TANTEX
-
టాంటెక్స్ ''నెలనెల తెలుగువెన్నెల'' 209 వ సాహిత్య సదస్సు
డాలస్లో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక 'నెల నెలా తెలుగు వెన్నెల' 209వ సాహిత్య సదస్సు ఘనంగా జరిగింది. సదస్సు ప్రారంభ సూచికగా మోహన రాగంలో త్యాగరాయ కృతి 'రామా నన్ను బ్రోవరా' కీర్తనను చిరంజీవి సమన్విత మాడా తన మధుర కంఠంతో పాడి సాహితీ ప్రియులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. ముందుగా దివంగతులైన టాంటెక్స్ పూర్వ అధ్యక్షులు లావు రామకృష్ణ గారికి సభ్యులందరూ ఒక నిముషము మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.స్వాగతోపన్యాసం చేసిన పాలక మండలి సభ్యులు, సాహిత్య వేదిక సమన్వయకర్త దయాకర్ మాడా గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ సాహిత్య వేదికను ప్రతి నెల 3వ ఆదివారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి డి పి అనురాధ గారి జీవిత విశేషాలను,అ ఖండ తెలుగుజాతి పూర్వాపరాలను తెలుసుకోవడానికి వారు చేస్తున్నఎనలేని కృషిని చక్కగా వివరించారు. ఇక సీనియర్ పాత్రికేయులు డి పి అనురాధ మాట్లాడుతూజజ తెలుగు జాతి చరిత్రను పాఠ్య పుస్తకాలలో చదివిన తాను తన గురువు తల్లాప్రగడ సత్యనారాయణ గారి మార్గదర్శకత్వంలోనూ తన అత్తమామల ప్రోత్సాహంతోనూ దాదాపు రెండువేల సంవత్సరాల నుంచి నేటివరకూ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు మాట్లాడుతున్న తెలుగు జాతి వారి మూలాలను అన్వేషిస్తూ పరిశోధక దృష్టితో అనేక దేశాలు పర్యటించినట్లు తెలియచేశారు. ఆగ్నేయాసియా దేశాల్లో స్థిరపడిన తెలుగుజాతివారిని కలుసుకొని వారి పుట్టుపూర్వోత్తరాలు వారి భాషాభిమానం అనుభవ పూర్వకంగా తెలుసుకున్నారు. అంతేగాదు ఆదిమ తెలుగు జాతి ప్రాచీన ప్రాభవం ఈ రోజుకి ఎలా గుబాళిస్తోందో తనదైన శైలిలో చక్కగా వివరించారు. శ్రీలంక, మయన్మార్, వియత్నాం, థాయ్లాండ్, కంబోడియా,ఇండోనేషియాల్లో ముఖ్యమైన పట్టణాలు, మారుమూల పల్లెలు తిరిగిన తాను ఆయా ప్రదేశాల్లో తెలుగు వారి అడుగుజాడలను పరిశీలంచిన వైనాన్ని చక్కగా విశదీకరించారు. ఆయాదేశాల చారిత్రక స్థలాలలోనున్న స్థూపాలు, శాసనాలు పరిశీలించి, వాంగ్మయంలోను, వలస వెళ్ళిన వారి భాషలోను, వారి జ్ఞాపక కథనాలలోను, విడి విడిగా ఉన్న సమాచారాన్ని తనదైన పద్ధతిలో క్రోడీకరించి అన్వయించి చెప్పారు. అలాగే వారి పూర్వీకులు మన ఆంధ్ర ప్రాంతం నుంచి బతుకుతెరువు కోసం తప్పనిసరై ఇతర దేశాలకు వెళ్లడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో వారి పూర్వీకులు కట్టిన గుడి గోపురాలు కట్టిన విధానం, వారి వ్యవసాయ పద్ధతులు, వ్యాపార ధృక్పథం తాను పరిశీలించడం జరిగిందన్నారు. వారి ఆచార వ్యవహారాల్లోనూ జీవన వైవిధ్యం, కళాకారుల ఉత్తమ కృషి, వారి పనితనం మనం స్పష్టంగా చూడ వచ్చునన్నారు. ‘మన్’జాతిలో మనవాళ్ళను, థాయ్లాండ్ ‘చిమ్మయి’ పిల్లను,, ద్వారావతి, హరిపుంజాయి వంటి థాయ్ ప్రాంతాల్లో మన పూర్వీకుల విశేషాలను, తెలుగు చీర చుట్టిన ‘చామదేవి’ చంపాలో ‘భద్రేశ్వరుని’, అక్కడ బంగారు తాపడాలు చేసిన ఘననిర్మాణాలు, శిల్పాలు చెక్కిన తెలుగు సంతతి వారి పూర్వీకుల తపనల స్వరూప విశేషాలను అనూరాధ గారు వివరించారు. శ్రీలంకకు మన శ్రీకాకుళానికి గల సత్సంబంధాన్ని చక్కగా వివరిస్తూ కొన్ని చోట్ల తాను ''మీరెవరు'' అని పలకరించిన వెంటనే ప్రతివారు తమ సమాధానంగా ''అక్కా ''అంటూ ప్రతిస్పందించడం తననెంతో ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఆయాప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివసిస్తున్న తెలుగు వారు తమ భాషా సంస్కృతిని కాపాడుకొంటూ రాబోయే కాలంలో ఏదో ఒకరోజు ఆంధ్రా ప్రాంతమునుంచి ''తలైవా '' అంటే ''తెలుగు మాట్లాడే గౌరవప్రదమైన నాయకుడు'' తప్పకుండా వస్తారనీ వారు తమ ఉనికిని గుర్తిస్తారనే ఆశతో బ్రతుకుతునారని వారి జీవన సరళిని కళ్ళకు కట్టినట్లు విశదీకరించారు. తమిళ జాతి వారితో కలిసి మన తెలుగు వారు నివసిస్తున్న చోట్ల సింహ పురి, దంతపురి పేర్లతో పిలువ బడే నగరాలుండేవని పేర్కొన్నారు. అలాగే ,''విమల''''విజయ''అనే పేరుతో పిలువబడేవారు.. చాలా చోట్ల కనిపించారని, కొన్ని చోట్ల మన తెలుగువారు తమ వారిని ఇంటిలో తెలుగు పేరుతోనూ బయట పని చేసేచోట తమిళ పేరుతోనూ పిలుచుకుంటున్నట్లు చెప్పారు. ఈ విధానాన్ని పాటిస్తున్న వైనం తన దృష్టికి వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. ఆగ్నేయాసియాలో తెలుగు వెలుగుని దేదీప్యమానం చేసే అఖండ తెలుగుజాతి విశేషాలను తాను శోధించిన పలు అంశాలను అనూరాధ గారు సోదాహరణంగా వివరించి సాహితీప్రియుల నుండి విశేష అభినందనలు అందుకొన్నారు.గత 79 మాసాలుగా నిరాటంకంగా నిర్వహిస్తున్న ధారావాహిక ''మన తెలుగు సిరి సంపదలు''శీర్షికన డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి పద ప్రహేళికల కార్యక్రమం రసవత్తరంగా సాగింది. తర్వాత ప్రముఖ సాహితీ విమర్శకులు లెనిన్ వేముల పలనాడు జిల్లా మాచర్ల కేంద్రంగా జన చైతన్య సాహిత్య విస్తృతికి విశేషంగా పాటుపడి, పౌరహక్కుల ఉద్యమాలకు 70వ దశకం నుండి 30 యేళ్ళ సుదీర్ఘ కాలంగా వెన్నంటి నిలిచి, చివరి వరకూ నమ్మిన విలువలకు కట్టుబడి జీవించి నాయకత్వ కుశలతతో ఎందరినో ఉత్తమ ఆశయాల వైపు ఆకర్షింపజేసి గతవారం కన్నుమూసిన కామ్రేడ్ రామినేని సాంబశివరావు కోసం అలనాటి విప్లవ గేయాలనెన్నో ఆలపించి అంజలి ఘటించారు.తరువాత సంస్థ సమన్వయ కర్త దయాకర్ మాడా 2024 సంవత్సరంలో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ మున్నెన్నడూ లేనివిధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలుగు సాహిత్య సదస్సుల విశేషాలనూ ప్రధాన వక్తలైన ముఖ్య అతిథుల ప్రజ్ఞా పాటవాలను ''సింహావలోకనం''లో ఒక్కొక్క నెల వారీగా చక్కగా వివరించారుసంస్థ పూర్వాధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర, చిన్న సత్యం వీర్నాపు , ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి, అనంత్ మల్లవరపు, చంద్రహాస్ మద్దుకూరి, లెనిన్ బండ, మూలింటి రాజ శేఖర్ , మాధవి సుంకిరెడ్డి , భాను, కొల్లారపు ప్రకాశరావు శర్మ, గోవర్ధనరావు నిడిగంటి వంటి సాహితీ ప్రియులు డి పి అనురాధ గారి ప్రసంగంపై తమ తమ ప్రతిస్పందనలు తెలియచేశారు. తర్వాత ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ ప్రస్తుత అధ్యక్షులు సతీష్ బండారు సంస్థ పాలక మండలి సభ్యులు, సమన్వయ కర్త దయాకర్ మాడ ముఖ్య అతిథి డి పి అనురాధ గారికి సంస్థ తరపున సన్మాన పత్ర జ్ఞాపికను చదివి వినిపించి ఘనంగా సన్మానించడం జరిగింది. ఇంతమంది సాహితీప్రియుల మధ్య తనకు జరిగిన ఈ సన్మానం అద్భుతమైన అనుభూతిని మిగిల్చిందని పేర్కొంటూ డి పి అనురాధ తన ప్రతిస్పందనలో కృతజ్ఞతను వెలిబుచ్చారు.చివరగా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ సమన్వయ కర్త దయాకర్ మాడ వందన సమర్పణ గావించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సతీష్ బండారు తమ అధ్యక్షోపన్యాసంలో సంస్థ పూర్వాధ్యక్షులకూ సంస్థ ఔన్నత్యానికి ఆర్ధికంగా తోడ్పడుతున్న దాతలకూ ఇంకా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియ చేశారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ప్రస్తుత అధ్యక్షులు సతీష్ బండారు, సమన్వయ కర్త దయాకర్ మాడా, సంస్థ పాలక మండలి అధికార కార్యవర్గ బృందం సభ్యులకు అభినందనలు తెలిపారు. (చదవండి: ఫిలడెల్ఫియాలో నాట్స్ బాలల సంబరాలకు అద్భుత స్పందన) -
టాంటెక్స్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు
-
తెలుగుభాషకు పట్టం కట్టిన డల్లాస్ సాహితీ సదస్సు
-
డాలస్లో యజ్ఞేశ్వర శతక పద్యగాన మహోత్సవం
డాలస్ (టెక్సాస్): ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) లు సంయుక్తంగా యజ్ఞేశ్వర శతకము పద్యగాన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించాయి. డాలస్ మెట్రో ఏరియాలో ఫ్రిస్కో నగరంలో నెలకొనిఉన్న కార్యసిద్ధి హనుమాన్ దేవాలయంలో వేడుకలు వైభవంగా జరిగాయి. డాలాస్-ఫోర్ట్ వర్త్ తానా ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన సాహితీ ప్రియులందరికీ సాదర స్వాగతం పలికి, తానా మరియు టాంటెక్స్ సంస్థలు కలసి పనిచేస్తూ మున్ముందు కూడా అనేక మంచి కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. అలాగే తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు సారధ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక సాహిత్య, సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం అని, అందరూ తానా కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. సభాధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. జొన్నవిత్తుల మంచి ప్రజాదరణ పొందిన సినిమా పాటలు ఎన్నో రాశారని, సాధారణంగా సినీగీత రచయితలు సినీ రంగానికే పరిమితం అవుతారని కాని కవి జొన్నవిత్తుల అనేక సామాజిక స్పృహకలిగిన పేరడీలు, దండకాలు, దాదాపు 30 శతకాలను రాశారన్నారు. తెలుగువేదకవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ ఈరోజు సకల దేవతా మూర్తులు కొలువైనటువంటి పవిత్ర కార్య సిద్ది హనుమాన్ దేవాలయంలో తనకు దైవదర్శనం ఒక దివ్యమైన అనుభూతినిచ్చింది అని, ప్రకాశరావు గారు హిందూ మతం, ధర్మం కోసం చేస్తున్న కృషి, తపన చాలా గొప్పవని అభినందించారు. జొన్నవిత్తులని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరియు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) కార్యవర్గ బృందం శాలువా, జ్ణాపిక అందించారు. అదే విధంగా 21వ శతాబ్దపు శతక సార్వభౌమ అనే బిరుదుతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రసాద్ తోటకూర, డాక్టర్ పుదూర్ జగదీశ్వరన్, శ్రీకాంత్ పోలవరపు, సతీష్ కొమ్మన, చినసత్యం వీర్నపు, సతీష్ బండారు, భానుమతి ఇవటూరి, సత్యన్ కళ్యాణ్ దుర్గ్, లెనిన్ వేముల, అనంత్ మల్లవరపు, వెంకట్ ములుకుట్ల, లోకేష్ నాయుడు కొణిదల, ఊరిమిండి నరసింహా రెడ్డి, సుబ్రమణ్యం జొన్నలగడ్డ, ప్రకాశరావు వెలగపూడి, లెనిన్ వీర, విజయ్ కొల్లపనేని, కృష్ణమోహన్ రెడ్డి, వెంకట్, డా. రతీరెడ్డి, సాగర్ అండవోలు, చంద్రహాస్ మద్దుకూరి, పాలేటి లక్ష్మి, కళ్యాణి తాడిమేటి తో సహా ఎంతో మంది భాషాభీమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్నవారికి, సభ విజయవంతం కావడానికి సహకరించిన వివిధ కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు డాలస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేశారు. చదవండి: డాలస్లో వైభవంగా శ్రీనివాస కల్యాణం -
మహాత్ముడికి టాంటెక్స్ నివాళులు
టెక్సాస్: జనవరి 30న జాతిపిత గాంధీజీ వర్ధంతి. సత్యం, అహింస మార్గాలే తన ఆయుధాలని చెప్పిన మహోన్నతుడాయన. 20వ శతాబ్దంలో భారత దేశాన్ని బ్రిటిష్ సామ్రాజ్య పాలన నుంచి విముక్తి చేసేందుకు ముందుండి పోరాడారు. చేతిలో కర్ర పట్టుకుని, నూలు వడికి, మురికి వాడలు శుభ్రం చేసి, అన్ని మతాలు, కులాలు ఒక్కటే అని చాటి చెప్పారు, సత్యం, అహింస అనేవి తన ఆయుధాలని చెప్పి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు. బ్రిటిష్ పాలకుల చేతుల్లోంచి భారతమాతకు విముక్తి కలిగించిన మహోన్నతుడు గాంధీ. గాంధీ వర్ధంతి సందర్భంగా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) సభ్యులందరి తరపున టాంటెక్స్ అద్యక్షురాలు లక్ష్మీ అన్నపూర్ణ పాలేటి, సహాయ కార్యదర్శిగా శ్రీకాంత్ రెడ్డి జొన్నల స్థానికంగా జాఫర్ సన్ పార్క్, అర్వింగ్లోని మహాత్ముడి విగ్రహానికి పుష్పగుచ్చం సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల సేవలను గుర్తు చేసుకుంటూ రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. (చదవండి: సాగువీరుడా ! సాహిత్యాభివందనం) -
డల్లాస్లో 160వ తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు
డల్లాస్: ప్రతి ఏటా జరిగే ఈ మాసపు వెన్నెల (నవంబరు) ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో 160వ నెలనెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు డాలస్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి డాలస్ నగర పరిధిలోని తెలుగు వారే కాకుండా ఆస్టిన్, టెక్సాస్ నగరాలకు చెందిన తెలుగు వారు సైతం హజరయ్యారు. సోమవారం జరిగిన ఈ సాహిత్య మాసపు సదస్సు ఎప్పటిలాగే చిన్నారులు సాహితి వేముల, సిందూర వేముల ‘తక్కువేమి మనకూ రాముండొక్కడుండు వరకూ’ అనే రామదాసు కీర్తన ఆలాపనతో ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ద్రవిడ విశ్వ విద్యాలయ పూర్వ ఉపకులపతి ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మనుచరిత్ర-తాత్విక ప్రతీకాత్మకత అన్న అంశంపై ప్రసంగించారు. దీనిపై ఆయన పరిపూర్ణాభ్యాసం, విస్తారమైన సాహిత్య విశ్లేషణ నేపథ్యంలో ఆచార్యులు మనుచరిత్ర రచనపై లోతైన చర్చ చేశారు. అల్లసాని వారి కావ్యంలోని రహస్యాలనెన్నో విప్పి చెప్పి సాహిత్య విజ్ఞానాన్ని సభలో పంచుకున్నారు. భాషాశాస్త్రం, పదాల ఉత్పత్తి, భారతీయ ఇతర భాషా సాహిత్యాలు, తెలుగు సాహిత్య చరిత్ర లాంటి అంశాలపై వారికున్న లోతైన పరిచయాన్ని మనుచరిత్ర కావ్య విశ్లేషణకు సాధనాలుగా ఉపకరించాయి. అల్లసాని వారు కథానాయకుడి పేరును ప్రవరుడుగా నామకరణం చేసిన నేపథ్యాన్ని ఆచార్యులు అద్భుతంగా సభలో అందరికి వివరించారు. చివరిలో ఆయన సత్చిత్ ఆనంద్ అనే పదాలు భారతీయ ఆధ్యాత్మిక చింతనాసరళికి ఏవిధంగా స్పష్టతను చేకూర్చాయో విశదీకరించారు. ప్రధాన వక్త ప్రసంగానికి ముందు ప్రతీ మాసం ఎంతో ఆదరణ పొందుతున్న “మనతెలుగు సిరి సంపదలు” ధారావాహికలో భాగంగా ఉరుమిండి నరసింహా రెడ్డి జాతీయాలు, పొడుపు కథల పరంపరను కొనసాగించారు. తెలుగు సాహిత్య ప్రపంచంలోని ప్రసిద్ద కవితాపంక్తులను, ప్రశ్నలు జవాబుల రూపంలో సంధిస్తూ సభకు హాజరైన వారిని చర్చలో భాగస్వామలు చేశారు. ఇక ఉపద్రష్ట సత్యం ‘పద్య సౌగంధం’శీర్షికన సాహితీ సమరాంగణ సార్వభౌముడు విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యదలోని పద్యాలను విశ్లేషించారు. పక్షి రాజు గరుత్మంతుడి శక్తిని విశ్వరూపదర్శనంగా చూపిన రాయల వారి కావ్యరచనలోని అర్థాలను, అలంకారాలను ఆయన చక్కగా వివరించారు. అదే విధంగా జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం ‘మాసానికో మహనీయుడు’ అనే శీర్షిక కొనసాగింపుగా, నవంబరు మాసంలో జన్మించిన తెలుగు సాహితీ మూర్తులను ప్రజెంటేషన్ ద్వారా సభలో గుర్తుకు తెచ్చారు. అనంతరం డాక్టర్ బల్లూరి ఉమాదేవి కార్తీక మాసవైశిష్ట్యాన్ని గుర్తు చేస్తూ.. వారు రాసిన స్వీయ పద్యకవితను పఠించారు. మరొక అంశంలో లెనిన్ బాబు వేముల కాళిదాస మహాకవి ఇప్పుడున్న భారతంలోని ఏ ప్రాంతపు వాడయి ఉంటాడో అన్న అంశంపై చర్చ జరిపారు. ఈ సదస్సు చివరిలో ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షులు కృష్ణా రెడ్డి కోడూరు మాట్లాడుతూ.. సదస్సులో ముఖ్య అతిధిగా పాల్గొన్న ద్రవిడ విశ్వ విద్యాలయ పూర్వ ఉపకులపతి ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారికి, ప్రార్థనా గీతం పాడిన సాహితి,సింధూరలతో పాటు మిగిలిన వక్తలకు, సభకు హజరైన సాహిత్య అభిమానులందరికి ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం కార్యవర్గం, పాలక మండలి తరుపున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
టాంటెక్స్ ఆధ్వర్యంలో తెలుగువెన్నెల సాహిత్య సదస్సు
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో 158వ ‘నెల నెలా తెలుగు వెన్నెల’ సాహిత్య సదస్సు డల్లాస్లో చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రొఫెసర్ మేడిపల్లి రవికుమార్ విచ్చేసి “ఆధునికతకు అడుగుజాడ-గురజాడ” అన్న అంశం మీద మాట్లాడటం జరిగింది. ఈ మాసపు నెలనెలా తెలుగు వెన్నెల నవయుగ కవి, వైతాళికుడు గురజాడ అప్పారావు స్మరణతో ఆసాంతం నిండుగా సాగింది. గురజాడ వారి జయంతి ఈ మాసంలోనే ఉండడం వక్తలకు ఆ మహాకవి ఆశయాల పునఃచర్చపై ఉత్సాహాన్ని కలిగించింది. ప్రారంభంలో చిన్నారులు సాహితి , సిందూర “శివుడు తాండవము సేయునమ్మా” అంటూ పరమేశుడి పై భక్తి గీతం పాడడం జరిగింది. ఎప్పూడూ చివరి అంశంగా ఉండే ప్రధాన వక్త ప్రసంగం ఈ మారు మొదటి అంశంగా ఉండడం ఒక విశేషమైతే అద్భుతమైన పాండిత్యంతో కూడిన ప్రసంగాన్నందిన ప్రొఫెసర్ మేడిపల్లి రవికుమార్ ధాటి ఎన్నదగిన మరొక విశేషం. “ఆధునికతకు అడుగుజాడ-గురజాడ” అన్న అంశం పై చర్చ చేస్తూ రవికుమార్ గురజాడ కేవలం వైతాళికుడే కాక, ముందు చూపు గలిగిన గొప్ప తాత్వికుడు అని గుర్తుచేయడం జరిగింది. సమకాలీన సమాజంలో పీడనకు గురైన స్త్రీ జాతిని మొదటగా జాగృతం చేసిన ఒక యోధుడుగా గురజాడ వారిని తలచుకోవడం జరిగింది. ఎప్పటివలెనే “మనతెలుగు సిరి సంపదలు” శీర్షికన జాతీయాలు, పొడుపు కథల పరంపరను ఉరుమిండి నరసింహా రెడ్డి కొనసాగించారు. వాటికి తోడుగా తెలుగు సాహితీ జగత్తులోని ప్రసిద్ద కవితా పంక్తులను, కొన్ని ప్రహేళికలను ప్రశ్నలు జవాబుల రూపంలో సదస్యులందరినీ చర్చలో భాగస్వాములును చేయడం జరిగింది. ఉపద్రష్ట సత్యం పద్య సౌగంధం శీర్షికన మల్లిఖార్జున భట్టు విరచిత భాస్కరరామాయణంలోని చక్కని శార్దూల పద్యాన్ని అర్థతాత్పర్య సహిత విశేషాలతో వివరించడం జరిగింది. సీతను చెరబట్టడం అతడి నాశనానికే అని హనుమంతుల వారు రావణుడికి చేసిన హెచ్చరికయే పద్యంలోని సారాంశంగా ఉపద్రష్ట వారు వివరించారు. జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం “మాసానికో మహనీయుడు” అనే శీర్షక కొనసాగింపుగా, సెప్టెంబరు మాసంలో జన్మించిన తెలుగు సాహితీ మూర్తులను ప్రజెంటేషన్ ద్వారా సభకు గుర్తు చేసి స్మరణకు తెచ్చారు. గురజాడ, జాషువా లాంటి ఎందరో మహనీయులు జన్మించిన మాసమిదని సుబ్రహ్మణ్యం సభకు గుర్తు చేశారు. చివరి రెండు అంశాలుగా లెనిన్ బాబు వేముల, మద్దుకూరి చంద్రహాస్ గురజాడ వారిని, ప్రారంభ దశలో వారు రాసిన రచనలనూ, ఆంగ్ల సాహిత్యం పై వారి ప్రవేశాన్ని గురించి సహృదయంతో గుర్తు తెచ్చి నివాళులర్పించారు. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీ కృష్ణా రెడ్డి కోడూరు ముఖ్య అతిధి శ్రీ ప్రొఫెసర్ మేడిపల్లి రవికుమార్కి, ప్రార్థనా గీతం పాడిన సాహితి,సింధూరలకి, మిగిలిన వక్తలకి,విచ్చేసిన సాహిత్య అభిమానులకి ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం కార్యవర్గం, పాలక మండలి తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి స్థానిక సాహిత్య ప్రియులు మాధవి రాణి, శశికళ పట్టిసీమ, విష్ణు ప్రియ, మాధవి ముగ్ధ ,శ్రీనివాస్ బసాబత్తిన, ప్రసాద్ తోటకూర, సురేష్ కాజా, చంద్రహాస్, ఆచార్యులు జగదీశ్వరన్ పూదూరు, ఉత్తరాధ్యక్షురాలు లక్ష్మి పాలేటి, పూర్వాధ్యక్షుడు చిన సత్యం వీర్నపు,తెలుగు, సునిల్ కుమార్,తవ్వా వెంకటయ్య ,సుబ్బ రాయుడు ,బసవ రాజప్ప తదితర్లు హాజరయ్యారు. -
'నెల నెలా తెలుగు వెన్నెల' సాహిత్య సదస్సు
డల్లాస్: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) ఆధ్వర్యంలో 13వ సాహిత్య సదస్సు వార్షికోత్సవం ఘనంగా జరిగింది. 156వ "నెల నెలా తెలుగు వెన్నెల" సాహిత్య సదస్సును వారాంతంలో డల్లాస్లో నిర్వహించారు. జూమ్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి డా.కె.గీతా మాధురి, శారదా కాసీవజ్జల ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వేములపల్లి శ్రీకృష్ణ రచించిన "చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి కలవోడా" అనే ప్రార్థనా గీతంతో సాహితి, సింధూ ఈ కార్యక్రమాన్ని ఆరంభించారు. అనంతరం డా.ఊర్మిండి నరసింహా రెడ్డి మన తెలుగు సిరిసంపదలు అనే జాతీయాలను, పొడుపు కథలను వివరించారు. డాక్టర్ ఉపద్రష్ట సత్యం శ్రీకృష్ణదేవరాయల “ఆముక్త మాల్యద” ప్రబంధం నుండి – “పూచినమావులం దవిలి.. పరుమేలు తీరినన్” అన్నవసంతఋతు వర్ణన పద్యాన్ని భావయుక్తం గా చదివి అందులోని విశేషాలను వివరించారు. ఆ పద్యంలో రాయలవారు “శ్రీచణుడు” అన్న అద్భుతమైన పదప్రయోగంతో ఆదిశంకరులవారి సౌందర్యలహరిలోని “ధనుః పౌష్పం... మనంగో విజయతే” అన్న ఒక శోభాయమానమైన శ్లోకాన్ని ధ్వనింపజేశారని చెబుతూ ఆ శ్లోక భావాన్ని రసవత్తరంగా విశదీకరించారు. ఆ తర్వాత రాయలవారి ‘భువన విజయ’ సన్నివేశంలో నుంచి ఆణిముత్యం లాంటి తెనాలి రామకృష్ణుల “కలనన్ తావక ఖడ్గ ఖండిత... కృష్ణరాయాధిపా!" అన్న పద్యాన్ని రాగ, భావయుక్తంగా ఆలపించి, సందర్భసహిత వ్యాఖ్యానం చేసి సభికులను రంజింపజేశారు. ఇలాటి పద్యాలను మనం అప్పుడప్పుడు చదువుతుంటే వాటిల్లోని రసజ్ఞత పఠితలకు, శ్రోతలకు కూడా అద్భుతమైన జీవశక్తినందిస్తుందని ఉద్ఘాటించారు. కర్నాటక సంగీత సంప్రదాయంలో త్రిముూర్తులుగా కొలవబడే ముగ్గురు వాగ్గేయకారులలో అగ్రజుడు శ్రీ శ్యామశాస్త్రి. రాశిలో తక్కువైనా వాసిలో మాత్రం గొప్పవిగా ఉండే కృతులను శ్యామశాస్త్రి వెలువరించారు. కంచి కామాక్షి అమ్మవారిపై వారు సృజించిన భైరవి రాగ స్వరజతి విశేషాన్ని ఈ వేదికపై లెనిన్ బాబు వేముల భావ సహితంగా స్తుతించారు. ఆ తర్వాత శారద కాసీవఝ్ఝల గారు మాతృ భాష మనుగడకు మనవంతు బాధ్యత అనే అంశం మీద మాట్లాడుతూ వ్యక్తులుగా, సమూహాలుగా, సంస్థలుగా, ప్రభుత్వాలు చేయవల్సిని బాధ్యతలని వివరించారు . 156 వ నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు సందర్భంగా “దేవులపల్లి కృష్ణశాస్త్రి లలితగీతాలు” అనే అంశంపై ప్రధాన ప్రసంగం చేసిన కె.గీత మాట్లాడుతూ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కవిత్వం అంటే అత్యంత తియ్యదనం, అనంతమైన అనుభూతి, అవధుల్లేని ప్రేమ, విహ్వల బాధ, అలవికాని వేదన మిళితమైన కరుణ రస మాధుర్యామృతం అని పేర్కొన్నారు. కృష్ణశాస్ర్తిగారు రాసిన ఏ పాట విన్నా రాసినప్పటి భావోద్వేగం అదే మోతాదులో శ్రోతల హృదయాల్లో కలగడం గమనార్హమని, పదాల్లోని కన్నీటి చెలమలు గుండె చాటు చెమ్మని అడుగడుగునా గుర్తుచేస్తాయని అన్నారు. ఆయన రాసిన అమృతవీణ వంటి సుమధుర గీతాల్ని, “కృష్ణపక్షము”, “మంగళ కాహళి” నుంచి భావ, అభ్యుదయ కవితల్ని సభకు పరిచయం చేశారు. కృష్ణశాస్త్రి గారి లలిత గీతాల్లోని విలక్షణ పదజాలాన్ని, లాలిత్యాన్ని , సాహిత్య, సంగీత విశిష్టతల్ని పేర్కొనడమే కాకుండా, రసవత్తరంగా ఆలపిస్తూ చేసిన గీతగారి ప్రసంగం అందరినీ విశేషంగా అలరించింది. తనకు సంగీతం, సాహిత్యం రెండుకళ్లుగా ఉగ్గుపాలతో అబ్బిన విద్యలుగా పేర్కొంటూ, అందుకు దోహదం చేసిన వారి మాతృమూర్తి, గురువు, ప్రముఖ కథారచయిత్రి శ్రీమతి కె.వరలక్ష్మిగారికి సభాపూర్వకంగా నమోవాకాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి అనేక మంది సాహిత్య ప్రియులు హాజరై సాహిత్య సదస్సును విజయవంతం చేశారు. స్థానిక సాహిత్య ప్రియులకు, విచ్చేసిన ముఖ్య అతిథులు డా.కె.గీత, శారద కాసీవఝ్ఝలకు, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం పోషక దాతలకు ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షులు కృష్ణా రెడ్డి కోడూరు ధన్యవాదాలు తెలిపారు. -
టాంటెక్స్ ఆధ్వర్యంలో తెలుగువెన్నెల సాహిత్య సదస్సు
డాలస్ : ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం(టాంటెక్స్) ఆధ్వర్యంలో నెల నెలా తెలుగు వెన్నెల153 వ సాహిత్య సదస్సు ఏప్రిల్ మూడవ ఆదివారం ఆన్ లైన్లో డాలస్లో ఘనంగా నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 153 నెలల పాటు ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించడం ఈ సంస్థ యొక్క విశేషం. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో 153వ సాహిత్య సదస్సుని ఆన్లైన్లో ఘనంగా నిర్వహించిన ఘనత ఉత్తర టెక్సస్ తెలుగు సంఘానికే దక్కుతుంది. ముందుగా సాహిత్య సమన్వయకర్త మల్లిక్ కొండా ఆధ్వర్యంలో చిన్నారుల ప్రార్థనా గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సత్యం, డాక్టర్ ఉర్మిండి నర్సింహారెడ్డి, భాషా శాస్త్రవేత్త భద్రిరాజు కృష్ణమూర్తి, డాక్టర్ బల్లూరి ఉమాదేవి, అయినంపూడి శ్రీలక్ష్మి, అనంత్ మల్లవరపు తదితరులు పాల్గొని తమ కార్యక్రమాలతో వీక్షకులను ఆనందింపజేశారు. కార్యక్రమం చివర్లో ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షుడు కృష్ణారెడ్డి కోడూరు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన పాలగుమ్మి రాజగోపాల్కు, ఆన్లైన్ కార్యక్రమంలో పాల్గొన్న సాహితీ ప్రియులందరికి కృతజ్ఞతలు తెలిపి ముగించారు. -
టాంటెక్స్ ఆధ్వర్యంలో తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు
డల్లాస్ : తెలుగు సంఘం సాహిత్య వేదిక (టాంటెక్స్) ఆధ్వర్యంలో నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు ఆదివారం ఫిబ్రవరి 23న డల్లాస్లోని శుభం ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సాహిత్య వేదిక సమన్వయకర్త మల్లిక్ రెడ్డి కొండా, కృష్ణ రెడ్డి కోడూరు అధ్యక్షతన జరిగింది. కాగా ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విజయా సారధి జీడిగుంట విచ్చేశారు. వీరు ముందు గా ప్రార్ధన గీతం తో సభను ప్రారంభించారు . ఈ సదస్సుకు సాహితీ వేత్తలు భాషాభిమానులు విచ్చేసారు. కార్యక్రమం ఆసాంతం వాల్మీకీ రామాయణం, అన్నమాచార్య కీర్తనలు, అనంతరం విజయ సారధి జీడిగుంట 'నన్నయ కవితా రీతులు-పామరుని విశ్లేషణ' అంశం పై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మల్లిక్ రెడ్డి కొండా, కృష్ణ రెడ్డి, విజయ్ సారధి, ఎన్ఆర్యూ,లెనిన్,సుబ్బు,చినసత్యం,ప్రసాద్తోటకూర,సుధా కల్వకుంట,రాజారెడ్డి, ఉమాదేవి,శరత్, వెంకట్,అశ్వని వెలివేటి,రవి పట్టిసం,శశి పట్టిసం,వేణు భీమవరపు,విష్ణుప్రియ తదితరులు పాల్గొన్నారు. -
టాంటెక్స్ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు
డల్లాస్: సూర్యుడు మకరరాశిలో చేరగానే వచ్చే పెద్ద పండగ సంక్రాంతి. ఈ పండగ తెలుగువాళ్లకు ఎంతో ఇష్టం అన్న విషయం తెలిసిందే. భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగను ప్రజలు ఎంతో ఘనంగా జరుగుపుకుంటారు. అమెరికాలోని తెలుగువారి కోసం.. అతిపెద్ద తెలుగు సంస్థలలో ఒకటైన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించింది. స్థానిక నిమిట్స్ హైస్కూల్లో అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో, చూడముచ్చటైన సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ కార్యక్రమంలో అచ్చమైన తెలుగు వాతావరణాన్ని ప్రతిబింబించేలా పాటలు, సంగీత, సాంస్కృతిక, నృత్య కార్యక్రమాలు అందరిని అలరించాయి. ఈ సంక్రాంతి సంబరాలను ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) అధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు ఆధ్వర్యంలో కార్యవర్గ, పాలకమండలితో పాటు సమన్వయ కర్తలు తోపుదుర్తి ప్రబంద్, జొన్నలగడ్డ శ్రీకాంత్, సాంస్కృతిక సమన్వయ కర్త స్రవంతి యర్రమనేని నిర్వహించారు. ఈ కార్యక్రమం చిన్నారులు ఆలపించిన అమెరికా జాతీయ గీతంతో ప్రారంభమైంది. ఈ వేడుకలల్లో ముద్దుగారే యశోద, వందే మీనాక్షి, కృష్ణాష్టకం, మాస్ ఈజ్ గ్రేట్, చరణములే నమ్మితి అనే స్థానిక కళాకారుల నాట్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అదేవిధంగా ఈ కార్యక్రమనికి ప్రధాన వ్యాఖ్యాతగా వ్యవహరించిన సమీర ఇల్లెందుల ఆద్యంతం నవ్వుల పువ్వులు పూయించారు. గాయని, గాయకులు దామిని భట్ల, ధనుంజయ్ పాడిన పాటలు అరించాయి. టాంటెక్స్ తక్షణ పూర్వాధ్యక్షులు చినసత్యం వీర్నపు మాట్లాడుతూ.. గత ఏడాది నిర్వహించిన కార్యక్రమాల గురించి వివరించారు. సంస్థకి సేవ చేయడం తన అదృష్టమని ఆయన అన్నారు. అనంతరం 2020వ సంవత్సరానికి టాంటెక్స్ అధ్యక్షులుగా ఉన్న కృష్ణారెడ్డి కోడూరు మాట్లాడుతూ.. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) సంస్థని సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితం చేయకుండాదన్నారు. తమ కార్యవర్గం, పాలకమండలి, సంస్థ సభ్యులని కలుపుకొని ఈ సంస్థను సేవారంగంలో కూడా ముందుంచి ఘన చరిత్రని కాపాడడానికి నిరంతరం శ్రామికుడిగా కష్టపడతానని తెలిపారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్)ను తనకున్న అనుభవంతో, సమాజంలో ఉన్న పరిచయాలతో మరింత సేవాతత్పరత కలిగిన సంస్థగా తీర్చిదిద్దుతానని ఆయన తెలిపారు. తర్వాత 2020 కార్యవర్గం, పాలక మండలి బృందాన్ని ఆయన సభకు పరిచయం చేశారు. సంక్రాంతి సంబరాలకి పసందైన పండుగ భోజనాన్ని వడ్డించిన బావార్చి అర్వింగ్ వారికి ఉత్తర టెక్సాస్ కార్యవర్గం, పాలక మండలి తరుఫున ఆయన కృతఙ్ఞతలు తెలిపారు. టాంటెక్స్ వారి సంక్రాంతి సంబరాలకి విచ్చేసి ఎంతో ఓపికగా నాలుగు గంటల వినోదాన్ని ఆస్వాదించిన ప్రేక్షకులకి, అతిధులకి, పోషకదాతలకి అధ్యక్షుడు కృష్ణారెడ్డి కోడూరు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఈ కార్యక్రమ నిర్వహణకు స్పాన్సర్లుగా వ్యవహరించిన నిజెల్ భవన నిర్మాణ సంస్థ, శరత్ యర్రం, రాం మజ్జి, టాంటెక్స్ సంస్థ డైమండ్ పోషకదాతలైన తిరుమల్ రెడ్డి కుంభం, ప్లాటినం పోషక దాతలైన బావార్చి అర్వింగ్ ఇండియన్ రెస్టారెంట్, క్వాంట్ సిస్టమ్స్, ప్రతాప్ భీమి రెడ్డి, విక్రం జంగం, డా. పవన్ పామదుర్తి, శ్రీకాంత్ పోలవరపు, అనిల్ యర్రం, ఆనంద్ దాసరి, డీఎంఆర్ డెవలపర్స్ , గోల్డ్ పోషకదాతలైన పసంద్ విందు, మై ట్యాక్స్ ఫైలర్, రాం కొనారా, స్వదేశి రమేష్ రెడ్డి , బసేరా హరి, కిషోర్ చుక్కాల ,టెక్ లీడర్స్ దేవేంద్ర రెడ్డి, సిల్వర్ పోషకదాతలైన మురళి వెన్నం, డా.భాస్కర్ రెడ్డి సానికొమ్ము, పెంటా బిల్డర్స్, ఒమేగా ట్రావెలర్స్, అవాంట్ టాక్స్, విశ్వభారత్ రెడ్డి కంది, శ్రీకాంత్ గాలికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సంకక్రాంతి వేడుకులకు సహకరించిన మీడియా పార్ట్నర్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన గాయని, గాయకులు దామిని భట్ల, ధనుంజయ్లతో పాటుగా వ్యాఖ్యాత సమీర ఇల్లందుని సన్మానించారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా తెరవెనుక నుంచి సేవలందించిన కార్యకర్తలందరికీ తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం భారతీయ జాతీయగీతం ఆలాపనతో అత్యంత శోభాయమానంగా సాగిన సంక్రాంతి సంబరాలు ముగిశాయి. -
టాంటెక్స్ 2020 నూతన కార్యవర్గం
టెక్సాస్: తెలుగు సంస్కృతికి, తెలుగు భాషకు ఎల్లప్పుడూ పట్టం కట్టే ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్)-2020 సంవత్సరానికి ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని జనవరి 5న డాలస్లో జరిగిన గవర్నింగ్ బోర్డు సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడుగా కృష్ణారెడ్డి కోడూరు పదవీబాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టాంటెక్స్ అధ్యక్షుడిగా పదవీబాధ్యతలు చేపట్టడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఉత్తర అమెరికాలోనే ప్రతిష్టాత్మక సంస్థ అయిన టాంటెక్స్ను ముందుండి నడపవలసిన బాధ్యతను తన మీద పెట్టినందుకు టాంటెక్స్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ ప్రమాణాలను మరింత పెంచే దిశగా ఈ సంవత్సరం నూతన కార్యక్రమాలను చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కొత్త పాలక మండలి, కార్యవర్గ బృందాల సూచనలు, సహాయ సహకారాలతో, సరికొత్త ఆలోచనలతో ఈ ఏడాదిలో అందరిని అలరించే కార్యక్రమాలు చేయనున్నామన్నారు. దీనికి స్థానిక తెలుగు వారి ఆశీస్సులు, ఆదరణ తప్పక ఉంటాయని ఆశిస్తున్నానని సంస్థ నూతన అధ్యక్షులు కృష్ణా రెడ్డి కోడూరు తెలిపారు. గతేడాది టాంటెక్స్ అధ్యక్షులుగా పనిచేసి పదవీ విరమణ చేస్తున్న చినసత్యం వీర్నపు మాట్లాడుతూ.. కృష్ణా రెడ్డి కోడూరు నేతృత్వంలో ఏర్పడిన 2020 కార్యవర్గ బృందం నిర్వహించబోయే కార్యక్రమాలకు నా సంపూర్ణ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ సందర్భంగా ప్రసార మాధ్యమాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. టాంటెక్స్ నూతన అధికారిక కార్యనిర్వాహక బృందం అధ్యక్షుడు: కృష్ణా రెడ్డి కోడూరు ఉత్తరాధ్యక్షురాలు: లక్ష్మి పాలేటి ఉపాధ్యక్షులు: ఉమా మహేష్ పార్నపల్లి కార్యదర్శి: సతీష్ బండారు కోశాధికారి: శరత్ ఎర్రం సంయుక్త కార్యదర్శి: మల్లిక్ కొండా సంయుక్త కోశాధికారి: కల్యాణి తాడిమేటి తక్షణ పూర్వాధ్యక్షులు: చిన సత్యం వీర్నపు మిగతా సభ్యులు: శ్రీకాంత్ రెడ్డి జొన్నల, చంద్ర పొట్టిపాటి, రఘునాధ రెడ్డి కుమ్మెత్త, స్రవంతి ఎర్రమనేని, సరిత కొండా, ప్రభాకర్ రెడ్డి మెట్టా, చంద్రారెడ్డి పోలీస్, వెంకట్ బొమ్మా, జనార్దన్ యెనికపాటి, లోకెష్ నాయుడు కొణిదల, నాగరాజ్ చల్లా, ఉదయ్ నిడగంటి, భాను ప్రకాష్ వెనిగల్ల. నూతన పాలక మండలి బృందం అధిపతి: పవన్ రాజ్ నెల్లుట్ల ఉపాధిపతి: డా. పవన్ పామదుర్తి మిగతా సభ్యులు: శ్రీకాంత్ పోలవరపు, వెంకట్ ములుకుట్ల, ఇందు రెడ్డి మందాడి, శ్రీలక్ష్మి మండిగ, ఎన్ఎంఎస్ రెడ్డి. -
టాంటెక్స్ ఆధ్వర్యంలో 'తెలుగు సాహిత్య సదస్సు'
డల్లాస్ : ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం(టాంటెక్స్) ఆధ్వర్యంలో 'నెల నెలా తెలుగు వెన్నెల' సాహిత్య సదస్సు డిసెంబర్ 15న వీర్నపు చినసత్యం అధ్యక్షతన డల్లాస్లో ఘనంగా నిర్వహించారు. ప్రవాసంలో నిరాటంకంగా 149 నెలల పాటు ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించడం గొప్ప విశేషం. ఈ కార్యక్రమానికి భాషాభిమానులు, సాహిత్య ప్రియులు అధిక సంఖ్యలో హాజరై సమావేశాన్ని జయప్రదం చేశారు. కార్యక్రమంలో ముందుగా ప్రముఖ సాహితీవేత్త, ప్రముఖ రంగస్థల నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి డా. గొల్లపూడి మారుతీరావు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఘనమైన నివాళులు అర్పించారు. గొల్లపూడి ఆకస్మిక మృతి మా అందరిని విషాదానికి గురి చేసిందని ప్రముఖ రంగస్థల నటుడు రామచంద్రనాయుడు పేర్కొన్నారు. కాగా, టాంటెక్స్ మొట్టమొదటి సాహిత్య వేదికను గొల్లపూడి ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఆ తర్వాత వేముల సాహితీ, వేముల సింధూర ' శ్రీరామదాసు ' కీర్తనలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. మన తెలుగు సిరి సంపదలు, నానుడి, జాతీయాలు, పొడుపు కథలు అడిగి డా. ఉరిమిండి నరసింహరెడ్డి సభికులను ఆసక్తి రేకెత్తించారు. టాంటెక్స్ అధ్యక్షులు వీర్నపు చినసత్యం సంహావలోకనం శీర్షికన గత 11 నెలలుగా నిర్వహించిన సాహిత్య సదస్సులకు విచ్చేసిన ముఖ్య అతిథులు, వారు మాట్లాడిన అంశాలను టూకీగా వివరించారు. ఈ సంవత్సరం మీ అందరి సహకారంతో ఎంతోమంది అతిథులను మన వేదికపైకి తీసుకొచ్చామని తెలిపారు. అలాగే జాతీయ సంస్థలు తానా, నాట్స్తో కలిసి టాంటెక్స్ సంయుక్తంగా ఎన్నో సాహిత్య సదస్సులు నిర్వహించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నందివాడ భీమారావు గారిని వీర్నపు చినసత్యం సభకు పరిచయం చేశారు. ఆ తర్వాత నందివాడ భీమారావు రచించిన ' ది ఆర్ట్ ఆఫ్ ది ఇంపాసిబుల్' పుస్తకావిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కన్నెగంటి చంద్రశేఖర్, తోటకూర ప్రసాద్, జొన్నలగడ్డ సుబ్రమణ్యం, ఉరిమిండి నరసింహరెడ్డి, ఆనందమూర్తి, లలితామూర్తి కూచిబొట్ల, సతీష్ బండారు తదితరులు పాల్గొన్నారు. -
డల్లాస్లో ఘనంగా ప్రాథమిక యోగా శిక్షణా సదస్సు
టెక్సాస్: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్), ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) డల్లాస్లో ప్రాథమిక యోగా శిక్షణా సదస్సు నిర్వహించింది. జెన్స్టార్ మాంటెస్టరీ అకాడమీలో సభ్యుల ఆరోగ్య అవగాహన కోసం డిసెంబరు 14న ఏర్పాటు చేసిన ప్రాథమిక యోగా శిక్షణా సదస్సు అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంతో ఘనంగా జరిగింది. ప్రస్తుత టాంటెక్స్ అధ్యక్షులు చినసత్యం వీర్నపు, కళ్యాణి తాడిమేటి (సుఖీభవ కమిటీ సమన్వయ కర్త), సాంబ దొడ్డ(తానా SW region RVP) అందరికి స్వాగతం పలికారు. టాంటెక్స్, తానా నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించి సభకు టాంటెక్స్, తానా కార్యవర్గ సభ్యులను పరిచయం చేసి, వారి సహాయ సహకారాలతోనే ఇటువంటి మంచి కార్యక్రమాలను మీ ముందుకు తీసుకురాగలుగుతున్నాం అని చెప్పారు. తదుపరి దత్త యోగా క్రియ టీచర్స్ ప్రశాంత దుల్లూర్, శివరాజు జయన్నలను సభకు పరిచయం చేసి కార్యక్రమం ప్రారంభించారు. యోగా టీచర్స్ ప్రశాంత్ దుల్లూర్, శివరాజు జయన్న ముందుగా టాంటెక్స్, తానా వారికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం యోగా ప్రక్రియ గురించి యోగా వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. నాడి సుద్ధి వ్యాయమాన్ని అందరికీ ఎలా చేయాలో చూయించి అందరూ ఆ వ్యాయామాన్ని ఎవరికి వారు చేయగలిగేలా నేర్పించారు. అలాగే ఆసనాలు, సూర్య నమస్కారాలు వాటివల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. సూర్యనమస్కారాల వల్ల జీర్ణశక్తి పెరుగుతుందని శరీరంలో నాడులన్నీ చక్కగా పనిచేస్తాయని మలబద్ధకం లాంటి రోగాల నుంచి ఉపశమనం కలుగుతుందని తెలియజేశారు. యోగా మనకి పూర్వీకులు అందించిన మంచి ప్రక్రియ అని దాన్ని మనం సక్రమంగా వాడుకోగలిగితే మంచి ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఉంటాయని తెలియజేశారు. చివరిగా ప్రాణాయమ ప్రక్రియను నేర్పి మన శరీరంలో ప్రతి అవయవం మన శ్వాసతో కలిసి పనిచేస్తుందని సరైన శ్వాసతో నాడులు పనితీరును యోగా ప్రక్రియ ద్వారా మెరుగుపర్చుకోవచ్చని తెలియజేశారు. అక్కడకు వచ్చిన సభ్యులు అందరూ ఎంతో ఓపికగా యోగాలో మెళకువలను నేర్పిన యోగా టీచర్స్కు ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్య అతిథులుగా వచ్చిన యోగా టీచర్స్ ప్రశాంత్ దుల్లూర్, శివరాజు జయన్నలను టాంటెక్స్ అధ్యక్షులు వీర్నపు చినసత్యం, సాంబ దొడ్డ (తానా sw region rvp), శ్రీకాంత్ పోలవరపు(తానా ఫౌండేషన్ డైరెక్టర్), కళ్యాణి తాడిమేటి(సుఖీభవ కమిటీ సమన్వయకర్త) శాలువా, జ్ఞాపిక ఇచ్చి సత్కరించారు. టాంటెక్స్ అధ్యక్షులు వీర్నపు చినసత్యం మాట్లాడుతూ యోగా టీచర్స్ ప్రశాంత్ దుల్లూర్, శివరాజు జయన్న సేవలను కొనియాడారు. టాంటెక్స్, తానా తరపున యోగా కార్యక్రమం చేయడానికి సహకరించినందుకు చాలా ఆనందంగా ఉందని, ఇటువంటి కార్య్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించినవారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంబ దొడ్డ, శ్రీకాంత్ పోలవరపు, మురళి వెన్నం, కళ్యాణం తాడవిమేటి తదితరులు పాల్గొన్నారు. ఎంతో కృషి, సమయం వెచ్చించిన టాంటెక్స్, తానా కార్యవర్గ సభ్యులకు వివిధ కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
వికలాంగుల కష్టాలు తీర్చే వైకుంఠం ‘విర్డ్’ ఆసుపత్రి
డాలస్: ఒక లక్షా 20వేలకు పైగా అంగవికలురకు విజయవంతంగా ఎముకల శస్త్రచికిత్సలు నిర్వహించిన ప్రముఖ వైద్యుడు డా.గుడారు జగదీష్ నేతృత్వంలో పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో నిర్వహిస్తున్న వెంకటేశ్వర అంగవైకల్య శస్త్రచికిత్స పరిశోధనా పునరావాస ఆసుపత్రికి(Venkateswara Institute For Rehabilitation & Research of the Disabled-VIRRD) డాలస్లో ఆదివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ప్రవాసులు రూ.60లక్షలను విరాళంగా ప్రకటించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా), ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్)లు ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహించాయి. కార్యక్రమాన్ని తానా ప్రాంతీయ ప్రతినిధి దొడ్డా సాంబ ప్రారంభించారు. తానా డైరక్టర్ల బోర్డు కార్యదర్శి వెన్నం మురళీ మాట్లాడుతూ నిస్వార్థంగా పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న డా.గుడారు జగదీష్ వంటి వారి ఆధ్వర్యంలో ముందుకు సాగుతున్న ఆసుపత్రికి డాలస్ ప్రవాసులు తోడ్పడం ఆనందంగా ఉందన్నారు. తానా మాజీ అధ్యక్షుడు డా.తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ 2013లో డాలస్లో జరిగిన తానా సభల్లో డా.గుడారుకి పురస్కారాన్ని అందించి గౌరవించుకున్నామని, 2017లో ఏలూరులో జరిగిన అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా మరో పురస్కారంతో ఆయన్ను రెండుసార్లు గౌరవించుకునే అవకాశం దక్కిందని అన్నారు. అకుంఠిత దీక్షతో, క్రమశిక్షణ, సాంత్వన కలిగిన మాటతీరుతో అంగవైకల్యం బాధపడే లక్షల మంది జీవితాల్లో ఆనందాన్ని నింపి వారి సొంత కాళ్లపై వారు నిలబడేలా చేసిన దేవుడు డా.గుడారు అని ఆయన కొనియాడారు. అనంతరం డా.జగదీష్ను తోటకూర సభకు పరిచయం చేశారు. డా.గుడారు జగదీష్ తన ప్రసంగాన్ని ప్రదర్శన రూపంలో వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ 1987లో ఎన్టీఆర్ తిరుపతిలో స్థాపించిన విర్డ్(BIRRD) ఆసుపత్రిలో నేను 1996 నుండి 1,20,000 మంది అంగవికలాంగులకు 95శాతం విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించాను. 2008లో వేగేశ్న ఫౌండేషన్, ద్వారకా తిరుమల ఆలయం సహకారంతో విర్డ్ను ఏర్పాటు చేసి ఇక్కడ కూడా ఎంతోమందికి ఎముకలకు సంబంధించిన శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రంలో 23వేల మంది అంగవికలాంగులకు శస్త్రచికిత్సలు, కృత్రిమ అవయవాల అవసరం ఉంది. దీనితో పాటు విర్డ్ ఆసుపత్రిలో అధునాతన శస్త్రచికిత్స గది, రోగులకు మంచాలు, గ్రంథాలయం, ఫిజియోథెరపీ ఉపకరణాలు వంటి వాటిని ఆధునీకరించాల్సిన ఆవశ్యకత ఉంది. జనవరి నుండి తొలివిడతలో ఏపీలో, తదనంతరం తెలంగాణా రాష్ట్రాల్లో వీఐఆర్ఆర్డీ ఉచిత నిర్ధారణ శిబిరాలను నిర్వహించి అర్హులైన వారికి స్థానిక వైద్యుల సహకారంతో స్థానికంగానే చికిత్స చేస్తాం లేదా విర్డ్కు తరలించి అక్కడే అవసరమైన మేర చికిత్స చేస్తాం. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా తమ ప్రాంతంలో ఈ శిబిరాలను నిర్వహించాలంటే విర్డ్ను సంప్రదించండి. తెల్ల రేషన్ కార్డు కలిగిన వారందరికీ పూర్తి ఉచితంగా ఎలాంటి శస్త్రచికిత్సను అయినా విర్డ్లో అందిస్తున్నాం. రోగి విర్డ్లోనే రెండు నుండి ఆరు వారాల పాటు ఉచితంగా భోజన సదుపాయంతో కూడిన నివాసంలో ఉండవచ్చు. తోడుగా ఒక కుటుంబ సభ్యుడు ఉండవచ్చు. రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల రోగులు సైతం మా విర్డ్కు వస్తున్నారు. ఏడాదికి 50వేల మంది రోగులకు మేము వైద్య సదుపాయాలను కల్పిస్తున్నాం. ఇంతమంది రోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఉన్న విర్డ్ను మరింత మెరుగుపరిచేందుకు నిధులను సేకరిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ప్రవాసులు తోడ్పడాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని డా.జగదీష్ పేర్కొన్నారు. తానా మాజీ అధ్యక్షుడ్ కోమటి జయరాం రూ.35లక్షలు, మురళీ వెన్నం సమన్వయంలో డాలస్ మిత్రులు రూ.15లక్షలు, తానా మాజీ అధ్యక్షుడు వేమన సతీష్ రూ.10లక్షలు విర్డ్కు అందించేందుకు హామీ ఇచ్చారు. వీరందరికీ డా.గుడారు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో టాంటెక్స్ అధ్యక్షుడు చినసత్యం వీర్నపు, కాకినాడ రంగరాయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు సుబ్బరాయ చౌదరి, చిత్తూరు ప్రవాసుల సంఘం మాజీ అధ్యక్షుడు కాకర్ల విజయమోహన్ తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో తానా క్రీడా విభాగ సమన్వయకర్త లోకేష్ నాయుడు, పోలవరపు శ్రీకాంత్, జొన్నలగడ్డ సుబ్రమణ్యం, మల్లవరపు అనంత్, డా.పుదూర్ జగదీశ్వరన్, యు.నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టాంటెక్స్ ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు సాహిత్య సదస్సు
డల్లాస్ : ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో 146వ తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు, 43 వ టెక్సాస్ సాహిత్య సదస్సు అర్వింగ్ పట్టణంలోని కూచిపూడి ఇండియన్ రెస్టారెంట్ లో ఘనంగా నిర్వహించారు. తెలుగు సాహిత్య వేదిక సమన్వయ కర్త కృష్ణారెడ్డి కోడూరు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి టెక్సస్లోని డల్లాస్, హ్యూస్టన్, ఆస్టిన్, సానాంటోనియో, టెంపుల్ నగరాల నుంచి వందల మంది సాహితీ ప్రియులు హాజరై స్వీయకవితలు, వ్యాసాలు, పద్యాలు, తెలుగు సిరిసంపదలు విని ఆనందించారు. సత్యం మందపాటి 'పేరులో ఏముంది', నందివాడ భీమరావు 'సాహిత్యంలో ధిక్కారం' అనే అంశాల మీద మాట్లాడారు. 'పరీక్ష సమీక్ష' అనే అంశం మీద డాక్టర్ చింతపల్లి గిరిజా శంకర్ మాట్లాడగా, తెలుగు సిరిసంపదల గురించి డాక్టర్ నరసింహారెడ్డి వివరించారు. ఈ సందర్భంగా సురేష్ కాజా, చంద్రహాస్ మద్దుకూరి గుర్రం జాషువా, జాలాది వంటి ఆధునిక కవుల గురించి పేర్కొన్నారు. చివరగా సాహితీ సింధూర చిన్నారుల పాటతో కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చిన సత్యం, కార్యదర్శి ఉమా మహేష్ పార్నపల్లి, కోశాధికారి శరత్ యర్రం, కార్యవర్గ సభ్యుడు సతీష్, పూర్వాధ్యక్షులు డా ఊర్మిండి నరసింహా రెడ్డి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, కృష్ణా రెడ్డి ఉప్పలపాటి, ప్రసాద్ తోటకూర, మాజీ అధినేత చంద్ర కన్నెగంటి, డా.శ్రీనివాసుల రెడ్డి ఆళ్ళ, పాలకమండలి మాజీ అధినేత రామకృష్ణా రెడ్డి దంపతులు, అనంత్ మల్లవరపు, రమణ జువ్వాడి, శ్రీకుమార్ గోమటం, శిరీష గోమటం, సుమ పోకల, సి యస్ రావు, ఆర్ కె పండిటి, నందివాడ ఉదయ భాస్కర్, కిరణ్మయి వేముల, పాలకమండలి సభ్యులు, తదితరులు హాజరయ్యారు. -
టాంటెక్స్ ఆధ్వర్యంలో ఫణినారాయణ వీణా మహా స్రవంతి
డాల్లస్ : ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం(టాంటెక్స్) ఆధ్వర్యంలో ఫణి నారాయణ వీణా వడలి ‘‘ శ్రీ ఫణి నారాయణ వీణా మహతీ స్రవంతి’’ కార్యక్రమం అత్యంత ఆహ్లాదకరంగా జరిగింది. సెయింట్ మలంకాకారా ఆర్థోడాక్స్ చర్చీలో సెప్టెంబర్ 14న ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిధులు ఫణి నారాయణ, విద్వాన్ శంకర్ రాజ గోపాలన్, సతీష్ నటరాజన్, శ్రీనివాసన్ ఇయ్యున్ని, చినసత్యం వీర్నపు తదితర టాంటెక్స్ కార్యవర్గ సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వాతి కృష్ణమూర్తి శిష్య బృందం ఆలపించిన కృష్ణాష్టకం ప్రారంభ గీతం అందరినీ ఆకట్టుకుంది. గాయిని సాయితన్మయ అద్భుతమైన ప్రతిభతో మరికొన్ని శాస్త్రీయ గీతాలు పాడి అందరి మన్ననలు పొందారు. అనంతరం ఫణినారాయణ వీణా ప్రస్థానం వీనుల విందుగా సాగింది. ఆయన వీణపై వాయించిన ‘‘ వటపత్ర సాయికి వరహాల లాలి’’ ‘‘కథగా కల్పనగా కనిపించెను నాకొక యువరాణి’’ ‘‘పరువం వానగా’’ ‘‘సుభలేఖ రాసుకున్న’’ ‘‘తకిట తకిట తందాన’’ ‘‘ సామజ వరగమన’’ ‘‘ ఈగాలి ఈనేల’’ వంటి పాటలు అందరినీ తన్మయత్వానికి గురిచేశాయి. టాంటెక్స్ అధ్యక్షులు వీర్నపు చినసత్యం, ఉత్తరాధ్యక్షులు కృష్ణా రెడ్డి కోడూరు, కార్యదర్శి ఉమామహేశ్ పార్నపల్లి, సంయుక్త కార్యదర్శి ప్రబంధ్ రెడ్డి తోపుదుర్తి, సతీష్ బండారు, వెంకట్ బొమ్మ, శరత్ యర్రం, కళ్యాణి తాడిమేటిలు ముఖ్య అతిధులు ఫణినారాయణ వీణా వడలి, విధ్వాన్ శంకర్ రాజ గోపాలన్, సతీష్ నటరాజన్, శ్రీనివాసన్ ఇయ్యున్నిలను శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా టాంటెక్స్ అధ్యక్షులు వీర్నపు చినసత్యం మాట్లాడుతూ.. ఫణినారాయణ టాంటెక్స్ కార్యక్రమానికి రావటం సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి సహకరించిన రఘురాం బుర్ర, బాల గునపవరపు, జయ కళ్యాణి, పూజిత కడిమిశెట్టిలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రసార మాధ్యమాలైన టీవీ9, టీవీ5, మన టీవీ, టీఎన్ఐ, ఫన్ ఏషియా, దేసీప్లాజ, తెలుగు టైమ్స్, ఐఏసియాలకు, సెయింట్. మలంకాకారా ఆర్థోడాక్స్ చర్చీవారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టాంటెక్స్ పూర్వాధ్యక్షులు సుబ్రమణ్యం జొన్నల గడ్డ, డా. తోటకూరి ప్రసాద్, శ్రీకాంత్ పోలవరపు, అనంత్ మల్లవరపు, డా. రమణ జువ్వాడి, చంద్రహాస్ మద్దుకూరితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
డల్లాస్లో ఘనంగా అష్టావధాన కార్యక్రమం
డల్లాస్(టెక్సస్) : ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం(టాంటెక్స్) , ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆద్వర్యంలో ఆగస్టు18 న డల్లాస్లోని ఫ్రిస్కో కార్యసిద్ధి హనుమాన్ దేవాలయంలో అష్టావధానం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపుగా 200 మందికి పైగా సాహితి ప్రియులు హాజరై సభను జయప్రదం చేశారు. టాంటెక్స్ అధ్యక్షులు చినసత్యం వీర్నపు సభను ప్రారంభించి అష్టావదానం నిర్వహించడానికి వచ్చిన డా. మేడసాని మోహన్గారికి సాదర స్వాగతం పలికారు. ఈ అష్టావదానం కార్యక్రమం తానా, టాంటెక్స్లు కలిసి నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ముందుగా తాన్వి పొప్పూరి ఆలపిచిన అన్నమయ్య కీర్తనలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. దిగవంతాలకు వ్యాపించేలా తెలుగు భాషలలో అత్యంత క్లిష్టమైన అవధాన ప్రక్రియను డాక్టర్ మేడపాని మోహన్ తనదైన శైలిలో రక్తి కట్టించి అమెరికా నలుమూలల నుంచి విచ్చేసిన అవధాన ప్రియులను ఆకట్టుకున్నారు. అవధానం అంటే అవధులు లేని ఆనందం అనిపించేంతగా కార్యక్రమం సాగింది. ఈ అవధాన ప్రక్రియలో 8 మంది పృచ్ఛకులు పాల్గొన్నారు. ఈ పృచ్ఛకులు ఒక్కొక్కరు ఒక్కొక్క అంశం మీద అవధాని గారిని పరీక్షించారు. మేడసాని మోహన్ ఎక్కడా కాగితం, కలం వాడకుండా వారు అడిగిన చందస్సులను చమత్కారంగా, ఛలోక్తులతో కూడిన సమాధానాలు ఇవ్వడం ద్వారా కార్యక్రమానికి విచ్చేసిన వీక్షకులను ఆనందింపజేశారు. అవధాన అంశాలలో శ్రీ ఊరిమిండి నరసింహరెడ్డి దత్తపది, శ్రీ తోటకూర ప్రసాద్ న్యస్తాక్షరి, శ్రీ ఉపద్రష్ట సత్యం మహాకవి ప్రసంగం, కుమారి మద్దుకూరి మధుమాహిత సమస్య, శ్రీ వేముల లెనిన్ వర్ణన, శ్రీమతి కలవగుంట సుధ, ఆశువు, శ్రీ కాజ సురేష్ నిషిద్దాక్షరి అంశాలతో, శ్రీ మాడ దయాకర్ తన అప్రస్తుత ప్రసంగం, జలసూత్రం చంద్రశేఖర్ లేఖకుడిగా ఈ కార్యక్రమంలో పాల్గొని అవధానం నిర్వహించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షులు శ్రీ జయశేఖర్ తాళ్ళూరి, టాంటెక్స్ అధ్యక్షులు చినసత్యం వీర్నపు, ఉత్తరాధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు, సాంబ దొడ్డ బృందం డా. మేడసాని మోహన్ గారిరీ శాలువా, జ్ఞాపిక ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తానా కార్యవర్గ బృందం డా. అడుస్తమిల్లి రాజేష్, చలపతి కొండ్రకుంట, శ్రీకాంత్ పోలవరపు, దినేష్ త్రిపురనేని, సతీష్ కొమ్మన, రాజ నల్లూరి, రవి అల్లూరి, శ్రీనివాస్ కొమ్మినేని, పరమేష్ దేవినేని, శేషారావు బొడ్డు, శివ రావూరి, లోకేష్ నాయుడు కొణిదాల, సుబ్బారావు కారసాల, శ్రీని మండువ, అనిల్ ఆరేపల్లి, డా. సి.ఆర్.రావు, డా. విశ్వనాధం పులిగండ్ల, సుగన్ చాగర్లమూడి, కె.సి.చేకూరి , ప్రకాశ్రావు వెలగపూడి, ,ఎం.వి.యల్. ప్రసాద్, టాంటెక్స్ ఉపాధ్యాక్షులు డా. ఊరిమిండి నరసింహా రెడ్డి, సుబ్రమణ్యం జొన్నలగడ్డ, విజయ్ కాకర్ల, ఉత్తరాధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు, ఉపాధ్యాక్షులు పాలేటి లక్ష్మి, సంయుక్త కార్యదర్శి ప్రబంధ్ తోపుదుర్తి, శ్రీకాంత్ జొన్నల, శరత్ ఎర్రం సహా మరికొంత మంది ప్రముఖులు పాల్గొన్నారు. -
డల్లాస్లో కనువిందుగా ఆహా! ఈహీ! ఓహో!
డల్లాస్ (టెక్సస్) : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో 'ఆహా! ఈహీ! ఒహో!' అనే తెలుగు సాహితీ వైభవ కార్యక్రమాన్ని జూలై 21న డల్లాస్లో ఘనంగా నిర్వహించారు. ఈ సభకు దాదాపు 200 మందికి పైగా సాహితీ ప్రియులు హాజరయ్యారు. నాలుగు గంటల పాటు సభను ఉత్సాహంగా నిర్వహించి విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సినీ గేయ రచయిత, తెలుగు వేదకవి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారికి తానాబోర్డు కార్యదర్శి మురళి వెన్నం సాదర స్వాగతం పలికారు. కొత్తగా ఎన్నికైన తానా సభ్యులను సభకు పరిచయం చేస్తూ, భావసారుప్యం ఉన్నజాతీయ, స్థానిక సంస్థలతో కలసి తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకై మంచి కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగాటాంటెక్స్ అధ్యక్షులు చినసత్యం వీర్నపు మట్లాడుతూ శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు ముఖ్య అతిథిగా రావడం చాలా ఆనందంగాఉందని, తానాకి కొత్తగా ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులందరకి అభినందనలు తెలియజేశారు. 'సాహితీ వేముల', 'సింధూర వేములలు','మా తెలుగు తల్లికి మల్లె పూదండ', 'ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట' అనే గీతాలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. తానా మరియు టాంటెక్స్ సంస్థల పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారినిసభకు పరిచేయం చేస్తూ.. శ్రీ శ్రీ, దాశరథి, వేటూరి, పురాణం సుభ్రమణ్యం శర్మ, డా. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, మల్లాది చంద్రశేఖర శాస్త్రిగారి లబ్ధ ప్రతిష్టులతో ఎంతో ఆత్మీయంగా మెలిగిన శ్రీ జొన్నవిత్తులగారు ఇక్కడికి రావడం ఎంతో ఆనందం కలిగించిందన్నారు. తానాకార్యవర్గ సభ్యుడు లోకేష్ నాయుడు జొన్నవిత్తుల గారిని పుష్పగుచ్చంతో వేదికపైకి ఆహ్వానం పలికినప్పుడు కరతాళధ్వనులు మిన్నంటాయి. నాలుగు భాగాలుగా చతుర్ముక పారాయణం మహాత్మా మెమోరియల్ అఫ్ నార్త్ టెక్సాస్ అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ .. శ్రీ జొన్నవిత్తుల గారితో వినూత్నంగా మొదటిసారి చమత్కార చతుర్ముఖ పారాయణం అనేనాలుగు ప్రక్రియలున్న సాహిత్య కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ చతుర్ముఖ పారాయణంలో సినీ సాహిత్యం, తెలుగు భాషా వైభవం,పురాణాల ప్రాశస్త్యం, పేరడీ పాటలు అనే నాలుగు విభాగాలుగా విభజించి ఒక కొత్త తరహ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా జొన్నవిత్తుల మాట్లాడుతూ.. డా. ప్రసాద్ తోటకూర గారితో తనకున్న ఎన్నో సంవత్సరాలు అనుబంధాన్ని గుర్తు చేశారు. తెలుగు భాషా ప్రియత్వం, నాయకత్వ లక్షణాలపై ప్రసాద్గారి ప్రేమను కొనియాగారు. ఇది తన 17వ అమెరికా పర్యటన అని తానా, టాంటెక్స్ లాంటి అనేక తెలుగు సంస్థలు తనకిస్తున్న ప్రోత్సాహం మరువలేనిదన్నారు. జొన్నవిత్తుల గారితో ప్రసాద్ తోటకూర ముఖాముఖి నిర్వహించారు. ఈ నేపథ్యంలో కవి జొన్నవిత్తుల తాను రాసిన పాటలు అనేక సినిమాలలో వినూత్న ప్రయోగాలుగా ఉండి అత్యంత ప్రజాదరణ పొందాయని పేర్కొన్నారు. ఒక డిస్కో పాటని పూర్తిగా సంస్కృతంలో రాయడం, కేవలం 'సరిగమపదని' అనే సప్త అక్షరాలతో పాట రాయడం, 'చినుకు చినుకు అందెలతో', 'జగదానంద కారకా', 'ఓ వాలు జడా, పూలజడా' వంటి పాటల నేపధ్యం గురించి అడిగినప్పుడు, అదంతా దర్శక, నిర్మాతలు తనికిచ్చిన అవకాశం అని పేర్కొంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జొన్నవిత్తుల గారు డా. మంగళంపల్లి బాలమురళి, బాపు, రమణ, వేటూరి గార్లతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని, అనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. అలాంటి గొప్ప పండితులతో, మేధావులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం రావడం తన పూర్వజన్మసుకృతం అని తెలిపారు. తర్వాత కనక దుర్గమ్మవారి రూపంలోని అక్షరమాలను, అక్షరమాలలో ఉన్న సకల సంగీత వాయిద్య పరికరాలను దర్శిస్తూ తెలుగు భాషా వైభవాన్ని జొన్నవిత్తుల పాడి వినిపించడంతో సభా ప్రాంగణం చప్పట్లతో మారుమోగింది. కోనసీమ శతకం, బతుకమ్మ శతకం, సింగరేణి శతకం, రామలింగేశ్వర శతకాల్లో నుoచి ఎన్నో పద్యాలను పాడి సభికులను ఆనందపరవశంలో ముంచెత్తారు. అదే విధంగా ప్రస్తుత సమకాలీన పరిస్థితుల్లో రాజకీయ పార్టీల గందరగోళం, యధేచ్చగా పార్టీలు మారడం, ఎన్నికల వాగ్ధానాలు, మద్యపానం, అవినీతి, స్కీములు, స్కాములు లాంటి అంశాలను కథా వస్తువుల ఆధారంగా శ్రీ జొన్నవిత్తుల పేరడీలు సృష్టించడంతో సభలో మొత్తం కేరింతలు, ఈలలతో నిండిపోయింది. ఈ సందర్భంగా శ్రీ జొన్నవిత్తుల గారిని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరియు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) కార్యవర్గ బృందం శాలువా, జ్ణాపికను బహుకరించి "అభినవ చమత్కార కవిసార్వభౌమ" అనే బిరుదుతో సత్కరించారు. సభకు విచ్చేసిన జ్యోతిష్య శాస్త్ర ప్రముఖులు డా. జంధ్యాల భాస్కర శాస్త్రి గారు శ్రీ జొన్నవిత్తులగారిని, వారి కవితా చాతుర్యాన్ని కొనియాడారు. డా. జంధ్యాల భాస్కర శాస్త్రి గారిని సభ నిర్వాహకులు గౌరవపూర్వకంగా శాలువాతో సత్కరించారు.కార్యక్రమం చివర్లో తానా పూర్వాధ్యక్షులైన డా. నవనీత కృష్ణ గొర్రెపాటి, డా. రాఘవేంద్ర ప్రసాద్ సూదనగుంట, డా. ప్రసాద్ తోటకూరలను తానా కార్యవర్గం ఘనంగా సన్మానించింది. తానా జాతీయస్థాయిలో తెలుగు వారందరికి మాతృ సంస్థ అని, గతంలో తానా, టాంటెక్స్ కలసి ఇక ముందు కూడా కలిసి పని చేస్తూ, పరస్పర సహకారంతో మరిన్ని మంచి కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలియజేశారు. గాంధీ స్మారక ప్రాంతాన్ని సందర్శించిన జొన్నవిత్తుల ఈ సాహితీ సమావేశం తర్వాత డా. ప్రసాద్ తోటకూరతో కలసి జొన్నవిత్తుల అమెరికాలోనే అతి పెద్దదైన 18 ఎకరాల పార్క్ లో నెలకొల్పిన మహాత్మాగాంధీ స్మారక ప్రాంతాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించారు. ఈ ప్రాంతాన్ని సందర్శించడం ఒక మధురానుభూతి అని, ఈ స్మారక నిర్మాణం వెనుక డా. తోటకూర ప్రసాద్ గారి కృషి, పట్టుదల, అకుంటిత దీక్షను కొనియాడదగినదని జొన్నవిత్తుల పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తానా కార్యవర్గ బృందం డా. అడుసుమిల్లి రాజేష్, చలపతి కొండ్రకుంట, శ్రీకాంత్ పోలవరపు, దినేష్ త్రిపురనేని, సతీష్ కొమ్మన, రాజ నల్లూరి, రవి అల్లూరి, శ్రీనివాస్ కొమ్మినేని, పరమేష్ దేవినేని, శేషారావు బొడ్డు, శివ రావూరి, లోకేష్ నాయుడు కొణిదాల, సుబ్బరావు కారసాల, శ్రీని మండువ, అనిల్ ఆరేపల్లి, రావు కల్వల, డా. సి.ఆర్.రావు, డా. విశ్వనాధం పులిగండ్ల, ఎం.వి.యల్.ప్రసాద్, టాంటెక్స్ పూర్వధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహా రెడ్డి, సుబ్రమణ్యం జొన్నలగడ్డ, విజయ్ కాకర్ల, రాజా రెడ్డి, గీతా దమ్మన్న, ఆర్.కె పండిటి, ఉత్తరాధ్యక్షులు కృష్ణా రెడ్డి కోడూరు, ఉపాధ్యక్షులు పాలేటి లక్ష్మి, సంయుక్త కార్యదర్శి ప్రబంధ్ తోపుదుర్తి, శ్రీకాంత్ జొన్నల, టాటా అధ్యక్షులు విక్రం జంగం, నాటా ఉత్తరాధ్యక్షులు డా. శ్రీధర్ రెడ్డి కొర్శపాటి, ఆటా బోర్డు అఫ్ డైరెక్టర్ సతీష్ రెడ్డి తో సహా ఎంతో మంది పుర ప్రముఖులు పాల్గొన్నారు. -
ఘనంగా నెల నెలా తెలుగు వెన్నెల 12వ వార్షికోత్సవం
డాలస్ : ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నెల నెలా తెలుగు వెన్నెల 144వ సాహిత్య సదస్సు,12వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఆదివారం జూలై 14న డాలస్లో సాహిత్య వేదిక సమన్వయ కర్త, ఉత్తరాధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు ఆధ్వర్యంలో సదస్సు కన్నుల పండుగగా జరిగింది. ప్రవాసంలో నిరాటంకంగా 144 నెలలుగా సాహితీ వేత్తల నడుమ ఈ సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ ప్రత్యేకత. ప్రవాస భారత సాంస్కృతిక రాజధాని డాలస్లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు పెద్ద సంఖ్యలో తరలి వఛ్చి ఈ సమావేశాన్ని జయప్రదం చేశారు. ముందుగా ఉత్తర టెక్సాస్ కార్యవర్గ, పాలక మండలి సభ్యులు, అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసిన తర్వాత సాహిత్య వేదిక సమన్వయ కర్త కృష్ణా రెడ్డి కోడూరు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం స్వాతి కృష్ణమూర్తి విద్యార్థులు దీప్తి గాలి, హాసిని దారా, సాహితి శంక, మనోగ్య బొమ్మదేవర, శ్రీనిధి తాటవర్తి, ఉదయ్ ఓమరవెల్లిల ప్రార్థనా గీతంతో మొదలైంది. ఆ తర్వాత త్యాగరాజ, అన్నమాచార్యుల సంకీర్తనలను వీణా నాద మంజరి పేరుతో ఉమా ప్రభల, అమృత వర్షిణి అకాడమీ వారి సంగీత విద్యార్థులు శ్రావ్య కస్తూరి, ప్రనికా కస్తూరి చాలా చక్కగా వినిపించారు. తర్వాత డాక్టర్ వాణీ కుమారి ఆధునిక చారిత్రిక కావ్యాలు అనే విషయం మీద మాట్లాడి సాహిత్య ప్రియులకి గురువు ప్రాధాన్యతని వివరించారు. మహా భారతంలో అర్జునుడికి గురువుగా శ్రీ కృష్ణుడి ఉపదేశం, ఛత్రపతి శివాజీ గురువుగా సమర్థ రామదాసు, శ్రీ కృష్ణ దేవరాయలు గురువు తిమ్మరుసు ప్రాధాన్యతలని వివరించారు. అనంతరం డా. కేయన్ మల్లేశ్వరి రచనా నేపద్యపు ఎంపిక - స్వీయానుభవాలు అనే అంశంపైన మాట్లాడుతూ రచయిత లేదా రచయిత్రులు రచనా విషయాన్ని ఎలా ఎంచుకొంటారో వివరించారు. శ్రీ చేగొండి సత్యనారాయణ మూర్తి.. నిజ సంస్కృతి వైభవం-పద్య గాన విశ్లేషణ అనే అంశం మీద పద్యాలతో పాడుతూ మన భాషలో ఎన్ని యాసలున్నా ఎన్ని ప్రాంతాలకి చెందినవారమైన మనమంతా తెలుగువారము, మన మంతా భరతమాత ముద్దు బిడ్డలమంటూ దేశ సమగ్రత -జాతీయతని చాలా చక్కగా వివరించారు. డా. ప్రసాద్ తోటకూర యుగ పురుషుడు వీరేశలింగం శత వర్ధంతి అనే అంశంపైన మాట్లాడుతూ.. వీరేశలింగం సమాజంలో తీసుకువచ్చిన సంఘ సంస్కరణల గురుంచి వివరించారు. తర్వాత డా. నందిని సిద్దా రెడ్డి సాహిత్యం -మానవ సంబంధాలు అనే అంశం మీద మాట్లాడారు. డా. సుధా కల్వగుంట్ల లాస్య సుధా డ్యాన్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో వారి బృందం హనుమాన్ చాలీసాని నాట్యంతో ప్రదర్శించి చూపారు. ఈ కార్యక్రమానికి కుమారి కీర్తన కల్వగుంట్ల కొరియో గ్రాఫర్ గాను , కుమారి నర్తన కల్వగుంట్ల కో ఆర్డినేటర్ గాను వ్యవహరించారు. ఆ తర్వాత నంది అవార్డ్ గ్రహీత శ్రీ బగాది రామచంద్ర నాయుడు బృందం సత్యహరిచంద్ర నాటకంలోని కాటిసీనును ప్రదర్శించి సాహిత్య ప్రియులను మెప్పించినారు. ఈ నాటకంలో చంద్రమతిగా స్థానికులైన కిరణ్మయి వేముల చక్కగా నటించారు. అటు పిమ్మట నాట్యాంజలి డ్యాన్స్ అకాడమీ, శ్రీ లతా సూరి బృందం అన్నమయ్య పద లాస్య మాలిక అనే నాట్యాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సాహిత్య వేదిక పూర్వ సభ్యులని, పోషక దాతలని, విచ్చేసిన అతిథులందరినీ గుర్తించి జ్ఞాపిక, శాలువాతో గౌరవించడం జరిగింది. సాహిత్య వేదిక సమన్వయకర్త కృష్ణారెడ్డి కోడూరు సాహిత్యం మీద ప్రేమ, మాతృభాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన టీవీ 5, మన టి.వి, టీవీ 9, టి.ఎన్.ఐ, ఏక్ నజర్, దేసిప్లాజా, వెంకట్ మీడియా మిత్రులకు కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేసారు. ఈ కార్యక్రమం అధ్యక్షుడు చినసత్యం ప్రసంగంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి సాహిత్య వేదిక సదస్సు సమన్వయ కర్త కృష్ణా రెడ్డి కోడూరు, అధ్యక్షులు చినసత్యం వీర్నపు, ఉపాధ్యక్షురాలు లక్ష్మి పాలేటి, కోశాధికారి శరత్ యర్రం, సహ కార్యదర్శి ప్రబంద్ తోపుదుర్తి, పాలకమండలి అధిపతి ఎన్ఎమ్ఎస్ రెడ్డి, సాహిత్య వేదిక కమిటీ సభ్యురాలు స్వర్ణ అట్లూరి, కార్యవర్గ సభ్యులు, సతీష్ బండారు, లోకేష్ నాయుడు, హరీష్, పూర్వాధ్యక్షులు డా. ఊర్మిండి నరసింహా రెడ్డి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, పాలకమండలి పూర్వాధిపతి రామ కృష్ణా రెడ్డి, చంద్ర కన్నెగంటి, భాస్కర్, సాంబ దొడ్డ, మురళీ వెన్నం, సీఆర్ రావు, రాఘవేంద్ర, రమేష్ సీరా, చంద్రహాస్, అనంత్ మల్లవరపు, లెనిన్ వేముల, కిరణ్మయి వేముల, జ్యోతి వనం, వాణి గజ్జెల, అమర్ నాధ రెడ్డి తరిమెల, మంజుల కన్నెగంటి, కళ్యాణ్, భాను ఇవటూరి, సురేష్ మండువ, రావు కలువల, సేనియర్ జర్నలిస్ట్ శ్రీశైలం సిల్వేరి, అనురాధ సిరిగిన, శ్రీనివాస్ సిరిగిన, డాక్టర్ ఇస్మాయిల్, పరిమళ మార్పాకతో పాటు అనేక మంది సాహిత్య ప్రియులు పాల్గొని, సభికుల హర్షద్వానాల మధ్య సాహిత్య వేదిక 12వ వార్షికోత్సవాన్ని విజయవంతం చేసారు . -
సైకియాట్రిస్ట్ ఝాన్సీ రాజ్ ఆత్మహత్య
టెక్సాస్ : అమెరికాలో సైకియాట్రిస్ట్గా పేరొందిన ప్రవాస తెలుగు మహిళ డాక్టర్ ఝాన్సీ రాజ్ ఆత్మహత్య చేసుకున్నారు. టెక్సాస్లోని ఫోర్ట్ వర్త్లో నివసించే ఝాన్సీ తన కారును స్వయంగా డ్రైవ్ చేస్తూ సరస్సులోకి దింపి బలవన్మరణానికి పాల్పడ్డారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఝాన్సీ నిత్యం చురుకుగా, ధైర్యంగా ఉండేవారు. ఆమె ఎందుకు ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకున్నారనేది వెల్లడి కాలేదు. ఝాన్సీ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో 1976లో వైద్య విద్యను అభ్యసించారు. అమెరికాలో ఆమె 43 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తూ ప్రముఖ సైకియాట్రిస్ట్గా గుర్తింపు పొందారు. -
డల్లాస్లో వందేమాతరం శ్రీనివాస్కు సత్కారం
డల్లాస్ : ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో జూన్ 11న దేశీప్లాజాలో ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ను ఘనంగా సత్కరించారు. ఆయనను.. టాంటెక్స్ కార్యదర్శి మహేష్ పార్నపల్లి, ఉత్తరాధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు, శ్రీకాంత్ రెడ్డిజొన్నల పుష్పగుచ్చంతో వేదిక మీదకు ఆహ్వానించారు. ఆయనతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. టాంటెక్స్ అధ్యక్షులు వీర్నపు చినసత్యం, కార్యదర్శి మహేష్ పార్నపల్లి, ఉత్తరాధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు, శ్రీకాంత్ రెడ్డిజొన్నల, పాలకమండలి అధిపతి ఎన్ఎమ్ఎస్ రెడ్డి, పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, డా. ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి శాలువా కప్పి, జ్ఞాపికను అందించారు. అనంతరం వీర్నపు సత్యనారాయణ మాట్లాడుతూ.. వందేమాతరం శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉందని, ఇటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలను తెలిపారు. ఈ కార్యక్రమంలో టాంటెక్స్ పూర్వధ్యక్షులు సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, విశ్వనాద్ పులిగండ్ల, రావు కలవల, డా. పూదుర్ జగదీశ్వరన్, సి.ఆర్.రావు, లెనిన్ వేముల, డా. రమణ జువ్వాడి, చంద్రహాస్ మద్దుకూరి తదితరులు పాల్గొన్నారు. -
డాలస్లో 141వ నెల నెలా తెలుగువెన్నెల సాహిత్య సదస్సు
డాలస్, టెక్సస్ : ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక సభ్యులు అట్లూరి స్వర్ణ ఆధ్వర్యంలో "నెల నెలా తెలుగు వెన్నెల" సాహిత్య సదస్సు ఘనంగా జరిగింది. ప్రవాసంలో నిరాటంకంగా 141 నెలలపాటు ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థయొక్క విశేషం. భాషాభిమానులు, సాహిత్య ప్రియులు, అధిక సంఖ్యలో ఆసక్తితో ఈ సమావేశానికి హాజరై జయప్రదం చేశారు. ఈ కార్యక్రమాన్ని చిన్నారి మాడ సమన్విత ప్రార్థనా గీతాన్ని ఆలపించి ప్రారంభించింది. తెలిదేవర మంజు శిష్యులు వెంపటి సీత, శ్రీలత మల్లాడి, చిరంజీవి గెడ్డశ్రీయ హృద్యంగా వీణా వాద్యంతో ముందుకు సాగిన ఉగాది కవి సమ్మేళనంలో డా. ఊరిమిండి నరసింహారెడ్డి రవీంద్రుని గీతాంజలి, మాడ మాడ్దయాకర్ కవితా గానం, మద్దుకూరి చంద్రహాస్ సోషల్ మీడియా పోస్ట్లపై రాసినస్వీయ కవిత, మల్లవరపు అనంత్ స్వీయ రచన "కొంటెతామర", కన్నెగంటి చంద్ర స్వీయ కవిత "మళ్ళీ ఇంకో వసంతం", పుదూర్ జగదీశ్వరన్ స్వీయ రచనతో సాగి వేముల లెనిన్ జాషువా లఘు ఖండిక "గిజిగాడు" సమీక్షతోముగిసింది. చిన్నారులు వేముల సాహితీప్రియ, వేములసింధూర, మాడ సమన్విత కందుకూరి రచన "ఎంత చక్కనిదోయి ఈ తెలుగు" అంటూచక్కగా పాడి ప్రశంసలు అందుకున్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ రచయిత్రి డా.రాజ్యశ్రీకేతవరపు రచించిన వంద ప్రశ్నలు-వేలభావాలు పుస్తకావిష్కరణ జరిగింది. ప్రముఖ విశ్లేషకులు నియోగి రచయిత్రి కవిత్వంపై రాసిన సాహిత్య విశ్లేషణ, తనకుసంధించిన 100 ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు పొందుపరిచి ఈ పుస్తకం ప్రచురించినట్లు తెలిపారు. పుస్తకంపై జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, అధ్యక్షులు వీర్నపుచినసత్యం స్పందించారు. ముఖ్య అతిథిగా విచ్చేసినప్రముఖ రచయిత్రి డా.రాజ్యశ్రీ కేతవరపు "షడ్రుచులసమ్మేళనం-కవిత్వం" అనే అంశంపై ప్రసంగించారు. ప్రతిరుచికి చక్కని ఉదాహరణలతో అనర్గళంగా సాగినప్రసంగంతో అందరి ప్రశంసలు అందుకున్నారు. గీతామృతంలో భగవద్గీతలో శ్లోకాలను సామాన్యమానవుడికి అర్థమయ్యేరీతిలో రాయడంలో తనఅనుభవాలను వివరించారు. ముఖ్యఅతిథి భట్రాజు రాణిని పుష్పగుచ్ఛముతో సత్కరించి సమన్వయకర్తగా వ్యవహరించి అట్లూరి స్వర్ణ సభకు పరిచయం చేశారు. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షులు వీర్నపు చినసత్యం, పూర్వాధ్యక్షులు జొన్నలగడ్డసుబ్రహ్మణ్యం, పూర్వాధ్యక్షులు డా.ఊరిమిండి నరసింహారెడ్డి దుశ్శలువా, సాహిత్యవేదిక బృందసభ్యులు జ్ఞాపికతో సత్కరించారు. ఉపాధ్యక్షులు పాలేటిలక్ష్మి, పాలకమండలి సభ్యులు కన్నెగంటి చంద్ర, కార్యవర్గసభ్యులు మండిగ శ్రీలక్ష్మి సాహిత్య వేదిక బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీర్నపు చినసత్యం ముఖ్య అతిథి ప్రసంగంపై స్పందిస్తూగత ఐదు సంవత్సారాలుగా పలుమార్లు తెలుగు వెలుగుపత్రికకు కథలు కవితలు అందిస్తున్న రచయిత్రిని ఈవిధంగా కలవడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. సాహిత్యం మీద ప్రేమ, మాతృభాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీ ప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు. -
టెక్సాస్లో ఉగాది ఉత్సవాలు
టెక్సాస్ : ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఉగాదిని ఘనంగా జరుపుకున్నారు. వికారినామ సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ.. సంబరాల్లో మునిగితేలారు. యూలెస్లోని ట్రినిటి హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగువారు పాల్గొన్నారు. 150కి పైగా పిల్లలు, పెద్దలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని అందరినీ అలరించారు. టాంటెక్స్ 2019 ‘ఉగాది పురస్కారాల’ను ఈ సంవత్సరం సాహిత్యం, సంగీతం, నాట్యం, సమాజ సేవ, సాంకేతిక, వైద్య రంగాలలో విశేష సేవలందించిన వ్యక్తులకు ప్రకటించారు. తెలుగు సాహిత్య రంగంలో కిరణ్ ప్రభ , సంగీతం రంగంలో శ్రీనివాస్ ప్రభల, నాట్యం రంగంలో శ్రీమతి శ్రీలత సూరి, సమాజ సేవ రంగంలో శ్రీకాంత్ పోలవరపు . సాంకేతిక రంగంలో డా. సాంబారెడ్డి, వైద్యరంగంలో డా. ఆళ్ళ శ్రీనివాసరెడ్డి , డా. కోసూరి రాజు మొదలైన వారికి ఈ పురస్కారాలను అందజేశారు. వివిధ కార్యక్రమాలలో తమదైన శైలిలో సేవలను అందిస్తున్న, అవినాష్ వెల్లంపాటి, కిరణ్మయి వేములలకు ‘ఉత్తమ స్వచ్ఛంద సేవకుడు (బెస్ట్ వాలంటీర్) ’ పురస్కారంతో సత్కరించి వారి సేవా ధృక్పదాన్ని పలువురికి చాటారు. జీవన సాఫల్య పురస్కారం డా. ప్రేమ్రెడ్డికి ఇచ్చారు. ప్రత్యేక అతిధిగా విచ్చేసిన ట్రినిటీ హైస్కూల్ సూపరింటెండెంట్ డా. స్టీవ్ చాప్మన్ మాట్లాడుతూ తెలుగు వారి విశిష్టత మరియు సేవా కార్యక్రమాలను కొనియాడారు. తరువాత డా. స్టీవ్ చాప్మన్ను ఘనంగా సత్కరించారు. సంస్థ అధ్యక్షులు చినసత్యం వీర్నపు.. ట్రినిటీ హైస్కూల్ ఆడిటోరియంను ఉచితంగా ఇప్పించిన డా. తోటకూర ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కళాకారుల సన్మాన కార్యక్రమంలో భాగంగా గాయకులు సుమంగళి, నరేంద్ర, మిమిక్రి ఆర్టిస్ట్ కళారత్నమల్లం రమేష్, వ్యాఖ్యాత రఘు వేముల లకు జ్ఞాపికలతో టాంటెక్స్ సంస్థ కార్యవర్గబృందం సభ్యులు సత్కరించారు. -
‘నెల నెలా తెలుగు వెన్నెల’ 140వ సాహిత్య సదస్సు
డల్లాస్ : ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘నెల నెలా తెలుగు వెన్నెల’ 140వ సాహిత్య సదస్సు డల్లాస్లో ఘనంగా నిర్వహించారు. సాహిత్య వేదిక సమన్వయకర్త కృష్ణారెడ్డి నేతృత్వంలో ఆదివారం (మార్చి 17న) ఈ కార్యక్రమం జరిగింది. ప్రవాస భారత సాంస్కృతిక రాజధాని డల్లాస్లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు పెద్ద సంఖ్యలో తరలి వఛ్చి ఈ సమావేశాన్ని జయప్రదం చేశారు. ప్రవాసంలో నిరాటంకంగా 140 నెలలుగా ‘నెల నెలా తెలుగు వెన్నెల’ సదస్సు నిర్వహించటం ఈ సంస్థ ప్రత్యేకత. ఈ కార్యక్రమాన్ని సాహిత్య ,సింధూ దేశభక్తి గేయంతో మొదలు పెట్టారు. అనంతరం కవులు, రచయితలు అనేక అంశాలపై మాట్లాడి చర్చించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన డాక్టర్ వేమూరి వెంకటేశ్వర రావు తెలుగుతో నా పోరాటం కథ అనే అంశం మీద మాట్లాడారు. సైన్స్ని తెలుగులో, తెలుగును ఆధునిక అవసరాలకి సరిపోయే విధంగా తేలిక పరిస్తే బాగుంటుందని ఆయన భావించారు. సైన్స్లో తనకి కావాల్సిన పదజాలాన్ని ఎలా సేకరించారో వివరించడమే కాకుండా ఆ పదజాలంతో వేమూరి నిఘంటుకు ఎలా రూపకల్పన చేశారో తెలిపారు. అనంతరం సాహిత్య వేదిక కమిటీ సభ్యులు, ఉత్తర టెక్సాస్ తెలుగు సంభం కార్యవర్గ సభ్యులు, పాలక మండలి సభ్యులు డాక్టర్ వేమూరి వెంకటేశ్వర్ రావును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టాంటెక్స్ అధ్యక్షుడు చినసత్యం వీర్నపు, ఉత్తరాధ్యక్షుడు కోడూరు కృష్ణారెడ్డి, సతీష్ బండారు, శ్రీకాంత్ జొన్నల, పాలక మండలి సభ్యులు చంద్ర కన్నెగంటి, పవన్ నెల్లుట్ల, సాహిత్య వేదిక కమిటీ సభ్యులు స్వర్ణ అట్లూరి, బసాబత్తిన, డాక్టర్ ఇస్మాయిల్, ఇతర కార్యవర్గ సభ్యులు, భాషాభిమానులు, తదితరులు పాల్గొన్నారు. -
డాలస్లో ట్యాక్స్ అండ్ ఎస్టేట్ సదస్సు
డాలస్ : ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్), నాట్స్ సంయుక్తంగా ట్యాక్స్ అండ్ ఎస్టేట్ సదస్సు నిర్వహించింది. టాంటెక్స్ అధ్యక్షులు వీర్నపు చినసత్యం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా బిజినెస్, మెంబర్ సర్వీసెస్ సమన్వయకర్త చంద్రారెడ్డి పోలిస్ సభను ప్రారంభించి అందరికి స్వాగతం పలికారు. అనంతరం టాంటెక్స్ నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించారు. 2018 సంవత్సరం నుండి ట్యాక్స్ చట్టాల్లో వచ్చిన మార్పులను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సీఏ మురళి వివరించారు. ఈ సంవత్సరపు గడువు, ఎఫ్బీఏఆర్, ఎఫ్ఏటీసీఏ చట్టాలు, న్యాయబద్దంగా ట్యాక్సు డబ్బులు ఆదా చేసే పద్దతులను తెలిపారు. అలాగే వాణిజ్య సంస్థలు ట్యాక్స్ డబ్బులు ఆదా చేసే మరికొన్ని పద్ధతులు సోదాహరణంగా పేర్కొన్నారు. ఆర్థికరంగా నిపుణులు తిరుమల్ రెడ్డి మాట్లాడుతూ.. భారత దేశం, అమెరికా దేశాల చట్టాలలో ముఖ్యంగా మరణానంతర ఆస్తుల సంక్రమణంలో తేడాలు వివరిస్తూ ఎస్టేట్ ప్లానింగ్ ప్రాముఖ్యతను, అవసరాన్ని గట్టిగా నొక్కి చెప్పారు. అలాగే డబ్బులు ఆదా చెయ్యాల్సిన అవసరం, పిల్లల కాలేజీల ఖర్చులు, ఉద్యోగ విరమణానంతర జీవితానికి సంబంధించి ఖర్చులు వాటిని సమర్థంగా ఎదుర్కొనడానికి అవలంభించాల్సిన ప్రణాళికలను వాటికి తన సంస్థ చేయగలిగిన సహాయాన్ని వివరించారు. ముఖ్యఅతిథులు మురళి, తిరుమల్ రెడ్డిని టాంటెక్స్ అధ్యక్షులు వీర్నపు చినసత్యం, ఉత్తరాధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు, కార్యదర్శి ఉమామహెష్ పార్నపల్లి, సంయుక్త కార్యదర్శి , ప్రబంధ్ రెడ్డి తోపుడుర్తి, కోశాధికారి శరత్ రెడ్డి యర్రం, సతీష్ బండారు, సమన్వయకర్త చంద్రారెడ్డి పోలిస్ పాలకమండలి సభ్యులు శాలువా, జ్ఞాపిక ఇచ్చి ఘనంగా సత్కరించారు. టాంటెక్స్ అధ్యక్షులు వీర్నపు చినసత్యం మాట్లాడుతూ మురళి, తిరుమల్ రెడ్డిల కమ్యూనిటీ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
టాంటెక్స్ ఆధ్వర్యంలో ఘనంగా ‘నెల నెలా తెలుగు వెన్నెల’
టెక్సాస్ : ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘నెల నెలా తెలుగు వెన్నెల’ 139వ సాహిత్య సదస్సు డల్లాస్లో ఘనంగా నిర్వహించారు. సాహిత్య వేదిక సమన్వయకర్త కృష్ణారెడ్డి నేతృత్వంలో ఆదివారం (ఫిబ్రవరి 17) ఈ కార్యక్రమం జరిగింది. ప్రవాస భారత సాంస్కృతిక రాజధాని డల్లాస్లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు పెద్ద సంఖ్యలో తరలి వఛ్చి ఈ సమావేశాన్ని జయప్రదం చేశారు. ప్రవాసంలో నిరాటంకంగా 139 నెలలుగా ‘నెల నెలా తెలుగు వెన్నెల’ సదస్సు నిర్వహించటం ఈ సంస్థ ప్రత్యేకత. కార్యక్రమంలో ముందుగా పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వీర సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలపాటు మౌనం పాటించి నివాళులు అర్పించారు. అనంతరం డాక్టర్ పుదూర్ జగదీశ్వరన్ తన 'ఆముక్త మాల్యద' పరిచయపు ధారావాహికను, ఎన్ఆర్యూ తెలుగు సామెతలు, నుడికారాల పరిచయపు ప్రహేళికను కొనసాగించారు. ఇటీవలే స్వర్గస్తులైన డాక్టర్ హేమలత పుట్ల జీవనయానాన్ని, రచనలను మరొక్క సారి గుర్తు చేస్తూ డాక్టర్ ఇస్మాయిల్ పెనుగొండ నివాళులు అర్పించారు. గీతాంజలి పేరుతో రచనలు చేస్తున్న ప్రముఖ రచయిత్రి డాక్టర్ భారతి, లలితానంద్ ప్రసాద్ స్వీయ కవితా గానాన్ని చేశారు. 'సందూక' లో పొందుపరిచి.. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నారాయణ స్వామి వెంకట యోగి గారిని దయాకర్ మాడ సభకు పరిచయం చేస్తూ.. ముఫై ఏళ్ల సుదీర్ఘ సాహితీ ప్రస్థానంలో నిబద్ధతతో వ్యవహరిస్తూ.. పీడితుల పక్షాన, బాధితుల గొంతుకగా మారి, తన అనుభవాల్ని, జ్ఞాపకాల్ని 'సందూక' లో పొందుపరిచి, తాను కన్న 'కల్లోల కలల మేఘం'.. ఉరుములు మెరుపులు కురిపిస్తూ 'వానొస్తదా ?' అని ప్రశ్నించే భావుకుడిగా అభివర్ణించారు. ఖండాలు దాటినా తన కవిసంగమపు కవిత్వ కరచాలనాన్ని మర్చిపోకుండా అక్షరీకరించి 'నడిసొఛ్చిన తొవ్వ' గా పదిలపరుచుకున్నారు. 'వానొస్తదా ?' సంపుటిలోని కొన్ని కవితలను నసీం సభకు చదివి వినిపించారు. సద్విమర్శ అవసరం.. ప్రధాన వక్త నారాయణ స్వామి వెంకట యోగి .. 'తెలుగులో వర్తమాన కవిత్వం - కవిత్వ విమర్శ ' అంశంపై ప్రసంగించారు. ప్రబంధ కాలం నుంచి నేటి దాకా సాహిత్యంలో వచ్చిన మార్పులను సోదాహరణంగా వివరించారు. స్థానికతకు నేటి కవితలలో ఉన్న ప్రాధాన్యతను, సామాజిక మాధ్యమాలలో విరివిగా వెళ్లి విరుస్తున్న నూతన గొంతుకలను, వారి వినూత్న కవితా వస్తువులను సభకు పరిచయం చేశారు. సద్విమర్శను తట్టుకోగలిగే స్థైర్యాన్ని కవులు కలిగి ఉండాలని, విమర్శకులు కూడా ముఖస్తుతికి కాకుండా వస్తు విమర్శ నిర్మొహమాటంగా చేయాలన్నారు. సరైన సద్విమర్శతో ఇటు రచయితకి అటు సాహిత్యానికి మేలు జరుగుతుందని వక్కాణించారు. 90 నిమిషాల పాటు ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగింది. ఉత్తర టెక్సాస్ తెలుగుసంఘం (టాంటెక్స్) అధ్యక్షుడు చినసత్యం వీర్నపు, ఉత్తరాధ్యక్షుడు కోడూరు కృష్ణారెడ్డి, కార్యదర్శి ఉమామహేష్ పార్నపల్లి, కోశాధికారి శరత్ యర్రం, సతీష్ బండారు, ఇతర కార్యవర్గ సభ్యులు, పాలక మండలి సభ్యులు చంద్ర కన్నెగంటి, సాహిత్య వేదిక కమిటీ సభ్యులు ముఖ్య అతిథి నారాయణ స్వామిని జ్ఞాపిక, దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. -
వీర జవాన్లకి ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం నివాళి
డాలస్ : టెక్సాస్లోని డాలస్లో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం సభ్యులు ఇర్వింగ్లో ఉన్న గాంధీ విగ్రహం దగ్గర దేశం కోసం వీరమరణం పొందిన జవాన్లకి ఆశ్రు నివాళి అర్పించారు. భారత దేశంలోని జమ్మూ కశ్మీర్లో పుల్వామాలో జవాన్ల పై జరిగిన తీవ్రవాద దాడిని దేశం మీద జరిగిన దాడిగా తెలుగు ఎన్ఆర్ఐలు వర్ణించారు. తీవ్ర వాదం వల్ల అనేక దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని ముఖ్యంగా భారత దేశం గత కొన్ని దశాబ్దాలుగా తీవ్రవాదంతో ఇబ్బంది పడుతోందన్నారు. ప్రపంచ దేశాలు అన్ని కలిసి తీవ్రవాదం మీద పోరాడి తీవ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పెకలించివేయాలని ప్రపంచదేశాలకి విజ్ఞప్తి చేశారు. తీవ్రవాదాన్ని పాకిస్తాన్ దేశం పెంచిపోషిస్తోందని, అనేక తీవ్రవాద సంస్థలకి పాకిస్తాన్ స్వర్గధామంగా మారిందని తెలుగు ఎన్ఆర్ఐలు అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ సైతం ఈ తీవ్రవాదంతో అనేక ఇబ్బందులు పడటమే కాకుండా తన దేశంలో ఉన్న అమాయక ప్రజలను పొట్టనబెట్టుకుంటోదని, మిగిలిన దేశాల్లో సైతం తీవ్రవాద భావజాల వ్యాప్తికి ఆ దేశం సహకరించడమే కాకుండా తీవ్రవాదులకి అన్ని రకాలుగా సహాయపడుతూ దాడులకి వారిని ప్రోత్సహించడం దారుణమని ప్రపంచ దేశాలన్నీ కలిసి అలాంటి దేశాల మీద చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి కష్ట సమయంలో భారత దేశంలో ఉన్న ప్రజలంతా తమ దేశపు సైన్యానికి, వీరమరణం పొందిన కుటుంబ సభ్యులకి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షులు చినసత్యం వీర్నపు, ఉత్తరాధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు, కార్యదర్శి ఉమా మహేష్ పార్నపల్లి, కోశాధికారి శరత్ యర్రం, సంయుక్త కార్యదర్శి ప్రబంద్ రెడ్డి తోపుదుర్తి, పూర్వాధ్యక్షులు సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, కార్యనిర్వాహక సభ్యులు సతీష్ బండారు, కల్యాణి తాడిమేటి, మనోహర్ కసగాని, ప్రభాకర్ రెడ్డి మెట్ట, సుమేద్ తాడిమేటి, పివి రావు, డాక్టర్ ఇస్మాయిల్, నారాయణ స్వామి వెంకట యోగి, దయాకర్ మాడ, గాలి శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి, కిషోర్ నీలకంటం, ఉదయ్ నిడగంటి, శ్రవణ్ నిడగంటి, చంద్ర, శ్రీనివాస్, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. -
టాంటెక్స్ ఆధ్వర్యంలో డల్లాస్లో సంక్రాంతి సంబరాలు
ముత్యాల ముగ్గులు.. రత్నాల గొబ్బిళ్లు.. భోగిమంటలు.. పిండి వంటలు.. కొత్త అల్లుళ్లు.. కోడిపందేలు.. సంక్రాంతి వచ్చిందంటేనే సంబరం.. ఎక్కడ లేని ఉత్సాహం. ఊరికి, దేశానికి దూరంగా అమెరికాలో ఉన్న తెలుగు వారికి ఈ పండుగ అంటే ఇంకా మమకారం. అమెరికాలోని తెలుగువారు ప్రతి పండుగను ఘనంగా జరుపుకొనేలా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్(టాంటెక్స్) ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాట్లు చేస్తుంటుంది. తెలుగు వారి సాంస్కృతిక వారధి, మూడు దశాబ్దాలకి పైబడి వారి మనసులు చూరగొంటున్న టాంటెక్స్ ఈసారి కూడా సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించింది. డల్లాస్/ఫోర్ట్ వర్త్ : తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్(టాంటెక్స్) ఆధ్వర్యంలో స్థానిక ఫ్రిస్కో హైస్కూల్లో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. అచ్చమైన తెలుగు వాతావరణాన్ని అణువణువునా ప్రతిబింబించే విధంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో, చూడ ముచ్చటైన సాంస్కృతిక కార్యక్రమాలతో అమెరికాలోని తెలుగువారు సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. టాంటెక్స్ అధ్యక్షుడు చిన్న సత్యం వీర్నపు, కార్యక్రమ, సాంస్కృతికి సమన్వయ కర్తలు ప్రబంధ్ రెడ్డి తోపుడుర్థి, సమీర ఇల్లెందుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. సంక్రాంతి పండుగ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టు సభా ప్రాంగణాన్ని అలంకరించారు. చిన్నారుల ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి స్థానిక బావార్చి ఇండియన్ రెస్టారెంట్ పసందైన పండుగ భోజనాన్ని వడ్డించింది. ఈ కార్యక్రమ ప్రసెంటింగ్ స్పాన్సర్స్ నితిన్ రెడ్డి శీలం, నాట్స్, ఇందిర అజయ్ రెడ్డి అండ్ ఫ్యామిలీ, ఈవెంట్ స్పాన్సర్స్ డా. ఉరిమిండి నరసిం హారెడ్డి,సుబ్రమణ్యం జొన్నలగడ్డ అండ్ ఫ్యామిలీ, మనోహర్ కసగాని, ఉమామహేష్ పార్నపల్లి అండ్ ఫ్యామిలీ, శరత్ రెడ్డి యర్రం, ప్లాటినం పోషక దాతలైన బావార్చి ఇండియన్ రెస్టారెంట్, ప్రసూనాస్ కిచెన్, క్వాంట్ స్విస్ టంస్,ఆల్బెర్ట్ సంతయ్య ఆఫ్ యెడ్వార్డ్ జోన్స్, విక్రం జంగం, డా. పవన్ పమడుర్తి, ప్రతాప్ భీమిరెడ్డి, శ్రీకాంత్ పోలవరపు, గోల్డ్ పోషక దాతలైన పసంద్ రెస్టారెంట్, విష్ పాలెపు సి.పి.ఏ, మైటాక్స్ ఫైలర్, మైటాక్స్ ఫైలర్, రాం కొనార, మెహతా జూలెర్స్, అడయార్ ఆనంద్ భవన్, బసేర ఇండియన్ రెస్టారెంట్, కిషొర్ చుక్కాల, సిల్వర్ పోషక దాతలైన సిం-పర్వతనేని- బ్రౌన్ లా ఆఫీసెస్, మురళి వెన్నం, డా. సుమన కేత, డా.భాస్కర్ రెడ్డి సానికొమ్ము, పెంటా బిల్డర్స్, టాంటెక్స్ మాజీ అధ్యక్షురాలు క్రిష్ణవేణి శీలంలకు చినసత్యం ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. -
టాంటెక్స్ 2019 నూతన కార్యవర్గం
డల్లాస్ : తెలుగు సంస్కృతికి, తెలుగు భాషకి ఎల్లప్పుడూ పట్టం కట్టే ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్ ) 2019 సంవత్సరానికి ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని జనవరి 6న డల్లాస్లో జరిగిన గవర్నింగ్ బోర్డు సమావేశంలో ప్రకటించారు. టాంటెక్స్ అధ్యక్షుడుగా వీర్నపు చినసత్యం బాధ్యతలు స్వీకరించారు. ఉపాధ్యాక్షులుగా కోడూరు కృష్ణా రెడ్డి, పాలేటి లక్ష్మీలలను నియమించగా, కార్యదర్శిగా పార్నపల్లి ఉమా మహేష్, సంయుక్త కార్యదర్శిగా తోపుదుర్తి ప్రభంద్ రెడ్డి, కోశాధికారిగా ఎర్రం శరత్, సంయుక్త కోశాధికారిగా బొమ్మ వెంకటేష్, తక్షణ పూర్వాధ్యక్షులుగా శీలం కృష్ణ వేణిలను ఎన్నుకున్నారు. అదే విధంగా పాలక మండలి బృంధాన్ని కూడా ఈ సమావేశంలో ప్రటించారు. పాలకమండలి అధిపతిగా ఎన్. ఎం. యస్.రెడ్డి, ఉపాధిపతిగా నెల్లుట్ల పవన్ రాజ్లను ఎన్నుకున్నారు. సభ్యులుగా కన్నెగంటి చంద్రశేఖర్, కొనార రామ్, మందాడి ఇందు రెడ్డి, ఎర్రబోలు దేవేందర్, డా. పామడుర్తి పవన్లను సంస్థ ఎన్నుకుంది. ఈ సందర్భంగా టాంటెక్స్ అధ్యక్షుడు వీర్నపు చినసత్యం మాట్లాడుతూ.. టాంటెక్స్ లాంటి గొప్ప సంస్థకి 33వ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించడం అదృష్టంగా భావిస్తున్నాని చెప్పారు. సంస్థ ప్రమాణాలను మరింత పెంచే దిశగా కృషి చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో కాజ చంద్రశేఖర్, మండిగ శ్రీలక్ష్మీ, మనోహర్ కసగాని, జొన్నల శ్రీకాంత్ రెడ్డి, కొండా మల్లిక్, మెట్టా ప్రభాకర్, తాడిమేటి కల్యాణి, లంక భాను, ఇల్లెందుల సమీర, బండారు సతీష్, చంద్రా రెడ్డి పోలీస్, యెనికపాటి జనార్దన్, కొనిదాల లోకేష్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
టాంటెక్స్ ఆధ్వర్యంలో మరో అష్టావధానం
డల్లాస్ : ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెన్నెల” 137వ సాహిత్య సదస్సు వీర్నపు చినసత్యం ఆధ్వర్యంలో డల్లాస్లో ఘనంగా జరిగింది. ప్రవాసంలో నిరాటంకంగా 137 నెలలుగా సాహితీ వేత్తల నడుమ ఈ సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ ప్రత్యేకత. ప్రవాస భారత సాంస్కృతిక రాజధాని డల్లాస్లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఈ సమావేశాన్ని జయప్రదం చేశారు. ముందుగా స్వాతి కృష్ణమూర్తి శిష్య బృందం అయిన లాస్య కండేపి, సహస్ర కాసం, సాన్విక కాసం, మనోజ్ఞ బొమ్మదేవర, ప్రితిక పలనిసేల్వం, దీప్తి గాలి, దర్శిత రాకం, శ్రీఆద్య ఊర, శ్రీనిధి తటవర్తి ప్రార్ధనా గీతం ఆలపించారు. కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరంలో జరిగిన కార్యక్రమాల సింహావలోకనం జరిగింది. నెలల వారిగా వచ్చిన అతిథుల, వారు ప్రసంగించిన అంశాల మీద చర్చ జరిగింది. అవధానంకు ప్రారంభ సూచకంగా మంజు తెలిదేవర శిష్య బృందం అయిన అనిక మల్లెల, అరుణ గోపాలన్, ద్రువ్ చిట్టిప్రోలు, సుమిత్ చిట్టిమల్ల, భవాని, ఈషాని గీతం ఆలపించారు. తరువాత సాహితి వేముల, సింధూర వేముల, సమన్విత మాడ గరుడ గమన గీతం ఆలపించారు. అమెరికాలో స్థిరనివాసం ఉంటున్న డా. పుదూర్ జగదీశ్వరన్ అవధానిగా ఎదిగి ఇటు ఇంటా అటు బయటా దిగ్విజయంగా అవధాన జైత్రయాత్ర చేయడం అందరినీ అబ్బురపరచే విషయం. అందరిలో ఉత్కంఠను రేపిన ఈ అవధాన కార్యక్రమానికి జువ్వాడి రమణ సంధాతగా, డా. తోటకూర ప్రసాద్ వ్యస్తాక్షరి, కాజ సురేష్ నిషిధ్ధాక్షరి, భాస్కర్ రాయవరం సమస్య, డా. సుధ కలవగుంట న్యస్తాక్షరి, డా. ఊరిమిండి నరసింహారెడ్డి దత్తపది, వేముల లెనిన్ వర్ణన, వీర్నపు చినసత్యం ఘంటాగణనం, దయాకర్ మాడ అప్రస్తుత ప్రసంగం అంశాలకు పృచ్చకులుగా వ్యవహరించారు. లేఖకులుగా బాసబత్తిన, రమణ దొడ్ల, కృష్ణ కోడూరి బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసి అమెరికా అవధానిగా పేరుగాంచిన డా. పుదూర్ జగదీశ్వరన్ గురు వందనంతో కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఆద్యంతం ఎలాంటి తొట్రుపాటు లేకుండా చలాకీగా నవ్వుతూ నవ్విస్తూ సమస్యలను పూరిస్తూ అందరినీ అలరింపచేశాడు. 'వాజియు నెక్కెను పఠాని ప్రాకట ఫణితిన్' అన్న సమస్యని శివాజీకి వర్తింప చేస్తూ గడుసుగా పూరించారు. పెరుగు, అరుగు, మరుగు, తరుగు పదాలను ఉపయోగిస్తూ మానవ సమతుల్య జీవనానికి సూత్రాలను దత్తపదిలో పూరించారు. వరూధినీ సౌందర్యాన్ని నిషిద్దాక్షరిలో లాఘవంగా పూరించారు. 20 అక్షరాల ఉత్పలమాల పాదాన్ని వ్యస్తాక్షరిలో ఛేదించారు. ఆద్యంతమూ అప్రస్తుత ప్రసంగం సభికులను నవ్వుల్లో ముంచెత్తింది. అవధాని కూడా చిలిపి ప్రశ్నలకు గడుసు సమాధానాలు ఇచ్చారు. అప్పుడే కార్యక్రమం ముగిసిందా అనిపిస్తూ అవధాని చివరగా అన్ని పద్యాలను అవలీలగా ధారణ చేయడంతో అవధానం దిగ్విజయంగా ముగిసింది. సభికుల హర్షద్వానాల మధ్య ఉత్తర టెక్సస్ తెలుగుసంఘం (టాంటెక్స్) అధ్యక్షురాలు కృష్ణవేణి శీలం , ఉత్తరాధ్యక్షులు చినసత్యం వీర్నపు , ఉపాధ్యక్షుడు కోడూరు కృష్ణారెడ్డి, సతీష్ బండారు, కోశాధికారి పాలేటి లక్ష్మి ఇతర కార్యవర్గ సభ్యులు, సాహిత్య వేదిక కమిటి సభ్యులు డా. పుదూర్ జగదీశ్వరన్ ను జ్ఞాపిక , దుశ్శలువాతో సన్మానించి, “అవధాన విరించి”బిరుదుతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుబ్బు జొన్నలగడ్డ, ఆనంద్ మూర్తి కూచిభోట్ల, జగదీశ్వర్ రావు, పులిగండ్ల విశ్వనాధ్, డా. ప్రసాద్ తోటకూర, సీ.ఆర్. రావు, రామకృష్ణ రోడ్ద ప్రముఖులు పాల్గొన్నారు. సమన్వయకర్త వీర్నపు చినసత్యం సాహిత్యం మీద ప్రేమ, మాతృభాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు. -
ఘనంగా టాంటెక్స్ నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు
డల్లాస్ : ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో 'నెల నెలా తెలుగు వెన్నెల' సాహిత్య సదస్సును సాహిత్య వేదిక సమన్వయకర్త వీర్నపు చినసత్యం అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ప్రవాసంలో నిరాటంకంగా 136 నెలలు పాటు ఉత్తమ సాహితీవేత్తల మధ్య సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం. భాషాభిమానులు, సాహిత్య ప్రియులు, అధిక సంఖ్యలో ఆసక్తితో ఈ సమావేశానికి విచ్చేసి, ఉత్సాహంగా పాల్గొని సభని జయప్రదం చేశారు. కార్యక్రమంలో ముందుగా మంజుల తెలిదేవర శిష్య బృందం వృంద, సంజన, హమ్సిక, అంటోనియో ప్రార్ధనా గీతంతో కార్యక్రమం ప్రారంభం అయ్యింది. తరువాత సింధూర, సాహితి వేముల అన్నమాచార్య కృతి ఆలపించారు. డా. ఊరిమిండి నరసింహారెడ్డి మన తెలుగు సిరి సంపదలు శీర్షికన, నానుడి, జాతీయాలు, పొడువు కథలు గురించి ప్రశ్నలు అడిగి సభికులలో ఆసక్తి రేకెత్తించారు. చంద్రహాస్ మద్దుకూరి ‘రగిలింది విప్లవాగ్ని ఈ రోజు’ పాట పూర్వాపరాలు వివరించారు. అలాగే దానిలో ఉపయోగించిన చరిత్ర, అల్లూరికి కలిగించిన ప్రేరణ వివరించారు. లెనిన్ వేముల తెలుగు శాసనాల చరిత్రని, పరిణామక్రమాన్ని వివరించారు. డా. పుదూర్ జగదీశ్వరన్ ఆముక్తమాల్యదలోని కొన్ని పద్యాలను రాగ యుక్తంగా చదివి వాటి అర్ధం వివరించారు. డా. ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి రాగ యుక్తంగా ఎంకి పాటలు పాడి అలరించారు. ముఖ్య అతిధి మల్లవరపు అనంత్ని మద్దుకూరి చంద్రహాస్ సభకు పరిచయం చేయగా, టాంటెక్స్ పూర్వాధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రమణ్యం పుష్పగుచ్చంతో సత్కరించారు. మల్లవరపు అనంత్ మాట్లాడుతూ.. శ్రీ శ్రీ ప్రముఖంగా అభ్యుదయ కవి, విప్లవ కవి అని, అలాంటి శ్రీ శ్రీ రచనలలోనుండి హాస్యం వెతకడం సాహసమే అవుతుందన్నారు. శ్రీ శ్రీ వ్రాసిన సిప్రాలి (సిరి సిరి మువ్వలు, ప్రాసక్రీడలు, లిమఋక్కులు ) పుస్తకాన్ని కూలంకషంగా పరిశీలించి దానిలోని హాస్యాన్ని సభికులకు పంచి సభలో నవ్వులు పూయించారు. కేవలం నవ్వు పుట్టించడం కోసమే కాకుండా చైతన్యం, విమర్శ, సామాజిక ప్రయోజనం లక్ష్యంగా శ్రీ శ్రీ రచనలలో హాస్యం తొణికిసలాడిందని పేర్కొన్నారు. ముఖ్యంగా అమెరికాలో తెలుగు సాహిత్యాన్ని మొదటి తరం సాహితీ వేత్తలు ముందు తరాల కందించే విధానానికి అమెరికాలోని సాహితీ వేత్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. అనంత్ మల్లవరపుని టాంటెక్స్ సాహిత్య వేదిక సభ్యులు, అధ్యక్షురాలు శీలం కృష్ణవేణి, ఉత్తరాధ్యక్షుడు వీర్నపు చినసత్యం, ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి కోడూరు, కోశాధికారి పాలేటి లక్ష్మి పాలకమండలి సభ్యులు శాలువా, జ్ఞాపిక ఇచ్చి ఘనంగా సత్కరించారు. అనంత్ మల్లవరపు తనను ఎంతో ఆదరించి, చక్కటి ఆతిథ్యం అందించిన టాంటెక్స్ కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలియజేశారు. టాంటెక్స్ అధ్యక్షురాలు కృష్ణవేణి శీలం మాట్లాడుతూ అనంత్ మల్లవరపు సాహిత్య సేవలను కొనియాడారు. సమన్వయకర్త వీర్నపు చినసత్యం సాహిత్యం మీద ప్రేమ, మాతృభాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు. -
ఘనంగా ముగిసిన టాంటెక్స్ 135వ సాహిత్య సదస్సు
డల్లాస్ : ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో 'నెల నెలా తెలుగు వెన్నెల' సాహిత్య సదస్సు నిర్వహించారు. సాహిత్య వేదిక సమన్వయకర్త వీర్నపు చినసత్యం అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ప్రవాసంలో నిరాటంకంగా 135 నెలల పాటు ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్య సదస్సులను టాంటెక్స్ నిర్వహించింది. భాషాభిమానులు, సాహిత్య ప్రియులు, అధిక సంఖ్యలో ఆసక్తితో ఈ సమావేశానికి విచ్చేసి, ఉత్సాహంగా పాల్గొని సభని జయప్రదం చేశారు. కార్యక్రమంలో ముందుగా చిన్నారులు వేముల సాహితి, వేముల సింధూర ప్రార్ధనా గీతంతో కార్యక్రమం ప్రారంభం అయ్యింది. తరువాత మనబడి చిన్నారులు గురజాడ దేశభక్తి గీతం ఆలపించారు. నానుడి, జాతీయాలు, పొడువు కథలు గురించి డా. ఊరిమిండి నరసింహ రెడ్డి ప్రశ్నలు అడిగి సభికులలో ఆసక్తి రేకెత్తించారు. చంద్రహాస్ మద్దుకూరి ‘పిలిచినా బిగువటరా’ పాట పూర్వాపరాలు వివరించారు. డా. ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి దేవరకొండ బాల గంగాధర్ తిలక్ కవితా వైశిష్ట్యాన్ని సోదాహరణంగా వివరించారు. కొన్ని కవితలు చదివి వినిపిస్తూ, అమృతం కురిసిన రాత్రితో ముగించారు. రమణ జువ్వాడి శ్రీనాధుని పద్య వైభవాన్ని కొన్ని పద్యాలు చదివి వివరించారు. డా. పుదూర్ జగదీశ్వరన్ ఆముక్తమాల్యదలోని కొన్ని పద్యాలను రాగ యుక్తంగా చదివి వాటి అర్ధం వివరించారు. ఉమా భారతి రాసిన ‘సరికొత్త వేకువ’, ‘నాత్యభారతీయం’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. బసాబత్తిన ‘నాట్య భారతీయం’ , ‘సరి కొత్త వేకువ’ పుస్తకాలను, రచయిత్రిని సభకు పరిచయం చేశారు. ఉమాభారతి కోసూరి మాట్లాడుతూ.. 'సాహిత్యమంటే.. ఓ పుస్తకం, వేమన పద్యాలు మాత్రమే కాదు. కళలంటే ‘తకిట తఝణులు’, రాగాలాపనలు మాత్రమే కాదు. ‘సహితస్య భావం సాహిత్యం’ అంటే అన్ని కళలు కలగలసినదే సాహిత్యం అని అర్ధం. కళలలో కవిత్వానిది అగ్రపీటం. కవిత్వం సాహిత్యంలో అంతర్భాగం అని మనకి తెలిసిందే. కవిత్వం అంటే దుఃఖార్తులకూ, శ్రమార్తులకూ, శోకార్తులకూ మానసికోల్లాసాన్ని కలిగించే దివ్య కళ అని నాట్యశాస్త్రంలో భరతుడు అంటాడు. అసలు జీవించడం నుండే సాహిత్యం పుట్టుకొస్తుంది అని కూడా అనవచ్చు. మానవ జీవనానికి గొప్ప మార్గదర్శకం మనకున్న సాహిత్య సంపదే అని, జీవన విధానాన్ని దిద్దుకునేందుకు సరిదిద్దుకునేందుకు కూడా మనకున్న గొప్ప సాహిత్య సంపద ఎంతైనా తోడ్పడుతుంది అని ఎందరో మేధావులు సూచించారు. అలాగే మనిషి మానసిక ఎదుగదల, సంక్షేమాలపై కూడా సాహిత్య, లలితకళల ప్రభావం తప్పక ఉంటుంది అని కూడా ఉండనే ఉంది. ముఖ్యంగా అమెరికాలో తెలుగు సాహిత్యాన్ని మొదటి తరం సాహితీ వేత్తలు ముందు తరాల కందించే విధానానికి ముగ్దురాలై అమెరికాలోని సాహితీ వేత్తలందరికీ ధన్యవాదాలు తెలుపుపుతున్నా' అని పేర్కొన్నారు. ఉమాభారతి కోసూరిని టాంటెక్స్ సాహిత్య వేదిక సభ్యులు, అధ్యక్షురాలు శీలం కృష్ణవేణి, ఉత్తరాధ్యక్షుడు వీర్నపు చినసత్యం, ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి కోడూరు, కార్యదర్శి శ్రీలు మండిగ, పాలకమండలి సభ్యులు శాలువా, జ్ఞాపిక ఇచ్చి ఘనంగా సత్కరించారు. తనను ఎంతో ఆదరించి, చక్కటి ఆతిధ్యం అందించిన టాంటెక్స్ కార్యవర్గానికి ఉమా భారతి కృతజ్ఞతలు తెలియజేశారు. టాంటెక్స్ అధ్యక్షురాలు కృష్ణవేణి శీలం మాట్లాడుతూ ఉమా భారతి నృత్య సేవలను కొనియాడారు. తన పూర్వ ప్రదర్శనలను గుర్తు చేసుకున్నారు. సమన్వయకర్త వీర్నపు చినసత్యం సాహిత్యం మీద ప్రేమ, మాతృభాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు. -
టాంటెక్స్ 134వ నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు
డల్లాస్, టెక్సాస్ : ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో 'నెల నెలా తెలుగు వెన్నెల' సాహిత్య సదస్సు జరిగింది. సాహిత్య వేదిక సమన్వయకర్త వీర్నపు చినసత్యం అధ్యక్షతన ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రవాసంలో నిరాటంకంగా 134 నెలలు పాటు ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించటం టాంటెక్స్ విశేషం. భాషాభిమానులు, సాహిత్య ప్రియులు, అధిక సంఖ్యలో ఆసక్తితో ఈ సమావేశానికి విచ్చేసి జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో ముందుగా చిన్నారులు వేముల సాహితి, వేముల సింధూర “కట్టెదురా వైకుంటము”, “అన్నమయ్య క్రుతి” కీర్తనలతో కార్యక్రమం ప్రారంభం అయ్యింది. దీపావళి గురించి రాసిన స్వీయ కవిత చదివి వినిపించారు. డా. ఊరిమిండి నరసింహ రెడ్డి - మన తెలుగు సిరి సంపదలు శీర్షికన, నానుడి, జాతీయాలు, పొడువు కథలు గురించి ప్రశ్నలు అడిగి సభికులలో ఆసక్తి రేకెత్తించారు. డా. ఉమాదేవి బల్లూరి చదివి వాటి అర్ధం ప్రశ్నలు సమాధానాలు అడుగుతూ సభ్యులను తమ చమత్కారమైన సమధాలనాలతో ఆనందభరితులను చేశారు. దయాకర్ మాడ 'చాటువుల' గురించి మాట్లాడుతూ రక రకాల ఇతివృత్తాలను సోదాహరణంగా వివరించారు. చివరగా బావపై బావమరిది రాసిన పద్యం చదివి దాని భావాన్ని వివరించి నవ్వించారు. డా. పుదూర్ జగదీశ్వరన్ ఆముక్తమాల్యదలోని ఒక పద్యాన్ని చదివి దాని అర్ధం వివరించారు. లెనిన్ వేముల తెలుగు శాసనాల చరిత్రని, పరిణామక్రమాన్ని వివరించారు. సాహిత్య వేదిక బృంద సభ్యుడు దయాకర్ మాడ ముఖ్య అతిథి వి.ఆర్.విధ్యార్ధిని సభకు పరిచయం చేశారు. నెలనెలా తెలుగు వెన్నెల సాహితీ సమావేశానికి వి.ఆర్.విధ్యార్ధి తమ ఉపన్యాసంలో ప్రపంచ సాహిత్య పునాదులు, ఆధునిక తెలుగు సాహిత్యంపై పాశ్చాత్య ఆధునిక సాహిత్య ప్రభావాలు, ఆధునిక తెలుగు సాహిత్యానికి మార్గదర్శకులైన వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు, రాయప్రోలు సుబ్బారావు మొదలగు వారి ప్రస్తావన తెస్తూ ఆధునిక తెలుగు సాహిత్యంలో ఒక్కో మార్గంలో ప్రముఖులైన కాళోజీ, శేషేంద్ర, అంపశయ్య నవీన్, పోట్లపల్లి రామారావు, కొందరు ఈతరం కవులు, రచయితల సాహిత్యం గురించి చర్చించారు. ఇంకా అమెరికాలో జరుగుతున్న తెలుగు సాహిత్య కృషిని కొనియాడారు. ముఖ్యంగా అమెరికాలో తెలుగు సాహిత్యాన్ని మొదటి తరం సాహితీ వేత్తలు ముందు తరాల కందించే విధానానికి ముగ్దుడై అమెరికాలోని సాహితీ వేత్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. వి.ఆర్.విధ్యార్ధిని టాంటెక్స్ సాహిత్య వేదిక సభ్యులు, అధ్యక్షురాలు శీలం కృష్ణవేణి, ఉత్తరాధ్యక్షుడు వీర్నపు చినసత్యం, పాలకమండలి సభ్యులు శాలువా, జ్ఞాపిక ఇచ్చి ఘనంగా సత్కరించారు. వి.ఆర్.విధ్యార్ధి తనను ఎంతో ఆదరించి, చక్కటి ఆతిధ్యం అందించిన టాంటెక్స్ కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలియజేశారు. టాంటెక్స్ అధ్యక్షురాలు కృష్ణవేణి శీలం మాట్లాడుతూ వి.ఆర్.విధ్యార్ధి సేవలను కొనియాడారు. సమన్వయకర్త వీర్నపు చినసత్యం సాహిత్యం మీద ప్రేమ, మాతృభాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు. -
డల్లాస్లో టాంటెక్స్ 'నెల నెలా తెలుగు వెన్నెల'
డల్లాస్ (టెక్సాస్) : ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో 'నెల నెలా తెలుగు వెన్నెల' తెలుగు సాహిత్య వేదిక 11వ వార్షికోత్సవ వేడుకలు డల్లాస్లో ఘనంగా జరిగాయి. స్థానిక ఫార్మర్స్ బ్రాంచ్ సెయింట్ మేరీస్ మలంకర చర్చి ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో డల్లాస్లోని తెలుగు భాషాభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. తెలుగు సాహిత్య వేదిక వార్షికోత్సవానికి శీలం కృష్ణవేణి అధ్యక్షత వహించగా, వీర్నపు చినసత్యం సమన్వయకర్తగా వ్యవహరించారు. 2018 సంవత్సరంలో జరిగిన సాహిత్య కార్యక్రమాల గురించి సాహిత్య వేదిక సమన్వయకర్త వీర్నపు చినసత్యం వివరించారు. లాస్య సుధ అకాడమీ విద్యార్థులైన శ్రావణి, హాసిని, బృంద, రుషిత, శ్రావ్య, సిరి, శ్రీనిధి, ఇషా కె, వినిష, ధాత్రిశ్రీ ప్రార్థనా గీతం ఆలపించారు. ఎన్.ఎస్.మూర్తిగారు 'అనువాద కథలు' అంశం మీద తాను స్వయంగా తర్జుమా చేసిన కొన్ని కథలు వాటి ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రసంగించారు. విశ్వపతి టీ.వీ.ఆర్.కె.మూర్తి 'అన్నమయ్య సాహిత్యంలో సాంఘిక సమానత్వం' అంశం మీద మాట్లాడారు. ప్రముఖ వెంట్రిలోక్విస్ట్ సంతోష్ తన అద్భుతమైన ప్రదర్శనతో అందరిని ఆనందంలోముంచెత్తారు. సత్కళాభారతి సత్యనారాయణ 'కళలు-సంస్కృతి' గురించి మాట్లాడారు. నెలనెలా తెలుగు వెన్నెల స్థాపకులను, ఇప్పటి దాకా ప్రతి సంవత్సరం సాహిత్య వేదిక నిర్వహించిన సమన్వయకర్తలను ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఘనంగా సత్కరించింది. ప్రభల అంజలి, కాకర్ల దీపిక, ప్రభల ఆరతి వాగ్గేయకార వైభవం తెలుపుతూ ఆలపించారు. డా.వైజర్సు బాలసుబ్రహ్మణ్యం 'సంగీత సాహిత్య సమన్వయం' అంశం మీద ప్రసంగించారు. ముత్తేవి రవీంధ్రనాథ్ 'తెలుగు సంస్కృతి - ఒక పరిచయం' అంశం మీద ప్రసంగించారు. టాంటెక్స్ అధ్యక్షులు శీలం కృష్ణవేణి తమ సందేశాన్ని సభకు వినిపించారు. ప్రఖ్యాత తెలుగు రచయిత చిలకమర్తి రచించిన 'గయ్యాళి గంగమ్మ' హాస్య నాటికను ప్రభల శ్రీనివాస్ దర్శకత్వంలో నటీనటులు ఇంగువ లావణ్య, తడిమేటి కళ్యాణి, గోలేటి శ్రీరాం చక్కగా ప్రదర్శించారు. ఎన్.టీ.ఆర్ జీవిత చరిత్ర అయిన' ఎదురులేని మనిషి' పుస్తకాన్ని డా. నందమూరి లక్ష్మి పార్వతి ఆవిష్కరించారు. అనంతరం 'సంస్కృతంలో చమత్కారాలు' అంశం మీద ప్రసంగించారు. ప్రముఖ నృత్య దర్శకులు డా.హలీం ఖాన్ ఆవుల కళ్యాణికిచెందిన అభినయ కూచిపూడి డాన్స్ అకాడమీ కళాకారులు మేకల నైషా, ఆవుల అభినయ్, కోలి శ్రీవల్లి, కొండల నమ్రత,కొండల అంషిక, నల్ల సమీక్ష, కర్ర దీషణ, వెలగ మహిత, గూడ అనీక, మంతెన రాధిక, కొండబోయిన శృతితో కలిసి తెలుగు భాష చరిత్ర విశేషాలను తెలుపుతూ 'తెలుగు ప్రస్థానం' అనే నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. సాహితీ ప్రముఖులందరిని ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు శీలం కృష్ణవేణి, ఉత్తరాధ్యక్షులు వీర్నపు చినసత్యం, కార్యవర్గ బృందం, పాలకమండలి అధిపతి కన్నెగంటి చంద్ర బృందం పాల్గొని పుష్ప గుచ్చం , దుశ్శాలువ, జ్ఞాపికలతో సన్మానించారు. తెలుగు భాష అభివృద్ధిని ఎల్లవేళలా ప్రోత్సహిస్తూ , ఈ 11 వ సాహిత్య వేదిక వార్షికోత్సవానికి తమవంతు ధన సహాయం అందించిన పోషక దాతలను అబినందిస్తూ, సంస్థ వారిని జ్ఞాపికలతో సన్మానించినది. ఎంతో కృషి, సమయం వెచ్చించిన టాంటెక్స్ సాహిత్య వేదిక కమిటీ, కార్యవర్గ సభ్యులకు, వివిధ కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
టాంటెక్స్ ఆధ్వర్యంలో కార్టూన్ సదస్సు
డల్లాస్ : ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) ఆధ్వర్యంలో కార్టూన్ వర్క్ షాప్ నిర్వహించారు. స్థానిక ఎస్.పి.ఆర్. బాంక్వెట్ హాల్లో శీలం కృష్ణవేణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ కార్టూనిస్ట్ టి.వి.ఆర్.కే.మూర్తి (విశ్వపతి) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విశ్వపతి పేరుతొ ప్రసిద్ధులైన మూర్తి ఇండియన్ ఎక్స్ప్రెస్లో 1984 నుంచి 1990 దాకా సమ్ఫన్ అనే శీర్షికతో కార్టూన్స్ వేశారు. ఆంధ్ర ప్రభ, ఆంధ్ర జ్యోతివంటి ప్రముఖ పత్రికల్లో 5వేలకు పైగా కార్టూన్లు వేశారు. టాంటెక్స్ పూర్వాధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం విశ్వపతిని సభకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కార్టూన్స్ గురించి తన అనుభవాలు జోడిస్తూ, రక రకాల బొమ్మలు ఎలా గీయొచ్చో తెలిపారు. అందరూ విశ్వపతి వేసిన బొమ్మలను అనుకరించి నేర్చుకోవడానికి ప్రయత్నించారు. ప్రతి ఒక్కరితో విశ్వపతి సంభాషిస్తూ, కార్టూన్లు గీయడంలో మెళకువలు వివరించారు. అంతేకాకుండా బాగా బొమ్మలు గీసిన వారికి తాను రాసిన 'సిన్సియర్లీ యువర్స్' పుస్తకాలను బహుమతిగా ఇచ్చారు. తాను గీసిన కొందరి ప్రముఖుల వ్యంగ్య చిత్రాలను టాంటెక్స్ కార్యవర్గ సభ్యులకు బహుమతిగా ప్రదానం చేశారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షురాలు శీలం క్రిష్ణవేణి, ఉత్తరాధ్యక్షుడు వీర్నపు చినసత్యం విశ్వపతిని శాలువతో, సంస్థ కార్యవర్గ సభ్యులు జ్ఞాపికతో సత్కరించారు. శీలం క్రిష్ణవేణి మాట్లాడుతూ విన్నూత్నంగా టాంటెక్స్ మొదటి సారిగా చేపట్టిన ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసిన వారికి, డ్రాయింగ్ పుస్తకాలను అందించిన కృష్ణ జ్యూవెలర్స్ వారికి, ఎస్.పి.ఆర్.బాంక్వెట్ హాల్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టాంటెక్స్ తక్షణ పూర్వాధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షుడు కోడూరు క్రిష్ణారెడ్డి, కార్యదర్శి మండిగ శ్రీలక్ష్మి, కోశాధికారి పాలేటి లక్ష్మి, కార్యవర్గ సభ్యులు బండారు సతీష్, ఇల్లెందుల సమీర పాల్గొన్నారు. -
మంచులక్ష్మితో ఫైర్ సైడ్ చాట్ షో
డల్లాస్ : డల్లాస్ మహానగరంలో ఉత్తరటెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో మంచులక్ష్మితో ఫైర్ సైడ్ చాట్ షో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచులక్ష్మి తాను మేముసైతం ప్రోగ్రాం ద్వారా చేస్తున్న సమాజసేవని వివరించారు. ఒక మహిళ నేటి సమాజంలో ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నా, ఒకనటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా నిలవడం ఎంత కష్టమో అని ఒకనటిగా, నిర్మాతగా, సంఘ సేవకురాలిగా చెప్పారు. మహిళకు అన్నిరంగాలలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని కాని వాటినన్నిటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు నడవాలని అక్కడికి వచ్చిన మహిళలను లక్ష్మీ ఉత్తేజపరిచారు. మంచులక్ష్మి తన సమయాన్ని కేటాయించి మహిళను సమాజంలో వివిధ రంగాలలో రాణించాలని ప్రోత్సహించడంతో పాటుగా, తను చేస్తున్న సామాజిక సేవని గుర్తించి ఉత్తర టెక్సాస్లో తెలుగు సంఘం, నాటా వారు ఆమెను పుష్పగుచ్చాలు, పీఠికలు, సాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి డల్లాస్లో తెలుగు వారు సుమారుగా 500 మందికి పైగా హాజరై విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగు వారికి, మీడియా వారికి, ఆతిధ్యమిచ్చిన హిల్టాప్ ఇండియా న్రెస్టారెంట్వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి సహకరించిన నాటాఎలెక్ట్ ప్రెసిడెంట్ కొర్సాపాటి శ్రీధర్ రెడ్డికి, మిగిలిన కార్యవర్గ, పాలక మండలి సభ్యులకు ఉత్తరటెక్సాస్ తెలుగు సంఘం తరుపున ధన్యవాదాలు తెలిపారు. -
తైక్వాండో విజేతలకు ఘన సత్కారం
డల్లాస్ : డల్లాస్లో జరిగిన అంతర్జాతీయ తైక్వాండో ఛాంపియన్ షిప్ పోటీలలో భారత క్రీడాకారులు అద్భుత విజయం సాధించారు. తెలుగు తేజాలైన కొండాసహదేవ్, అబ్దుల్ కలీల్, సింధు తపస్విలు బంగారు, రజత, కాంస్య పతకాలు సాధించారు. విజేతలకు స్థానిక తెలుగు సంస్థ టాంటెక్స్ (ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం), తెలంగాణ ఎన్.ఆర్.ఐ. విభాగం సంయుక్తంగా సత్కరించింది. ఇర్వింగ్ లోని అవర్ ప్లేస్ రెస్టారెంట్లో ఈ సత్కార కార్యక్రమం జరిగింది. తెలుగు భాష , సంస్కృతులను డల్లాస్ పరిసర ప్రాంతాల్లో 32 సంవత్సరాలకు పైగా పరిరక్షిస్తూ, వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్న టాంటెక్స్ సంస్థ ప్రస్తుత అధ్యక్షురాలు శీలం కృష్ణవేణి మాట్లాడుతూ తైక్వాండో పోటీల్లో విజయం సాధించి భారత దేశ కీర్తిని చాటిన విజేతలను సత్కరించడం తమ బాధ్యత అని తెలిపారు. సంవత్సరం పొడుగునా వివిధ క్రీడా కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. తెలుగు వారందరికీ గర్వ కారణమైన తైక్వాండో విజేతలను, ఈ క్రీడాకారులను ప్రత్యేక శిక్షణ ఇస్తూ తీర్చిదిద్దిన వారి కోచ్ జయంత్ రెడ్డి లను టాంటెక్స్ సంస్థ సభ్యులు జ్ఞాపికలతో సత్కరించారు. డా. మోహన్ గోలి, రఘు చిట్టిమల్లలు, తెలంగాణా ఎన్.ఆర్.ఐ. విభాగ సభ్యులకు, కార్యక్రమం జరిగిన అవర్ ప్లేస్ రెస్టారెంట్ యజమాని నరేంద్ర బాబులకు అభినందనలు తెలిపారు. వీర్నపు చినసత్యం, కోడూరు క్రిష్ణారెడ్డి, కోశాధికారి పాలేటి లక్ష్మి, కార్యవర్గ సభ్యులు శరత్ ఎర్రం, సమీర ఇల్లెందుల, బండారు సతిష్మరియుపాలక మండలి అధిపతి కన్నెగంటి చంద్ర, సభ్యుడు పవన్ నెల్లుట్ల ఈకార్యక్రమంలో పాల్గొన్నారు. -
సాహిత్యం పై సోషల్ మీడియా ప్రభావం
డల్లాస్ : ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక సమన్వయకర్త వీర్నపు చినసత్యం అధ్యక్షతన 'నెల నెలా తెలుగు వెన్నెల' సదస్సును ఘనంగా నిర్వహించారు. ఉత్తమ సాహితీవేత్తల నడుమ 126 నెలలుగా టాంటెక్స్ సాహిత్య సదస్సులు నిర్వహించింది. భాషాభిమానులు, సాహిత్య ప్రియులు, అధిక సంఖ్యలో ఆసక్తితో ఈ సమావేశానికి వచ్చి జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో ముందుగా స్వాతి శిష్యులు చిన్నారి శీలంశెట్టి శ్రీవల్లి, రాకం దర్షిత, గాలి దీప్తి మృదుమధురంగా ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. డా. ఊరిమిండి నరసింహారెడ్డి 'మన తెలుగు సిరిసంపదలు' శీర్షికను జాతీయాలు, నుడికారాలు, సామెతలు, పొడుపుకథలు గుర్తుచేస్తూ ఎంతో ఆసక్తికరంగా కార్యక్రమాన్ని ముందుకు నడిపారు. చిన్నారులు వేముల సాహితీప్రియ, వేముల సింధూరలు 'జయతి జయతి', 'జయ జయ ప్రియ భారత' గీతాలను చక్కగా పాడి ప్రశంసలు అందుకున్నారు. వేముల లెనిన్ 'గుర్రం జాషువా' కొన్ని పద్యాలను ఒక శీర్షికగా ప్రతినెలా పరిచయం చేయాలని ఉందని తెలియచేస్తూ, 'రాజు జీవించె రాతి విగ్రహములందు, సుకవి జీవించె ప్రజల నాలుకలందు' వంటి ఉదాహరణలను సభతో పంచుకున్నారు. మద్దుకూరి చంద్రహాస్ గతంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన బల్లూరి ఉమాదేవి రచించిన 'శ్రీ రామ దూత శతకం' పుస్తక పరిచయం చేశారు. పుస్తకం ముందుమాట చదువుతూ ఎన్నో విషయాలు తెలుసుకున్నాను అని, వాయుదేవుడి అంశగా రచయిత్రి ఆంజనేయుడు, భీముడు, మద్వాచార్యుడు ముగ్గురి పై కలిపి 115 పద్యాలు ఈ శతకంలో వ్రాశారని ఎంతో ఆసక్తికరంగా పరిచయం చేశారు. కన్నెగంటి చంద్ర స్వీయ కవిత 'ఒకప్పుడు', 'యుద్దం' చదివి వినిపించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ రచయిత్రి కర్ర విజయ 'సాహిత్యం పై సోషల్ మీడియ ప్రభావం' అనే అంశంపై ప్రసంగించారు. స్పందన, అభిప్రాయం వేరు వేరు అంటూ, నాటి పత్రికలలో స్పందన శీర్షికన వారాల తరబడి ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా ఎలా స్పందిచేవారో ఉదాహరణలతో గుర్తుచేశారు. నేటి సోషల్ మీడియాలో స్పందన, విమర్శలు అప్పుడప్పుడూ వెళ్ళే రైలు బండి అయితే, కామెంట్ల బండి మాత్రం ప్యాసింజర్ ట్రైన్లలా వెళ్తూనే ఉంటాయన్నారు. అందమైన తెలుగుభాష రచనలో అందంగా ఒదుగుతుంది, అదే మాటల్లో చెప్తే తేలిపోతుంది అంటూ ఉదాహరణలు చెప్పారు. నాటి నేతి సాహిత్య పోకడలపై ఆసక్తికరంగా ప్రసంగించారు. ముఖ్య అతిథిని సాహిత్య వేదిక పూర్వ సమన్వయకర్త సింగిరెడ్డి శారద పుష్పగుచ్ఛంతో సత్కరించి సభకు పరిచయం చేయగా, ప్రసంగానంతరం ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం తక్షణ పూర్వాధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి, పాలకమండలి సభ్యులు కన్నెగంటి చంద్ర దుశ్శలువాతో, సాహిత్యవేదిక బృంద సభ్యులు జ్ఞాపికతో సత్కరించారు. టాంటెక్స్ అధ్యక్షులు శీలం క్రిష్ణవేణి, తక్షణ పూర్వాధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి, ఉత్తరాధ్యక్షుడు వీర్నపు చినసత్యం, ఉపాధ్యక్షుడు కోడూరు క్రిష్ణారెడ్డి, కార్యదర్శి మండిగ శ్రీలక్ష్మి, పాలకమందలి సభ్యులు కన్నెగంటి చంద్ర, కార్యవర్గ సభ్యులు పాలేటి లక్ష్మి, బండారు సతిష్, పార్నపల్లి ఉమామహేష్, మరియు సాహిత్య వేదిక బృందం సభ్యులు డా. కలవగుంట సుధ, మాడ దయాకర్, అట్లూరి స్వర్ణ ఈకార్యక్రమంలో పాల్గొన్నారు. టాంటెక్స్ అధ్యక్షులు శీలం క్రిష్ణవేణి మాట్లాడుతూ ఈ సంవత్సరంలో తాము చేబట్టే అన్ని కార్యక్రమాలకు సహకరించి జయప్రదం చేయవలసిందిగా కోరారు. సాహిత్య వేదిక పూర్వ సమన్వయకర్త సింగిరెడ్డి శారద గత సంవత్సరమంతా కార్యక్రమానికి విచ్చేసిన సహకరించిన అందరికీ కృతఙ్ఞతలు తెలియజేస్తూ, ముందు ముందుకూడా మంచి అతిథులను వేదికకు పరిచయం చేసే బాధ్యత సాహితీప్రియులందరిదీ అని అన్నారు. సమన్వయకర్త వీర్నపు చినసత్యం సాహిత్యం మీద ప్రేమ, మాతృభాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన టీవీ 5, టి.ఎన్.ఐ, ఏక్ నజర్ లకు కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేశారు. -
టాంటెక్స్ అధ్యక్షురాలిగా శీలం కృష్ణవేణి
డాలస్ : తెలుగు సంస్కృతికి, తెలుగు భాషకు ఎల్లప్పుడూ పట్టం కట్టే ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) నూతన కార్యవర్గం ఎంపిక జరిగింది. ఈ నెల 7వ తేదీన డాలస్లో జరిగిన గవర్నింగ్ బోర్డు సమావేశంలో టాంటెక్స్ నూతన కార్యవర్గ వివరాలను ప్రకటించింది. టాంటెక్స్ నూతన అధ్యక్షురాలిగా శీలం కృష్ణవేణి పదవీ బాధ్యతలు తీసుకుంటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టాంటెక్స్ లాంటి ఉన్నత సంస్థకు అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. కొత్తపాలకమండలి, కార్యవర్గ సభ్యుల సూచనలతో 2018లో వినూత్న కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యనిర్వహక బృందం అధ్యక్షులు : శీలం కృష్ణవేణి ఉత్తరాధ్యక్షుడు : వీర్నపు చిన్నసత్యం ఉపాధ్యక్షుడు : కోడూరు కృష్ణారెడ్డి కార్యదర్శి : మండిగ శ్రీలక్ష్మీ సంయుక్త కార్యదర్శి : కసగాని మనోహర్ కోశాధికారి : పాలేటి లక్ష్మీ సంయుక్త కోశాధికారి : కొణిదల లోకేష్ నాయుడు తక్షణ పూర్వాధ్యక్షులు : ఉప్పలపాటి కృష్ణారెడ్డి కాజా చంద్రశేఖర్, సింగిరెడ్డి శారద, పార్నపల్లి ఉమా మహేష్, బ్రహ్మదేవర శేఖర్ రాజు, పద్మశ్రీ తోట, తోపుదుర్తి ప్రభంద్ రెడ్డి, లంక భాను, ఎర్రం శరత్, ఇల్లెందుల సమీర, బండారు సతీష్, చంద్రారెడ్డి పోలీస్, బొమ్మ వెంకటేష్, యెనికపాటి జనార్ధన్ పాలకమండలి బృందం అధిపతి : డా. సిరిపిరెడ్డి రాఘవ రెడ్డి ఉపాధిపతి : కొనార రామ్ కన్నెగంటి చంద్రశేఖర్, ఎన్ఎంఎస్ రెడ్డి, మందాడి ఇందు రెడ్డి, నెల్లూట్ల పవన్ రాజ్, ఎర్రబోలు దేవేందర్ -
టాంటెక్స్ వేదికపై 'మహిళ నాడు - నేడు'
డాలస్, టెక్సాస్ : ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక సమన్వయకర్త సింగిరెడ్డి శారద అధ్యక్షతన "నెల నెలా తెలుగు వెన్నెల" సదస్సును నిర్వహించారు. ప్రవాసంలో నిరాటంకంగా 123 నెలల పాటు సాహితీ వేత్తల నడుమ సాహిత్య సదస్సులను టాంటెక్స్ నిర్వహించింది. డాలస్లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు ఈ సమావేశానికి విచ్చేసి, జయప్రదం చేశారు. కార్యక్రమంలో లాస్య సుధ డాన్స్ అకాడమీ డా. కలవగుంట సుధ శిష్యులు ప్రార్థనా గీతం ఆలపించారు. డా. బల్లూరి ఉమాదేవి 123వ సాహిత్య సదస్సుకి ముఖ్య అతిథిగా విచ్చేసి ‘మహిళ నాడు - నేడు , వేమన దృష్టిలో మహిళ’ అనే అంశము పై ప్రసంగిస్తూ, గృహనిర్వహణతో పాటూ దేశప్రగతిలోను మహిళలు అగ్రస్థానంలో ఉన్నారన్నారు. వేదకాలంలోని గార్గి మొదలుకొని నేటి కాలం దాక మహిళ సాధించిన విజయాలను వివరించారు. అందుకే మాతృదేవోభవ అంటూ తల్లికి మొదటిస్థానమిచ్చారు. రుద్రమ దేవి, ఝాన్సీ లక్ష్మీ, ఇందిరా గాంధీ, విక్టోరియా రాణి, మార్గరేట్ థాచర్ ఇలా ఎందరో మహిళలు సాధించిన ప్రగతిని వివరించారు. వేమన మహిళలకిచ్చిన గౌరవాదరాలను విశదీకరించడంతో పాటూ స్వయంగా మహిళలపై వ్రాసిన పద్యాలను కవితలను చదివి వినిపించారు. తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గురించి మాసానికో మహనీయుడు ('మామ') అనే శీర్షికలో భాగంగా తోటకూర పల్లవి ఆహూతులకు తెలియజేశారు. సంస్థ పూర్వాధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహా రెడ్డి జాతీయాలు, నుడికారాలు, పొడుపుకథలు గుర్తుచేస్తూ కార్యక్రమంలో ప్రేక్షకులను కూడా పాల్గొనేట్టు చేసి ఎంతో ఆసక్తికరంగా కార్యక్రమాన్ని ముందుకు నడిపారు. రామరాజభూషణుడు రచించిన వసుచరిత్రలోని పద్యాలను జువ్వాడి రమణ వినిపించారు. అనంతరం యీరం ఖాన్ ‘మురిపాల ముకుందా సరదాల సనంద' అనే పాట పై చక్కటి నృత్యం చేసి ప్రేక్షకుల ప్రశంసలను పొందారు. ముక్కు తిమ్మన పారిజాతాపహరణములో సత్యభామ తన కోపాన్ని ఏ విధంగా చూపించిందో అనే ఘట్టాన్ని ఉదాహరణగా తీసుకుని స్త్రీల బలానికి కోపము ప్రధాన మని "మాసిన చీర గట్టుకొని మౌనము తోడ నిరస్త భూషయై"అన్న పద్యాన్ని ఆచార్య పుదూర్ జగదీశ్వరన్ శ్రోతలకు వినిపించారు. డా. ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి ‘అందమే ఆనందం... ఆనందమే జీవిత మకరందం’ లాంటి మధురమైన సినిమా గీతాలను తమ అధ్భుత గాత్రంతో ఆలపించి సభను అలరించారు. మద్దుకూరి చంద్రహాస్ అందమె ఆనందం, మనసున మనసై పాటల సాహిత్యం, పోతన, కొడాలి సుబ్బారావు, నార్ల వెంకటేశ్వరరావుల పద్యాలు కొన్ని చక్కగా విశ్లేషించారు. ముఖ్య అతిథి డా. బల్లూరి ఉమాదేవిని టాంటెక్స్ అధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణా రెడ్డి, పాలక మండలి సభ్యులు కన్నెగంటి చంద్రశేఖర్ శాలువాతో, కార్యక్రమ సమన్వయకర్త సింగిరెడ్డి శారద, సాహిత్య వేదిక బృంద సభ్యులు జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, వీర్నపు చినసత్యం, సాహిత్య వేదిక బృంద సభ్యులు డా. కలవగుంట సుధ, జయ తెలకపల్లి, శశి రెడ్డి కర్రి, పల్లవి తోటకూర తదితరులు పాల్గొన్నారు. సమన్వయకర్త సింగిరెడ్డి శారద సాహిత్యం మీద ప్రేమ, మాతృ భాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభి మానులకు, సాహితీ ప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు. -
టెక్సాస్లో ఘనంగా తెలుగు వైభవం కార్యక్రమం
టెక్సాస్: తెలుగు వైభవం, నెలనెలా తెలుగు వెన్నెల కార్యక్రమాలను ఉత్తర టెక్సాస్ సంఘం(టాంటెక్స్) టెక్సాస్లో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమాలకు పలువురు విశిష్ట అతిధులు హాజరయ్యారు. 120 నెలల పాటు వరుసగా సాహిత్య సదస్సులు నిర్వహించిన ఘనత టాంటెక్స్కు ఉంది. ప్రముఖ సాహితీవేత్తలను ఆహ్వానించి వారి సమక్షంలో టాంటెక్స్ ఈ సదస్సులను నిర్వహిస్తుంది. ఈ నెల 8వ తేదీన జరిగిన తెలుగు వైభవం 10వ వార్షికోత్సవం , తెలుగు వెన్నెల కార్యక్రమాలకు ఉప్పలపాటి కృష్ణారెడ్డి, సింగిరెడ్డి శారద, పలువురు సాహితీ ప్రియులు హాజరయ్యారు. సాహిత్య వేదిక సమన్వయ కర్త సింగిరెడ్డి శారద 2017లో జరిగిన సాహిత్య కార్యక్రమాల మీద మాట్లాడారు. ప్రొ. వీ దుర్గాభవాని తెలుగుసాహిత్యం మీద, దాసరి అమరేంద్ర 'తెలుగు యాత్రా సాహిత్యం' అనే అంశాలపై ప్రసంగించారు. డా.కాత్యాయని విద్మహే, వాసిరెడ్డి నవీన్, డా.కందిమళ్ల సాంబశివరావు, గొర్తి బ్రహ్మానందం, మెర్సీ మార్గరెట్, నశీం షేక్, కేవీ సత్యనారాయణ, ఆదిభట్ల మహేష్ ఆదిత్య తదతరులు కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. గాయని సునీత, వందేమాతంర శ్రీనివాస్, భార్గవి పిళ్లై, దినకర్, యాసిన్ నజీర్, సమీర భరద్వాజ్లు సంగీతంతో అలరించారు. -
డల్లాస్లో రేవంత్రెడ్డికి ఘన సత్కారం
టెక్సాస్: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం డల్లాస్లో 31వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టీడీపీ పక్షనేత రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనని టీఏఎన్టీఈఎక్స్ సభ్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం నెలనెలా తెలుగు వెన్నెల తెలుగు సాహితీ వేదికపై ఆయన ప్రసంగించారు. -
డల్లాస్లో టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు
డల్లాస్ ఉత్తర టెక్సాస్ తెలుగుసంఘం(టాంటెక్స్) ఆధ్వర్యంలో శ్రీహేవళంబి నామ ఉగాది ఉత్సవాలు డల్లాస్లో ఘనంగా జరిగాయి. టాంటెక్స్ అధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి, కార్యక్రమ సమన్వయకర్త పాలేటి లక్ష్మి, సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయ కర్త తోటపద్మశ్రీ పర్యవేక్షణలో ఈ ఉగాది ఉత్సవాలలో ఏర్పాటు చేసిన విభిన్నకార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ ఉగాది ఉత్సవాలకు సుమారు1100మందికి పైగా తెలుగు వారు హాజరు కాగా సుమారు 250మంది పిల్లలు, పెద్దలు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని సందడిచేశారు. అమెరికా జాతీయ గీతంతో కార్యక్రమం ప్రారంభమై, 'ఏకదంతాయ వక్రతుండాయ' అంటూ వివిధ సంప్రదాయక నృత్యాలతో కార్యక్రమాలు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీటవేస్తూ కొనసాగాయి. భారతదేశం నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన కోమలి సోదరీమణులు కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తూ, చక్కటిమాటలతో, మిమిక్రీ ప్రదర్శనలతో ప్రేక్షకులందరిని ఎంతో ఆనందపరిచారు. సంప్రదాయమైన నృత్యాలతోపాటు, సినిమాపాటలు వీక్షకులను అలరించాయి. ఉగాది సందర్భంగా కంటంరాజు సాయికృష్ణ పంచాంగ శ్రవణం వినిపించారు. ఉగాదిని పురస్కరించుకొని టాంటెక్స్2017 ’ఉగాది పురస్కారాల’ను ఈ సంవత్సరం వైద్య, తెలుగుభాషాభివృద్ది, విద్యా రంగాలలో విశేష సేవలందించిన వ్యక్తులకు ప్రకటించారు. వైద్యరంగంలో డా.గునుకుల శ్రీనివాస్, తెలుగుభాషాభివృద్ది రంగంలో కే.సి. చేకూరి, విద్యారంగంలో డా. పుప్పాల ఆనంద్లకు ఈ పురస్కారాలను అందజేశారు. అదే విధంగా సంస్థ వివిధ కార్యక్రమాలలో ఎనలేని సేవలను అందిస్తున్న దివాకర్ మల్లిక్, డా. కలవగుంటసుధ, మార్పాక పరిమళ, తుమ్మల జస్మిత, నిడిగంటి ఉదయ్లను‘ఉత్తమస్వచ్ఛందసేవకుడు (బెస్ట్ వాలంటీర్)’పురస్కారంతోసత్కరించారు. అలాగే కార్యక్రమానికి విచ్చేసిన అతిథికళాకారులైన మెజీషియన్ వసంత్, గాయకుడు కూరపాటి సందీప్, కోమలి సోదరీమణులను టాంటెక్స్ కార్యవర్గ బృందంజ్ఞాపికలతో సత్కరించారు. సంస్థ రేడియో కార్యక్రమాలకు 2016 సంవత్సరంలో వ్యాఖ్యాతలుగా స్వచ్ఛందంగా సేవలందించిన వారికి జ్ఞాపికలను అందించారు. ఈ ఉగాదికార్యక్రమం విజయవంతం కావడంతో కృసి చేసిన ఎన్ఎస్ఐ సంస్థ, రాం కొనార, పోలవరపు శ్రీకాంత్, రిచ్మండ్ హిల్ మోంటెస్సోరి సంస్థ, ప్రాడిజీ టెక్నాలజీస్, వీర్నపు చిన సత్యంలకు టాంటెక్స్ కృతఙ్ఞతలు తెలిపింది. -
దేవులపల్లి కృష్ణశాస్త్రిని స్మరించుకున్న టాంటెక్స్
డల్లాస్ (టెక్సాస్) : ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) ఆధ్వర్యంలో 'నెల నెలా తెలుగువెన్నెల' సాహిత్యసదస్సును డల్లాస్లోని దేశీ ప్లాజా టీవీస్టూడియోలో నిర్వహించారు. సాహిత్య వేదిక సమన్వయకర్త సింగిరెడ్డి శారద అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. డల్లాస్లోని భాషాభిమానులు, సాహిత్య ప్రియులు పెద్ద ఎత్తున ఈ సమావేశానికి హాజరయ్యారు. సింగిరెడ్డి శారద సభను ప్రారంభిస్తూ 115వ నెలనెలా తెలుగు వెన్నెల సదస్సుకి విచ్చేసిన సాహితీ ప్రియులకు స్వాగతంపలికారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి వర్ధంతి సందర్భంగా నివాళి అర్పిస్తూ జ్యోతిప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో ముందుగా దేవులపల్లికృష్ణశాస్త్రి రచించిన భక్తిగీతాలను ప్రభలశ్రీని, దీపిక, ప్రభలఉమ, ప్రభలఅంజలి, చాగంటిశ్రీక, ఎడవల్లి శ్రేయ, మద్దుకూరిమహిత, మద్దుకూరిఅభినుతి, అనసారపుశ్రేయాస్, రాయవరం స్నేహిత్, ప్రభల ఆరతిలు ఆలపించారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన కొన్ని సినీగీతాలను వడ్లమన్నాటి నాగి, శ్రీలక్ష్మి, శ్రీనివాస్ ఇయ్యుణ్ణి పాడారు. సాహిత్యవిశ్లేషకుడు వేముల లెనిన్ బాబు ఆంధ్రమహా భారతం అవతారికలోని విశేషాలను ప్రస్తావించారు. డల్లాస్కి చెందిన సాహిత్యాభిమాని మద్దుకూరి విజయచంద్రహాస్ 'ఆంధ్రనగరి' పుస్తకాన్ని పరిచయం చేశారు. జంధ్యాల మాటలతో తోకల గోపి కడుపుబ్బా నవ్వించారు. జువ్వాడి రమణ తెలుగు సాహిత్యంలో ముస్లిం రచయితలు అనే అంశం పై ప్రసంగించారు. దేవులపల్లి కృష్ణ శాస్త్రి రచించిన 'కొలువైతివా రంగసాయి' గేయానికి గురు పరంపరస్కూల్ అఫ్ఆర్ట్స్ నుంచి హేమమాలిని చావలి శిష్యురాలు సనంపూడి కౌముది నాట్యం చేశారు. కూచిపూడి కళాక్షేత్ర పద్మసొంటి శిష్యులు విళ్లా అమూల్య, కటసానిగీతిక 'భోశంభో' పాటకి నాట్యం చేశారు. 115వ నెలనెలాతెలుగువెన్నెల సదస్సుకి ముఖ్య అతిథిగావిచ్చేసిన విశ్వకళా భారతి డా.రత్నకుమార్ భావ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రిసాహిత్యం - అనుభూతులు అంశం మీద ప్రసంగించారు. తాతగారితో తనకున్నఅనుభవాలను గుర్తుచేసుకుంటూ ఆ సాహితీ జ్ఞాపకాలను సభతో పంచుకున్నారు. పలు ప్రముఖ గేయాలకు వింజమూరి అనసూయతో స్వరపరుచుకోవడం తనకు బాగా గుర్తు అని చెప్పుకొచ్చారు. కృష్ణశాస్త్రి రాసిన 'జయ జయ ప్రియ భారత' గేయం భారత దేశ జాతీయ గీతం అయితే ఎంతో బాగుండేదని ఆమె అభిప్రాయపడ్డారు. దేవులపల్లి కృష్ణ శాస్త్రి గురించి పలువురి ప్రశ్నల కుడా. రత్నకుమార్ ఓపికగా సమాధానాలిచ్చారు. టాంటెక్స్ అధ్యక్షులు ఉప్పలపాటికృష్ణారెడ్డి, తక్షణ పూర్వాధ్యక్షులు జొన్నల గడ్డ సుబ్రహ్మణ్యం, సంయుక్త కార్యదర్శి కోడూరుకృష్ణారెడ్డి, సంయుక్త కోశాధికారి మండిగ శ్రీలక్ష్మి, పాలకమండలి అధిపతి రొడ్డా రామక్రిష్ణారెడ్డి, పాలకమండలి సభ్యులు రుమాళ్ల శ్యామల, కన్నెగంటి ఛంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు పార్నపల్లి ఉమామహేశ్వర్, కొణిదల లోకేష్ నాయుడు, పాలేటి లక్ష్మి, తోపుదుర్తి ప్రబంద్ ఈ కార్యక్రమంలోపాల్గొన్నారు. -
అట్టహాసంగా టాంటెక్స్ సంక్రాంతి సంబరాలు
డాలస్/ఫోర్ట్ వర్త్: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) డల్లాస్ లో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఘనంగా ముగిశాయి. సాంస్కృతిక బృంద సమన్వయకర్త లక్ష్మి పాలేటి , కార్యక్రమ సమన్వయకర్త జ్యోతి వనం ఆధ్వర్యంలో ఉప్పలపాటి కృష్ణారెడ్డి గారి అధ్యక్షతన జనవరి 28న డల్లాస్ లోని ఇర్వింగ్ హైస్కూల్లో టాంటెక్స్ సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ప్రధాన వ్యాఖ్యాతలుగా సమీరా ఇల్లందుల, మధుమహిత మద్దుకూరి, అభినుత మద్దుకూరిలు సంప్రదాయానికి పెద్ద పీట వేసి, ఆధునికతను మేళవించి తెలుగు వారిలో ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. 2017 వ సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని టాంటెక్స్ నూతన అధ్యక్షుడు ఉప్పలపాటి కృష్ణారెడ్డిని పూర్వాధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం సభకు పరిచయం చేశారు. ఉప్పలపాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఈ సంక్రాంతి పర్వదినాన నూతన ఉత్సాహంతో తెలుగు భాషకు, ప్రజలకు సేవ చేయడమే పరమార్ధంగా భావిస్తానని చెప్పారు. తెలుగు జాతి మొత్తం గర్వపడేలా సంస్థ అభివృద్ధికి కృషి చేస్తామని, మహా తెలుగు సభలు టాంటెక్స్ ఆధ్వరంలో నిర్వహిస్తామన్నారు. మాజీ అధ్యక్షుడు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. గతేడాది మీరు అందించిన సహాయ సహకారాలు ఈ సంవత్సరం కూడా కొనసాగించాలని, తెలుగు జాతి అభ్యున్నతికి అందరూ కృషి చేయాలని పిలుపు నిచ్చారు. జొన్నలగడ్డకి శాలువా కప్పి పుష్పగుచ్చాలతో టాంటెక్స్అధ్యక్షులు కృష్ణా రెడ్డి ఉప్పలపాటి గారు, పాలకమండలి సభ్యులు ఘనంగా సన్మానించారు. అలాగే కార్యనిర్వాహక సభ్యులుగా విశేష సేవలందించిన జ్యోతి వనం, వెంకట్ దండ, రఘుగజ్జల, సుగన్ చాగర్లమూడి, శ్రీనివాస రెడ్డి గుర్రంలను జ్ఞాపికలతో సత్కరించారు.ఇక్కడికి విచ్చేసిన టాటా సంస్థ ప్రస్తుత అధ్యక్షుడు, డైమండ్పోషక దాత డా.ఝాన్సి రెడ్డిని కార్యవర్గం సన్మానించింది. విశిష్ట అతిధి, బుల్లి తెర వ్యాఖ్యాత, చలన చిత్ర నటుడు జెమిని సురేష్ తన సినీ అనుభవాలను పంచుకున్నారు. స్వరమంజరి అనే కార్యక్రమం ద్వారా టాంటెక్స్ వారు నూతన కళాకారులను వెలుగులోకి తెచ్చి వారికి చక్కని అవకాశాలు కల్పిస్తారు. 2016 విజేతలయిన స్నిగ్ధ ఏలేశ్వరపు, కీర్తి చామకూర, దీపికా కాకర్ల అద్భుతమైన గాత్రంతో ప్రేక్షకులను మైమరపింప చేశారు. శ్రీ లక్ష్మితోరం నేతృత్వంలో నాట్య ప్రదర్శన, గిరిజా ఆనంద్ రూపకల్పనలో ‘శివ పూజకు వేళాయరా’, శ్రీ దేవి యడ్లపాటి గారి ఆధ్వర్యంలో ‘శంభో శివ శంభో’ అనే పాటకు, జయలక్ష్మి గొర్తి ‘శ్రీమాన్నారాయణ’ శాస్త్రీయ నృత్యం, రూప బంద రూపకల్పనలో ‘ఓం మహాప్రాణ దీపం’ నృత్యం, హేమమాలిని చావలి ‘కొలువైతివా రంగ సాయి’ అంటూ చక్కని నృత్యాలు కనుల విందు చేశాయి. నూతన కార్యనిర్వాహక సభ్యులు భాను లంక, మనోహర్ కాసగాని, ప్రబంధ రెడ్డి తోపుదుర్తి, శరత్ రెడ్డి ఎర్రం, సమీరా ఇల్లందులను, పాలక మండలి సభ్యులు చంద్ర కన్నెగంటి, రాం కొనార, వేణు పావులూరిలను కమిటీలోకి ఆహ్వానించారు. క్రాంతి కార్యక్రమం చేపట్టిన చంద్రశేఖర్ కాజ,అజయ్ గోవాడ, శ్రీలు మండిగ, జెమిని సురేశ్ లను సత్కరించారు. ఆహూతులకు టచ్ నైన్ వారు పసందైన విందు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో చీరలు, చుడిదార్లు, గాజులతో నిండిన ఎన్నో స్టాల్ లు అతివలకోసం ఏర్పాటుచేశారు. అక్కడే టాక్స్ ఫైలింగ్ ఏర్పాట్లు, యోగ, ఆర్యోగ సంబంధిత స్టాల్ ల ద్వారా ఎన్నో విషయాలు తెలిపారు. సంక్రాంతి సంబరాలు” కార్యక్రమ సమన్వయకర్త జ్యోతి వనం , ఎంతో ఓపికగా నాలుగు గంటల వినోదాన్ని ఆస్వాదించిన ప్రేక్షకులకు, అతిథులకు, రుచికరమైన విందు భోజనం వడ్డించిన టచ్ నైన్ రెస్టారెంట్ యాజమాన్యంకు, మరియు నేటి కార్యక్రమ పోషకులకు కృతఙ్ఞతలు తెలియజేశారు. -
ఘనంగా టాంటెక్స్ 114వ సాహిత్య సదస్సు
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో "నెలనెలా తెలుగు వెన్నెల" సాహిత్య సదస్సు జనవరి 15న దేశీప్లాజా టీవీ స్టూడియోలో సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. డాలస్లోని భాషాభిమానులు, సాహితీప్రియులు పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి విచ్చేసి సభను జయప్రదం చేశారు. ప్రవాసంలో నిరాటంకంగా 114 నెలలపాటు ఉత్తమ సాహితీవేత్తల నడుమ సదస్సులు నిర్వహించడం ఈ సంస్థ విశేషం. ఈ సదస్సుకి విచ్చేసిన సాహితీప్రియులకు కార్యక్రమ సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ స్వాగతం పలికారు. 2017 ఏడాదికిగానూ సమన్వయకర్తగా శారద సింగిరెడ్డిని సభకు పరిచయం చేస్తూ వేదికమీదికి ఆహ్వానించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డా.ఆళ్ల శ్రీనివాసరెడ్డిని పరిచయం చేస్తూ ఎం.వి.ఎల్.ప్రసాద్ వేదిక మీదకు ఆహ్వానించగా డా.సి.ఆర్.రావు, కలవలరావులు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేశారు. కార్యక్రమంలో ముందుగా చిరంజీవి కమ్మంకర్ శ్రీతన్ ప్రార్థనా గీతాన్ని ఆలపించాడు. భగవద్గీత నేర్చుకుంటున్న శ్రీతన్ మొదటి, ఎనిమిదో అధ్యాయాలలో ఏ పద్యం అడిగినా పద్యం చెప్పి, అర్ధం వివరించి అందరి మెప్పు పొందాడు. గతంలో ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా వచ్చిన పిస్కా సత్యనారాయణ.. ద్వాపరయుగంలోని శ్రీకృష్ణుడిని, కలియుగంలోని శ్రీకృష్ణదేవరాయలని అనుసంధానిస్తూ కొన్ని పద్యాలను ఉదహరించారు. సాహిత్యవేదిక సభ్యులు డా.కలవగుంట సుధ క్షేత్రయ్య పదసాహిత్యంతో సాహితీ ప్రేక్షకులను అలరించారు. మద్దుకూరి చంద్రహాస్ 'నేనొక ప్రేమ పిపాసిని' అనే పాటలో రెండు చరణాలు పాడి, మూడో చరణంలో అందమైన సాహిత్యం దాగిఉందో వివరించారు. జువ్వాడి రమణ శాతవాహనులకి ఆ పేరు ఎలా వచ్చిందో ఈ సందర్భంగా తెలిపారు. వేముల లెనిన్ కొన్ని నన్నయ పద్యాలను పాడి వినిపించారు. డా.ఆళ్ల శ్రీనివాసరెడ్డి 'జానపదం మరియు భావకవిత్వం'పై దాదాపు తొంభై నిమిషాలపాటు ప్రసంగించారు. జానపదంలో వేర్వేరు ప్రాంతాల యాసలను, ఆయా పాటల లక్షణాలను చెబుతూ, కవులు, రచయితల కలాల నుంచి ఎలా వెలువడ్డాయో వివరించారు. 2016ఏడాదికి సంస్థ అధ్యక్షుడిగా వ్యవహరించిన జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. నెలనెలా తెలుగువెన్నెల సదస్సును విజయవంతంగా నిర్వహిస్తున్న బృంద సభ్యులను, సమన్వయకర్తలను అభినందించారు. మూడు దశాబ్దాల చరిత్రగల సంస్థలో బాధ్యతలు చేపట్టం అదృష్టమని అధ్యక్షుడు ఉప్పలపాటి కృష్ణారెడ్డి అన్నారు. ముఖ్య అతిథిని టాంటెక్స్ అధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి, పాలకమండలి అధిపతి రొడ్డ రామకృష్ణలు శాలువాతో, కార్యక్రమ సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ మరియు సాహిత్య వేదిక బృందసభ్యులు జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. టాంటెక్స్ ఉత్తరాధ్యక్షులు శీలం కృష్ణవేణి, ఉపాధ్యక్షులు వీర్నపు చినసత్వం, కోశాధికారి గోవాడ అజయ్, సంయుక్త కోశాధికారి మండిగ శ్రీలక్ష్మి, పాలకమండలి సభ్యులు కన్నెగంటి చంద్ర, కార్యవర్గసభ్యులు డా.ఊరిమిండి నరసింహారెడ్డి, దండ వెంకట్, సింగిరెడ్డి శారద, పార్నపల్లి ఉమామహేష్, తోపుదుర్తి ప్రభంధ్, లంకా భాను, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సదస్సుకు విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీ ప్రియులకు, మీడియాకు బిళ్ళా ప్రసాద్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. -
ఉప్పలపాటి అధ్యక్షతన టాంటెక్స్ నూతన కార్యవర్గం
డాలస్, ఫోర్ట్ వర్త్ : తెలుగు సంస్కృతి, తెలుగు భాష కోసం అహర్నిషలు కృషి చేస్తున్న ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) 2017 సంవత్సరానికి కొత్త కార్యవర్గం ఏర్పాటైంది. ఇర్వింగ్లో జరిగిన గవర్నింగ్ బోర్డు సమావేశంలో టాoటెక్స్ 2017 నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. టాంటెక్స్ అధ్యక్షుడిగా ఉప్పలపాటి కృష్ణారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. టాంటెక్స్ లాంటి సంస్థకు అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు తీసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఉత్తర అమెరికాలోనే ప్రతిష్టాత్మక సంస్థ అయిన టాంటెక్స్ను ముందుండి నడపవలసిన బాధ్యతను తన మీద పెట్టినందుకు టాంటెక్స్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవలే టాంటెక్స్ అధ్యక్షడిగా పదవీ విరమణ చేసిన జొన్నల గడ్డ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. ఉప్పలపాటి కృష్ణారెడ్డి నేతృత్వంలోని కార్యవర్గ బృందానికి తన సంపూర్ణ సహకారం ఉంటుందని పేర్కొన్నారు. టాంటెక్స్ అధికారిక కార్యనిర్వాహక బృందం.. అధ్యక్షుడు : ఉప్పలపాటి కృష్ణారెడ్డి సంయుక్త కార్యదర్శి : కోడూరు కృష్ణారెడ్డి ఉత్తరాధ్యక్షులు: శీలం కృష్ణవేణి కోశాధికారి : గోవాడ అజయ్ ఉపాధ్యక్షుడు : వీర్నపు చిన్న సత్యం సంయుక్త కోశాధికారి : మండిగ శ్రీలక్ష్మీ కార్యదర్శి : కాజ చంద్రశేఖర్ పాత అధ్యక్షుడు: జొన్నలగడ్డ సుబ్రమణ్యం ఇతర సభ్యలు : ఆదిభట్ల మహేష్ ఆదిత్య, పాలేటి లక్ష్మీ, బిళ్ల ప్రవీణ్, సింగిరెడ్డి శారద, కొణిదల లోకేష్ నాయుడు, బ్రహ్మదేవర శేఖర్ రాజ్, పార్నపల్లి ఉమా మహేష్, పద్మశ్రీ తోట, తోపుదుర్తి ప్రబంధ్ రెడ్డి, కసగాని మనోహర్, లంక భాను, ఎర్రం శరత్, ఇల్లెందుల సమీర. పాలక మండలి అధిపతి : రొడ్డ రామకృష్ణా రెడ్డి, ఉపాధిపతి : పావులూరి వేణుమాధవ్, ఇతర సభ్యులు : డా. సిరిపిరెడ్డి రాఘవరెడ్డి, పుట్లూరు రమణ, రుమాళ్ల శ్యామ, కొనార రామ్, కన్నెగంటి చంద్రశేఖర్. -
ఘనంగా టాంటెక్స్ 112వ సాహిత్య సదస్సు
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో "నెలనెలా తెలుగు వెన్నెల" సాహిత్య సదస్సు నవంబర్ 20న దేశీప్లాజా టీవీ స్టూడియోలో సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. డాలస్లోని భాషాభిమానులు, సాహితీప్రియులు పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి విచ్చేసి సభను జయప్రదం చేశారు. 112వ నెలనెలా తెలుగు వెన్నెల సదస్సుకి విచ్చేసిన సాహితీప్రియులకు బిళ్ళా ప్రవీణ్ స్వాగతం పలికారు. స్వాతి అన్నమయ్య కీర్తన గానంచే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంజాబ్కు చెందిన శ్రీ కుల్దీప్ సింగ్, డాలస్కి చెందిన కాజా సురేష్ తమ అనుభవాలను పంచుకున్నారు. గతంలో ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా వచ్చిన పిస్కా సత్యనారాయణ మహాకవి శ్రీనాధుని శ్లేష చమత్కారం గురించి ప్రసంగించారు. టాంటెక్స్ పూర్వాధ్యక్షులు డా.ఊరిమిండి నరసింహారెడ్డి తెలుగు భాషలోని జాతీయాలు, సామెతలను సభికులకు గుర్తు చేశారు. ప్రతి నెల అట్లూరి స్వర్ణ నిర్వహించే ప్రశ్నావళి కార్యక్రమం సందడిగా జరిగింది. ఆర్జే శ్రీ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ సదస్సుని తెలుగు వన్ రేడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేశారు. సాహిత్య సదస్సుకి ముఖ్య అతిథిగా విచ్చేసిన వేముల లెనిన్ బాబుని మద్దుకూరి చంద్రహాస్ వేదిక మీదకు ఆహ్వానించగా, ప్రొఫెసర్ దంతు రాం ఆయనకు పుష్పగుచ్చం అందజేశారు. తొంభై నిముషాల పాటూ అనర్గళంగా దాశరథి గారి పాటలనే కాకుండా మహాకవి శ్రీశ్రీ పద్యాలను లెనిన్ ఆలపించారు. లెనిన్ను టాంటెక్స్ అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, ఉత్తరాధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి శాలువాతో, బిళ్ళా ప్రవీణ్, సాహిత్య వేదిక బృంద సభ్యులు జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టాంటెక్స్ పూర్వాధ్యక్షులు డా.ఊరిమిండి నరసింహారెడ్డి, కాకర్ల విజయ్, కార్యదర్శి వీర్నపు చినసత్యం, కోశాధికారి దండ వెంకట్, కార్యవర్గ సభ్యులు పావులూరి వేణు, తోట పద్మశ్రీ , పాలేటి లక్ష్మి పాల్గొన్నారు. సదస్సుకు విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీ ప్రియులకు, మీడియాకు బిళ్ళా ప్రసాద్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. -
బ్రౌన్ దొరని స్మరించుకున్న టాంటెక్స్ సాహిత్య వేదిక
డల్లాస్: ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో "నెలనెలా తెలుగు వెన్నెల" సాహిత్య సదస్సు అక్టోబర్ 16వ తేదీన దేశీప్లాజా టీవీ స్టూడియోలో ఘనంగా జరిగింది. సాహిత్యవేదిక సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో డాల్లాస్లోని భాషాభిమానులు, సాహిత్యప్రియులు పాల్గొన్నారు. ప్రవాసంలో నిరాటంకంగా 111 నెలలపాటు ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్యసదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం. బిళ్ళా ప్రవీణ్ సభను ప్రారంభిస్తూ 111వ నెలనెలా తెలుగు వెన్నెల సదస్సుకి విచ్చేసిన సాహితీప్రియులకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో ముందుగా శ్రీమతి అనిపిండి మీనాక్షి శిష్య బృందానికి చెందిన చిన్నారులు చక్కగా అన్నమయ్య కీర్తనలు గానం చేసారు. డా. ఎం.డీ.ఎన్.రావు "అమ్మ కవిత"ని చదివి వినిపించారు. ఇటీవలే స్వర్గస్తులయిన తమ తల్లిగారి జ్ఞాపకాలతో రాసిన కవితని చదువుతూ ఆమెకి నివాళి అర్పించారు. గతంలో 76వ నెలనెలా తెలుగు వెన్నెల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ పిస్కా సత్యనారాయణ "సీతని చూసి నవ్విన బలరాముడు" అన్న అంశం మీద ఆసక్తికరంగా ప్రసంగించారు. రామాయణ కాలంనాటి సీతని భారత కాలానికి చెందిన బలరాముడిని పద్యం ద్వారా కలిపి చక్కగా చెప్పారు. సాహిత్యవేదిక సభ్యులైన మాడ దయాకర్ "భాష-ఏకాక్షరం" అంశం మీద మాట్లాడారు. మరే భాషలో లేని సోయగం తెలుగు భాషకు ఉందని చెప్తూ ఒక చిన్న అక్షరంతో ఎంతో భావాన్ని చెప్పగలమని ఉదాహరణలతో విశ్లేషించారు. "శ్రీ రమణ పేరడీలు" అంశం మీద శ్రీ మద్దుకూరి చంద్రహాస్ ప్రసంగిస్తూ కొన్నిటిని సభకు పరిచయం చేసారు. ప్రముఖులు ప్రేమలేఖలు రాస్తే ఎలా ఉంటుందో చెపుతూ కొన్ని చదివి వినిపించారు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ప్రేమలేఖ రాస్తే ఎలా ఉంటుందో చెప్తూ అందరినీ నవ్వుల్లో ముంచెత్తారు. ప్రతి నెలా జరిగే నెలనెలా తెలుగు వెన్నెలలో అట్లూరి స్వర్ణ నిర్వహించే ప్రశ్నావళి కార్యక్రమం బాగా సందడిగా జరుగుతుంది. ఈ సారి కూడా స్వర్ణ అడిగిన ప్రశ్నలకు సభికులు తికమక పడ్డారు. ప్రతి ఆదివారం సాయంత్రం ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం సమర్పించే టాంటెక్స్ తరంగిణి కార్యక్రమం తెలుగు వన్ రేడియో ద్వారా 4 గంటల నుండి 6 గంటల వరకు సాగుతుంది. ఈ కార్యక్రమానికి RJ శ్రీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ 111వ నెలనెలా తెలుగు వెన్నెల సదస్సుని దేశీ ప్లాజా స్టూడియో నుండి టాంటెక్స్ తరంగిణిలో తెలుగు వన్ రేడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేసారు. సదస్సుకి ముఖ్య అతిథిగా హాజరైన టాంటెక్స్ మరియు తానా మాజీ అధ్యక్షులు డా. తోటకూర ప్రసాద్ను మద్దుకూరి చంద్రహాస్ వేదిక మీదకు ఆహ్వానించగా, శ్రీ కల్వల రావు, శ్రీ పులిగండ్ల విశ్వనాథం, శ్రీ ఎం.వి.ఎల్.ప్రసాద్, శ్రీ పుదూర్ జగదీశ్వరన్ కలిసి ముఖ్య అతిథికి పుష్పగుచ్చం అందచేసారు. పాల్గొన్నారు. తెలుగు సాహిత్యరంగంలో విశేష కృషి చేసిన విదేశీయుడు చార్లెస్ బ్రౌన్ గురించి ఆయన ప్రసంగించారు. బ్రౌన్ పుట్టుపూర్వోత్తరాలను ఉద్యోగ బాధ్యతలను పరిచయం చేస్తూ తెలుగు భాషకి గ్రంధ సేకరణ, పరిరక్షణ, ముద్రణ, వ్యాకరణ రచన, నిఘంటువు రచన, లఘు రచనల కోవల్లో ఆయన చేసిన అద్భుతమైన కృషిని విశదీకరంగా వివరించారు. మెకంజీ, లెయిడన్ వంటి వారు సేకరించిన రెండువేలకు పైబడిన తాళపత్రాలను మద్రాస్ గ్రంధాలయానికి తరలించడమే కాకుండా తనకు తానుగా సుమారు 2440 గ్రంధాలను కూడా ఈ గ్రంధాలయానికి అందించిన మహోన్నత తెలుగు భాషాభిమాని బ్రౌన్ దొర అని ప్రసాద్ వివరించారు. తనకు పక్షవాతం వచ్చినా కూడా తెలుగును పరుగెత్తించిన నిబద్ధత కలిగిన విదేశీయుడు బ్రౌన్ దొర అని ఆయన తెలుగు భాషకు అందించిన సేవలు చిరస్మరణీయాలు అని తోటకూర కొనియాడారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో బ్రౌన్ స్మారక చిహ్నాల ఏర్పాటు, జయంతి-వర్థంతిల నిర్వహణ, విద్యార్థులకు బ్రౌన్ పేరిట ఉపకారవేతనాలు వంటి వాటిని అందించి బ్రౌన్కు ప్రభుత్వాలు నిజమైన నివాళి అర్పించాలని ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. కేవలం ప్రజలతో సంభాషిస్తూనే బ్రౌన్ తెలుగుని నేర్చుకుని, వ్యాకరణ సూత్రాలను రచించి, నిఘంటువును రూపొందించారని, వేమన శతకానికి ప్రాచుర్యం కల్పించి ఎన్నో శతకాలు, తాళపత్ర గ్రంధాలకు పుస్తకరూపం తీసుకు వచ్చిన అరుదైన వ్యక్తి బ్రౌన్ దొర అని ప్రసాద్ కొనియాడారు. అనంతరం ముఖ్య అతిథిని ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం మరియు పాలక మండలి అధ్యక్షులు గుర్రం శ్రీనివాస్ రెడ్డి శాలువాతో మరియు కార్యక్రమ సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ మరియు సాహిత్య వేదిక బృంద సభ్యులు జ్ఞాపిక తో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఉత్తరాధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి, పూర్వాధ్యక్షులు డా.ఊరిమిండి నరసింహారెడ్డి, కాకర్ల విజయ్, కార్యదర్శి వీర్నపు చినసత్యం, కోశాధికారి దండ వెంకట్, కార్యవర్గ సభ్యులు పావులూరి వేణు, పాలేటి లక్ష్మి, వనం జ్యోతి, లోకేష్ నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాహిత్య వేదిక బృంద సభ్యులు డా. కలవగుంట సుధ, వరిగొండ శ్యాం, జలసూత్రం చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
అత్యద్భుతంగా నెల నెలా తెలుగు వెన్నెల
టెక్సస్ : అమెరికా తెలుగు వీధికి శాశ్వత చిరునామా అయిన డాలస్లో ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో 'నెల నెలా తెలుగు వెన్నెల' ఘనంగా నిర్వహించారు. నెల నెలా తెలుగు వెన్నెల 9వ సాహిత్య వేదిక వార్షికోత్సవంతో పాటు108వ సదస్సు ఆదివారం సెయింట్ మేరీ మలంకారా చర్చి ఆడిటోరియంలో నభూతో న భవిష్యతి అన్న రీతిలో అత్యంత శోభాయమానంగా జరిగింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర, తెలంగాణ ఇలా వివిధ తెలుగు ప్రాంతాల నుండి వచ్చిన ప్రముఖులు, ఆయా ప్రాంతాల సంస్కృతి సంప్రదాయాలను, వ్యావహారిక శైలిని కళ్ళకు కట్టినట్లు వివరించి, ప్రాంతాలు వేరైనా , యాసలు వేరైనా మనమంతా తెలుగు తల్లి బిడ్డలం అని ఘనంగా చాటిచెప్పారు. ఇంతకు ముందెన్నడూ జరిగని ఈ అపురూప సమాగమం, అత్యద్భుత వ్యాఖ్యాన సుందరదృశ్యకావ్యం మనసుకు హత్తుకుని మైపరిచిపోయేలా చేశాయి. టాంటెక్స్ కమిటీ సభ్యులు , సాహిత్య వేదిక సభ్యులు జ్యోతి ప్రజ్వలనం గావించగా, ఎల్ఎంఏ మ్యూజిక్ అకాడమీ విద్యార్థులు మధురంగా గానం చేయగా 9వ వార్షిక ఉత్సవం ప్రారంభమైంది. సాహిత్య వేదిక సమన్వయకర్త ప్రవీణ్ బిళ్ళా మాట్లాడుతూ, 108 నెలల క్రితం నాటిన సాహిత్య వేదిక విత్తనం దిన దిన ప్రవర్ధమానం చెంది, ఈనాడు ఒక వట వృక్షమై ఎందరో తెలుగు అభిమానులకు మధుర ఫలాలు అందిస్తోందని, ఇది సంగీత సాహిత్యాలు ఒకటిగా పెనవేసుకున్న మణిహారమన్నారు. టాంటెక్స్ అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రమణ్యం గారు మాట్లాడుతూ , 2007 లో మొదలు పెట్టిన నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమం ఇన్ని నెలలుగా నిరాటంకంగా కొనసాగుతూ ఉత్తర అమెరికాలో మొట్టమొదటి సుదీర్ఘ తెలుగు కార్యక్రమంగా గుర్తింపు తెచ్చుకోవడం ఎంతో సంతోషంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన గొప్ప రచయితలు,వక్తలు ప్రసంగించారు. -
ప్రకృతి పాటలతో పులకించిన 'తెలుగు వెన్నెల'
టెక్సస్ : ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో 'నెల నెలా తెలుగు వెన్నెల' సదస్సు ఆదివారం దేశీ ప్లాజా టీవీ స్టూడియోలో అంగరంగ వైభవంగా జరిగింది. సాహిత్య వేదిక సమన్వయకర్త బిళ్ల ప్రవీణ్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ప్రముఖ జానపద గాయని శ్రీమతి తేలు విజయ పల్లె పాటలతో ప్రారంభమైంది. డా.జువ్వాడి రమణ మాట్లాడుతూ... దాశరథి రచించిన నా తెలంగాణ కోటి రతనాల వీణ పాటను గానం చేశారు. ఈ సందర్భంగా దాశరథి రాసిన ఆ పాటను ఆయన కూలంకుషంగా వివరించారు. డాలస్ వాస్తవ్యులు వేముల లెనిన్ పితృ దినోత్సవం, మాతృ దినోత్సవం సందర్భంగా రచించిన పద్యాలను చదివి వినిపించారు. పునేకు చెందిన స్పీచ్ థెరఫిస్టు అజిత్ హరిసింఘాని ఆంగ్ల రచనను కొల్లూరు సోమశంకర్ తెలుగులో 'ప్రయాణానికే జీవితం' అనే పేరుతో అనువదించారు. ఈ పుస్తకాన్ని సాహిత్య వేదిక సభ్యులు బసాబత్తిన శ్రీనివాసులు సభకు పరిచయం చేశారు. ఆ పుస్తకంలోని పలు అంశాలను ఆయన ఈ సందర్భంగా సవివరంగా విశదీకరించారు. ఈ 107వ సాహిత్య సదస్సుకి లోక కవి డా.అందెశ్రీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రకృతి - కవితాకృతి అనే అంశంపై ఆయన ప్రసంగించారు. 2010లో మిసిసిప్పీ నది నుంచి ప్రపంచయాత్ర మొదటిపెట్టి మళ్లీ 2016లో మిసిసిప్పీలోనే పూర్తి చేసిన విశేషాలను ఆయన హృద్యంగా పంచుకున్నారు. అందెశ్రీ ప్రకృతి మీద తీయని పాటలు పాడుతూ దాదాపు రెండున్నర గంటలు ఆహుతులను మంత్రముగ్థులను చేశారు. ఆ తర్వాత ఆహుతులతో ప్రశ్నోత్తరాల కార్యక్రమం చాలా సరదాగా సాగింది. అందె శ్రీ ప్రసంగాన్ని తొలిసారిగా ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం నిర్వహిస్తున్న టాంటెక్స్ తరంగిణి రేడియో కార్యక్రమంలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. అనంతరం అందెశ్రీని టాంటెక్స్ అధ్యక్షుడు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, ఉత్తరాధ్యక్షుడు ఉప్పలపాటి కృష్ణారెడ్డి ఘనంగా సత్కరించారు. సాహిత్య వేదిక బృందం సభ్యులు జ్ఞాపిక అందజేశారు. వేసవి నేపథ్యంలో డాలస్లో చిన్నారులకు సంగీత శిక్షణ ఇవ్వడానికి వచ్చిన రామాచారి కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. భావితరాలకు తెలుగు భాషని పంచవలసిన అవశ్యకతను రామాచారి ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో తక్షణ పూర్వాధ్యక్షులు డా.ఊరిమిండి నరసింహారెడ్డి, కార్యదర్శి వీర్నపు చినసత్యం, కోశాధికారి దండ వెంకట్, కార్యవర్గ సభ్యులు మండిగ శ్రీలక్ష్మి, కోడూరు కృష్ణారెడ్డి మరియు సాహిత్య వేదిక బృంద సభ్యులు డా.కలవగుంట సుధ, అట్లూరి స్వర్ణ, మార్తినేని మమత, మాడ దయాకర్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు సాహిత్య వేదిక సమన్వయకర్త బిళ్ల ప్రవీణ్ ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషీ, టీవీ 5, టీఎన్ఐలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రవాసంలో నిరాటంకంగా 107 నెలల పాటు సాహితీవేత్తల నడుమ ఈ సంస్థ సాహిత్య సదస్సులు నిర్వహించడం విశేషం. డాలస్లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు ఈ సమావేశానికి విచ్చేసి జయప్రదం చేశారు. -
కన్నుల పండువగా టాంటెక్స్ మైత్రి సదస్సు
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) మైత్రి ఆధ్వర్యంలో ఫాదర్స్ డే సంబరాలను ఘనంగా నిర్వహించారు. టచ్ నైన్ ఇండియన్ రెస్టారెంట్ లో జరిగిన ఈ కార్యక్రమానికి మైత్రి సమన్వయకర్త మండిగ శ్రీలక్ష్మి అధ్యక్షత వహించారు. చిన్నారులు సహస్ర, వనం హర్షిత్ తదితరులు పాటలు, కవితలతో అలరించారు. ఇదే కార్యక్రమంలో నాన్న ప్రేమను తెలియజేస్తూ ప్రదర్శించిన ‘మా నాన్న’ షార్ట్ ఫిల్మ్ అందరినీ ఆకట్టుకుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లంతా తమను తాము పరిచయం చేసుకున్నారు. అనంతరం మైత్రి బృంద సభ్యులు వనం జ్యోతి, చాగర్లమూడి శ్రీదేవి, బింగి సుమన “నేం బింగో”, "టాబూ" ఆటలు ఆడించడంతో కాసేపు అంతా చిన్నపిల్లలు అయిపోయారు. పంచె కట్టే పోటీ చాలా సరదాగా సాగి.. అందరినీ నవ్వించింది. ఆటల్లో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పాలకమండలి సభ్యుడు రొడ్డా రామకృష్ణ ఎన్నో తెలుగు పుస్తకాలు, నవలలను పంచిపెట్టారు. టాంటెక్స్ అధ్యక్షుడు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, ఉత్తరాధ్యక్షుడు ఉప్పలపాటి కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు శీలం కృష్ణవేణి, తక్షణ పూర్వాధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి, కార్యవర్గ సభ్యులు వనం జ్యోతి, మండిగ శ్రీ లక్ష్మి, పాలేటిలక్ష్మి, తోట పద్మశ్రీ, పార్నపల్లి ఉమామహేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేపడతామని, సభ్యుల కోరిక మేరకు జూలైలో మైత్రి సభ్యులకు కేరమ్స్, చెస్ పోటీలు నిర్వహిస్తామని సమన్వయకర్త మండిగ శ్రీలక్ష్మి తెలిపారు. -
ఉత్కంఠభరితంగా సాగిన టాంటెక్స్ వాలీబాల్ టోర్నమెంట్
డాలస్ : క్రీడల పట్ల మన దేశీయులకున్న ఆసక్తి చూస్తే చాలా గర్వంగా ఉందని డాలస్లోని ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షుడు జొన్నలగడ్డ సుబ్రమణ్యం అన్నారు. డాలస్లోని స్పోర్ట్స్ ప్లెక్స్ సెంటర్లో ఆదివారం (మే 1వ తేదీ) వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఉదయం 8.00 గంటలకు ఈ వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభమై... సాయంకాలం 7.00 గంటల వరకు ఉత్కంఠభరితంగా సాగింది. ఈ టోర్నమెంట్కు డాలస్తోపాటు ఫోర్ట్వర్త్ నగరం నుంచి 25 జట్లు పాల్గొన్నాయి. వాటిని నాలుగు పూల్స్గా విభజించి... ఆట మొదలుపెట్టారు. ఇందులో గెలిచిన 16 జట్లు క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నారు. ఇక్కడ నుంచి 8 జట్లు లెవెల్-1 కప్ కోసం ఆడగా మిగతా 8 జట్లు లెవెల్-2 కప్ కోసం ఆడారు. ఫైనల్స్ చేరుకున్న 4 జట్ల మధ్య ఆట హోరాహోరీగా సాగింది. లెవెల్-1 కప్లో అంబ్లిక్స్vs కేయాస్ మధ్య జరిగిన ఫైనల్స్లో కేయాస్ జట్టు విజేతగా నిలిచింది. లెవెల్-2 కప్లో స్నయిపర్స్-2 vs పంజాబ్ లయన్స్ మధ్య జరిగిన ఫైనల్స్ లో పంజాబ్ లయన్స్ విజేత గా నిలిచింది. టోర్నమెంట్ అనంతరం టాంటెక్స్ క్రీడల సమన్వయకర్త బ్రహ్మదేవర శేఖర్ మాట్లాడుతూ... వాలీబాల్ టోర్నమెంట్కి ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఇదే మొదటిసారి అని తెలిపారు. ఈ టోర్నమెంట్ కోసం కష్టపడి ఏర్పాట్లు చేసినందుకు ఫలితం దక్కిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. క్రీడా విభాగం సభ్యులైన డా.కొండ తిరుమలయ్య,తోట పద్మశ్రీ, పూర్వ రాజ్వడే,రాజ వైశ్యరాజు, మధుమతి వైశ్యరాజు, శరత్ ఎర్రం తమ వంతు సహాయ సహకారాలు అందించారు. టాంటెక్స్ పుర్వాధ్యక్షులు డా.ఉరిమిండి నరసింహారెడ్డి, కార్యదర్శి వీర్నపు చినసత్యం, పాలకమండలి సభ్యులు రొడ్ద రామకృష్ణ, కోశాధికారి దండవెంకట్, కార్యనిర్వాహక సభ్యులు కోడూరు కృష్ణ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్లో పాల్గొన్న జట్లుకు జొన్నలగడ్డ సుబ్రమణ్యం, బ్రహ్మదేవర శేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. -
ఘనంగా టాంటెక్స్ 105 వ సాహిత్య సదస్సు
-
ఘనంగా టాంటెక్స్ 105 వ సాహిత్య సదస్సు
డాలస్/ఫోర్టువర్త్: తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన 'నెలనెలా తెలుగు వెన్నెల' 105వ సాహిత్య సదస్సు ఆద్యంతం భాషామృతాన్ని కుమ్మరించింది. దేశీప్లాజా టీవీ స్టుడియోలో నిర్వహించిన ఈ సదస్సులో ఉగాది కవి సమ్మేళనంతోపాటు నిర్వహించిన తెలుగు ప్రక్రియలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సాహిత్యవేదిక సమన్వయకర్త బిళ్లా ప్రవీణ్ సభకు అధ్యక్షత వహించారు. ప్రారంభోపన్యాసం అనంతరం 'శ్రీ గణనాథం' గీతాలాపనతో దుర్ముఖినామ సంవత్సర కవి సమ్మేళనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్ధండులతోపాటు ఔత్సాహికులు కవితలు, పద్యాలు, ప్రసంగాలు చేశారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 'నవల- కథన శిల్పం' అంశంపై డాక్టర్ సి. మృణాళిని ప్రసంగించారు. ప్రముఖ కవి జొన్నవిత్తుల రాసిన 'తెలుగు పద్యముల ప్రసాదం' పద్యాన్ని చిన్నారి పాలూరి ఇతిహాస శ్రావ్యంగా పఠించింది. డాక్టర్ దొడ్ల రమణ తాను రచించిన 'బంధాలు చిరకాలం ఉండవు' పద్యమాలికను చదివి వినిపించారు. వేముల లెనిన్ శ్రీశ్రీ వర్షధారను పాడారు. మద్దుకూరి చంద్రహాసన్ 'ఉగాది కవిత.. మమత' చచనను ఆహుతులతో పంచుకున్నారు. కాజా సురేశ్ సీస పద్యాన్ని, జువ్వాడి రమణ హాస్య పద్యాన్ని వినిపించారు. మాడ దయాకర్ ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం సేవలను కొనియాడారు. నందివాడ ఉదయ భాస్కర్ తన ఉగాది కవితలో రాజకీయాంశాలను ప్రస్తావించారు. పుదూర్ జగదీశ్వర్ పద్యాలు, పెనుగొండ ఇస్మాయిల్.. నటి మధుబాలపై రాసిన కవితను పఠించారు. ఇలా అందరికి అందరూ తమదైన విభిన్న శైలిలో తెలుగు వ్యాకరణ ప్రక్రియలో నచ్చిన అంశాన్ని ప్రదర్శించారు. సాహితీ వేదిక నిర్వహకులు ఆహూతులకు ఉప్పు- కారంతో పచ్చి మామిడి ముక్కలు, దోర జామపడ్లను అందించడంతోపాటు అచ్చతెలుగు భోజనాన్ని ఏర్పాటుచేశారు. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షుడు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, ఉత్తరాధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి, సమన్వయకర్త బిళ్లా ప్రవీణ్, సాహిత్య వేదిక బృందం, టెంటెక్స్ కార్యవర్గం అంతా కలిసి ముఖ్యఅతిథి డాక్టర్ సి. మృణాళినిని ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందించారు. ఈ సందర్భంగా బిళ్లా ప్రవీణ్ మాట్లాడుతూ దుర్ముఖి నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని కవిసమ్మేళనం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఆచార్య మృణాళినికి, ఆహూతులుగా విచ్చేసిన భాషాభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టాంటెక్స్ పాలక మండలి అధిపతి గుర్రం శ్రీనివాసరెడ్డి, సభ్యులు రొడ్డ రామకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు శీలం కృష్ణవేణి, కార్యదర్శి వీర్నపు చినసత్యం, కోశాధికారి దండ వెంకట్, తక్షణపూర్వాధ్యక్షుడు డాక్టర్ ఊరిమిండి నరసింహారెడ్డి, సభ్యులు పావులూరి వేణుమాధవ్, వనం జ్యోతి, మండిగ శ్రీలక్ష్మి, పాలేటి లక్ష్మి, సాహిత్య వేదిక సభ్యులు అట్లూరి స్వర్ణ, బసాబత్తిన శ్రీనివాసులు, జలసూత్రం చంద్ర తదితరులు పాల్గొన్నారు. -
డాలస్లో జోరుగా టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు
-
“అక్షయంగా వెలుగొందిన యక్షగానం”
డల్లాస్/ఫోర్టువర్త్, టెక్సాస్: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ప్రతినెలా నిర్వహించే “నెల నెలా తెలుగు వెన్నెల” 102 వ సదస్సు జనవరి 24న డల్లాస్ నగరంలోని దేశీప్లాజా స్టూడియోలో 2015 సాహిత్య వేదిక సమన్వయకర్త దండ వెంకట్ అధ్యక్షతన ప్రారంభించారు. 2016కి గానూ తెలుగు సాహిత్య వేదిక నూతన సమన్వయకర్తగా బిళ్ళ ప్రవీణ్ బాధ్యతలు చేపట్టారు. భాషా సాహిత్యాలకు పెద్ద పీట వేస్తున్న సాహిత్య వేదిక ఆశయాలను, సాహిత్య ప్రేమికులను అభినందిస్తూ సహాయ సహకారాలు కోరుతూ ఆసక్తి వున్న వారిని బిళ్ళ ప్రవీణ్ ఆహ్వానించారు. ఘంటసాల లలిత గీతాలను వీనుల విందుగా ఆలపించి, వడ్లమన్నాటి నాగేష్ మరియు కుందేటి చక్రపాణి అలనాటి మధుర గాయకుడిని మరోసారి గుర్తు చేశారు. పోతన భాగవతం నుండి పద్యాలను కుమారి దొడ్ల నిర్జర, దొడ్ల రమణ కమ్మగా పాడి వినిపించారు. బసాబత్తిన శ్రీనివాసులు వేలుపిళ్ళై కథలను పరిచయం చేస్తూ, కథా రచయిత సి. రామచంద్రరావు రాసిన 9 కథల గురించి ప్రస్తావించారు. సంక్రాంతి లేదా సంక్రమణం అంటే "చేరడం" అని, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభం అవుతుంది, ఇది ఎంతో పవిత్రమైన కాలం, దీనినే మకర సంక్రాంతి అంటారు అని జలసూత్రం చంద్రశేఖర్ వివరించారు. తెలుగు కవులు పేరడీలలో ఎంతో ప్రసిద్ధులు అని.. శ్రీశ్రీ కవిత్వాన్ని పేరడీ చెయ్యనివాడు పేరడీ కవే కాడు అని మాడ దయాకర్ వ్యాఖ్యానించారు. ప్రముఖ రచయిత శ్రీ రమణ గారు, "పిచ్చి ప్రేమ" అనే సినిమాపై సమీక్ష రాయమంటే విశ్వనాథ సత్యనారాయణ గారు హాస్య భరితంగా ఎలా రాస్తారో అనే ఊహాత్మక రచన చేశారు, దానిని మాడ దయాకర్ గారు చదివి నవ్వుల పువ్వులు పూయించారు. వేముల లెనిన్ "తల్లీ నినుదలంచి" అంటూ మాడుగుల నాగ ఫణిశర్మ గారు రచించిన గీతాన్ని పాడి వినిపించారు. డా.జువ్వాడి రమణ తెలుగు పద్యాలు చక్కగా పాడి వినిపించారు. డా.పుదూర్ జగదీశ్వరన్ ఇటీవల హ్యూస్టన్ నగరంలో ఆవిష్కరించిన తెలుగు అంతర్జాల పత్రిక "మధురవాణి" ని www.madhuravani.com ద్వారా చదువుకోవచ్చు అని తెలియచేశారు. తెలుగులో రెండు డాక్టరేట్ పట్టాలు సాధించి, నాట్యంలో జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకొన్న డా. కలవగుంట సుధ గారు "అక్షయంగా వెలుగొందిన యక్షగానం" అనే అంశం మీద మాట్లాడారు. పురాణాల గురించి, వాల్మీకి రామాయణంలో యక్షత్వం అంటే అమరత్వం, అదొక దివ్య ప్రసాదం అని తెలిపారు. మొట్ట మొదటి యక్ష గ్రంధం ప్రోలుగంటి చెన్నశౌరి రచించిన "సౌభరి చరితం", ఇది ప్రస్తుతానికి అలభ్యం, కవి కాలాదులు తెలిసినంతవరకు కందుకూరి రుద్రకవి వ్రాసిన "సుగ్రీవ విజయం" మొట్టమొదటిది అని తెలిపారు. 12వ శతాబ్దంలో పాల్కూరికి సోమనాథుడు పండితారాధ్య చరితము లో, మహాకవి శ్రీనాథుడు భీమేశ్వర పురాణంలో, 16వ శతాబ్దంలో అల్లసాని పెద్దన మనుచరిత్రలో ప్రవరాక్షుడు హిమవత పర్వత ప్రాంతంలో "గంధర్వ యక్ష ఘార్ణితమగు..." అనే పద్యంలో యక్షుల గురించి ప్రస్తావించారు. సుధ గారు తెలుగు నేలకు గర్వకారణం అయిన కూచిపూడి గ్రామాన్ని సందర్శించి కూచిపూడి నాట్య పండితులను కలిసి వారి అనుభవాలు సేకరించి పదిలపరిచారు. డా. కలవగుంటసుధ గారిని ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం మరియు పాలక మండలి అధిపతి గుర్రం శ్రీనివాస్ రెడ్డి శాలువతోమరియు కార్యక్రమ సమన్వయకర్త బిళ్ళ ప్రవీణ్ మరియు సాహిత్య వేదిక బృంద సభ్యులు జ్ఞాపికతో సత్కరించారు. జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం ఈ సభకు అధ్యక్షత వహించారు. టాంటెక్స్ కళలకు, కళాకారులకు, సాహితీవేత్తలకు ఎప్పుడూ పెద్ద పీట వేస్తుందని సమన్వయకర్త బిళ్ళ ప్రవీణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో టాంటెక్స్ పూర్వాధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి, కార్యదర్శి వీర్నపు చినసత్యం, కోశాధికారి దండ వెంకట్, సంయుక్త కోశాధికారి సింగిరెడ్డి శారద, కార్యవర్గసభ్యులు పాలేటి లక్ష్మి, మండిగ శ్రీ లక్ష్మి, గోవాడ అజయ్, తోటపద్మశ్రీ, కొణిదల లోకేష్ నాయుడు, సాహిత్య వేదిక బృంద సభ్యులు అట్లూరి స్వర్ణ, మర్తినేని మమత, దిండుకుర్తి నగేష్ పాల్గొన్నారు. -
డల్లాస్లో టాంటెక్స్ సంక్రాంతి సంబరాలు
డల్లాస్: తెలుగువారి సంస్కృతీ, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా సంక్రాంతి ఉత్సవాలను అమెరికాలో ఘనంగా నిర్వహించారు. టాంటెక్స్ సంస్థ ఆద్వర్యంలో జరిగిన ఈ సంబరాల్లో డల్లాస్ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగువారు పాల్గొని తమ మాతృభూమి అనుభూతులను నెమరువేసుకున్నారు. శనివారం జరిగిన ఈ ఉత్సవాల్లో రంగవల్లులు, గొబ్బెమ్మలతో పల్లెటూరు వాతావరణాన్ని గుర్తుచేసుకొని ఆనందోత్సాహాలతో గడిపారు. ఆర్.జే ప్రణవి ఈ కార్యక్రమానికి ప్రధాన వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరటెక్సాస్ తెలుగుసంఘం (టాంటెక్స్) అధ్యక్షులు సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, కార్యక్రమసమన్వయకర్త రఘు గజ్జల, టెంటెక్స్ పూర్వాధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డితో పాటూ అజయ్ రెడ్డి, డా.రాఘవ రెడ్డి, లోకేష్ నాయుడు, శేఖర్ బ్రహ్మదేవర, ఉమామహేష్ పార్నపల్లి, పద్మశ్రీ తోట, శారద సింగిరెడ్డి, సునీల్ దేవిరెడ్డి, నీరజ పడిగెల, శశి కనపర్తి, మిమిక్రి రమేష్లు పాల్గొన్నారు.