rajasekhar
-
పళ్ళు చూపించి ఫోటోలు దిగడం కాదు ...అభివృద్ధి అంటే..
-
‘టీడీపీకి జనసేన ఎందుకు సహకరించాలి?’
అంబేద్కర్ కోనసీమ, సాక్షి: ఎమ్మెల్సీ ఎన్నిక కూటమిలో చిచ్చు రాజేస్తోంది. రాజోలులో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్కు జనసేన నేత యెనుముల వేంకటపతిరాజు పెద్ద షాకిచ్చారు. ఆయనకు మద్ధతు ఇచ్చేది లేదని బహిరంగంగా ప్రకటన చేశారు. సోషల్ మీడియా వేదికగా జనసేన ఎన్నారై విభాగం నేత వేంకటపతిరాజు చేసిన పోస్టులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘‘టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్(MLC Candidate Rajasekhar) కు జనసేన కార్యకర్తలెవరూ సపోర్టు చేయొద్దు. పార్టీ మీద బతికే నాయకులు మీ వద్దకు వస్తే ‘ఛీ’ కొట్టండి. జనసేన కార్యకర్తలను రోడ్డును పడేస్తే.. నాయకులను కూడా రోడ్డున పడేస్తాం’’.. ‘‘రాజోలు(Razole)లో పాలన ఏమాత్రం బాగోలేదు. గతంలో వివక్షంలో ఉన్నా పనులు జరిగేవి. ఇప్పుడు అధికారులే మాట వినడం లేదు. యువత , మహిళలు అందరూ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించాలి. సమయం వృధా చేసుకోవద్దు. ఓటు అడగడానికి వస్తే మొహంపైనే ‘ఎందుకు ఓటు వేయాలి’ అని అడగండి’’ అంటూ అంటూ వరుస పోస్టులు చేశారాయాన.జనసేనకు ఓటు బ్యాంకు ఉన్న రాజోలులో.. గత కొంతకాలంగా టీడీపీ వర్సెస్ జనసేన వ్యవహారం నడుస్తోంది. అధికారంలోకి వచ్చాక జనసేన(Jana Sena) కేడర్ను టీడీపీ నేతలు చిన్నచూపు చూస్తున్నారని అసంతృప్తితో రగిలిపోతోంది. ఈ క్రమంలో.. ఎమ్మెల్సీ ఎన్నిక దీన్ని మరింత ముదిరేలా చేసింది. అసలు టీడీపీ అభ్యర్థికి ఎందుకు మద్దతు ఇవ్వాలి? అంటూ జనసేన నేతలు ప్రశ్నించడాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది.రాజశేఖర్ నేపథ్యం.. ఎన్డీయే కూటమి తరఫున ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ(Godavari MLC Elections) అభ్యర్థిగా పెరబత్తుల రాజశేఖర్ పేరును టీడీపీ ప్రకటించింది. 1998లో టీడీపీలో చేరిన రాజశేఖర్.. ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పని చేశారు. 2024 ఎన్నికల్లో కాకినాడ రూరల్ టికెట్ దక్కుతుందని ఆయన ఆశించారు. అయితే అది జనసేనకు వెళ్లింది. దీంతో అలకబూనిన ఆయన్ని చంద్రబాబు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి బుజ్జగించారు. ఇదీ చదవండి: మనుషుల వైద్యానికి.. పశువుల వైద్యంతో ముడి -
కేజ్రీవాల్ ని చూసి నేర్చుకో.. బాబుకు టీడీపీ నేత ఝలక్
-
హామీలు ఎగ్గొడతానని చంద్రబాబు క్లారిటీగా ఉన్నాడు..
-
అప్పులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి: కాకుమాను రాజశేఖర్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడు నెలల్లో చేసిన రూ.1.19 కోట్ల అప్పులపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేసి, ఆ అప్పు ఎలా ఖర్చు చేశారో చెప్పాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్ డిమాండ్ చేశారు. ఆ బాధ్యత కచ్చితంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్పై ఉందని ఆయన తేల్చి చెప్పారు. రాజకీయాల్లో తనంత అనుభవజ్ఞుడు లేడని చెప్పే చంద్రబాబు, ఎన్నికల ముందు గొప్పగా ప్రచారం చేసిన సూపర్సిక్స్ హామీలు అమలు చేయకుండా, సాకులు చెప్పడం సరికాదని స్పష్టం చేశారు.కరోనా సంక్షోభంలో ఎలాగైతే వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను కొనసాగించారో.. అదే స్ఫూర్తితో సీఎం చంద్రబాబు పని చేయాలని సూచించారు. పథకాలు అమలు చేయబోమని చంద్రబాబు చెబుతున్నా.. పవన్కళ్యాణ్ తేలు కుట్టినా దొంగలా సైలెంట్గా ఉండటానికి కారణమేంటని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కాకుమాను రాజశేఖర్ ప్రశ్నించారు.ఆత్మవిమర్శ చేసుకోవాలి:కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 8 నెలలవుతోంది. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను కూటమి పార్టీలు ఏ మేరకు నెరవేర్చారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. కూటమి పాలనలో ప్రజలకు జరిగిన మేలు గుండు సున్నా. ఎన్నికల మేనిఫెస్టోలో అమలు కాని వాగ్ధానాలు చేర్చడం, తీరా అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చకుండా మోసం చేయడం చంద్రబాబుకి పరిపాటిగా మారింది. ప్రజలను మోసం చేసి చంద్రబాబు ఇప్పటికి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు మోసాలపై బీజేపీకి క్లారిటీ ఉంది కాబట్టే ఆ మేనిఫెస్టో రిలీజ్ చేసే సమయంలో దాన్ని ముట్టుకోవడానికి కూడా బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్ ఇష్టపడలేదు.ప్రజలతో మూడు ముక్కలాట:పాలనపై చంద్రబాబు పట్టుకోల్పోయారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన జరగడం లేదు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు ప్రజల ఆశలతో మూడు ముక్కలాట ఆడుకుంటున్నారు. వైయస్సార్సీపీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించడం, డైవర్షన్ పాలిటిక్స్ చేయడం మినహా 8 నెలల్లో జరిగింది శూన్యం. గత వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో విద్య, వైద్యం, పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో గణనీయమైన అభివృద్ధి జరిగిందని పలు గణాంకాలు రుజువు చేస్తున్నాయి. కోవిడ్ సమయంలో జగన్ చేసిన పాలనకు దేశమే బ్రహ్మరథం పట్టింది. అయినా కరోనా సాకు చూపించి సంక్షేమ పథకాలను అమలు చేయకుండా తప్పించుకోవాలని చూడకపోవడం ఆయన గొప్పతనం. నేడు పరిస్దితులన్నీ బాగానే ఉన్నా, అనుభవశాలినని చెప్పుకునే చంద్రబాబు సూపర్ సిక్స్ అమలు చేయలేక పిల్లి మొగ్గలేస్తున్నాడు.ఆయన ఏనాడూ సాకులు చెప్పలేదు:జగన్ మేనిఫెస్టోను ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావించి అమలు చేస్తే చంద్రబాబు మాత్రం ప్రజల్ని వంచించడానికి ఆయుధంగా వాడుకుంటున్నారు. 2019లో వైఎస్ జగన్ సీఎం అయ్యేనాటికి టీడీపీ ప్రభుత్వం ఖజానాలో కేవలం రూ.100 కోట్లు మాత్రమే ఉంచి దిగిపోయింది. అయినా చంద్రబాబులా జగన్ సాకులు వెతుక్కోకుండా నవరత్నాలను అమలు చేసి చూపించారు. ఈ 8 నెలల్లో దాదాపు 1.19 లక్షల కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు ప్రజలకు ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయలేకపోయారు. పైగా గత ప్రభుత్వ అప్పులంటూ సాకులు వెతుకుతూ వైఎస్ జగన్ పాలనపై బురదజల్లాలని చూస్తున్నారు. ఈ ఎనిమిది కాలంలో చంద్రబాబు చేసిన అప్పులు, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలి.కరోనా లాంటి సంక్షోభ పరిస్థితులున్నా వైఎస్ జగన్ ఎలాగైతే సంక్షేమ పథకాలు అమలు చేశారో.. చంద్రబాబు కూడా కారణాలు వెతకడం మానేసి ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందే. అమలు చేయలేకపోతే ప్రజలకు క్షమాపణలు చెప్పి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలి. అవసరమున్నా లేకపోయినా ప్రతి సందర్భంలో ఐయామ్ ప్రజెంట్ అంటూ తలదూర్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇప్పుడు తేలు కుట్టిన దొంగలా దాక్కోవడం సరైన పద్ధతి కాదు. సూపర్ సిక్స్ హామీలపై గ్యారంటీ ఇస్తూ సంతకం చేసిన ఆ పెద్ద మనిషి తక్షణం స్పందించాలి. ప్రభుత్వం ఇప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ మీద కాకుండా మేనిఫెస్టో అమలుపై చిత్తశుద్ధితో పని చేయాలని కాకుమాను రాజశేఖర్ కోరారు. -
కిడ్నీ రాకెట్ కేసులో సర్జన్ రాజశేఖర్ రిమాండ్
చైతన్యపురి: అలకానంద కిడ్నీ రాకెట్ కేసు(kidney racket case)లో మరొకరిని సరూర్నగర్ పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్కు తరలించిన ట్లు ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ శస్త్ర చికిత్సలు చేసిన తమిళనాడుకు చెందిన పెరుమాళ్ల రాజశేఖర్(Surgeon Rajasekhar) (59)ను చెన్నై వెళ్లిన పోలీస్ బృందం అరెస్ట్ చేసి నగరానికి తీసుకొచ్చారు. కిడ్నీ రాకెట్ కేసులో 13వ నిందితుడుగా ఉన్న రాజశేఖర్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా మిలటరీ కాలనీకి చెందిన వ్యక్తి.తమిళనాడులోని సవిత మెడికల్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్నా రు. అలకానంద ఆస్పత్రి అక్రమ కిడ్నీ రాకెట్ వ్యవహారంలో శస్త్ర చికిత్సలు చేసిన ప్రధాన సర్జన్. ఆయన సుమారు 12 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాక ఇదే ముఠా ఆధ్వర్యంలో జనని, అరుణ ఆస్పత్రుల్లో కూడా మరో 30కి పైగా కిడ్నీ మార్పిడి చేసినట్లు తెలిసింది. -
వంగలపూడి అనిత చేసిన నిర్వాకం.. సంచలన విషయాలు..
-
మూగబోయిన దళితుల గొంతుక
పది రోజుల క్రితం మరణించిన వి.టి.రాజశేఖర్ మండల్ నిశ్శబ్ద విప్లవం ప్రారంభం కాకముందే దళితవాదం వైపు మళ్లారు. ఒక కన్నడ అగ్రకుల శూద్ర శెట్టి అయినప్పటికీ దళితుల కోసం అదే పేరుతో(దళిత్ వాయిస్) ఒక పత్రికను స్థాపించారు. దానివల్ల సామాజిక ఒంటరితనాన్ని అనుభవించారు. ఆయన బలమైన జాత్యహంకార వ్యతిరేకి. చివరివరకూ దళిత ఉద్యమకారులకు, రచయితలకు అండగా నిలిచారు. దళితులు–ఓబీసీల ఐక్యత కంటే దళితులు–ముస్లింల ఐక్యత గురించిన ఆయన ఆలోచన మరింత స్థిరమైనది. ముస్లింగా మారకపోయినా, ఇస్లాం మతానికి బలమైన మద్దతుదారుగా నిలిచారు. అంటరానితనానికి వ్యతిరేకంగా, దళిత విముక్తి ప్రచారకర్తగా ఆయన లాంటి ఏ ఉన్నత శూద్ర మేధావీ ఇప్పటివరకూ ఉద్భవించలేదు.2024 నవంబర్ 20న 93 సంవత్సరాల వయస్సులో వి.టి.రాజశేఖర్ మరణం, ఒక కోణంలో నన్ను తీవ్రంగా బాధించినప్పటికీ, మరో కోణంలో ఆయన జీవితాన్నీ, వారసత్వాన్నీ వేడుకగా జరుపుకొనే వీలు కల్పించింది. ఆయన భారతదేశ వ్యాప్తంగానూ, దేశం వెలుపలా కూడా ఉన్న నాలాంటి ఉద్యమకారులకు, రచయితలకు ధైర్యం, విశ్వాసం కలిగించిన స్నేహితుడూ, మార్గదర్శకుడూ! ఆయన వల్లే నా పుస్తకం ‘నేను హిందువు నెట్లయిత’ (వై ఐ యామ్ నాట్ ఎ హిందూ)కు 2008లో ‘లండన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియా’(లీసా) అవార్డు వచ్చింది. వెస్ట్మినిస్టర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ (బ్రిటిష్ పార్లమెంట్)లో నా ఉపన్యాసం తర్వాత జరిగిన అవార్డు వేడుకకుఆయన వ్యక్తిగతంగా హాజరయ్యారు. మేము లండన్లో ప్రపంచ రాజ కీయాల గురించి చర్చించుకుంటూ, కలిసి భోజనం చేస్తూ విలువైన సమయం గడిపాము.ఆయన, ఆయన పత్రిక గురించి నాకు తెలియకముందే, ఒక చక్కటి సమీక్ష రాసి, నా పుస్తకానికి తన ‘దళిత్ వాయిస్’ పాఠకులలో ప్రాచుర్యం కలిగించారు. ఆయన భిన్నాభిప్రాయాలకు సంబంధించిన విషయాలపై వెంటనే తగాదాకు తెరతీయగల వ్యక్తి, కానీ అదే సమయంలో విషయాలు ఆమోదయోగ్యమైన స్థానాలకు మారిన ప్పుడు స్నేహాన్ని పునరుద్ధరించగల వ్యక్తి. ‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’లో పని అనుభవంతో, దృఢమైన పాత్రికేయ నేపథ్యంతో, బంట్ అని కూడా పిలువబడే కన్నడ శెట్టి సంఘం నుండి వచ్చిన వి.టి. రాజశేఖర్కు దళిత విముక్తిపై ఉన్న తిరుగులేని వైఖరి నిజంగా విశేషమైనది. చనిపోయే వరకు ఆయన దళితవాద నిబద్ధతతోనే ఉన్నారు. ఆయన తరాన్ని అలా ఉండనివ్వండి, అంటరానితనానికి వ్యతిరేకంగా, దళిత విముక్తి ప్రచారకర్తగా ఆయన లాంటి ఏ ఉన్నత శూద్ర మేధావీ ఇప్పటివరకూ ఉద్భవించలేదు.‘దళిత్ వాయిస్’ని ప్రారంభించిన తర్వాత తన మధ్యతరగతి ఉన్నత కుల స్నేహితులందరినీ కోల్పోయానని ఆయన చెప్పారు.బెంగళూరులోని తన సొంత ఇంటి నుండి ఆ పత్రిక రచన, ముద్రణ, పంపిణీని ఒంటరిగా నిర్వహించారు.మండల్ నిశ్శబ్ద విప్లవం ప్రారంభం కాకముందే ఆయన దళితవాదం వైపు మళ్లారు. అప్పట్లో అంబేడ్కర్ అనంతర దళితులకు ఇంగ్లిష్ చదవడం, రాయడానికి సంబంధించిన పాండిత్యం లేదు. దళిత్ పాంథర్ మరాఠీ సాహిత్య ఉద్యమం కారణంగా దళిత్ అనే పదం కొన్ని మీడియా సర్కిళ్లలో మాత్రమే గుర్తించబడుతోంది.ఆయన కూడా ఒక రిపోర్టర్గా బొంబాయి నగరంలో ఉన్నందున, ఏకంగా ఒక పత్రికను ప్రారంభించడం ద్వారా ‘దళిత’ అనే పదాన్ని ప్రాచుర్యంలోకి తేవడంలోని ప్రాముఖ్యతను వెంటనే అర్థం చేసు కున్నారు. కానీ ఒక కన్నడ అగ్ర కుల శూద్ర శెట్టికి ఆ నిర్ణయం తీసుకోవడం, పర్యవసానంగా సామాజిక ఒంటరితనాన్ని ఎదుర్కో వడం, ముఖ్యంగా తన జర్నలిస్టు సర్కిళ్లలో ఒక హింసాత్మక ప్రక్రియ అయి ఉండాలి!ఒక లాభదాయకమైన జర్నలిస్టు ఉద్యోగాన్ని విడిచిపెట్టి, ఆ శీర్షికతో ఆంగ్ల పత్రికను ప్రారంభించడం మండల్కు ముందటి పరిస్థితుల్లో ఊహించుకోండి. 2024 లోనే దళిత, ఓబీసీ, ఆదివాసీలకు చెందిన జర్నలిస్టులు ఎంత మంది ఉన్నారని రాహుల్ గాంధీ ఒక జాతీయ మీడియా సమావేశంలో ప్రశ్నించగా, అందులో ఎవరూ చేయి ఎత్తలేదు. అది కూడా ఒక ప్రధాన ప్రతిపక్ష రాజకీయ నేత, విదేశీ మీడియా సమక్షంలో... ఇదీ పరిస్థితి! దేశంలోని ప్రముఖ మీడియాలో ఉన్న ఆంగ్ల బ్రాహ్మణ జర్నలిస్టు కులతత్వపు వలయాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించిన ఒంటరి శూద్రుడు వీటీ రాజశేఖర్ అయివుండాలి! ప్రధాన స్రవంతి మీడియాలోని కులతత్వం కారణంగా ఆయన నిరాశతో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. తన ప్రత్యర్థులతో పోరాడేందుకు రాడికల్ దళిత్ జర్నల్ను ప్రారంభించానని నాకు చెప్పారు.ఆయన భారతదేశంలోని అగ్రవర్ణ జర్నలిజంతో ఎప్పుడూ రాజీ పడలేదు. దళిత్ వాయిస్ను ప్రారంభించిన తర్వాత ఆయన కథనాలు ఏ జాతీయ ఆంగ్ల వార్తాపత్రికలోనూ కనిపించలేదు. భారతీయ మీడియా గురించి చర్చ జరిగినప్పుడల్లా ఆయన దాని కులతత్వాన్ని దుయ్యబట్టేవారు. అగ్ర కులాల భారతీయ వార్తాపత్రికలన్నీ ‘టాయి లెట్ పేపర్లు’ అనేవారు. నేను జాతీయ వార్తాపత్రికలలో రాస్తున్నానని తెలుసుకున్నప్పుడు, ఆయన నాతో ‘మీ ఆలోచనలను అగ్రవర్ణాల వారికి అమ్మవద్దు, వారు మారరు’ అన్నారు. వాస్తవానికి నేను చిరునవ్వుతో దానిని అక్కడే వదిలేశాను. ఎందుకంటే ప్రధాన స్రవంతి మీడియాలో వీలైనంత ఎక్కువగా పాల్గొనాలనీ, రాయాలనీ నేను నమ్ముతాను. అలాంటి విభేదాలు ఉన్నప్పటికీ ఆయన చనిపోయే వరకు మా స్నేహం ఆప్యాయంగా కొనసాగింది.దళితులు–ఓబీసీల ఐక్యత కంటే దళితులు–ముస్లింల ఐక్యత గురించి ఆయన ఆలోచన మరింత స్థిరమైనది. దళితుల కంటే ఓబీసీలు ఆర్ఎస్ఎస్/బీజేపీతో కలిసి వెళ్తారని ఆయన అన్నారు. ఆయన ముస్లింగా మారకపోయినా, ఇస్లాం మతానికి బలమైన మద్దతుదారుగా నిలిచారు. తన పాకిస్తాన్ పర్యటనల కారణంగా కొంతకాలం పాటు ఆయన వీసా రద్దు చేయబడింది. ఆయన బలమైన జాత్యహంకార వ్యతిరేకి. యూదులకు వ్యతిరేకంగా పదే పదే వ్యాసాలు రాశారు.తన జీవితం చివరి రోజుల్లో ఆరోగ్య కారణాల వల్ల బెంగళూరు నుండి మంగళూరుకు మారిన తర్వాత ఆయన మౌనం మరింత పెరిగింది. అయినప్పటికీ, తన 80వ దశకం చివరి వరకూ ప్రయాణిస్తూనే ఉన్నారు. 2016లో హైదరాబాద్ సెంట్రల్ యూని వర్సిటీలో రోహిత్ వేముల వ్యవస్థీకృత హత్యకు వ్యతిరేకంగాజరిగిన నిరసన సభకు హాజరయ్యేందుకు వచ్చినప్పుడు నేను చివరిసారిగా ఆయనను కలిశాను. దురదృష్టవశాత్తు క్యాంపస్లోకి ప్రవేశించడానికి ఆయనను అనుమతించలేదు. అయినప్పటికీ గేటు వద్ద చాలాసేపు నిల్చొని నిరసన తెలిపారు. అది దళితుల పట్ల ఆయనకున్న నిబద్ధత.ఆయన ఎప్పుడూ ఖాదీ కుర్తా, పైజామా ధరించే వ్యక్తి. ఒక సాధారణ కన్నడ కాంగ్రెస్ రాజకీయ నాయకుడిలా కనిపిస్తారు. కానీ ఆయన నిజమైన మతం మారిన దళిత మేధావి.ఈ సంవత్సరం ప్రారంభంలో పాల్ దివాకర్ బృందం ‘దళిత్ వాయిస్’ను డిజిటలైజ్ చేశారు. ఆ వెబ్సైట్ ప్రారంభోత్సవానికిబెంగళూరు ఇండియన్ సోషల్ ఇన్ స్టిట్యూట్కు నన్ను ఆహ్వానించారు. దురదృష్టవశాత్తు నేను వెళ్ళలేకపోయాను. అయితే ఈ లెజెండరీ దళితుడు జీవించి ఉన్నప్పుడే అది జరిగింది.శూద్ర అగ్రవర్ణం నుండి దళితవాదంలోకి మారి, వారి విముక్తి కోసం తన జీవితాంతం పోరాడగలిగే మరో రాజశేఖర్ ఉద్భవిస్తాడని అనుకోలేము. ఆయన దళిత్ వాయిస్ పత్రిక ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఆఫ్రికాలో, అనేక ముస్లిం దేశాలలో ప్రసిద్ధి చెందింది.ప్రపంచంలోని అత్యంత అణగారిన ప్రజల విముక్తి కోసం బతికిన ఆయన ఇంత సుదీర్ఘ జీవితం తర్వాత ఈ భూమిని విడిచి పెట్టారు. కాబట్టి, మనం కూడా జీవించి ఉన్నంత కాలం వీటీ రాజ శేఖర్ జీవితాన్ని, ఆలోచనలను, రచనలను వేడుకగా జరుపుకోవాలి. గుడ్ బై వీటీఆర్.-వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త - ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ -
దేవుడిని రాజకీయాలకు వాడి చేయరాని తప్పు చేశాడు.. సిద్ధాంతం, నీతి లేని అవకాశవాది పవన్
-
మేము బ్లూ బుక్ ఓపెన్ చేస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి?
-
KSR Live Show: అచ్యుతాపురం ఘటనపై పవన్ కామెంట్స్.. చింతా రాజశేఖర్ కౌంటర్..
-
KSR Live Show: చంద్రబాబు, పవన్ నిద్రపోతున్నారా ?
-
తల్లికి వందనం ఎగనామం.. మీడియాపై దాడులు..
-
ఫ్యాన్స్కు టెన్షన్.. పొరపాటున కల్కి టికెట్స్ బుక్ చేసుకున్నారు!
ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఓవర్సీస్లో టికెట్ బుకింగ్స్ ప్రారంభం క్రేజీ రికార్డ్ సృష్టించింది. టికెట్స్ అమ్మకాల్లో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని అధిగమించింది. రిలీజ్ తేదీ దగ్గరపడుతుండడంతో ఇండియాలోనూ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది సేపటికే టికెట్స్ అమ్ముడుపోయాయి.అయితే హైదరాబాద్లో టికెట్స్ బుక్ చేసుకున్న వారికి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ప్రభాస్ కల్కి 2898 ఏడీకి బదులు.. రాజశేఖర్ నటించిన కల్కి మూవీ టికెట్స్ బుక్ అయినట్లు చూపించారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. టికెట్స్ బుక్ చేసుకోవాలన్న తొందరలో ఫ్యాన్స్ ఈ విషయాన్ని గమనించలేదు. టికెట్ లావాదేవి పూర్తయ్యాక చూస్తే కల్కి పోస్టర్ కనిపించడంతో అవాక్కయ్యారు. కాగా.. 2019లో ప్రశాంత్ వర్మ, రాజశేఖర్ కాంబోలో కల్కి సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.అయితే అలా టికెట్స్ బుక్ అయిన వారికి బుక్మై షో వివరణ ఇచ్చింది. ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదని తెలిపింది. కల్కి టికెట్ బుక్ చేసుకున్నప్పటికీ.. కల్కి 2898 ఏడీ టికెట్గానే భావించండి. సాంకేతిక లోపం వల్లే ఈ సమస్య వచ్చిందని వెల్లడించింది. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని పేర్కొంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. కల్కి 2898 ఏడీ ఈనెల 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, అమితాబ్, కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు.స్పందించిన రాజశేఖర్అయితే తన సినిమా కల్కి టికెట్స్ బుక్ కావడంపై హీరో రాజశేఖర్ స్పందించారు. ఈ విషయంలో తనకేలాంటి సంబంధం లేదని అన్నారు. ఈ సందర్భంగా కల్కి 2898 ఏడీ చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. Naaku assalu sammandham ledhu 😅🤣Jokes apart...Wishing dear #Prabhas @nagashwin7, Maa #AshwiniDutt garu @VyjayanthiFilms, The stellar cast and crew all the very very best!May you create history and take the film industry a step ahead #kalki2898ad https://t.co/P00OyIZFVE— Dr.Rajasekhar (@ActorRajasekhar) June 23, 2024 -
జగన్నాథుడి జైత్రయాత్ర తథ్యం..కూటమి కుట్రలు పారలేదు
-
అంతకుమించి ఇంకేం కావాలి: జీవిత రాజశేఖర్
జీవిత- రాజశేఖర్.. ఇద్దరూ సినిమా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈ దంపతుల కూతుర్లు శివాని, శివాత్మికలు పేరెంట్స్ అడుగుజాడల్లో నడుస్తూ తెలుగు చలనచిత్రపరిశ్రమలో క్లిక్కయ్యారు. ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీలో ఫైనలిస్టుగా నిలిచిన శివాని అద్భుతం మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. టూ స్టేట్స్, www, శేఖర్, జిలేబి, కోట బొమ్మాళి పీఎస్ సినిమాలతో అలరించింది. శివాత్మిక అక్క కంటే ముందే దొరసాని మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఇద్దరూ ఇండస్ట్రీలో రాణిస్తుండటంతో తల్లి హృదయం ఉప్పొంగిపోతోంది.సొంత నిర్ణయాలు..నేడు (మే 12న) మదర్స్ డే సందర్భంగా జీవిత రాజశేఖర్ కొన్ని ముచ్చట్లను మీడియాతో పంచుకుంది. నా పిల్లలిద్దరూ శక్తివంతమైన మహిళలుగా ఎదుగుతుంటే సంతోషంగా ఉంది. మొదట్లో నేను సూచనలు, సలహాలు ఇచ్చేదాన్ని. తర్వాత వారే సొంత నిర్ణయాలతో తమ జీవితాన్ని దిశానిర్దేశం చేసుకుంటున్నారు. ఎంత ఎదిగినా వారికేదైనా అవసరమైతే సాయం చేసేందుకు నేను ఎప్పటికీ ముందుంటాను.పిల్లలపైనే ఆధారపడుతున్నాం..ఇప్పుడు పిల్లలే నాకు చాలా విషయాల్లో సాయపడుతున్నారు. ఇన్స్టాగ్రామ్ వంటి లేటెస్ట్ టెక్నాలజీల గురించి వాళ్లే నాకు అన్నీ నేర్పిస్తారు. ఏదైనా డౌట్ వచ్చినా ఎంతో ఓపికగా అలా కాదమ్మా.. అంటూ అర్థమయ్యేలా వివరిస్తారు. ఇలాంటి విషయాల్లో రాజశేఖర్- నేను పిల్లలపైనే ఆధారపడతాము.తల్లిగా ఆరా తీస్తాఎప్పుడైనా వాళ్లు కోపంగా, చిరాకుగా ప్రవర్తించినా ఒక తల్లిగా అసలేమైందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. వారు ఎలాంటి చికాకులు లేకుండా ఆనందంగా ఉండాలనే చూస్తాను. పిల్లల సంతోషమే నాక్కావాల్సింది.. అంతకు మించి ఏమీ వద్దు అని చెప్పుకొచ్చింది.చదవండి: నీలి రంగు చీరలో టిల్లు స్క్వేర్ బ్యూటీ.. సారీ ధరెంతో తెలుసా? -
జాతీయ ఛానెల్ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ నిజ స్వరూపం బట్టబయలు
-
చంద్రబాబు చీప్ పాలిటిక్స్ పై చింతా రాజశేఖర్ విశ్లేషణ
-
స్నేహానికి హద్దు లేదురా!
‘‘ఏ దర్శకుడికైనా ఫస్ట్ మూవీ బర్త్ లాంటింది. నా తొలి చిత్రం ‘డాన్ శ్రీను’ ని ఇప్పటికీ మర్చిపోలేను. మనమేంటో ఇండస్ట్రీకి తెలియజేసేదే తొలి సినిమా. ‘హద్దు లేదురా’ చిత్రం ట్రైలర్ చూస్తుంటే రాజశేఖర్ తొలిసారి దర్శకత్వం వహించినట్లు అనిపించడం లేదు. ఈ మూవీ మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని డైరెక్టర్ గోపీచంద్ మలినేని అన్నారు. ఆశిష్ గాంధీ, అశోక్ హీరోలుగా, వర్ష, హ్రితిక హీరోయిన్లుగా, ఎస్తేర్ అతిథి పాత్రలో నటించిన చిత్రం ‘హద్దు లేదురా’. రాజశేఖర్ రావి దర్శకత్వంలో వీరేష్ గాజుల బళ్లారి నిర్మించారు. రావి మోహన్రావు సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ ఈ నెల 21న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి గోపీచంద్ మలినేని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘‘స్నేహం నేపథ్యంలో రూపొందిన చిత్రమిది’’ అన్నారు రాజశేఖర్ రావి. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులు మా యూనిట్ని ప్రోత్సహించాలి’’ అన్నారు వీరేష్ గాజుల బళ్లారి. నటీనటులు ఆశిష్ గాంధీ, తనికెళ్ల భరణి, రాధా మనోహర్ దాస్, ఎస్తేర్ మాట్లాడారు. -
గీతాంజలినే టార్గెట్ చేసి మరీ...?
-
చంద్రబాబుకు పెంపుడు కుక్క పవన్ కళ్యాణ్: చింతా రాజశేఖర్
-
అదే కనుక జరిగితే జనసైనికులు పవన్ కళ్యాణ్ ని ఈడ్చి తన్నుతారు..
-
షర్మిల చదువుతున్నది ఎవరి స్క్రిప్ట్..టీడీపీ, జనసేన మధ్య ఏం జరుగుతుంది ?
-
హీరో రాజశేఖర్ అరుదైన (ఫొటోలు)
-
ఆ డైలాగ్ ఎలా రాశారో తెలియదు..నా మాటే జీవిత వింటుంది: రాజశేఖర్
టాలీవుడ్ బెస్ట్ కపుల్ లిస్ట్లో మొదటి వరుసలో ఉంటారు జీవిత, రాజశేఖర్. ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటూ.. అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే ఇంట్లో ఎక్కువగా జీవిత డామినేషనే ఉంటుందని టాలీవుడ్ టాక్. జీవిత ఎలా చెబితే అలా రాజశేఖర్ చేస్తారని, అందుకే వారి మధ్య గొడవలు జరగవని అంటుంటారు. ఇదే విషయాన్ని ఎక్ట్రా ఆర్డనరీ మ్యాన్ సినిమాలో ఒక్క డైలాగ్తో చెప్పించాడు దర్శకుడు వక్కంతం వంశీ. నితిన్, శ్రీలీల జంటగా నటించిన ఈ చిత్రంలో రాజశేఖర్ ఓ కీలక పాత్ర పోషించాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్లో ‘నాకు జీవిత, జీవితం రెండూ ఒక్కటే’ అని రాజశేఖర్ చెప్పే డైలాగ్ బాగా వైరల్ అయింది. (చదవండి: రేవంత్ రెడ్డి ఫోటో షేర్ చేస్తే ఇంతలా వేధిస్తారా..నన్ను వదిలేయండి: సుప్రిత) తాజాగా జరిగిన ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్లో రాజశేఖర్ ఈ డైలాగ్ గురించి మాట్లాడుతూ..‘ జీవిత, జీవితం రెండూ ఒకటే అనే డైలాగ్ వక్కంతం వంశీ గారు ఎలా రాశారో తెలియదు కానీ.. బాగా సక్సెస్ అయింది. ‘జీవిత కూర్చో అంటే కూర్చుంట..లే అంటే లేస్తాను’ అనే ఉద్దేశంతో వంశీ ఈ డైలాగ్ రాసినట్లు ఉన్నాడు. వాస్తవానికి నేను చెప్పిందే జీవిత వింటుంది. చాలా మంచిది. ఒక్క మాట కూడా తిరిగి అనదు. కానీ అందరూ జీవిత చెప్తే నేను ఆడతాను అని అనుకుంటున్నారు. జీవిత చెప్పింది కూడా నేను వింటాను. ఎందుకంటే ఆమె చెప్పేది నా మంచి కోసమే’ అని రాజశేఖర్ చెప్పుకొచ్చాడు. ఇక జీవిత మాట్లాడుతూ.. ‘భార్యభర్తలు అంటూ ఒకరి మాట ఒకరు వినాలి.. ఒకరి గురించి ఇంకొకరు బతకాలి.. అలాంటి మైండ్ సెట్ ఉంటేనే పెళ్లి చేసుకోవాలి. మేం ఇద్దరం ఒకరికొకరం బతుకుతాం. నాకు నా భర్త.. ఇద్దరు కూతుళ్లు..వీళ్లే ప్రపంచం. వీళ్ల కోసం ఎవరినైనా ఎదిరిస్తాను. మంచి పాత్ర దొరికితే రాజశేఖర్ విలన్గా అయినా, ఓ స్పెషల్ అప్పియరెన్స్ అయినా చేస్తారు’ అన్నారు. -
పవన్ కళ్యాణ్ గంగిరెద్దు రెండు ఒక్కటే
-
ఓట్లు కావాలి కానీ..పార్టీ బలపడకూడదు..అందుకేనా..?
-
నితిన్ సినిమాను నాన్న ఎందుకు ఒప్పుకున్నారంటే: శివాని రాజశేఖర్
తెలుగులో యాంగ్రీ యంగ్మేన్ అనగానే గుర్తొచ్చేది రాజశేఖర్ పేరే. వెండితెరపై ఆవేశంతో కూడిన పాత్రల్లో కనిపిస్తూ... టాప్ హీరోగా దశాబ్దాలపాటు ప్రేక్షకుల్ని అలరించి ఎనలేనీ కీర్తి సంపాధించుకున్నారు. ఇండస్ట్రీలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలెన్నో ఆయన చేశారు. తాజాగా ఆయన నితిన్ సినిమాలో నెగటివ్ రోల్ చేస్తున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘ఎక్స్ట్రా’లో రాజశేఖర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా "కోటబొమ్మాళి పీఎస్" సినిమా ప్రమోషన్స్లో రాజశేఖర్ ఈ సినిమా ఎందుకు ఓకే చేశారో ఆయన కూతురు శివాని చెప్పింది. 'నాన్నగారికి చాలా రోజుల నుంచి విలన్గా చేయాలని కోరిక ఉంది. అందులో భాగంగ కొన్ని కథలు విన్నాడు. కొన్ని నచ్చలేదని పక్కన పెట్టేశాడు. ఇప్పటికే ఇండస్ట్రీలో విజయ్ సేతుపతి, అరవింద స్వామి వంటి టాప్ హీరోలు అలాంటి పాత్రలు చేసి మెప్పించారు. అలా నాన్నగారికి కూడా విలక్షణ పాత్రలు చేయాలని ఉంది. కానీ ఇప్పటి వరకు బెటర్ స్టోరీ రాలేదు. నితిన్ సినిమాలోని రాజశేఖర పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాలో ఆయన పాత్ర ఎంతగానో నచ్చింది.. అందుకే ఆయన వెంటనే ఓకే చెప్పేశారు. నాకు తెలిసినంత వరకు ఆ పాత్ర థియేటర్లో అదిరిపోతుంది.' అని శివాని తెలిపింది. 'కోటబొమ్మాళి పీఎస్' మూవీ గురించి శివాని మాట్లాడుతూ.. 'ఆర్టికల్ 15' తమిళ్ రీమేక్లో నా నటన చూసి తేజ నాకు ఈ కథ చెప్పారు. అందులో ట్రైబల్ అమ్మాయిగా నటించా. ఇందులో అలాంటి పాత్రనే కావడంతో నన్ను సంప్రదించారు. ఇది నాయట్టు చిత్రానికి రీమేక్ అయినా తెలుగు ప్రేక్షకుల కోసం ఎన్నో మార్పులు చేశారు. ఈ సినిమా కోసం శ్రీకాకుళం స్లాంగ్ కూడా నేర్చుకున్నా. విలేజ్లో కనిపించే లేడీ పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటించా. మా ఫ్యామిలీలో తాతగారు పోలీస్ కావడం.. నాన్న చాలా చిత్రాల్లో పోలీస్ ఆఫీసర్గా నటించడంతో వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. నా గెటప్ కోసం నాన్న కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. ' అని అన్నారు. ఈ చిత్రం నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
"పవర్" లేని పవర్ స్టార్...
-
గ్రామీణ రహదారులకూ మహర్దశ
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉండే (హై ఇంపాక్ట్) మరో 202 రోడ్లను రూ.784.22 కోట్లతో పూర్తిస్థాయిలో మరమ్మతులతోపాటు పునర్నిర్మాణం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 26 జిల్లాల్లో 1,035 కిలోమీటర్ల మేర ఈ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. రాష్ట్రంలో 258 రోడ్లు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం పరిధిలో ఉండగా.. వాటిలో 56 రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం గతంలోనే అనుమతులు ఇవ్వగా.. పనులు పురోగతిలో ఉన్నాయి. మిగిలిన 202 రోడ్ల పునర్నిర్మాణ పనుల కోసం పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. టెండర్ల ప్రక్రియ షురూ! ఈ పనులకు సంబంధించి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ మొదలైంది. ఈ నెల 6వ తేదీ నుంచి ఆన్లైన్ విధానంలో కాంట్రాక్టర్లు బిడ్లు దాఖలు ప్రక్రియను మొదలు పెట్టినట్టు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఈఎన్సీ బాలు నాయక్ తెలిపారు. 14 రోజుల పాటు టెండర్ల దాఖలుకు గడువు ఉంటుందని.. నవంబర్ నెలాఖరు నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి డిసెంబర్ మొదటి వారంలోనే ఆయా రోడ్ల పనులను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన చెప్పారు. కాగా.. ఆర్ అండ్ బీ శాఖ పరిధిలో గుర్తించిన హై ఇంపాక్ట్ కేటగిరీ రోడ్లకు ప్రభుత్వం ఆ శాఖ ఆధ్వర్యంలో అనుమతులు మంజూరు చేసింది. ఆ పనులు కూడ మొదలైనట్టు అధికారులు వెల్లడించారు. -
ఎవరు ఈ రుక్మిణి కోట ?..పవన్ కళ్యాణ్ కి రుక్మిణి కోటకు ఉన్న సంబంధం అదే..
-
ఏఎన్యూలో కొత్త కోర్సులు ప్రారంభం
ఏఎన్యూ: విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కొత్త కోర్సులను వీసీ ఆచార్య పి.రాజశేఖర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ కొత్తగా ప్రారంభించిన కోర్సుల్లో ఎంబీఏ టెక్నాలజీ మేనేజ్మెంట్, ఎంబీఏ మీడియా మేనేజ్మెంట్, ఎంఎస్సీ డేటా సైన్స్, ఎంఎస్సీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఎంఏ అప్లైడ్ లింగ్విస్టిక్స్ అండ్ ట్రాన్స్లేషన్ స్టడీస్ కోర్సులు ఉన్నాయని చెప్పారు. మారుతున్న పరిస్థితులు, సాంకేతిక పరిజ్ఞానం, విద్యా ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని విద్యార్థులకు నూతన కోర్సులు అందుబాటులోకి తెచ్చామన్నారు. విద్యార్థులు కోర్సు పూర్తి చేసిన వెంటనే ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. నూతన కోర్సులలో ఫ్యాకల్టీ నియామకం, మౌలిక సదుపాయాలు కల్పనకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. డిగ్రీ ఫలితాలు విడుదల ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన డిగ్రీ కోర్సుల నాల్గవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను సోమవారం వీసీ ఆచార్య రాజశేఖర్ విడుదల చేశారు. యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారా ఫలితాలు పొందవచ్చు.డిగ్రీ నాల్గవ సెమిస్టర్ ఫలితాల్లో 61శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఏసీఈ ఆర్.ప్రకాష్రావు తెలిపారు. రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 24 ఆఖరు తేదీగా నిర్ణయించామన్నారు. ఫీజు ఒక్కో పేపర్కు రూ.1,240 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. -
కళ్లు మూసుకొని... కళ్లు చెదిరే విజయం
ఎన్నో అద్భుత విజయాలు సాధించిన విజేతల అద్భుత విజయాలను డాక్యుమెంటరీలలో చూసిన తరువాత తాను కూడా ఏదైనా సాధించాలనుకుంది మలేసియాకు చెందిన పది సంవత్సరాల పునీత మలర్ రాజశేఖర్. ఈ చిన్నారికి చెస్ అంటే ఇష్టం. తాజాగా... కళ్లకు గంతలు కట్టుకొని కేవలం 45.72 సెకన్లలో చెస్బోర్డ్పై అత్యంత వేగంగా 32 పావులను సెట్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది. తండ్రి సహకారంతో నాలుగు నెలల పాటు కష్టపడి ఈ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. -
రాయలసీమ నేపథ్యంలో సినిమా..అక్టోబరు 6న విడుదల
రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంటగా రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సగిలేటి కథ’. హీరో నవదీప్ సి–స్పేస్ సమర్పణలో దేవీ ప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి నిర్మించారు. ఈ సినిమాను అక్టోబరు 6న విడుదల చేస్తున్నట్లు యూనిట్ వెల్లడించింది. ‘‘రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం, కెమెరా, ఎడిటింగ్: రాజశేఖర్ సుద్మూన్, సంగీతం: జశ్వంత్ పసుపులేటి, నేపథ్య సంగీతం: సనల్ వాసుదేవ్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: నరేష్ మాదినేని, లైన్ ప్రోడ్యూసర్: చందు కొత్తగుండ్ల. -
టీడీపీ భవిష్యత్తుపై చింతా రాజశేఖర్ విశ్లేషణ
-
చంద్రబాబు ఐటీ కేసు ఇష్యూపై చింతా రాజశేఖర్..!
-
బ్రో సినిమా పై చింతా రాజశేఖర్ కామెంట్స్
-
సీఐ సార్ చొరవ.. కేంద్రం మెచ్చిన చంద్రగిరి ఠాణా
నాడు: చుట్టూ ముళ్లపొదలు.. ఏ మూల చూసినా పాముల పుట్టలు.. దశాబ్దాలుగా గుట్టలుగా పడి శిథిలావస్థకు చేరుకున్న వాహనాలు.. అస్తవ్యస్త పార్కింగ్.. కళావిహీనంగా చెట్లు.. సరైన బోర్డు కూడా లేని పోలీస్ స్టేషన్...రంగులు వెలిసి పాత భవనాలను తలపించే దుర్గంధంతో సిబ్బంది ఇబ్బందిగా పనిచేసేవారు. అస్తవ్యస్తంగా ఉండేది తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్. నేడు : ఒక అధికారి బదిలీపై అక్కడికి వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కేవలం 20 రోజుల్లోనే స్టేషన్ రూపురేఖలు మార్చారు. భవనాలకు అందమైన రంగులు వేయించా డు. ప్రాంగణంలో పిచ్చి మొక్కలను తీయించాడు. చెట్లను ట్రిమ్మింగ్ చేయించారు. వాహనాలను స్టేషన్ వెనుక పార్కింగ్ చే యించారు. స్టేషన్కు వచ్చేవారు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండేలా చిన్నసైజు పార్క్ను తీర్చిదిద్దారు. స్టేషన్లో రికార్డు రూమును డిటలైజ్ చేసి అందమైన ర్యాక్లతో వాటిని ముస్తాబు చేశారు. సిబ్బందికి విశ్రాంతి గదినీ ఏర్పాటు చేశారు. తిరుపతి రూరల్: చంద్రగిరి పీఎస్లో నూతనంగా సీఐగా బాధ్యతలు స్వీకరించిన రాజశేఖర్ స్టేషన్ రూపురేఖలను మార్చేశారు. ఇది చూసి చంద్రగిరి డీఎస్పీ యశ్వంత్, తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి ఆయన్ను అభినందించారు. రాష్ట్ర డీజీపీ ద్వారా సమాచారం అందుకున్న ఢిల్లీకి చెందిన బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(బీపీఆర్డీ) బృందం ఇటీవల చంద్రగిరి పోలీస్స్టేషన్ను సందర్శించింది. స్టేషన్ ప్రాంగణం, వివిధ సమస్యలపై వచ్చే అర్జీదారులకు అందిస్తున్న సేవలు, రికార్డుల మెయింటెనెన్స్ వంటి అంశాలను పరిశీలించింది. ఇతర స్టేషన్లతో పోల్చితే ఇక్కడ ఏర్పాట్లు, పరిసరాల శుభ్రత, రికార్డుల నిర్వహణ భేషుగ్గా ఉన్నాయని బీపీఆర్డీ బృందం పర్యవేక్షణాధికారి బాలచంద్రన్ చంద్రగిరి సీఐ రాజశేఖర్ను అభినందించారు. త్వరలో బీపీఆర్డీ జాతీయస్థాయిలో పోలీస్ స్టేషన్లకు ర్యాంకులు కేటాయించనున్నారు. అయితే అద్భుతంగా తీర్చిదిద్దిన చంద్రగిరి పోలీస్ స్టేషన్కు అత్యత్తుమ ర్యాంకు వచ్చే అవకాశం ఉందని తిరుపతి జిల్లా పోలీస్ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మనసు పెడితే స్టేషన్లను అద్భుతంగా తీర్చిదిద్దవచ్చని నిరూపించిన సీఐ రాజశేఖర్ను పలువురు పోలీస్ అధికారులు అభినందిస్తున్నారు. -
నిఖిల్ని చూసి గర్వపడుతున్నా
‘‘స్పై థ్రిల్లర్ సినిమాలు తీయడం అంత సులభం కాదు.. అది ఒక సవాల్. ఎందుకంటే ఇలాంటి హాలీవుడ్ సినిమాలను ఓటీటీల్లో చూసేస్తున్నారు. కానీ, ‘స్పై’ టీజర్, ట్రైలర్ చూశాక చాలా బాగా అనిపించింది. అంతర్జాతీయ స్థాయి విలువలకు ఏ మాత్రం తగ్గలేదు. రాజశేఖర్, చరణ్ తేజ్ల ప్యాషన్ ఏంటో తెలుస్తోంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలి’’ అని హీరో నాగచైతన్య అన్నారు. నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్యామీనన్ జంటగా గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పై’. ఈడీ ఎంటర్టైన్ మెంట్స్పై కె.రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా రేపు(గురువారం) విడుదలకానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘నిఖిల్ అంటే నాకు చాలా ఇష్టం. ‘హ్యాపీడేస్’ తో కెరీర్ మొదలుపెట్టి, ‘స్వామిరారా, కార్తికేయ’ తో ఓ ట్రెండ్ సెట్ చేసి, ‘కార్తికేయ 2’ తో బాక్సాఫీస్ని షేక్ చేశాడు.. తనని చూసి నేను చాలా గర్వపడుతున్నాను. ‘కార్తికేయ 2’ తో ఒక ట్రెండ్ ఎలా సెట్ చేశాడో.. ‘స్పై’ చిత్రంతో ఆ ట్రెండ్ దాటి తర్వాతి స్థాయికి వెళతాడనే నమ్మకం ఉంది’’ అన్నారు. నిఖిల్ సిద్ధార్థ్ మాట్లాడుతూ–‘‘సుభాష్ చంద్రబోస్ వంటి ఒక గొప్ప వ్యక్తి గురించి ఉన్న సినిమా ‘స్పై’. నాలుగురోజుల కిందట ఈ మూవీ ఫైనల్ కాపీ చూశాక ‘థ్యాంక్యూ గ్యారీ’ అన్నాను.. అంత బాగా ఈ మూవీ తీశాడు. ఇలాంటి సినిమా చేసినందుకు యూనిట్ అంతా గర్వపడుతున్నాం. ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా ఇది’’ అన్నారు. ‘‘ఒక్క ఫోన్ కాల్తో ‘స్పై’ ప్రీ రిలీజ్ వేడుకకి వచ్చిన నాగచైతన్యగారికి థ్యాంక్స్’’ అన్నారు కె.రాజశేఖర్ రెడ్డి. గ్యారీ బీహెచ్ మాట్లాడుతూ–‘‘డాక్టర్ అయిన నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్తానంటే ఎవరూ ఒప్పుకోరు. కానీ, నా తల్లితండ్రులు ఒప్పుకుని, నన్నుప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు. ‘స్పై’ చాలా బాగా తీశావంటూ నిఖిల్గారు నన్ను హత్తుకోవడంతో సినిమా విజయంపై మరింత నమ్మకం పెరిగింది’’ అన్నారు. ఈ వేడుకలో ఈడీ ఎంటర్టైన్ మెంట్స్ సీఈఓ చరణ్ తేజ్, సంగీత దర్శకుడుశ్రీచరణ్ పాకాల, కెమెరామేన్ వంశీ పచ్చిపులుసు, యూవీ క్రియేషన్స్ నిర్మాత వంశీ, నటీనటులు సాన్య ఠాకూర్, ఆర్యన్ రాజేష్ పాల్గొన్నారు. -
పాస్వర్డ్ గుట్టు వీడలేదు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో (టీఎస్పీఎస్సీ) చోటుచేసుకున్న ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ అధికారులు శుక్రవారం తొలి చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో అరెస్టులు మొదలై 90 రోజులు కావస్తుండటంతో నాంపల్లి న్యాయస్థానంలో సప్లిమెంటరీ చార్జ్షీట్ వేశారు. ఇందులో 37 మందిపై అభియోగాలు మోపారు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా మిగిలిన వారిపై అదనపు చార్జిషీట్లు దాఖలు చేయనున్నారు. యూజర్ ఐడీ, పాస్వర్డ్ చేతికి చిక్కిందెలా? కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో ఉన్న కంప్యూటర్ నుంచి మాస్టర్ ప్రశ్నపత్రాలను కమిషన్ మాజీ ఉద్యోగి పులిదిండి ప్రవీణ్ కుమార్, మాజీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అట్ల రాజశేఖర్ పెన్డ్రైవ్లోకి కాపీ చేసుకోవడం ద్వారా చేజిక్కించుకున్నట్లు సిట్ నిర్ధారించింది. అయితే ఆ కంప్యూటర్లోకి చొరబడటానికి వాడిన యూజర్ ఐడీ, పాస్వర్డ్ వారి చేతికి ఎలా చిక్కిందనే అంశంపై మాత్రం ఇప్పటికీ స్పష్టత రాలేదు. నిందితులు పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇన్చార్జ్గా ఉన్న శంకరలక్ష్మి యూజర్ ఐడీ, పాస్వర్డ్స్ను తన పుస్తకంలో రాసి పెట్టుకున్నారు. వాటిని ప్రవీణ్ నోట్ చేసుకొని రాజశేఖర్కు తెలిపాడని దర్యాప్తు అధికారులు చెప్పారు. ఆపై కంప్యూటర్ను నిందితులు హ్యాక్ చేశారనే ఆరోపణలు వచ్చినా దానికీ ఆధారాలు లభించలేదు. 50 మంది నిందితుల్లో చిక్కిన 49 మంది... బేగంబజార్ పోలీసుస్టేషన్లో నమోదైన ఈ కేసు దర్యాప్తు నిమిత్తం సిట్కు బదిలీ అయింది. అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ పర్యవేక్షణలో ఏసీపీ పి.వెంకటేశ్వర్లు దర్యాప్తు చేపట్టిన ఈ కేసులో ఇప్పటివరకు 50 మందిని నిందితులుగా తేల్చి 49 మందిని అరెస్టు చేశామని సిట్ అధికారులు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. న్యూజిల్యాండ్లో ఉన్న నిందితుడిని పట్టుకోవాల్సి ఉందన్నారు. 50 మందిలో 16 మంది పేపర్ల విక్రయంలో మధ్యవర్తులుగా వ్యవహరించిన వాళ్లే. అక్రమంగా ఏఈఈ ప్రశ్నపత్రం పొంది పరీక్ష రాసిన వాళ్లు ఏడుగురు, ఏఈ ప్రశ్నపత్రం పొంది రాసిన వాళ్లు 13 మంది, డీఏఓ పేపర్ పొంది పరీక్ష రాసిన వాళ్లు ఎనిమిది మంది ఉన్నారు. అరెస్టు అయిన నిందితుల్లో ప్రవీణ్ కుమార్, రాజశేఖర్లతోపాటు షమీమ్, రమేష్ కుమార్లు కమిషన్ ఉద్యోగులు. వారిలో రాజశేఖర్ మినహా మిగిలిన ముగ్గురూ గ్రూప్–1 పరీక్ష రాశారు. టీఎస్పీఎస్సీగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసి మానేసిన సురేష్ సైతం గ్రూప్–1 పేపర్ పొంది పరీక్ష రాశాడు. ఇరిగేషన్ శాఖ మాజీ ఏఈ పూల రమేష్ సహకారంతో ఏఈఈ పరీక్షల్లో హైటెక్ మాస్ కాపీయింగ్కు పాల్పడిన ముగ్గురినీ సిట్ అరెస్టు చేసింది. ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన వివరాలను బట్టి ప్రశ్నపత్రాల క్రయవిక్రయాల్లో రూ.1.63 కోట్లు చేతులు మారినట్లు తేలింది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న పెన్డ్రైవ్స్, ల్యాప్టాప్స్, హార్డ్డిసు్కలతోపాటు ఫోన్లను విశ్లేషణ నిమిత్తం సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపారు. ఈ వివరాలన్నీ క్రోడీకరించి న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకున్నాక నాంపల్లి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసినట్లు అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. మరోవైపు లీకేజీ కేసులో అరెస్టు అయిన మాజీ ఏఈ పూల రమేష్ ఆరు రోజుల పోలీసు కస్టడీ శుక్రవారంతో ముగిసింది. దీంతో ఇతడికి వైద్య పరీక్షల అనంతరం పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం చంచల్గూడ జైలుకు తరలించారు. -
ఆపద్బాంధవి 108
చౌడేపల్లె: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైద్య స్వరూపమే మారిపోయింది. పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేసింది. ఇందులో భాగంగానే 108 వ్యవస్థను మరింతగా బలోపేతం చేసింది. ఫోన్ వస్తే చాలు నిమిషాల్లో ఘటనా స్థలానికి సిబ్బంది చేరిపోతున్నారు. రోగులకు కావాల్సిన సహాయం అందించి మన్ననలు అందుకుంటున్నారు. ఇలాంటిదే చిత్తూరు జిల్లాలో జరిగింది. చౌడేపల్లె మండలం, పందిళ్లపల్లె పంచాయతీ, ముదిరెడ్డిపల్లెకు చెందిన రాజశేఖర్, వసంత దంపతులు సోమల మండలం, పెద్ద ఉప్పరపల్లె సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న మామిడితోటలో కాపలా ఉన్నారు. ఇక్కడకు ఎలాంటి దారి వసతి లేదు. సెల్ఫోన్ సిగ్నల్ కూడా అందదు. వసంత నిండు గర్భిణి కావడంతో ఆదివారం ఉదయం పురిటినొప్పులు వచ్చాయి. రాజశేఖర్ సెల్ సిగ్నల్ ఉన్న ప్రాంతానికి వచ్చి 108కు ఫోన్ చేశారు. సమాచారం అందుకొన్న 108 సిబ్బంది గణేష్, ప్రసాద్ అతికష్టం మీద మామిడి తోటకు చేరారు. అక్కడి నుంచి రోడ్డు మార్గానికి కిలోమీటరు దూరం ఉండటంతో స్ట్రెచర్పైనే గర్భిణిని మోసుకువచ్చారు. మార్గమధ్యంలో పురిటి నొప్పులు అధికమవడంతో మామిడితోటలోనే సుఖ ప్రసవం చేశారు. వసంత మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డను అటవీ ప్రాంతం నుంచి చౌడేపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సిబ్బంది సేవలను గ్రామస్తులు, అధికారులు అభినందించారు. -
కేజ్రీవాల్ బంగ్లా దర్యాప్తు అధికారికి ఉద్వాసన
న్యూఢిల్లీ: ఢిల్లీలో పాలనాధికారం రాష్ట్ర సర్కార్కే ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చిన నేపథ్యంలో ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం కేజ్రీవాల్ అధికార బంగ్లా ఆధునీకరణకు రూ.45 కోట్లు వెచ్చించారన్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న విజిలెన్స్ అధికారి, సీనియర్ ఐఏఎస్ రాజశేఖర్ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దర్యాప్తును విజిలెన్స్ విభాగంలోని ఇతర అసిస్టెంట్ డైరెక్టర్లు పంచుకోవాలని, నివేదికలను నేరుగా విజిలెన్స్ సెక్రటరీకి సమర్పించాలని ఆదేశించింది. దర్యాప్తు మాటున రాజశేఖర్ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు విజిలెన్స్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ చెప్పారు. -
జీవిత.. పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు, నాతోనే ఉంటానంది: రాజశేఖర్
జీవిత అంటే రాజశేఖర్.. రాజశేఖర్ అంటే జీవిత.. వీరిద్దరినీ వేర్వేరుగా చూడలేం. అంతలా ముడిపడిపోయిన ఈ జంట టాలీవుడ్ బెస్ట్ కపుల్లో ఒకటి అనడంలో అతిశయోక్తి లేదు. వీరి ప్రేమకథ సినిమాకు ఏమాత్రం తీసిపోదు. సినిమాలోలాగే వీరి ప్రేమకథలో కూడా అనేక ట్విస్టులున్నాయి. అసలు పరిచయమే ఒక వింత అనుభవంతో జరిగింది. రాజశేఖర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలో జీవితతో ఓ సినిమా చేయాల్సింది. అయితే హీరోయిన్ బాలేదు, మార్చేయండి అని చెప్పాడట. కట్ చేస్తే నిర్మాతలు రాజశేఖర్ స్థానంలో మరో హీరోను పెట్టి సినిమా చేశారు. అలా విచిత్ర సంఘటనతో మొదలైన వీరి పరిచయం తర్వాత ప్రేమగా మారడంతో 1991లో పెళ్లి చేసుకున్నారు. వీరి కూతుర్లు శివానీ, శివాత్మిక ఇద్దరూ సినీరంగంలో ప్రవేశించి ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నారు. తాజాగా ఓ షోలో పాల్గొన్న వీరిద్దరూ తమ లవ్స్టోరీని వెల్లడించారు. ఒకసారి రాజశేఖర్ నా వద్దకు వచ్చి మీరు నాపై ఆసక్తి చూపిస్తున్నారని అనిపిస్తోంది అని నేరుగా అడిగేశాడు. ఆయనలో ఆ ఫ్రాంక్నెస్ బాగా నచ్చిందని చెప్పింది జీవిత. అయితే రాజశేఖర్ను ఒప్పించేందుకు, ఆయనను పెళ్లి చేసుకునేందుకు చాలా కష్టపడిందట. ఈ విషయం తెలిసిన రాఘవేంద్రరావు.. రాజశేఖర్ విలన్లా ఉన్నాడు, నమ్మకు అని జీవితకు సలహా ఇచ్చాడని తెలిపాడు రాజశేఖర్. ఇంకా ఆయన మాట్లాడుతూ.. అయినా సరే పట్టువీడని జీవిత నన్ను బ్రిడ్జిపై నుంచి తోసేసి, ఆస్పత్రిలో చేర్పించి సేవలు చేసి మా అమ్మానాన్నలతో ఓకే చెప్పించింది అని తెలిపాడు. ఈ క్రమంలో జీవిత ఓ సంఘటన గుర్తు చేసుకుని ఎమోషనలైంది. 'రాజశేఖర్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు చాలా ఫీలయ్యాను. ఆయనకు అప్పుడు అంబాసిడర్ కారు ఉండేది. ముందు సీట్లో ఆయన పక్కనే ఆ అమ్మాయి కూర్చుంది. నేనేమో వెనకాల కూర్చున్నాను. చాలా బాధేసింది, ఏడ్చేశాను' అని చెప్తూ ఎమోషనలైంది. పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు, కానీ నాతోనే ఉంటానని తెగేసి చెప్పింది, ఆ ప్రేమే నచ్చిందన్నాడు రాజశేఖర్. -
‘టీఎస్పీఎస్సీ కేసు’లో సాక్షిగా శంకరలక్ష్మి
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ కేసులో కాన్ఫిడెన్షియల్ సెక్షన్ కస్టోడియన్ బి.శంకరలక్ష్మి కీలక సాక్షిగా మారారు. తొలుత అరెస్టు చేసిన తొమ్మిది మందిలో ప్రవీణ్, రాజశేఖర్, రేణుక, డాక్యాల అదనపు కస్టడీతోపాటు తాజాగా అరెస్టు చేసిన షమీమ్, సురేశ్,రమేశ్లను తమ కస్టడీకి అప్పగించాలంటూ సిట్ అధికారులు శుక్రవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. టీఎస్పీఎస్సీ కార్యదర్శికి వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరించిన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పులిదిండి ప్రవీణ్ కుమార్, రాజశేఖర్రెడ్డి ఐదు పరీక్షలకు సంబంధించిన 11 ప్రశ్నపత్రాలను కాన్ఫిడెన్షియల్ సెక్షన్ కస్టోడియన్ అయిన శంకరలక్ష్మి కంప్యూటర్ నుంచే తస్కరించారు. ఈ వ్యవహరంలో ఆమె నిర్లక్ష్యం ఉందని అధికారులు ఇప్పటికే తేల్చడంతో చర్యలు కూడా తీసుకుంటారని ప్రచారం జరిగింది. అయితే ఆమెను ఈ కేసులో రెండో సాక్షిగా పరిగణిస్తున్నట్లు కోర్టు దృష్టికి సిట్ తీసుకువెళ్లింది. నిందితులను శుక్రవారం కోర్టులో హాజరుపరుస్తూ దాఖలు చేసిన రిమాండ్ కేస్ డైరీలో ఈ విషయాలు పొందుపరిచింది. ఈ కేసులో వివరాలు సేకరించి దర్యాప్తు పూర్తి చేయడంతోపాటు అభియోగపత్రాలు దాఖలు చేయడానికి నిందితుల కస్టడీ అవసరమని పేర్కొంది. రాజశేఖర్ బంధువుకు నోటీసులు! న్యూజిలాండ్లో నివసిస్తూ గతేడాది గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష రాసేందుకు హైదరాబాద్ వచ్చి వెళ్లిన కమిషన్ నెట్వర్క్ అడ్మిన్ రాజశేఖర్రెడ్డి సమీప బంధువు ప్రశాంత్ను ప్రశ్నించాలని సిట్ అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం అతనికి వాట్సాప్ ద్వారా నోటీసులు పంపిస్తున్నారు. అత డు విచారణకు రాకుంటే లుక్ఔట్ సర్క్యులర్ జారీ చేయనున్నారు. గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష లీకేజీ కేసులో 100 కంటే ఎక్కువ మార్కులు వచ్చిన 121 మందిలో శుక్రవారం నాటికి 40 మంది విచారణ పూర్తయింది. ఏఈ పరీక్ష ప్రశ్న పత్రం విషయంలోనే క్రయవిక్రయాలు జరిగాయని, గ్రూప్– 1లో ఇలాంటివి జరిగినట్లు ఇప్పటివరకు తమ దృష్టికి రాలేదని సిట్ అధికారులు చెబుతున్నారు. బండి సంజయ్ గైర్హాజరు... పరీక్ష పత్రాల లీకేజీ కేసుల్లో ఆరోపణలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అందుకుతగ్గ ఆధారాలను శుక్రవారం తమ కార్యాలయానికి వచ్చి సమర్పించాలంటూ సిట్ అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ బండి సంజయ్ హాజరుకాలేదు. టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి సైతం సిట్ నోటీసులు ఇవ్వగా ఆయన గురువారం సిట్ కార్యాలయానికి హాజరైన సంగతి తెలిసిందే. -
TSPSC Paper Leak: రాజశేఖర్ ఆర్థిక పరిస్థితిపై సిట్ ఆరా
జగిత్యాల క్రైం: టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ కేసులో ఏ–2గా ఉన్న రాజశేఖర్ ఆర్థిక మూలాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఆరా తీస్తోంది. వాస్తవానికి ఈ కుటుంబం గతంలో ఆర్థికంగా అంత ఉన్నదేమీకాదు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లికి చెందిన రాజశేఖర్ తండ్రి ఉపాధి కోసం దుబాయ్, సౌదీ, మస్కట్, లిబియా లాంటి దేశాలకు వలస వెళ్లారు. అంతోఇంతో సంపాదించి ఆ సొమ్ముతో తన కుమారుడు, కుమార్తెను చదివించారు. తల్లి అంగన్వాడీ టీచర్ ఉద్యోగం చేస్తూ పిల్లల ఆలనాపాలనా చూసుకుంది. చదువు పూర్తయ్యాక రాజశేఖర్ టీఎస్పీఎస్సీలో కాంట్రాక్టు ఉద్యోగిగా చేరాడు. అయితే ‘ఉద్యోగంలో చేరిన కొద్దికాలంలోనే తాటిపల్లిలో ఆధునిక హంగులతో రూ.25 లక్షలు – రూ.30 లక్షల విలువైన భవనం నిర్మించాడు. తన ఇద్దరు స్నేహితులకు ఉద్యోగాలు ఇప్పించాడు. సోదరికి కరీంనగర్కు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. వారు న్యూజిలాండ్లో స్థిరపడగా..తల్లిదండ్రులు స్వగ్రామంలోనే ఉంటున్నారు. వారికి గ్రామ శివారులో సుమారు రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉంది..’అని గ్రామస్తులు చెబుతున్నారు. వీటన్నిటిపైనా సిట్ దృష్టి సారించినట్లు తెలిసింది. బంధువుల సాయంతో కాంట్రాక్టు ఉద్యోగం.. కరీంనగర్లో డిగ్రీ పూర్తిచేసిన రాజశేఖర్ కొన్నాళ్లు హైదరాబాద్లో ఉండి కంప్యూటర్ హార్డ్వేర్ కోర్సులో శిక్షణ పొందాడు. తర్వాత అఫ్గానిస్తాన్ వెళ్లి అక్కడ మూడేళ్ల పాటు కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేశాడు. తిరిగి స్వదేశానికి వచ్చి లంబాడిపల్లికి చెందిన సుచరితను వివాహం చేసుకున్నాడు. వీరికి ప్రస్తుతం ఐదేళ్ల బాబు ఉన్నాడు. కాగా రాజశేఖర్కు కరీంనగర్లోని అతని సమీప బంధువులు 2017లో టీఎస్పీఎస్సీలో కాంట్రాక్టు ఉద్యోగం ఇప్పించినట్లు తెలుస్తోంది. తమ కొడుకు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడని, నెలకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు వేతనం పొందుతున్నాడని తల్లిదండ్రులు గ్రామస్తులకు చెబుతూ వచ్చినట్లు సమాచారం. సన్నిహితులు ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగాలు రాజశేఖర్ తనకు అత్యంత సన్నిహితులైన ఇద్దరు స్నేహితులకు 2018లో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించినట్లు తెలిసింది. ఒకరు విద్యాశాఖలో, మరొకరు వేరే శాఖలో పని చేస్తున్నట్లు సమాచారం. కాగా రాజశేఖర్ మరికొందరికి కూడా ఈ విధంగా ఉద్యోగాలు ఇప్పించాడని తెలుస్తోంది. -
ఆ విషయం ఇప్పటిదాకా అమ్మానాన్నలకు తెలియదు : శివానీ రాజశేఖర్
శివాని రాజశేఖర్.. సినీ జంట డాక్టర్ రాజశేఖర్, జీవితల తనయ. ఆ ఐడెంటిటీ కొంచెం ప్లస్ అయినా నటిగా నిలదొక్కుకోవడానికి మాత్రం అభినయాన్నే నమ్ముకుంది. చిన్న పాత్రా.. పెద్ద పాత్రా.. అని చూసుకోకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు పోషించడం ముఖ్యమని భావించింది. అనుసరిస్తోంది. స్టార్గా వెబ్ తెరను ఏలుతోంది. తండ్రి లాగే ఎమ్బీబీస్ పూర్తిచేసి యాక్టర్ అయిన డాక్టర్ శివాని.. చెల్లి శివాత్మిక కంటే కొంచెం లేట్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమా ప్రపంచం గురించి పూర్తి అవగాహన ఉండటంతో మొదట నిర్మాతగా మారి తెలుగులో ‘ఎవడైతే నాకేంటి’, ‘సత్యమేవ జయతే’, ‘ కల్కి’ సినిమాలు నిర్మించింది. మోడల్గానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘ఫెమినా మిస్ ఇండియా 2022’ ఫైనలిస్ట్గా నిలిచింది. తర్వాత ‘అద్భుతం’సినిమాలో అద్భుతంగా నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ‘టూ స్టేట్స్’, ‘డబ్యూడబ్ల్యూడబ్ల్యూ’ , ‘శేఖర్’ సినిమాలతో ఇటు తెలుగు ప్రేక్షకులను, ‘అన్బరివు’, ‘నెంజుక్కు నీతి’ సినిమాలతో అటు తమిళ ప్రేక్షకులనూ మెప్పించింది. తన సినిమాలు అన్నీ ఓటీటీలోనే విడుదలయినప్పటికీ వెండితెర ప్రేక్షకులకూ బాగా దగ్గరైంది. ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్లో ఉన్న ‘ఆహ నా పెళ్లంట’ వెబ్ సిరీస్తో వినోదాన్ని పంచుతోంది. చిన్నప్పుడు బొంగరాలు కొట్టేసేదాన్ని. ఇంటికి తెచ్చి ఎవరికీ తెలియకుండా వాటిని తిప్పుతూ తెగ ఆనందపడిపోయేదాన్ని. ఈ విషయం ఇప్పటిదాకా అమ్మనాన్నలకు తెలియదు. – శివాని రాజశేఖర్ -
నా కూతుళ్లు ఆ రంగంలోకి వెళ్తామంటే చాలా టెన్షన్ పడ్డాం : జీవితా రాజశేఖర్
జీవితా రాజశేఖర్ కూతురిగా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది శివాత్మిక. మొదటి సినిమా దొరసానితో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న శివాత్మిక చాలా గ్యాప్ తర్వాత తెలుగులో మళ్లీ నటిస్తున్న సినిమా పంచతంత్రం. హర్ష పులిపాక దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో జీవితా రాజశేఖర్ స్పెషల్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ''చిన్నప్పటి నుంచి నా ఇద్దరు పిల్లలు సినిమా వాతావరణంలోనే పెరిగారు. వాళ్లు ఓరోజు మేం కూడా ఇండస్ట్రీలోకి వస్తాం అని చెప్పగానే నాకు, రాజశేఖర్ గారికి మామూలు టెన్షన్ రాలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్లకి ఏం కావాలన్నా ఆస్తులు అమ్మి మరీ కొనిచ్చాం. కానీ సినిమాలోకి రావడం అంత ఈజీ కాదు. మంచి పాత్రలు దొరకడం, ఫేమ్ రావడం, రాకపోవడం అన్నది డెస్టినీ మీద ఆధారపడి ఉంటుంది. ఇది డబ్బుతో కొనలేం. అందుకే మా అమ్మాయిల విషయంలో చాలా టెన్షన్ పడ్డాం. కానీ వాళ్ల ఇష్టాన్ని గౌరవించి సపోర్ట్ చేస్తున్నాం'' అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జీవితా రాజశేఖర్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. -
నామినేషన్స్ నాకు నథింగ్: వాసంతి ఫైర్
సందు దొరికితే చాలు నామినేషన్ కోసం పాయింట్లు వెతుక్కుంటారు హౌస్మేట్స్. మామూలుగానే రేవంత్ మీద తెగ ఓట్లు గుద్దుతారు. అలాంటిది అతడు కెప్టెన్ అయినప్పుడు బిగ్బాస్ రూల్స్ పాటించకుండా రెండుసార్లు నిద్రపోయాడు. ఇంకే, దొరికిందే ఛాన్స్ అనుకున్న హౌస్మేట్స్ ఇప్పుడు నామినేషన్స్లో ఒకటే ఓట్లు గుద్దుతున్నారు. మరోవైపు బ్యాటరీ రీచార్జ్ టాస్క్లో రోహిత్, వాసంతి.. ఇద్దరిలలో ఎవరైనా ఒకరు రెండు వారాలు సెల్ఫ్ నామినేట్ కావాలన్నారు. దీనికి వాసంతి ఒప్పుకోకపోగా రోహిత్ ఇంటిసభ్యులందరి కోసం సెల్ఫ్ నామినేట్ అయ్యాడు. తాజాగా ఇదే విషయాన్ని హౌస్మేట్స్ నామినేషన్లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. నామినేషన్స్కు భయపడుతున్నావ్ అంటూ వాసంతిని నామినేట్ చేయగా ఆమె అగ్గి మీద గుగ్గిలమైంది. నాకు నామినేషన్స్ నథింగ్, కానీ నా హెయిర్ నాకు లైఫ్ అని మండిపడింది. మొత్తానికి ఈ వారం కెప్టెన్ సూర్య, గీతూ మినహా మిగతా అందరూ నామినేషన్లో ఉన్నారు. చదవండి: ఏడు జన్మలుగా నీవే నా తల్లి అని సాయిబాబా అన్నారు: నటి యాంకర్కు సుదీప దిమ్మతిరిగిపోయే ఆన్సర్లు -
ఆ ఇద్దరికీ దక్కని సర్ప్రైజ్.. హౌస్మేట్స్కు గాయాలు
బిగ్బాస్ హౌస్లో ప్రస్తుతం రేవంత్ కెప్టెన్గా కొనసాగుతున్నాడు. హౌస్లో తను బెస్ట్ కెప్టెన్ అనిపించుకుంటానన్న రేవంత్ ఆ మాట నిలబెట్టుకునేట్లు కనిపించడం లేదు. బ్యాటరీ రీచార్జ్ టాస్క్ నడుస్తున్న సమయంలో ఇంటి నియమాలు ఎవరు పాటించకపోయినా బ్యాటరీ తగ్గుతుందని బిగ్బాస్ నొక్కి మరీ చెప్పాడు. అందరూ బిగ్బాస్ నియమాలు సరిగ్గా పాటించేలా చేయాల్సిన కెప్టెన్ రేవంతే ఆదమరిచి నిద్రపోయి రెండుసార్లు బ్యాటరీ తగ్గేందుకు కారణమయ్యాడు. దీంతో అతడికి నామినేషన్స్లో గట్టిగానే ఓట్లు పడేట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే టాస్క్ చివర్లో రాజ్ మొత్తం బ్యాటరీని వాడుకోవడంతో మెరీనా-రోహిత్లకు తమ ఫ్యామిలీ నుంచి ఎలాంటి సర్ప్రైజ్ అందకుండా పోయినట్లు తెలుస్తోంది.. కాగా తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఈ వారం బిగ్బాస్ ఇచ్చిన కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్లో హౌస్మేట్స్కు గాయాలైనట్లు కనిపిస్తోంది. టాస్క్లో భాగంగా బంతిని దక్కించుకునే క్రమంలో ఇంటిసభ్యులు గాయపడినట్లున్నారు. ఇకపోతే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. ఆది, వాసంతి, సూర్య, అర్జున్, రోహిత్, రేవంత్, సత్య, రాజ్ కెప్టెన్సీకోసం పోటీపడనున్నారట. మరి వీరిలో ఎవరు గెలిచి కెప్టెన్ అవుతారో చూడాలి! చదవండి: త్యాగానికి సిద్ధమైన రోహిత్, వాసంతి బతికిపోయిందిగా! సినిమా ఛాన్స్.. ఇంటికి పిలిచి..: నటి -
విద్యపై విషపు రాతలా?
సాక్షి, అమరావతి: ‘వెనుక‘బడి’నా గొప్పలే’ అంటూ ఈనాడు దినపత్రిక సోమవారం వండివార్చిన కథనంలో అన్నీ అసత్యాలేనని, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయాలన్న దుర్బుద్ధితో తప్పుడు కథనాన్ని ప్రచురించిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (పాఠశాల విద్య) బి. రాజశేఖర్ తీవ్రంగా ఖండించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఈ కథనాన్ని రాసిందని, ఇందులో దురుద్దేశమే కాకుండా నేరపూరిత ఆలోచనలు కూడా ఉన్నాయని వ్యాఖ్యానించారు. సచివాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనాడు రాసిన కథనంలోని ప్రతి అంశమూ అసత్యమేనని సవివరంగా స్పష్టంచేశారు. అంశాల వారీగా ఈనాడు తప్పుడు రాతలను రాజశేఖర్ ఎండగట్టారు. ఆయన ఏమన్నారంటే.. వరల్డ్ బ్యాంకు ప్రాజెక్టుపై ఈనాడుకు అవగాహనలేదు.. జాతీయ విద్యా విధానంలో 5+3+3+4 విధానాన్ని కేవలం కరిక్యులమ్ వరకు మాత్రమే అమలుచేయాలని చెప్పిందని.. 3, 4, 5 తరగతులను హైస్కూళ్లలో విలీనం చేయాలని ఎక్కడా చెప్పలేదని, ప్రపంచ బ్యాంకు ఒత్తిడికి తలొగ్గి టీచర్ల సంఖ్యను తగ్గించేందుకు విలీనం చేస్తున్నారంటూ ఈనాడు రాసింది. వాస్తవం ఏమిటంటే.. వరల్డ్ బ్యాంకు సహకారంతో అమలవుతున్న ప్రాజెక్టు మీద ఈనాడుకు అవగాహనలేదు. దానిపేరు సాల్ట్ (సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్). గత మూడేళ్లలో చేపట్టిన కార్యక్రమాల్లోని ప్రగతిని గమనించి ఆ ప్రభుత్వాలకు ఆర్థిక సహకారమిచ్చి మరింత ముందుకుపోయేలా ఈ ప్రాజెక్టు ద్వారా ప్రపంచ బ్యాంకు 250 మిలియన్ డాలర్లను అందిస్తోంది. గతంలో మాదిరిగా తాను ఎలాంటి జోక్యం చేసుకోకుండా కేవలం సాధించే ఫలితాల ఆధారంగా ఆర్థిక సహాయాన్ని అందించే కొత్త విధానాన్ని ప్రపంచబ్యాంకు చేపట్టింది. 2022లో ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ప్రాజెక్టులు 139 మంజూరు చేయగా అందులో ఏపీ ఒక్కటి. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సాధిస్తున్న పురోగతిని గమనించి ప్రపంచబ్యాంకు ఈ ఆర్థిక సహకారాన్ని అందిస్తోంది. ఇందులో ఎలాంటి షరతుల్లేవు. రాష్ట్ర విద్యారంగ చరిత్రలోనే ఇలాంటి ప్రాజెక్టు ఎక్కడా రాలేదు. అయితే, ఈనాడులో ప్రపంచ బ్యాంకు ఒత్తిడిచేసి విలీనం చేయిస్తోందని తప్పుడు వార్త రాసింది. ఎన్ఈపీలో విద్యార్థులకు అన్ని సదుపాయాలనూ అందుబాటులోకి తెచ్చేలా వనరులన్నిటినీ వినియోగించుకోవాలని, అందుకు అనుగుణంగా ఆయా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని, ఆ దిశగా 5+3+3+4 విధానాన్ని అనుసరించాలని ఎన్ఈపీ 7.5 పేరాలో కేంద్రం స్పష్టంగా చెప్పింది. కానీ, దీనిపై అవగాహన లేకుండా ఈనాడు ప్రజలను తప్పుదోవపట్టించింది. చేరికల అంకెల్లోనూ అడ్డగోలు రాతలే ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు తగ్గిపోయాయని తప్పుడు అంకెలతో కథనం రాశారు. అసలు చేరికల లెక్కలకు సంబంధించి కేంద్రం ప్రామాణికంగా నిర్దేశించిన యూడైస్ ప్లస్ గణాంకాల ఇంకా ఖరారు కాలేదు. ఇష్టమొచ్చిన సంఖ్యలు రాశారు. ఈనెల 14, 15 తేదీల్లో కేంద్ర విద్యాశాఖ దక్షిణాది రాష్ట్రాలతో వర్కుషాపును నిర్వహించాక ఈ గణాంకాలు ఖరారవుతాయి. ఈ ఏడాది లెక్కలు ఇంకా ఖరారుకానందున ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం ప్రసంగానికి గత ఏడాది గణాంకాలను అందించాం. యూడైస్ ప్లస్ ఏడాదికి ఒక్కసారే అప్డేట్ అవుతుంది. కానీ, రాష్ట్రంలో చైల్డ్ ఇన్ఫో పేరుతో రోజువారీ అప్డేషన్తో గణాంకాలు నిర్వహిస్తున్నాం. ఎక్కడినుంచో కొన్ని అంకెలను తీసుకుని ఈనాడు ప్రభుత్వంపై విషం చిమ్మింది. ఏ విద్యార్థీ బడిబయట ఉండరాదన్న ఉద్దేశంతో అమ్మఒడి సహ అనేక కార్యక్రమాలను ఎలాంటి తారతమ్యం లేకుండా ప్రభుత్వం చేస్తోంది. చరిత్రలో ఎవరూ పెట్టని విధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంపై దృష్టిపెట్టింది. ప్రతి పిల్లాడినీ బడిలో చేర్చేలా కసరత్తు చేశాం. రాష్ట్రం ఏర్పాటయ్యాక గణాంకాలు పరిశీలిస్తే.. 2014–15లో 72,32,771 చేరికలు కాగా 2015–16కు 69,07,004కు తగ్గింది. 2016–17లో 68,48,197, 2017–18లో 69,75,526, 2018–19లో 70,43,071లుగా చేరికలు ఉన్నాయి. ఇక 2019–20లో ఆ సంఖ్య 72,43,269లకు 2020–21లో 73,12,852కు పెరిగింది. 2021–22లో 72,45,640కు చేరింది. ఇక 2022–23లో సెప్టెంబర్ 30 వరకు 71,59,441లుగా చేరికలు ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే 86,199 తగ్గింది. ఈ తగ్గడం ఎందుకంటే ఇతర రాష్ట్రాలకు మైగ్రేషన్వల్ల 16,857, సీజనల్ మైగ్రేషన్వల్ల 38,951, మరణాలవల్ల 1,289 మంది చేరికలు తగ్గాయి. ఇక జనాభా తగ్గుదలవల్ల దేశవ్యాప్తంగా ఒకటో తరగతిలో చేరికలు తగ్గాయి. మన రాష్ట్రంలో కూడా ఆ విధంగా 29,102 మంది తగ్గారు. సీజనల్ మైగ్రేషన్ అయిన వారిని తిరిగి స్కూళ్లలో చేర్చేలా చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే 12వేల మంది చేరారు. చేరికలు ఐదు లక్షలకు పైగా పెరిగాయి ప్రభుత్వ స్కూళ్లలో చేరికలు చూస్తే.. వాటిపై శ్రద్ధ గత ప్రభుత్వానికి, ఇప్పటికి ప్రభుత్వానికి మధ్యనున్న తేడా తెలుస్తుంది. ప్రభుత్వ స్కూళ్లలో 2014–15లో 41,83,441 మంది పిల్లలుండగా 2015–16లో 39,24,078కు, 2016–17లో 37,57,000లకు, 2017–18లో 37,29,000లకు, 2018–19లో 37,20,988లకు చేరింది. అదే 2019–20లో 38,18,348లకు పెరగ్గా 2020–21లో 43,42,874లకు చేరింది. అంటే ఏకంగా 5 లక్షల మేర చేరికలు అదనంగా పెరిగాయి. 21–22లో 44,29,569లు కాగా 2022–23లో అది 40,31,239లుగా ఉంది. కరోనావల్ల ఆర్థిక పరిస్థితులు దెబ్బతిని ప్రైవేటు నుంచి ప్రభుత్వ స్కూళ్లలోకి చేరికలు పెరిగాయని పలు విశ్లేషణలు చెబుతున్నాయి. అయితే, ఈ చేరికల్లో ఏపీ 14 శాతంతో అగ్రస్థానంలో ఉంది. ఇతర రాష్ట్రాలు మనకన్నా తక్కువగా ఉన్నాయి. అసర్ నివేదిక కూడా ఇదే చెబుతోంది. జనాబా తగ్గుదలవల్ల కూడా చేరికలు తగ్గుతున్నట్లు ఎన్సీఈఆర్టీ నివేదిక చెబుతోంది. 2025 నాటికి 14 శాతం మేర తగ్గుతుందని నివేదించింది. ఇక 2019–20లో ప్రభుత్వ స్కూళ్లలో 38,18,348 మంది పిల్లలుండగా ప్రైవేటులో 32,28,681 మంది ఉన్నారు. అదే ప్రస్తుత విద్యాసంవత్సరంతో పోలిస్తే ప్రభుత్వ స్కూళ్లలో 40,31,239 మంది పిల్లలున్నారు. అంటే రెండు లక్షల మంది అదనంగా పెరిగారు. అదే ప్రైవేటు స్కూళ్లలో 2019–20తో పోలిస్తే 2,12,407 చేరికలు తగ్గాయి. ప్రభుత్వ స్కూళ్లలో చేరికలు తగ్గాయని ప్రైవేటులోకి వెళ్లిపోతున్నారని ఈనాడు పచ్చి అబద్ధాలు రాసింది. కరోనా పరిస్థితులు తగ్గి ఆర్థిక స్థితి కొంత పెరిగి తిరిగి ప్రైవేటులోకి వెళ్లిపోతున్నారని అనుకున్నా అందరూ ప్రభుత్వ స్కూళ్ల నుంచి వెళ్లడంలేదని ఈ గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. ఆంగ్ల మాధ్యమంతో పాటు పథకాలు, ఇతర కార్యక్రమాలవల్ల తల్లిదండ్రులు, విద్యార్థుల్లో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరిగింది. ఐఏఎస్ అధికారులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేరుస్తున్నారంటే రాష్ట్రంలో విద్యారంగంలో ప్రమాణాలు ఎంత అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నాయో స్పష్టమవుతోంది. ఇక బెండపూడి స్కూలులో ప్రసాద్ అనే టీచర్ చేసిన ప్రయత్నంవల్ల విద్యార్థులు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడుతున్నారు. దీన్ని రాష్ట్రంలోని ఇతర స్కూళ్లలోనూ అమలుచేసేలా చర్యలు చేపడుతున్నాం. ఇంత మంచిగా కార్యక్రమాలు జరుగుతూ విద్యారంగం అభివృద్ధి సాధిస్తుంటే వెనుకబడిపోయిందని ఈనాడు తప్పుడు రాతలు రాయడం సరికాదు. తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం వెనుక ఈనాడుకు నేరపూరిత ఉద్దేశాలున్నాయి. ప్రైవేటు స్కూళ్లకు వెళ్లమనా ఈనాడు ఉద్దేశ్యం? ఆంగ్ల మాధ్యమంలో ఒక్క వాక్యాన్నీ చదవలేకపోతున్నారని రాశారు. కానీ, అది అవాస్తవం. ఈ ఏడాది టెన్త్ ఫలితాల్లో తెలుగు మీడియంలో 1,08,543 మంది హాజరైతే 43.97 పాసయ్యారు. ఇంగ్లీషు మీడియంలో 4,22,743 మంది రాస్తే 77.55 శాతం పాసయ్యారు. ఈ పరీక్షలను ఎలాంటి వాతావరణంలో నిర్వహించామో అందరికీ తెలుసు. మాస్కాపీయింగ్ చేసిన వారిని, దానికి సహకరించిన టీచర్లను కూడా సస్పెండ్ చేశాం. ఇంత పకడ్బందీ నిర్వహణలోనూ ఇంగ్లీషు మీడియం పిల్లలు పాస్ అత్యధికంగా ఉంది. ఏదీ రాయడం, చదవడం రాకుండానే ఇంతమంది పాసవుతారా? అన్నది అర్థం చేసుకోవాలి. ఇలాంటి తప్పుడు వార్తలతో ప్రజలను మిస్లీడ్ చేయడం వెనుక ఈనాడు ఉద్దేశమేమిటి? ప్రభుత్వ స్కూళ్లు నిర్వీర్యం అయ్యాయంటూ ప్రైవేటు స్కూళ్లకు వెళ్లమని పిల్లలకు చెబుతున్నారా? రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులను ప్రపంచస్థాయి పౌరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం. -
వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్టు పేరే సాల్ట్
-
మాన్స్టర్గా వస్తున్న రాజశేఖర్ (ఫొటోలు)
-
సంస్కరణలతో పటిష్ట పునాది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తొలిసారిగా విద్యార్థులే కేంద్రంగా విద్యా విధానాలను అమలు చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ తెలిపారు. దశాబ్దాలుగా అమలుకు నోచుకోని సంస్కరణలను ఈ మూడేళ్లలోనే తీసుకొచ్చామన్నారు. మౌలిక వసతులు, మానవ వనరులను సక్రమంగా వినియోగించుకుంటూ ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు గట్టిపునాది వేసేందుకే తరగతుల విలీనాన్ని చేపట్టామన్నారు. పాఠశాలల మ్యాపింగ్ మాత్రమే జరుగుతోందని, ఏ ఒక్క స్కూల్ మూతపడదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇదే విషయాన్ని పలుసార్లు స్పష్టం చేసినప్పటికీ ‘ఈనాడు’ పత్రిక దురుద్దేశంతో తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురిచేసేలా అసత్య కథనాలు ప్రచురిస్తోందన్నారు. విద్యా వ్యవస్థలో వేళ్లూనుకున్న లోపాలకు సరైన చికిత్స చేస్తుంటే దుష్ప్రచారం సరికాదని హితవు పలికారు. సదుపాయాలు కల్పించాకే.. 2021–22లో 2,943 ప్రాథమిక పాఠశాలల తరగతులను 250 మీటర్ల దూరం లోపు ఉన్న 2,800 ఉన్నత పాఠశాలలకు మ్యాపింగ్ చేశామని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. 2022–23లో 620 ఫౌండేషన్ ప్లస్ పాఠశాలలను కిలోమీటరు దూరంలోపు ఉన్న 4,954 ప్రీ హైస్కూళ్లు మ్యాపింగ్ చేసినట్లు వివరించారు. 5,870 పాఠశాలల్లో తరగతులను విలీనం చేస్తే కేవలం 820 స్కూళ్లకు సంబంధించి సమస్యలున్నట్లు శాసన సభ్యులు ప్రభుత్వం దృష్టికి తెచ్చారన్నారు. దీనిపై అధ్యయనానికి జాయింట్ కలెక్టర్ చైర్మన్గా ఏర్పాటైన ప్రత్యేక కమిటీ క్షేత్రస్థాయిలో ఇబ్బందులను పరిశీలించి నివేదిక అందిస్తుందన్నారు. విలీన ప్రక్రియ సాధ్యంకాని పక్షంలో ఆ పాఠశాలలను యథావిధిగా కొనసాగిస్తామన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల సమస్య ఉంటే పరిష్కరించిన తర్వాతే తరగతుల విలీనానికి ముందుకెళ్తామన్నారు. 8,232 మంది ఎస్జీటీలకు పదోన్నతి.. కొత్త విద్యావిధానం అమలుతో ఏ ఒక్క ఉపాధ్యాయ పోస్టూ రద్దు కాదని స్పష్టం చేశారు. పైగా 8,232 మంది ఎస్జీటీలకు మేలు చేసేలా స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తున్నామన్నారు. అదనంగా పెద్ద సంఖ్యలో హెచ్ఎం పోస్టులకు షెడ్యూల్ ఖరారు చేశామన్నారు. ప్రతి ఉన్నత పాఠశాలకు ఒక హెచ్ఎం, పీఈటీతో పాటు కచ్చితంగా 9మంది సబ్జెక్టు టీచర్లు ఉండేలా పటిష్ట చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు వారానికి 36 పీరియడ్లు మించకుండా, వారిపై తరగతుల విలీన ప్రక్రియ భారం పడకుండా చూస్తామన్నారు. నాడు –నేడు ద్వారా ఇప్పటికే 15,715 పాఠశాలలను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి 32 వేల అదనపు తరగతులను నిర్మించనున్నట్టు చెప్పారు. మాకు విద్యార్థులే ముఖ్యం చరిత్రలో తొలిసారిగా విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం విద్యా విధానాన్ని అమలు చేస్తోందన్నారు. కోవిడ్తో రెండేళ్లు పాఠశాలలు సరిగా తెరుచుకోకపోవడంతో విద్యార్థుల అభ్యాసన సామర్థ్యం పడిపోయిందన్నారు. ఇదే విషయాన్ని అసర్, న్యాస్ రిపోర్టులు సైతం చెబుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా పాఠశాలలను గ్రూపింగ్ చేసి 2025 నాటికి సమస్యను అధిగమించాలని సూచిస్తోందన్నారు. గుజరాత్తో పాటు మిగిలిన రాష్ట్రాలు కూడా ఏపీ బాటలో పయనించేందుకు సిద్ధమయ్యాయని తెలిపారు. అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాల్లో సైతం ఈ తరహా విద్యా విధానం అమలవుతోందన్నారు. -
ఇంట్రెస్టింగ్గా రాజ'శేఖర్' ట్రైలర్
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'శేఖర్' .ఇందులో ఆయన పెద్ద కుమార్తె శివానీ రాజశేఖర్ కీలక పాత్రలో నటించారు. జీవితా రాజశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్ ప్లే సమకూర్చారు. బీరం సుధాకర్ రెడ్డి, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజశేఖర్ నటించిన 91వ చిత్రమిది. ఈ సినిమాలో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, గ్లింప్స ఆకటుకుంటున్నాయి. మే20న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్ను హీరో అడివి శేష్ విడుదల చేశారు. మర్డర్ మిస్టరీని తన స్టైల్లో విచారణ జరపడం వంటివి ట్రైలర్లో చూపించారు. ఈ సినిమాలో ముస్కాన్ హీరోయిన్గా నటించింది. Very happy to launch the #ShekarTrailer My best wishes to@ActorRajasekhar garu on this new look film. Seems like an interesting #ShekarOnMay20 in Theaters. Kudos & luck to #JeevithaRajashekar garu, @Rshivani_1, @ShivathmikaR & team #Shekarhttps://t.co/m0Z304OyAT pic.twitter.com/1LrfXq94GX — Adivi Sesh (@AdiviSesh) May 5, 2022 -
చనిపోతా.. రేపో, ఎల్లుండో చితికి మంట పెట్టేస్తారనుకున్నా: రాజశేఖర్ ఎమోషనల్
గత మూడున్నర దశాబ్దాలుగా విభిన్నమైన చిత్రాలలో నటిస్తూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సీనియర్ హీరో రాజశేఖర్. ఇప్పుడంటే ఆయన సినిమాలు తగ్గించాడు కానీ.. ఒకప్పుడు రాజశేఖర్ సినిమా అంటే.. మినిమమ్ గ్యారెంటీ ఉండేది. అంతేకాదు 90ల్లో స్టార్ హీరోగా వెలుగొందాడు. అప్పట్లో రాజశేఖర్ ఖాతాలో ఎన్నో సంచలన విజయాలు ఉన్నాయి. చాలా గ్యాప్ తర్వాత ఈ యాంగ్రీ స్టార్ ‘శేఖర్’సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రానికి ఆయన భార్య జీవిత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషన్స్లో భాగంగా ఓ టీవీ షోలో పాల్గొన్నా రాజశేఖర్.. తన జీవితంలో అనుభవించిన అత్యంత గడ్డు కాలాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. గతేడాది కరోనా బారిన రాజశేఖర్.. నెల రోజులకు పైగా ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ.. ‘కరోనా సోకినప్పుడు నాకు చాలా సీరియస్ అయింది. ఇక నేను చనిపోతాననుకున్నా. రేపో ఎల్లుండో నా చితికి మంట పెడతారనే ఆలోచనలు వచ్చాయి. జీవిత, పిల్లలకు ధైర్యంగా ఉండాలని చెప్పా. ప్రేక్షకుల ప్రార్థనల వల్లే బతికాను. ఇంటికి వచ్చిన తర్వాత నా కాళ్లు, చేతులు పనిచేయలేదు. ఇక నేను నటించలేనేమో అనే భయం కలిగింది. నాపై నాకే నమ్మకం లేకపోవడంతో..‘శేఖర్’చిత్రాన్ని వేరేవాళ్లతో చేయమని చెప్పా. ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడితే అవన్నీ గుర్తొస్తాయి’ అంటూ జీవిత,రాజశేఖర్ దంపతులుఎమోషనల్ అయ్యారు. ఇక సినిమాల్లోకి ఎలా వచ్చారో చెబుతూ... ‘నాకు చిన్నప్పటి నుంచి నటుడి కావాలని కోరిక ఉండేది. కానీ నాకు నత్తి ఉంది. ఒకవేళ నాకు సినిమా చాన్స్ వచ్చినా.. నత్తి ఉందని తీసేస్తారేమోననే భయం ఉండేది. అసలు నాకు నటన వచ్చో..రాదో తెలుసుకోవడానికి యాక్టింగ్ స్కూల్లో చేరా. అప్పడు నమ్మకం కలిగి.. నటించడం మొదలుపెట్టా’అని రాజశేఖర్ చెప్పుకొచ్చారు. -
తొలి ప్రేమే పుట్టిందంటున్న రాజశేఖర్!
రాజశేఖర్ హీరోగా జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శేఖర్’. వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో బీరం సుధాకర్ రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మికా రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మించిన చిత్రం ఇది. తాజాగా ‘శేఖర్’ చిత్రంలోని ‘ప్రేమ గంటే మోగిందంట’ పాటను విడుదల చేశారు. ‘‘బొట్టు పెట్టి.. కాటుక ఎట్టి వచ్చిందమ్మా సిన్నది... బుగ్గ మీద సుక్కే పెట్టి సిగ్గే పడుతున్నది..’’ అంటూ మొదలైన ఈ పాట ‘డండ డండ డండ లవ్గంట మోగిందంట... తొలి ప్రేమే పుట్టిందంట’ అంటూ సాగుతుంది. చంద్రబోస్ రాసిన ఈ పాటను విజయ్ ప్రకాష్, అనూప్, రేవంత్ పాడారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు స్వరకర్త. ‘‘ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు జీవితా రాజశేఖర్. -
ఆ సమయంలో శివానీ బాగా ఏడ్చేసింది.. ఎప్పుడూ మర్చిపోను : రాజ శేఖర్
‘నాకు కరోనా సోకినప్పుడు భయపడలేదు. కానీ నా కుటుంబ సభ్యులు చాలా బాధపడ్డారు. ‘డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు’మూవీ టీమ్ నుంచే శివానికి కోవిడ్ సోకింది. ఆమె నుంచి నాకు వచ్చింది. ఆ సమయంలో శివాని చాలా బాధపడింది. నా వల్లే డానీకి కరోనా సోకిందని ఏడ్చేసింది. ఆ జీవితాన్ని నేను ఎప్పుడూ మర్చిపోను’అన్నారు సీనియర్ హీరో రాజశేఖర్. అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం'డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు'(ఎవరు, ఎక్కడ, ఎందుకు). సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో రామంత్ర క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా డా. రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 24 నుంచి ప్రముఖ ఓటీటీ సోనిలివ్లో స్ట్రీమింగ్ కానుంది. తోంది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్కు హీరో రాజశేఖర్, జీవిత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. డా. రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘గుహన్ వండర్ ఫుల్ టెక్నీషియన్. గరుడ వేగలో మా పరిచయం జరిగింది. ఏజ్ డిఫరెన్స్ లేకుండా ఫ్రెండ్స్లా తిరిగాం. ఆయనతో శివానీ సినిమా చేస్తుందని తెలియడంతో ఆనందమేసింది. సినిమా ఫాస్ట్గా వస్తుందని చెప్పారు. ఇప్పుడు కరెక్ట్ సమయానికి వస్తోంది. డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు అంటే నాకు జీవితంలో కొన్ని గుర్తుకువస్తాయి. కోవిడ్ను చూసి నేను భయపడలేదు. ఈ టీం నుంచే శివానికి కరోనా వచ్చింది. అక్కడి నుంచి నాకు వచ్చింది. నా వల్ల డాడీకి వచ్చిందని శివానీ బాగా ఏడ్చేసింది. ఈ జీవితాన్ని నేను ఎప్పుడూ మరిచిపోను. ఈ చిత్రం మా జీవితంలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. మరిచిపోలేని ఈ సినిమా డిసెంబర్ 24న వస్తోంది. అద్భుతం సినిమాకు ఎంత మంచి పేరు వచ్చిందో.. ఈసినిమాకు కూడా అంత మంచి పేరు వస్తుందని అంటున్నారు. నాకు ఎంతో గర్వంగా ఉంది. నా పేరు నిలబెట్టిందని అందరూ అంటుంటే సంతోషంగా ఉంది. ప్రేక్షకులు అందరూ కూడా ఈ సినిమాను చూడాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘చిన్నప్పుడు మా పిల్లలు ఎప్పుడూ షూటింగ్లకు వచ్చేవారు. రాజశేఖర్ అవుట్ డోర్కు వెళ్తే తీసుకెళ్లేవారు. అప్పుడు కెమెరా వెనక ఉండేవారు. ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చారు. ఊహ వచ్చాక సినిమాల్లోకి వస్తామని మాతో నేరుగా చెప్పేశారు. సినిమాల్లో సక్సెస్ కాకపోతే డిప్రెషన్లోకి వెళ్లొద్దు.. వేరే కెరీర్ ఎంచుకోవాలని అన్నాం. శివానీ నటించిన అద్భుతం సినిమా మంచి విజయం సాధించింది. నైలు నది అనే పాట నాకు చాలా ఇష్టం. ఒక సినిమా ఒక హీరో లేదా ఇద్దరు హీరోలుంటారు. కానీ ఈ సినిమాకు నలుగురు హీరోలు. అదిత్, గుహన్, సైమన్, నిర్మాత గారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది. నేను సినిమా చూశాను. అదిత్ చాలా బాగా చేశాడు. శివానీ కూడా కష్టపడి చేసింది. గుహన్ గారు ఈ సినిమాను కేవలం 20 రోజుల్లో షూట్ చేశారు. అంత ఫాస్ట్గా ఎలా తీశారా? అని నేను షాక్ అయ్యాను. ఈ సినిమా తప్పకుండా అద్భుతంగా ఉండబోతోంది’ అని అన్నారు. అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్, ప్రియదర్శి, వైవా హర్ష, దివ్య, రియాజ్ ఖాన్, సత్యం రాజేష్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సైమన్ కె. కింగ్ సంగీతం అందిస్తున్నారు. -
కోవిడ్తో తల్లిదండ్రులు చనిపోయిన పిల్లల చదువుపై ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి: పూర్వ ప్రాథమిక విద్య నుంచి ప్లస్ టూ (ఇంటర్మీడియెట్) విద్య వరకు సమగ్ర విద్యా విధానం అమలు కావలసిన అవసరముందని పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్ తెలిపారు. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) అమలులో భాగంగా ఒకే ప్రాంగణం లేదా 250 మీటర్లలోపు ప్రాథమిక పాఠశాలల్లో గల 3, 4, 5 తరగతుల విద్యార్థులను సమీప ఉన్నత పాఠశాలలకు అనుసంధానించాలన్నారు. తద్వారా 3 నుంచి 10వ తరగతి విద్యార్థులకు విషయ నిపుణుల చేత బోధన నిర్వహించాలని సూచించారు. గురువారం ఇబ్రహీంపట్నంలోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ప్రస్తుతం గణాంక ఆధార వ్యవస్థ అవసరమైన దృష్ట్యా ప్రతి ఒక్కరూ గణాంకాల మీద లోతైన అవగాహన పెంచుకోవాలని డీఈవోలకు, ఏపీసీలకు సూచించారు. యూడైస్ ప్లస్ (ఏకీకృత జిల్లా సమాచార వ్యవస్థ)లో వివరాలు నమోదు చేయడంలో అలసత్వం చూపొద్దని విద్యాధికారులకు రాజశేఖర్ స్పష్టం చేశారు. దాని ప్రభావం జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రగతి సూచీలపై పడుతుందని తెలిపారు. యూడైస్ ప్లస్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కూడా ఉండేలా చూసుకోవాలన్నారు. కోవిడ్తో తల్లిదండ్రులు చనిపోయిన పిల్లల చదువులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఇలాంటి పిల్లలు ప్రైవేటు విద్యా సంస్థల్లో ఉంటే ఉచిత విద్యతోపాటు ఇతర బాధ్యతలపై ఆయా సంస్థల నుంచి ధ్రువపత్రం తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి, పాఠశాల విద్య సలహాదారు ఎ.మురళి, జగనన్న గోరుముద్ద పథకం డైరెక్టర్ దివాన్ మైదీన్, ఆర్ఎంఎస్ఏ డైరెక్టర్ పి.పార్వతి, పౌర గ్రంథాలయాల సంచాలకులు డా.ప్రసన్నకుమార్, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా.ప్రతాప్ రెడ్డి, పాఠశాల విద్య జాయింట్ డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు, జిల్లా విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు. -
రాజ‘శేఖర్’ మూవీకి ఓటీటీ షాకింగ్ రేట్స్!
కరోనా కారణంగా ఓటీటీలకు ఫుల్ డిమాండ్ వచ్చేసింది. ఇప్పటికే కొన్ని ఓటీటీ సంస్థలు సొంతంగా సినిమాలను తెరకెక్కించి డైరెక్ట్ స్ట్రీమింగ్ ఇస్తుంటే మరికొన్ని సంస్థలు ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా సినిమాలను ఫ్యాన్సీ రేటుకు కొనేసుకుంటున్నాయి. దీంతో థియేటర్ లో రిలీజ్ కాకుండానే డైరెక్ట్ స్ట్రీమింగ్ కు భారీ ధరలను కూడా ఓటీటీ సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. అందుకే వెంకటేష్ లాంటి సీనియర్ హీరోల సినిమాలు కూడా డైరెక్ట్ ఓటీటీలో వచ్చేస్తున్నాయి. చదవండి: పుష్ప ట్రైలర్ టీజ్ అవుట్, మామూలుగా లేదుగా.. థియేటర్లు తెరుచుకున్నప్పటికీ.. ఓటీటీలు మాత్రం ప్రేక్షకులలో అటెన్షన్ క్రియేట్ చేసి కొన్ని సినిమాలను ఎలాగైనా డైరెక్ట్ ఓటీటీ దక్కించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. అలా బజ్ క్రియేట్ చేసిన యాంగ్రీమెన్ రాజశేఖర్ ‘శేఖర్’ సినిమాపై ఇప్పుడు ఓటీటీల చూపు పడింది. డైరెక్ట్ రిలీజ్ కోసం ఓటీటీలు శేఖర్ సినిమాకు 22 నుంచి 25 కోట్ల రూపాయల వరకు ఫ్యాన్సీ రెట్లను ఆఫర్ చేస్తున్నాయట. ఈ సినిమా డిజిటల్ ప్లస్ శాటిలైట్ కలిపి 20 కోట్లకు పైగానే పలుకుతుండటం ట్రేడ్ వర్గాలకు షాక్ ఇస్తుంది. పెద్దగా మార్కెట్ లేని రాజశేఖర్ లాంటి హీరోల సినిమాకి ఓటీటీలు ఈ రేంజ్లో డీల్ కుదుర్చుకోవడం గమనార్హం. చదవండి: రూ. 3 కోట్ల మోసం, శిల్పా చౌదరి చేతిలో మోసపోయిన యంగ్ హీరో ఇతడే దీనికి కారణం ఇప్పటికే విడుదలైన శేఖర్ గ్లింప్స్ ప్రేక్షకులలో అటెన్షన్ క్రియేట్ చేశాయనడంలో ఎలాంటి డౌట్స్ లేవు. ఈ సినిమా జానర్ కూడా మరో కారణం కాగా.. ఇది ఆల్రెడీ హిట్టయిన మలయాళ మూవీ జోసెఫ్కు రీమేక్ కావడంతో ఓటీటీలు ఎలాగైనా ఈ సినిమాను దక్కించుకునేందుకు భారీ స్థాయి ఆఫర్లు ఇస్తున్నారట. శేఖర్ రీమేక్ మూవీ అయినప్పటికీ మెయిన్ సోల్ మిస్ కాకుండా కథ-స్క్రీన్ ప్లేలో మార్పుచేర్పులు చేయడంతో పాటు తెలుగు ఆడియన్స్ కోసం ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేశారట. ఈ రీమేక్కి జీవిత రాజశేఖర్ డైరెక్టర్ కాగా స్క్రీన్ప్లే కూడా ఆమెనే చూసుకుంటుంది. మరి ఓటీటీకి ఇచ్చేస్తారా లేక థియేటర్లలో వదులుతారో చూడాలి. -
మా కుమార్తెలు మేం గర్వపడేలా చేశారు: రాజశేఖర్, జీవిత
‘‘శివానీ హీరోయిన్గా పరిచయం కావాల్సిన ‘2 స్టేట్స్’ సినిమా తెలుగు రీమేక్ ఆగిపోయింది. నేనే నిర్మాతగా శివానీతో ఓ సినిమా చేయాలనుకున్నాను. వీలుపడలేదు. కానీ ఇప్పుడు ‘అద్భుతం’ లాంటి మంచి సినిమాతో శివానీ హీరోయిన్గా పరిచయం అయింది. శివానీ నటనను మెచ్చుకుంటూ నాకు చాలా ఫోన్కాల్స్, మెసేజ్లు వచ్చాయి. ‘అద్భుతం’ సినిమాతో శివానీ, ‘దొరసాని’ చిత్రంతో శివాత్మిక మేం గర్వపడేలా చేసినందుకు సంతోషంగా ఉంది’’ అని రాజశేఖర్, జీవిత దంపతులు అన్నారు. తేజా సజ్జా, శివానీ రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో చంద్రశేఖర్ నిర్మించిన చిత్రం ‘అద్భుతం’. డిస్నీ ప్లస్ హాట్స్టార్ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాకు వీక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘సక్సెస్ను కొనలేం. కష్టపడి సాధించుకోవాలి. ‘అద్భుతం’లాంటి సినిమాతో శివానీకి సక్సెస్ రావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘నేను హీరోయిన్గా అంగీకరించిన సినిమాలు ఏదో కారణం చేత ఆగిపోతూనే ఉన్నాయి. ‘అద్భుతం’ సినిమాతో నా కల నిజమైంది. నా తొలి సినిమా ఓటీటీలో విడుదలైనప్పటికీ వ్యూయర్స్ నుంచి మంచి స్పందన వస్తుండటం ఆనందంగా ఉంది’’ అన్నారు శివానీ. ఈ కార్యక్రమంలో శివాత్మిక, దర్శకుడు ప్రవీణ్ సత్తారు, లక్ష్మీభూపాల్, సృజన్లతో పాటు చిత్రబృందం పాల్గొంది. -
హీరో రాజశేఖర్ ఇంట తీవ్ర విషాదం
Hero Rajasekhar Father Is No More: టాలీవుడ్ హీరో రాజశేఖర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి వరదరాజన్ గోపాల్(93) గురువారం సాయంత్రం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. వరదరాజన్ గోపాల్ చెన్నై డీఎస్పీగా రిటైర్ అయ్యారు. ఆయనకు ఐదుగురు సంతానం కాగా ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వరదరాజన్ రెండో సంతానమే హీరో రాజశేఖర్. శుక్రవారం ఉదయం 6.30 గంటలకు వరదరాజన్ భౌతిక కాయాన్ని చెన్నైకి తరలించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన అంత్యక్రియలు చెన్నైలోనే జరగనున్నాయి. Varadarajan Gopal (93) Garu (father of actor @ActorRajasekhar) is no more. Condolences to the family members. RIP @ShivathmikaR @Rshivani_1 pic.twitter.com/uep5nRrpp7 — BA Raju's Team (@baraju_SuperHit) November 4, 2021 -
గోపీచంద్ మూవీ కోసం హీరో రాజశేఖర్కి భారీ రెమ్యునరేషన్!
తనదైన నటనతో తెలుగు ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరో రాజశేఖర్. ఇప్పుడంటే ఆయనకు పెద్దగా మార్కెట్ లేదు కానీ 20 ఏళ్ల క్రితం ఆయన వరుస విజయాలతో చాలా రికార్డులు సృష్టించాడు. ఒకప్పుడు తెలుగులో భారీ పారితోషికం అందుకున్న హీరోల్లో రాజశేఖర్ కూడా ఉన్నాడు. 90ల్లో ఈయన సినిమాలు వస్తే బాక్సాఫీస్ షేక్ అయిపోయేది. చిరంజీవి లాంటి హీరోలతో కూడా రాజశేఖర్ పోటీ పడిన సందర్భాలున్నాయి. అయితే ఆ మధ్య కాలంలో ఆయన చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో ఈ యాంగ్రీ హీరో కాస్త డీలా పడ్డాడు. ఆ తర్వాత ‘గరుడ వేగ’తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. అనంతరం ‘కల్కి’తో ప్రేక్షకులను పలకరించారు. ఆ తర్వాత మళ్లీ గ్యాప్ తీసుకున్న ఈ సీనియర్ హీరో.. ఇటీవలే ‘శేఖర్’ అనే సినిమాను ప్రకటించాడు. తాజాగా గోపీచంద్ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం రాజ శేఖర్ భారీ పారితోషికం డిమాండ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీలో హీరో సోదరుడి పాత్ర చాలా కీలకం. రాజశేఖర్ అయితేనే ఈ పాత్రకు సరిగ్గా సరిపోతారని మేకర్స్ భావించారు. రాజశేఖర్ కూడా పాత్ర నచ్చడంతో ఓకే చెబుతూ కొన్ని కండీషన్స్ పెట్టాడట. ఈ మూవీకి రూ. 4 కోట్లు పారితోషికంగా ఇవ్వాలని, అంతేకాకుండా తన పాత్రకు తగినంత ప్రాధాన్యత ఉండేలా చూడాలని షరతులు విధించాడట. దీనికి నిర్మాతలు కూడా అంగీకారం తెలిపారట. -
‘సహకార’ వ్యూహం ఫలించేనా?
కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ఒక రోజు ముందు, నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం సహకార రంగానికి కొత్త మంత్రిత్వ శాఖను ఏర్పర్చింది. భారత్లో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ఒక ప్రత్యేక పాలనా, న్యాయశాసన, విధానపరమైన చట్రాన్ని ఈ కొత్త శాఖ అందిస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఒక రోజు తర్వాత ఈ నూతన మంత్రిత్వ శాఖకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వం వహిస్తారని ప్రకటించింది. విడివిడిగానే అయినప్పటికీ కలిసే వచ్చిన ఈ రెండు ప్రకటనలపై పరిశీలకులు అంచనాలు మొదలెట్టేశారు. వాస్తవానికి కో-ఆపరేటివ్లు రాష్ట్రాలకు సంబంధించిన విషయం. దేశం లోని ప్రతి రాష్ట్రం కో-ఆపరేటివ్లకు రిజిస్ట్రార్ని నియమిస్తుంది. ఈ రంగాన్ని మొత్తంగా ఆ రిజిస్ట్రారే పర్యవేక్షిస్తుంటారు. పైగా, భారతీయ రిజర్వ్ బ్యాంక్ కూడా కో-ఆపరేటివ్ బ్యాంకులపై ఒక కన్నేసి ఉంచుతుంది. ఇంత పటిష్ట నిర్మాణం ఉంటూండగా, కేంద్ర ప్రభుత్వం ఈ రంగానికి కొత్త మంత్రిత్వ శాఖను ఎందుకు సృష్టించినట్లు? పైగా ఈ శాఖను అమిత్ షా చేతిలో పెట్టడం పలు అనుమానాలకు దారి తీసింది. అయితే ఏం జరుగుతోందని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఇతర రంగాలకు మల్లే సహకార సంస్థలకు పెద్దగా ప్రాచుర్యం లభించదు. అవి సామాన్యంగా పతాక శీర్షికలకు ఎక్కవు. కానీ గ్రామీణ భారత్ని, క్రమబద్ధీకరణ లేని ఆర్థిక వ్యవస్థను బలపర్చే ఆర్థికపరమైన చట్రంలో ఇవి భాగం. ఉత్పత్తి (చక్కెర), పరపతి (పట్టణ, గ్రామీణ కో-ఆపరేటివ్లు, సహకార బ్యాంకులు), మార్కెటింగ్ (పాల కో-ఆపరేటివ్లు) వంటి వాటిలో వీటి ఉనికిని మనం చూడవచ్చు. పాత వైపరీత్యం దిద్దుబాటే లక్ష్యమా? చాలాకాలంగా కొనసాగుతున్న ఒక నియమ విరుద్ధమైన వైపరీత్యాన్ని చక్కదిద్దడానికే కేంద్రం ఈ పనికి పూనుకుందని భావిస్తున్నారు. కో–ఆపరేటివ్లు నిజానికి రాష్ట్ర పరిధిలోనివే అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ రంగంపై ఒక కన్నేసి ఉంచుతూ వస్తోంది. భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖలో సహకార సంస్థల పర్యవేక్షణ విభాగం ఉంటోంది. ఇది ప్రధానంగా వ్యవసాయంపై దృష్టి పెడుతున్నప్పటికీ, కో–ఆపరేటివ్ల అవసరాల పట్ల ఈ శాఖ పెద్దగా స్పందించదని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ మాజీ సంయుక్త కార్యదర్శి ఒకరు పేర్కొన్నారు. కాలానుగుణంగా కోఆపరేటివ్లు మారుతూవచ్చాయి. కొత్తగా సహకార రంగంలో జరుగుతున్న రిజిస్ట్రేషన్లు వ్యవసాయ రంగానికి సంబంధించి ఉండటం లేదు. ఇప్పుడవి గృహనిర్మాణం, కార్మిక రంగాలలో ప్రవేశిస్తున్నాయి. ఈ కారణాలవల్ల సహకార సంస్థలను కేంద్ర వ్యవసాయ శాఖ పరిధిలోకి తీసుకురావడం ఏమంత అర్థవంతమైన చర్య కాదు అని ఆ అధికారి చెప్పారు. అయితే మోదీ నిర్ణయం ప్రకారం అమిత్ షా ఈ కొత్త శాఖకు బాధ్యతలు తీసుకున్నారు. కో-ఆపరేటివ్లు అభివృద్ధికి ఉపకరణాలుగా ఉపయోగపడేవి కాబట్టి రాజకీయ లక్ష్యాలు తెరమీదికి వస్తుండేవి. సహకార సంస్థలు... రాజకీయాల ప్రాబల్యం నరేంద్రమోదీని అధికారంలోకి తీసుకొచ్చిన గుజరాత్ నమూనాకు సంబంధించిన కీలకమైన అంశాల్లో కో-ఆపరేటివ్లపై బీజేపీ నియంత్రణ ఒకటనే విషయం ఎవరికీ పెద్దగా తెలీదు. 1990లలో బీజేపీ... గుజరాత్లో రుణపరపతి సహకార సంస్థలపై నియంత్రణను ఏర్పర్చుకోవడం ప్రారంభించింది. ఆ తర్వాత అమూల్ జిల్లా పాల యూనియన్లపై పట్టు సాధించింది. రాష్ట్రంలోని కాంగ్రెస్, స్థానిక అధికార వ్యవస్థలను బలహీనపర్చి వాటిని తొలగించడమే దీని ఉద్దేశం. దీర్ఘకాలం అధికారంలో ఉండాలని కోరుకునే వారెవరైనా సరే... ప్రజలను, సంస్థలను అదుపులో ఉంచుకోవలసి ఉంటుంది. గుజరాత్లో పాల సహకార వ్యవస్థ చాలా పెద్దది. గుజరాత్లోని 17 వేల గ్రామాల్లో 16,500 గ్రామాలు డెయిరీల పరిధిలో ఉంటున్నాయి. అందుకే 2001లో మోదీ గుజరాత్ సీఎం అయ్యాక సహకార సంస్థలను కైవసం చేసుకునే ప్రక్రియ వేగం పుంజుకుంది. కో-ఆపరేటివ్ల యాజమాన్యాలపై కేసులు పెట్టి వారు బీజేపీలో చేరకతప్పని పరిస్థితి కల్పించారు. 2017 నాటికి కో-ఆపరేటివ్లను పూర్తిగా కైవసం చేసుకోవడం పూర్తయిపోయింది. ఆ తర్వాత ప్రతిపక్షాల చేతుల్లో ఒక్క కోఆపరేటివ్ సంస్థ కూడా లేకుండా పోయింది. మొత్తం మీద చూస్తే రాజకీయ లాభం కోసం కో-ఆపరేటివ్లను ఉపయోగించుకోవడం గుజరాత్లో స్పష్టాతిస్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల్లో గెలవడానికి రాజకీయనేతలు అతిగా ఖర్చుపెట్టడం, పలు కాంట్రాక్టుల ద్వారా దాన్ని తిరిగి సంపాదించుకోవడం మొదలుకావడంతో డెయిరీ ఆర్థికవ్యవస్థలు క్షీణించిపోయాయి. సహకార రంగానికి కొత్త మంత్రిత్వ శాఖపై మరో రెండు కొత్త ఊహలు కూడా చోటుచేసుకుంటున్నాయి. యూపీలో గ్రామీణ అసంతృప్తిని చల్లార్చడం ఎలా? ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు రైతులను శాంతపర్చడానికి కేంద్రం చేస్తున్న తీవ్రప్రయత్నాల్లో భాగమే సహకార శాఖకు కొత్త మంత్రిని తీసుకురావడం అని ఒక ఊహ. పశ్చిమ యూపీలో 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని రైతులు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తిరగబడుతున్నారు. యూపీలో మళ్లీ అధికారంలోకి రావాలంటే పెద్దనోట్ల రద్దు వంటి భారీ పథకాన్ని ప్రకటించడానికి బీజేపీ ఏదోలా జోక్యం చేసుకోవడం తప్పేటట్టు లేదు. ప్రైవేట్ కంపెనీలే అన్ని వ్యవసాయ ఉత్పత్తులను కొనేస్తాయనే భయాందోళనలనుంచి రైతులను బయటపడేయడానికి పెద్ద ఎత్తున సహకార సంస్థలను రంగంలోకి దింపాలన్నది కేంద్ర ప్రభుత్వ ప్రయత్నంగా కనిపిస్తోంది. యూపీ ఎన్నికలకు ముందుగా భారీ పథకం ప్రకటించి వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోకుండా చేయవచ్చని కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు భావిస్తున్నారు. మరొక ఊహాకల్పన ఏమిటంటే గుజరాత్లో మోదీ, షా ట్రాక్ రికార్డుపై ఎక్కువగా ఆధారపడుతూ దేశం మొత్తాన్ని గుజరాత్గా మలచాలని లక్ష్యం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నట్లు భావిస్తున్నారు. మూడో ఊహ ఏమిటంటే, శరద్ పవార్ ఎన్సీపీ వంటి పార్టీలు మహారాష్ట్ర షుగర్ కో-ఆపరేటివ్లపై పట్టు సాధించడం ద్వారానే రాష్ట్ర రాజ కీయాల్లో తమ పట్టు నిలుపుకుంటూ వస్తున్నాయి. ఈ కో-ఆపరేటివ్లపై బీజేపీ పట్టు సాధించగలిగితే మహారాష్ట్ర వంటి కీలకమైన రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోతాయని మునుపటి ప్లానింగ్ కమిషన్ మాజీ సభ్యుడొకరు చెబుతున్నారు. అయితే ఇది మహారాష్ట్రకు మాత్రమే పరిమితం కాబోదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాల్లో కూడా కోఆపరేటివ్ సంస్థలు బలంగా ఉంటున్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై, గ్రామీణులపై బీజేపీ, ఎన్డీఏ పట్టు సడలిపోయిన సమయంలో కో-ఆపరేటివ్లు వారికి ఒక దారి చూపుతున్నట్లుంది. ఇప్పటికే రైతుల ఆందోళనలు వ్యవసాయ సమాజంపై కేంద్ర ప్రభుత్వ పలుకుబడిని బలహీనపర్చాయి. తిరిగి మండీల బాట పట్టడానికి బదులుగా కో-ఆపరేటివ్లపై పట్టు సాధిస్తే ఆ వ్యవస్థ మొత్తాన్నే కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకోవచ్చు. స్థానిక ఎన్నికలకు మాత్రమే కాకుండా ఇతర ఎన్నికలకు కూడా కో-ఆపరేటివ్లు ఎక్కువ నిధులను అందించే అవకాశం మెండుగా ఉంది అని గుజరాత్ పరిశీలకులు ఒకరు చెప్పారు. కో-ఆపరేటివ్ సొసైటీల కేంద్ర రిజిస్ట్రార్ను మంత్రిత్వ శాఖ గుప్పిట్లో పెట్టుకుంటే రాష్ట్రాల కో-ఆపరేటివ్ సొసైటీలన్నింటినీ క్రమబద్ధీకరించవచ్చు. అయితే కేంద్రం కో-ఆపరేటివ్ సంస్థలను ఎలా అదుపుచేస్తుంది అనేది తెలియాలంటే వేచిచూడాల్సిందే మరి. వచ్చే ఆరు నెలల్లోనే సహకార సంస్థలపై సంచలన చట్టం రూపకల్పనను మనం చూడవచ్చు. దేశం సాధించిన అద్భుత విజ యాల్లో సహకార సంస్థలు కూడా ఒకటి. కానీ రాజకీయ హైజాకింగ్ వల్ల ఇవికూడా స్వయంపాలనను కోల్పోయి తలకిందులవుతున్నాయి. ఈ నేపథ్యంలో సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో రాజకీయ నాయకులు మాత్రమే లాభపడి, దేశ ప్రజలు నష్టపోయే రోజులు రాబోతున్నాయన్నదే అందరి ఆందోళన. దీంతో కో-ఆపరేటివ్లను అంతర్జాతీయంగా పోటీపడేలా రూపుదిద్దడం అనే సవాలు కూడా ప్రశ్నార్థకం కానుంది. ఎమ్. రాజశేఖర్ వ్యాసకర్త స్వతంత్ర పాత్రికేయుడు (‘ది వైర్’ సౌజన్యంతో..) -
సినిమా రిలీజ్కు ముందే నిర్మాత బలి
సాక్షి, యశవంతపుర: కరోనా వైరస్ కన్నడ చిత్ర రంగాన్ని కుదిపేస్తోంది. ఇటీవల నిర్మాత రాము మృతి చెందగా శుక్రవారం మరో నిర్మాత రాజశేఖర్ వైరస్కు బలయ్యారు. నీనాసం సతీష్ నటిస్తున్న 'పెట్రోమ్యాక్స్' చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంపై ఆశలు పెట్టుకున్న రాజశేఖర్ సినిమా విడుదలకు ముందే కన్నుమూశారు. ఆయన మృతికి పలువురు నటులు, నిర్మాతలు సంతాపం వ్యక్తం చేశారు. చదవండి: KV Anand: ప్రముఖ దర్శకుడు కేవీ ఆనంద్ కన్నుమూత -
‘ఫస్ట్ టైమ్’ అంటున్న అఖిల్.. నో టెన్షన్ అన్న అనిల్
ప్రతి ఉగాదికి నూతన చిత్రాల ప్రారంభోత్సవాలు, షూటింగ్ అప్డేట్స్తో తెలుగు పరిశ్రమ కళకళలాడుతుంటుంది. ఈ ఏడాది ఉగాది కూడా సంతోషాన్ని తీసుకువచ్చింది. కొత్త చిత్రాల ప్రారంభోత్సవాలు, నిర్మాణంలో ఉన్న చిత్రాల విశేషాలు, భవిష్యత్తులోపట్టాలెక్కే చిత్రాల కబుర్లతో పండగ జోష్ కనిపించింది. పండగ పూట.. కొత్త పాట హైదరాబాద్లో కొత్త పాట మొదలుపెట్టారు మహేశ్బాబు. ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో మహేశ్బాబు హీరోగా చేస్తున్న ‘సర్కారువారిపాట’ సినిమా సెకండ్ షెడ్యూల్ మంగళవారం హైదరాబాద్లో ఆరంభమైంది. ఇందులో కీర్తీ సురేష్ హీరోయిన్గా నటిస్తున్నారు. నవీన్ ఎర్నేని, రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే సంక్రాంతి సందర్భంగా ‘సర్కారువారి పాట’ విడుదల కానుంది. నో టెన్షన్.. ఓన్లీ ఫన్ ‘ఎఫ్ 3’ సినిమా సెట్లో మళ్ళీ ఫన్ మొదలైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్తేజ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ఇది. ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, మెహరీన్ హీరోయిన్లు. ఈ సినిమా తాజా షెడ్యూల్ మంగళవారం మొదలైంది. ‘‘ఎఫ్ 3’ సెట్స్లో ఫన్ మళ్లీ మొదలైంది. ఈ ఏడాది అంతా సంతోషం, హంగామాలతో నిండిపోవాలి. ఆందోళనలకు, బాధలకు చోటు ఉండకూడదు’’ అని పేర్కొన్నారు అనిల్ రావిపూడి. ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 27న విడుదల చేయాలనుకుంటున్నారు. రవితేజ హీరోగా రూపొందనున్న తాజా చిత్రం హైదారాబాద్లో ఆరంభమైంది. శరత్ మండవ ఈ చిత్రానికి తొలి సన్నివేశానికి నిర్మాత రవిశంకర్ కెమెరా స్విచ్చాన్ చేయగా, రవితేజ క్లాప్ ఇచ్చారు, ఈ చిత్రనిర్మాత సుధాకర్ చెరుకూరి స్క్రిప్ట్ను శరత్కు అందించారు. దివ్యాంశా కౌశిక్ హీరోయిన్. ఈ సినిమా షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. ‘బిగ్బాస్’ ఫేమ్ అఖిల్ సార్ధక్ హీరోగా ఐ.హేమంత్ స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఫస్ట్ టైమ్’. అనిక విక్రమన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. హైదరాబాద్లో జరిగిన పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ఆరంభమైంది. దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచ్చాన్ చేయగా, ఎమ్.ఎల్.ఎ రఘునందన్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యానారయణ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ రొమాంటిక్ అడ్వంచర్ మూవీని ఆగస్టులో విడుదల చేయాలనుకుంటున్నారు. నూతన నటీనటులతో నిర్మాతలు ఐ. సతీష్కుమార్, కల్యాణ్ సుంకరలు ఓ సినిమాను ప్రారంభించారు. తొలి సన్నివేశానికి నటుడు అలీ కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరోయిన్ పాయల్ రాజ్పుత్ క్లాప్ ఇచ్చారు. రాజ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఆర్పీ పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు. మే నెలలో షూటింగ్ ప్రారంభించి అదే నెలలో చిత్రీకరణ పూర్తి చేస్తామని, చిత్రబృందం తెలిపింది. ఆర్జీవీ దెయ్యం హారర్ బ్యాక్డ్రాప్లో రామ్గోపాల్వర్మ (ఆర్జీవీ) సినిమాలంటే ఆడియన్స్లో ఓ స్పెషల్ ఎటెన్షన్ ఉంటుంది. ఆర్జీవీ డైరెక్షన్ లో వస్తున్న హారర్ సినిమాల సిరీస్లో రూపొందిన మరో చిత్రం ‘ఆర్జీవీ దెయ్యం’. ఈ నెల 16న సినిమా విడుదల కానుంది. రాజశేఖర్, స్వాతీ దీక్షిత్ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ఇది. జీవితా రాజశేఖర్, నట్టి కరుణ, నట్టి క్రాంతి, బోగారం వెంకట శ్రీనివాస్ ఈ సినిమాకు నిర్మాతలు. ‘‘రాజశేఖర్, నేను ఎవరికి వాళ్లం బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా విడుదల ఆలస్యం అయింది. ఇందులో రాజశేఖర్ కూతురిగా దీక్ష నటించారు’’ అని విలేకరుల సమావేశంలో రామ్గోపాల్ వర్మ అన్నారు. -
డాక్టర్ అంబేడ్కర్... జాతినిర్మాణ రూపశిల్పి
స్వాతంత్య్రోద్యమ కాలంలో సామాజిక, రాజకీయ హక్కుల కోసం అంబేడ్కర్ నిరంతర పోరాటం చేయడమే కాకుండా పౌరుల స్వాతంత్య్రం, స్వేచ్ఛ కోసం సమాంతర ఉద్యమాన్నే తీసుకొచ్చారు. ఈ అంశంపై జాతిని అంగీకరించేలా చేశారు. మహాత్మాగాంధీ నేతృత్వంలో సాగిన స్వాతంత్య్ర ఉద్యమానికి సమాంతరంగా నిలబడి, భారతీయ సామాజిక అణచివేత చట్రాన్ని సవాలు చేసిన మహనీయ మూర్తులలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఒకరు. స్వాతంత్య్రానంతరం తొలి చరిత్రకారులు అంబేడ్కర్ను విస్మరించినప్పటికీ, నేడు మనం నివసిస్తున్న భారత దేశాన్ని తీర్చిదిద్దడంలో అంబేడ్కర్ ముద్రను, ఆయన పాత్రను గుర్తించడానికి ఎక్కువ కాలం పట్టలేదు. బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్య్రం అంటే దేశ స్వాతంత్య్రమేనని అర్థం చేసుకున్న అంబేడ్కర్ స్వతంత్ర దేశంలో స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్య్రం అనే సమస్యపై చర్చ జరగడానికి ప్రయత్నించారు. ఒకసారి బ్రిటిష్ వారు దేశంనుంచి వెళ్లిపోయాక, ప్రజలు దోపిడీ, పీడన లేకుండా స్వేచ్ఛగా, సమానత్వంతో జీవిస్తారా అన్నదే ఆయన ప్రశ్న. స్వాతంత్య్రోద్యమ కాలంలో భారత రాజకీయ, సామాజిక రంగంపై అంబేడ్కర్ జోక్యం చేసుకున్న తీరు బలమైన ముద్ర వేయడమే కాకుండా, రాజ్యాంగ రచనా సమయంలో పౌరులందరి సామాజిక, రాజ కీయ సమానత్వం పట్ల విస్తృతమైన ఆమోదానికి వీలు కల్పిం చింది. పైగా పీడకస్వభావంతో ఉంటున్న సామాజిక చట్రం, దాని ఆచారాల కింద నలిగిపోయిన వారిని ఉద్ధరించే రీతిలో రాజ్యాం గాన్ని రూపొం దించడానికి అంబేడ్కర్ బాటలేశారు. స్వాతంత్య్రం తీసుకురావడంతో గాంధీ పాత్ర ముగిసిపోగా, జాతి మొత్తంలో సామాజిక, రాజకీయ సమానత్వా న్ని తీసుకురావడం కోసం అంబేడ్కర్ పాత్ర ప్రారంభమైంది. రాజకీయరంగంలో అంబేడ్కర్ తొలి జోక్యం ఒక మనిషికి ఒక ఓటుతో మొదలైంది. బ్రిటిష్ కాలంలో సార్వత్రిక వయోజన ఓటు ఉండేది కాదు. పన్ను చెల్లింపుదారులు, విద్యావంతులు మాత్రమే ఓటు వేసేవారు. అంబేడ్కర్ సార్వత్రిక ఓటు హక్కుకై పోరాడారు. మహిళల ఓటుహక్కు ఉద్యమం దీర్ఘకాలం పోరాడిన తర్వాత బ్రిటన్ మహిళలు 1928లో ఓటు హక్కు పొందగలిగారు. అమెరికాలో సైతం మహిళలు 1920లో మాత్రమే ఓటు హక్కు పొందగలిగారు. 1930లో ఆ తర్వాత కూడా రౌండ్ టేబుల్ సదస్సులో ఈ డిమాండును లేవనెత్తడానికి అంబేడ్కర్ తనకు అందుబాటులో ఉన్న ప్రతి వేదికనూ ఉపయోగించుకున్నారు. స్వాతంత్య్రానికి, ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు ఒక అత్యవసరమైన అంశం అనే అభిప్రాయాన్ని అంబేడ్కర్ సృష్టించగలిగారు. నిరక్షరాస్యత అంశం ప్రాతిపదికన ఓటింగ్ హక్కులు కల్పించడంపై రాజ్యాంగ సభలో అంబేడ్కర్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత నెహ్రూ సాయంతో అంబేడ్కర్ రాజ్యాంగంలో సార్వత్రిక వయోజన ఓటు హక్కును ముందుకు తీసుకొచ్చారు. ఏ కమ్యూనిటీ అయినా, వ్యక్తుల బృందాలు అయినా స్వయం నిర్ణయాధికార హక్కును కలిగి ఉండాలనే అంశాన్ని అంబేడ్కర్ నొక్కి చెప్పేవారు. ఏ కమ్యూనిటీకైనా ఏది మంచిది అనే విషయాన్ని ఇతరులు ఆదేశించకూడదని అంబేడ్కర్ భావించేవారు. పైగా తమకు ఏది మంచిది అని ప్రజలే నిర్ణయించుకునే హక్కు ఉండాలని చెప్పేవారు. రాజ కీయ అంగాల ప్రాతినిధ్య హక్కు భావనను రౌండ్ టేబుల్ సదస్సులో పోరాడి సాధించడం ద్వారా శాసనసభల్లో దళితులకు ప్రాతినిధ్యం కల్పించడంలో అంబేడ్కర్ ఘనవిజయం సాధించారు. ఆయన ప్రతిపాదించి అమలులోకి తీసుకొచ్చిన ఈ భావన తర్వాత పార్లమెంటులో గిరిజన ప్రాతినిధ్య హక్కుల పరికల్పనకు కూడా వీలు కల్పించింది. పంచాయతీలు, పురపాలక సంస్థల్లో కూడా దళితులకు, వెనుకబడిన వర్గాలకు కూడా ప్రాతినిధ్య హక్కులు లభించాయి. అణచివేత స్వభావంకల భారత సామాజిక చట్రం, అసమానమైన మత వ్యవస్థ, ఆచారాలపై నిరంతర చర్చ మొదలెట్టి, సవాలు చేయగలడం ద్వారా అంబేడ్కర్ సామాజిక రంగంలో గణనీయ పాత్ర పోషించారు. 1930-32 కాలంలో లండన్లో రౌండ్ టేబుల్ సదస్సులలో దళితుల ప్రతినిధిగా ఎలుగెత్తిన అంబేడ్కర్ దళితులకు రాజకీయ ప్రాతి నిధ్యం సాధించడంతో తన పేరు మార్మోగిపోయింది. 1932 సెప్టెంబర్లో పూనా ఒడంబడికపై సంతకం చేయడం ద్వారా గాంధీ ప్రాణాలను కాపాడటంలో అంబేడ్కర్ నిర్వహించిన పాత్రతో విశిష్టమైంది. 1932 ఒడంబడిక తర్వాతే గాంధీ దళితులకు దేవాలయ ప్రవేశంపై ఉద్యమం ప్రారంభించారు. కానీ 1935 అక్టోబర్ 13న హిందువుగా జన్మించాను కానీ హిందువుగా మరణించను అనే సుప్రసిద్ధ ప్రకటన ద్వారా అంబేడ్కర్ పాతుకుపోయిన భారతీయ మత చట్రాన్ని సవాలు చేశారు. ఈ విస్పోటనా ప్రకటన ద్వారా అన్ని మతాలు, మతనేతలను తమలోకి తాము తొంగి చూసుకునేలా చేశారు. సమాజంలో వ్యక్తి సమానత్వం, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ, న్యాయంపై మతాలు ఏం చెబుతున్నప్పటికీ వాటి ఆచారాలను, మత వ్యవస్థలను మళ్లీ మదింపు చేసుకోవాలని అంబేడ్కర్ వారిని కోరారు. 1935లో ఆయన చేసిన ఈ చారిత్రక ప్రకటనతో ప్రతి ఒక్కరూ స్త్రీపురుషుల సమానత్వం, న్యాయమైన సమాజం పట్ల తమ మతవిశ్వాసాలను, ఆచారాలను లోతుగా పునఃపరిశీలించుకోవలసి వచ్చింది. చివరకు గాంధీజీ సైతం ఈ చర్చలో పాల్గొన్నారు. ఇక 1936లో అంబేడ్కర్ చేయలేకపోయిన సుప్రసిద్ధ ప్రసంగం ‘కులనిర్మూలన’తో మరొక సవాల్ విసిరారు. ఈ ప్రసంగంలో మతం, మానవ సమానత్వం పాత్రను అంబేడ్కర్ లోతైన విశ్లేషణ చేశారు. 1940లలో తీసుకొచ్చిన ఆలయ ప్రవేశ చట్టాలను అంబేడ్కర్ గుర్తించలేదు. కేవలం ఆలయాల్లోకి ప్రవేశం కల్పించడం ద్వారా మాత్రమే రహదారులు, నీరు, విద్య వంటి అంశాలపై దళితులకు, పౌరులకు పౌర హక్కులు, సామాజిక హక్కులు కల్పించలేరని అంబేడ్కర్ తప్పుపట్టారు. దళితులకు ఆంక్షలు లేకుండా నీరు కల్పించడానికి 1927లో అంబేడ్కర్ మొదలెట్టిన మహద్ సత్యాగ్రహం కానీ, 1932లో నాసిక్లోని కాలారాం ఆలయ ప్రవేశం కోసం తాను చేసిన ప్రయత్నం కానీ.. భారతీయ సామాజిక చట్రం దళితులకు ఈ హక్కులను తిరస్కరిస్తోందనడానికి నిదర్శనాలుగా మిగి లిపోయాయి. స్వాతంత్య్రోద్యమ కాలంలో సామాజిక, రాజకీయ హక్కుల కోసం అంబేడ్కర్ నిరంతర పోరాటం చేయడమే కాకుండా పౌరుల స్వాతంత్య్రం, స్వేచ్ఛ కోసం సమాంతర ఉద్యమాన్నే తీసుకొచ్చారు. ఈ అంశంపై జాతి లేచి నిలబడి చర్చించి, అంగీకరించేలా చేశారు. ఇది 1950లో భారత రాజ్యాంగంలో ఈ హక్కులన్నింటినీ పొందుపర్చడానికి దారి తీసింది. డాక్టర్ రాజశేఖర్ ఉండ్రు వ్యాసకర్త ఐఏఎస్ అధికారి, హరియాణా ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి -
రాజశేఖర్ హీరోగా ‘శేఖర్’.. ఫస్ట్లుక్
‘‘భయంకరమైన కోవిడ్–19 నన్ను మరణపు సరిహద్దుల్లోకి తీసుకువెళ్లినా నేను ప్రేమించేవాళ్లు, నా అభిమానుల ప్రార్థనలే నా ఈ పుట్టినరోజు నాడు ఒక కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించేలా చేశాయి. కనిపించని ఆ దేవుడికి, కనిపించే దేవుళ్లయిన మీకు రుణపడి ఉంటాను’’ అన్నారు రాజశేఖర్. గురువారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా రాజశేఖర్ హీరోగా ‘శేఖర్’ చిత్రాన్ని ప్రకటించి, ఫస్ట్లుక్ విడుదల చేశారు. లలిత్ దర్శకత్వంలో తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ఎమ్.ఎల్.వి. సత్యనారాయణ, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. ‘‘రాజశేఖర్ గారి 91వ చిత్రమిది. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించాం’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి రచయిత: లక్ష్మీ భూపాల్, కెమెరా: మల్లికార్జున్ నరగని, సంగీతం: అనూప్ రూబెన్స్, కళ: దత్తాత్రేయ. -
రాజశేఖర్ చాలా క్రిటికల్ స్టేజి వరకు వెళ్లారు: జీవిత
సాక్షి, హైదరాబాద్: సినీనటుడు రాజశేఖర్ ఆరోగ్యంపై ఆయన భార్య జీవితా రాజశేఖర్ స్పందించారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. రాజశేఖర్ ఆరోగ్యం ముందుకన్నా చాలా మెరుగ్గా ఉంది. వైద్యానికి ఆయన సహకరిస్తున్నారు. మొదట చాలా క్రిటికల్ స్టేజి వరకు వెళ్లారు. వైద్యులు, మేము కూడా చాలా భయపడ్డాము. డాక్టర్లు అనుక్షణం ఆయనను కనిపెట్టి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఆక్సిజన్ అవసరం లేకుండా వైద్యం అందుతోంది. తొందరలోనే డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది' అని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యం తొందరగా కుదుటపడాలని కోరుకున్న అభిమానులందరికి ప్రత్యేక ధన్యవాదాలు' తెలిపారు. (కరోనా: పైకి అంతా బాగున్నా.. లోలోపల ఏదో టెన్షన్) -
రాజశేఖర్ ఆరోగ్యంపై కూతురు శివాత్మిక ట్వీట్
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్ ఆరోగ్యం మెల్లమెల్లగా కుదుటపడుతోంది. తండ్రి ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్ను కూతురు శివాత్మిక ట్విటర్లో వెల్లడించారు. ప్రస్తుతం రాజశేఖర్ ఆరోగ్యం బాగుందని, కరోనా నుంచి కోలుకుంటున్నట్లు ఆమె తెలిపారు. హైదరాబాద్లోని సిటీ న్యూరో ఆసుపత్రి బృందం తన తండ్రి ఆరోగ్యం కుదుటపడటానికి ఎంతో కృషి చేస్తున్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సిటీ న్యూరో ఆసుపత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్ను శివాత్మిక షేర్ చేశారు. చదవండి: నిలకడగా హీరో రాజశేఖర్ ఆరోగ్యం Daddy is recovering! Grateful for the team of doctors at @CitiNeuro lead by Dr.Krishna Prabhakar Garu. Thanks to dear Dr.Madhu garu for always being there for us! Tq all so much for your prayers and wishes! Keep us in your thoughts, We'll come out stronger💜 pic.twitter.com/3kgzRVIh7C — Shivathmika Rajashekar (@ShivathmikaR) October 31, 2020 'రాజశేఖర్ కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రస్తుతం ఆయన శరీరం చికిత్సకు సహకరిస్తోంది. వైద్యుల బృందం నిరంతరం ఆయనను పర్యవేక్షిస్తోంది. హై ఫ్లో ఆక్సిజన్ను ఆయనకు అందిస్తున్నాం' అని బులెటిన్ లో డాక్టర్లు పేర్కొన్నారు. కాగా ఇటీవల రాజశేఖర్ కుటుంబం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే జీవితా, ఇద్దరు కూతుళ్లు కరోనా నుంచి బయటపడినప్పటికీ రాజశేఖర్ మాత్రం ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చదవండి: హనీమూన్ వాయిదా వేసుకున్న కాజల్.. -
ఐసీయూలో హీరో రాజశేఖర్
సాక్షి, హైదరాబాద్: కోవిడ్తో బాధపడుతూ ఇటీవల హైదరాబాద్లోని సిటీ న్యూరో సెంటర్లో చేరిన హీరో రాజశేఖర్కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు గురువారం ప్రకటించాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైద్య చికిత్సకు ఆయన శరీరం స్పందిస్తోందని వైద్యులు తెలిపారు. నటుడు రాజశేఖర్, ఆయన కుటుంబ సభ్యులకు ఇటీవల కరోనా సోకిన సంగతి తెలిసిందే. ‘ పిల్లలు.. శివాత్మిక, శివానీ ఇద్దరికీ బాగానే ఉంది. నేను, జీవిత చికిత్స తీసుకుంటున్నాం’ అని ట్విట్టర్ ద్వారా నాలుగు రోజుల క్రితం ఆయన తెలిపిన సంగతి విదితమే. కాగా, రాజశేఖర్ ఆరోగ్యం విషమించిందన్న వార్తలను ఆయన కుటుంబం ఖండించింది. పుకార్లను నమ్మవద్దని కోరింది. ‘నాన్నగారు కోవిడ్తో పోరాడుతున్నారు. మీ అందరి ప్రార్థనలు కావాలి. మీ ప్రేమతో ఆయన మరింత ఆరోగ్యంగా బయటకు వస్తారు’ అని ఆయన కుమార్తె శివాత్మిక గురువారం ట్వీట్ చేశారు. ఇదే విషయాన్ని ఒక లేఖ ద్వారా కూడా ఆయన కుటుంబం తెలిపింది. -
‘మా’లో మళ్లీ లొల్లి.. నరేష్పై..
సాక్షి, హైదరాబాద్ : ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)’ లో మళ్లీ లుకలుకలు మొదలయ్యాయి. ‘మా’ అధ్యక్షుడు నరేష్పై ఎగ్జిక్యూటీవ్ మెంబర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేష్ ప్రవర్తనను దుయ్యబట్టిన ఈసీ సభ్యులు.. ఆయనపై చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీకి లేఖ రాశారు. శివాజీరాజా హయం నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలను ఆ లేఖలో ప్రస్తావించారు. ‘మా’ అభివృద్ధికి నరేశ్ అడ్డంకి మారారని, నిధులు దుర్వినియోగం చేయడంతో పాటు ఈసీ సభ్యులను అవమానపరుస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన నరేశ్పై చర్యలు తీసుకోవాలని 9 పేజీల లేఖను క్రమశిక్షణ కమిటీకి పంపారు. ఈ లేఖలో జీవిత రాజశేఖర్, జయలక్ష్మి, మహ్మద్ అలీ, ఎంవీ బెనర్జీ, రాజారవీంద్ర, ఉత్తేజ్లతో పాటు మరో పదిమంది సభ్యులు సంతకాలు చేశారు. కాగా, ఇటీవల జరిగిన ‘మా’ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో రాజశేఖర్ కొందరు సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చిరంజీవి, మోహన్ బాబు వారించినా లెక్క చేయకుండా తను చెప్పాలనుకున్నది చెప్పేసిన రాజశేఖర్... తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు జీవిత లేఖతో ‘మా’ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నరేష్పై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్న జీవిత.. ఈసీ మెంబర్లతో సుధీర్ఘ సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడకుండానే వెనుదిరిగారు. -
‘మా’ 2020 డైరీ ఆవిష్కరణ
-
హీరో రాజశేఖర్ సంచలన నిర్ణయం
-
హీరో రాజశేఖర్ సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)’ లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. దీంతో ‘మా’ఉపాధ్యక్షుడు రాజశేఖర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గురువారం స్థానిక హోటల్లో జరిగిన ‘మా’ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో తీవ్రస్థాయిలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదానికి ప్రధాన బిందువుగా నిలిచిన రాజశేఖర్పై సినీ ఇండస్ట్రీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కలత చెందిన ఆయన ‘మా’ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను మీడియాకు విడుదల చేశారు. అయితే తన రాజీనామాకు ‘మా’ అధ్యక్షుడు నరేశ్ కారణమని, ‘మా’ కొత్త కార్యవర్గం ఎన్నికైనప్పట్నుంచి అతడి తీరు అస్సలు బాగోలేదని, అంతేకాకుండా అతడితో తమకు పొసగడంలేదని అందుకే రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. అసలేం జరిగిందంటే.. గురువారం ‘మా’ పలు నాటకీయ, ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ‘మా’లో మారోసారి విభేదాలు బట్టబయలయ్యాయి. ఈ కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతుండగా.. ఆయన నుంచి మైకు లాక్కొన్నాడు. దీంతో వేదికపై ఉన్న చిరంజీవి, మోహన్బాబులకు ఆగ్రహం తెప్పించింది. దీనికి తోడు రాజశేఖర్ మాట్లాడిన తీరు, అంశాలపై వారిద్దరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలని పనిగట్టుకుని గొడవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి వచ్చారని రాజశేఖర్ను ఉద్దేశిస్తూ చిరంజీవి విమర్శించారు. అంతేకాకుండా ‘మా’నియమనిబంధనలు పాటించని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. మోహన్ బాబు, కృష్ణంరాజు చిరంజీవికి సపోర్ట్ నిలుస్తూ రాజశేఖర్ చేసిన పనిని తప్పుపట్టారు. అంతేకాకుండా జీవితరాజశేఖర్ సైతం తన భర్తది చిన్నపిల్లల మనస్తత్వంగా పేర్కొనడం విశేషం. చదవండి: ‘మా’ విభేదాలు.. స్పందించిన జీవితా రాజశేఖర్ ‘మా’లో రచ్చ.. రాజశేఖర్పై చిరంజీవి ఆగ్రహం -
‘మా’ విభేదాలు.. స్పందించిన జీవితా రాజశేఖర్
సాక్షి, హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసిసోయేషన్ (మా)లో మరోసారి విభేదాలు బయటపడిన సంగతి తెలిసిందే. ‘మా’ డైరీ ఆవిష్కరణ సందర్భంగా చిరంజీవి, రాజశేఖర్ వాగ్వాదం జరగడం, చిరు కామెంట్స్కు రాజశేఖర్ అడ్డుపడ్డటం, రాజశేఖర్ తీరును చిరంజీవి, మోహన్బాబు ఖండించడంతో వివాదం రేగింది. రాజశేఖర్ అర్ధంతరంగా కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ‘మా’ జనరల్ సెక్రటరీ జీవితారాజశేఖర్ స్పందించారు. మాలోని విభేదాలు తగ్గించి..పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. నరేశ్ వర్గంతో తమకున్న విభేదాలను తామలో తాము పరిష్కరించుకుంటామని ఆమె తెలిపారు. మాలో భేదాభిప్రాయాలు ఉన్నమాట వాస్తవమేనని, వాటిని ఉమ్మడిగా పరిష్కరించుకుంటామని తెలిపారు. ప్రతిచోట గొడవలు రావడం సహజమేనని, తామేమీ దేవుళ్లం కాదు మీలాగే మనుషులమని అన్నారు. చిరంజీవి మా అసోసియేషన్కు చాలా టైమ్ ఇచ్చారని, మా అభివృద్ధికి ఎన్నో సూచనలు ఇచ్చారని తెలిపారు. చిరంజీవి, మోహన్బాబులాంటి వారినుంచి ఎంతో నేర్చుకున్నామన్నారు. రాజశేఖర్ది చిన్నపిల్లల మనస్తత్వమని, ఆయన కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యారని, ఆయన మనస్సులో ఏది దాచుకోరని తెలిపారు. మాను బలోపేతం చేయడం, గౌరవప్రదమైన సంస్థగా మార్చడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. నరేశ్తో తనకు కానీ, రాజశేఖర్కుకానీ వ్యక్తిగత విభేదాలు లేవని, చిన్నచిన్న భేదాభిప్రాయాలను అందరం కలిసి ఉమ్మడిగా పరిష్కరించుకుంటామని చెప్పారు. మరోవైపు సినీ పెద్దలు కూడా ‘మా’లోని విభేదాలను రూపుమాపి.. నరేశ్, జీవితారాజశేఖర్ వర్గాల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. దీంతో మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం వివాదంతో రచ్చరేపినా.. చివరకు పరిస్థితి చల్లబడింది. చదవండి: ‘మా’లో రచ్చ.. రాజశేఖర్పై చిరంజీవి ఆగ్రహం -
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు!
సాక్షి, హైదరాబాద్: హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దయింది. రవాణాశాఖ ఆయన డ్రైవింగ్ లైసెన్స్ను 6 నెలలపాటు రద్దు చేసింది. గతనెల 12న ఔటర్ రింగ్ రోడ్డు పెద్ద గోల్కొండ వద్ద ఆయన కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఆ సమయంలో రాజశేఖరేకారు నడిపారు. ఈ కేసులోనే రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ను అధికారులు రద్దు చేసినట్లుగా సమాచారం. 2017 అక్టోబర్లోనూ పీవీ ఎక్స్ప్రెస్ హైవేపై ఓ కారును రాజశేఖర్ వాహనం ఢీకొట్టిన సంగతి తెలిసిందే. విశ్వసనీయ సమాచారం ప్రకారం రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ కాలపరిమితి 2017 లోనే ముగిసింది. అయినా, ఆయన దాన్ని రెన్యువల్ చేసుకోలేదు. దీనికితోడు నిర్లక్ష్యంగా కారు నడుపుతూ వరుసగా ప్రమాదాలకు కారణమవుతుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. -
వారందరికీ కృతజ్ఞతలు: రాజశేఖర్
-
వారందరికీ కృతజ్ఞతలు: రాజశేఖర్
ప్రముఖ హీరో డాక్టర్ రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. బుధవారం వేకువజామున రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ రోడ్ ఔటర్ రింగ్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. రామెజీఫిల్మ్ సిటీ నుంచి తన కారులో ఇంటికి వస్తుండగా కారు టైరు పగిలి డివైడర్ను ఢీకొని, కారు పల్టీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో రాజశేఖర్ స్వల్పగాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఈ ప్రమాదంపై అనేక వార్తలు వస్తున్న తరుణంలో రాజశేఖర్ మీడియా ముందుకు వచ్చారు. దేవుడి దయ వల్ల పెద్ద ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డానని ఆయన తెలిపారు. కారు పల్టీలు కొట్టడంతో ఒళ్లు నొప్పులున్నాయి తప్పా పెద్ద గాయాలు కాలేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న వారితో పాటు తనపై ప్రేమాభిమానాలు కురిపించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాను క్షేమంగా ఉన్నట్లు తెలిపిన రాజశేఖర్.. ఎవరూ ఆందోళన పడొద్దని ధైర్యం చెప్పారు. ‘ఈ ప్రమాదం జరిగినప్పట్నుంచి అనేక మంది మెసేజ్లు, ఫోన్లు చేసి నా యోగ క్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. కొంతమంది ఇంటికి వచ్చి పరామర్శిస్తున్నారు. వీరందరి పలకరింపులు, నాపై చూపిస్తున్న ప్రేమ చూస్తేంటే చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ సందర్భంగా మీ అందరికీ ఒక్కటి చెప్పదల్చుకున్నాను. సినిమా ఇండస్ట్రీ అంతా ఒక ఫ్యామిలీ. అయితే ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు చనిపోయిన వారి కుటంబసభ్యులను కలవడం కానీ, ప్రమాదాలకు గురై గాయపడ్డ వారిని పలకరించడం వంటివి చేయాలి. లేకపోతే వారి కుటుంబసభ్యులు బాధపడతారు. మనకు సినీ ఇండస్ట్రీలో ఎవరూ లేరా అని నిరుత్సాహపడతారు. అలాగే ఆరోగ్యం బాగోలేని వ్యక్తుల దగ్గరికి వెళ్లి దయచేసి పరామర్శించండి. ధైర్యం నింపండి. డిజిటల్ యుగంలో ఉన్నాం.. ఏదైనా జరిగినప్పుడు కనీసం ట్వీట్ చేయండి’అంటూ రాజశేఖర్ పేర్కొన్నారు. ఇక రాజశేఖర్ పూర్తి సందేశం కింది వీడియోలో.. -
ప్రమాదంపై స్పందించిన జీవితా రాజశేఖర్
సాక్షి, హైదరాబాద్: తన భర్త పెద్ద ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారని ప్రముఖ నటి, దర్శక నిర్మాత జీవితా రాజశేఖర్ తెలిపారు. అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రేమాభిమానాలతో కారు ప్రమాద ఘటన నుంచి ఆయన క్షేమంగా బయటపడ్డారని చెప్పారు. రాజశేఖర్ కారు ప్రమాదంపై మీడియా, సోషల్ మీడియాలో భిన్నమైన వార్తలు రావడంతో ఆమె స్పందించారు. ఈ మేరకు మీడియాకు ఒక వీడియో రిలీజ్ చేశారు. ‘కారు ప్రమాదంపై రకరకాల వార్తలు వస్తుండటంతో వాస్తవాలు వెల్లడించేందుకు మీ ముందుకు వచ్చాను. రాజశేఖర్ గారు మంగళవారం అర్ధరాత్రి ఘాటింగ్ ముగించుకుని ఇంటికి వస్తుండగా కారు టైరు పేలిపోవడంతో నియంత్రణ తప్పి డివైడర్ను ఢీకొని పక్కవైపు పడిపోయింది. ఎదురుగా వస్తున్న కారులో ఉన్నవారు ఆగి రాజశేఖర్ గారిని గుర్తించారు. వారి సహాయంతో కారులోంచి బయటకు వచ్చారు. ఆయన ఫోన్ స్విచ్చాఫ్ అయిపోవడంతో ఎవరైతే ఆయనను బయటకు తీశారో వాళ్ల ఫోన్ నుంచి పోలీసులకు, మాకు ఫోన్ చేశారు. నేను వీళ్ల కారులోనే వస్తున్నాను మీరు ఎదురురండి అని మాతో చెప్పారు. మేము బయలుదేరి సగం దూరం వెళ్లి ఆయనను మా కారులో ఎక్కించుకుని ఇంటికి తీసుకొచ్చాం. పోలీసులకు విషయాన్ని వివరించాను. రాజశేఖర్ గారు క్షేమంగానే ఉన్నారు కదా అని ఒకటికి రెండుసార్లు అడిగారు. ఆయనతో కూడా ఫోన్లో మాట్లాడారు. ఎటువంటి దెబ్బలు తగల్లేదని చెప్పారు. ఈ ఉదయం కూడా శంషాబాద్ సీఐ వెంకటేశ్ గారితో మాట్లాడాను. ప్రమాదం జరిగిన తీరుపై ఒకసారి స్టేషన్కు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పారు. రాజశేఖర్ కోలుకున్నాక స్టేషన్కు రమ్మన్నారు. ఇది కచ్చితంగా పెద్ద ప్రమాదం. రాజశేఖర్ గారిని అభిమానించే అందరి ప్రేమాభిమానాలతో ఆయన క్షేమంగా బయటపడ్డార’ని జీవిత వివరించారు. (ప్రాథమిక వార్త: హీరో రాజశేఖర్ కారుకు మరో ప్రమాదం) -
నాకు ఎటువంటి గాయాలు కాలేదు