Politics
-
ఆ ప్రశ్న అడగాల్సింది చంద్రబాబును: పవన్ కల్యాణ్
న్యూఢిల్లీ: కూటమి ప్రభుత్వంపై, రాష్ట్రంలో శాంతిభద్రతల విఘాతంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయనకు రాష్ట్రంలో ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై పవన్కు మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది.దానికి ఆయన స్పందిస్తూ..నేనేం లా అండ్ ఆర్డర్, హోం శాఖ చూడడం లేదు. నా శాఖ గురించి ఏదైనా అడిగితే చెప్పగలను. అయినా మీరు ఈ ప్రశ్న అడగాల్సింది.. సీఎం చంద్రబాబును, హోం మంత్రి అనితను. అయినప్పటికీ మీరు చెప్పినవన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్తా అని అన్నారు.అలాగే.. దర్శకుడు రాం గోపాల్ వర్మ తప్పించుకుని తిరుగుతున్నారని, చంద్రబాబును ఇబ్బంది పెట్టినప్పుడు ధైర్యంగా వ్యవహరించిన పోలీసులు.. ఇప్పుడు ఎందుకు తటపటాయిస్తున్నారు? అని పవన్ వ్యాఖ్యానించారు. అలాగే రాష్ట్రంలో ఏం జరిగినా.. కూటమి ప్రభుత్వం తరఫున సమిష్టిగా బాధ్యత వహిస్తాం అని చెప్పారు.గతంలో పవన్ కల్యాణ్.. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో హోం మంత్రి అనితను నిందిస్తూ.. తాను హోం మంత్రి పదవి చేపడితే పరిస్థితి మరోలా ఉంటుందంటూ వార్నింగ్ ఇచ్చారు.ఇదీ చదవండి: వర్చువల్ విచారణకు వర్మ సిద్దపడ్డారు కదా! -
‘వైఎస్సార్సీపీ ఒప్పందం చేసుకుందని నిరూపిస్తే దేనికైనా సిద్ధం’
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని విమర్శించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. లోకేష్ రాసిన రెడ్బుక్ రాజ్యాంగం అమలు అవుతోందని మండిపడ్డారు. నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు.. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలకు ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని వైఎస్ జగన్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. రైల్వే భవనాల నిర్మాణానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం 52 ఎకరాలను కేటాయించిందన్నారు.‘కేకే లైన్తో కూడిన రైల్వే జోన్ ఇవ్వాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అదానీతో ఎటువంటి ఒప్పందాలు చేసుకోలేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సేకీతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆదానీ సంస్థతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం. ప్రధాని మోదీ ప్రారంభిస్తారనే గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఒప్పందం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగింది. ప్లాంట్కు సంబంధించిన భూ కేటాయింపులు మా ప్రభుత్వ హయాంలోనే జరిగాయి’ అని తెలిపారు. -
హాయ్ చెప్తే..అంత డ్రామా చేస్తారా: మంత్రి పొంగులేటి ఫైర్
సాక్షి,హైదరాబాద్: తాను వ్యాపారవేత్త అదానీతో హైదరాబాద్లోని ఓ హోటల్లో భేటీ అయ్యానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు.ఈ విషయమై పొంగులేటి మంగళవారం(నవంబర్26) ‘సాక్షి’ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు.‘అదానీ నేను హైదరాబాద్లోని ఒక హోటల్లో లిఫ్ట్ దగ్గర కలిశాం. పాత పరిచయంతో అదానీకి హాయ్ చెపితే దానికి ఇంత డ్రామా చేస్తారా? అదానీతో పదేండ్లు అంటకాగింది బీఆర్ఎస్ పార్టీ. గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అదానీతో చాలా ఒప్పందాలు చేసుకుంది. అదానీకి బీఆర్ఎస్ ఇచ్చిన కాంట్రాక్టులు రద్దు చేయాలా వద్దా క్లియర్గా చెప్పండి.మనసులో ఏదో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వంపై అదానీ మార్క్ వేస్తారా?మా నాన్న తర్వాత మీ నాన్ననే ఎక్కువగా నమ్మాను.ఐదేళ్లు తడిబట్టతో నా గొంతు కోశారు’అని పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: సీఎం రేవంత్కు కేటీఆర్ గట్టి కౌంటర్ -
సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి,హైదరాబాద్: రాహుల్ గాంధీ మొట్టికాయలు వేయడం వల్లే సీఎం రేవంత్ అదానీ ఇచ్చిన వంద కోట్లు తిరస్కరించాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. మంగళవారం(నవంబర్ 26) కేటీఆర్ తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడారు.‘కొసరు మాత్రమే తిరిగిస్తే సరిపోదు. 12,400కోట్లు ఒప్పందాల సంగతేంటి?రాహుల్,రేవంత్రెడ్డిలలో ఎవరు పిచ్చోళ్ళో వాళ్లే తేల్చుకోవాలి.ఇకపై అనుముల రేవంత్ రెడ్డి కాదు..అబద్దాల రేవంత్ రెడ్డి. మైక్రోసాఫ్ట్ డేటా ప్రాజెక్టును అదానీ డేటా సెంటర్ అని రేవంత్ అనడం హాస్యాస్పదం.తనకంటే చిన్నవాడిని కాబట్టి తిట్టినా పడతాను. కానీ కేసీఆర్ను అనడానికి రేవంత్కు ఎంత ధైర్యం?ఈడీ కేసు కోసం రేవంత్,అతని మంత్రుల లెక్క మేం అదానీ కాళ్ళు పట్టుకోలేదు.బ్యాగులు మోసిన గజ దొంగ రేవంత్రెడ్డి.చిట్టినాయుడికి చిప్ దొబ్బిందని నిన్నటి రేవంత్ కామెంట్స్ చూస్తే అర్థమవుతోంది.నేను సైకో అయితే..సీఎం రేవంత్ సన్నాసినా? శాడిస్టా? ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఢిల్లీ నుంచి 8 రూపాయలు కూడా తీసుకురాలేదు.28సార్లు ఢిల్లీ వెళ్ళి..రేవంత్ 28 రూపాయలు కూడా తీసుకురాలేదు.అదానీ జాతీయ రహదారులు,రక్షణ శాఖ పనులు చేస్తే మాకేం సంబంధం?రేవంత్లో సబ్జెక్టు,సరుకు ఉండదు. ఎవరైనా చెప్తే వినడు. దావోస్లో నేను అదానీని బరాబర్ కలిసిన. మీ మాదిరి కోహినూరులో కాళ్ళు పట్టుకోలేదు. కేసీఆర్ హాయాంలో అదానీని ఎప్పుడు ప్రోత్సహించలేదు.అదానీకి రేవంత్ రెడ్ కార్పెట్ వేస్తే..మేం రెడ్ సిగ్నల్ చూపించాం.మాజీ సర్పంచ్ సాయిరెడ్డిది సీఎం రేవంత్ సోదరులు చేసిన హత్యే. ఏడాదిగా అదానీ,అల్లుడు, అన్న,బావమరిదికి అమృతం పంచటం కోసమే రేవంత్ పనిచేస్తున్నాడు.రేవంత్రెడ్డి అసహనం,నిరాశ, నిస్పృహలో ఉన్నారు.ముఖ్యమంత్రి అయ్యాక కూడా రేవంత్కు కేసీఆర్,మా మీద ఫ్రస్టేషన్ ఎందుకు?కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 48 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారు.వాంకిడి గురుకుల విద్యార్థి శైలజది ప్రభుత్వం చేసిన హత్యే.తల్లిదండ్రుల మాదిరి చూసుకోవాల్సిన ప్రభుత్వమే విద్యార్థులను చంపేస్తోంది.గురుకుల విద్యార్థుల హత్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతాం’అని కేటీఆర్ హెచ్చరించారు.ఇదీ చదవండి: అదానీ నిధులు వద్దన్నాం: సీఎం రేవంత్ -
‘ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు’
కర్నూలు జిల్లా: ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ రాజ్యాంగానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూట్లు పొడిచారని మండిపడ్డారు కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి,.కేవలం చంద్రబాబు తన రెడ్బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే రాష్ట్రంలో అమలు చేస్తూ నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిందని, ఇంటి వద్దకే సంక్షేమ పాలనతో పాటు సంక్షేమ పథకాలు అందించిన సంగతిని ఎస్వీ మోహన్రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఈ రోజు సంక్షేమ పథకాలు లేవు, రాజ్యాంగానికి విరుద్ధంగా పాలనను చంద్రబాబు సాగిస్తున్నారంటూ విమర్శించారు.‘సోషల్ మీడియా పోస్టులకు లైక్ కొట్టిన వారిపై నాన్ బెయిల్బెల్ కేసులు’ఏపీలో నిరంకుశ, దుర్మార్గ పాలన సాగుతోందని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. కాకినాడ జిల్లా తునిలో ఘనంగా 75వ భారత జ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘ రాష్ట్రంలో గత ఆరు నెలలుగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా పాలన జరుగుతోంది. ప్రత్యర్థులను అణిచివేసే ధోరణి చాలా నిరంకుశంగా జరుగుతోంది. తునిలో 17 మందిపై అక్రమ కేసులు పెట్టారు. సోషల మీడియాలో పోస్ట్ను లైక్ చేసిన వారిపై నాన్ బెయిల్బెల్ కేసులు పెట్టారు. పసుపు చొక్కా లేసుకుని ఉద్యోగాలు చేయొద్దని పోలీసులను కోరుతున్నాను. గత పదేండ్ల కాలంలో వైఎస్సార్సీపీ ఒక పర్సంటేజ్సోషల్ మీడియా పోస్టులు పెడితే, టీడీపీ, జనసేన 99 శాతం అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టారు. తునిలో మామ-అల్లుళ్ల పాలన కొనసాగుతోంది. అల్లుడు గల్లా పెట్టె దగ్గర కూర్చుంటే.. మామ యనమల అమాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు. -
AP: సోషల్ మీడియా కార్యకర్తలపై పెరిగిన వేధింపులు
సాక్షి,తాడేపల్లి:ఏపీలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసుల వేధింపులు ఆగడం లేదు. సోషల్మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నవారిని టార్గెట్ చేసి మరీ భారీగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఇప్పటికే ఒక్కొక్కరిపై పది నుంచి ఇరవైకి పైగా అక్రమ కేసులు నమోదు చేశారు. సజ్జల భార్గవ్పై11, అర్జున్ రెడ్డి మీద 11,వర్రా రవీంద్రరెడ్డిపై 21, ఇంటూరి రవికిరణ్ మీద16,పెద్దిరెడ్డి సుధారాణిపై 10,వెంకటరమణారెడ్డిపై 10 కేసులు పెట్టారు. ఇవి కాకుండా చంద్రబాబు సర్కారు రహస్యంగా మరికొన్ని కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.కేసులు నమోదైనవారిలో ఎవరైనా హైకోర్టులో హెబియస్ కార్పస్,క్వాష్, ముందస్తు బెయిల్ పిటిషన్లు వేస్తే వారిని పోలీసులు మరింతగా టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ,వాక్ స్వాతంత్రం అసలే కనిపించడం లేదని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. -
పెళ్లికి వచ్చా.. రాజకీయాలకు కాదు: ఢిల్లీలో ఫడ్నవిస్
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి ఘనవిజయం సాధించిన దరిమిలా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనేదానిపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ పేరు సీఎం రేసులో ముందంజలో ఉంది. కాగా దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం సాయంత్రం ఢిల్లీకి వచ్చారు. ఈ నేపధ్యంలో ఫడ్నవీస్ ఢిల్లీ పర్యటనపై పలు చర్చలు జరుగుతున్నాయి.లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీకి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు మాత్రమే ఢిల్లీకి వచ్చానని, తన ఢిల్లీ పర్యటనకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. అయితే దేవేంద్ర ఫడ్నవిస్ ఢిల్లీలో బీజేపీ అగ్ర నాయకత్వాన్ని కలవవచ్చంటూ గతంలో వార్తలు వినిపించాయి. అయితే తనకు ప్రస్తుతం పార్టీ అగ్రనేతలను కలిసే ఆలోచన లేదని ఫడ్నవిస్ స్వయంగా తెలిపారు.మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు గాను మహాయుతి 234 స్థానాల్లో విజయం సాధించింది. వీటిలో బీజేపీ 132 సీట్లు, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 57 సీట్లు, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 41 సీట్లు గెలుచుకున్నాయి. మిగతా మిత్రపక్షాలు నాలుగు స్థానాల్లో విజయం సాధించాయి. కాగా మీడియా కథనాల ప్రకారం దేవేంద్ర ఫడ్నవిస్ పేరు సీఎం పదవికి ఆమోదం పొందిందని, అతనితోపాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారని తెలుస్తోంది. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కూడా దేవేంద్ర ఫడ్నవిస్ను సీఎం చేయడానికి అనుకూలంగా ఉందని సమాచారం. ఇది కూడా చదవండి: రాజకుటుంబంలో విభేదాలు.. ఉదయ్పూర్ ప్యాలెస్లో ఉద్రిక్తతలు.. -
కొత్త దుష్ట సంస్కృతికి తెరలేపిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి!
ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది. ఇది అత్యంత ప్రమాదకరందని చెప్పకతప్పదు. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ సోషల్ మీడియా కార్యకర్తలపై ఏకపక్షంగా పోలీసులను ప్రయోగిస్తున్న తీరు దారుణం. ప్రతిపక్షంలో ఉండగా సోషల్ మీడియా స్వేచ్చ గురించి నీతులు చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా నుంచి పెద్ద ఎత్తున వచ్చిన పోలీసులు హైదరాబాద్లో ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటి వద్ద హడావుడి చేయడం చూస్తే ఏపీ పోలీసుల ప్రాధాన్యత క్రమం మారిపోయినట్లు అనిపిస్తుంది. ఒక సినిమా విడుదల సందర్భంగా వర్మ ఎప్పుడో ఏవో ఫోటోలు పెట్టారట. దానిపై ఇప్పుడు ఎవరో ఫిర్యాదు చేశారట. పోలీసులు వాయు వేగంతో వర్మకు నోటీసులు జారీ చేశారు. అయితే పోలీసుల ముందు హాజరయ్యేందుకు వర్మ కారణాలు చూపుతూ సమయం కోరారు. పైగా అంతేకాక కొత్త చట్టం ప్రకారం వర్చువల్ విచారణకు సిద్దపడ్డారు. వర్మ ప్రత్యక్ష విచారణకు హాజరు కాబోరని కనిపెట్టిన పోలీసులు హుటాహుటిన హైదరాబాద్ తరలివచ్చారు.వర్మ కొన్నేళ్ల క్రితం తప్పు చేసి ఉంటే అప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయలేదు? కేవలం టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నారు కనుక ఆయనను ఇబ్బంది పెట్టే లక్ష్యంతో కక్షకట్టి పోలీసులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని అర్థం చేసుకోవడం కష్టం కాదు. రాజకీయాలతో సంబంధం లేని ఒక సినీ ప్రముఖుడిని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం తప్పుడు సంకేతం పంపినట్లవుతుంది. వర్మ తప్పు చేసి ఉంటే చర్య తీసుకోరాదని ఎవరూ చెప్పరు. కానీ కావాలని దురుద్దేశంతో వ్యవహరిస్తున్న తీరే విమర్శలకు ఆస్కారం ఇస్తోంది. ఇది సినీ పరిశ్రమపై దాడిగా కనిపిస్తుంది. వర్మ ఒకవేళ ఒంగోలుకు వెళ్లి కేసు విచారణకు హాజరై ఉంటే ,అక్కడ నుంచి ఎన్ని పోలీస్ స్టేషన్లకు తిప్పేవారో ఊహించుకోవడం కష్టం కాదు. వర్మపై వచ్చిన అభియోగం ఏమిటో చెప్పకుండా పోలీసులు విచారణకు పిలవడం, హైదరాబాద్ లోని ఆయన ఇంటి వద్ద సీన్ క్రియేట్ చేయడం శోచనీయం.అలాగే మరో నటుడు పోసాని కృష్ణ మురళీ మీద అనేక పోలీస్ స్టేషన్లలో టీడీపీ, జనసేన వారు ఫిర్యాదులు చేశారు. దాంతో ఆయన ఈ రకమైన వేధింపులకు తట్టుకోలేమని భావించి రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. అయినా వదలిపెట్టబోమని టీడీపీ నేతలు మీడియా సమావేశం పెట్టి హెచ్చరిస్తున్నారు.ఏపీలో ఇవన్ని కొత్త ట్రెండ్ లో భాగంగానే కనిపిస్తాయి. నిజంగానే ఎవరైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే వెంటనే ఫిర్యాదు చేయడం ఒక పద్దతి. అలా కాకుండా టీడీపీ నుంచి ఎవరుపడితే వారు ఫిర్యాదులు చేస్తే, వెంటనే టేకప్ చేసి ఆరోపణలకు గురైనవారిని అదుపులోకి తీసుకుని, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తిప్పుతూ, కొన్ని చోట్ల రిమాండ్కు పంపుతూ, మరికొన్ని చోట్ల విచారణ చేసి, మళ్లీ వేరే స్టేషన్కు తరలించడం, తద్వారా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను వేధిస్తున్న తీరు కచ్చితంగా ప్రజాస్వామ్య విరుద్దం. ఇంటూరి రవికిరణ్ వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఆయనపై ద్వేషంతో ఇప్పటికి పదిహేను కేసులు పెట్టారట. అటు ఉత్తరాంద్ర నుంచి ఇటు రాయలసీమ వరకు ఈ కేసులు పెట్టడంలోనే దురుద్దేశం ఉంది. ఇంటూరి భార్య ఆవేదనతో ఈ విషయాలు చెబుతూ పరిస్థితి ఇలాగే కొనసాగితే తాను సీఎం. ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాపై కేసులు పెడతామని చెప్పిన వెంటనే టీడీపీ, జనసేనకు చెందిన కొంతమంది రంగంలోకి దిగి ఫిర్యాదుల పరంపర సాగిస్తున్న తీరు చూస్తే ఇదంతా కుట్ర అని, ఆర్గనైజ్డ్గా చేస్తున్నారని అర్థమవుతుంది.మాజీ మంత్రి కొడాలి నాని పై మరీ చిత్రంగా ఒక లా విద్యార్ది ఫిర్యాదు చేస్తే రాత్రి 11 గంటల సమయంలో కేసు నమోదు చేశారట. అంత ఆకస్మికంగా కేసు కట్టవలసిన అవసరం ఏమిటో తెలియదు. నాని మీడియా సమావేశాలలో, అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడిన సందర్భంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ తదితరులపై చేసిన వ్యాఖ్యల వల్ల ఆ విద్యార్ది మనోభావాలు దెబ్బతిన్నాయని ఫిర్యాదు చేయడం విచిత్రంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరి మనో భావాలు అయినా దెబ్బతింటే ఆయన వ్యాఖ్యలు చేసిన వెంటనే ఫిర్యాదులు చేయాలి. అలా కాకుండా ఎప్పుడో చేసిన విమర్శలు వ్యాఖ్యలపై కూటమి ప్రభుత్వం వచ్చిన ఐదు నెలలకు ఫిర్యాదు చేయడం ఏమిటో తెలియదు. పవన్ కళ్యాణ్ ఏపీలో 31 వేల మంది మహిళలు మిస్ అయిపోయారని, మహిళల అక్రమ రవాణా జరిగిందని ఆరోపిస్తే మహిళల మనోభావాలు దెబ్బ తినలేదా? లోకేష్ రెడ్బుక్ అంటూ ఐఎఎస్, ఐపిఎస్ అధికారులను బెదిరిస్తే వారి మనోభావాలు దెబ్బ తినలేదా? జగన్ను సైకో అని ఇష్టం వచ్చినట్లు చంద్రబాబు మాట్లాడితే వైఎస్సార్సీపీ వారి మనోభావాలు దెబ్బ తినలేదా? అప్పట్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితరులు ఎంత దారుణంగా మాట్లాడినా, వారిపై ఎవరూ కేసులు పెట్టలేదు.రాజకీయంగానే చూశారు.కానీ ఇప్పుడు వీరు పగ, ప్రతీకారంతో రగిలిపోతున్నట్లు వ్యవహరిస్తున్నారు. కొడాలి నాని ఏ విధమైన వ్యాఖ్యలు చేశారో, అంతకన్నా ఘాటుగా టీడీపీ నేతలు పలువురు మాట్లాడారు. మరి వారిపై ఎందుకు కేసులు రావడం లేదు?శాసనసభలో జరిగే ప్రసంగాలు, చర్చలు, వాదోపవాదాలపై కోర్టులే జోక్యం చేసుకోవు. అలాంటిది ఏకంగా పోలీసులు ఎలా చర్య తీసుకుంటారంటే, అది ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ స్పెషాలిటీ అని భావించాలి. వైఎస్సార్సీపీ నేతలు పలువురు టీడీపీ సోషల్ మీడియా చేసిన దారుణమైన పోస్టింగ్లపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోవడం లేదు? మాజీ మంత్రి రోజా మీడియాలో ఈ విషయమై కన్నీరు పెట్టుకున్నారు.అయినా కూటమి ప్రభుత్వం ఆమె చేసిన ఫిర్యాదును స్వీకరించడం లేదు. అలాగే మరో మాజీ మంత్రి అంబటి రాంబాబు తన కుటుంబంపై పెట్టిన అసభ్య పోస్టింగ్లకు సంబంధించి ఫిర్యాదు చేస్తూ పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు.మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంపై పెట్టిన నీచమైన పోస్టింగ్ల మాటేమిటని అడిగినా స్పందించే నాథుడు లేకుండా పోయారు. ప్రస్తుత స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి లోకేష్ లపై ఫిర్యాదు చేస్తే చర్య తీసుకోరా? వైఎస్సార్సీపీ వారిపై మాత్రం ఏదో ఒక కేసు పెడతారా? ఏమిటి ఏపీని ఇలా మార్చుతున్నారని వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏపీని పోలీసు రాజ్యంగా చేయడం ద్వారా శాశ్వతంగా ఏలవచ్చని పాలకులు భ్రమ పడుతున్నట్లుగా ఉంది. కానీ చరిత్రలో అది ఎల్లవేళలా సాధ్యపడదని అనేకమార్లు రుజువైంది. టీడీపీ ప్రభుత్వం తన వైఫల్యాలను ప్రజల దృష్టి నుంచి మళ్లించడం కోసం ఇలాంటి టెక్నిక్స్ ను వాడవచ్చు. తమ పాతకక్షలను తీర్చుకోవడానికి పోలీసులను టూల్స్ గా వాడుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇంటూరి రవికిరణ్, వర్రా రవీంద్ర రెడ్డి మొదలైన వారితో బలవంతంగా స్టేట్ మెంట్స్ పై సంతకాలు పెట్టించుకుంటున్నారట. సోషల్ మీడియా కేసులు పెట్టడం కుదరకపోతే ఏదో ఒక క్రిమినల్ కేసులో ఇరికించడానికి యత్నిస్తున్నారు. అర్ధరాత్రి వేళ పోలీసులు కొంతమంది నాయకుల ఇళ్లలోకి చొరబడి ఆడవాళ్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.వైఎస్సార్సీపీ నేత గౌతం రెడ్డి ఇంటిపై దాడి చేసి పోలీసులు సృష్టించిన గలభానే ఇందుకు నిదర్శనం. ఇలాంటివి వైఎస్సార్సీపీ హయాంలో ఎప్పుడైనా ఒకటి,అరా జరిగితే టీడీపీ కానీ, ఎల్లో మీడియా కానీ నానా రచ్చ చేసేవి. కానీ ఇప్పుడు టీడీపీతోపాటు అదే ఎల్లో మీడియా పోలీసుల అరాచకాలకు మద్దతు ఇస్తున్నాయి. ఈ తరహాలో పోలీసులను ఉపయోగిస్తే, వచ్చే కాలంలో ప్రభుత్వాలు మారితే, ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. అప్పుడు టీడీపీ, జనసేనలకు చెందిన ముఖ్యనేతలపై కూడా ఇలాగే ఎక్కడపడితే అక్కడ కేసులు పెట్టే ప్రమాదం ఉంటుంది. గత టరమ్లో టీడీపీ ముఖ్యనేతలకు సంబంధించి కేసులు వచ్చినా ఇంత అరాచకంగా వారి పట్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పోలీసులు ప్రవర్తించలేదు. నిబంధనల ప్రకారం చర్య తీసుకోవడానికి యత్నించారు.అయినా ఆ రోజుల్లో మీడియా అండతో టీడీపీ నేతలు గందరగోళం సృష్టించే వారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని కావాలని కోర్టులో ప్రవేశపెట్టడంలో జాప్యం చేసిన వైనం కూడా అభ్యంతరకరమే. గతంలో చంద్రబాబు హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్న సందర్భంలో నందిగామ వద్ద ఏదో గొడవ జరిగింది.ఇప్పుడు దానిని హత్యయత్నం కుట్ర కేసుగా మార్చి అక్కడి వైఎస్సార్సీపీ ముఖ్యనేతలపై కేసులు పెడుతున్నారట.మాజీ ఎంపీనందిగం సురేష్ ను ఎలా వేధిస్తున్నది అంతా గమనిస్తున్నారు. ఎవరు తప్పు చేశారన్న ఫిర్యాదులు వచ్చినా పోలీసులు చర్య తీసుకోవచ్చు. కానీ చట్టబద్దంగా చర్యలు తీసుకోవాలని మాత్రమే ఎవరైనా చెబుతారు. అలా కాకుండా ఇష్టారీతిన పోలీసులతో చట్టవిరుద్దమైన పనులు చేయిస్తున్నారు. ఏపీతో పోల్చితే తెలంగాణలో ఈ పరిస్థితి అంత తీవ్రంగా లేదు. అయినా బిఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ పై ఇప్పటికి ఆయా పోలీస్ స్టేషన్ లలో ఆరు కేసులు నమోదు చేశారట.వాటిని గమనిస్తే ఏదో కావాలని కేసులు పెట్టారన్న భావన కలుగుతుంది. చిన్న, చిన్న ఉదంతాలను కూడా కేసులుగా మార్చి ప్రత్యర్ధి రాజకీయ పార్టీలను వేధించాలన్న దోరణి మంచిది కాదు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కాంగ్రెస్ అధ్యక్షుడు గా ఉన్న రేవంత్ రెడ్డి ఎంత తీవ్రమైన వ్యాఖ్యలు పరుష భాషతో చేసింది తెలిసిందే. అలాగే కేసీఆర్ కూడా చేసి ఉండవచ్చు. అయినా ఎక్కడా ఈ కేసుల గొడవ రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఏపీలో మాదిరి తెలంగాణలో కూడా ఈ ట్రెండ్ కు వెళితే కాంగ్రెస్ పార్టీకి నష్టం. చంద్రబాబు, రేవంత్ రెడ్డిలను గురుశిష్యులుగా అంతా చెప్పుకుంటారు.తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు మాదిరే రేవంత్ కూడా వ్యవహరిస్తే అది ఆయనకే అప్రతిష్ట.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మనిషిగా నిఖిల్ ఓడిపోలేదు
బనశంకరి: నా కుమారుడు ఎన్నికల్లో మూడోసారి ఓడిపోయాడు. అతను ఎన్నికల్లో ఓడిపోవచ్చు కానీ, మానవత్వం, సహృదయమున్న మనిషిగా ఓడిపోలేదని నిఖిల్ తల్లి అనితా కుమారస్వామి అన్నారు. చెన్నపట్టణ ఉప ఎన్నికలో నిఖిల్ పరాజయం తరువాత ఆమె ఎక్స్లో సోమవారం పోస్ట్ చేశారు. నా కొడుకు ఓటమిని ఒప్పుకుంటున్నా. ఎన్నికల్లో జయాపజయాలు సహజం. ఒకరు గెలవాలంటే మరొకరు ఓడిపోవాలి, కానీ ఓటమికి అనేక కారణాలు ఉంటాయి. రాజకీయాల్లో నా భర్త, మామగార్లకు ఇటువంటివి కొత్త కాదు. ఓటమితో కుంగిపోలేదు. నా కుమారునికీ ఇదే వర్తిస్తుంది అని ఆమె పేర్కొన్నారు. నిఖిల్ మనిషిగా ఓటమి చెందలేదన్నారు. చెన్నపట్టణ ప్రజల, ప్రేమ, విశ్వాసం నిఖిల్ వెంటే ఉన్నాయని, ప్రజాసేవ చేసే అవకాశం లభిస్తుందని చెప్పారు. -
మహారాష్ట్ర సీఎం రేసు.. షిండే కీలక ట్వీట్
సాక్షి,ఢిల్లీ:మహారాష్ట్ర కొత్త సీఎం రేసు నుంచి శివసేన చీఫ్, ప్రస్తుత సీఎం ఏక్ నాథ్ షిండే తప్పుకున్నట్లు తెలుస్తోంది. తనకు మద్దతుగా ముంబైకి ఎవరు రావొద్దని,సమావేశాలు పెట్టొద్దని ఏక్నాథ్షిండే ట్వీట్ చేయడం సీఎం రేసు నుంచి ఆయన తప్పుకున్నారనడానికి నిదర్శనమన్న ప్రచారం జరుగుతోంది. महायुतीच्या प्रचंड विजयानंतर राज्यात पुन्हा एकदा आपले सरकार स्थापन होणार आहे. महायुती म्हणून आपण एकत्रित निवडणूक लढवली आणि आजही एकत्रच आहोत. माझ्यावरील प्रेमापोटी काही मंडळींनी सर्वांना एकत्र जमण्याचे, मुंबईत येण्याचे आवाहन केले आहे. तुमच्या या प्रेमासाठी मी अत्यंत मनापासून ऋणी…— Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) November 25, 2024 త్వరలోనే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని మహారాష్ట్ర ప్రగతికి మహాయుతి కూటమి పనిచేస్తుందని షిండే ట్వీట్లో పేర్కొన్నారు. సీఎం రేసు నుంచి షిండే తప్పుకోవడం దాదాపు ఖాయమవడంతో బీజేపీ నేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పగ్గాలు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.మహారాష్ట్ర ఎన్నికల్లో మెజారిటీ మార్కు కు చేరువగా 132 సీట్లను బీజేపీ గెలుచుకుంది. సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్కు మద్దతిసస్తామని మహాయుతిలో మరో కీలక భాగస్వామ్య పార్టీ ఎన్సీపీ(అజిత్పవార్)ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. -
ప్రజల దృష్టి మళ్లించాలనే జగన్పై దుష్ప్రచారం
నెల్లూరు (బారకాసు): ప్రజల ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ వ్యవసాయానికి 25 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ అందించడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో చేసుకున్న ఒప్పందం కేంద్ర ప్రభుత్వం సహా అందరి ప్రశంసలందుకుందని, ఇది చూసి ఓర్వలేకే కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా వైఎస్ జగన్ శ్రీకారం చుట్టిన గొప్ప ప్రాజెక్టు ఇది అని చెప్పారు. ఆయన సోమవారం ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అత్యంత చౌకగా సోలార్ విద్యుత్ సెకీ స్వయంగా ముందుకొచ్చి రాష్ట్రానికి లేఖ రాసిందన్నారు.ఈ వాస్తవాన్ని దాచిపెట్టి అదానీతో వైఎస్ జగన్ రహస్య ఒప్పందం అంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. సెకీకి, అదానికి మధ్య జరిగిన వ్యవహారాన్ని జగన్పై నెట్టేస్తున్నారని అన్నారు. అప్పట్లో కాంగ్రెస్తో కుమ్మక్కై జగన్ను జైల్లో పెట్టించారని, మళ్లీ ఇప్పుడు అవే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. 2014–19 మధ్య యూనిట్ రూ.6.90 చంద్రబాబు కొన్నారని, కానీ వైఎస్ జగన్ రూ.2.49కే సెకీతో ఒప్పందం చేసుకున్నారని వివరించారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థను నాశనం చేసింది చంద్రబాబేనని చెప్పారు. బాబు హయాంలో రూ.8,848 కోట్లు బకాయిలు పెట్టి విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేశారన్నారు. ఈనాడు వార్తలన్నీ టీడీపీ ఆఫీసు నుంచే వస్తున్నట్టున్నాయని చెప్పారు. వైఎస్ జగన్ వల్లే మంత్రి అయిన బాలినేని నేడు చంద్రబాబు, పవన్ మెప్పు కోసం అబద్ధాలాడుతున్నారని చెప్పారు. -
అదానీ నిధులు వద్దన్నాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్కిల్స్ యూనివర్సిటీ కోసం అదానీ సంస్థ ఇస్తామని ప్రకటించిన రూ. 100 కోట్లను తీసుకోవడం లేదని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ప్రకటించారు. అదానీ గ్రూపు విషయంలో వివాదాలు, జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అయితే పక్క రాష్ట్రాల్లో జరుగుతున్న వివాదాలకు, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం లేదని పేర్కొన్నారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, కాంగ్రెస్ నేతలు జంగా రాఘవరెడ్డి, రోహిణ్రెడ్డి, సామా రామ్మోహన్రెడ్డిలతో కలిసి రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడారు. జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. సదుద్దేశంతో ప్రారంభించిన స్కిల్ వర్సిటీ వివాదాలకు లోనుకావడం తమకు ఇష్టం లేదని.. అనవసర వివాదాల్లోకి రాష్ట్ర ప్రభుత్వాన్ని, తమను లాగొద్దని విజ్ఞప్తి చేశారు. రాజకీయ పార్టీలు ఈ వ్యవహారాన్ని రాజకీయ కోణంలో చూడటం ద్వారా నిరుద్యోగులకు నష్టం చేసే వైఖరిని అవలంబించవద్దని విజ్ఞప్తి చేశారు. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి కార్పస్ ఫండ్ కింద నిధులు ఇచ్చేందుకు చాలా సంస్థలు ముందుకొచ్చాయని సీఎం రేవంత్ చెప్పారు. అలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద రూ.100 కోట్లు ఇచ్చేందుకు అదానీ సంస్థ ముందుకొచ్చిందని తెలిపారు. కానీ అదానీ సంస్థ అదేదో తెలంగాణ రాష్ట్రానికో, ముఖ్యమంత్రికో అప్పనంగా రూ.100 కోట్లు ఇచ్చినట్టు చర్చ జరుగుతోందన్నారు. ‘‘అదానీ సహా ఇప్పటివరకు ఏ సంస్థ నుంచి తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అదానీ సంస్థ నుంచి నిధులు తీసుకున్నారంటూ వ్యక్తిగతంగా నా గురించి చర్చ జరగడం నాకు, కేబినెట్ సహచరులకు ఇష్టం లేదు. అందుకే మా అధికారి జయేశ్రంజన్ ద్వారా అదానీ సంస్థకు లేఖ రాశాం. ఆ సంస్థ ప్రకటించిన రూ.100 కోట్లు స్వీకరించడానికి సిద్ధంగా లేమని, ఆ నిధులు ప్రభుత్వానికి బదిలీ చేయవద్దని ఆ లేఖలో స్పష్టం చేశాం’’ అని రేవంత్ తెలిపారు. ఒప్పందాల రద్దు అంత సులువుకాదు అదానీ గ్రూపుతో గతంలో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంటారా? అని మీడియా ప్రశ్నించగా.. అది అంత సులువైనది కాదని, అలా రద్దు చేసుకుంటే వారు కోర్టులకు వెళ్లే అవకాశం ఉంటుందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ‘‘అయినా అదానీ ఫ్లైట్లో ఆడంబరంగా తిరిగింది వాళ్లు. కేసీఆర్లా మేం అదానీ నుంచి అప్పనంగా తీసుకోలేదు. అదానీతో ఎన్నో ఒప్పందాలు చేసుకున్నవారు మాపై ఆరోపణలు చేస్తున్నారు. అసలు పెట్టుబడుల విషయంలో వారి విధానమేంటి? పెట్టుబడులు రాకపోతే తీసుకురాలేదంటారు. తెస్తే రద్దు చేసుకోవాలంటారు. అంటే గత ప్రభుత్వం అదానీ గ్రూపుతో జాతీయ రహదారులు, డేటా సెంటర్ల ఏర్పాటు కోసం ఒప్పందాలు చేసుకున్నందుకు కేసీఆర్ను ప్రాసిక్యూట్ చేయాలా? వారి మీద కూడా కేసులు పెట్టాలా?’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. వాళ్ల కాకిగోలను పట్టించుకోబోం పెట్టుబడుల విషయంలో తాము ఎవరికీ ఆయాచిత లబ్ధి చేకూర్చబోమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ‘‘2023లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. 2024లో డిపాజిట్లు కోల్పోయింది. ఇప్పుడు మెదడు కోల్పోయింది. మీ కడుపు మంట మాకు తెలుసు. మీ దుఃఖం మాకు తెలుసు. మీ కాకిగోలను పట్టించుకోం. మీలాంటి వాళ్లు అరుస్తుంటే మాకు ఉత్సాహం వస్తుంది. మా కార్యకర్తలు సంతోషపడతారు. మీ క్షోభను చూస్తుంటే అప్పుడప్పుడు కోపం వస్తుంది. అయినా ఏకాగ్రత, కార్యదీక్షతో మేం ముందుకెళుతున్నాం’’ అంటూ బీఆర్ఎస్ నేతలను ఎద్దేవా చేశారు. ఆ ఎన్నికల్లో వచ్చింది లేదు.. పోయింది లేదు జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఉప ఎన్నికలపై రేవంత్రెడ్డి స్పందిస్తూ... ఆ ఎన్నికల వల్ల ఎవరికీ వచ్చింది లేదని, ఎవరికీ పోయింది లేదని పేర్కొన్నారు. ‘‘మహారాష్ట్రలో బీజేపీ కూటమికి ఎక్కువ సీట్లు వచ్చాయి. జార్ఖండ్లో ఇండియా కూటమికి ఎక్కువ సీట్లు వచ్చాయి. కర్ణాటక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. బెంగాల్లో బీజేపీ డిపాజిట్లు కోల్పోయింది. దేశంలోని రెండు లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు మోదీని ఓడించి రాహుల్, ఖర్గేల నాయకత్వాన్ని బలపర్చారు. కేరళలోని వాయనాడ్ నుంచి ప్రియాంకా గాంధీ భారీ మెజార్టీతో గెలిచారు. మహారాష్ట్రలోని నాందేడ్ లోక్సభ స్థానాన్ని మేమే గెలిచాం. దీన్నిబట్టి దేశ ప్రజలు మోదీ నాయకత్వాన్ని, కిషన్రెడ్డిని ఛీ కొట్టారని అర్థమవుతోంది. అయినా కిషన్రెడ్డి ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. ఆయనను కేంద్ర మంత్రిగా చేయడం తెలంగాణ దురదృష్టం..’’ అని రేవంత్ విమర్శించారు. పైరవీల కోసం కాదు.. పెళ్లి కోసం ఢిల్లీ వెళ్తున్నా.. తాను ఢిల్లీ వెళ్లినప్పుడల్లా మంత్రివర్గ విస్తరణ గురించి వార్తలు వస్తున్నాయని సీఎం రేవంత్ అన్నారు. ఇప్పుడు తాను ఢిల్లీకి వెళ్తోంది లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహం కోసమని చెప్పారు. సోమవారం రాత్రి వివాహానికి హాజరై... మంగళవారం ఉదయం తెలంగాణ ఎంపీలతో సమావేశమవుతామన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, దీర్ఘకాలం నుంచి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల గురించి పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించే వ్యూహంపై చర్చిస్తామని చెప్పారు. అందుబాటులో కేంద్ర మంత్రులెవరైనా ఉంటే కలుస్తామన్నారు. అయితే తాము బీఆర్ఎస్ నేతల్లా పైరవీలు చేసేందుకు, కాళ్లు పట్టుకునేందుకు, కేసుల నుంచి తప్పించుకునేందుకో, మోదీ ముందు మోకరిల్లేందుకో ఢిల్లీకి వెళ్లడం లేదని పేర్కొన్నారు. కేంద్రాన్ని నిలదీసి అయినా నిధులు తెచ్చుకునేందుకు వెళుతున్నామని.. ఎన్నిసార్లయినా వెళ్తామని రేవంత్ చెప్పారు. కేంద్రం సమాఖ్య స్ఫూర్తితో ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు ఇవ్వాలని ఇవ్వాలని... అదేమీ బీజేపీ ఖజానా కాదని వ్యాఖ్యానించారు. ఏ ఎన్నికలైనా బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించాలనేది కాంగ్రెస్ పార్టీ విధానమని, తనది కూడా అదే అభిప్రాయమని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కేటీఆర్ జైలుకెళ్లినా సీఎం అయ్యే చాన్స్ లేదు! ఎప్పుడెప్పుడు జైలుకు పోదామా అని కేటీఆర్ ఎదురుచూస్తున్నారని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘జైలుకు వెళ్లినవారంతా ముఖ్యమంత్రులు అయ్యారని పేపర్లలో వార్తలు చూసి తాను కూడా జైలుకెళితే ముఖ్యమంత్రి అవుతానని కేటీఆర్ అనుకుంటున్నారు. కానీ కేటీఆర్ కన్నా ముందు ఆయన చెల్లెలు కవిత జైలుకు వెళ్లింది. ఇప్పుడిక సీఎం అవకాశం కూడా కేటీఆర్కు లేదు. సీఎం పోస్టు కోసం కేసీఆర్ కుటుంబంలో పోటీ ఎక్కువైంది. పదేళ్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి తెలివిని వాడాలి. చిల్లర ఆలోచనలు మానాలి. ఏ ఎల్లయ్యో, పుల్లయ్యో, బోడిగాడో చెప్పినట్టు ప్రభుత్వం వ్యవహరించదు. ఇక నుంచి ఆయన పేరును సైకో రామ్గా ఫిక్స్ చేయండి’’ అని ఎద్దేవా చేశారు. -
మరికొద్ది గంటలే.. షిండే వెనక్కి తగ్గకుంటే.. 2019 సీన్ రిపీట్?
మహారాష్ట్రలో మహాయుతి కూటమి గ్రాండ్ విక్టరీ సాధించినప్పటికీ.. ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. మహారాష్ట్ర సింగిల్ డిజిట్ లార్డెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ.. ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేక మిత్రపక్షాల మద్దతు తీసుకోవాల్సిన పరిస్థితి. కానీ..సీఎం పదవికి, సంఖ్యా బలానికి సంబంధం లేదని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అంటున్నారు. కూర్చొని చర్చించి సీఎంను ఎంపిక చేస్తామని చెప్పారు. అదే టైంలో దేవేంద్ర ఫడ్నవిస్ను ముఖ్యమంత్రి ఛాయిస్గా బీజేపీ దాదాపుగా ఫిక్స్ అయిపోయింది. మరోవైపు.. మొదట సీఎం రేసులో ఉన్నట్లు కనిపించిన అజిత్ పవార్.. ఇప్పుడు బీజేపీకే మొగ్గు చూపిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో..మహా సీఎం పంచాయితీ ఢిల్లీకి చేరింది. ఫడ్నవిస్-షిండే-అజిత్ పవార్లు ఇవాళ బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరుపుతున్నారు. అమిత్ షాతో కీలక భేటీ జరగనుంది. రేపటితో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియనుంది. ప్రస్తుత సీఎం షిండే రేపు రాజీనామా చేస్తారని.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని శివసేన ప్రకటించింది. ఆ పార్టీ లెజిస్లేచర్ నేతగా షిండేను ఎన్నుకుంది కూడా. అయితే..మహారాష్ట్ర అసెంబ్లీ గడువు మంగళవారంతో ముగియనుంది. దీంతో ఆ లోగానే కొత్త అసెంబ్లీ కొలువుదీరాల్సి ఉంది. అంటే.. సీఎం ప్రమాణం జరగాలి. అలాంటిదేమీ జరగలేదు కాబట్టి.. పరిస్థితుల దృష్ట్యా కచ్చితంగా రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితి వస్తుంది. అదే జరిగితే.. మహారాష్ట్రలో వరుసగా రెండోసారి ఎన్నికల తర్వాత రాష్ట్రపతి పాలన విధించినట్లు అవుతుంది. 2019 ఎన్నికల అనంతరం కూడా ప్రభుత్వం ఏర్పాటుపై ప్రతిష్ఠంభన నెలకొనడంతో రాష్ట్రపతి పాలన విధించారు. సుమారు 33 రోజుల పాటు ఆ టైంలో ప్రభుత్వ ఏర్పాటు ప్రతిష్టంభన కొనసాగింది. ఇక.. 2014లోనూ మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది. మరో రెండు వారాల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. కాంగ్రెస్ పార్టీతో 15 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంది నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ). మద్దతు ఉపసంహరించడంతో.. పృథ్వీరాజ్ చవాన్ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలో పడడం, తదనంతరం సీఎం పదవికి చవాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది.ఇంతకు ముందులా లేదుగా.. ..మహారాష్ట్రలో 2019లో జరిగిన ఎన్నికల్లోనూ 105 సీట్లను బీజేపీ దక్కించుకుంది. నాడు ఉమ్మడి శివసేన 56 స్థానాలు గెలుచుకుని.. బీజేపీ కూటమిగా(161 సీట్లతో) సంపూర్ణ మెజారిటీ సాధించాయి. అయితే, ముఖ్యమంత్రి పదవిపై ఉమ్మడి శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే పేచీ పెట్టడంతో రాజకీయం మారిపోయింది. చెరో రెండున్నరేళ్ల సీఎం పదవి కోసం డిమాండ్ చేశారాయన. కుదరకపోవడంతో.. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. ఆపై కలిసొచ్చిన అవకాశం అందిపుచ్చుకుని కాంగ్రెస్, ఉమ్మడి ఎన్సీపీలతో కలిసి మహా వికాస్ అఘాడీ కూటమిని ఏర్పాటు చేసి సీఎం అయ్యారు. ఇక..2022లో ఏక్ నాథ్ షిండే శివసేనలో చీలిక తెచ్చి.. బీజేపీతో కలిసి సీఎం అయ్యారు. ఆ టైంలోనూ ఫడ్నవిస్ సీఎం పదవిని త్యాగం చేయాల్సి వచ్చింది. షిండే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కొనసాగారు. మరోవైపు.. 2023లో ఎన్సీపీని చీల్చి అజిత్ పవార్ వచ్చి చేరారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. ఫడ్నవిస్ సీఎంగా ఉండి.. షిండే, పవార్లు డిప్యూటీ సీఎంలుగా కొనసాగడమే సబబని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. మరి అందుకు షిండే అంగీకరిస్తారో లేదో? అనేది ఈ రాత్రికల్లా తేలిపోవాల్సి ఉంది. లేకుంటే.. రాష్ట్రపతి పాలన తప్పదు!. -
‘‘100 కోట్లు వెనక్కి సరే.. ఒప్పందాల మాటేమిటి రేవంత్?’’
సాక్షి,హైదరాబాద్ : రూ.100 కోట్ల నిధులు వెనక్కి ఇస్తున్నారు సరే.. అదానీతో కుదుర్చుకున్న రూ.12,400 కోట్ల ఒప్పందాల సంగతి ఏంటని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఆదాని ఇచ్చిన రూ.100 కోట్ల నిధులను వెనక్కి ఇస్తున్నట్లు సీఎం రేవంత్రెడ్డి అధికారికంగా ప్రకటించారు. రేవంత్ సర్కార్ నిర్ణయంపై హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఆదాని ఇచ్చిన 100 కోట్ల నిధులను వెనక్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న రేవంత్రెడ్డి .. మరి, రాహుల్ గాంధీ అదాని అవినీతి మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని నినదిస్తున్న సమయంలో దావోస్ లో మీరు ఆదానితో చేసుకున్న 12,400 కోట్ల ఒప్పందాల సంగతేమిటి?అదానీకి రాష్ట్రంలోని డిస్కంలను అప్పగించి వాటిని ప్రైవేటీకరించేందుకు మీరు చేస్తున్న కుట్రల మాటేమిటి?. 20 వేల మెగావాట్ల థర్మల్ ప్లాంట్ పెడుతామనే ప్రతిపాదనతో వస్తే, మర్యాదపూర్వకంగా కలిసి చాయ్ తాగించి పంపించేశాం. కానీ కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు పాటించింది. రాహుల్ గాంధీ అవినీతి పరుడు అన్న వ్యక్తికే గల్లీ కాంగ్రెస్ రెడ్ కార్పెట్ పరిచింది.ఢిల్లీలో రాహుల్ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఆదానితో రేవంత్ రెడ్డి దోస్తీ చేసి ఒప్పందాలు చేసుకున్నాడు. ఇప్పుడు ఆదాని అవినీతి బయటికిరాగానే మాట మార్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదానీతో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్లో హరీష్ రావు స్పష్టం చేశారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఆదాని ఇచ్చిన 100 కోట్ల నిధులను వెనక్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి గారూ...మరి, రాహుల్ గాంధీ గారు అదాని అవినీతి మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని నినదిస్తున్న సమయంలో దావోస్ లో మీరు ఆదానితో చేసుకున్న 12,400 కోట్ల ఒప్పందాల… pic.twitter.com/XuxVIF7IgM— Harish Rao Thanneeru (@BRSHarish) November 25, 2024 -
బడి లేదు.. భవిష్యత్తూ లేదు.. కూటమి ప్రభుత్వంపై జూపూడి ఫైర్
సాక్షి, తాడేపల్లి : బడి లేదు.. భవిష్యత్తూ లేదు. ఆరు నెలల కూటమి పాలనలో విద్యావ్యవస్థ సర్వనాశనం చేసిందని ధ్వజమెత్తారు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్రావు. కూటమి ప్రభుత్వ వైఫల్య పాలనపై వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాయలంలో జూపూడి ప్రభాకర్రావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జూపూడి ప్రభాకర్రావు మాట్లాడుతూ.. మహానేత వైఎస్సార్ ప్రారంభించిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కేసింది. 2004కి ముందు ఉమ్మడి రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో పాదయాత్రలో చూసిన పరిస్థితులతో చలించిపోయి మొదటి సంతకం రైతులకు ఉచిత విద్యుత్ పథకానికి శ్రీకారం చుట్టారు.మరోవైపు ఫీజులు చెల్లించలేక పిల్లలు చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా విద్యా విప్లవం తీసుకొచ్చారు. ఆ పథకం ఎందరో విద్యార్థుల జీవితం మార్చింది. ఎందరో సాఫ్ట్వేర్ ఉద్యోగాలతో జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మళ్లీ 2004కి ముందు పరిస్థితులను తీసుకొచ్చారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో..:2019లో జగన్ సీఎం అయ్యాక, రాష్ట్రంలో మళ్లీ విద్యావిప్లవం మొదలైంది. ప్రభుత్వ స్కూళ్లు సమూలంగా మార్చేశారు. వాటిలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టి కొత్త ఒరవడికి నాంది పలికారు. మంచి పౌష్టికాహారం, రోజుకో మెనూతో మధ్యాహ్న భోజన పథకం గోరుముద్దను అమలు చేశారు. అంగన్వాడీల్లో సంపూర్ణ పోషణ అమలు చేశారు. పిల్లలకు పూర్తి ఫీజు చెల్లిస్తూ విద్యాదీవెన అమలు చేశారు. బిడ్డ చదువుల కోసం తల్లి ఫీజులు కట్టే విధంగా మహిళా సాధికారతకు అర్థం తెచ్చేలా, విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఆ మొత్తం నేరుగా జమ చేశారు.మళ్లీ అంతా అస్తవ్యస్తం:కూటమి ప్రభుత్వం రాగానే విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేసేశారు. గోరుముద్ద పథకాన్ని మూలన పడేశారు. ఇంగ్లిష్ మీడియం ఆగిపోయింది. అమ్మ ఒడి లేదు. విద్యావ్యవస్థను పూర్తిగా తొక్కేశారు. ఆరు నెలలుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారమైంది.ఉదా: ప్రకాశం జిల్లా జె.పంగులూరులో ఫీజు కట్టలేదని ఓ విద్యార్థిని కాలేజీ యాజమాన్యం ఇంటికి పంపేసింది.పిల్లలు ఫీజు బకాయిలు కట్టలేదంటూ చాలాచోట్ల వారికి టీసీ ఇవ్వడం లేదు. ఇంకా చాలా మంది పిల్లలు ఫీజులు కట్టలేక, విద్యార్థులు కూలీ పనులకు పోతున్నారు.జగన్పై కక్ష పిల్లలపై చూపొద్దు:జగన్ మార్క్ విధానాలు ఎక్కడా కనిపించకూడదనే అక్కసుతోనే కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును పథకం ప్రకారం కాలరాస్తోంది. తల్లిదండ్రుల ఆశలు చిదిమేస్తోంది. మీకేదైనా కక్ష ఉంటే మా మీద తీర్చుకోండి. అమాయక, పేద ప్రజల భవిష్యత్తును నాశనం చేయొద్దు. విద్యను నమ్ముకుని జీవితాలను బాగు చేసుకోవాలని కలలు కంటున్న వారి నమ్మకాన్ని కాలరాయొద్దు. నిజానికి 2019లో చంద్రబాబు దిగిపోతూ పెట్టిన రూ.2,800 కోట్ల ఫీజు బకాయిలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెల్లించింది. ఆరు నెలల కూటమి పాలనలో విద్య, వైద్య రంగాలు మూలన పడ్డాయి. పేకాట క్లబ్లు, మద్యం షాపులు విచ్చలవిడిగా వెలిశాయి.2019–24. విద్యారంగం వ్యయం:అయిదేళ్లలో ఫీజు రీయింబర్స్మెంట్ వ్యయం రూ.12,609 కోట్లు.మనబడి నాడు–నేడు మొదటి దశలో రూ. 3,669 కోట్లతో 15,715 బడుల్లో సమూల మార్పులు. రెండో విడతలో రూ.8వేల కోట్ల వ్యయంతో 22,344 స్కూళ్ల సమగ్ర అభివృద్ధి.అమ్మ ఒడి పథకంలో 44,48,865 మంది తల్లుల ఖాతాల్లో రూ.26,067 కోట్లు జమ.విద్యాదీవెనలో 29,65,930 మంది మంది పిల్లలకు మేలు చేస్తూ, రూ.12,609 కోట్ల ఫీజు చెల్లింపు.వసతి దీవెన కింద 25,17,245 మందికి రూ.4,275 కోట్లు.జగనన్న విదేశీ విద్యాదీవెనలో దాదాపు 408 మందికి రూ.107 కోట్లువిద్యాకానుక కిట్లు. 47,40,421 మంది పిల్లలకు లబ్ధి. వ్యయం రూ.3,366 కోట్లు.8వ తరగతి పిల్లలకు బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబ్లు.గోరుమద్దు పథకంలో 43,26782 మంది పిల్లలకు మేలు చేస్తూ రూ.6,568 కోట్లు ఖర్చు.అంగన్వాడీల్లో గర్భిణులు, బాలింతలకు, చిన్నారుల పౌష్టికాహారం కోసం సంపూర్ణ పోషణ కింద రూ.9,894 కోట్లు ఖర్చు.శానిటరీ న్యాప్కిన్స్ కోసం రూ.32 కోట్లు.6వ తరగతి నుంచే టోఫెల్ శిక్షణ.2024–25లో టీచర్ల టీచింగ్ సామర్థ్యం పెంచేందుకు ట్రైనింగ్ ఇచ్చారు. ఒక్కో ఏడాది ఒక్కో తరగతి పిల్లలకు ఐబీలో విద్యాబోధన మొదలు. అలా 2035 నాటికి పదో తరగతి పిల్లలకు సర్టిఫికెట్.అలా గత ఐదేళ్లలో కేవలం విద్యారంగంపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన వ్యయం రూ.73 వేల కోట్లు. జగన్ ఒక్కరే అంత ఖర్చు చేస్తే, మీ మూడు పార్టీలు కలిసి చేసే ఖర్చెంతో చూపించాలని జూపూడి ప్రభాకర్రావు డిమాండ్ చేశారు.ఫీజు బకాయిలు చెల్లించాలి: రవిచంద్ర, వైస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా విద్యాదీవెన, వసతి దీవెనకి ఒక్క రూపాయి కేటాయించలేదు. పైగా మంత్రి నారా లోకేశ్ గత ప్రభుత్వం రూ.6500 కోట్లు బకాయిలు పెట్టిపోయిందని మాట్లాడుతున్నారు. నిజానికి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి రూ.502 కోట్లు మాత్రమే. ఎన్నికల కోడ్ వల్ల ఆ చెల్లింపు కోసం అనుమతి తీసుకున్నా, ఇవ్వకుండా చంద్రబాబే అడ్డుకున్నారు. ఫలితంగా చివరి క్వార్టర్ ఫీజు చెల్లింపు ఆగిపోయింది. కాలేజీల యాజమాన్యాలు లోకేశ్ని కలిసి రీయింబర్స్మెంట్ డబ్బులు గురించి అడిగినా వారిని పట్టించుకోలేదు. ఇంజినీరింగ్, ఫార్మసీ, డిగ్రీ విద్యార్థుల నుంచి ఆయా విద్యాసంస్థలు అండర్టేకింగ్ లెటర్లు తీసుకుంటున్నాయి. ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో, అవి విద్యార్థులే చెల్లించేలా వారితో ఒప్పందాలు చేసుకుంటున్న దుస్థితి.విద్యా రంగంలో ఏ పథకానికి ఎంత నిధులు కేటాయించారో కూటమి ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి. గత ప్రభుత్వం బకాయిలు పెట్టిందంటూ విద్యార్థుల జీవితాలతో చంద్రబాబు ఆడుకుంటున్నారు. కానీ అదే చంద్రబాబు పెట్టిన బకాయిలను వైఎస్ జగన్ సీఎంగా ఉండగా చెల్లించి పెద్ద మనసు చాటుకున్నారు. -
వాసన్నా.. జగన్ ఇచ్చిన స్వేచ్చను ఓసారి గుర్తు తెచ్చుకోండి: చెవిరెడ్డి
సాక్షి, తిరుపతి: సెకీతో ఒప్పందంపై మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి చేస్తున్న ప్రకటనలపై వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాలినేని ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదని.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గురించి వ్యక్తిగతంగా మాట్లాడటం సరికాదంటూ చెవిరెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. సోమవారం తిరుపతిలో చెవిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘.. ఎమ్మెల్సీ పదవి కోసం బాలిరెడ్డి దిగజారిపోయారు. ఆరోపణలు మాని విద్యుత్ ఒప్పందాలపై వాస్తవాలు చెప్పాలి. బాలినేని సంతకంతోనే సెకి ఒప్పందం జరిగింది. కానీ, పార్టీ మెప్పు కోసమే బాలినేని అబద్ధాలు ఆడుతున్నారు. ఎవరినో మెప్పించడం కోసం బాలినేని నాయకుడిపై మాట్లాడుతున్నారు. .. వాసన్న మాటలు చూస్తే జాలి వేస్తుంది. సెకి తో ఒప్పందం పై గొప్పగా చెప్పాల్సింది పోయి.. రెండుసార్లు మంత్రిగా పనిచేశా.. రెండు సార్లు సంతకాలు చేశా.. ఫార్వర్డ్ చేశాను అని చెప్పడం బాధాకరం. పాలసీ గురించి మాట్లాడితే అదే మాట్లాడతాను. వ్యక్తిత్వ హననం చేసేందుకు మీరు ప్రయత్నిస్తే మేము వాస్తవాలు మాట్లాడతాం.. మీ నియోజకవర్గం కొండెపి కదా.. ఒంగోలు నుంచి ఎందుకు పోటీ చేశారు?. మీ నాయకుడు(పవన్ కల్యాణ్) పాలకొల్లు నుంచి పిఠాపురం ఎందుకెళ్లారని, చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పం ఎందుకు వెళ్లారని బాలినేనిని చెవిరెడ్డి ప్రశ్నించారు. ఒంగోలు ప్రజలతో నాకు అనుబంధం ఉంది. ఒంగోలు లో మీకంటే(బాలినేని) నాకు ఎక్కువ ఓట్లు వేశారు ప్రజలు. ఎంపీ అభ్యర్థిగా ఒంగోలు లో 52 వేల ఓట్లు అదనంగా వచ్చాయి. ఒంగోలు ప్రజలుతో నాకు అనుబంధం ఏర్పడింది, అండగా నిలుస్తాం. నేను విద్యార్ధి దశ నుంచి వైఎస్ కుటుంబంతో ఉన్నాను. గత 36 సంవత్సరాలగా వైఎస్సార్ కుటుంబంతోనే ఉన్నాను. నేను ఏ పార్టీ మారలేదు. మరోజెండా పట్టుకోలేదు... వాసన్నా.. జగన్ ఇచ్చిన స్వేచ్చను బాలినేని ఒకసారి గుర్తు చేసుకోవాలి. మీరు స్పెషల్ ఫ్లైట్లో విదేశాలకు ఇతర పార్టీలు నేతలతో రష్యా కు వెళ్లారు. కూటమి నేతలు ఇతర పార్టీ నాయకులతో స్పెషల్ ఫ్లైట్ లో డిల్లి కు వెళ్తే చంద్రబాబు దిగే లోపే పదవి ఊడగొడతారు. అయినా కూడా మీరు జగన్ను ఎన్నోసార్లు ఇబ్బందులు పెట్టారు. అయినా కూడా జగన్ భరించారు. ఇప్పుడు కూటమితో జతకట్టి జగన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కానీ, ఎన్ని కష్టాలు వచ్చినా జగన్ ఎదుర్కొంటారని గుర్తుంచుకోండి. వాసన్నా.. మీకు జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన స్వేచ్ఛ ఏదో ఒకరోజు మీకు గుర్తుకు వస్తుంది’’ అని చెవిరెడ్డి అన్నారు. -
‘పెండ్లికి పోతున్నావో.. పేరంటానికే పోతున్నావో..’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు సంధించారు. తాజా ప్రెస్మీట్లో ఢిల్లీ పర్యటనలపై రేవంత్ మాట్లాడుతూ.. కేటీఆర్ను, బీఆర్ఎస్ను ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఎక్స్ ద్వారా కేటీఆర్ స్పందించారు.పదే పదే ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో తెలియదని.. కనీసం ఒక్క రూపాయి కూడా తేలేకపోయారని, దీనిపై నిలదీయాల్సిన అవసరం తెలంగాణ పౌరులుగా తమకు ఉందని అన్నారాయన. అలాగే.. బడేభాయ్, చోటామియాలు ఈడీ దాడులు బయటపడకుండా ఉన్నారంటూ తీవ్ర ఆరోపణలే చేశారు కేటీఆర్. పెండ్లికి పోతున్నవో పేరంటానికి పోతున్నావోసావుకు పోతున్నావో తెలంగాణ పౌరులుగా 28 సార్లు పోయినవ్28 రూపాయలు తీస్కరాలేదు అని అడగడం మా బాధ్యతరాజ్యాంగబద్ధంగా మినహాఈ ఏడాదిలో అదనంగా కేంద్రం నుండి ఒక్క రూపాయి తెచ్చింది లేదుఈడీ దాడుల నుండి తప్పించుకోవడానికి ఫైవ్ స్టార్ హోటల్లో…— KTR (@KTRBRS) November 25, 2024తామేం రేవంత్లా ఢిల్లీ గులాములం కాదని.. పోరాటం తమ రక్తంలోనే ఉందని, మా జెండా మా ఎజెండా ఎన్నటికీ తెలంగాణ అభివృద్ధే అంటూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారాయన. ఇదీ చదవండి: ‘ఢిల్లీకి వెళ్లేది వాళ్లలా కాళ్లు పట్టుకోవడానికి కాదు’ -
షిండేనే మహారాష్ట్ర సీఎం.. తెరపైకి బీహార్ మోడల్!
ముంబై : మహరాష్ట్ర సీఎం ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది. దేవేంద్ర ఫడ్నవిస్నే సీఎంను చేయాలని బీజేపీ భావిస్తుండగా.. ఏక్నాథ్ షిండే అడ్డు పడుతున్నారు. అయితే.. ఫలితాలు వెలువడ్డాక సీఎం రేసులో తాను ఉన్నానంటూ సంకేతాలిచ్చిన ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్.. ఇప్పుడు ఫడ్నవిస్కే మద్దతు ఇవ్వబోతున్నారంటూ అక్కడి మీడియాలో కథనాలు వస్తునాయి. ఈలోపు.. బీహార్ మోడల్ను తెరపైకి తెచ్చారు ఓ ఎంపీ. బీహార్ మోడల్ ప్రకారం.. ఏక్నాథ్ షిండేని సీఎంగా కొనసాగించాలని ఆ వర్గం నేత నరేష్ మ్హస్కే డిమాండ్ చేస్తున్నారు. . అలా జరిగితే.. తన మిత్ర పక్షాల్ని రాజకీయావలసరాల కోసం వాడుకుని, ఆపై వదిలేస్తుందనే విమర్శలకు బీజేపీ ధీటైన సమాధానం ఇచ్చినట్లు అవుతుందని నరేష్ అంటున్నారు. బీహార్ మోడల్ ఏంటంటే..2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. 243 స్థానాలకు గానూ.. ఆర్జేడీ 75 సీట్లు దక్కించుకోగా, బీజేపీ 74, జేడీ(యూ) 43 స్థానాలు దక్కించుకుంది. అయితే.. బీజేపీ జేడీయూ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి.. నితీశ్ కుమార్ను సీఎంను చేసి పెద్ద త్యాగమే చేసింది. ఆ టైంలో శివసేన పత్రిక సామ్నా ఈ పరిణామంపై సెటైర్లు కూడా వేసింది.2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలవగా, శివసేన 56, ఎన్సీపీ 54 స్థానాలు దక్కించుకున్నాయి. అయితే సీఎం పదవిని బీజేపీ వదులుకోకపోవడంతో.. ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత.. శివసేన నుంచి ఏక్నాథ్ షిండే వర్గం చీలికతో బీజేపీ తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. షిండేనే బీజేపీ సీఎంను చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. 288 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 132 సీట్లను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. అయితే, సీఎం విషయమే ఇంకా ఓ కొలిక్కి రాలేదు.బీజేపీ అధిష్టానం దేవేంద్ర ఫడ్నవీస్కు సీఎం బాధ్యతల్ని అప్పగించేందుకు మొగ్గు చూపుతుంది. అజిత్ పవార్ నేతృత్వరంలోని ఎన్సీపీ సైతం ఫడ్నవీస్కు ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టడాన్ని సమర్థిస్తోంది. కానీ, శివసేన నేతృత్వంలోని ఏక్ నాథ్ షిండే మాత్రం సీఎం సీటు తనకే కావాలని పట్టుబడుతున్నారు. షిండే వర్గం నేతలు ఇదే విషయంపై కుండబద్దలు కొడుతున్నారు. ఈ తరుణంలో సోమవారం (నవంబర్ 25న) మహాయుతి కూటమి వర్గం కీలక నేతలు దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే,అజిత్ పవార్లు బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో మహరాష్ట్ర సీఎం ఎవరనేది బీజేపీ పెద్దలు రాత్రికల్లా తేల్చే అవకాశం ఉంది. -
అదానీ నిధులను నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: గత కొన్ని రోజులుగా చెలరేగుతున్న అదానీ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కోసం ఎంతోమంది నిధులు ఇచ్చారని తెలిపారు. అదానీ సంస్థ కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బిలిటీ కింద రూ. 100 కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి విరాళం ఇచ్చారని పేర్కొన్నారు.అయితే స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇస్తానన్న వంద కోట్లను తెలంగాణ ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా లేదని సీఎం రేవంత్ వెల్లడించారు. 100 కోట్లు స్వీకరించవద్దని నిర్ణయించుకున్నామని, డబ్బులు ట్రాన్స్ఫర్ చేయవద్దని అదానీ గ్రూప్కు లేఖ రాశామన్నారు. అదానీ నుంచి తెలంగాణ ప్రభుత్వం నిధులు సేకరించినట్లు తప్పుగా ప్రచారం చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. అనవసర వివాదాల్లోకి తెలంగాణ ప్రభుత్వాన్ని లాగొద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి నష్టం చేకూర్చేలా వార్తలు రాయవద్దని మీడియా మిత్రులను కోరుతున్నట్లు చెప్పారు.రేవంత్ ఇంకా మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అదాని వంద కోట్లు ఇచ్చిన విషయాన్ని మీడియా రాహుల్ గాంధీ దగ్గర ప్రస్తావించింది. రాహుల్ కూడా స్పష్టంగా సమాధానం చెప్పారు.అదానీకే కాదు ఏ సంస్థలకైనా రాజ్యాంగ బద్దంగా పెట్టుబడులు పెట్టడానికి హక్కు ఉంటుందని రాహుల్ చెప్పారు చట్టబద్దంగా నిర్వహించే టెండర్లలో అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి.గొప్ప ఉద్ధేశంతో స్కిల్ యూనివర్సిటీ ప్రారంభించాంస్కిల్స్ యూనివర్సిటీ కి వంద కోట్లు కార్పస్ ఫండ్ ఇస్తామని అదాని కంపెనీ లేఖ ఇచ్చింది.ఇప్పటి వరకు ఓక్క రూపాయి కూడా స్కూల్ యూనివర్సిటీ నిధులు తీసుకోలేదు.అదాని నుంచి వంద కోట్లు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.ఈ విషయాన్ని నిన్ననే అదాని కంపెనీకి లేఖ ద్వారా తెలియజేశాం.తెలంగాణను వివాదాలకు లాగొద్దనే అదాని వంద కోట్లు వద్దన్నాంఢిల్లీ పర్యటన మంత్రివర్గ విస్తరణ కోసం కాదు.ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ కేబినెట్ విస్తరణ అని అంటున్నారు. అది తప్పుఢిల్లీ పర్యటన మంత్రివర్గ విస్తరణ కోసం కాదు.ఈరోజు ఓంబిర్లా కూతురు వివాహానికి వెళ్తున్నాం.రేపు ఢిల్లీలో కాంగ్రెస్ లోక్సభ, రాజ్యసభ ఎంపీలతో భేటీ అవుతాను.తెలంగాణ ప్రయోజనాలను సభలో మాట్లాడాలని సూచిస్తా.ఫామ్హౌజ్లో పడుకుంటే ప్రయోజనం ఉండదు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి ఎన్నిసార్లైనా వెళ్తాంవాళ్లలాగా గవర్నర్ అనుమతి ఇవ్వకుండా పైరవీలు కోసం వెళ్లంఅరెస్ట్కు గవర్నర్ అనుమతి ఇవ్వకుండా ఒత్తిడి తీసుకురావడానికి ఢిల్లీ వెల్లడం లేదు10 ఏళ్లు మా కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించారు.తెలంగాణకు నిధులు ఇవ్వాలని పార్లమెంటులో ఒత్తిడి చేస్తాంబీజేపీ ఖజానా నుంచి నిధులు ఇవ్వడం లేదుమన హక్కుల కోసం ఢిల్లీ వెళ్లాలి, నిధులు తెచ్చుకోవాలిమీ కడుపుమంట మాకు తెలుసు. మీ కాకి గోల పట్టించుకోంబీఆర్ఎస్ కూడా అదానీతో చేసుకున్న ఒప్పందాలు చాలా ఉన్నాయి.జైలుకు పోయినవారు సీఎం అయ్యారని, కేటీఆర్ మాటిమాటికి జైలుకు వెళ్తా అని అంటున్నాడుకేటీఆర్ కంటే ముందు జైలుకు చెల్లిపోయింది.. ఆ అవకాశం కూడా లేదు.విచారణ అంటే కేసులు పెడుతున్నారని అంటున్నారుఅలా అయితే అదానీకి ప్రాజెక్టులు ఇచ్చిన కేసీఆర్ను ప్రాసిక్యూట్ చేయాలా?కేసీఆర్ లాగా అదానీ నుంచి మేమేం నొక్కేయలేదు.అదానీ ఫ్లైట్లలో ప్రయాణించేది వాళ్లేఅదానీకి భూములు, కాంట్రాక్టులు ఇచ్చింది బీఆర్ఎస్ వాళ్లేగతంలో మీరు హేవేలు డేటా సెంటర్లు కేటాయించారు.మీరు కేటాయించిన వాటిపై కేసులు పెట్టాలిఒప్పందాలు రద్దు చేయాలంటే న్యాయ నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది.మేము ఎవరికి అప్పనంగా భూములు కట్టబెట్టంనోరు తెరిస్తే అబద్దాలు మాట్లాడటం బీఆర్ఎస్కు అలవాటైందిఅదానీ దగ్గర కేసీఆర్లా నేను ఇంత వంగి వంగి లేను2023లో అధికారం పోయింది2024 డిపాజిట్ కోల్పోయారు.ఇప్పుడు మెదడు కూడా లేకుండా పోయిందిబ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరగాలనేది మా విధానంవయనాడ్, నాందేడ్లో కాంగ్రెస్ను గెలిపించారురెండు ఎంపీ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో మోదీ, నాయకత్వాన్ని ప్రజలు చీత్కరించారురాష్ట్రానికి సంబంధించి ఒక రకంగా కేంద్రానికి సంబంధించిన ఎన్నికల్లో ఒకరకంగా తీర్పు ఇచ్చారు’ అని రేవంత్ పేర్కొన్నారు. -
సంభాల్ హింస: ఎంపీ సహా 400 మందిపై కేసు
ఉత్తర ప్రదేశ్లోని సంభాల్లో ఆదివారం చెలరేగిన హింసాత్మక ఘటనలో పోలీసులు చర్యలు చేపట్టారు. దాదాపు 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. 400 మందిపై ఏడు కేసులు నమోదు చేశారు. కేసు నమోదైన వారిలో సంభాల్ ఎంపీ, సమాజ్వాదీ పార్టీ నేత జియావుర్ రెహమాన్, స్థానిక ఎమ్మెల్యే ఇక్బాల్ మెహమూద్ కుమారుడు సోహైల్ ఇక్బాల్ కూడా ఉన్నారు. వీరిద్దరూ హింసకు పాల్పడటంతోపాటు జనాలను గుంపులుగా సమీకరించి, అశాంతిని రెచ్చగొట్టడం వంటివి పాల్పడ్డారని అభియోగాలు మోపుతూ కేసు నమోదు చేశారు.కాగా సంభాల్ పట్టణంలో మొగల్ కాలానికి చెందిన షాహీ జామా మసీదు ఉన్న చోట గతంలో హరిహర మందిరం ఉండేదన్న ఫిర్యాదుతో న్యాయస్థానం సర్వేకి ఆదేశించింది. దీంతో ఆదివారం సర్వే నిర్వహిస్తుండగా హింస చేలరేగింది. గుంపుగా వచ్చిన కొందరు స్థానికులు సర్వేకు వ్యతిరేంగా మసీదు ముందు నినాదాలతో ఆందోళనకు దిగారు. చదవండి: ఘొర పరాజయం.. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నానా పటోలే రాజీనామాపోలీసులపై రాళ్లు రువ్వి, వాహనాలకు నిప్పు పెట్టారు. స్పందించిన పోలీసులు లాఠీలు, టియర్ గ్యాస్ షెల్స్ ఉపయోగించారు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ అల్లర్లలో నలుగురు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. రాళ్ల దాడిలో సీఐ సహా 15 నుంచి 20 మంది పోలీసులకు సైతం గాయాలయ్యాయి.ఈ ఘటనపై అధికార బీజేపీ, కాంగ్రెస్ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నాయి. బీజేపీ కుట్ర పన్నిందని కాంగ్రెస్, హింసను కాంగ్రెస్ ప్రేరేపిస్తోందని బీజేపీ ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. ఇక సోమవారం సంభల్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. స్కూళ్లను బంద్ చేశారు. ప్రజలు గుంపులుగా గుమిగూడటంపై నిషేధం విధించారు.#WATCH | Delhi: On Sambhal stone pelting incident, Samajwadi Party MP Akhilesh Yadav says "Our MP Zia ur Rahman was not even in Sambhal and despite that an FIR was lodged against him...This is a riot done by the government...Right after the order was passed by the Court, police… pic.twitter.com/qwPGtpho1m— ANI (@ANI) November 25, 2024 -
‘నేను రాలేదు.. కాబట్టే నువ్వు గెలిచావ్ రా’!..
ముంబై : నువ్వు పోటీ చేసిన అసెంబ్లీ నియోజకవర్గంలో నేను పోటీ చేసి ఉండి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదంటూ బాబాయ్ అజిత్ పవార్, అబ్బాయి రోహిత్ పవార్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ప్రస్తుతం, ఆ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) తరుఫున అహల్య జిల్లా ఖజరత్ జమ్ఖేడ్ నియోజకవర్గం నుంచి అజిత్ పవార్ సోదరుడి కుమారుడు రోహిత్ పవార్.. బీజేపీ అభ్యర్థిపై స్వల్ప తేడాతో విజయం సాధించారు.ఈ తరుణంలో సోమవారం(నవంబర్ 25) మహారాష్ట్ర తొలి సీఎం వైబీ చవాన్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అజిత్ పవార్, ఆయన సోదరుడి కుమారుడు రోహిత్ పవార్ ఒకరికొకరు ఎదురుపడ్డారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచావుగా. రా.. వచ్చి నా ఆశీర్వాదం తీసుకో. ఒకవేళ నేనే ఖజరత్ జమ్ఖేడ్లో ఎన్నికల ప్రచారం చేసి ఉంటే ఏమి జరిగి ఉండేది?’’ అని రోహిత్ పవార్ను ఉద్దేశిస్తూ అజిత్ పవార్ చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడారు. ఆ మాటతో రోహిత్ పవార్.. అజిత్ పవార్ కాళ్లకు నమస్కరించారు.స్వల్ప తేడాది విజయంఇటీవల ముగిసిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ మనవడు రోహిత్ పవార్ అహల్యానగర్ జిల్లాలోని ఖజరత్ జమ్ఖేడ్ నియోజకవర్గంలో తన ప్రత్యర్థి బీజేపీ నేత రామ్ షిండేపై 1,243 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. 41 అసెంబ్లీ స్థానాల్లో అజిత్ పవార్ గెలుపుగత వారం మహరాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాల ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఎన్నికలలో శరత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ)10 స్థానాల్ని కైవసం చేసుకోగా.. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 41 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. स्व. यशवंतराव चव्हाण साहेबांची समाधी प्रितीसंगम म्हणजे पवित्र स्थळ. चव्हाण साहेबांनीच एक सुसंस्कृत अशी राजकीय संस्कृती जपण्याचे संस्कार महाराष्ट्रावर केले. त्यानुसारच आज प्रितीसंगमावर आदरणीय अजितदादांची भेट झाली. त्यांची राजकीय वाटचाल स्वतंत्र दिशेने सुरु असली तरी त्यांचा राजकीय… pic.twitter.com/Oc8eQYdwfN— Rohit Pawar (@RRPSpeaks) November 25, 2024 -
‘పుష్ప- 2పై కొందరికి జెలసీగా ఉంది’
గుంటూరు, సాక్షి: అల్లు అర్జున్ పుష్ప-2 చిత్రంపై సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రోలింగ్పై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. గుంటూరులో సోషల్ మీడియా అరెస్టుల అంశంపై ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. పనిగట్టుకుని కొందరు ఆ చిత్రంపై పోస్టులు చేయడం గురించి ప్రస్తావించారు. ‘అల్లు అర్జున్ సినిమాను చూడకుండా ఎవరూ ఆపలేరు. అతనొక ఇంటర్నేషనల్ స్టార్. పుష్ప-2 అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను కూడా అడ్డుకోవాలనుకున్నారు. ఏమైంది?.. సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు. పుష్ప-2 కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. .. నేను కూడా ఆ సినిమా చూడడానికి రెడీగా ఉన్నాను.మొదటి పార్ట్ అద్భుతంగా ఉంది.పుష్ప-2పై కొంతమందికి జెలసీగా ఉంది. అరచేతిని అడ్డుపెట్టుకుని ఒక సినిమా విజయాన్ని ఆపలేరు. ఎన్టీఆర్, అల్లు అర్జున్ చిత్రాలను అడ్డుకోవాలనుకోవడం అవివేకం’అని అంబటి అన్నారు. -
ఘోర పరాజయం.. కాంగ్రెస్ అధ్యక్షుడి రాజీనామా
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహావికాస్ అఘాడి ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. 288 స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్, ఎన్సీపీ(శరద్పవార్, శివసేన(ఉద్దవ్)చెందిన కూటమి కేవలం 49 స్థానాల్లోనే గెలుపొందింది. ప్రతిపక్ష కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో తీవ్ర ఓటమితో ఇప్పటికే ఖంగుతున్న ఎంవీఏ కూటమిలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నానా పటోలే సోమవారం రాజీనామా చేశారు. మొత్తం 103 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 16 స్థానాల్లో మాత్రమే గెలిచి 12.42 శాతం ఓట్లు సాధించింది. మహారాష్ట్ర ఏర్పడిన నాటినుంచి ఎన్నడూ లేనంత బలహీనంగా కాంగ్రెస్ మారిపోయింది. ఇక సకోలీ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర చీఫ్ నానా పటోలే 208 ఓట్ల తేడాతో గట్టెక్కారు. ఈ క్రమంలోనే పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ నానా పటోలే అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. మాజీ ఎంపీ అయిన పటోలే 2021లో మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. 17 స్థానాలకు గాను 13 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. అయితే, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బోల్తా కొట్టింది. మొత్తం మీద 49 సీట్లు మాత్రమే గెలుచుకుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్చంద్ర పవార్) 10 సీట్లు, కాంగ్రెస్ 16, శివసేన (ఉద్దవ్) 20 సీట్లు గెలుచుకున్నాయి. మరోవైపు మహాయుతి కూటమి 233 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది.