటి తరుణంలో అన్నదమ్ములు చేతులు కలిపినా ఏమాత్రం ప్రయోజనం ఉంటుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
డీఎఫ్లోనూ వేరుకుంపటి
ముంబై: ముఖ్యమంత్రి పదవిపై కన్నేసిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఈ ఎన్నికల్లో ఒంటరిగానే తన బలాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకుంది. గత పదిహేనేళ్లుగా మిత్రపక్షమైన కాంగ్రెస్ తమను చిన్న చూపు చూస్తోందని ఆరోపిస్తూ ప్రజాస్వామ్య కూటమికి వీడ్కోలు పలికింది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కన్నా రెట్టింపు సీట్లు గెలుచుకున్నామన్న ధీమాతో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ ఒరవడిని కొనసాగించగలమని భావిస్తోంది. ఈ ఎన్నికల్లో రెండు పార్టీలూ తలా 144 సీట్లలో పోటీ చేయాలని ఎన్సీపీ ప్రతిపాదించింది. దీనికి నిరాకరించిన కాంగ్రెస్ ఎన్సీపీకి 124 సీట్లు మాత్రమే ఇస్తామని స్పష్టం చేసింది. సీట్ల సర్దుబాటుపై గత శనివారం ఎన్సీపీ 24 గంటల గడువు విధించినప్పటికీ కాంగ్రెస్ గురువారం వరకూ స్పందించలేదు. తిరిగి అధికారంలోకి వస్తే రెండున్నర సంవత్సరాల పాటు తమకు ముఖ్యమంత్రి పదివిని ఇవ్వాలన్న ప్రతిపాదనను కూడా కాంగ్రెస్ బేఖాతరు చేసింది. దీనిపై ఎన్సీపీ నాయకుడు ప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ, ‘‘గత పదిహేనేళ్లలో ప్రతిసారి కాంగ్రెస్కు చెందిన వారే ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఈసారి శరద్ పవార్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి, ఎన్సీపీ పొత్తును కొనసాగించాలనుకుంటుందని చెప్పారు. అధికారంలో తమకు సమాన భాగస్వామ్యం కావాలని అడిగారు’’ అని చెప్పారు. ఇంతకాలం వారే సీఎం పదవిని అనుభవించారు, ఇప్పుడు పంచుకుంటే తప్పేమిటని పటేల్ ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రజల్లో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకత తమకన్నా కాంగ్రెస్పైనే అధికంగా ప్రభావం చూపిందని ఎన్సీపీ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ ధోరణి కొనసాగితే తాము మెజారిటీ స్థానాలు సాధించగలమని అంచనా వేస్తోంది. మరోవైపు బీజేపీ, శివసేనల పొత్తు కూడా విచ్ఛిన్నం కావడంతో తమ అవకాశాలు మరింత మెరుగుపడగలవని ఎన్సీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
కాంగ్రెస్ జాబితాలో అన్నీ పాత ముఖాలే!
సాక్షి ముంబై: సీట్ల పంపకాలపై లెక్కలు తేలకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. ముంబైతోపాటు రాష్ట్రంలోని 118 నియోజకవర్గాలకు పార్టీ తరఫున బరిలోకి నిలిచేవారి తొలిజాబితాను ప్రకటించింది. అదనపు స్థానాలు కావాలని డిమాండ్ చేస్తున్న ఎన్సీపీపై పైచేయి సాధించేందుకే కాంగ్రెస్ ఈ తొలిజాబితాను విడుదల చేసిందని చెబుతున్నారు. గత కొన్నిరోజులుగా చర్చల్లోకెక్కిన దక్షిణ కరద్, నవాపూర్, మాలెగావ్ తదితర అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు చర్చల్లో ఉన్న కొన్ని స్థానాలకు కూడా కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించడం విశేషం. 2009 ఎన్నికల్లో నవాపూర్, మాలెగావ్ అసెంబ్లీ నియోజకవర్గాలపై చర్చలు విఫలమై పొత్తులు వికటించే వరకు వచ్చింది. అయితే ఈసారి ఈ రెండు నియోజకవర్గాలపై మళ్లీ చర్చలు జరిగే సమయంలోనే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. మరో వైపు కాంగ్రెస్లో అంతర్గత విబేదాలు పొడసూపే అవకాశాలున్నాయని భావించే దక్షిణ కరద్ నియోజకర్గం నుంచి ముందు నుంచి చెబుతున్నట్టుగానే ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పేరును ప్రకటించింది. తొలిజాబితాలో కాంగ్రెస్ సీనియర్ నాయకులైన నారాయణ రాణే, పతంగ్రావ్ కదం, బాలాసాహెబ్ థోరత్, రాధాకృష్ణ విఖేపాటిల్, హర్షవర్ధన్ పాటిల్, రాజేంద్ర దర్డా, సురేశ్ శెట్టి, నితన్ రావుత్, మధుకర్రావ్ చవాన్, నసీం ఖాన్, వర్షా గైక్వాడ్, పద్మాకర్ వాల్వి, అబ్దుల్ సత్తార్, సతేజ్ పాటిల్, రాజేంద్ర గావిత్, డీపీ సావంత్, రంజిత్ కాంబ్లే, అమిత్ దేశ్ముఖ్ తదతర మంత్రుల పేర్లున్నాయి. యువతకు ప్రాధాన్యమేది? అత్యంత వయోవృద్ధులైన అప్పాసాహెబ్ పాటిల్కు కాంగ్రెస్ మళ్లి టిక్కెట్ ఇచ్చింది. మాజీ సహాయక మంత్రి విజయ్ వడెట్టివార్కు ఈసారి చిమూర్కు బదులుగా బ్రహ్మపురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఇవ్వగా మాజీ ఎమ్మెల్యే అవినాష్ వారజుర్కర్ను చిమూర్ అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించింది. ఇక రాష్ట్ర మహిళ కమిషన్ అధ్యక్షురాలు, మాజీ మంత్రి బి. దేశాయి కూతురైన సుశోబెన్ షాకు దక్షిణ ముంబైలోని మలబార్ హిల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అవకాశం కల్పించింది. అయితే వీరంతా రాజకీయాల్లో తలపండినవారే. ఒక్కొక్కరికి కనీసం 30-40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది. ఈ సారి కూడా వారికే టికెట్ ఇవ్వడంపై కాంగ్రెస్ యువనాయకుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో యువతకు ప్రాధాన్యమివ్వడం లేదని కొంతమంది బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. అయితే మలి జాబితా మొత్తం యువకులతోనే నిండి ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. -
మహారాష్ట్ర ఎన్నికల పరిశీలకులుగా 'తెలుగు నేతలు'
న్యూఢిల్లీ: మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఎన్నికల పరిశీలకులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు సీనియర్ నేతలను ఎంపిక చేసినట్లు ఏఐసీసీ గురువారం వెల్లడించింది. తెలంగాణ నుంచి ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్, మాజీ ఎంపీలు వివేక్, మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్లను ఎంపిక చేసినట్లు తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ ఎంపీ బోత్స ఝాన్సీతోపాటు కేంద్ర మాజీ మంత్రులు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, కిల్లి కృపారాణి, కిషోర్ చంద్రదేవ్, పళ్లంరాజు లను ఎంపిక చేసినట్లు ఏఐసీసీ ప్రకటించింది. 288 మంది సభ్యులు గల మహారాష్ట్ర శాసనసభకు వచ్చే నెల 15న ఎన్నికలు జరగనున్నాయి. అందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఎన్నికల సంఘం ఇప్పటికే జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధిక శాసనసభ స్థానాలు కైవసం చేసుకోవాలని ఇప్పటికే పలు పార్టీలు దృష్టి సారించాయి. అందులోభాగంగా ప్రధాన పార్టీలు వివిధ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నాయి. -
షరతులతో పొత్తు కష్టమే: సీఎం
ముంబై: సాధ్యం కాని షరతులు విధిస్తే ఇక ఎన్సీపీతో పొత్తు కొనసాగించటం కష్టంగా మారగలదని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అభిప్రాయపడ్డారు. మతోన్మాద శక్తులను దూరంగా ఉంచేందుకు గాను ఎన్సీపీతో పొత్తును కొనసాగించాలన్నదే కాంగ్రెస్ వైఖరి అని ఆయన స్పష్టం చేశారు. అయితే అసాధ్యమైన షరతులు విధించడం వల్లనే పరిస్థితులు కఠినంగా మారుతున్నాయని అన్నారు. షరతులు లేకండా చర్చలు ప్రారంభించి ఉంటే ఇప్పటికి అన్ని సమస్యలూ పరిష్కారమై ఉండేవని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కరద్లో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. తిరిగి అధికారంలోకి వస్తే సగం కాలం పాటు ముఖ్యమంత్రి పదవిని ఎన్సీపీ కోరిందన్న వార్తలపై వ్యాఖ్యానించేందుకు చవాన్ నిరాకరించారు. అయితే ఈ అంశాన్ని మరో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నారాయణ్ రాణే ధ్రువీకరించారు. ఎన్సీపీ డిమాండ్పై ముఖ్యమంత్రి చవాన్ కాంగ్రెస్ అధిష్టానంతో చర్చిస్తున్నారని చెప్పారు. కరద్లో తన మద్దతుదారులతో మాట్లాడిన చవాన్, తాను పోటీ చేయాలనుకుంటున్న నగరాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. కరద్ తన స్వస్థలమని, ఈ పట్టణాన్ని తాను ఎంతో రుణపడి ఉన్నానని అన్నారు. -
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ దూరం
ముంబై: వచ్చే నెల 15న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంగళవారం ప్రకటిం చింది. బలమైన నిర్మాణం లేకుండా ఎన్నికల్లో విజయం సాధ్యం కాదని లోక్సభ ఎన్నికల ఫలితాల ద్వార తెలిసిందని ఆప్ ప్రతినాధి ప్రీతీ శర్మమీనన్ అన్నారు. వనరుల కొరత, నిధులు సమకూర్చలేని అసమర్థత కారణంగా అనేక మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోరాడటానికి అష్టకష్టాలు పడ్డారని చెప్పారు. పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించామని ఆమె అన్నారు. వాలంటీర్లకు నిత్యం సమీపంగా ఉండేందుకు మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం, వారికి శిక్షణనివ్వడం ద్వారా బలమైన కార్యకర్తలు రూపొందగలరని పేర్కొన్నారు. తాము ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, అలాగే ఏ పార్టీకి లేదా స్వతంత్ర అభ్యర్థులకు కూడా మద్దతునివ్వడం లేదని ప్రీతీశర్మ స్పష్టం చేశారు. ఆప్ సభ్యులెవరైనా ఇతర పార్టీల నుంచి లేదా ఇండిపెండెంట్గా బరిలోకి దిగితే వారి సభ్యత్వాన్ని రద్దు చేస్తామని చెప్పారు. అయితే తాము ‘జాగ్రుత్-నాగ్రిక్’ పేరిట ఒక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టనున్నామని తెలిపారు. అవినీతిపరులైన అభ్యర్థులను గుర్తించేందుకు, అవినీతిని అరికట్టేందుకు ఒక్కో నియోజకవర్గంలో రెండు కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. -
నేడు ఎన్సీపీ నేత పాటిల్ కాంగ్రెస్లో చేరిక
యవత్మాల్ : జిల్లాలో గట్టి పట్టున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుడు ఉత్తమ్రావ్ పాటిల్ బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. తన సొంత గ్రామమైన అర్ని తాలూకా లోనీలో నిర్వహిస్తున్న ఒక కార్యక్రమంలో ఆయన తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని మంగళవారం యవత్మాల్ జిల్లా కేంద్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ (వైడీసీసీ) చైర్మన్, ఉత్తమ్రావ్ పాటిల్ కుమారుడైన మనీష్ పాటిల్ తెలిపారు. జిల్లాపరిషత్ మాజీ అధ్యక్షుడు ప్రఫుల్ల మన్కర్ కూడా పాటిల్తోపాటు కాంగ్రెస్ తీర్థం తీసుకోనున్నారు. డిప్యూటీ స్పీకర్ వసంత్ పర్కే, మంత్రి శివాజీరావ్ మోఘే సూచన మేరకు వారం కిందట సీఎం పృథ్వీరాజ్ చవాన్ను కలిసి తాము కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపామని మనీష్ వివరించారు. ఇంతకుముందు, మాజీ ఎమ్మెల్యే, ఎన్సీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రకాశ్ పాటిల్ దియోసర్కార్ సైతం పార్టీని వీడి శివసేనలో చేరిన విషయం తెలిసిందే. ఎన్సీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే సందీప్ బజోరియా తిరిగి అక్కడ అభ్యర్థిగా ప్రచారం మొదలుపెట్టారు. ఆయనపై అసంతృప్తితో జిల్లాలోని చాలామంది ఎన్సీపీ నాయకులు పక్క పార్టీల్లో చేరిపోతున్నారు. -
శివసేన, బీజేపీలో మధ్య కుదిరిన సీట్ల ఒప్పందం!
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్ధుబాటుపై బీజేపీ, శివసేనల మధ్య అవగాహన కుదిరింది. దాంతో పొత్తుపై ఇరుపార్టీల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన తొలగడంతో బీజేపీ, సేన పార్టీల నేతలు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. బీజేపీకి 130 సీట్లు ఇవ్వడానికి శివసేన అంగీకరించడంతో ఇరుపార్టీల మధ్య పొత్తు ముందుకు కొనసాగడానికి మార్గం సుగమమైంది. సీట్లు సర్ధుబాటు, ఎన్నికల పొత్తు ముందుకు కొనసాగించడానికి ఇరుపార్టీల నేతలు మంగళవారం ఉదయం భేటి అయ్యారు. అయితే సీట్ల సర్ధుబాటు విషయంలో శివసేన కోత విధించుకుంటుందా? లేక చిన్న పార్టీలు త్యాగం చేస్తాయా అనే విషయం ఇంకా స్పష్టం కాలేదు. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 సీట్లకు ఎన్నికలు జరుగనున్నాయి. -
పొత్తా?.. ఒంటరి పోరా?
మహారాష్ట్రలో తేలని ప్రధాన కూటముల పొత్తుల కొట్లాట 119 కన్నా ఎక్కువ సీట్లివ్వబోమన్న శివసేన; 130 కావాలంటున్న బీజేపీ 124 ఇస్తానంటున్న కాంగ్రెస్; ఇంకా ఎక్కువ కోరుతున్న ఎన్సీపీ పొత్తులపై కాంగ్రెస్, ఎన్సీపీల కీలక భేటీ నేడు సాక్షి, ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన కూటములు కలసి పోటీ చేస్తాయా? లేదా ఒంటరిగా పోటీ చేస్తాయా? అనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. శివసేన, బీజేపీలు ప్రధాన పార్టీలుగా ఉన్న మహాకూటమిలోను.. కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)ల ప్రజాస్వామ్య కూటమి(డీఎఫ్)లోనూ సీట్ల సర్దుబాటు చర్చలు ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో.. ఆయా పార్టీలు ఒంటరి పోరు దిశగా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో, నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ(సెప్టెంబర్ 27) దగ్గరపడుతుండటంతో నాలుగు ప్రధాన పార్టీలు ఒకవైపు పొత్తులపై చర్చలు కొనసాగిస్తూనే.. మరోవైపు తమతమ అభ్యర్థుల ఖరారుపై దృష్టిసారించాయి. అవసరమైతే సొంతంగా బరిలో దిగుతామంటూ ఒకవైపు కత్తులు దూస్తూనే.. పొత్తును కాపాడుకుంటామంటూ మరోవైపు ప్రకటనలు చేస్తున్నాయి ఈ రెండు కూటములు. పాతికేళ్ల బంధం కొనసాగుతుందా? బీజేపీ, శివసేనల పాతికేళ్ల పొత్తుకు బీటలు వారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీకి 119 స్థానాలకు మించి ఇవ్వబోమని శివసేన తేల్చిచెబుతుండగా, 135 సీట్లు కావాలంటూ బీజేపీ కోరుతోంది. కనీసం 130 సీట్లైనా తమకు ఆమోదయోగ్యమేనని చెబుతోంది. ఆ ప్రతిపాదనకూ శివసేన ససేమీరా అంటోంది. ‘మేము 130 స్థానాలు కోరడం ద్వారా మేం ఒక ఉదాత్తమైన ప్రతిపాదన పంపాం. అదీ శివసేన ఏనాడు గెలవని స్థానాలనే మాకివ్వమంటున్నాం. దానికీ ఒప్పుకోకపోతే.. మొత్తం 288 స్థానాల్లోనూ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని బీజేపీ మహారాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి రాజీవ్ ప్రతాప్ రూడీ సోమవారం స్పష్టం చేశారు. పొత్తును కాపాడేందుకు బీజేపీ చీఫ్ అమిత్ షా సోమవారం శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేకు ఫోన్ చేసి మాట్లాడారని.. సాయంత్రం ప్రధాని మోదీ కూడా ఉద్ధవ్కు ఫోన్ చేసి, సీట్ల సర్దుబాటు విషయంలో పట్టువిడుపు ఉండాలని హితవు చెప్పారని సమాచారం. 20, 30 మినహా అన్ని స్థానాల్లో అభ్యర్థుల పేర్లు ఖరారు అయ్యాయని బీజేపీ వర్గాలు తెలిపాయి. కాగా, ఉద్ధవ్ చెప్పిన 119 స్థానాలే తమ చివరి మాట అని శివసేన సీనియర్ నేత ఒకరు స్పష్టం చేశారు. పదిహేనేళ్ల పొత్తు భవితవ్యమేంటి? అధికార ప్రజాసామ్య కూటమి(డీఎఫ్)లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 144 స్థానాలు కావాలని ఎన్సీపీ డిమాండ్ చేస్తుండగా.. 124 ఇస్తామంటూ కాంగ్రెస్ చెబుతోంది. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ నేతృత్వంలో సోమవారం పార్టీ కోర్ కమిటీ భేటీలో.. పొత్తును కొనసాగించాల్సిందేనని నిర్ణయించారు. కానీ, కాంగ్రెస్ ఇస్తామంటున్న 124 స్థానాలు తమకు ఆమోదయోగ్యం కాదన్నారు. 15 ఏళ్ల పొత్తును కాపాడుకునేందుకు మంగళవారం ఉదయం ఇరు పార్టీల మధ్య మరో భేటీ జరగనుందని ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ వెల్లడించారు. బీజేపీతో ఎన్సీపీ పొత్తు పెట్టుకోబోతోందన్న వార్తలను కొట్టివేశారు. కాంగ్రెస్ కూడా సీట్ల విషయంపై గట్టిగానే ఉంది. అన్ని స్థానాల్లో పోటీ చేసే విషయంపై పార్టీలో చర్చించామని పేర్కొంది. ఒకస్థాయిలో పొత్తు విషయమై చర్చలు జరుగుతున్నాయని, మరో స్థాయిలో అన్ని స్థానాల్లో అభ్యర్థుల ఖరారుపై దృష్టి పెట్టామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ వ్యాఖ్యానించారు. మోదీపై ‘సామ్నా’ ప్రశంసలు ఒకవైపు పొత్తు పట్లు కొనసాగుతుండగా.. మరోవైపు మోదీపై శివసేన ప్రశంసల జల్లు కురిపించింది. భారత ముస్లింపై మోదీ వ్యాఖ్యలను ప్రశంసిస్తూ పార్టీ పత్రిక సామ్నాలో సంపాదకీయం రాసింది. మాతృభూమిపై ముస్లింల దేశభక్తికి మోదీ గ్యారంటీ ఇచ్చి కొత్త అధ్యాయం లిఖించారని, ఆయన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ముస్లింలపైనే ఉందని అందులో పేర్కొంది. ముస్లింలను ప్రశంసించడాన్ని ..మోదీలో హిందుత్వవాదం సన్నగిల్లినట్లుగా చూడరాదని తెలిపింది. ప్రధానమంత్రిగా మోదీ అన్ని మతాలకు, అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తారంది. నకిలీ లౌకికవాదులు మోదీని ముస్లిం వ్యతిరేకిగా చిత్రించారని తెలిపింది. -
130 సీట్లు ఇస్తాం... సరేనా?
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, బీజేపీల మధ్య సీట్ల సర్దుబాటుపై దోబూచులాట కొనసాగుతోంది. చిరకాల మిత్రపక్షం శివసేన కోసం కమలం పార్టీ ఒక మెట్టు దిగింది. 151 స్థానాల్లో పోటీ చేసి తీరుతామని బెట్టు చేస్తున్న శివసేనను శాంతింపజేసేందుకు ఒక ప్రతిపాదన చేసింది. 130 సీట్లు కేటాయిస్తామని మధ్యేమార్గంగా ప్రతిపాదించింది. ఈ మేరకు బీజేపీ నాయకుడు ప్రతాప్ రూడీ సోమవారం సాయంత్రం ఒక ప్రకటన చేశారు. అయితే దీనిపై శివసేన వెంటనే స్పందించలేదు. సీట్ల సర్దుబాటుపై ఒకపక్క పీటముడి కొనసాగుతుండగా శివసేనపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో బీజేపీ తాజా ప్రతిపాదనను శివసేన అంగీకరిస్తుందో, లేదో చూడాలి. -
సీట్లు పంచుకుందాం.. రండి!
మహారాష్ట్ర ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య సీట్ల పంపిణీ విషయమై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించడానికి బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగారు. సీట్ల విషయమై శివసేన చేస్తున్న ప్రతిపాదనలను పునరాలోచించుకోవాలని ఉద్ధవ్ ఠాక్రేను ఆయన కోరారు. దాదాపు 25 ఏళ్లుగా పొత్తులో ఉన్న ఈ రెండు పార్టీల మధ్య ఈసారి ఎన్నికలకు పోటీ చేసే విషయమై వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ 15వ తేదీన జరగనున్నాయి. సోమవారం ఉదయం ఉద్ధవ్ను పిలిపించిన అమిత్ షా.. రెండు పార్టీల మధ్య బంధం తెగిపోకూడదని సూచించారు. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో తాము కనీసం 135 చోట్ల పోటీ చేస్తామని బీజేపీ అంటుండగా, శివసేన మాత్రం 119కి మించి ఇచ్చేది లేదని అంటోంది. ఈనెల 27తో నామినేషన్ల దాఖలు గడువు ముగిసిపోతుంది. త్వరలోనే అభ్యర్థుల జాబితా సిద్ధం చేస్తామని బీజేపీ వర్గాలు అంటున్నాయి. పొత్తు విషయమై తమ నిర్ణయం త్వరలోనే వెల్లడిస్తామని బీజేపీ అధికార ప్రతినిధి సయ్యద్ షానవాజ్ హుస్సేన్ తెలిపారు. -
ఉద్థవ్ థాక్రేకు అమిత్ షా ఫోన్ కాల్
ముంబయి : సీట్ల సర్దుబాటుపై ఏర్పడ్డ ప్రతిష్టంభన తొలగించేందుకు బీజేపీ, శివసేన ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సోమవారం ఉద్ధవ్ థాక్రేతో ఫోన్లో మాట్లాడారు. రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని అమిత్ షా సూచించారు. పొత్తు పెట్టుకోకపోతే ఇరు పార్టీలకు నష్టమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. కాగా 151 స్థానాలకు పోటీ చేసి తీరుతామని తెగేసి చెబుతున్న శివసేన.. బీజేపీకి 119కి సీట్లకు మించి ఒక్కటి కూడా ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. కనీసం 130 సీట్లు కావాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో అమిత్ షా ఫోన్ కాల్ ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి పదవి శివసేనకు ఇచ్చేందుకు అంగీకరిస్తే.. శివసేన మరి కొన్ని సీట్లు బీజేపీకి ఇచ్చేందుకు ఒప్పుకోవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. -
ఢిల్లీకి ‘మహా’ పొత్తుల గొడవ
* శివసేన వైఖరిపై బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీలో చర్చ * 119 మించి ఇవ్వబోమని తేల్చిచెప్పిన శివసేన * 135కి తగ్గమంటున్న బీజేపీ ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, బీజేపీల మధ్య సీట్ల సర్దుబాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. 151 స్థానాలకు పోటీ చేసి తీరుతామని తెగేసి చెబుతున్న శివసేన.. బీజేపీకి 119కి సీట్లకు మించి ఒక్కటి కూడా ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. ఇదే తమ తుది మాట అని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. 135 స్థానాలకు తక్కువగా పోటీ చేయవద్దని, అవసరమైతే ఒంటరిగా బరిలో దిగుదామన్న పార్టీ మహారాష్ట్ర శాఖ వాదనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తదితరులతో కూడిన కమిటీ చర్చించింది. అయితే, శివసేనతో పొత్తును వదులుకోవడంపై మోదీ, అమిత్షాలు అంత ఆసక్తి చూపలేదని సమాచారం. సమావేశం మధ్యలో మోదీ, షాలు కాసేపు ఏకాంతంగా చర్చలు జరిపారని, ఆ తరువాత అమిత్ షా శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేతో ఫోన్లో మాట్లాడారని తెలిసింది. ఆ తరువాత బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీలోనూ ఈ అంశంపై చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి పదవి శివసేనకు ఇచ్చేందుకు అంగీకరిస్తే.. శివసేన మరి కొన్ని సీట్లు బీజేపీకి ఇచ్చేందుకు ఒప్పుకోవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మెుత్తం 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నారుు. ఆదివారం ఉదయం పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం తర్వాత శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే కార్యకర్తలతో మాట్లాడారు. ‘బీజేపీకి ఇంకెలాంటి రారుుతీ ఇవ్వదలుచుకోలేదు. ప్రతిపక్ష పార్టీల మహాయుతి (విపక్షాల మహా కూటమి) చెదిరిపోకుండా ఉండేందుకు నేనో చివరి ప్రయత్నం చేస్తున్నా. 119 సీట్లు బీజేపీకి వదిలి మనం 151 స్థానాల్లో బరిలోకి దిగుతాం. మిగతావి ఇతర మిత్రపక్షాలకు ఇస్తాం’ అని చెప్పారు. ‘2002 గుజరాత్ ఘర్షణల అనంతరం శివసేన దివంగత అధినేత బాల్ థాకరే మీకు వెన్నుదన్నుగా నిలిచిన విషయం ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి’ అంటూ ప్రధాని మోదీకి ఠాక్రే సూచించారు. గోధ్రా అల్లర్ల తర్వాత మోడీని గుజరాత్ సీఎం పదవి నుంచి తప్పించాలని అందరూ అన్నారని, అయితే హిందూ సిద్ధాంతం కోసం ఆయనను పదవిలో ఉంచాలని బాలసాహేబ్ ఒక్కరే అద్వానీకి నచ్చజెప్పారన్నారు. కూటమి కొనసాగాలన్నదే తన అభిమతమని, అన్ని సీట్లకు పోటీ చేసేందుకు సైతం తాము సిద్ధమని ఉద్ధవ్ స్పష్టం చేశారు. అయితే శివసేన తుది ప్రతిపాదనను తిరస్కరిస్తున్నామని మహారాష్ట్ర బీజేపీ నేతలు పేర్కొన్నారు. -
ఒంటరిగానే..
సాక్షి, ముంబై: వచ్చే నెలలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 200 మంది అభ్యర్థులను బరిలో దింపాలని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) నిర్ణయించింది. అందుకు సంబంధిం చిన అభ్యర్థుల తుది జాబితా సిద్ధమయ్యిందని, త్వరలో ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే అధికారికం గా దాన్ని వెల్లడిస్తారని ఆ పార్టీ సీనియర్ నాయకుడు బాలా నాంద్గావ్కర్ చెప్పారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్-నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), ప్రతిపక్షంలో ఉన్న శివసేన-బీజేపీ కూటములు ఇంకా సీట్ల సర్దుబాటు విషయంలో సిగలు పట్టుకుం టూనే ఉన్నాయి.. దీంతో ఏ నియోజకవర్గం ఏ పార్టీ ఆధీనంలోకి వస్తుంది...? ఏ అభ్యర్థి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఇంతవరకు సందిగ్ధంగానే ఉండిపోయింది. కాని ఎమ్మెన్నెస్ మాత్రం తమ పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా 200 మంది అభ్యర్థులను బరి లో దింపనున్నట్లు అనధికారికంగా ప్రకటించింది. కాగా విదర్భ, పశ్చిమ మహారాష్ట్రతో పోలిస్తే మిగతా ప్రాంతాల్లో అభ్యర్థులను తక్కువ సంఖ్యలో బరిలో దింపినట్లు నాంద్గావ్కర్ తెలిపారు. మరఠ్వాడాలో దాదాపు అన్ని నియోజక వర్గాలలో తమ అభ్యర్థుల ను బరిలో దింపనున్నట్లు వెల్లడించారు. విదర్భలో సుమారు 35-40 మంది అభ్యర్థులను రంగంలోకి దింపనున్నారు. ముంబై, ఠాణే, నవీ ముంబై, పుణే, నాసిక్ తదితర నగరాల్లో అన్ని స్థానాల్లో ఎమ్మెన్నెస్ పోటీ చేస్తుందని ఆయన అన్నారు. ఈ నెల 25న సాయంత్రం మాటుంగాలోని షణ్ముఖానంద హాలు లో ఎమ్మెన్నెస్ బ్ల్యూ ప్రింట్ విడుదల కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో రాజ్ ఠాక్రే పూర్తి వివరాలు వెల్లడిస్తారన్నారు. ఇందులో అభ్యర్థుల తుది జాబితాతోపాటు తమ పార్టీ అధికారంలో వస్తే రాష్ట్ర్రాన్ని ఎలా అభివృద్థి చేస్తామనేది కూడా స్పష్టం చేయనున్నారని నాంద్గావ్కర్ తెలిపారు. అదే రోజు రాజ్ ఠాక్రే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. బ్ల్యూ ప్రింట్ విడుదల కార్యక్రమం ఈ నెల 9,10 తేదీలో జరగాల్సి ఉన్నా పితృపక్షం కారణంగా వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. ఆ రోజు జరిగే కార్యక్రమానికి వివిధ రంగాల ప్రముఖులతోపాటు పార్టీ పదాధికారులు, కొందరు ముఖ్యమైన కార్యకర్తలు, మీడియా బృందాలను ఆహ్వానించనున్నారని ఆయన స్పష్టం చేశారు. -
బీజేపీ హెచ్చరిక... శివసేన బేఖాతరు!
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేనల మధ్య పొత్తు అసాధ్యంగా కనిపిస్తోంది. సీట్ల సర్ధుబాటు వ్యవహారంలో ఇరుపార్టీలు మెట్టు దిగకపోవడంతో పొత్తు వ్యవహారం కష్టంగా మారింది. ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టలేం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పొత్తుపై ఉద్దవ్ థాక్రే నిర్ణయం తీసుకుంటారు. శివసేన ఎవరి అల్టిమేటంకు తలవంచదు అని ఆపార్టీ ఎంపీ సంజయ్ రావత్ అన్నారు. తామ ప్రతిపాదించిన ఫార్మూలా సానుకూలంగా స్పందించాలని లేకపోతే తెగతెంపులకు సిద్ధమని బీజేపీ చేసిన వ్యాఖ్యల అనంతరం థాక్రే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. 288 అసెంబ్లీ సీట్లు ఉన్న అసెంబ్లీలో 135 సీట్లలో పోటీ చేయాలని బీజేపీ, శివసేనలు నిర్ణయం తీసుకున్నాయి. 2009 ఎన్నికల్లో బీజేపీ 119, శివసేన 169 సీట్లలో పోటీ చేశారు. -
పొత్తుల కోసం ఆత్మగౌరవం బలిపెట్టం
పాత మిత్రపక్షం శివసేనతో పొత్తు విషయమై బీజేపీకి ఇంతవరకు స్పష్టత రాకపోయినా.. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆత్మగౌరవాన్ని బలిపెట్టి తాము పొత్తుల కోసం వెంపర్లాడబోమని ఆయన అన్నారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్లో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదిహేనేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్-ఎన్సీపీ కూటమిని కూలగొట్టాలంటే 'మహాకూటమి' బలంగా, ఐకమత్యంగా నిలవాలని ఆయన చెప్పారు. ఈసారి మహారాష్ట్రలో వచ్చేది మాత్రం బీజేపీ ప్రభుత్వమేనని కచ్చితంగా చెప్పారు. విమానంలో ముంబైనుంచి కొల్హాపూర్ వచ్చేటప్పుడు కూడా తాను బీజేపీ నాయకులు దేవేంద్ర ఫడ్నవిస్, వినోద్ తవాడేలకు పొత్తుల విషయాన్ని త్వరగా తేల్చాలని చెప్పానన్నారు. తాము గట్టిగా ప్రయత్నిస్తున్నా శివసేన నుంచి తగిన స్పందన లేదని వాళ్లు అన్నారని తెలిపారు. బీజేపీ రెండు అడుగులు ముందుకు వస్తుందని, శివసేన కూడా రెండు అడుగులు ముందుకొచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. -
నేల వీడి సాము వద్దు
ముంబై: ఉప ఎన్నికల ఫలితాలను చూసి గుణపాఠం నేర్చుకోవాలని శివసేన తన భాగస్వామ్యపక్షమైన బీజేపీకి హితవు చెప్పింది. ఉప ఎన్నికల్లో ఎదురైన ఎదురుదెబ్బలను చూసైనా కాళ్లు నేలపై మోపాలని పేర్కొంది. పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూల పలితాలు ఎదురైన సంగతి తెల్సిందే. ముఖ్యంగా ఉత్తర్ప్రదేశ్లో తన సిట్టింగ్ స్థానాలను బీజేపీ కోల్పోయింది. దీనిపై శివసేన తన అధికార పత్రిక సామ్నాలో విరుచుకుపడింది. ఈ ఫలితాలు ఆశ్చర్యకరం, ఊహించని షాక్ అని పేర్కొంది.‘ప్రజలను తేలికగా తీసుకోవద్దు. ఈ ఫలితాలు అందరికీ ఓ గుణపాఠం కావాలి. ఓటర్ల మనస్సు చంచలమైనది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఉప ఎన్నికల ఫలితాలు ఓ గుణపాఠం. లోక్సభ ఎన్నికల్లో లభించిన విజయంతో గాలిలో ఎగరకండి. నేల విడిచి సాము చేస్తే.. ఫలితాలు ఇలాగే ఉంటాయి.. ఇకనైనా కాళ్లు నేలపై మోపండి లేదా ప్రజలు చమ్డాలు వలిచేస్తా రు’ అంటూ ఘాటుగా విమర్శించింది. ఈ గుణపాఠం నేర్చుకున్న వారే మహారాష్ట్రలో గెలుపొందుతారని, లేదా ప్రజలే ఆ గుణపాఠం నేర్పుతారని హితవు పలికింది. బీజేపీకి గట్టి పట్టున్న ఉత్తర్ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్లలోనే ఆ పార్టీకి తీవ్ర ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ మూడు రాష్ట్రాల్లో 23 సీట్లలో బీజేపీ 13 స్థానాలను తన ప్రత్యర్థులకు కోల్పోయింది. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో కాంగ్రెస్ ఆశ్చర్యకరమైన విజయాలను నమోదు చేసింది. ఉప ఎన్నికల ఫలితాలను మోడీ హవాతో ముడిపెట్టకూడదని సామ్నా పేర్కొంది. సార్వత్రిక, రాష్ట్రస్థాయి ఎన్నికలకు తేడా ఉంటుందని తెలిపింది. స్వామీ ఆదిత్యనాథ్ ‘లవ్ జీహాద్’ అంశాన్ని లేవనెత్తారని, కానీ ఆ ప్రభావం ఉప ఎన్నికలపై పడలేదని సామ్నా వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ సాధించిన విజయాలకు సోనియా లేదా రాహుల్ గాంధీలను ఎవరూ బాధ్యులు చేయడం లేదని, అలాగే ఇది మోడీకి వ్యతిరేకంగా వచ్చిన తీర్పు అని కూడా నిర్ధారించకూడదని పేర్కొంది. వచ్చేనెల జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధిక సీట్లను డిమాండ్ చేస్తున్న బీజేపీ గొంతు నొక్కేందుకే శివసేన తన అధికార పత్రికలో ఈ విధంగా విరుచుకుపడిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. త్వరగా తేల్చండి: ఎస్సెస్సెస్ ముంబై : ప్రతిపక్ష కూటమి ‘మహాయుతి’లో సీట్ల పంపకాలపై ఒక ఒప్పందం కుదరకపోవడం పట్ల స్వాభిమానీ షేట్కారీ సంఘటన్ అసహనం వ్యక్తం చేసింది. సీట్ల పంపకంపై శివసేన, బీజేపీలు త్వరగా ఒక అంగీకారానికి రావాలని సంఘటన్ నాయకుడు రాజుశెట్టి కోరారు. ఒప్పందం ఖరారులో అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలను బీజేపీ విరమరించాలని ఆయనసూచించారు. సీట్ల పంపకంపై సేన, బీజేపీల మధ్య చర్చలు వేగవంతం చేయాలని ఆర్పీ నాయకుడు రాందాస్ ఆఠవలే కోరారు. ఆయన బుధవారం సేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేను కలుసుకుని తమకు 13 సీట్లు కావాలని కోరారు. రాష్ట్ర ప్రజలు మహాయుతి వైపు చూస్తున్నారని ఆఠవలే పేర్కొన్నారు. అందువల్ల త్వరగా సీట్ల పంపకాన్ని పూర్తి చేసుకొని ప్రచారంపై దృష్టి కేంద్రీకరించాలని కోరారు. సీట్ల సంఖ్యపై బీజేపీ మొండి పట్టుదలకు పోతూ పొత్తుకు ఆటంకాలు సృష్టిస్తోందని ఆఠవలె ఆరోపించారు. -
అధిష్టానం నిర్ణయిస్తుంది
ముంబై: శివసేనతో పొత్తు కొనసాగింపు విషయమై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ అధికార ప్రతినిధి మాధవ్భండారీ పేర్కొన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘పార్టీ కార్యకర్తలు, నాయకుల మనోభావాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లా. పొత్తు విషయంలో తాజా సమాచారం ఏదైనా ఉంటే మా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దేవేంద్ర ఫడనవిస్ మీడియాకు తెలియజేస్తారు’ అని అన్నారు. కాగా ఉద్ధవ్ఠాక్రే శనివారం ఓ టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక రాష్ట్రాల్లో మోడీ వేవ్ పనిచేయలేదని పేర్కొన్నారు. అందువల్ల లోక్సభ ఎన్నికల్లో విజయాన్ని మోడీకి మాత్రమే ఆపాదింపజేయలేమన్నారు. మహారాష్ట్రలో విజయం విషయంలో శివసేన వాటాను కొట్టిపారేయలేనదని పేర్కొన్న సంగతి విదితమే. ఈ వ్యాఖ్యలు బీజేపీ నాయకులు, కార్యకర్తలను తీవ్ర ఆగ్రహానికి గురిచేసిన సంగతి విదితమే. కార్యకర్తలు కలత చెందారు ప్రధానమంత్రి నరేంద్రమోడీపై శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ఠాక్రే చేసిన వ్యాఖ్యలు తమ పార్టీ కార్యకర్తల్లో కలత రేపాయని బీజేపీ రాష్ట్ర శాఖ కోశాధికారి షైనా ఎన్సీ పేర్కొన్నారు. ‘మా నాయకుడిని ఉద్ధవ్ అవమానించారు. ప్రతి ఒక్కరికీ రాజకీయ ఆకాంక్షలు ఉంటాయి. అయితే ఇతర పార్టీ నాయకుల గురించి ఆచితూచి మాట్లాడాలి. విచక్షణతో మాట్లాడాలి’అని అన్నారు. కాగా మూడురోజుల పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా ఈ నెల 17వ తేదీన నగరానికి రానున్నారు. -
బీడ్ ఉప ఎన్నిక
ముంబై: బీడ్ లోక్సభ నియోజకవర్గానికి నిర్వహించే ఉప ఎన్నికపై దివంగత నాయకుడు గోపీనాథ్ కుమార్తె పంకజా పాల్వేముండే ఆసక్తి చూపడం లేదు. దీంతో ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలోకి ఎవరు దిగుతారనే విషయం అస్పష్టంగా ఉంది. ప్రస్తుతం పంకజా ‘సంఘర్ష్ యాత్ర’ పేరిట రాష్ర్టవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. రాష్ట్ర రాజ కీయాలపై తనకు ఆసక్తి ఉందనే విషయాన్ని పరోక్షంగా తెలియజేస్తున్నారు. అయితే పంకజ సోదరి ప్రీతమ్ ముండే ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఒకవేళ అదే కనుక జరిగితే ఈ సీటును మళ్లీ బీజేపీకి దక్కించుకోవడం అంత కష్టం కాకపోవచ్చు. ఇందుకు మరో కారణం కూడా ఉంది. ముండే కుటుంబ సభ్యులెవరైనా ముందుకొస్తే వారికి పోటీగా ఈ నియోజకవర్గంనుంచి తమ పార్టీ తరఫున ఎవరినీ బరిలోకి దించబోమని ఎన్సీపీ అధినేత శరద్పవార్ ఇప్పటికే బహిరంగంగా ప్రకటించారు. దీంతో ఇక్కడ బీజేపీ గెలుపు నల్లేరుపై నడకే కావచ్చని రాజకీయ పండితులు అంటున్నారు. ఇదిలాఉంచితే ప్రీతమ్ ముండే బీడ్ నియోజవర్గం పరిధిలోని పర్లి, బీడ్, నాసిక్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే పర్యటిస్తున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్సీపీ తరఫున బరిలోకి దిగిన రమేష్ అడస్కర్ ఇప్పటికే బీజేపీలో చేరారు. ఇది కూడా బీజేపీకి కలిసొచ్చే అంశమే. -
పోటీకి రాజ్ దూరం
సాక్షి, ముంబై: వచ్చే శాసనసభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే స్పష్టం చేశారు. నాగపూర్లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమానికి రాజ్ఠాక్రే హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలోని నియోజకవర్గాలన్నీ తనవేనని, ప్రస్తుతం వాటిపై దృష్టి కేంద్రీకరించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. నాసిక్ లేదా ముంబైలో ఏదో ఒక శాసనసభ నియోజక వర్గం నుంచి పోటీచేస్తానని రెండు నెలల కిందట ఠాక్రే ప్రకటించిన విషయం తెలిసిందే. కచ్చితంగా ఎక్కడి నుంచి పోటీ చేస్తాననేది త్వరలో ప్రకటిస్తానని చెప్పారు. దీంతో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయమై ఇటు ప్రజల్లో, అటు ఎమ్మెన్నెస్ కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. చివరకు తాను పోటీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించి ఆందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ‘నేను ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా...? ఆ నియోజకవర్గానికే పరిమితమవుతాను. అందుకే పోటీకి దూరంగా ఉంటున్నాను. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలూ నావే’ అని స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ ఘోర పరాజయం తరువాత మే 31న మొదటిసారి బహిరంగా సభ ఏర్పాటుచేసి ప్రజల ముందుకు వచ్చారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించిన తరువాత వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీచేసి తన సత్తా ఏంటో నిరూపిస్తానని ప్రకటించారు. దీంతో ఠాక్రే కుటుంబంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న మొదటి వ్యక్తి రాజ్ అంటూ వార్తలు వచ్చాయి. ఎన్నికల్లో పోటీచేయడం లేదని తాజాగా ప్రకటించి ఆశ్చర్యంలో ముంచెత్తారు. ‘మా కుటుంబంలో ఇంతవరకు ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇది మా ‘జన్యుపరమైన’ సమస్య’ అంటూ చమత్కరించారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీకి అధికారం ఇస్తే మహారాష్ట్ర రూపురేఖలు మార్చివేస్తామని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత తాము ఏం చేస్తామో తెలియజేసే మార్గదర్శక నివేదికను (బ్లూప్రింట్) వచ్చే వారం, పది రోజుల్లో విడుదల చేస్తామని ఈ సందర్భంగా రాజ్ స్పష్టం చేశారు. మొన్నటి వరకు ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధిని ప్రశంసించిన ఠాక్రే ఆదివారం మాత్రం ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఇటీవల నాగపూర్లో మోడీ సభను ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ బహిష్కరించడం సబబేనని అన్నారు. కార్యక్రమానికి ఆహ్వానించి, అవమానించడం సరికాదన్నారు. చివరగా రాజ్ మాట్లాడుతూ కేవలం తమకు అనుకూలంగా ఉన్న స్థానాల్లోనేగాక మొత్తం 288 శాసనసభ స్థానాల్లో ఎమ్మెన్నెస్ పోటీ చేస్తుందని ప్రకటించారు. -
మా సీట్లు మాకు కావాలే..
సాక్షి, ముంబై: వచ్చే శాసన సభ ఎన్నికల్లో కాషాయ కూటమి తమ పార్టీకి 20 స్థానాలు కేటాయించాల్సిందేనని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) అధ్యక్షుడు రాందాస్ ఆఠవలే స్పష్టం చేశారు. బాంద్రాలోని రంగశారద సభాగృహంలో జరిగిన పార్టీ కార్యకర్తల సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో శివసేన, బీజేపీ కూటమి చిహ్నంపై తమ అభ్యర్థులు పోటీ చేయబోరని, తమ పార్టీ గుర్తుపైనే పోటీచేస్తారని కుండబద్దలు కొట్టారు. ఇంతకుముందు తమ పార్టీకి 40 స్థానాలు కావాలని అడిగినా ప్రస్తుత వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కేవలం 20 స్థానాలు కావాలని అడుగుతున్నామని ఆయన చెప్పారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో శివసేన, బీజేపీ అభ్యర్థులకు ఆర్పీఐ ఓట్లు గంపగుత్తగా పడ్డాయని ఆయన చెప్పారు. అయితే ఆమేరకు ఆర్పీఐ అభ్యర్థులకు కూటమి పార్టీల ఓట్లు రావడంలేదని రాందాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ శాసన సభ ఎన్నికల్లో పరిస్థితుల మారాలంటే ఆ ఓట్లన్నీ ఆర్పీఐ అభ్యర్థులకు పోలయ్యే విధంగా ప్రయత్నాలు చేయాలని ఇరు పార్టీల నాయకులకు ఆఠవలే సూచించారు. ఒక కులానికి రిజర్వేషన్ అమలుచేసే ముందు మరో కులానికి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హితవు పలికారు. కొద్ది రోజులుగా ధన్గర్ సమాజ ప్రజలు రిజర్వేషన్ కోసం తీవ్ర పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరికి సమాన న్యాయం జరిగే తీరులో తుది నిర్ణయం తీసుకోవాలని రాందాస్ విజ్ఞప్తి చేశారు. అది మా లిస్ట్ కాదు.. బీడ్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల నిమిత్తం తమ పార్టీ ఇంకా అభ్యర్థుల జాబితాను ఖరారు చేయలేదని ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ ఆఠవలే స్పష్టం చేశారు. ఇటీవల ఆర్పీఐ అభ్యర్థుల జాబితా అంటూ మీడియాలో వచ్చిన కథనాలను బుధవారం ఆయన ఖండించారు. ఎవరో కూటమిని తప్పుదోవ పట్టించేందుకు ఇలా అసత్యాలను ప్రచారంచేస్తున్నారని ఆరోపించారు. తాము అభ్యర్థుల జాబితా ఖరారైన తర్వాత మీడియా ద్వారానే బహిరంగంగా ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు. తప్పుడు కథనాల వల్ల కార్యకర్తల్లో అయోమయం నెలకొందన్నారు. పుకార్లను నమ్మవద్దని ఆయన ఈ సందర్భంగా కార్యకర్తలకు సూచించారు. బీజేపీ,శివసేన కూటమికి తాము 57 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి జాబితాను అందజేశామని, వాటిలో 20 సీట్లను తమకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామని రాందాస్ ప్రకటించారు. గతంలో కాంగ్రెస్ ప్రవర్తించినట్లు ఇప్పుడు కాషాయ కూటమి ప్రవర్తిస్తుందని అనుకోవడంలేదని, ఆర్పీఐ అండ లేకుండా దళితుల ఓట్లను సాధించడం కూటమి వల్ల కాదని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీలో ఇప్పటికే నటి రాఖీ సావంత్ చేరగా, ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ త్వరలో చేరనున్నట్లు వివరించారు. కాగా, బీడ్ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రాందాస్ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. -
సంఘర్ష్ యాత్రకు సన్నద్ధం
ముంబై: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ‘సంఘర్ష్ యాత్ర’ రాష్ట్రవ్యాప్త పర్యటనకు దివంగత కేంద్రమంత్రి గోపీనాథ్ ముండే కుమార్తె పంకజ సిద్ధమవుతున్నారు. నగరంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వినోద్ తావ్డేతోపాటు పంకజా ముండే మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. 14 రోజులపాటు నిర్వహించే యాత్రలో భాగంగా పంకజ 21 జిల్లాల్లోని 71 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు వేల కిలోమీటర్లు పర్యటిస్తారు. బుల్డాణాలోని సింధ్ఖేడ్ జిల్లాలో యాత్ర ప్రారంభమవుతుందని పంకజ తెలిపారు. ఈ ప్రాంతం మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ తల్లి రాజమాత జీజావు జన్మస్థలం. తండ్రి మరణం కారణంగా ఖాళీ అయిన స్థానంలో పోటీకి పంకజ సిద్ధంగా లేరని ఇటీవల వార్తలు వచ్చాయి. ముండే కుటుంబం నుంచి ఎవరు బరిలోకి దిగినా వారికి వ్యతిరేకంగా తాము అభ్యర్థిని బరిలోకి దింపబోమని ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ ప్రకటించారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారం రోజులకే ముండే ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవడం తెలిసిందే. -
మోడీ హవా మీద ఆధారపడవద్దు: గడ్కరీ
పూణే: ప్రధాని నరేంద్రమోడీ హవా మీద ఆధారపడి ఉండవద్దని బీజేపీ కార్యకర్తలను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హెచ్చరించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి బీజేపీ కార్యకర్తలు నిర్లక్ష్య వైఖరిని, అలసత్వాన్ని వదులకోవాలని గడ్కరీ సూచించారు. దేశంలో మోడీ హవా ఉందనేది వాస్తవం అని గడ్కరీ అన్నారు. బీజేపీ కార్యకర్తలు గ్రామాల్లోకి వెళ్లి మోడీ అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేవలం మోడీ హవాతోనే అధికారంలోకి వస్తామని భ్రమలు తొలగించుకోవాలని గడ్కరీ సూచించారు. పూణే నగరానికి మెట్రో ప్రాజెక్ట్ క్లియరెన్స్ వచ్చిందంటూ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, డిప్యూటి సీఎం అజిత్ పవార్ లు చేసిన వ్యాఖ్యలను గడ్కరీ ఖండించారు. -
గెలుపు కోసం ‘షా’న్దార్ వ్యూహాలు
ముంబై: రాష్ట్ర శాసనసభకు త్వరలో జరగనున్న ఎన్నికల కోసం బీజేపీ కసరత్తులు మొదలుపెట్టింది. లోక్సభ ఎన్నికల్లో పార్టీకి అఖండ విజయం దక్కేలా వ్యూహాలు రూపొందించిన అమిత్ షా ఇప్పుడు మహారాష్ట్రంలో మహాకూటమికి అధికారం దక్కేలా పథకరచన చేస్తున్నారు. అమిత్ షా మార్గదర్శకత్వంలోనే ఎన్నికలకు వెళ్తామని బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఉత్తరప్రదేశ్లో షా వ్యూహాలు అద్భుతంగా పనిచేశాయని, అయితే మహారాష్ట్రంలో మాత్రం యూపీ ఫార్ములాను అమలు చేయబోమని ఫడ్నవీస్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర కోసం మహా ఫార్ములాను షా రూపొందిస్తున్నారని, ఇప్పటికే ఫార్ములాను అమలు చేయడం ప్రారంభించామన్నారు. అయితే షాపై వస్తున్న ఆరోపణల విషయంలో మీకు ఎలాంటి భయమైనా ఉందా? అని అడిగిన ప్రశ్నకు ఫడ్నవీస్ సమాధానమిస్తూ... ‘ఆయనపై వస్తున్న ఆరోపణలన్నీ రాజకీయపరమైనవే. వాటిని ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్దంగా ఉంది. షాపై వస్తున్న ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవని యూపీఏ హయాంలోనే సీబీఐ తేల్చిచెప్పింది. షా ఇక్కడికి వస్తున్నారంటేనే మా ప్రత్యర్థుల్లో గుబులు మొదలైంది. వాళ్ల తలరాతలను మార్చే ఎన్నికలు త్వరలో జరగనున్నాయ’ని చెప్పారు. సీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకోలేదు... ముఖ్యమంత్రి అభ్యర్థిగా శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే పేరు వినిపిస్తోందని, ఆ పార్టీ నేతలు బహిరంగంగానే ప్రకటిస్తున్నారని అడిగిన ప్రశ్నకు ఫడ్నవీస్ సమాధానమిస్తూ... దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మహాకూటమి సమావేశంలో నిర్ణయం తీసుకొని ప్రకటిస్తాం. రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించే సంస్కృతి కాషాయ కూటమిలో లేదు. అందుకు ఇంకా సమయముంది. సీట్ల కేటాయింపుపై కూడా అదే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామ’న్నారు. -
144 సీట్లు ఇవ్వాల్సిందే
సాక్షి, ముంబై : ఎన్సీపీకి 144 సీట్లు ఇవ్వాల్సిందేనని మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షులు సునీల్ తట్కరే స్పష్టం చేశారు. సీట్ల పంపకాల అంశంపై ఎన్సీపీ, కాంగ్రెస్ల మధ్య చర్చలు కొలిక్కిరావడం లేదు. ఈ నేపథ్యంలో సీట్ల పంపకాల అంశం తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ విషయమై గురువారం ఎన్సీపీ భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీట్ల పంపకాల అంశంపై సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించిందని తెలిపారు. ఈ సమావేశంలో 144 సీట్లు కేటాయించాల్సిందేనని పట్టుబట్టినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి పథ్వీరాజ్ చవాన్, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, ఎంపీసీసీ అధ్యక్షులు మాణిక్రావ్ ఠాక్రే తదితర ప్రముఖులు పాల్గొని, తమ ప్రతిపాదనలు, డిమాండ్లను ఎన్సీపీ ముందుంచినట్లు చెప్పారు. ఈ విషయాలపై కాంగ్రెస్ మహారాష్ట్ర ఇంచార్జీ మోహన్ప్రకాష్ ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానంతో చర్చిస్తారు. ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ ఎన్సీపీ అధ్యక్షులు శరద్ పవార్తో చర్చిస్తారు. వీరిద్దరి చర్చల అనంతరం మరో రెండు మూడు రోజుల్లో సీట్ల పంపకాల విషయంపై మళ్లీ సమావేశం జరగనుందని చెప్పారు. ఆ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని సునీల్ తట్కరే తెలిపారు. మరోవైపు రమేష్ కదం ఎన్సీపీలో చేరికతో కోంకణ్లో ముఖ్యంగా చిప్లూన్లో ఉత్సాహమైన వాతవరణం నెలకొందన్నారు. ఇక రాణే విషయంపై మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారమని చెప్పారు. ఢిల్లీ మహారాష్ట్ర సదన్లోని సంఘటనపై మాత్రం రాష్ట్ర సంస్కతి, సాంప్రదాయలకు వ్యతిరేకమైన సంఘటనగా పేర్కొంటూ శివసేనపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. సమాజ్వాదీ పార్టీ ప్రజాసామ్య కూటమిలో జతకట్టనుందన్న విషయంపై ఇంత వరకు ఎలాంటి ప్రస్తావన రాలేదని స్పష్టం చేశారు. -
మరాఠ్వాడా బాధ్యతలు అశోక్చవాన్కు
ముంబై: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడానికి కాంగ్రెస్ కసరత్తుల జోరు పెంచింది. మరాఠ్వాడా ప్రాంతానికి సంబంధించి ఎన్నికల వ్యూహాలను రూపొందించే బాధ్యతను మాజీ ముఖ్యమంత్రి, నాందేడ్ ఎంపీ అశోక్రావ్ చవాన్కు శుక్రవారం అప్పగించారు. మధుకర్ చవాన్, రాజేంద్ర దర్డా, అమిత్ దేశ్ముఖ్, అబ్దుల్ సత్తార్, డీపీ సావంత్లతో కూడిన మరాఠ్వాడా నేతల బృందానికి చవాన్ నేతృత్వం వహిస్తారు. 2010లో ఆదర్శ్ కుంభకోణంలో చవాన్పై కూడా ఆరోపణలు వెల్లువెత్తడంతో ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన వైదొలిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో నాందేడ్ ఎంపీగా పోటీ చేసిన చవాన్ తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోటీచేసిన 26 స్థానాల్లో కాంగ్రెస్ కేవలం రెండు నియోజకవర్గాల్లో మాత్రమే గెలిచింది. అందులో ఒకటి అశోక్చవాన్ బరిలో నిలిచిన నాందేడ్ కాగా మరొకటి రాజీవ్ సతావ్ బరిలో నిలిచిన హింగోళి. గెలిచిన రెండు స్థానాలు కూడా మరాఠ్వాడా ప్రాంతంలోనివే కావడం గమనార్హం. అంతటి మోడీ ప్రభంజనంలో కూడా ఇక్కడి ప్రజలు కాంగ్రెస్ పక్షాన నిలిచారని చెప్పేందుకు ఈ రెండు నియోజకవర్గాల్లో విజయమే ఉదాహరణ. దీంతో ఈ ప్రాంతంలోని కాంగ్రెస్ కార్యకర్తలను అసెంబ్లీ ఎన్నికలనాటికి పూర్తి సమాయత్తం చేయాలని భావించిన అధిష్టానం ఇక్కడి ప్రజల సమస్యలు, కులాల వారీగా రిజర్వేషన్లు, రహదారుల సమస్యలు, రైతుల సమస్యలను గుర్తించి, ఎన్నికల వ్యూహాలను రూపొందించే బాధ్యత అశోక్చవాన్ నేతృత్వంలోని బృందానికి అప్పగించింది. అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ తీసుకున్న మొదటి నిర్ణయం దాదాపుగా ఇదేనని చెప్పవచ్చు. ఈ రీజియన్లో 46 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2009లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడి 18 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. ఇదిలాఉండగా ఈ ప్రాంత సమస్యల విషయమై సీఎం చవాన్, ఎంసీసీసీ అధ్యక్షుడు మాణిక్రావ్ ఠాక్రే, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మోహన్ ప్రకాశ్ తదితరులు అశోక్చవాన్తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇక్కడి సమస్యలను చవాన్ వారికి వెల్లడించినట్లు సమాచారం. వాటిలో స్థానిక సమస్యలతోపాటు మరిన్ని కులాలకు రిజర్వేషన్ కల్పించడం, ఆలయాలు, ప్రార్థనా స్థలాలకు నిధులను పెంచడం, రైతుల సమస్యలు తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. -
ఓ నిర్ణయానికొచ్చిన ఎన్నికల కమిషన్
సాక్షి, ముంబై: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అసెంబ్లీ ఎన్నికలను దీపావళికి ముందే నిర్వహించాలని ఎన్నికల సంఘం ఓ నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. అక్టోబర్ 13 నుంచి 18వ తేదీ లోపు రెండు దశల్లో పూర్తిచేసి ఫలితాలు వెల్లడించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్, జాతీయవాద కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)ల నేతృత్వంలోని ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం గడువు డిసెంబర్ 7వ తేదీతో ముగుస్తుంది. హర్యానా ప్రభుత్వం గడువు కూడా అక్టోబర్ 27తో ముగియనుంది. దీంతో ఆలోపే ఇరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు తెలిసింది. లోక్సభ ఎన్నికల తర్వాత ఇప్పుడు అందరి దృష్టి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలవైపు మళ్లింది. గత పదేళ్ల కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయంపాలైన విషయం తెలిసిందే. ప్రతిపక్ష హోదా కూడా అతికష్టం మీద దక్కించుకున్న కాంగ్రెస్కు, తిరుగులేని మెజార్టీ సాధించిన బీజేపీకి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు పెద్ద సవాలే. దీంతో దేశం మొత్తం కూడా ఈ ఎన్నికలవైపు చూస్తోంది. ఎన్నికల గురించి కమిషన్ ఎటువంటి కసరత్తు మొదలు పెట్టకముందే ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. కాగా లోక్సభ ఎన్నికలకు సంబంధించిన తతంగమంతా పూర్తి కావడంతో మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిసారించిన ఎన్నికల సంఘం మరో రెండు నెలల్లో పక్కా షెడ్యూల్ ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికల కమిషన్ ఈ ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైంది. ఈ నెలాఖరు వరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇరు రాష్ట్రాల రాజకీయ నాయకులతో ఎన్నికల తేదీలపై చర్చలు జరిపి వారి అభిప్రాయాన్ని సేకరించనుంది. అందుకు ముంబైలో ఈ నెల 20వ తేదీన అన్ని రాజ కీయ పార్టీలతో సమావేశం నిర్వహించే అవకాశాలున్నట్లు తెలిసింది. సెప్టెంబర్లో గణేశ్ ఉత్సవాలు జరుగనుండడంతో ఆ సమయంలో ఎన్నికలు నిర్వహించవద్దంటూ ఇదివరకే రాజకీయ పార్టీలతోపాటు సార్వజనిక గణేశ్ ఉత్సవ మండళ్లు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. దీంతో గణేశ్ ఉత్సవాలు ముగిసిన తర్వాత, దీపావళి ముందు అంటే రెండు పండుగల మధ్యలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ యోచిస్తోందని, అక్టోబర్ 21 నుంచి దీపావళి పండుగ మొదలవుతుండడంతో మహారాష్ట్రలో దీపావళికి ముందే ఎన్నికల తంతు పూర్తిచేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. దీంతో డిసెంబరు 7వ తేదీ గడువు ముగిసేలోపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తగినంత సమయం దొరుకుతుందని ఎన్నికల కమిషన్ భావిస్తున్నట్లు సమాచారం. కార్యకర్తలను ఉత్తేజపరుస్తాం: తట్కరే ముంబై: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, సమావేశాలు నిర్వహించి కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపుతామని ఎన్సీపీ రాష్ట్రాధ్యక్షుడు సునీల్ తట్కరే తెలిపారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పాల్ఘర్లో ఈ నెల 1వ తేదీన కార్యకర్తలతో సమావేశం నిర్వహించామని, 4న అహ్మద్నగర్లో నిర్వహించనున్నామని, ఆ తర్వాత 5న డోంబివలి, ఠాణేలో, జల్గావ్లో 6న నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశాలు సామాన్యులను పార్టీకి దగ్గర చేసేందుకేనని చెప్పారు. కాంగ్రెస్-ఎన్సీపీ నేతృత్వంలోని ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను వివరిస్తామన్నారు. వివిధ ప్రాంతాల్లో నిర్వహించే సమావేశాల ద్వారా అన్నివర్గాల ప్రజలను ఆకట్టుకుంటామని చెప్పారు. పార్టీ కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపేందుకు సుహృద్భావ వాతావరణం నెలకొల్పే ప్రయత్నం చేస్తామన్నారు. నేతలు నిజాయతీగా నడుచుకునేందుకు అవసరమైన మార్గదర్శనం చేస్తామన్నారు. సమావేశాలను విజయవంతం చేసేందుకు పార్టీ కార్యకర్తలంద రూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. చేసేదే ప్రజలకు చెబుతామని, మోడీలాగా కల్లబొల్లి మాటలు చెప్పి మోసగించమన్నారు. మంచి రోజులు ముందున్నాయని చెప్పిన మోడీనుద్దేశించి మాట్లాడుతూ... ‘ఏవి మంచిరోజు లు.. మీరు అధికారంలోకి వచ్చాక ఇంధనం ధరలు పెంచేశారు. రైలు చార్జీలు పెంచేశారు. ఇవేనా మంచిరోజులు?’ అని ప్రశ్నించారు. -
సిసలైన గ్రామీణ నాయకుడు..!
ముండేను కొనియాడిన అసెంబ్లీ నివాళులర్పించిన అధికార, ప్రతిపక్షాలు ముంబై: బీజేపీ దివంగత నేత, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి గోపీనాథ్ ముండేకు మహారాష్ట్ర అసెంబ్లీ ఘనంగా నివాళులర్పించింది. ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముండే మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణించిన రోజే సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. శుక్రవారం ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ నివాళి తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడుతూ... ‘ప్రజలకు సేవ చేయాలనే తపన కలిగిన నేత గోపీనాథ్ ముండే. పట్టణ పార్టీగా చెప్పుకునే బీజేపీలో ఆయన గ్రామీణ నేత. ఎన్నికలను ఎప్పుడూ ఆయన తేలికగా తీసుకునేవారు కాదు. తనదైన వ్యూహాలతో ముందుకు వెళ్లేవారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల విషయమై ఆయన ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు కనిపించేది. రాజకీయ ప్రస్థానంలో ఉన్నత స్థానంలో ఉన్నప్పుడే ఆయన మరణించడం విచారకరం. ఆయన కల(ముఖ్యమంత్రి కావాలన్న) నెరవేరకుండానే మన మధ్య నుంచి వెళ్లిపోయారు. చివరిసారిగా ఆయన నాతో ఫోన్లో మాట్లాడారు. తన మంత్రిత్వశాఖ గురించి ఎన్నో విషయాలు చెప్పారు. రాష్ట్రంలోని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ఇదే సరైన సమయమన్నారు. బడ్జెట్ కేటాయింపుల గురించి తాను చర్చించారు. రాజకీయాలకు అతీతంగా ఆయన స్నేహం చేసేవారు. ఎప్పుడూ బాధ్యతల నుంచి తప్పింకోవాలని చూడలేదు. మరో పదిహేను రోజుల తర్వాత కలుద్దామని చెప్పాను. తనకు చాలా సమయముందని, ఎప్పుడైనా కలుసుకుందామని చెప్పి అందరాని లోకాలకు వెళ్లిపోయార’ని గుర్తుచేసుకున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఏక్నాథ్ ఖడ్సే మాట్లాడుతూ... బీజేపీ శివసేనలు కూటమిగా ఏర్పడ్డాక ముండే రాజకీయ ప్రస్థానం మొగ్గతొడగడం మొదలైంది. బాల్ఠాక్రేతో ముండేకు చాలా దగ్గరి సాన్నిహిత్యం ఉండేది. రైతుల సంక్షేమం కోసం కృష్ణావ్యాలీని అభివృద్ధి చేయాలన్న ఆలోచన ముండేదే. అందరిపట్ల అభిమానం చూపే వ్యక్తి ఆయన. కిందిస్థాయి కార్యకర్తలు ఎదుగుతున్నారని ఎంతో సంబరపడిపోయేవారు. వారి ఎదుగుదలను చూసి ఎప్పుడూ ఆయన భయపడలేదు. పార్టీ పటిష్టానికి ఇది శుభపరిణామం అనేవారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మనమధ్య లేకపోవడం తీరని లోటు’ అంటూ ఉద్వేగభరితంగా మాట్లాడారు. నారాయణ్ రాణే మాట్లాడుతూ... ‘గ్రామీణ అంశాలపై ముండేకు గట్టి పట్టు ఉందన్నారు. వెనుకబడిన వర్గాల ప్రజలకు ముండే చేసిన సేవలు మరువలేనివని ప్రజాపనులశాఖ మంత్రి ఛగన్ భుజ్బల్ కొనియాడారు. తమ ఓబీసీ డిమాండ్కు మద్దతు పలికిన మొట్టమొదటి బీజేపీ నేత ముండే అని గుర్తుచేసుకున్నారు. సుభాష్ దేశాయ్, పతంగ్రావ్ కదమ్ తదితరులు కూడా ముండే సేవలను కొనియాడారు. -
ఒరిగేదేమీ లేదు: బీజేపీ
ముంబై: గురువారం చేపట్టిన మంత్రివర్గ విస్తరణతో కాంగ్రెస్-ఎన్సీపీల నేతృత్వంలోని ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వానికి ఒరిగేదేమీ లేదని బీజేపీ విమర్శించింది. మంత్రులను మార్చినంతమాత్రాన ఎన్నికల్లో విజయావకాశాలు మెరుగుపడతాయనడం హాస్యాస్పదంగా ఉందని బీజేపీ ముంబై విభాగం అధ్యక్షుడు ఆశిష్ శేలార్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమాలు చేసిందో ప్రజలకు తెలుసని, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వారికి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. కొత్తగా వైద్యవిద్యాశాఖ మంత్రిగా ప్రమాణం చేసిన జితేంద్ర అవ్హాడ్కు శుభాకాంక్షలు చెబుతున్నానన్నారు. ప్రమాణస్వీకారోత్సవానికి బీజేపీ, శివసేనలు ఎందుకు హాజరు కాలేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు శేలార్ సమాధానమిస్తూ... ప్రతిపక్షాల తరఫున తాను హాజరయ్యానని చెప్పారు. తమ పార్టీ నేతలు పర్యటనల్లో ఉన్నందున కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని, అయితే అంతా శుభాకాంక్షలు తెలిపారని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు రెండు, ఎన్సీపీకి నాలుగు స్థానాల్లో మాత్రమే విజయం వరించింది. మిగతా నలభై స్థానాల్లో ఆ పార్టీలు ఘోర పరాభవాన్ని చవిచూశాయి. మళ్లీ అదే తరహా ఫలితాలు పునరావృతమవుతాయని ప్రతిపక్ష బీజేపీ, శివసేనలు చెబుతున్నాయి. -
అవసరమైతే సీట్ల మార్పిడి
ముంబై: ఇటీవలి లోక్సభ ఎన్నికల ఫలితాలు బీజేపీ, శివసేన నేతృత్వం లోని మహాకూటమికి ఎనలేని ఉత్సాహాన్నిచ్చాయి. ఈ నేపథ్యం లో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లోనూ ఇదే రకమైన ఫలితాలు వస్తాయని ధీమాతో ఉన్న ఈ కూటమి అందుకు అనుగుణంగా ప్రణాళికలను రూపొందించుకుంటోంది. ఎవరికి అనుకూలంగా ఉన్న స్థానాల్లో వారే పోటీ చేయాలని, ఇందుకోసం స్థానాలను తారుమారు చేసుకోవాలని బీజేపీ భావిస్తోం ది. ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ వెల్లడించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సీట్ల మార్పిడి కిగల అవకాశాలపై శివసేనతో చర్చిస్తామన్నారు. ఇప్పటికే ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, ఇందులో ఎటువంటి వివాదాలు తలెత్తలేదన్నారు. సీట్ల మార్పిడికి సంబంధించి ఈ సందర్భంగా ఆయన ఓ ఉదాహరణ చెబుతూ గతంలో తూర్పు నాగపూర్ నియోజకవర్గం శివసేన కోటాలో ఉంద ని, అంతకుముందు అక్కడ జరిగిన ఎన్నికల్లో పోటీచేసిన తమ భాగస్వామ్య పక్షం ఓటమి పాలైం దన్నారు. అయితే గత శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి కృష్ణ ఖోప్డే పోటీ చేసి 34 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారని ఆయన గుర్తుచేశారు. ఒకవైపు మోడీ ప్రభంజనం, మరోవైపు ప్రభు త్వ వ్యతిరేకత శాసనసభ ఎన్నికల్లో తమకు కలిసొస్తుందన్నారు. పొత్తు పెట్టుకోం త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో రాజ్ఠాక్రే నేతృత్వంలోని ఎమ్మెన్నెస్తో పొత్తు పెట్టుకునే ప్రశ్నే లేదన్నారు. -
ఎమ్మెన్నెస్, ఆప్లకు మొండిచేయి
సాక్షి ముంబై: రాష్ట్ర లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్), ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్)లకు ప్రజలు మొండిచేయి చూపారు. రాష్ట్రంలోని 48 లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఆప్ ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. మరోవైపు తమ సత్తా చాటుతామని పేర్కొన్న రాజ్ ఠాక్రే పార్టీ ఎమ్మెన్నెస్ కూడా ఖాతా తెరవలేకపోయింది. ఈ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్, ఆప్ అభ్యర్థులు ప్రభావం చూపుతారని అంతా భావించారు. అయితే అలాంటిదేమీ జరగలేదు. అసలు వీరి ప్రభావమే కనిపించలేదు. మరోవైపు ఎస్పీ, బీఎస్పీల ప్రభావం కూడా ఎక్కడా కానరాలేదు. బోణీ చేయని ఎమ్మెన్నెస్... ముంబైతోపాటు రాష్ట్రంలోని మొత్తం 10 లోక్సభ నియోజకవర్గాల్లో ఎమ్నెన్నెస్ పోటీ చేసింది. గతంలో ఖాతా తెరవలేకపోయినపార్టీకి ఈ సారి గెలుస్తామనే ధీమా వ్యక్తం చేసింది. అయితే ప్రజలు మాత్రం ఎమ్మెన్నెస్ను ఆదరించకపోగా కొన్ని నియోజకవర్గాల్లో డిపాజిట్ కూడా గల్లంతైనట్టు సమాచారం. నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్లో అధికారంలో ఎమ్మెన్నెస్ ఉన్నప్పటికీ అక్కడ పెద్దగా అభివృద్ధి పనులేవీ చేయలేదని, అన్నిపార్టీల్లాగానే హామిలిచ్చిందనే ఆరోపణలున్నాయి. దీని ప్రభావం లోక్సభ ఎన్నికల్లో కనిపించిందని కొందరు పేర్కొంటున్నారు. నాసిక్లో ఎమ్మెన్నెస్ అభ్యర్థి ప్రదీప్ పవార్ ఎలాంటి ప్రభావం చూపలేదు. మరోవైపు ముంబైలో కూడా బాలానాందగావ్కర్తోపాటు ప్రముఖ అభ్యర్థులంతా పరాజయం పాలయ్యారు. ఖాతా తెరవని ఆప్... తొలిసారిగా లోక్సభ ఎన్నికల బరిలోకి దిగిన ఆప్ ప్రభావం కూడా కనిపించలేదు. ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ప్రభావం కారణంగా కనీసం ఒకటిరెండైనా సీట్లు దక్కుతాయని భావించారు. అయితే ప్రముఖ అభ్యర్థులంతా పరాజయం పాలయ్యారు. ముఖ్యంగా మేథా పాట్కర్, మీరా సాన్యాల్, మయాంక్ గాంధీ, అంజలి దమానియా, విజయ్ పాండరేలు బరిలోకి దిగినా ఉపయోగం లేకుండాపోయింది. -
1995 నాటి ‘హిందుత్వ’ తీర్పుపై సుప్రీంకోర్టు సమీక్ష
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రయోజనాల కోసం మతాన్ని దుర్వినియోగం చేయడం అవినీతిపూర్వక చర్య కిం దకే వస్తుందని ప్రజా ప్రాతినిధ్య చట్టంలో పేర్కొనడంపై సుప్రీంకోర్టు మరోసారి విచారణ ప్రారంభిం చనుంది. దానికి సంబంధించి సాధికార తీర్పునిచ్చే దిశగా ఏడుగురు న్యాయమూర్తుల విసృ్తత ధర్మాసనం విచారణను వేగవంతం చేయాలని నిర్ణయించింది. అందుకు దారితీసిన కారణాలు.. హిందుత్వ లేదా హిందూయిజం పేరున వేసే వోటు ఏ అభ్యర్థి విజయావకాశాలపై ప్రతికూల ప్రభావం చూపవని మనోహర్ జోషి వర్సెస్ ఎన్బీ పాటిల్ కేసుకు సంబంధించి 1995లో సుప్రీం తీర్పునిచ్చింది. హిందుత్వ అనేది భారత ప్రజల జీవనవిధానమని, అది ఒక మానసిక స్థితి అని ఆ తీర్పులో త్రిసభ్య బెంచ్ పేర్కొంది. మహారాష్ట్రలో మొదటి హిందూ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తామంటూ ఎన్నికల సందర్భంగా జోషీ చేసిన వ్యాఖ్యపై పాటిల్ ఈ కేసు వేశారు. నాటినుంచి ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123(3)పై 3 పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. 1990లో మహారాష్ట్ర అసెంబ్లీకి బీజేపీ తరఫున అభిరామ్సింగ్ ఎన్నికయ్యారు. పైన పేర్కొన్న సెక్షన్ ఆధారంగా బాంబే హైకోర్టు ఆ ఎన్నికను 1991లో నిలిపేసింది. దాంతో ఆయన సుప్రీం కెళ్లారు. ఆ పిటిషన్కు సంబంధించి సెక్షన్ 123 (3)పై వివరణ అంశం జనవరి 30న సుప్రీంకోర్టులోని జస్టిస్ ఆర్ఎం లోధా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బెంచ్ ముందుకు వచ్చింది. అయితే, దానిని ఆ ధర్మాసనం ఏడుగురు సభ్యుల విసృ్తత ధర్మాసనానికి నివేదించింది. -
తంత్రగాళ్లకు చెక్
సాక్షి, ముంబై: అమాయకుల బలహీనతలను ఆసరాగా చేసుకొని మూఢనమ్మకాలను వారిపై రుద్దుతున్న ‘తంత్రగాళ్లకు’ ఇకపై ముకుతాడు పడనుంది. మూఢాచారాలకు వ్యతిరేకంగా పోరాడి, హత్యకు గురైన ప్రముఖ హేతువాది నరేంద్ర దభోల్కర్ లక్ష్యం ఎట్టకేలకు నెరవేరింది. నాగపూర్లో జరుగుతున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ‘మూఢాచారాల వ్యతిరేక బిల్లు’ను శుక్రవారం ఆమోదించారు. ఈ బిల్లు ఎగువసభ అయిన విధాన మండలి ఆమోదం కూడా పొంది, చట్టంగా మారితే.. అటువంటి చట్టాన్ని తెచ్చిన మొట్టమొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర అవతరించనుంది. స్పీకర్ ఓటింగ్ పద్ధతిలో సభ ఆమోదాన్ని కోరడంతో మెజారీ సభ్యులు ఆమెదిస్తున్నట్లు తెలిపారు. ఫలించిన దభోల్కర్ కల... మూఢాచారాలు, మంత్రతంత్రాలకు వ్యతిరేకంగా పోరాడిన నరేంద్ర దభోల్కర్ కల ఈ బిల్లు ఆమోదంతో సాకరమైందనే అభిప్రాయాన్ని ఆయన అనూయాయులు వ్యక్తం చేస్తున్నారు. బిల్లు కోసం పోరాడినందుకే దభోల్కర్ను హత్య చేశారని, ఆయన బతికుంటే మరింత కఠినమైన చట్టం కోసం పోరాటం చేసేవారని అభిప్రాయపడ్డారు. బిల్లును అసెంబ్లీ ఆమోదించడంపై దభోల్కర్ కుమారుడు హమీద్ దభోల్కర్ సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉపముఖ్యమంత్రి అజిత్పవార్లు గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని, త్వరలో రూపుదిద్దుకోనున్న ఈ చట్టం సమర్థవంతంగా అమలైనప్పుడే తన తండ్రి కృషి ఫలిస్తుందన్నారు. బీజేపీ, శివసేన అసంతృప్తి... దేశంలోనే మూఢాచారాలకు వ్యతిరేకంగా తెస్తున్న బిల్లుపై నామమత్రమైనా చర్చ చేపట్టకుండా ఆమోదింపజేసుకున్నారని బీజేపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. మెజార్టీ ఉందనే మొండివైఖరితోనే అధికారపక్షం ఏకపక్షంగా బిల్లును చర్చకు తావులేకుండా ఆమోదింపజేసుకుందని, చర్చ జరిగి ఉంటే బిల్లులో అవసరమైన మార్పులు, చేర్పులపై మరిన్ని అభిప్రాయాలు వ్యక్తమయ్యేవని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. ఇక ఈ బిల్లు ఆమోదం పొందడంపై శివసేన కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. బిల్లును ఆమోదింపజేసుకునేముందు వార్కారీలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిందన్నారు. విధానమండలిలో సోమవారం.... దిగువసభ అయిన విధానసభ ఆమోదం పొందిన మూఢాచారాల వ్యతిరేక బిల్లు ఇక ఎగువ సభ అయిన విధాన మండలి ఆమోదం కోసం వెళ్లనుంది. సోమవారం ఈ బిల్లు విధాన మండలి ఆమోదానికి వెళ్లే అవకాశముందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే అక్కడ కూడా ఎటువంటి చర్చ లేకుండానే సంఖ్యాబలం ఆధారంగా బిల్లును ఆమోదింపజేసుకోవాలని సర్కార్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కాగా ప్రతిపక్ష బీజేపీ, శివసేను చర్చ జరపాలంటూ పట్టుబట్టే అవకాశముందని తెలిసింది.