Sarfaraz Ahmed
-
Ind vs Pak: టీమిండియా చేతిలో ఓటమి తర్వాత కసి పెరిగింది! ఫైనల్లో అలా..
క్రికెట్ ప్రపంచంలో భారత్- పాకిస్తాన్(India vs Pakistan) మ్యాచ్కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇరుదేశాల అభిమానులతో పాటు క్రికెట్ ప్రేమికులంతా దాయాదుల పోరు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తాయనడంలో అతిశయోక్తి లేదు. ఇక గత కొన్నేళ్లుగా ఆసియా కప్, ఐసీసీ వంటి ప్రధాన ఈవెంట్లలో మాత్రమే ఈ చిరకాల ప్రత్యర్థుల ముఖాముఖి పోటీపడుతుండగా.. అత్యధిక సార్లు భారత్ పైచేయి సాధించింది.కానీ 2017 నాటి చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) ఫైనల్లో మాత్రం టీమిండియాకు దాయాది చేతిలో భంగపాటు ఎదురైంది. లీగ్ దశలో పాక్ను చిత్తు చేసిన భారత జట్టు.. టైటిల్ పోరులో మాత్రం దురదృష్టవశాత్తూ ఓటమిపాలైంది. ఇక ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్ మొదలుకానున్న తరుణంలో నాటి విన్నింగ్ పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్(Sarfaraz Ahmed) గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.మాలో కసి పెరిగిందిచాంపియన్స్ ట్రోఫీ-2017లో తమ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘‘గ్రూప్ స్టేజ్లో టీమిండియా చేతిలో ఓడిపోయిన తర్వాత జట్టు సమావేశంలో భాగంగా సీనియర్లు షోయబ్ మాలిక్, మొహమ్మద్ హఫీజ్ మాలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. జట్టులో అలాంటి వ్యక్తులు ఉండటం అదనపు బలం.ఆరోజు నుంచి మా ఆలోచనా ధోరణి మారిపోయింది. ఆ చేదు అనుభవం నుంచి పాఠాలు నేర్చుకున్నాం. జట్టులో రెండు మార్పులతో బరిలోకి దిగి వరుస విజయాలు సాధించాం. సౌతాఫ్రికా, శ్రీలంక జట్లను ఓడించాం.టీమిండియా మనకు కొత్తదేమీ కాదుఇక ఇంగ్లండ్తో సెమీ ఫైనల్లో మా బౌలర్లు అద్భుతంగా ఆడి గెలిపించారు. ఆ తర్వాత టీమిండియాతో ఫైనల్. అప్పుడు రెట్టింపు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాల్సిన పరిస్థితి. అందరూ పూర్తిగా రిలాక్స్ అవ్వాలని మా వాళ్లకు సందేశం ఇచ్చాను.అత్యుత్తమ జట్లను ఓడించాం. ఇక టీమిండియా కూడా మనకు కొత్తదేమీ కాదు. మనం చూడని జట్టూ కాదు. ఫలితం ఏమిటన్న విషయం గురించి ఆలోచించవద్దు. గెలిచేందుకు వంద శాతం ప్రయత్నం చేశామా లేదా అన్నది మాత్రమే ముఖ్యం.ఆ తర్వాత జరిగిందంతా మీకు తెలుసు. చివరి వికెట్ పడగానే మాకు కలిగిన అనుభూతిని మాటల్లో వర్ణించలేము’’ అంటూ ఐసీసీతో తన జ్ఞాపకాలు పంచుకున్నాడు సర్ఫరాజ్ అహ్మద్. కాగా లండన్ వేదికగా నాటి ఫైనల్లో పాకిస్తాన్ కోహ్లి సేనపై 180 పరుగుల తేడాతో గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది.దుబాయ్లో టీమిండియా మ్యాచ్లుఇక 2017లో ఫైనల్ ఆడిన జట్టులో ఉన్న రోహిత్ శర్మ ప్రస్తుతం కెప్టెన్గా ఉండగా.. విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా కూడా ప్రస్తుత చాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఈసారి పాకిస్తాన్ ఈ ఐసీసీ టోర్నీ ఆతిథ్య హక్కులు సంపాదించుకోగా.. భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టు దుబాయ్లో తమ మ్యాచ్లు ఆడనుంది. ఇక భారత్- పాకిస్తాన్ మధ్య ఫిబ్రవరి 23న మ్యాచ్ జరుగనుంది. ఈసారి.. టీమిండియా హాట్ ఫేవరెట్గా బరిలో దిగనుంది. చదవండి: CT 2025: ఏ జట్టునైనా ఓడిస్తాం.. చాంపియన్స్ ట్రోఫీ మాదే: బంగ్లాదేశ్ కెప్టెన్ -
PCB: మెంటార్లుగా ఆ ఐదుగురు.. షోయబ్ మాలిక్ సహా..
దేశవాళీ చాంపియన్స్ కప్ టోర్నీలో ఐదుగురు మాజీ క్రికెటర్లకు మెంటార్లుగా అవకాశం ఇచ్చినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. మిస్బా ఉల్ హక్, సక్లెయిన్ ముస్తాక్, వకార్ యూనిస్, షోయబ్ మాలిక్, సర్ఫరాజ్ అహ్మద్లతో ఇందుకు గానూ మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది. అయితే ఎవరు ఏ జట్టుకు మార్గనిర్దేశకుడిగా ఉంటారనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు.నవతరం ఆణిముత్యాలను గుర్తించేందుకుతొలుత వీరు చాంపియన్స్ వన్డే కప్ ద్వారా ఆయా జట్లకు మెంటార్లుగా తమ ప్రయాణం మొదలుపెడతారని తెలిపింది. ఈ విషయం గురించి పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ మాట్లాడుతూ.. ‘‘చాంపియన్స్కప్ టీమ్స్ మెంటార్లుగా ఐదుగురు చాంపియన్లను నియమించడం ఎంతో సంతోషంగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో అపార అనుభవం గడించి.. ఆట పట్ల అంకితభావం కలిగి ఉన్న వీరు.. నవతరం ఆణిముత్యాలను గుర్తించడంలో.. వారిని మెరికల్లా తీర్చిదిద్దడంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు సహకరిస్తారని విశ్వసిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.ప్రక్షాళనలో భాగంగా కొత్తగా మూడు టోర్నీలుఅంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్కు మధ్య వారధులుగా పనిచేస్తారని.. యువ క్రికెటర్ల నైపుణ్యాలకు సానపెట్టడంలో వీరు కీలక పాత్ర పోషించబోతున్నారని నక్వీ వెల్లడించారు. ఆట పరంగానే వ్యక్తిగతంగానూ యువ ఆటగాళ్లకు వీరు దిక్సూచిలుగా వ్యవహరిస్తారని తెలిపారు. కాగా నేషనల్ టీ20 కప్, ఖైద్- ఈ - ఆజం ట్రోఫీ, ప్రెసిడెంట్స్ ట్రోఫీ, ప్రెసిడెంట్స్ కప్, హెచ్బీఎల్ పాకిస్తాన్ సూపర్ లీగ్ వంటి డొమెస్టిక్ క్రికెట్ టోర్నీలు పాకిస్తాన్లో ఉన్నాయి.వీటికి అదనంగా మూడు కొత్త టోర్నమెంట్లను పీసీబీ ఇటీవల ప్రవేశపెట్టింది. పురుషుల క్రికెట్లో చాంపియన్స్ వన్డే కప్, చాంపియన్స్ టీ20 కప్, చాంపియన్స్ ఫస్ట్క్లాస్ కప్ పేరిట టోర్నీలు నిర్వహిస్తామని వెల్లడించింది. ఇందులో భాగంగా మొదట సెప్టెంబరు 12- 29 వరకు చాంపియన్స్ వన్డే కప్ నిర్వహించనుంది. ఇందులో టాప్ దేశవాళీ క్రికెటర్లతో పాటు సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్లు కూడా పాల్గొనున్నట్లు పీసీబీ తెలిపింది. ప్రతిభావంతులైన ఆటగాళ్లను వెలికి తీసి.. వారి నైపుణ్యాలకు మెరుగులు దిద్ది అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పీసీబీ ఈ టోర్నమెంట్లను ప్రవేశపెట్టింది.ఐదుగురు అనుభవజ్ఞులుపాక్ మాజీ బ్యాటర్, 52 ఏళ్ల వకార్ యూనిస్ ఇటీవల పీసీబీ సలహాదారుగా పనిచేశాడు. మరో మాజీ ఆటగాడు సక్లెయిన్ ముస్తాక్ పాక్ జాతీయ హెడ్కోచ్గా గతంలో సేవలు అందించాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, మాజీ బ్యాటర్ మిస్బా ఉల్ హక్, మాజీ ఆల్రౌండర్ షోయబ్ మాలిక్ ఐసీసీ ట్రోఫీలు గెలిచిన పాక్ జట్లలో సభ్యులుగా ఉన్నారు. ఇకపై మెంటార్లుగా వీరు కొత్త అవతారం ఎత్తనున్నారు. చదవండి: రోహిత్ కోసం మేమూ పోటీలో ఉంటాం: పంజాబ్ కింగ్స్ అధికారి -
మార్టిన్ గప్తిల్ వీరవిహారం.. 56 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో..
పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో క్వెట్టా గ్లాడియేటర్స్ 5 మ్యాచ్ల తర్వాత ఓ మ్యాచ్లో విజయం సాధించింది. ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడిన గ్లాడియేటర్స్.. 2 విజయాలు, 6 పరాజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. కరాచీ కింగ్స్తో నిన్న (మార్చి 6) జరిగిన మ్యాచ్లో గ్లాడియేటర్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ కింగ్స్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేయగా.. గ్లాడియేటర్స్ 19.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (56 బంతుల్లో 86; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయమైన అర్ధసెంచరీతో గ్లాడియేటర్స్ను విజయతీరాలకు చేర్చాడు. గప్తిల్కు మరో ఎండ్ నుంచి ఎవరి సపోర్ట్ లేనప్పటికీ, ఒంటరి పోరాటంచేసి తన జట్టును గెలిపించుకున్నాడు. గప్తిల్కు సర్ఫరాజ్ అహ్మద్ (29), మహ్మద్ నవాజ్ (15), డ్వేన్ ప్రిటోరియస్ (10 నాటౌట్) నుంచి ఓ మోస్తరు మద్దతు లభించింది. కరాచీ బౌలర్లలో తబ్రేజ్ షంషి 2 వికెట్లు పడగొట్టగా.. ఆమెర్ యామిన్, ముహ్మద్ మూసా, జేమ్స్ ఫుల్లర్ తలో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు కరాచీ ఇన్నింగ్స్లో రొస్సింగ్టన్ (45 బంతుల్లో 69; 10 ఫోర్లు, సిక్స్) హాఫ్ సెంచరీతో మెరవగా.. ఇమాద్ వసీం (30 నాటౌట్), ఆమెర్ యామిన్ (23 నాటౌట్) పర్వాలేదనిపించారు. గ్లాడియేటర్స్ బౌలర్లలో నసీం షా, ఐమల్ ఖాన్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ నవాజ్, నవీన్ ఉల్ హక్ చెరో వికెట్ దక్కించుకున్నారు. లీగ్లో భాగంగా ఇవాళ (మార్చి 7) డబుల్ హెడర్ మ్యాచ్లు జరుగనున్నాయి. మధ్యాహ్నం 2:30 గంటలకు పెషావర్ జల్మీ-లాహోర్ ఖలందర్స్ తలపడనుండగా.. సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్లో ఇస్లామాబాద్-ముల్తాన్ సుల్తాన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. -
సికందర్ రజా సునామీ ఇన్నింగ్స్.. వరుసగా నాలుగో విజయం
Pakistan Super League 2023: పాకిస్తాన్ సూపర్లీగ్-2023లో లాహోర్ ఖలండర్స్ వరుసగా నాలుగో విజయం సాధించింది. క్వెటా గ్లాడియేటర్స్ను ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. జింబాబ్వే ఆల్రౌండర్ సికందర్ రజా విధ్వంసకర ఇన్నింగ్స్తో జట్టుకు గెలుపు అందించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. లాహోర్లోని గడాఫీ స్టేడియంలో గురువారం రాత్రి లాహోర్ ఖలండర్స్, క్వెటా గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన క్వెటా గ్లాడియేటర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ సర్ఫరాజ్ నమ్మకాన్ని నిర్ణయానికి సార్థకత చేకూరుస్తూ.. క్వెటా బౌలర్లు అదరగొట్టారు. ఉమైద్ అసీఫ్ లాహోర్ ఓపెనర్లు మీర్జా బేగ్(2), ఫఖర్ జమాన్(రనౌట్)లను తక్కువ స్కోర్లకే పరిమితం చేసి శుభారంభం అందించాడు. ఇక వన్డౌన్ బ్యాటర్ షఫీక్ 15 పరుగులు చేయగా, వికెట్ కీపర్ సామ్ బిల్లింగ్స్ (2) పూర్తిగా నిరాశపరిచాడు. ఐదో స్థానంలో వచ్చిన హుసేన్ తలట్ కూడా కేవలం ఆరు పరుగులు చేసి నిష్క్రమించగా.. ఆరోస్థానంలో వచ్చిన కెప్టెన్ షాహిన్ ఆఫ్రిది 16 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇలా వరుస వికెట్లు కోల్పయి జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ సికందర్ రజా తన అద్భుత బ్యాటింగ్తో జట్టును ఆదుకున్నాడు. 34 బంతుల్లో 8ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 71 పరుగులతో తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచి లాహోర్ 148 పరుగుల మెరుగైన స్కోరు నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. క్వెటా బౌలర్లలో నసీం షా, ఓడియన్ స్మిత్, ఉమైద్ అసీఫ్ ఒక్కో వికెట్ తీయగా.. నవీన్ ఉల్ హక్, మహ్మద్ నవాజ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన క్వెటా గ్లాడియేటర్స్ను లాహోర్ బౌలర్లు హారిస్ రవూఫ్(3 వికెట్లు), రషీద్ ఖాన్(2 వికెట్లు) దెబ్బ కొట్టారు. వీరికి తోడు డేవిడ్ వీస్ ఒక వికెట్తో రాణించాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసిన క్వెటా గ్లాడియేటర్స్ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇప్పటి వరకు ఒకే ఒక్క గెలుపు నమోదు చేసిన క్వెటా గ్లాడియేటర్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. చదవండి: Ind Vs Aus 3rd Test: ఎట్టకేలకు బోణీ కొట్టిన ఆస్ట్రేలియా.. రోహిత్ సేనపై 9 వికెట్ల తేడాతో విజయం IND vs AUS: ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్.. చూస్తే వావ్ అనాల్సిందే! వీడియో వైరల్ View this post on Instagram A post shared by Pakistan Super League (@thepsl) -
Irani Cup 2023: స్టార్ క్రికెటర్కు దక్కని చోటు.. కారణం ఏంటంటే..?
ముంబై స్టార్ క్రికెటర్, అప్ కమింగ్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్కు దేశవాలీ ప్రతిష్టాత్మక టోర్నీ అయిన ఇరానీ కప్లో ఆడే అవకాశం లభించలేదు. మార్చి 1 నుంచి మధ్యప్రదేశ్తో జరగాల్సిన మ్యాచ్కు రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుకు సర్ఫరాజ్ సారధ్యం వహించాల్సి ఉండింది. అయితే చేతి వేలి ఫ్రాక్చర్ కారణంగా సెలెక్టర్లు సర్ఫరాజ్ పేరును పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తోంది. సర్ఫరాజ్ గైర్హాజరీలో మయాంక్ అగర్వాల్ రెస్ట్ ఆఫ్ ఇండియా పగ్గాలు చేపడతాడు. డీవై పాటిల్ టీ20 కప్ సందర్భంగా సర్ఫరాజ్కు గాయమైనట్లు సమాచారం. కాగా, సర్ఫరాజ్ గతకొంతకాలంగా జాతీయ జట్టులో చోటు ఆశిస్తున్న విషయం తెలిసిందే. ఇతను దేశవాలీ టోర్నీల్లో పరుగుల వరద పారిస్తున్నా.. సెలెక్టర్లు ప్రతిసారి మొండిచెయ్యే చూపిస్తున్నారు. సెంచరీలు, డబుల్ సెంచరీలు, ట్రిపుల్ సెంచరీలు సాధిస్తున్నప్పటికీ.. ఈ ముంబై ఆటగాడిపై సెలెక్టర్లు కనికరం చూపించడం లేదు. ఈ క్రమంలో సర్ఫరాజ్ ఒకానొక దశలో సహనం కోల్పోయి సెలెక్టర్లు, బీసీసీఐపై విరుచుకుపడ్డాడు. సెలక్టర్లు తనను మోసం చేశారంటూ వాపోయాడు. ఇదిలా ఉంటే, దేశవాలీ కెరీర్లో ఇప్పటివరకు 37 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన సర్ఫరాజ్ ఖాన్.. 79.65 సగటున 13 శతకాల సాయంతో 3505 పరుగులు చేశాడు. ఇటీవల ముగిసిన రంజీ సీజన్లో 6 మ్యాచ్లు ఆడిన సర్ఫరాజ్.. 92.66 సగటున 3 సెంచరీల సాయంతో 556 పరుగులు సాధించాడు. రెస్టాఫ్ ఇండియా : మయాంక్ అగర్వాల్, సుదీప్ కుమార్, యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, హర్విక్ దేశాయ్, ముఖేశ్ కుమార్, అతిత్ సేథ్, చేతన్ సకారియా, నవదీప్ సైనీ, ఉపేంద్ర యాదవ్ (వికెట్ కీపర్), మయాంక్ మార్ఖండే, సౌరభ్ కుమార్, ఆకాశ్ దీప్, బాబా ఇంద్రజీత్, పుల్కిత్ నారంగ్, యశ్ ధుల్ -
150 కి.మీ వేగంతో సూపర్ డెలివరీ.. దెబ్బకు కెప్టెన్ ఫ్యూజ్లు ఔట్!
పాకిస్తాన్ సూపర్ లీగ్లో భాగంగా బుధవారం క్వెట్టా గ్లాడియేటర్స్తో జరిగిన మ్యాచ్లో ముల్తాన్ సుల్తాన్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గ్లాడియేటర్స్.. ముల్తాన్ బౌలర్ల దాటికి కేవలం 110 పరుగులకే కుప్పకూలింది. ముల్తాన్ బౌలర్లలో పేసర్ ఇహ్సానుల్లా ఐదు వికెట్లతో గ్లాడియేటర్స్ విన్ను విరచగా.. సామీన్ గుల్, అబ్బాస్ అఫ్రిది తలా రెండు వికెట్లు సాధించారు. అదే విధంగా గ్లాడియటర్స్ బ్యాటర్లలో జాసన్ రాయ్ 27 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక 111 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముల్తాన్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే నష్టపోయి ఛేదించింది. ముల్తాన్ బ్యాటర్లలో రిలీ రుసౌ 78 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఇహ్సానుల్లా సూపర్ డెలివరీ.. ఇక ఈ మ్యాచ్లో ముల్తాన్ పేసర్ ఇహ్సానుల్లా సంచలన బంతితో మెరిశాడు. ఓ అద్భుతమైన బంతితో గ్లాడియేటర్స్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ను ఇహ్సానుల్లా క్లీన్ బౌల్డ్ చేశాడు. 150.3 కి.మీ వేగంతో వేసిన బంతికి సర్ఫరాజ్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. బంతి నేరుగా వెళ్లి స్టంప్సను గిరాటేసింది. దీంతో సర్ఫరాజ్ అహ్మద్ ఒక్కసారిగా బిత్తరపోయాడు. ఇక ఇహ్సానుల్లా దెబ్బకు సర్ఫరాజ్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో రెండో టెస్టు.. రాహుల్, సూర్యకుమార్కు నో ఛాన్స్! -
బాబర్ ఆజమ్పై వేటు, పాక్ కొత్త కెప్టెన్ ఎవరంటే..?
స్వదేశంలో వరుస పరాజయాల నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నాయకత్వ మార్పు చేయాలని డిసైడైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో కెప్టెన్గా ఉన్న బాబర్ ఆజమ్ను దించేసి, అతని స్థానంలో మిడిలార్డర్ బ్యాటర్ షాన్ మసూద్కు పట్టం కట్టేందుకు సర్వం సిద్ధమైనట్లు పాక్ మీడియాలో కధనాలు ప్రసారమవుతున్నాయి. మరోవైపు వెటరన్ వికెట్కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ను టెస్ట్ కెప్టెన్ చేస్తారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. వన్డే, టీ20ల్లో షాన్ మసూద్కు కెప్టెన్సీ అప్పగించినా.. టెస్ట్ల్లో మాత్రం సర్ఫరాజ్కు సారధ్య బాధ్యతలు అప్పజెప్పాలని పాక్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారట. ఈ విషయంపై నజీం నేథీ నేతృత్వంలోని పీసీబీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. పాక్ క్రికెట్ సర్కిల్స్లో మాత్రం రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పాక్ మాజీలు, ఆ దేశ క్రికెట్ విశ్లేషకులేమో మూడు ఫార్మాట్లలో ముగ్గురు వేర్వేరు కెప్టెన్ల ప్రతిపాదనను తెరపైకి తెచ్చారని సమాచారం. ఏదిఏమైనప్పటికీ పీసీబీ నుంచి అధికారిక ప్రకటన వెలువడేంత వరకు ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. కాగా, ఇటీవలి కాలంలో పాక్ స్వదేశంలో ఆడిన దాదాపు ప్రతి సిరీస్లో ఓటమిపాలైన విషయం తెలిసిందే. తాజాగా న్యూజిలాండ్తో ముగిసిన వన్డే సిరీస్లో 1-2 తేడాతో ఓటమిపాలైన పాక్.. అంతకుముందు అదే జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ను అతికష్టం మీద డ్రా చేసుకోగలిగింది. అంతకుముందు ఇంగ్లండ్ చేతిలో 0-3 తేడాతో వైట్ వాష్ అయిన పాక్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23లో భాగంగా స్వదేశంలో జరిగిన ఒక్క మ్యాచ్లోనూ విజయం సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలోనే పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్పై వేటు అంశం తెరపైకి వచ్చింది. ఇదిలా ఉంటే, పీసీబీ కొద్దికాలం క్రితమే బోర్డు ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. తొలుత అధ్యక్షుడు రమీజ్ రజాపై వేటు వేసి నజీం సేథికి బాధ్యతలు అప్పగించిన పీసీబీ.. ఇటీవలే షాహిద్ అఫ్రిదిని జాతీయ సెలెక్షన్ కమిటీ చైర్మన్గా నియమించింది. -
సర్ఫరాజ్ అహ్మద్ సెంచరీ.. ‘చేసింది చాలు.. ఇక నాటకాలు ఆపు!’
సర్ఫరాజ్ అహ్మద్ (35).. దాదాపు నాలుగేళ్ల తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్ ద్వారా జట్టులోకి వచ్చాడు. మూడో టెస్టులో అద్భుత శతకం సాధించిన ఈ పాక్ మాజీ కెప్టెన్పై నెటిజన్ల ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్లలో 86, 53 పరుగులు చేసిన సర్ఫరాజ్.. చివరిదైన రెండో టెస్టులోనూ గొప్ప ప్రదర్శన చేశాడు. తొలి ఇన్నింగ్స్లో 78 పరుగులు, రెండో ఇన్సింగ్స్లో 118 (176 బంతులు, 9 ఫోర్లు, 1 సిక్స్) పరుగులు చేసి పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. దీంతో పాక్ 0-0తో రెండో టెస్టును, సిరీస్ను కాపాడుకోగలిగింది. ఇక సిరీస్లో 335 పరుగులు చేసిన ఈ సీనియర్ వికెట్ కీపర్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గెలుచుకోవడం విశేషం. ఈ క్రమంలో జట్టు సభ్యులు, పాక్ క్రికెట్ అభిమానుల అభినందనలు వెల్లువెత్తాయి. సెంచరీ అనంతరం పాక్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం, ఓపెనర్ ఇమాముల్ హక్, ఇతర సభ్యులు సర్ఫరాజ్కు స్టాండింగ్ ఓవేషన్ కూడా ఇచ్చారు. కెరీర్ ముగిసిపోతుందనుకున్న సమయంలో జట్టులోకి రావడం, అద్భుతంగా రాణించి సెంచరీ కూడా చేయడంతో సర్ఫరాజ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అతని భార్య కన్నీరు పెట్టుకుంది. ఈక్రమంలో సోషల్ మీడియాలో ఓ నెటిజన్ పెట్టిన పోస్టు వైరల్గా మారింది. ‘జట్టుకు కెప్టెన్గా ఎన్నో సేవలందించిన ఆటగాడిని మీ చెత్త రాజకీయాలకు బలిచేశారు. నాలుగేళ్లుగా జట్టుకు దూరం పెట్టి.. వాటర్మాన్లాగా మార్చి ఘోరంగా అవమానించారు. సర్ఫరాజ్ కుటుంబం కన్నీటికి కారణమయ్యారు. ఇప్పుడు యాక్షన్లోకి దిగి తుప్పు రేగ్గొట్టేసరికి శభాష్! అంటూ కీర్తిస్తున్నారు. నాటకాలు ఆపు. ఇక చాలు!’ అంటూ స్టాండింగ్ ఓవేషన్ ఫోటో షేర్ చేసి బాబర్ను ఉద్దేశించి ట్వీట్ చేశాడు. (చదవండి: శివమ్ మావి కళ్లు చెదిరే క్యాచ్.. హార్దిక్ షాకింగ్ రియాక్షన్ వైరల్) ట్విస్టు ఏంటంటే? అయితే, సదరు నెటిజన్ చేసిన ట్వీట్ ఒక ఎత్తయితే, ఆ పోస్టును సర్ఫరాజ్ లైక్ చేశాడు. దీంతో అప్పటికే వైరల్గా మారిన ట్వీట్.. ఈ దెబ్బతో హాట్ టాపిక్ అయింది. అయితే, బాబర్ అభిమానులు కొందరు ఈ చర్యను తప్పుబట్టారు. అపార్థాలతో అనర్థమేనని కామెంట్లు చేశారు. దీంతో సర్ఫరాజ్ తన పొరపాటును తెలుసుకుని ఆ ట్వీట్కు లైక్ను తొలగించాడు. ఇదిలాఉండగా 2019, జనవరిలో సర్ఫరాజ్ తన చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. అదే ఏడాది ఇంగ్లండ్లో జరిగిన వన్డే ప్రపంచకప్లో పాక్ నిష్క్రమణ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. (చదవండి: నేను గనుక సూర్యకి బౌలింగ్ చేసే ఉంటేనా: హార్దిక్ పాండ్యా) KAPTAAANNNNN https://t.co/tciugffgf5 pic.twitter.com/u8aetEUx83 — Outsider. (@shayaannn) January 7, 2023 -
నీ కెరీర్ ముగిసిపోయిందన్నాడు కదా! రమీజ్ రాజాకు సర్ఫరాజ్ కౌంటర్!
Pakistan vs New Zealand, 2nd Test: ‘‘షాహిద్ భాయ్ చీఫ్ సెలక్టర్గా బాధ్యతలు చేపట్టగానే నన్ను పిలిచి.. నువ్వు ఈ మ్యాచ్ ఆడుబోతున్నావు అని చెప్పాడు. ప్రాక్టీసు చేస్తున్న సమయంలో బాబర్ ఆజం కూడా ఇదే మాట అన్నాడు. నేను షాహిద్ భాయ్తో గతంలో ఆడాను.. తనకు నా గురించి తెలుసు’’ అని పాకిస్తాన్ బ్యాటర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నాడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత న్యూజిలాండ్తో సొంతగడ్డపై టెస్టు సిరీస్తో పునరాగమనం చేశాడు సర్ఫరాజ్. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్గా రమీజ్ రాజా స్థానంలో నజీమ్ సేతీ నియామకంతో పాటు చీఫ్ సెలక్టర్గా మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది ఎంపికైన తర్వాత జరిగిన తొలి సిరీస్ ఇది. నిరూపించుకున్నాడు ఈ క్రమంలో వైస్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్పై వేటు వేసి 35 ఏళ్ల సర్ఫరాజ్కు ఆడే అవకాశం ఇవ్వడంతో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, సర్ఫరాజ్ మాత్రం తనకు ఇచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. మొదటి టెస్టులో రెండు ఇన్నింగ్స్లో అర్ధ శతకాలు (86, 53) బాదిన ఈ వికెట్ కీపర్.. రెండో మ్యాచ్లో అద్భుత సెంచరీతో(78, 118) మెరిశాడు. ఈ రెండు మ్యాచ్లలో పాక్ను గట్టెక్కించి ఓటమి నుంచి తప్పించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో రమీజ్ రాజా గతంలో చేసిన వ్యాఖ్యలపై సర్ఫరాజ్కు ప్రశ్న ఎదురైంది. కివీస్తో రెండో టెస్టు ముగిసిన తర్వాత మీడియా సమావేశంలో.. ‘‘ఆటగాడిగా నీ కెరీర్ ముగిసిపోయిందని రమీజ్ రాజా అన్నాడు. అయితే, వచ్చీ రాగానే.. డేరింగ్ సెలక్టర్ షాహిద్ ఆఫ్రిది నీకు ఛాన్స్ ఇచ్చాడు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు సర్ఫరాజ్’’ అని విలేకరులు ప్రశ్నించారు. ఇందుకు బదులుగా.. రమీజ్ రాజా పేరు ప్రస్తావించకుండానే.. ‘‘దేశవాళీ క్రికెట్లో రాణించాను. సరైన వ్యక్తుల మార్గదర్శనం, మీడియా ప్రోత్సాహం.. నా కుటుంబం, శ్రేయోభిలాషుల మద్దతుతో ఇక్కడి దాకా వచ్చాను’’ అని సర్ఫరాజ్ అహ్మద్ చెప్పుకొచ్చాడు. రమీజ్ రాజా తన గురించి మాట్లాడిన మాటలకు ఆటతోనే సమాధానం చెప్పానని పరోక్షంగా కౌంటర్ ఇచ్చాడు. షాహిద్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని చెప్పుకొచ్చాడు. ఆఖరి వరకు ఉత్కంఠ పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు ఉత్కంఠభరిత మలుపులు తిరిగి చివరకు ‘డ్రా’గా ముగిసింది. ఒక దశలో పాక్ ఓటమి ఖాయమనిపించి, ఆపై గెలుపు అవకాశం చిక్కినా వాడుకోలేకపోగా... పేలవ బౌలింగ్తో చివరకు కివీస్ ‘డ్రా’తో సంతృప్తి పడాల్సి వచ్చింది. 319 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్నైట్ స్కోరు 0/2తో ఆట కొనసాగించిన పాక్ శుక్రవారం మ్యాచ్ ముగిసే సమయానికి 90 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. సర్ఫరాజ్ అహ్మద్ (176 బంతుల్లో 118; 9 ఫోర్లు, 1 సిక్స్) వీరోచిత సెంచరీ సాధించగా...షాన్ మసూద్ (35), సౌద్ షకీల్ (32), ఆగా సల్మాన్ (30) అండగా నిలిచారు. ఒక దశలో 80 పరుగుల వద్దే పాక్ 5 వికెట్లు కోల్పోయింది. అయితే సర్ఫరాజ్, షకీల్ ఆరో వికెట్కు 123 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. సల్మాన్తో కూడా సర్ఫరాజ్ వేగంగా 70 పరుగులు జత చేశాడు. చివరి 15 ఓవర్లలో 70 పరుగులు చేయాల్సి ఉండగా... తక్కువ వ్యవధిలో 3 వికెట్లు తీసి న్యూజిలాండ్ విజయంపై గురి పెట్టింది. అయితే 32 పరుగులు చేయాల్సిన స్థితిలో సర్ఫరాజ్ 9వ వికెట్గా వెనుదిరిగాడు. చివరి వికెట్ తీస్తే కివీస్ గెలుపు అందుకునే అవకాశం ఉండగా...చివరి జోడి నసీమ్ షా (15 నాటౌట్), అబ్రార్ (7 నాటౌట్) వికెట్ పడకుండా 21 బంతులు జాగ్రత్తగా ఆడారు. మిగిలిన 3 ఓవర్లలో పాక్కు 15 పరుగులు అవసరం కాగా... వెలుతురు మందగించడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. దాంతో రెండు టెస్టుల సిరీస్ 0–0తో డ్రాగా ముగిసింది. చదవండి: ఆసీస్ కెప్టెన్ సంచలన నిర్ణయం.. డబుల్ సెంచరీ పూర్తి కాకుండానే ఇన్నింగ్స్ డిక్లేర్ Ind VS SL 3rd T20: భారీ స్కోర్లు గ్యారంటీ! అతడికి ఉద్వాసన.. రుతురాజ్ ఎంట్రీ! Sarfaraz Ahmed’s press conference following the drawn Test in Karachi.#PAKvNZ | #TayyariKiwiHai https://t.co/oSRFkM3L2k — Pakistan Cricket (@TheRealPCB) January 6, 2023 -
ఎనిమిదేళ్ల తర్వాత తొలి సెంచరీ.. పాక్ ఆటగాడి సెలబ్రేషన్స్ మాములుగా లేవుగా!
నాలుగేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అదరగొడుతున్నాడు. కివీస్తో స్వదేశంలో జరిగిన మొదటి టెస్టులో 86 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన సర్ఫరాజ్ అహ్మద్.. తాజాగా రెండో టెస్టులో కూడా అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. రెండో ఇన్నింగ్స్లో సర్ఫరాజ్ 118 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కాగా ఇది సర్ఫరాజ్కు ఎనిమిదేళ్ల తర్వాత తొలి టెస్టు సెంచరీ కావడం విశేషం. ఇక సెంచరీ సాధించిన వెంటనే సర్ఫరాజ్ భావోద్వేగానికి లోనయ్యాడు. గాల్లోకి ఎగురుతూ, గ్రౌండ్కు పంచ్ చేస్తూ తన సెంచరీ సెలబ్రేషన్స్ జరపుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ట్విటర్లో షేర్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే రెండో టెస్టు కూడా డ్రాగా ముగిసింది. దీంతో రెండు టెస్టుల సిరీస్ కూడా డ్రాగా ముగిసింది. 319 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ విజయానికి 15 పరుగులు అవరసమవ్వగా.. వెలుతురులేమి కారణంగా ఆఖరి రోజు ఆటను అంపైర్లు నిలిపివేశారు. రెండో ఇన్నింగ్స్లో పాక్ 9 వికెట్లు కోల్పోయి 304 పరుగులు చేసింది. అయితే న్యూజిలాండ్ కూడా తమ విజయానికి కేవలం ఒక్క వికెట్ దూరంలో నిలిచింది. This moment 💚 Sarfaraz delivers on his home ground 👏#PAKvNZ | #TayyariKiwiHai pic.twitter.com/LoIPI9HrcG — Pakistan Cricket (@TheRealPCB) January 6, 2023 చదవండి: Rishabh Pant: బ్రదర్ అంటూ వార్నర్ భావోద్వేగం.. ఫొటో వైరల్ -
సౌద్ షకీల్ శతకం.. కివీస్కు ధీటుగా బదులిస్తున్న పాక్
PAK VS NZ 2nd Test 3rd Day: కరాచీ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో పాకిస్తాన్ ధీటుగా బదులిస్తుంది. సౌద్ షకీల్ (336 బంతుల్లో 124 నాటౌట్; 17 ఫోర్లు) టెస్ట్ల్లో తన తొలి శతకంతో రెచ్చిపోవడంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిధ్య జట్టు తమ తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 407 పరుగులు చేసింది. షకీల్కు జతగా ఇమామ్ ఉల్ హాక్ (83), వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ (78) అర్ధసెంచరీలతో రాణించగా.. ఆఘా సల్మాన్ (41) పర్వాలేదనిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్ 3 వికెట్లు పడగొట్టగా.. ఇష్ సోధీ 2, టిమ్ సౌథీ, మ్యాట్ హెన్రీ, డారిల్ మిచెల్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అంతకుముందు న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 449 పరుగులకు ఆలౌటైంది. డెవాన్ కాన్వే (122) సెంచరీతో చెలరేగగా.. టామ్ లాథమ్ (71), టామ్ బ్లండల్ (51), మ్యాట్ హెన్రీ (68) అర్ధశతకాలతో రాణించారు. పాక్ బౌలర్లలో అబ్రార్ అహ్మద్ 4 వికెట్లతో సత్తా చాటగా.. నసీమ్ షా, అఘా సల్మాన్ 3 వికెట్లతో రాణించారు. కాగా, సప్పగా సాగుతున్న ఈ రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో తొలి మ్యాచ్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. దీనికి ముందు ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ కోసం బౌలర్లకు అనుకూలమైన పిచ్లు తయారు చేశారని విమర్శలు ఎదుర్కొన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. వరుస పరాభవాలను తప్పించుకునేందుకు ఈ సిరీస్ కోసం నిర్జీవమైన పిచ్లు తయారు చేసింది. ఇంగ్లండ్ చేతిలో పాక్ 0-3 తేడాతో వైట్వాష్ అయిన విషయం తెలిసిందే. -
క్రికెట్ రూల్స్ బ్రేక్ చేసిన మహ్మద్ రిజ్వాన్..
పాకిస్తాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ ఐసీసీ రూల్స్ బ్రేక్ చేశాడు. న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య మొదలైన తొలి టెస్టు మూడోరోజు ఆటలో ఇది చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. జ్వరం కారణంగా బాబర్ ఆజం మూడోరోజు మైదానంలోకి రాలేదు. దీంతో బాబర్ ఆజం స్థానంలో స్టాండిన్ కెప్టెన్గా సీనియర్ ప్లేయర్ సర్ఫరాజ్ అహ్మద్ వ్యవహరించాడు. ఇక బాబర్ స్థానంలో మహ్మద్ రిజ్వాన్ సబ్స్టిట్యూట్ ప్లేయర్గా అడుగుపెట్టాడు. మ్యాచ్లో పలుసార్లు ఆటగాళ్లను ఫీల్డింగ్ మారుస్తూ కెప్టెన్గా వ్యవహరించడం వివాదానికి దారి తీసింది.. ప్రస్తుతం మహ్మద్ రిజ్వాన్ టెస్టుల్లో వైస్కెప్టెన్గా ఉన్నప్పటికి కివీస్తో తొలి టెస్టుకు రిజ్వాన్ స్థానంలో సీనియర్ సర్ఫరాజ్ అహ్మద్ జట్టులోకి వచ్చాడు. అతనే వికెట్ కీపింగ్ బాధ్యతలతో పాటు స్టాండిన్ కెప్టెన్సీ తీసుకున్నాడు. సబ్స్టిట్యూట్ ప్లేయర్గా అడుగుపెట్టి కాసేపు స్టాండింగ్ కెప్టెన్గా వ్యవహరించి రిజ్వాన్ చర్య నిబంధనలకు విరుద్ధం. వాస్తవానికి క్రికెట్లో చట్టాలు తెచ్చే ఎంసీసీ(మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్) రూల్స్ ఏం చెబతున్నాయంటే.. మ్యాచ్లో సబ్స్టిట్యూట్ ప్లేయర్గా వచ్చిన ఏ ఆటగాడైనా సరే కెప్టెన్సీ లేదా బౌలింగ్ చేయకూడదన్న నిబంధన ఉంది. అయితే అంపైర్ అనుమతితో వికెట్ కీపింగ్ చేసే అవకాశం మాత్రం ఉంటుంది(అదీ అంపైర్ అనుమతి ఇస్తేనే). ఇక క్రికెట్ పుస్తకాల్లో ఎంసీసీ పేర్కొన్న రూల్ 24.1.2 కూడా ఇదే చెబుతుంది. అయితే ఈ నిబంధనను రిజ్వాన్తో పాటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గాలికొదిలేసినట్లు కనిపించింది. ఇదే విషయమై సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. పీసీబీ కావాలనే నిబంధనను గాలికొదిలేసిందా లేక మరిచిపోయిందా అనేది ఆసక్తికరంగా మారింది. ఆ తర్వాత కాసేపటికే డెవన్ కాన్వే రివ్యూ విషయంలో కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ డీఆర్ఎస్కు వెళ్లాడు. అయితే రివ్యూకు వెళ్లడానికి ముందు రిజ్వాన్తో చర్చించి డీఆర్ఎస్కు అప్పీల్ చేయడం కన్ఫూజన్కు గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఆ రివ్యూ పాక్కు ఫలితం తెచ్చిపెట్టడంతో ఈ విషయం పెద్దగా వెలుగులోకి రాలేదు. ఇక తొలి టెస్టులో న్యూజిలాండ్ పాక్ జట్టుకు ధీటుగా బదులిస్తుంది. బాబర్ ఆజం, అగా సల్మాన్లు సెంచరీలతో చెలరేగడంతో పాకిస్తాన్ తమ తొలి ఇన్నింగ్స్లో 438 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ చేస్తున్న న్యూజిలాండ్ 4 వికెట్ల నష్టానికి 408 పరుగులతో ఆడుతుంది. కేన్ విలియమ్సన్ 85 పరుగులతో , టామ్ బ్లండెల్ 41 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు డెవన్ కాన్వే 92 పరుగులు చేసి ఔటయ్యాడు. Rewarded for the tight lines maintained this morning ☝️ Excellent review 👏#PAKvNZ | #TayyariKiwiHai pic.twitter.com/jejexv1v7n — Pakistan Cricket (@TheRealPCB) December 28, 2022 చదవండి: ధోని కూతురుకు మెస్సీ అరుదైన కానుక అందుకే అత్యుత్సాహం పనికి రాదంటారు.. -
'రీఎంట్రీ కదా.. హార్ట్బీట్ కొలిస్తే మీటర్ పగిలేదేమో!'
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు. తన ఎంపిక సరైనదేనని చాటుతూ రీఎంట్రీ మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నాడు. కివీస్తో స్వదేశంలో జరుగుతున్న మొదటి టెస్టులో అతను 86 పరుగులు చేశాడు. అయితే క్రీజులో ఉన్నప్పుడు తన గుండె చాలా వేగంగా కొట్టుకుందని అతను అన్నాడు. ''నేను మొదటి మూడు బంతులు ఎదుర్కొన్నప్పుడు నా గుండె ఎంతో వేగంగా కొట్టుకుందంటే.. ఆ సమయంలో నా హార్ట్బీట్ను కొలిస్తే, ఆ మీటర్ పగిలిపోయి ఉండేదేమో’ అని అతను మ్యాచ్ అనంతరం సరదాగా వ్యాఖ్యానించాడు. ‘నా గుండె చాలా వేగంగా కొట్టుకుంది. ఇదేమి నాకు తొలి టెస్టు మ్యాచ్ కాదు. అయినా సరే ఎందుకో చాలా టెన్షన్గా అనిపించింది. బాబర్ మాట్లాడడంతో నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. నాకు చాలా రోజుల తర్వాత అవకాశం వచ్చింది. నా ఇన్నింగ్స్ జట్టు విజయానికి తోడ్పడుతుందని అనుకుంటున్నా'' అని సర్ఫరాజ్ అన్నాడు. వికెట్ కీపర్ అయిన సర్ఫరాజ్ దాదాపు నాలుగేళ్ల తర్వాత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. పాక్ క్రికెట్ బోర్డు మహమ్మద్ రిజ్వాన్ స్థానంలో సర్ఫరాజ్ను ఎంపిక చేసింది. కెప్టెన్ బాబర్తో కలిసి ఐదో వికెట్కు 196 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. పాకిస్థాన్ భారీ స్కోర్కు బాటలు వేసిన సర్ఫరాజ్ సెంచరీ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. 153 బంతుల్లో 86 రన్స్ చేసిన అతను ఎజాజ్ పటేల్ వేసిన 86వ ఓవర్లో అవుటయ్యాడు. ఇక సర్ఫరాజ్ అహ్మద్ పాకిస్తాన్ తరపున 49 టెస్టులు, 117 వన్డేలు, 61 టి20 మ్యాచ్లు ఆడాడు. చదవండి: సివిల్స్ క్లియర్ చేసిన టీమిండియా క్రికెటర్ ఎవరో తెలుసా? అంతర్జాతీయ క్రికెట్కు సీనియర్ ఆల్రౌండర్ గుడ్బై -
Pak Vs NZ: బాబర్ ఆజం అజేయ శతకం, సత్తా చాటిన సర్ఫరాజ్
Pakistan vs New Zealand, 1st Test Day 1: సొంతగడ్డపై ఇటీవలే ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్ జట్టుకు న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో మెరుగైన ఆరంభం లభించింది. సోమవారం ప్రారంభమైన తొలి టెస్టులో ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్లో పాక్ 5 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (277 బంతుల్లో 161 నాటౌట్; 15 ఫోర్లు, 1 సిక్స్) అజేయ శతకం సాధించగా, దాదాపు నాలుగేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడిన వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ (153 బంతుల్లో ) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బాబర్కు టెస్టుల్లో ఇది 9వ సెంచరీ. ఒక దశలో పాకిస్తాన్ స్కోరు 110/4 కాగా...ఐదో వికెట్కు 196 పరుగులు జోడించి బాబర్, సర్ఫరాజ్ ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. కివీస్ బౌలర్లలో బ్రేస్వెల్, ఎజాజ్ పటేల్ చెరో 2 వికెట్లు తీశారు. కాగా వైస్ కెప్టెన్ రిజ్వాన్ను కాదని సర్ఫరాజ్ అహ్మద్కు తుది జట్టులో చోటు ఇవ్వడంపై చీఫ్ సెలక్టర్ షాహిద్ ఆఫ్రిదిపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడు ఈ మేరకు విలువైన ఇన్నింగ్స్ ఆడి సత్తా చాటడం విశేషం. చదవండి: IPL 2023: అన్న త్యాగం వల్లే ఇలా కోటీశ్వరుడిగా.. నాన్నను మిస్ అవుతున్నా! వాళ్లతో కలిసి ఆడతా Suryakumar Yadav: సీక్రెట్ రివీల్ చేసిన సూర్యకుమార్.. వాళ్ల వల్లే ఇలా! కేకేఆర్ నుంచి మారిన తర్వాతే Pak VS NZ: కివీస్తో పాక్ మ్యాచ్.. 145 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి Performing on his Test return 🙌 🗣️ @SarfarazA_54 opens up about his comeback and the remarkable partnership with @babarazam258 #PAKvNZ | #TayyariKiwiHai pic.twitter.com/GdhPg8drZP — Pakistan Cricket (@TheRealPCB) December 26, 2022 -
17 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్తో టెస్టు సిరీస్.. పాక్ సీనియర్ ఆటగాడు ఎంట్రీ!
టీ20 ప్రపంచకప్-2022 రన్నరప్గా నిలిచిన పాకిస్తాన్ జట్టు.. ఇప్పుడు స్వదేశంలో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో తలపడేందుకు సిద్దమైంది. ఈ హోం సిరీస్లో భాగంగా పాకిస్తాన్ ఇంగ్లండ్తో మూడు టెస్టులు ఆడనుంది. కాగా 17 ఏళ్ల తర్వాత తొలిసారిగా పాకిస్తాన్ వేదికగా ఇంగ్లండ్ జట్టు బాబర్ సేనతో టెస్టుల్లో తలపడనుంది. ఇక ఈ చారిత్రాత్మక టెస్టు సిరీస్కు 18 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ సోమవారం ప్రకటించింది. ఈ జట్టుకు బాబర్ ఆజం సారథ్యం వహించనున్నాడు. ఇక గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న వెటరన్ ఆటగాడు సర్ఫరాజ్ అహ్మద్కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. సర్ఫరాజ్ చివరిసారిగా 2019లో పాకిస్తాన్ తరపున టెస్టుల్లో ఆడాడు. అదే విధంగా స్టార్ పేసర్ షాహీన్ షా ఆఫ్రిది గాయం కారణంగా దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో స్పీడ్స్టర్ హారీస్ రౌఫ్ టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు. ఇక డిసెంబర్1న రావల్పిండి వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇంగ్లండ్తో టెస్టులకు పాక్ జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, అజర్ అలీ, ఫహీమ్ అష్రఫ్, హరీస్ రవూఫ్, ఇమామ్-ఉల్-హక్, మహ్మద్ అలీ, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, నౌమాన్ అలీ, సల్మాన్ అలీ అఘా, సర్ఫరాజ్ అహ్మద్, సౌద్ షకీల్, షాన్ మసూద్, జాహిద్ మెహమూద్ 🚨 Our 18-player squad for the three-Test series against England 🚨#PAKvENG pic.twitter.com/NOXoTMPYDx — Pakistan Cricket (@TheRealPCB) November 21, 2022 చదవండి: Ind Vs Ban: టీమిండియా అంటే ఆ మాత్రం ఉండాలి! వాళ్లు రాణిస్తేనే..! కనీసం 300 స్కోరు చేసి -
‘భారత్తో మ్యాచ్లో కచ్చితంగా పాకిస్తాన్దే విజయం! ఎందుకంటే.. మాకు’
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న భారత్- పాకిస్తాన్ మ్యాచ్కు కౌంట్డౌన్ ప్రారంభమైంది. ఆసియా కప్-2022లో భాగంగా టీమిండియా తమ తొలి మ్యాచ్లో ఆగస్టు 28న దుబాయ్ వేదికగా పాక్తో తలపడనుంది. గతేడాది టీ20 ప్రపంచకప్లో ఇదే వేదికలో పాక్ చేతిలో ఓటమి చెందిన భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. కాగా దాయాదుల పోరుకు ఇంకా సమయం ఉన్నప్పటికీ మాజీలు, క్రికెట్ నిపుణులు విజేతను ముందుగానే అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ కోవలో పాక్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కూడా చేరాడు. ఈ హైవోల్టేజ్ మ్యాచ్లో భారత్పై పాక్ మళ్లీ విజయం సాధిస్తుందని అహ్మద్ జోస్యం చెప్పాడు. భారత్పై మాదే మళ్లీ విజయం ! అహ్మద్ స్పోర్ట్స్ పాక్ టీవీతో మాట్లాడుతూ.. "మెగా టోర్నీల్లో ఏ జట్టు అయినా తమ తొలి మ్యాచ్ను విజయంతో ఆరంభించాలని భావిస్తుంది. ఆసియాకప్లో భాగంగా మా జట్టు తొలి మ్యాచ్లో భారత్ను ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్లో మేము పూర్తి విశ్వాసంతో బరిలోకి దిగుతున్నాము. ఎందుకంటే మేము గతేడాది ఇదే వేదికపై భారత్ను మట్టికరిపించాం. యూఏఈలో పరిస్ధితులు పాకిస్తాన్కు బాగా తెలుసు. గతంలో మేము ఇక్కడ పాకిస్తాన్ సూపర్ లీగ్తో పాటు అనేక ద్వైపాక్షిక సిరీస్లు కూడా ఆడాము. కాబట్టి ఈ మ్యాచ్లో కచ్చితంగా విజయం సాధిస్తాం. ఇక భారత ఆటగాళ్లకు కూడా ఇక్కడ ఐపీఎల్లో ఆడిన అనుభవం ఉంది. కానీ వాళ్ల కంటే యూఏఈ పిచ్లపై ఆడిన అనుభవం మాకే ఎక్కువ ఉంది" అని పేర్కొన్నాడు. ఇక ఈ వ్యాఖ్యలపై స్పందించిన భారత అభిమానులు ‘‘అంతలేదు.. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దులే. జట్టులో చోటే లేదు కానీ.. ప్రగల్భాలు పలుకుతున్నావా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా గత కొంత కాలంగా సర్ఫరాజ్ అహ్మద్కు జాతీయ జట్టులో చోటు దక్కడం లేదు. అతడు చివరగా పాక్ తరపున 2021 నవంబర్లో బంగ్లాదేశ్పై ఆడాడు. తొలి మ్యాచ్లో ఆఫ్గానిస్తాన్-శ్రీలంక ఢీ ఇక ఆసియాకప్-2022 యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి దుబాయ్ వేదికగా ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో ఆఫ్గానిస్తాన్- శ్రీలంక తలపడనున్నాయి. ఇక ఈ టోర్నీలో మెత్తం ఆరు జట్లు పాల్గొననున్నాయి. ఇప్పటికే భారత్,పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ అర్హత సాధించగా.. ఇక మరో స్థానం కోసం క్వాలిఫియంగ్ రౌండ్లో యూఏఈ, కువైట్, సింగపూర్, హాంకాంగ్ తలపడనున్నాయి. అదే విధంగా ఈ టోర్నీ కోసం ఇప్పటికే భారత్,పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్తాన్ తమ జట్లను ప్రకటించాయి. చదవండి: IND vs PAK: మ్యాచ్కు 15 రోజులుంది.. అప్పుడే జోస్యం చెప్పిన పాంటింగ్ -
కొడుకు బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయిన క్రికెటర్.. వీడియో వైరల్
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ సర్ఫరాజ్ అహ్మద్ తన ఐదేళ్ల కొడుకు బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విషయంలోకి వెళితే.. సర్ఫరాజ్ అహ్మద్ తన కొడుకు ఐదేళ్ల జూనియర్ సర్ఫరాజ్తో కలిసి ఒక గల్లీ క్రికెట్లో పాల్గొన్నాడు. తాను సరదాగా బ్యాటింగ్ చేయగా.. కొడుకు బౌలింగ్ చేశాడు. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ కొడుకు ఒక పర్ఫెక్ట్ యార్కర్ సంధించగా.. సర్ఫరాజ్ అహ్మద్ క్లీన్బౌల్డ్ అయ్యాడు. తన కుమారుడివైపు ఒక లుక్ ఇచ్చిన సర్ఫరాజ్ చిరునవ్వుతో తన కొడుకును మెచ్చుకున్నాడు. ఐదేళ్ల అబ్దుల్లా(సర్పారజ్ అహ్మద్ కొడుకు) ఇప్పటికే లోకల్ క్రికెట్ అకాడమీలో క్రికెటర్గా రూపుదిద్దుకుంటున్నాడు. కాగా గతంలో ఇక్కడి రాజకీయాలతో విసిగిపోయానని.. అది క్రికెట్కు కూడా పాకిందని.. తన కుమారుడిని ఎట్టి పరిస్థితుల్లో క్రికెటర్ను కానివ్వను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరి తాజాగా తనను క్లీన్బౌల్డ్ చేసిన కుమారుడిని భవిష్యత్తులో స్టార్ క్రికెటర్గా మారుస్తాడేమో చూడాలి. ఇక సర్ఫరాజ్ అహ్మద్కు పాకిస్తాన్ టీంలో అంతగా అవకాశాలు రావడం లేదు. దీనికి ఒక కారణం ఉంది. వికెట్ కీపర్ అయిన సర్ఫరాజ్ అహ్మద్ మంచి బ్యాటర్ కూడా. అయితే మహ్మద్ రిజ్వాన్ రూపంలో పాక్కు మంచి యంగ్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ దొరికాడు. ప్రస్తుతం రిజ్వాన్ అన్ని ఫార్మాట్లలోనూ కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. దీంతో సర్ఫరాజ్ అహ్మద్కు అవకాశాలు సన్నగిల్లాయి. సర్ఫరాజ్ చివరిసారి పాక్ తరపున 2021 ఏప్రిల్లో సౌతాఫ్రికాతో ఆడాడు. ఇక సర్ఫరాజ్ అహ్మద్ పాకిస్తాన్కు కెప్టెన్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అతని కెప్టెన్సీలోనే పాకిస్తాన్ 2017లో ఐసీసీ చాంపియన్స్ ట్రోపీ గెలుచుకుంది. ఆ టోర్నీ ఫైనల్లో టీమిండియాను ఓడించిన పాకిస్తాన్ ట్రోపీని దక్కించుకుంది. ఇక సర్ఫరాజ్ అహ్మద్ పాకిస్తాన్ తరపున 49 టెస్టుల్లో 2657 పరుగులు, 117 వన్డేల్లో 2315 పరుగులు, 61 టి20ల్లో 818 పరుగులు సాధించాడు. Shabash Beta Abba ki he wicket he ura di 👏👏🔥 @SarfarazA_54 pic.twitter.com/rpvdxcNUVv — Thakur (@hassam_sajjad) June 20, 2022 చదవండి: Cheteshwar Pujara: 'ఆ క్రికెటర్ యువ ఆటగాళ్లకు ఒక గుణపాఠం.. చూసి నేర్చుకొండి' కామెంటరీ ప్యానెల్ ఇదే.. మరో క్రికెట్ జట్టును తలపిస్తుందిగా! -
పాకిస్తాన్ టి20 జట్టులో మూడు మార్పులు.. ఆ ముగ్గురికి చోటు
3 Players Added In Pakistan T20 Worldcup Team.. టి20 ప్రపంచకప్ 2021 ప్రారంభానికి ముందు పాకిస్తాన్ తన జట్టులో మూడు మార్పులు చేసింది. టాప్ ఆర్డర్ బ్యాటర్ ఫఖర్ జమాన్, వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్, మిడిలార్డర్ బ్యాటర్ హైదర్ అలీ జట్టులోకి వచ్చారు. కాగా ముందు ప్రకటించిన జట్టులో సర్ఫరాజ్తో హైదర్ అలీకి చోటు లేదు. అజమ్ ఖాన్, మహ్మద్ హస్నైన్ల స్థానంలో వీరిద్దరు చోటు దక్కించుకోగా.. ఇక ట్రావెల్ రిజర్వ్ ప్లేయర్గా ఉన్న ఫఖర్ జమాన్ను కుష్దిల్ షా స్థానంలో జట్టులోకి ఎంపిక చేశారు. తాజాగా జరిగిన నేషనల్ టి20 కప్లో ప్రదర్శన ఆధారంగా ఈ ముగ్గురిని తుది జట్టులోకి తీసుకున్నట్లు చీఫ్ సెలెక్టర్ ముహముద్ వసీమ్ పేర్కొన్నారు. ''ఈ ముగ్గురు నేషనల్ టి20 కప్లో ఆకట్టుకున్నారు. వాళ్ల అనుభవం ప్రస్తుతం జట్టుకు ఎంతో అవసరం. వీరు చేరడం వల్ల జట్టుకు మరింత బలం చేకూరుతుంది. ఇక అజమ్ ఖాన్, కుష్దిల్ షా, హస్నైన్లకు భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయి.'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు జరగనున్న టి20 ప్రపంచకప్ టోర్నీలో పాకిస్తాన్ తన తొలి మ్యాచ్ను టీమిండియాతో అక్టోబర్ 24న ఆడనుంది. టి20 ప్రపంచకప్ పాకిస్తాన్ 15మందితో కూడిన జట్టు బాబర్ అజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, మహ్మద్ హఫీజ్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మొహమ్మద్ వసీం జూనియర్, సర్ఫరాజ్ అహ్మద్, షహీన్ షా అఫ్రిది, సోహైబ్ మక్సూద్ రిజర్వ్ ఆటగాళ్లు- కుష్దిల్ షా, షానవాజ్ దహాని, ఉస్మాన్ ఖాదిర్ -
వాళ్లిద్దరి కెప్టెన్సీ ఒకేలా ఉంటుంది.. ఆ విషయంలో ధోనీ స్టైల్ వేరు
కరాచీ: జట్టును ముందుండి నడిపించడంలో పాక్ మాజీ సారధి సర్ఫరాజ్ అహ్మద్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్టైల్ ఒకేలా ఉంటుందని దక్షిణాఫ్రికా మాజీ సారథి ఫాఫ్ డుప్లెసిస్ అభిప్రాయపడ్డాడు. అయితే, ఈ విషయంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ స్టైల్ వాళ్లిద్దరికి పూర్తి భిన్నంగా ఉంటుందని ఆయన పేర్కొన్నాడు. జూన్ 9 నుంచి ప్రారంభంకానున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో పాల్గొనేందుకు పాక్ చేరుకున్న డుప్లెసిస్.. శనివారం పాక్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. పీఎస్ఎల్లో సర్ఫరాజ్ సారథ్యంలోని క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున ఆడుతున్న డుప్లెసిస్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ధోనీ, సర్ఫరాజ్ల కెప్టెన్సీలను పోల్చే క్రమంలో కోహ్లీ సారథ్యం గురించి ఆయన మాట్లాడుతూ.. సర్ఫరాజ్ కూడా కోహ్లీలాగే మైదానంలో దూకుడుగా ఉంటాడని, ప్రతి ఒక్క ఆటగాడితో క్రమం తప్పకుండా మాట్లాడి వాళ్ల అభిప్రాయాలు తెలుసుకుంటాడని, ముఖ్యంగా బౌలర్లతో ప్రతి బంతికి ముందు, తర్వాత సంభాషిస్తాడని పేర్కొన్నాడు. ఈ విషయంలో ధోనీ స్టైల్ డిఫరెంట్గా ఉంటుందని, ఆయన మైదానంలో కూల్గా, రిజర్వ్డ్గా ఉంటాడని, సందర్భానుసారంగా నిర్ణయాలు తీసుకోవడంలో ధోనీ తరవాతే ఎవరైనా అని డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు. అయితే జట్టును నడిపించడంలో ఎవరి శైలి వారికుంటుందని, ఈ విషయంలో ఒకరితో ఒకరిని పోల్చలేమని ఆయన పేర్కొన్నాడు. వ్యక్తిగతంగా తనకు వివిధ కెప్టెన్లతో కలిసి ఆడాలని ఉంటుందని, వాళ్లంతా తమ జట్లను ఎలా నడిపిస్తారో చూడాలని ఉంటుందని ఈ దక్షిణాఫ్రికా మాజీ సారథి తెలిపాడు. తనకు మొదటి నుంచి కెప్టెన్సీ అంటే మక్కువని, దక్షిణాఫ్రికా జట్టుకు సారధ్యం వహించడం ద్వారా తన కల నెరవేరిందని వెల్లడించాడు. సర్ఫరాజ్ సారథ్యంలో ఆడటాన్ని ఆస్వాధిస్తానని, అవసరమైతే అతనికి సలహాలు, సూచనలు చేస్తానని తెలిపాడు. ఐపీఎల్ 14వ సీజన్లో సీఎస్కే తరఫున ఆడిన ఫాఫ్.. 7 మ్యాచ్ల్లో 320 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ధసెంచరీలు ఉన్నాయి. అయితే భారత్లో కరోనా కేసులు అధికమవడం కారణంగా ఐపీఎల్ అర్ధంతరంగా రద్దు కావడంతో మిగిలిన మ్యాచ్లను యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. చదవండి: అశ్విన్ ఆల్టైమ్ గ్రేట్ స్పిన్నర్ అంటే ఒప్పుకోను.. -
పాక్ సీనియర్ ఆటగాళ్లపై వేటు
కరాచీ: కొంత కాలంగా పేలవ ఫామ్తో జట్టుకు భారంగా తయారైన పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ సారథులు షోయబ్ మాలిక్, సర్ఫరాజ్ అహ్మద్లతోపాటు పేసర్ మొహ్మమ్మద్ అమీర్పై వేటు పడింది. జింబాబ్వేతో ఆరంభమయ్యే వన్డే, టి20 సిరీస్ల కోసం 22 మందితో కూడిన ప్రాబబుల్స్ జట్టులో వీరికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చోటు కల్పించలేదు. అయితే ఇటీవల ముగిసిన దేశవాళీ టి20 లీగ్ నేషనల్ టి20 కప్లో రాణించిన సెంట్రల్ పంజాబ్ జట్టు యువ ఆటగాడు అబ్దుల్లా షఫీక్కు మొదటిసారి సీనియర్ జట్టులో స్థానం లభించింది. గాయాల నుంచి పూర్తిగా కోలుకోని పేస్ ద్వయం హసన్ అలీ, నసీమ్ షా పేర్లను పరిగణనలోకి తీసుకోలేదు. కెప్టెన్గా బాబర్ ఆజమ్ను నియమించిన పీసీబీ... వైస్ కెప్టెన్గా షాదాబ్ ఖాన్ను నియమించింది. పాక్, జింబాబ్వే మధ్య తొలి వన్డే ఈనెల 30న జరగనుండగా... నవంబర్ 1, 3వ తేదీల్లో మిగిలిన రెండు వన్డేలు జరుగుతాయి. అనంతరం నవంబర్ 7, 8, 10వ తేదీల్లో మూడు టి20లు జరుగుతాయి. మా వీసాల అంశాన్ని ఐసీసీ చూస్తుంది భారత్లో ఆడేందుకు తలెత్తే వీసా ఇబ్బందులను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చూసుకుంటుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తెలిపింది. వచ్చే ఏడాది అక్టోబర్లో భారత్లో టి20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో తమ ఆటగాళ్లు, సహాయక సిబ్బంది వీసాల బాధ్యత పూర్తిగా ఐసీసీదేనని పీసీబీ సీఈఓ వసీమ్ ఖాన్ తెలిపారు. ఐసీసీ ఈ అంశంపై తమకు హామీ ఇవ్వాలని ఆయన చెప్పారు. అయితే దేనికైనా నిర్దిష్ట గడువు అంటూ ఉండాలని వచ్చే జనవరిదాకా ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని ఐసీసీని కోరినట్లు చెప్పారు. చిరకాల ప్రత్యర్థుల మధ్య సమీప భవిష్యత్తులో ముఖాముఖి టోర్నీలు జరుగుతాయన్న ఆశలేవీ లేవని ఆయన చెప్పారు. -
సర్ఫరాజ్ ఈజ్ బ్యాక్
కరాచీ: గతేడాది జరిగిన అండర్-19 వరల్డ్కప్లో సత్తాచాటిన పాకిస్తాన్ యువ బ్యాట్స్మన్ హైదర్ అలీ అంతర్జాతీయ అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. ఆగస్టులో ఇంగ్లండ్ గడ్డపై జరుగనున్న ద్వైపాక్షిక సిరీస్కు సంబంధించి పాకిస్తాన్ జట్టులో హైదర్ అలీ చోటు దక్కించుకున్నాడు. ఇక నాలుగేళ్ల తర్వాత పాకిస్తాన్ జట్టులో సొహైల్ ఖాన్కు అవకాశం దక్కింది. మరొకవైపు గతేడాది అక్టోబర్లో పాక్ తరఫున చివరిసారి కనిపించిన మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ రీఎంట్రీ ఖాయమైంది. ఇంగ్లండ్కు వెళ్లే 29 మందితో కూడిన పాక్ జట్టులో సర్ఫరాజ్కు సెలక్టర్లు అవకాశం కల్పించారు. (ఇక మా పని అయిపోయినట్లే: ఇషాంత్) ఇక పాకిస్తాన్ బ్యాకప్ వికెట్ కీపర్గా మహ్మద్ రిజ్వాన్ను ఎంపిక చేశారు. అటు టెస్టు క్రికెట్కు ఇటు పరిమిత ఓవర్ల క్రికెట్కు ఒకేసారి పీసీబీ సెలక్టర్లు జట్టును ప్రకటించారు.గత పీసీబీ కాంట్రాక్ట్ను కోల్పోయిన పేసర్ వహాబ్ రియాజ్కు మరొకసారి అవకాశం ఇచ్చారు. కాగా, మహ్మద్ అమిర్, హారిస్ సొహైల్లు ఇంగ్లండ్ పర్యటనకు దూరం కానున్నారు. అమిర్ భార్య ఆగస్టులో ప్రసవించే అవకాశం ఉండటంతో అతను ఇంగ్లండ్ పర్యటన నుంచి వైదొలిగాడు. టెస్టు ఫార్మాట్కు గుడ్ బై చెప్పి, కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రమే కొనసాగుతున్న అమిర్.. పీసీబీ అనుమతితో ఇంగ్లండ్ పర్యటన నుంచి వైదొలిగాడు.(‘సొహైల్.. నా రక్తం మరిగేలా చేశాడు’) -
సర్ఫరాజ్కు డిమోషన్..!
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్లో ఒక వెలుగు వెలిగిన మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ క్రమేపీ తన ఉనికిని కోల్పోతున్నాడు. గతేడాది నవంబర్లో అటు కెప్టెన్గా, ఇటు ఆటగాడిగా మూడు ఫార్మాట్ల నుంచి తొలగించబడ్డ సర్ఫరాజ్.. తాజాగా మరింత కిందకి పడిపోయినట్లు తెలుస్తోంది. 2020-21 సీజన్కు సంబంధించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి విడుదల చేయడానికి సిద్ధంగా ఉ్నన కొత్త కాంట్రాక్ట్ జాబితాలో సర్ఫరాజ్కు సి కేటగిరీ కేటాయించినట్లు తెలుస్తోంది.. గతంలో కెప్టెన్గా చేసిన సమయంలో ‘ ఏ’ కేటగిరీలో ఉన్న సర్ఫరాజ్కు ‘సి’తో సరిపెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. గతేడాది ఆగస్టులో 19 క్రికెటర్లకు మాత్రమే సెంట్రల్ కాంట్రాక్ట్లో చోటు కల్పించిన సంగతి తెలిసిందే. అప్పటివరకూ 32 మందికి చోటు కల్పిస్తూ వచ్చిన పీసీబీ వారిని 19కి కుదించింది. తాజాగా వారికే తిరిగా చోటు కల్పించడానికి సిద్ధమైన పీసీబీ.. 2017 చాంపియన్స్ ట్రోఫీ కెప్టెన్ అయిన సర్ఫరాజ్కు ‘సి’తో సరిపెడితే చాలని భావిస్తోంది. ('పాంటింగ్ గెలుపు కోసం చూస్తాడు.. ధోని మాత్రం') గతంలో సర్పరాజ్ అహ్మద్ కెప్టెన్గా ఉన్న సమయంలో ‘ఎ’ కేటగిరీని దక్కించుకున్నాడు. బాబర్ అజామ్, యాసిర్ షాలతో కలిసి సర్ఫరాజ్ కొంతకాలం ‘ఎ’ కాంట్రాక్ట్ విభాగంలో కొనసాగాడు. ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ జట్టులో సభ్యుడిగా లేని సర్ఫరాజ్ను తిరిగి మళ్లీ జట్టులోకి తీసుకోవాలనే ఉద్దేశంతోనే అతనికి ‘సి’ కేటాగిరీ కేటాయించినట్లు పీసీబీ వర్గాల సమాచారం. అదే సమయంలో ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో కోత విధించడానికి కూడా పీసీబీ సిద్ధమైంది. ప్రస్తుత పీసీబీ నిబంధనల ప్రకారం ’ఏ’ కేటగిరీలో ఉన్న ఆటగాడికి టెస్టు మ్యాచ్ ఫీజు రూ. 7, 62,300 ఉండగా, బి కేటగిరీలో ఉన్న ఆటగాడికి రూ. 6,65,280 గా ఉంది. ఇక సి కేటగిరీలో క్రికెటర్లకు రూ. 5, 68, 260 గా ఉంది. గతేడాది చివర్లో శ్రీలంకతో జరిగిన స్వదేశీ సిరీస్ తర్వాత సర్ఫరాజ్ మళ్లీ పాకిస్తాన్ తరఫున ఆడలేదు. ఇంగ్లండ్ వేదికగా జరిగిన గత వన్డే వరల్డ్కప్లో పాకిస్తాన్ నాకౌట్ స్టేజ్కు వెళ్లకుండానే నిష్క్రమించింది. దానిలో భాగంగా ప్రక్షాళన చేపట్టిన పీసీబీ.. ముందుగా కెప్టెన్ సర్ఫరాజ్ను కోచ్ మికీ ఆర్థర్లకు ఉద్వాసన పలికింది. సర్ఫరాజ్ను కెప్టెన్గా తొలగించినా ఆటగాడిగా మాత్రం ఉంచింది. అయితే కెప్టెన్సీ భారం తగ్గినా సర్ఫరాజ్ ఆటలో మార్పు రాకపోవడంతో అతన్ని ఆటగాడిగా తప్పించింది. మళ్లీ సర్ఫరాజ్కు చోటు కల్పించాలనే ఉద్దేశంతో ఉన్న పీసీబీ.. కనీసం సి కేటగిరిలో ఉంచినట్లు సమాచారం.(ధావన్ ఒక ఇడియట్.. స్ట్రైక్ తీసుకోనన్నాడు..!) -
సర్ఫరాజ్కు పీసీబీ షాక్!
కరాచీ: గత కొంతకాలంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టులో చోటు కోల్పోయినప్పటికీ వన్డే కెప్టెన్సీ హోదాలో మాత్రం కొనసాగుతూ వస్తున్నాడు సర్ఫరాజ్ అహ్మద్. గతేడాది అక్టోబర్లో సర్ఫరాజ్ను టెస్టు కెప్టెన్సీ, టీ20 కెప్టెన్సీ పదవుల నుంచి తొలగించిన పీసీబీ.. అజహర్ అలీకీ టెస్టు కెప్టెన్ పదవి కట్టబెట్టగా, బాబర్ అజామ్కు టీ20 సారథ్య బాధ్యతలను అప్పగించింది. అయితే పాకిస్తాన్కు వన్డే సిరీస్లు లేకపోవడంతో అప్పట్లో ఆ ఫార్మాట్ కెప్టెన్గా సర్ఫరాజ్నే కొనసాగిస్తున్నామని పీసీబీ పేర్కొంది. అయితే ఏప్రిల్లో బంగ్లాదేశ్తో ఏకైక వన్డే జరుగుతుండటంతో సర్ఫరాజ్కు మొత్తంగా ఉద్వాసన పలకాలనే యోచనలో ఉంది పీసీబీ. ప్లేయర్గా కూడా ఆ మ్యాచ్లో సర్ఫరాజ్ చోటు ఇవ్వడానికి సుముఖంగా లేని పీసీబీ సెలక్టర్లు.. ఇప్పుడు కెప్టెన్గా ఎవర్ని చేయాలనే దానిపై కసరత్తులు చేస్తున్నారు. (ఇక్కడ చదవండి: సర్ఫరాజ్ ఇక దేశవాళీ ఆడుకో: ఇమ్రాన్) ఈ రేసులో ముందు వరుసలో ఉన్న పేరు బాబర్ అజామ్. టీ20 ఫార్మాట్కు కెప్టెన్గా ఉన్న అజామ్నే వన్డే ఫార్మాట్కు కూడా కెప్టెన్గా చేయాలని పీసీబీ ఇప్పటికే ప్రణాళికలు చేసింది. అయితే సర్ఫరాజ్ను పక్కకు పెడుతున్నారనే వార్తల నేపథ్యంలో విమర్శలు మొదలయ్యాయి. గతేడాది వరుసగా ఆరు వన్డే మ్యాచ్ల్లో విజయాలు అందించిన సర్ఫరాజ్కు ఉద్వాసన చెప్పడం మంచి నిర్ణయం కాదని ఆ దేశీ మాజీలు అంటున్నారు. 2017లో సర్ఫరాజ్ నేతృత్వంలోని పాకిస్తాన్ చాంపియన్స్ ట్రోఫీ గెలవడమే కాకుండా అతనే నేతృత్వంలోని టీ20 ర్యాంకింగ్స్లో పాక్ టాప్కు చేరుకుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇది సర్ఫరాజ్కు జరిగిన నష్టంగానే చూడాలని పాకిస్తాన్ మాజీ చీఫ్ సెలక్టర్ మొహిసిన్ ఖాన్ తెలిపారు. అతను కీపర్ అనే అంశాన్ని పరిగణలోకి తీసుకుని మాత్రమే ప్లేయర్గా అన్యాయం చేస్తున్నారన్నాడు. -
ఎక్సైజ్శాఖ డైరెక్టర్గా సర్ఫరాజ్ అహ్మద్
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్కు ప్రభుత్వం కీలకమైన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ పదవిని కట్టబెట్టింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి సోమేశ్కుమార్ ఇప్పటివరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్గా అదనపు బాధ్యతలు చూస్తుండగా, ఆయన్ను తప్పించి ఆ విభాగాన్ని సర్ఫరాజ్కు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మూడేళ్ల పాటు కరీంనగర్ జిల్లా కలెక్టర్గా పనిచేసిన సర్ఫరాజ్ ఇటీవల వార్తల్లో నిలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల వ్యయం విషయంలో తనకు వ్యతిరేకంగా సర్ఫరాజ్ బీజే పీ ఎంపీ బండి సంజయ్తో కలసి కుట్ర చేశారని జిల్లా మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. దీనిపై ఆయన సీఎం కేసీఆర్కు ఫిర్యాదు చేశా రు. ఈ వివాదం తర్వాత సర్ఫరాజ్కు కీలకమైన ఎక్సై జ్ శాఖ పోస్టు లభించడం గమనార్హం. రెవెన్యూ కార్యదర్శిగా ‘బుసాని’ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం అదనపు డైరెక్టర్ జనరల్ బుసాని వెంకటేశ్వర్లు ను రెవెన్యూ శాఖ (విపత్తుల నిర్వహణ) కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది. వెయిటింగ్లో ఉన్న ఎ.అశోక్ను డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం అదనపు డైరెక్టర్ జనరల్గా బదిలీ చేసింది. జోగులాంబ–గద్వాల జిల్లా కలెక్టర్ కె.శశాంక కరీంనగర్ జిల్లా కలెక్టర్గా బదిలీ అయ్యారు. వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతికి జోగులాంబ–గద్వాల జిల్లా కలెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. -
సర్ఫరాజ్ ఇక దేశవాళీ ఆడుకో: ఇమ్రాన్
కరాచీ: ఈ ఏడాది జరిగిన వన్డే వరల్డ్కప్లో పాకిస్తాన్ నాకౌట్కు చేరుకుండా నిష్క్రమించడంతో ఆ మెగాటోర్నీలో ఆ దేశ కెప్టెన్గా వ్యవహరించిన సర్ఫారాజ్ అహ్మద్పై తీవ్ర విమర్శల వర్షం కురిసింది. ఇటీవల సర్ఫరాజ్ను టెస్టు, టీ20 ఫార్మాట్ల నుంచి కెప్టెన్గా తొలగిస్తూ పీసీబీ నిర్ణయం కూడా తీసుకుంది. మరొకవైపు ఆసీస్తో జరిగిన మూడు టీ20ల సిరీస్లో కూడా సర్ఫరాజ్కు అవకాశం దక్కలేదు. దీన్ని ఉదహరిస్తూనే సర్పరాజ్ అహ్మద్ను దేశవాళీ క్రికెట్ ఆడుకోమంటూ ఆ దేశ ప్రధాని, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ సలహా ఇచ్చారు.వరల్డ్కప్లో పాక్ పేలవ ప్రదర్శన తర్వాత తమ క్రికెట్ జట్టు ఎలా ఉండాలో తానే నిర్దేస్తానంటూ ఇమ్రాన్ ఆ సమయంలోనే పేర్కొన్నాడు. ఇప్పుడు అదే పనిలో ఇమ్రాన్ నిమగ్నమయ్యారు. ముందుగా సర్ఫరాజ్ రోడ్ మ్యాప్ ఎలా ఉండాలో ఇమ్రాన్ సూచించాడు. జాతీయ జట్టులో కొనసాగుతున్నప్పటికీ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోతున్న సర్పరాజ్ను ముందుగా దేశవాళీ మ్యాచ్లు ఆడమంటూ ఇమ్రాన్ హితబోధ చేశారు.‘ ఇక సర్ఫరాజ్ దేశవాళీ మ్యాచ్లపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. టీ20 ప్రదర్శన ఆధారంగా ఒక ఆటగాడి ఫామ్ను అంచనా వేయలేం. టెస్టు క్రికెట్ కానీ, వన్డే క్రికెట్లో కానీ ఒక ఆటగాడి ప్రదర్శన బయటకు వస్తుంది. ముందుగా సర్ఫరాజ్ దేశవాళీ క్రికెట్పై ఫోకస్ చేయాలి. జాతీయ జట్టులోకి రావాలంటే దేశవాళీ మ్యాచ్ల్లో ఉత్తమ ప్రదర్శన అవసరం. నువ్వు ఘనంగా పాకిస్తాన్ జట్టులోకి రీ ఎంట్రీ ఇస్తావనే అనుకుంటున్నా’ అని ఇమ్రాన్ పేర్కొన్నారు.ఇక పాకిస్తాన్ ప్రధాన కోచ్గా చీఫ్ సెలక్టర్గా ఎంపికైన మిస్బావుల్ హక్పై ఇమ్రాన్ ప్రశంసలు కురిపించారు. పాకిస్తాన్ క్రికెట్ కోచ్గా మిస్బావుల్ అన్ని విధాలుగా అర్హుడని పేర్కొన్నారు. అతనొక అత్యుత్తమ ఆటగాడు కావడంతో ప్రస్తుత జట్టులోని ఆటగాళ్ల ప్రదర్శనకు కూడా మెరుగవుతుందన్నారు. -
కలెక్టర్తో బండి సంజయ్ ఫోన్కాల్.. వైరల్!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ చేతిలో ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి, ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్తో జరిపిన సంభాషణ దాదాపు ఏడాది తరువాత రచ్చకెక్కింది. ఆ ఎన్నికల్లో కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా కమలాకర్ పరిమితికి మించి ఖర్చు చేశారని కోర్టును ఆశ్రయించిన సంజయ్.. కలెక్టర్ సహకారం కోరినట్లుగా లీకైన ఆడియోలో ఉంది. కలెక్టర్ స్పష్టత లేని తెలుగులో మాట్లాడగా, సంజయ్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్కు కృతజ్ఞతలు తెలిపేందుకే ఎక్కువ సమయం కేటాయించారు. గంగుల పరిమితికి మించి ఎన్నికల్లో ఖర్చు చేసిన అంశం, దానికి సంబంధించిన పత్రాల సమర్పణ వంటి విషయాలే చర్చకు వచ్చినట్లుగా ఉంది. టేప్లో 1.30 నిమిషాల సంభాషణ ఉంది. ఈ లీకైన ఆడియో టేపుపై మంత్రి గంగుల కమలాకర్ తీవ్రంగా స్పందించారు. తనను ఎన్నికల్లో ఓడించేందుకు మొదట కుట్ర చేశారని, అది సాధ్యం కాకపోవడంతో గెలిచిన తరువాత డిస్క్వాలిఫై చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. బండి సంజయ్ కలెక్టర్తో కలసి కుట్ర చేశారని ఆరోపించారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న కలెక్టర్ తనపై ఓడిపోయిన అభ్యర్థికి సహకరించే విధంగా ఫోన్లో మాట్లాడటాన్ని తప్పు పట్టారు. ఈ ఆడియో టేపుపై ముఖ్యమంత్రి కేసీఆర్కు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. కాగా టీఆర్ఎస్ అభ్యర్థి కమలాకర్ పరిమితికి మించి ఎన్నికల్లో ఖర్చు చేశారని కోర్టును ఆశ్రయించినట్లు బండి సంజయ్ ‘సాక్షి’కి చెప్పారు. ఈ అంశం కోర్టులో ఉన్నందున లీకైన ఆడియో టేప్ గురించి తానేమీ మాట్లాడనని స్పష్టం చేశారు. సంజయ్తో జరిగిన సంభాషణకు లీకైన ఆడియో టేప్కు సంబంధం లేదని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ స్పష్టం చేశారు. ఎనిమిది నిమిషాల తమ సంభాషణను కటింగ్, మిక్సింగ్ ద్వారా 1.30 నిమిషాలకు కుదించి వైరల్ చేశారని ఆయన పేర్కొన్నారు. ఒరిజినల్ ఆడియో టేప్ను ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు. మల్లికార్జున్ ఫోన్ నుంచే ఆడియో లీక్? కలెక్టర్, ఎంపీ మధ్య జరిగిన సంభాషణ చర్చనీయాంశంగా మారింది. సంజయ్ వాడే ఫోన్లో వాట్సాప్గానీ, వాయిస్ రికార్డర్ ఆప్షన్ గానీ ఉండదు. కలెక్టర్ ఫోన్ నుంచి ఆడియో లీకయ్యే అవకాశం లేదు. దీనిపై విచారిస్తే .. ఫోన్ సంభాషణలో కలెక్టర్ మాట్లాడుతూ ‘మీ నంబర్ నాకు మెసేజ్ చేస్తే సేవ్ చేస్తా.. వాట్సాప్ పంపిస్తా’అని చెప్పగా, తనకు వాట్సా ప్ లేదని సంజయ్ చెప్పారు. దాంతో కలెక్టర్ ‘నేను మల్లికార్జున్కు చేస్తా. ఆయన మీకు చూపిస్తారు’అని అంటారు. దీన్ని బట్టి సంజయ్.. మల్లికార్జున్ అనే వ్యక్తి ఫోన్ నుంచి మాట్లాడినట్లు స్పష్టమవుతోంది. మల్లికార్జున్ ప్రస్తుతం ఓ పత్రికకు మేనేజర్గా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక పత్రిక (ప్రస్తుతం మూతపడింది)కు విలేకరిగా వ్యవహరించారు. ఆయన ఫోన్ నుంచే సంజయ్ మాట్లాడినట్లు స్పష్టమవుతోంది. ఈ విషయాన్ని కలెక్టర్ ‘సాక్షి’ తో మాట్లాడుతూ ధ్రువీకరించారు. తానెవరి ఫోన్ నుంచి కలెక్టర్తో మాట్లాడలేదని, తన ఫోన్తోనే మాట్లాడినట్లు సంజయ్ ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. కలెక్టర్ తన విధులను అపహాస్యం చేశారు: గంగుల ఎంపీ బండి సంజయ్, కలెక్టర్ సర్ఫరాజ్ల మధ్య ఫోన్ సంభాషణపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. కొంతమంది అధికారులు, నాయకులు కలసి తనను ఓడించేందుకు ప్రయత్నించారన్నారు. ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని, రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న కలెక్టర్ ప్రభుత్వ ఆంతరంగిక అంశాలను బయట వ్యక్తులకు చెప్పడం సరికాదన్నారు. కుట్రలు, కుతంత్రాల మధ్య ఎంపీ సంజయ్ ఉన్నారని..ప్రజల మధ్య తానున్నానని స్పష్టం చేశారు. ఈ ఆడియో వంద ప్రశ్నలకు సమాధానం చెప్తుందని, ప్రజా దీవెనలు లేకపోతే ఎప్పుడో బలయ్యే వాడినన్నారు. ఎన్నికల అధికారిగా ఉన్న కలెక్టర్ లీకులకు పాల్పడితే ప్రజలకు ప్రజాస్వా మ్యం మీద నమ్మకం పోతుందన్నారు. అది 8 నిమిషాల సంభాషణ: కలెక్టర్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి, ఫలితాలు విడుదలైన 2018 డిసెంబర్ 11 తరువాత బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన బండి సంజయ్ నాతో మాట్లాడారు. సంజయ్ వేరే వ్యక్తి ఫోన్ నుంచి 8 నిమిషాలు మాట్లాడారు. అప్పుడు గెలిచిన కమలాకర్ సమర్పించే ఎన్నికల ఖర్చును తగ్గించడానికి ఎవరైనా ప్రయత్నిస్తారేమోనని సంజయ్ అనుమానం వ్యక్తం చేస్తే, అలాంటిదేమీ ఉండదని ఎవరూ ఏమీ చేయలేరని చెప్పాను. చాలా విషయాలపై సంజయ్ మాట్లాడితే, రిటర్నింగ్ అధికారిగా ఆయన అనుమానాలు నివృత్తి చేశాను. రాజ్యాంగబద్ధ హోదాలో దానికి కట్టుబడే మాట్లాడాను. నేను సంజయ్తో ఎనిమిది నిమిషాలు మాట్లాడగా, లీకైనట్లు చెపుతున్న ఆడియో కాల్ 1.30 నిమిషాలే ఉంది. ఎనిమిది నిమిషాల కాల్లో కట్, పేస్ట్ విధానం ద్వారా ఎవరో వాళ్లకు అవసరమైన సంభాషణను మిక్స్ చేసి ఆడియోగా రూపొందించి, వైరల్ చేశారు. గతంలోనే నాకు ఒకరు 8 నిమిషాల ఆడియో టేప్ పంపించారు. అది ప్రభుత్వానికి సమర్పిస్తా. మీడియాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. తాను సంజయ్తో కలసి కుట్ర చేశానని మంత్రి గంగుల వ్యాఖ్యానించడం బాధాకరమని, ఆ ఆడియో టేపులో సంజయ్ను ఫోన్ నంబర్ పంపించమని చెప్పడం స్పష్టంగా తెలుస్తుందని, ఫోన్ నంబరే లేని వ్యక్తితో కలసి కుట్రలు ఎలా పన్నుతానని చెప్పారు. -
మిస్బా.. నీ ‘ఆట’లు సాగవ్!
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ జట్టు టెస్టు, టీ20 కెప్టెన్సీ పదవి నుంచి సర్ఫరాజ్ అహ్మద్ను తప్పించడంపై ఆ దేశ మాజీ కెప్టెన్, మాజీ వికెట్ కీపర్ మొయిన్ ఖాన్ తీవ్రంగా ధ్వజమెత్తాడు. సర్ఫరాజ్ను రెండు ఫార్మాట్ల నుంచి సారథిగా తొలగించడానికి ప్రధాన కారణంగా కొత్తగా కోచ్గా వచ్చిన మిస్బావుల్ హక్ కారణమని విమర్శించాడు. పాకిస్తాన్ క్రికెట్లో ఏదో అద్భుతాలు చేయాలని చూస్తున్న మిస్బా.. సింగిల్గా ఏమీ సాధించలేడని విషయం తెలుసుకోవాలన్నాడు. ‘ పాకిస్తాన్ క్రికెట్లో మిస్బా ఒక శక్తిగా ఎదగాలనుకుంటన్నాడు. అదే పని చేయదనే విషయాన్ని గ్రహించు. అసలు సర్ఫరాజ్ను కెప్టెన్గా ఎందుకు తీసేయాల్సి వచ్చింది. టీ20 క్రికెట్లో పాకిస్తాన్కు 11 వరుస సిరీస్లు అందించిన సర్ఫరాజ్ను సారథిగా ఎలా తప్పిస్తారు. మిస్బాతో వకార్ యూనస్కు సర్ఫరాజ్ అంటే ఎప్పుడూ ఇష్టం ఉండదు. వారి వారి వ్యక్తిగత కారణాలతోనే సర్ఫరాజ్ను తొలగించారు. నువ్వు పాకిస్తాన్ క్రికెట్లో అత్యంత శక్తిమంతుడిగా ఎదగాలనుకుంటున్నావ్. కానీ సింగిల్ అది వర్క్ ఔట్ కాదు’ అని విమర్శించాడు. ఇటీవల పాకిస్తాన్ టెస్టు, టీ20 క్రికెట్ సారథిగా సర్ఫరాజ్ను తప్పించి అజహర్ అలీ, బాబర్ అజామ్లకు ఆ బాధ్యతలు అప్పగించారు. కేవలం వన్డే కెప్టెన్సీకి మాత్రమే సర్ఫరాజ్ను పరిమితం చేశారు. దాంతో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సర్ఫరాజ్ అహ్మద్ను తప్పించడాన్ని సమర్థిస్తే, మరికొందరు మాత్రం పీసీబీ చర్యలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కాస్తా పంజాబ్ క్రికెట్ బోర్డు అయ్యిందంటూ విమర్శిస్తున్నారు. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంతానికి చెందిన మిస్బా-వకార్లు తమ స్థానికత కోసం కృషి చేస్తున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు. అజహర్ అలీ కూడా పంజాబ్ ప్రాంతానికి చెందిన వాడే కావడంతో మిస్బాపై విరుచుకుపడుతున్నారు., -
పీసీబీ.. పంజాబ్ క్రికెట్ బోర్డు అయ్యింది!
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ జట్టు టెస్టు, టీ20 కెప్టెన్గా సర్ఫరాజ్ అహ్మద్ను తప్పించడంపై ఆ దేశ క్రికెట్ ఫ్యాన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్లో ఓవరాల్గా జట్టు మొత్తం విఫలమైతే సర్ఫరాజ్ను బలి పశువును చేశారంటూ మండిపడుతున్నారు. అసలు సర్ఫరాజ్ నుంచి అజహర్ అలీకి టెస్టు పగ్గాలు అప్పచెప్పడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గత కొన్ని మ్యాచ్లను చూస్తే అజహర్ అలీ పూర్తిగా విఫలమయ్యాడనే విషయాన్ని పీసీబీ పెద్దలు మరిచిపోయారా అంటూ విమర్శిస్తున్నారు. గత ఐదు మ్యాచ్ల్లో అజహర్ అలీ పేలవ ప్రదర్శన కనిపించలేదా అంటూ పీసీబీని ఎండగడుతున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కాస్తా పంజాబ్ క్రికెట్ బోర్డు అయిపోయిందంటూ ఎద్దేవా చేస్తున్నారు. పాకిస్తాన్లోని పంజాబ్కు చెందిన మిస్బావుల్ హక్, వకార్ యూనిస్లు ఇప్పుడు అదే ప్రాంతానికి చెందిన అజహర్ అలీని కెప్టెన్గా నియమించారంటూ మండిపడుతున్నారు. (ఇక్కడ చదవండి: మిస్బా మార్క్.. సర్ఫరాజ్ కెప్టెన్సీ ఫట్!) ‘ఇదొక అవినీతి నిర్ణయం.. ఇది పంజాబ్ క్రికెట్ బోర్డు’ అని ఒకరు విమర్శించగా, ‘ అలీని ఎందుకు కెప్టెన్గా చేశారు.. బాబర్ అజామ్నే అన్ని ఫార్మాట్లకు కెప్టెన్గా చేయాల్సింది’ అని మరొకరు విమర్శించారు. ఈ విషయంలో సర్ఫరాజ్ అహ్మద్ను బలి పశువునే చేశారు.. శ్రీలంకతో సిరీస్లో జట్టు ఓవరాల్గా విఫలమైతే సర్ఫరాజ్ను తీసేస్తారా’ అని మరొక అభిమాని ప్రశ్నించాడు. ‘ శ్రీలంకతో సిరీస్లో అత్యధిక పరుగులు చేసినందుకు సర్ఫరాజ్కు ఇది కానుక’ అని మరొకరు చమత్కరించారు. ‘అజహర్ అలీ డబ్బులిచ్చి తిరిగి జట్టులోకి వచ్చాడు’ అని మరొక అభిమాని ఫైర్ అయ్యాడు. -
మిస్బా మార్క్.. సర్ఫరాజ్ కెప్టెన్సీ ఫట్!
కరాచీ: ఇటీవల శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్లో పాకిస్తాన్ వైట్వాష్ కావడంతో ఆ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ముప్పు తెచ్చిపెట్టింది. దీనిపై వెంటనే చర్యలకు శ్రీకారం చుట్టిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ).. సర్ఫరాజ్ను టీ20లతో పాటు టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ ప్రధాన కోచ్గా, చీఫ్ సెలక్టర్గా నియమించబడ్డ మిస్బావుల్ హక్ దిద్దుబాటు చర్యలకు రంగం సిద్ధం చేసిన నేపథ్యంలో తొలుత సర్ఫరాజ్ను రెండు ఫార్మాట్లకు కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఒక కెప్టెన్గా పాకిస్తాన్ క్రికెటర్లను సరైన దారిలో పెట్టడంలో విఫలమవుతున్న సర్ఫరాజ్ వైఖరిపై మిస్బా గుర్రుగా ఉన్నారు. ఈ తరుణంలో సర్ఫరాజ్ను సారథిగా తప్పించడమే మంచిదని భావించిన మిస్బా.. దాన్ని వెంటనే అమలు చేశాడు. కేవలం వన్డేలకు మాత్రమే సర్ఫరాజ్ను కెప్టెన్గా పరిమితం చేసిన మిస్బా నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. టీ20, టెస్టు ఫార్మాట్లకు వేర్వేరు సారథుల్ని నియమించింది. అజహర్ అలీని టెస్టు కెప్టెన్సీ అప్పచెప్పగా, బాబర్ అజామ్కు టీ20 కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చింది. కాకపోతే వచ్చే ఏడాది జూలై వరకూ పాకిస్తాన్కు పెద్దగా వన్డే సిరీస్లు లేకపోవడంతో సర్ఫరాజ్ను నామమాత్రపు కెప్టెన్గానే ఉంచారు. 2016లో టీ20 కెప్టెన్గా నియమించబడ్డ సర్ఫరాజ్.. 2017లో వన్డే సారథిగా ఎంపికయ్యాడు. ఈ క్రమంలోనే టెస్టు కెప్టెన్గా కూడా సర్ఫరాజ్ నియమించబడ్డాడు. అయితే పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన ‘జూనియర్ శ్రీలంక’ జట్టు చేతిలో వైట్వాష్ కావడంతో సర్ఫరాజ్ కెప్టెన్సీకి ప్రధానంగా ఎసరు తెచ్చింది. -
క్రికెట్కు తక్కువ.. కుస్తీ పోటీకి సిద్ధంగా!
ఇస్లామాబాద్ : శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్లో ఘోర అపజయాన్ని మూటగట్టుకున్న పాకిస్తాన్ జట్టుపై విమర్శలు కొనసాగుతున్నాయి. టీ20ల్లో నంబర్ వన్ జట్టుగా పేరు తెచ్చుకున్న పాక్.. ప్రత్యర్థి జట్టు చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. భద్రతా కారణాల దృష్ట్యా స్టార్ ఆటగాళ్లు పాక్ పర్యటనకు రాకపోయినప్పటికీ... శ్రీలంక యువ క్రికెటర్లు పాక్ను క్లీన్స్వీప్ చేసి సత్తా చాటారు. ఈ క్రమంలో పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ సహా హెడ్కోచ్, చీఫ్ సెలక్టర్ మిస్బావుల్ హక్పై అభిమానులు విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఆమిర్ సోహైల్ కూడా పాక్ ఆటగాళ్ల తీరుపై విమర్శలు గుప్పించాడు. ‘ ఫిట్నెస్పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చెబుతోంది. అయితే క్రికెట్కు తక్కువ... కుస్తీ పోటీలకు ఎక్కువ అన్నట్లు క్రికెటర్ల ఆకారం కనబడుతోంది. వీళ్లు ఒలంపిక్స్ లేదా డబ్ల్యూడబ్ల్యూఈ కుస్తీ పోటీలకు సిద్ధం అవుతున్నారో అర్థం కావడం లేదు’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. (చదవండి : కటౌట్ను కసితీరా తన్నిన ఫ్యాన్..!) కాగా ప్రపంచకప్ సమయంలోనూ పాక్ క్రికెటర్ల ఫిట్నెస్ చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. టీమిండియాతో ఓటమి తర్వాత.. ‘మా టీం తిండి తినడం మీద చూపే శ్రద్ధలో పావు వంతు అయినా ఫిట్నెస్, క్రమశిక్షణ మీద చూపిస్తే బాగుండేది. పిజ్జాలు బర్గర్లు తింటారు తప్ప మైదానంలో పోరాడలేరు. రేపు మ్యాచ్ ఉందంటే.. ఫిట్నెస్ గురించి ఏ మాత్రం ఆలోచించకుండా.. జంక్ ఫుడ్ తిని కడుపు నింపుకోవడంలో మా ఆటగాళ్లు బిజీగా ఉంటారు’ అంటూ ఓ అభిమాని సోషల్ మీడియాలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో పాక్ జట్టుపై విపరీతంగా జోకులు పేలడంతో పాటు విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో జట్టు కోచ్గా పగ్గాలు చేపట్టిన మిస్బా... ఫిట్నెస్ ప్రమాణాలు పెంచి ఆటగాళ్లు మైదానంలో మరింత చురుగ్గా ఉండేలా చేసేందుకు ప్రణాళికలు రచించాడు. బిర్యానీతో పాటు నూనె ఎక్కువగా వాడి వండే రెడ్ మీట్, మిఠాయిలకు దూరంగా ఉంచాలని అతడు ఆటగాళ్లకు సూచించాడు. -
కటౌట్ను కసితీరా తన్నిన ఫ్యాన్..!
ఇస్లామాబాద్ : ఇతర దేశాలతో పోలిస్తే భారత ఉపఖండంలో క్రికెటర్లకు ఉన్న క్రేజే వేరు. అభిమాన ఆటగాళ్లను కలిసేందుకు మైదానంలోకి పరిగెత్తుకు వెళ్లి అరెస్టైన ఫ్యాన్స్ కూడా కోకొల్లలు. అయితే విజయం సాధించినపుడు ఆకాశానికెత్తేసే కొంతమంది ‘వీరాభిమానులు’.. ఓడిపోయిన సమయాల్లో వారిపై కోపం ప్రదర్శించడానికి ఏమాత్రం వెనుకాడరు. ప్రస్తుతం అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్లో జయభేరి మోగించిన పాకిస్తాన్.. టీ20 సిరీస్లో మాత్రం ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. భద్రతా కారణాల దృష్ట్యా స్టార్ ఆటగాళ్లు జట్టుకు దూరమైనప్పటికీ.. అద్భుత ప్రదర్శనతో లంక యువ ఆటగాళ్లు మూడు మ్యాచ్ల సిరీస్ను సొంతం చేసుకున్నారు. సుదీర్ఘ కాలంగా టీ20ల్లో వైట్వాష్ ఎరుగని జట్టుగా ఉన్న పాక్ను క్లీన్స్వీప్ చేసి ప్రత్యర్థి జట్టుకు గట్టి షాకిచ్చారు.(చదవండి : అందుకే ఓడిపోయాం.. సరేనా: పాక్ కోచ్) ఈ క్రమంలో పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్, కోచ్ మిస్బావుల్ హక్పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెత్త ఆటతో పరువు తీశారంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్రమంలో సర్ఫరాజ్ అహ్మద్ కటౌట్ను ఓ అభిమాని కసితీరా కొట్టి కాలితో తన్నాడు. కటౌట్ పూర్తిగా నేలమట్టం అయ్యేంత వరకు కోపంతో ఊగిపోతూ తిట్ల వర్షం కురిపించాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియోను సాజ్ సాదిఖ్ అనే నెటిజన్ ట్విటర్లో షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇక జట్టు ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని సర్ఫరాజ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. A fan not happy with Sarfaraz Ahmed after the 3-0 loss to Sri Lanka #PAKvSL #Cricket pic.twitter.com/S6Biri8z4f — Saj Sadiq (@Saj_PakPassion) October 10, 2019 -
అందుకే ఓడిపోయాం.. సరేనా: పాక్ కోచ్
ఇస్లామాబాద్ : ‘నేనే ఏదో తప్పు చేసి ఉంటాను. అందుకే జట్టు ఓడిపోయిందనుకుంటున్నా.. సరేనా ’ అంటూ పాకిస్తాన్ క్రికెట్ జట్టు హెచ్ కోచ్ మిస్బావుల్ హక్ రిపోర్టర్పై అసహనం వ్యక్తం చేశాడు. శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో పాక్ ఘోర ఓటమి పాలైన విషయం తెలిసిందే. స్టార్ ఆటగాళ్లు లేనప్పటికీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న శ్రీలంక యువ ఆటగాళ్లు పాక్ను వైట్వాష్ చేసి సత్తా చాటారు. ఈ క్రమంలో మూడో మ్యాచ్ ముగిసిన అనంతరం పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్తో కలిసి మిస్బా విలేకరులతో మాట్లాడాడు. ఈ సందర్భంగా పొట్టి క్రికెట్ ఫార్మాట్లో నంబర్ 1గా ఉన్న జట్టుగా పేరు గాంచిన పాక్ ఇంతటి అపజయాన్ని మూటగట్టుకోవడానికి కారణం ఏంటని ఓ విలేకరి మిస్బాను ప్రశ్నించాడు. ఇందుకు బదులుగా... ‘ అవును అప్పటికీ ఇప్పటికీ ఏమీ మారలేదు. కేవలం నేను మాత్రమే మారాను. నేనే ఏదో తప్పు చేసి ఉంటాను. కుడి చేతివాటం బ్యాట్స్మెన్ను ఎడమ చేతివాటంతో ఆడమని చెప్పాను. అంతేకాదు రైట్ ఆర్మ్ బౌలర్లను.. లెఫ్ట్ హ్యాండ్తో బౌలింగ్ చేయమని చెప్పాను. అందుకే ఓడిపోయామని అనుకుంటున్నా. నేను అలా చేయకపోయి ఉంటే ఇలా జరిగేది కాదు కదా అంటూ వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. అదే విధంగా లెగ్ స్పిన్నర్ షాబాద్ ఖాన్ ప్రదర్శనపై వచ్చిన విమర్శల గురించి ప్రశ్నించగా.. దేశవాళీ జట్టులో మెరుగ్గా రాణిస్తున్న ఒక్క రిస్ట్ స్పిన్నర్ని అయినా జాతీయ జట్టులోకి తీసుకోకుండా ఉన్నామా అంటూ మిస్బా ఎదురు ప్రశ్నించాడు. ఇక తమ కోచ్ వ్యాఖ్యలను పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ సమర్థించాడు. ‘ఓటమికి పూర్తి బాధ్యత నాదే. ఇదే ఆటగాళ్లతో ఆడినప్పుడు మేం నంబర్ వన్ జట్టుగా ఉన్నాము. మాపై బోర్డు ఒత్తిడి ఉందనడం సరికాదు. స్వేచ్చగా ఆడేందుకు మాకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. టీం మేనేజ్మెంట్ కఠినంగా శ్రమిస్తోంది. అయితే మైదానంలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడంలో ఆటగాళ్లు విఫలమం అవుతున్నారు’ అని పేర్కొన్నాడు. కాగా పాక్ సిరీస్కు తమ ఆటగాళ్లను పంపడానికి శ్రీలంక వెనుకాడటంతో.. భారత్ బెదిరింపుల కారణంగానే శ్రీలంక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందంటూ పాక్ మంత్రి ఫవాద్ చౌదరి ఆరోపించిన సంగతి తెలిసిందే. -
ధోని తర్వాత సర్ఫరాజ్
కరాచీ: పాకిస్తాన్ కెప్టెన్, వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ అరుదైన ఘనత అందుకున్నాడు. కరాచీ వేదికగా బుధవారం శ్రీలంకతో జరిగిన మూడో వన్డే మ్యాచ్ సర్ఫరాజ్కు కెప్టెన్గా 50వ వన్డే మ్యాచ్. 50 వన్డేలకి కెప్టెన్సీ వహించిన సర్ఫరాజ్.. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక అత్యధిక వన్డేలకు కెప్టెన్సీ వహించిన రెండో వికెట్ కీపర్గా రికార్డులకెక్కాడు. ఎంఎస్ ధోనీ 2007 నుండి 2018 వరకు 200 వన్డేల్లో భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించాడు. 200 వన్డేలకి కెప్టెన్సీ వహించిన ధోని.. భారత జట్టుకు 110 విజయాలు అందించాడు. ఇక 74 పరాజయాలు ఉండగా.. 16 మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు. 50 వన్డేలకి నాయకత్వం వహించిన సర్ఫరాజ్.. తన జట్టుకు 28 మ్యాచ్ల్లో విజయాలను అందించాడు. 20 మ్యాచ్ల్లో పాక్ ఓడిపోగా.. రెండింటిలో ఫలితం తేలలేదు. తాజాగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో పాకిస్తాన్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లంకేయులు 9 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేయగా, దాన్ని పాకిస్తాన్ 48.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫకార్ జమాన్(76), అబిద్ అలీ(74), హారిస్ సొహైల్(56)లు హాఫ్ సెంచరీలు సాధించి పాక్ విజయంలో కీలక పాత్ర పోషించారు. -
‘ఇక చాలు.. కెప్టెన్సీ నుంచి తప్పుకో’
కరాచీ: పాకిస్తాన్ సారథి సర్ఫరాజ్ అహ్మద్పై ఆ దేశ మాజీ ఆటగాళ్లు జహీర్ అబ్బాస్, షాహిద్ ఆఫ్రిదిలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టెస్టు సారథ్య బాధ్యతల నుంచి సర్ఫరాజ్ తప్పుకుంటే అతడికి, పాక్ క్రికెట్కు ఎంతో మేలు జరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు. వన్డే, టీ20లకు కెప్టెన్గా సర్ఫరాజ్ విజయంతమయ్యాడని ప్రశంసించారు. అయితే టెస్టు క్రికెట్ ఎంతో కఠినమైదని.. సర్ఫరాజ్ ఈ ఫార్మట్ సారథిగా సత్తా చాటలేడని పేర్కొన్నాడు. అతడే స్వతహగా టెస్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొని పరిమిత ఓవర్ల క్రికెట్పై దృష్టి పెట్టాలని సర్ఫరాజ్కు సూచించారు. తప్పుకుంటే అతడికే మంచిది: ఆఫ్రిది టెస్టు సారథ్య బాధ్యతల నుంచి సర్ఫరాజ్ తప్పుకుంటే అతడికే మేలు జరుగుతుందని ఆఫ్రిది అభిప్రాయపడ్డాడు. మూడు ఫార్మట్లకు కెప్టెన్గా వ్యవహరించడమనేది అధిక భారంతో కూడుకున్నదని పేర్కొన్నాడు. వన్డే, టీ20 క్రికెట్ సారథిగా సర్ఫరాజ్ విజయవంతమైన తరుణంలో టెస్టు నుంచి తప్పుకోవాలని ఆఫ్రిది అన్నాడు. అంతేకాకుండా టెస్టు జట్టు సారథిగా సర్ఫరాజ్ ఎంపిక సరైనది కాదనేది తన అభిప్రాయమన్నాడు. మిస్బావుల్ ఎంపిక సరైనది కాదు: జహీర్ మిస్బావుల్ హక్ను చీఫ్ సెలక్టర్గా, ప్రధాన కోచ్గా నియమించడం సరైనది కాదని జహీర్ అబ్బాస్ అభిప్రాయపడ్డాడు. రెండు పదవులు మిస్బావుల్కు అప్పగించడంతో అతడిపై అధిక భారం పడుతుందన్నాడు. టెస్టు క్రికెట్ చాలా కఠినమైనది ఈ ఫార్మట్లో కెప్టెన్గా వ్యవహరించడమనేది సవాల్తో కూడుకున్నదని.. అయితే ఆ సత్తా సర్ఫరాజ్కు లేదన్నాడు. దీంతో వన్డే, టీ20లపై ఫోకస్ పెట్టి, టెస్టు నుంచి తప్పుకుంటే మంచిదని జహీర్ సూచించాడు. -
‘యావత్ పాకిస్తాన్ మీకు అండగా ఉంటుంది’
కరాచీ: జమ్మూ కశ్మీర్కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయంపై పాకిస్తాన్ క్రికెట్ కెప్టెన్ సర్పరాజ్ అహ్మద్ స్పందించాడు. ఇది కశ్మీరీ సోదరులకు కష్ట కాలంగా సర్పరాజ్ అభివర్ణించాడు. ఈ ఆపద నుంచి గట్టెక్కించేందుకు కశ్మీరీలకు అల్లా సాయం చేయాలని తాను ప్రార్థించినట్లు తెలిపాడు. ‘ కశ్మీరీ సోదరులారా.. బాధను, కష్టాలను సమానంగా పంచుకుందాం. యావత్ పాకిస్తాన్ మీకు అండగా ఉంటుంది’ అని సర్పరాజ్ అహ్మద్ పేర్కొన్నాడు. కరాచీలో ఈద్ ప్రార్థనలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడిన సర్పరాజ్ ఆర్టికల్ 370 రద్దుపై పైవిధంగా స్పందించాడు. అంతకుముందు పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది సైతం ఆర్టికల్ 370 రద్దుపై విమర్శలు గుప్పించాడు. ఐక్యరాజ్య సమితి తీర్మానానికి అనుగుణంగా కశ్మీరీ పౌరులకు కనీస హక్కులు దక్కడం లేదు. అసలు ఐరాసను ఎందుకు ఏర్పాటు చేశారు? ఇంత జరుగుతున్నా ఎందుకలా నిద్రపోతోంది. కశ్మీరీల హక్కుల ఉల్లంఘనపై ఐరాస ఎందుకు స్పందించట్లేదు. కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనను పరిగణలోకి తీసుకోవాలి’ అంటూ అఫ్రిది మండిపడ్డాడు. -
‘ప్రధాన కోచ్ను కొనసాగించే ముచ్చటే లేదు ’
ఇస్లామాబాద్: ప్రపంచకప్లో కనీసం సెమీస్కు చేరకుండానే ఇంటిబాట పట్టడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) దిద్దుబాటు చర్యలకు దిగింది. పాక్ క్రికెట్ జట్టును ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఏర్పడిందని అన్ని వైపుల విమర్శలు వస్తుండటంతో పీసీబీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15తో ముగుస్తున్న కోచింగ్ బృందం కాంట్రాక్టును పొడగించకూడదని నిశ్చయించుకుంది. దీంతో 2016 నుంచి పాక్ క్రికెట్ జట్టుకు సేవలందిస్తున్న మికీ అర్థర్కు ఉద్వాసన పలకనుంది. అతడితో పాటు బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్, బౌలింగ్ కోచ్ అజహర్ మహ్మద్, ఇతర సిబ్బందిని కూడా కొనసాగించకూడదని పీసీబీ నిర్ణయం తీసుకుంది. ప్రపంచకప్లో పాక్ వైపల్యానికి కోచింగ్ బృందం పొరపాట్లు కూడా ఉన్నాయని పీసీబీ విశ్వసిస్తోంది. దీంతో వారిపై వేటు వేయనుంది. ఇక జట్టును విజయపథంలో నడిపించే కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియను త్వరలోనే ప్రారంభించనున్నట్లు పీసీబీకి చెందిన ఓ అధికారి తెలిపారు. 2016 నుంచి పాక్ జట్టుకు మికీ అర్థర్ విశేష సేవలందిస్తున్నాడు. అతడి కోచ్గా ఉన్న సమయంలోనే 2017 చాంపియన్ ట్రోఫీని పాక్ గెలుచుకుంది. ఇక అర్థర్ కూడా పాక్ జట్టుకు కోచ్గా కొనసాగేందుకు ఆసక్తి కనబర్చటం లేదని తెలుస్తోంది. శ్రీలంక క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. రెండ్రోజుల క్రితమే ప్రపంచకప్ ఓటమిపై సమీక్ష జరగగా పీసీబీ ఏర్పాటు చేసిన కమిటీకి అర్థర్ కెప్టెన్సీ మార్పుపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాడని సమాచారం. గత రెండేళ్లుగా సారథిగా సర్ఫరాజ్ అహ్మద్ పూర్తిగా విఫలమయ్యాడని, అతడిని సారథ్య బాధ్యతల నుంచి తప్పించాలని పీసీబీకి అర్థర్ సూచించినట్టు సమాచారం. -
సర్ఫరాజ్ను తీసేయండి.. నన్ను కొనసాగించండి!
కరాచీ: ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్కప్లో పాకిస్తాన్ నాకౌట్ దశకు చేరకపోవడంతో ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) ప్రక్షాళన చేపట్టింది. ప్రధానంగా కోచ్, కెప్టెన్లను మార్చాలనే యోచనలో ఉంది. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా పాక్ క్రికెట్ ఆట తీరుపై గుర్రుగా ఉన్నారు. ఇక నుంచి పాక్ క్రికెట్ను తీర్చిదిద్దే బాధ్యత తానే తీసుకుంటానని హామి ఇచ్చారు కూడా. అయితే పాకిస్తాన్ క్రికెట్కు ప్రధాన కోచ్ మికీ ఆర్థర్ సమర్పించిన నివేదికలో కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్నే టార్గెట్ చేశారంట. అసలు కెప్టెన్గా సర్ఫరాజ్ వద్దంటూ బోర్డుకు తేల్చిచెప్పారు పీసీబీలో విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీనిలో భాగంగా సర్పరాజ్ అహ్మద్లో పలు నెగిటివ్ విషయాల్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇక తాను కోచ్గా ఉండేందుకు మరో రెండేళ్లు పొడిగించాలని ఆర్థర్ కోరినట్లు సమాచారం. తన పర్యవేక్షణలో పాక్ క్రికెట్ జట్టు ఆశించిన స్థాయిలోనే ఫలితాలు సాధించిందని స్పష్టం చేశారట. తన కోచ్ పదవిపై పీసీబీ మేనేజింగ్ డైరెక్టర్ వసీం ఖాన్ నుంచి హామీ లభించిందని ఆర్థర్ ధైర్యంగా ఉన్నాడట. అయితే అదే సమయంలో శ్రీలంక ప్రధాన కోచ్గా సేవలందించేందుకు కూడా ఆర్థర్ దరఖాస్తు చేసుకున్నాడనే వార్తలు వస్తున్నాయి. 2016లో పాకిస్తాన్ కోచ్గా ఆర్థర్ స్వీకరించాడు. అతని పర్యవేక్షణలో పాకిస్తాన్ జట్టు చాంపియన్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆ తర్వాత అతని హయాంలో భారీ ఘనతలు ఏమీ లేకపోకపోయినప్పటికీ, టీ20ల్లో పాక్ను నంబర్ వన్ స్థానంలో నిలిపాడు. ఇక టెస్టు, వన్డే ఫార్మాట్లో మాత్రం పాక్ క్రికెట్ జట్టు ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించకపోవడం ఆర్థర్ను కోచ్గా కొనసాగిస్తారా.. లేదా అనేది సందిగ్థంలో ఉంది. కోచ్గా ఆర్థర్ను కొనసాగించేందుకు కొంతమంది పాక్ మాజీలు మద్దతు తెలుపుతుండగా, మరికొంతమంది మాత్రం అతను వద్దనే అంటున్నారు. (ఇక్కడచ చదవండి: చాలా నష్టం చేశాడు.. ఇంకా కోచ్గా ఎందుకు?) -
‘సారథిగా తప్పుకుంటే నీకే మంచిది’
రావల్పిండి : తాజా ప్రపంచకప్లో పాకిస్తాన్ ఓటమిని ఆ దేశ అభిమానులు, మాజీ క్రికెటర్లు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆటగాళ్ల ప్రదర్శనను, కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ వైఫల్యాలను వేలెత్తి చూపుతూ నిందిస్తున్నారు. తాజాగా రావల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అక్తర్ పాక్ సారథి సర్ఫరాజ్పై మరోసారి నిప్పులు చెరిగాడు. బుధవారం తన యూట్యూబ్ చానల్లో ఓ వీడియో పోస్ట్ చేసిన అక్తర్.. పాక్ జట్టుకు సారథిని మార్చే సమయం వచ్చిందంటూ పేర్కొన్నాడు. అయితే సర్ఫరాజ్ను జట్టు నుంచి తప్పించాల్సిన అవసరం లేదన్నాడు. అతడి కీపింగ్, బ్యాటింగ్ పాక్కు ఎంతగానో ఉపయోగపడుతుందన్నాడు. సర్ఫరాజ్ స్థానంలో వన్డే, టీ20లకు హారీస్ సోహైల్ను, టెస్టులకు బాబర్ అజమ్ను సారథులుగా ఎంపిక చేయాలని సూచించాడు. ‘సర్ఫరాజ్ స్వతహాగా సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగితే బెటర్. కెప్టెన్సీ నుంచి తప్పుకొని బ్యాటింగ్, కీపింగ్పై దృష్టి పెడితే అతడికి, పాక్ క్రికెట్కు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రపంచకప్లో పాక్ సారథిగా సర్ఫరాజ్ తేలిపోయాడు. యువకులకు సారథ్య బాధ్యతలను అప్పగిస్తే బెటర్. హారీస్ సోహైల్(వన్డే, టీ20), బాబర్ అజమ్(టెస్టు)లకు సారథ్య బాధ్యతలను అప్పంగించాలి’అంటూ అక్తర్ పేర్కొన్నాడు. ఇక గతంలో కూడా సర్ఫరాజ్ ‘తెలివితక్కువ సారథి’అంటూ వ్యాఖ్యానించాడు. ఇక పాక్ జట్టును త్వరలోనే అన్ని విధాల సెట్ చేస్తానని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
సారీ చెప్పాల్సిన అవసరం లేదు: సర్ఫరాజ్
కరాచీ: ప్రస్తుత వరల్డ్కప్లో తమ ప్రదర్శన మరీ అంత చెత్తగా ఏమీ లేదని పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ సర్పరాజ్ అహ్మద్ పేర్కొన్నాడు. తమ జట్టు సెమీ ఫైనల్ రేసులో నిలవలేకపోయినా ఆకట్టుకుందనే విషయం అందరికీ తెలసన్నాడు. ప్రధానంగా భారత్పై ఓటమి తర్వాత తమ తిరిగి పుంజుకున్న తీరు అమోఘమంటూ జట్టు సభ్యులపై ప్రశంసలు కురింపించాడు. ఒకవేళ తాము సెమీ ఫైనల్కు వెళ్లనుందుకు ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం కూడా లేదన్నాడు. వరల్డ్కప్ను లీగ్ దశలోనే ముగించి స్వదేశానికి చేరుకున్న క్రమంలో కరాచీలో ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్లో సర్పరాజ్ మాట్లాడాడు. ‘ మా ప్రదర్శన చెత్తగా ఉందని ఎవరైనా అభిప్రాయపడితే అది తప్పు. మేము భారత్పై ఓటమి చెందిన తర్వాత పూర్తి స్థాయి ప్రదర్శనతో వరుస విజయాలు సాధించాం. అయినా అదృష్టం కలిసి రాక టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. అటువంటప్పుడు మేము ఎవరికి క్షమాపణలు చెప్పాలి. అసలు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు. మా శాయ శక్తుల ప్రయత్నించాం. మేము 2 నుంచి 4 పాయింట్లతో స్వదేశానికి రాలేదు. మేము 11 పాయింట్లు సాధించాం. దాంతో మా ప్రదర్శన బాగుందనే విషయం అంతా అంగీకరించాలి’ అని సర్పరాజ్ తెలిపాడు. -
ధోనిలా స్టంపింగ్ చేయబోయి..
లీడ్స్: వికెట్ కీపింగ్లో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఓ ప్రత్యేకమైన స్టైల్ ఉంది. వికెట్ వంక చూడకుండా కూడా ధోని రనౌట్ చేయగలడు. కను రెప్ప పాటులో అతను బ్యాట్స్మెన్ని స్టంప్ చేసేస్తాడు. అందుకే అతని వికెట్ కీపింగ్కి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే చాలా మంది ధోనిలా వికెట్ కీపింగ్ చేయబోయి విఫలమయ్యారు. తాజాగా ఈ జాబితాలో పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కూడా చేరాడు. ప్రపంచకప్లో భాగంగా శనివారం లీడ్స్ వేదికగా పాక్, అఫ్గానిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఆఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్ చివరి బంతికి ముజీబ్ రెండు పరుగులు తీసేందుకు ప్రయత్నించాడు. అయితే ఫీల్డర్ బంతికి కీపర్ సర్ఫరాజ్కు అందించగా.. అతను వికెట్లను చూడకుండానే రనౌట్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ బంతికి వికెట్ల నుంచి దూరంగా వెళ్లడంతో బ్యాట్స్మెన్ రనౌట్ కాకుండా తప్పించుకున్నాడు. -
ఐసీసీ పోస్ట్: ధోనినా.. సర్ఫరాజా?
మాంచెస్టర్: టీమిండియా సీనియర్ ఆటగాడు, వికెట్ కీపర్ ఎంఎస్ ధోని కీపింగ్ నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వెలుతురు కంటే వేగంగా స్టంపౌట్లు చేయడం, కళ్లుచెదిరే రీతిలో క్యాచ్లు అందుకోవడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. తాజాగా ప్రపంచకప్లో భాగంగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో కార్లొస్ బ్రాత్వైట్ ఇచ్చిన క్యాచ్ను డైవ్ చేస్తూ ఒంటి చేత్తో అందుకోని ఔరా అనిపించాడు. అయితే ప్రస్తుతం ధోని క్యాచ్ వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తుండగానే.. ఐసీసీ ఈ వీడియోకు మరొకటి జతచేసి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో రాస్ టేలర్ ఇచ్చిన క్యాచ్ను పాకిస్తాన్ వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ సూపర్గా డైవ్ చేస్తూ ఒంటిచేత్తో అందుకున్నాడు. అయితే రెండు క్యాచ్లు ఒకేలా పోలి ఉండటంతో ఐసీసీ రెండు వీడియోలను జత చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాకుండా ఎవరి క్యాచ్ అద్బుతంగా ఉందంటూ ఫ్యాన్స్ను ప్రశ్నించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. కీపింగ్లో ధోనిని మించిన తోపు మరొకరు ఉండరని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
ఎవరిది బెస్ట్ క్యాచ్: ప్రశ్నించిన ఐసీసీ
-
అలాగే జరగాలని ఏమీ లేదు: పాక్ కెప్టెన్
బర్మింగ్హామ్: ప్రస్తుత వన్డే వరల్డ్కప్లో న్యూజిలాండ్పై సాధించిన ఘన విజయంతో 1992 నాటి చరిత్ర పునరావృతం అవుతుందనే పాక్ అభిమానులు జోస్యం చెబుతున్నారు. పాకిస్తాన్ జట్టు తన మిగిలిన మ్యాచ్లన్నింటిలోనూ ఇదే తరహా స్ఫూర్తిదాయక విజయాలను నమోదు చేసి వరల్డ్కప్ను ఎగరేసుకుపోతుందని పాక్ అభిమానులతో పాటు ఆ దేశ మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 1992లో పడుతూ లేస్తూ సెమీస్కు చేరిన పాకిస్తాన్.. చివరికి ప్రపంచకప్ను గెలుచుకుందని, ఆ చరిత్ర మళ్లీ పునరావృతం అవుతోందని మాజీ క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, వసీం అక్రమ్, షోయబ్ అఖ్తర్, జావెద్ మియాందాద్, రమీజ్ రజా తదితరులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, దీనిపై పాకిస్తాన్ క్రికెట్ కెప్టెన్ సర్పరాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. ‘1992 వరల్డ్కప్ గురించి ఆలోచించడం లేదు. అలా జరుగుతుందని అనుకోవడం లేదు. అలాగే జరగాలని ఏమీ లేదు. ప్రతీ మ్యాచ్ మాకు ముఖ్యమే. విజయాలు సాధిస్తూ ముందుకు సాగడమే మా లక్ష్యం. న్యూజిలాండ్తో మ్యాచ్లో బాబర్ అజామ్, హరీస్ సొహైల్ బ్యాటింగ్ అద్భుతం. నేను చూసిన బాబర్ ఇన్నింగ్స్ల్లో ఇదొక అత్యుత్తమ ఇన్నింగ్స్. క్లిష్టమైన పిచ్పై బాబర్ సెంచరీ చేసి విజయంలో పాలు పంచుకోవడం ఆనందంగా ఉంది. యాభై ఓవర్ల పాటు క్రీజ్లో ఉండాలనే తలంపుతోనే బ్యాటింగ్కు దిగాం. ఈ క్రెడిట్ అంతా బాబర్, హరీస్లదే. ఒత్తిడిని అధిగమిస్తూ వారు అద్వితీయంగా రాణించారు. ఊహించిన పేస్ను, గింగిరాలు తిరిగే స్పిన్ను ఎదుర్కొంటూ వారు పోరాడిన తీరు అమోఘం’ అని సర్ఫరాజ్ కొనియాడాడు. -
మూడో పాక్ క్రికెటర్గా..
లండన్: పాకిస్తాన్ క్రికెటర్ హరీస్ సొహైల్ అరుదైన ఘనతను సాధించాడు. వన్డే వరల్డ్కప్లో భాగంగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో సొహైల్(89; 59 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో పాకిస్తాన్ 309 పరుగుల టార్గెట్ను నిర్దేశించకల్గింది. ఈ క్రమంలోనే సొహైల్ దిగ్గజ క్రికెటర్ల జాబితాలో చేరిపోయాడు. వరల్డ్కప్ మ్యాచ్ల్లో యాభైకి పైగా వ్యక్తిగత పరుగులు సాధించే క్రమంలో అత్యధిక స్టైక్రేట్ నమోదు చేసిన మూడో పాక్ క్రికెటర్గా గుర్తింపు సాధించాడు. ఈ మ్యాచ్లో సొహైల్ స్టైక్రేట్ 150.84గా ఉంది. ఐదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన సొహైల్ ఆది నుంచి విజృంభించి ఆడాడు. 50కి పైగా పరుగుల్ని ఫోర్లు, సిక్సర్లతోనే సాధించాడు. దాంతో వరల్డ్కప్లో అత్యధిక స్టైక్రేట్ సాధించిన పాక్ ఆటగాళ్ల జాబితాలో చోటు సంపాదించాడు. అంతకుముందు వరల్డ్కప్ మ్యాచ్ల్లో అత్యధిక స్టైక్రేట్ నమోదు చేసిన పాక్ ఆటగాళ్లలో ఇమ్రాన్ ఖాన్ 169. 69స్టైక్ రేట్(1983, శ్రీలంకపై 33 బంతుల్లో 56 పరుగులు), ఇంజమాముల్ హక్ 162. 16(1992, 37 బంతుల్లో 60)లు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. వీరి తర్వాత స్థానాన్ని తాజాగా హరీస్ సొహైల్ ఆక్రమించాడు. -
సర్ఫరాజ్ భయపడ్డాడా?
లండన్: వన్డే వరల్డ్కప్లో భారత్పై ఘోర పరాజయం తర్వాత పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అటు కెప్టెన్సీలోనూ ఇటు ఆటలోనూ వైఫల్యం చెందడంతో సర్ఫరాజ్పై ఆ దేశ మాజీ క్రికెటర్లు దుమ్మెత్తిపోశారు. ఇక పాక్ అభిమానులైతే పిజ్జాలు, బర్గర్లు తింటూ పొట్ట బాగా పెంచావే కానీ ఆటపై ఏకాగ్రత లేదంటూ మండిపడ్డారు. అయితే భారత్తో మ్యాచ్ తర్వాత పాకిస్తాన్.. దక్షిణాఫ్రికాతో మ్యాచ్కు సిద్ధమైంది. ఆదివారం దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగింది. హరీస్ సోహైల్(89; 59 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు), బాబర్ అజామ్(69), ఇమాముల్ హక్(44), ఫకార్ జమాన్(44)లు రాణించడంతో ఆ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. అంతవరకూ బాగానే ఉంది.. కానీ పాక్ కెప్టెన్ సర్పరాజ్ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు దిగడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. (ఇక్కడ చదవండి: చెలరేగిన సొహైల్..) పాక్ టాపార్డర్ ఆటగాళ్లలో పలువురు మెరుగైన ప్రదర్శన కనబరిచి మంచి స్కోరుకు బాటలో వేసిన సమయంలో సర్ఫరాజ్ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ దిగడం పాక్ అభిమానులను ఆలోచింపజేస్తోంది. సాధారణంగా ఐదో స్థానంలో బ్యాటింగ్ దిగే సర్పరాజ్ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ రావడమే ఇప్పుడు హాట్ టాపిక్. బ్యాట్స్మన్ అయిన సర్ఫరాజ్ కింది వరుసలో బ్యాటింగ్ చేయడమేంటనేది సగటు క్రీడాభిమానికి మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇమాద్ వసీం ఐదో వికెట్గా పెవిలియన్ చేరిన తర్వాత సర్ఫరాజ్ బ్యాటింగ్కు వస్తాడని అనుకున్నారంతా. 48 ఓవర్ చివరి బంతికి ఇమాద్ వసీం ఔట్ కాగా అప్పటికి పాక్ స్కోరు 295. ఆ సమయంలో వహాబ్ రియాజ్ బ్యాటింగ్కు దిగాడు. ఇక్కడ వహాబ్ విఫలమయ్యాడు. ఇంకా రెండు ఓవర్లు ఉన్న సమయంలో సర్ఫరాజ్ బ్యాటింగ్కు రాకుండా వహాబ్ను దింపడం ఆలోచనలో పడేసింది. అప్పుడు సర్పరాజ్ బ్యాటింగ్కు వచ్చి ఉంటే పాక్ స్కోరు మరింత పెరగడానికి ఆస్కారం ఉన్న నేపథ్యంలో ఇలా బ్యాటింగ్ ఆర్డర్లో వెనక్కి పోవడంతో మరోసారి విమర్శలకు బాట వేసినట్లే కనిపిస్తోంది. అసలు సర్పరాజ్ బ్యాటింగ్ చేసేందుకు సిద్ధం కాలేదా లేక హిట్టింగ్ చేయలేక భయపడ్డాడా అనేది అతనికే తెలియాలి. ఈ మ్యాచ్లో ఆఖరి ఓవర్లో రెండు బంతులు మాత్రమే ఎదుర్కొన్న సర్పరాజ్ రెండు పరుగులే చేసి అజేయంగా నిలవడం గమనార్హం. ఇక్కడ సర్పరాజ్ అహ్మద్ స్టైక్రేట్ వంద ఉంది..ఒకవేళ మ్యాచ్లో ఫలితం తేడా వస్తే అతన్ని మాటలతో ఉతికి ఆరేసే స్టైక్రేట్ కూడా వందకు పోవడం ఖాయం. ఇది పాక్కు కీలక మ్యాచ్. ఆ జట్టు సెమీస్ ఆశల్ని సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్. -
మాజీ ఆటగాళ్లపై సర్ఫరాజ్ ఫైర్!
మెగా టోర్నీ ప్రపంచకప్లో భారత్ చేతిలో ఓటమి పాలైన నాటి నుంచి పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్పై అభిమానులు విరుచుకుపడుతున్నారు. వారితో పాటు పాక్ మాజీ ఆటగాళ్లు కూడా సర్ఫరాజ్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ముఖ్యంగా ఆ జట్టు మాజీ ఆటగాడు, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్.. ఓటమికి సర్ఫరాజ్ అనాలోచిత నిర్ణయమే కారణమని విమర్శించిన సంగతి తెలిసిందే. ‘సర్ఫరాజ్ ఇంత తెలివి తక్కువ పనిచేస్తాడని నేను అసలు ఊహించలేదు. పాకిస్తాన్ టాస్ గెలవగానే సగం మ్యాచ్ గెలిచాం అనుకున్నాం. కానీ సర్ఫరాజ్ చేజేతులా మ్యాచ్ను చేజార్చాడు. టాస్ చాలా కీలకం. పాకిస్తాన్ 260 పరుగులు చేసినా.. తమకున్న బౌలింగ్ వనరులతో కాపాడుకునేది. నిజంగా సర్ఫరాజ్ది బ్రెయిన్లెస్ కెప్టెన్సీ’ అంటూ తన యూట్యూబ్ చానెల్ వేదికగా సర్ఫరాజ్పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. తనపై వెల్లువెత్తుతున్న విమర్శలపై సర్ఫరాజ్ స్పందించాడు. ఇలాంటి ఓటమి తమకేం కొత్త కాదని, గతంలో కూడా చాలాసార్లు భారత్ చేతిలో ఓడామని పేర్కొన్నాడు. నిజానికి భారత్తో మ్యాచ్ ముగిసిన తర్వాతే పరిస్థితులు చక్కబడ్డాయని పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో తమపై వస్తున్న ట్రోలింగ్ గురించి మాట్లాడుతూ.. అసభ్యకర ట్రోల్స్ చేసే వారు పద్ధతి మార్చుకోవాలని సూచించాడు. ఇక తమ ఓటమిపై మాజీ క్రికెటర్ల తీరును ప్రస్తావిస్తూ..‘ వాళ్ల కంటికి మేము ఆటగాళ్లలా కనిపించడం లేదు. వారు మమ్మల్ని చూసే తీరు వేరుగా ఉంటుంది. వాళ్లిప్పుడు టీవీ తెరపై దేవుళ్ల అవతారం ఎత్తారు’ అంటూ ఘాటుగా స్పందించాడు. కాగా గత ఆదివారం భారత్తో జరిగిన మ్యాచ్లో పాక్ 89 పరుగుల (డక్వర్త్–లూయిస్ ప్రకారం) తేడాతో ఘోరపరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. ఇక పాక్ తమ తదుపరి మ్యాచ్లో సఫారీలతో తలపడనుంది. -
సర్ఫరాజ్కు టీమిండియా ఫ్యాన్స్ మద్దతు
లండన్: పాకిస్తాన్ సారథి సర్ఫరాజ్ అహ్మద్కు టీమిండియా అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు. ఇంగ్లండ్లో షాపింగ్ చేస్తున్న సర్ఫరాజ్ను ఓ అభిమాని తీవ్రంగా అవమానానికి గురిచేశాడు. షాపింగ్ చేస్తున్న సర్ఫరాజ్ను ఓ అభిమాని సెల్ఫీ అడగగా అతడు అంగీకరించాడు. అంతలోనే సర్ఫరాజ్ కొడుకు ఏడుస్తుండటంతో పక్కకు జరిగాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ అభిమాని.. ‘సర్ఫరాజ్ బాయ్.. ఎందుకిలా పందిలా బలిసావు. కొంచెం డైట్ చేయవచ్చు కదా’ అంటూ అభ్యంతరకర పదజాలం వాడాడు. అయినా సర్ఫరాజ్ ఏ మాత్రం ఆగ్రహానికి గురవ్వకుండా ప్రశాంతంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఈ వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేయడంతో సర్ఫరాజ్కు మద్దతుగా టీమిండియా అభిమానులతో సహా యావత్ క్రికెట్ ప్రపంచం అండగా నిలిచింది. అభ్యంతరకర పదజాలంతో నోరుపారేసుకున్న సదరు వ్యక్తిపై సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. సర్ఫరాజ్తో అభిమాని ప్రవర్తించిన తీరు సిగ్గుచేటన్నారు. విజయం సాధించినప్పుడు భుజానికి ఎత్తుకోవడం, ఓడిపోయినప్పుడు కాళ్లతో తొక్కేయడం సబబు కాదని పేర్కొన్నారు. ‘నీలాంటి వెదవల జోలికి పోవడం కన్నా ప్రశాంతంగా ఉండటమే మంచిదని వాళ్లమ్మ సర్ఫరాజ్కు నేర్పించింది’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఒక ఆటగాడిపై వ్యక్తిగతంగా మాటలదాడి చేయడం, అతని శరీర ఆకృతిని ప్రస్తావిస్తూ తిట్టడం సరైంది కాదని క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇక సోషల్మీడియా ప్రభావంతో తన తప్పును తెలుసుకొని ఆ అభిమాని సర్ఫరాజ్కు క్షమాపణలు చెప్పాడు. తాను చేసిన పని పట్ల పశ్చాతాపం వ్యక్తం చేస్తూ ఓ వీడియోను విడుదల చేశాడు. పాక్ కెప్టెన్ పట్ల నేను ప్రవర్తించిన తీరుకు పశ్చాతాపం వ్యక్తం చేస్తున్నాను. ఈ ఘటనతో బాధపడ్డ ప్రతి ఒక్కరికి బేషరతుగా క్షమాపణలు తెలియజేస్తున్నాను. నేను అసలు ఆ వీడియోనే అప్లోడ్ చేయలేదు. అది ఎలా వైరల్ అయ్యిందో నాకు తెలియదు. కానీ నేను చేసింది చాలా తప్పు. సర్ఫరాజ్తో ఉన్న చిన్నారి తన కొడుకని నాకు తెలియదు.’ అంటూ క్షమాపణలు కోరాడు. చదవండి: సర్ఫరాజ్ను సెల్ఫీ అడిగి మరి తిట్టాడు! ‘గెలుపైనా, ఓటమైనా అందరిదీ’ -
సారీ సర్ఫరాజ్!
లండన్ : ‘పందిలా బలిసావు.. డైట్ చేయవచ్చు కదా’ అంటూ పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్పై నోరుపారేసుకున్న ఓ అభిమాని ఎట్టకేలకు తన తప్పును తెలుసుకున్నాడు. సోషల్మీడియా ప్రభావంతో తన తప్పును తెలుసుకొని సర్ఫరాజ్కు క్షమాపణలు చెప్పాడు. తాను చేసిన పని పట్ల పశ్చాతాపం వ్యక్తం చేస్తూ ఓ వీడియోను విడుదల చేశాడు. ‘పాక్ కెప్టెన్ పట్ల నేను ప్రవర్తించిన తీరుకు పశ్చాతాపం వ్యక్తం చేస్తున్నాను. ఈ ఘటనతో బాధపడ్డ ప్రతి ఒక్కరికి బేషరతుగా క్షమాపణలు తెలియజేస్తున్నాను. నేను అసలు ఆ వీడియోనే అప్లోడ్ చేయలేదు. అది ఎలా వైరల్ అయ్యిందో నాకు తెలియదు. కానీ నేను చేసింది చాలా తప్పు. సర్ఫరాజ్తో ఉన్న చిన్నారి తన కొడుకని నాకు తెలియదు.’ అంటూ క్షమాపణలు కోరాడు. The man who abused sarfraz today makes an apology in his new video. Saying sorry to @SarfarazA_54 nd whole nation.👏👏 says that he neither new that the kid was his son nor sarfraz is hafiz e Quran What you people say on this ⚡#PakistanLovesSarfaraz #sorrysarfaraz pic.twitter.com/wdxQRJjhV9 — M Mansoor: IStandWithSarfraz 🇵🇰 (@mansoorThoughts) June 21, 2019 కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్కు వెళ్లిన సర్ఫరాజ్ను సదరు అభిమాని సెల్ఫీ అడగ్గా.. సర్ఫరాజ్ సైతం అంగీకరించాడు. కానీ అతని కొడుకు ఏడుస్తుండటంతో పక్కకు వెళ్లిపోయాడు. దీంతో ఆ అభిమాని పాక్ కెప్టెన్ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించాడు. ‘సర్ఫరాజ్ బాయ్.. ఎందుకిలా పందిలా బలిసావు. కొంచెం డైట్ చేయవచ్చు కదా’ అంటూ అభ్యంతరకర పదజాలం వాడాడు. అయినా సర్ఫరాజ్ ఏ మాత్రం ఆగ్రహానికి గురవ్వకుండా ప్రశాంతంగా అతన్ని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనిపై యావత్ క్రికెట్ అభిమానులు సర్ఫరాజ్కు మద్దతుగా నిలిచారు. అభ్యంతరకర పదజాలంతో నోరుపారేసుకున్న సదరు వ్యక్తిపై సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ‘నీలాంటి వెదవల జోలికి పోవడం కన్నా ప్రశాంతంగా ఉండటమే మంచిదని వాళ్లమ్మ సర్ఫరాజ్కు నేర్పించింది. అందుకే అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు’ అని, ఒక ఫ్రొఫెషనల్ ఆటగాడి పట్ల అలా ప్రవర్తించడం సిగ్గుమాలిన చర్యని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరైతే ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలని కామెంట్లు పెట్టారు. ఈ దెబ్బకు దిగొచ్చిన ఆ వ్యక్తి తన తప్పును తెలుసుకుని క్షమాపణలు కోరాడు. చదవండి: సర్ఫరాజ్ను సెల్ఫీ అడిగి మరి తిట్టాడు! మా కెప్టెన్కు బుద్ధి లేదు : అక్తర్ ఫైర్ మైదానంలోనే పాక్ కెప్టెన్కు అవమానం! -
మా కెప్టెన్ నిర్ణయం సరైందే : పాక్ క్రికెటర్
న్యూఢిల్లీ : భారత్తో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ నిర్ణయాన్ని ఆ జట్టు ఆల్రౌండర్ మహ్మద్ హఫీజ్ సమర్థించాడు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో సమిష్టిగా విఫలమైనందునే ఓడిపోయామని అభిప్రాయపడ్డాడు. ఓ పాక్ చానెల్కు ఇచ్చిన ఇంటర్యూలో హఫీజ్ మాట్లాడుతూ.. ' టాస్ నిర్ణయం మేం జట్టుగా కలిసి తీసుకున్నది. మ్యాచ్లో బౌలింగ్, బ్యాటింగ్ సరిగా చేయకపోవడం వల్లే ఓటమి చవి చూశాం. ఈ పరాజయంలో జట్టుగా అందరి బాధ్యత ఉంది. ఒక్క సర్ఫరాజ్నే నిందించడం సరికాదు. మా సెమీస్ అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. భారత్ మ్యాచ్ అనంతరం మాకు తగినంత సమయం దొరికింది. నూతనోత్సాహంతో మిగతా మ్యాచ్లను గెలుస్తాం’ అని హఫీజ్ ధీమా వ్యక్తం చేశాడు. ఇక పాక్ తమ తర్వాతి మ్యాచ్ను ఆదివారం దక్షిణాప్రికాతో ఆడనుంది. పాక్ ప్రధాని, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ సైతం టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవాలని మ్యాచ్కు ముందు సర్ఫరాజ్కు సూచించారు. కానీ సర్ఫరాజ్ ఆయన మాటను లెక్క చేయకుండా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో సర్ఫరాజ్ అహ్మద్ తీవ్ర ట్రోలింగ్కు గురయ్యాడు. ఈ నిర్ణయమే పాకిస్తాన్ విజయాలను దెబ్బతీసిందని, చాంపియన్స్ ట్రోఫి ఫైనల్లో భారత్ చేసిన తప్పునే ఇప్పుడు పాక్ చేసిందని అభిమానులు, ఆ దేశ మాజీ క్రికెటర్లు సర్ఫరాజ్పై మండిపడ్డారు. పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ అయితే సర్ఫరాజ్కు బుద్ధిలేదని ఘాటుగా వ్యాఖ్యానించాడు. -
పందిలా బలిసావు.. డైట్ చేయవచ్చు కదా
-
మైదానంలో సర్ఫరాజ్ అహ్మద్కు అవమానం!
-
బర్గర్లు తింటే తప్పేంటి : హర్భజన్ సింగ్
లండన్ : ప్రపంచకప్ మ్యాచ్లో భారత్ చేతిలో చిత్తుగా ఓడిన తర్వాత పాకిస్తాన్పై విమర్శలతో సోషల్ మీడియా హోరెత్తింది. ముఖ్యంగా పాక్ ఆటగాళ్ల ఫిట్నెస్, మ్యాచ్కు ముందు రోజు బయట షికార్లు చేశారంటూ ఆ దేశ అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఓటమిని జీర్ణించుకోలేని ఓ అభిమాని.. ‘ఎన్నో సమస్యలు ఉన్న పాకిస్తాన్లో మాకు క్రికెట్ కొంత సాంత్వననిస్తుంది. ఎంతో డబ్బు పెట్టి, ఇబ్బందులు పడి ఎన్నో ఆశలతో ఇక్కడికొస్తే ఇలాంటి ఆట ఆడతారా? ఆటగాళ్లకు కనీస ఫిట్నెస్ కూడా లేదు. మ్యాచ్కు ముందు రోజు రాత్రి వారు పిజ్జాలు, బర్గర్లు, ఐస్క్రీమ్లు తిన్నారని విన్నాను. ఎవరైనా ఆటగాళ్లు ఇలాంటి తిండి తింటారా? వీరు క్రికెట్లో కాదు కుస్తీలో పోటీ పడాల్సింది.’ అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. అయితే పాకిస్తాన్పై జరుగుతున్న ఈ తరహా ట్రోలింగ్పై టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. పిజ్జాలు, బర్గర్లు తింటే తప్పేంటని పాక్ ఆటగాళ్లను వెనకేసుకొచ్చాడు. ఆటగాళ్లు వారి ఇష్టమైన ఆహారన్ని తినవచ్చని అభిప్రాయపడ్డాడు. వారి ఆహారమే చెత్త ప్రదర్శనకు కారణమని చెప్పడం సరికాదన్నారు. మ్యాచ్కు ముందు రోజు పాక్ క్రికెటర్లు షికారు చేశారని, షోయబ్ మాలిక్ తన భార్య సానియా మీర్జా, ఇద్దరు సహచరులతో కలిసి ‘హుక్కా కేఫ్’లో ఉన్న ఫోటోలు వైరల్ అవ్వడంపై కూడా భజ్జీ స్పందించాడు. ‘అది నిజమో కాదో నాకు తెలియదు. ఒక వేళా అలా మ్యాచ్ ముందు రోజు షికారు చేస్తే మాత్రం సరైంది కాదు. అది ప్రపంచకప్లో భారత్తో మ్యాచ్ అయితే అస్సలు అలాంటి పనిచేయకూడదు. అదంతా అసత్యమనే అనుకుంటున్నా’ అని హర్భజన్ పేర్కొన్నాడు. భారత్తో ఓటమితో పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఆ జట్టు సెమీస్ చేరాలంటే న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లతో జరిగే 4 మ్యాచ్లను తప్పకుండా గెలవాలి. ఒకవేళ పాక్ ఓడిపోయి.. సెమీస్ చేరకుంటే మాత్రం సర్ఫరాజ్ తన కెప్టెన్సీ పదవి కోల్పోతాడని హర్భజన్ జోస్యం చెప్పాడు. ‘వారు విజయాలు పొందుతారని ఆశిస్తున్నాను. ఒక వేళ వారు సెమీస్కు వెళ్లకుండా ఉంటే.. భారత్, పాక్లో చెలరేగే భావోద్వేగాలు నాకు తెలుసు. నాకు తెలిసి సర్ఫరాజ్ తన కెప్టెన్సీ కూడా కోల్పోతాడు. ఇది భారత్-పాక్లో సర్వసాధారణమే. గతంలో చాలా మంది జట్టులోనే స్థానాలు కూడా కోల్పోయారు.’ అని భజ్జీ తెలిపాడు. చదవండి: ‘సర్ఫరాజ్ స్లీప్ ఫీల్డర్’ -
మా కెప్టెన్కు బుద్ధి లేదు : అక్తర్ ఫైర్
ఇస్లామాబాద్ : భారత్ చేతిలో పాకిస్తాన్ ఘోర పరాజయం పొందడంపై ఆ జట్టు మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఆదివారం భారత్తో జరిగిన మ్యాచ్లో పాక్ 89 పరుగుల (డక్వర్త్–లూయిస్ ప్రకారం) తేడాతో ఘోరపరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో పాక్ ఓటమికి కెప్టెన్ సర్ఫరాజ్ అనాలోచిత నిర్ణయమే కారణమని అక్తర్ మండిపడ్డాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా.. సర్ఫరాజ్, బౌలర్ హసన్ అలీలపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత జట్టు చేసిన తప్పునే నిన్న పాకిస్తాన్ జట్టు చేసింది. సర్ఫరాజ్ ఇంత తెలివి తక్కువ పనిచేస్తాడని నేను అసలు ఊహించలేదు. పాక్ చేజింగ్ చేయలేదనే విషయాన్ని, తమ బలం, ఏ రకమైన బౌలింగ్ ముఖ్యమనే విషయాలను మర్చిపోయాడు. పాకిస్తాన్ టాస్ గెలవగానే సగం మ్యాచ్ గెలిచాం అనుకున్నాం. కానీ సర్ఫరాజ్ చేజేతులా మ్యాచ్ను చేజార్చాడు. టాస్ చాలా కీలకం. పాకిస్తాన్ 260 పరుగులు చేసినా.. తమకున్న బౌలింగ్ వనరులతో కాపాడుకునేది. నిజంగా సర్ఫరాజ్ది బ్రెయిన్లెస్ కెప్టెన్సీ. కెప్టెన్గా అతను చేసిన పనిని ఏ మాత్రం సహించలేకపోతున్నాం. ఈ ఓటమి తీవ్ర బాధను మిగిల్చింది. అతనిలో ఇమ్రాన్ ఖాన్ షేడ్స్ చూడాలనుకున్నాను కానీ అతను మాత్రం బుద్ధిలేని పనులకు పాల్పడుతున్నాడు.’ అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. ఇక భారీగా పరుగులు సమర్పించుకున్న బౌలర్ హసన్ అలీపై సైతం అక్తర్ మండిపడ్డాడు. హసన్ అలీ కేవలం టీ20, పీఎస్ఎల్లు మాత్రమే చాలనుకుంటున్నాడని, వన్డేల్లో ఏమాత్రం కష్టపడటంలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. బ్యాట్స్మెన్ బాదుతున్నా.. షార్ట్ పిచ్ బంతులు వేసాడని, అతని బౌలింగ్లో ఎలాంటి పేస్, స్వింగ్ కనిపించలేదన్నాడు. బ్యాట్స్మెన్ ఏమాత్రం తడబాటుకు గురిచేయలేదని విమర్శించాడు. ఇక 9 ఓవర్లు వేసిన హసన్ అలీ ఏకంగా 84 పరుగులు సమర్పించుకున్నాడు. వెస్టిండీస్తో తొలి మ్యాచ్ ఓడినప్పుడు కూడా అక్తర్.. సర్ఫరాజ్కు బాగా కొవ్వెక్కిందని నోరు పారేసుకున్న విషయం తెలిసిందే. ‘మా కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ టాస్కి వస్తున్న సమయంలో.. కొవ్వు పేరుకుపోయిన అతని పొట్ట వెలుపలికి వచ్చి అసహ్యంగా కనిపించింది. నేను చూసిన మొదటి అన్ఫిట్ కెప్టెన్ అతనే. అతను తనకున్న కొవ్వుతో కనీసం కదల్లేకపోతున్నాడు. వికెట్ కీపింగ్ సమయంలోనూ ఇబ్బంది పడటం కనిపించింది’ అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ బౌలర్లలో ఒక్క మహ్మద్ ఆమిర్ మినహా మిగతా బౌలర్లంతా పోటీపడి పరుగులు సమర్పించుకున్నారు. భారత హిట్మ్యాన్ రోహిత్శర్మ బ్యాట్కు బలయ్యారు. చదవండి: ‘సోనాలీ బింద్రేను కిడ్నాప్ చేద్దామనుకున్నా’ మా కెప్టెన్కు బాగా కొవ్వెక్కింది : అక్తర్ -
టీమిండియా ఫ్యాన్స్పై పాక్ సారథి సెటైర్
టాంటాన్ : పాకిస్తాన్ సారథి సర్ఫరాజ్ అహ్మద్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్. వీలుచిక్కినప్పుడల్లా తన నోటికి పనిచెబుతూ వార్తల్లో నిలుస్తాడు. ప్రపంచకప్లో భాగంగా బుధవారం ఆస్ట్రేలియాతో పాకిస్తాన్ తలపడనుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సర్ఫరాజ్ మాట్లాడుతూ.. ‘పాక్ ఫ్యాన్స్ క్రికెట్ను ఎంతగా ఇష్టపడతారో అంతకంటే ఎక్కువగా ఆటగాళ్లను గౌరవిస్తారు. స్మిత్ను గత మ్యాచ్లో కొందరు ఎగతాళి చేసినట్లు తెలిసింది. కానీ పాక్ ఫ్యాన్స్ అలా ఎప్పటికీ చేయరు. ఆసీస్తో మ్యాచ్లో స్టీవ్ స్మిత్ను కించపరిచేలా మా వాళ్లు ప్రవర్తించరు’అంటూ టీమిండియా ఫ్యాన్స్ను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్లో భారత్ అభిమానులు కొందరు స్మిత్ పట్ల అతిగా ప్రవర్తించారు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న స్మిత్ను ట్యాంపరింగ్ వివాదాన్ని ప్రస్తావిస్తూ ‘చీటర్, చీటర్’ అంటూ గేలి చేశారు. కొద్దిసేపు దీనిని గమనించిన కోహ్లి, హార్ధిక్ పాండ్యా వికెట్ పడ్డ సమయంలో ప్రేక్షకులను ఉద్దేశిస్తూ... అలా ప్రవర్తించవద్దంటూ మందలించాడు. స్మిత్ కోసం చప్పట్లు కొట్టి ప్రోత్సహించాలని సైగ చేస్తూ.. తన క్రీడాస్పూర్తిని చాటుకున్నాడు. అయితే ఈ వివాదాన్ని దృష్టిలో పెట్టుకునే సర్ఫరాజ్ అలా మాట్లాడాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. టీమిండియాను గేలి చేయడానికి ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని సర్ఫరాజ్ ఎదురుచూస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు. చదవండి: బెయిల్స్ పడకపోవడం ఏంట్రా బాబు! మావాళ్ల తరఫున సారీ స్మిత్ : కోహ్లి -
పాక్ టి20 కెప్టెన్ గా సర్ఫరాజ్
కరాచీ: పాకిస్తాన్ టి20 నూతన కెప్టెన్గా వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ను నియమించారు. టి20 ప్రపంచకప్లో దారుణ వైఫల్యం అనంతరం కెప్టెన్సీకి షాహిద్ ఆఫ్రిది రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో వైస్ కెప్టెన్గా ఉన్న సర్ఫరాజ్కు బాధ్యతలు అప్పగిస్తున్నట్టు పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రకటించింది. గత కొన్నేళ్లుగా మూడు ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తూ సర్ఫరాజ్ ఆకట్టుకుంటున్నాడు. ‘కెప్టెన్గా ఎన్నిక కావడం గౌరవంగా భావిస్తున్నాను. తిరిగి మా జట్టు టాప్ ర్యాంకును అందుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాను’ అని 28 ఏళ్ల సర్ఫరాజ్ తెలిపారు. ఇప్పటికే టెస్టులకు మిస్బా, వన్డేలకు అజహర్ అలీ కెప్టెన్లుగా కొనసాగుతున్నారు. -
‘ప్రాక్టీస్’లో నెగ్గిన పాకిస్తాన్
రాణించిన హఫీజ్ కోల్కతా: బౌలింగ్లో రాణించిన పాకిస్తాన్... టి20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్లో విజయం సాధించింది. సోమవారం జరిగిన మ్యాచ్లో 15 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన పాక్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులు చేసింది. హఫీజ్ (49 బంతుల్లో 70 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగాడు. సర్ఫరాజ్ అహ్మద్ (13)తో మూడో వికెట్కు 39; ఉమర్ అక్మల్తో నాలుగో వికెట్కు 53 పరుగులు జత చేశాడు. కెప్టెన్ ఆఫ్రిది (0) తొలి బంతికే డకౌటయ్యాడు. తిసారా పెరీరా 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన లంకను లెఫ్టార్మ్ స్పిన్నర్ ఇమద్ వసీమ్ (4/25) వణికించాడు. దీంతో లంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 142 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లండ్కు మరో విజయం ముంబై: టి20 ప్రపంచకప్ సన్నాహల్లో భాగంగా జరిగిన వార్మప్ మ్యాచ్లను ఇంగ్లండ్ విజయాలతో ముగించింది. తొలి వార్మప్లో పటిష్ట న్యూజిలాండ్ను దెబ్బతీయగా... తాజాగా సోమవారం స్థానిక బ్రబౌర్న్ స్టేడియంలో ముంబై క్రికెట్ సంఘం ఎలెవన్తో జరిగిన మ్యాచ్లోనూ ఇంగ్లండ్ 14 పరుగుల తేడాతో నెగ్గింది. ముందుగా ఇంగ్లండ్ జట్టు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 177 పరుగులు చేసింది. జో రూట్ (34 బంతుల్లో 48; 3 ఫోర్లు; 2 సిక్సర్లు), అలెక్స్ హేల్స్ (23 బంతుల్లో 37; 7 ఫోర్లు) రాణించారు. అనంతరం బరిలోకి దిగిన ఎంసీఏ ఎలెవన్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 136 పరుగులు చేసింది. ఓపెనర్ జే బిస్టా (37 బంతుల్లో 51; 5 ఫోర్లు; 2 సిక్సర్లు), జేమ్స్ విన్స్ (38 బంతుల్లో 45; 4 ఫోర్లు; 1 సిక్స్) ఆకట్టుకున్నారు. -
‘మహా’ అభివృద్ధికి కృషి
♦ బల్దియూ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ♦ నగరంలో పలుచోట్ల ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు వరంగల్ అర్బన్ : మహా నగర అభివృద్ధికి కృషి చేద్దామని బల్దియూ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ పిలుపునిచ్చారు. శనివారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ పతాకం ఎగురువేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ-ఆఫీస్ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వేడుకల్లో అడిషనల్ కమిషనర్ షాహిద్ మసూద్, డిప్యూటీ కమిషనర్లు రాజేంద్ర కుమార్, రవి, ఎస్ఈ అబ్దుల్ రహ్మన్, ఎంహెచ్వో జయ ప్రకాశ్, బయాలాజిస్టు సాధనాల సంధ్య, ఉద్యాన వన అధికారి సంధ్య, ఏసీపీలు శైలజ, శిల్ప, గణేష్, రవి, ఈఈ నిత్యనందం, శివకుమార్,మేనేజర్ అబ్బాస్, డీఈలు, ఆర్వోలు, సానిటరీ సూపర్వైజర్లు, సూపరింటెండెంట్లు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. నగరపాలక సంస్థలో ఉత్తమ సేవలు అందిస్తున్న 45 మంది ఉద్యోగులకు కమిషనర్ సర్ఫ రాజ్ అహ్మద్ ప్రశంసా పత్రాలు ఇచ్చారు. అవార్డులు పొందిన ఉద్యోగులు ప్రజారోగ్య విభాగం: శానిటరీ ఇన్స్పెక్టర్లు గోల్కండ శ్రీను, మాదాసి సాంబయ్య, హెల్త్ అసిస్టెంట్ ఏల్ల స్వామి, హెల్త్ ఇన్స్పెక్టర్ బిర్రు రవి, జవాన్లు వెంకటేష్, జే.స్వామి, డ్రైవర్ అభిలాష్, జవాన్లు దామెర సారయ్య, జి.శ్రీనివాస్, కవిత, శ్యామీమ్, కరుణాకర్, మూర్తి రాజ్, పి.రవికుమార్,శ్రీనివాసులు, జన్ను స్వామి, సోలా రాజు, పోలెపాక కుమార్, పీహెచ్ వర్కర్లు ఎ.స్వప్న, పోచయ్య, యాకుబ్, మైదం సరోజ, సుగుణ, మస్కే కుమార్, కోట డేవిడ్, గాదే లక్ష్మి, జన్ను రవి, హన్మకొండ కుమార్, సాంబయ్య, ప్రేమ్ సాగర్, కౌసల్య, లక్ష్మి,బాసికే రజిత పన్నుల విభాగం ఆర్వో ఎస్.శ్రీహరి, ఆర్ఐలు మన్సూర్ అలీ, బి.బాలు, బిల్ కలెక్టర్లు పి.వీరస్వామి, వెంకటస్వామి, మొగిళి, సీనియర్ అసిస్టెంట్ బి.ఉమా దేవేందర్ టౌన్ ప్లానింగ్ విభాగం టీపీఎస్ వీరస్వామి, చైన్మెన్ సదారెడ్డి, హనుమయ్య, రమే ష్, సీనియర్ అసిస్టెంట్ అనిల్ బాబు, ట్రేసర్ గౌరీ శంకర్ ఇంజినీరింగ్ విభాగం ఏఈలు రవికిరణ్, బి.సురేందర్, డ్రాఫ్ట్మెన్ డీవీఎలల్ రంగనాథ్, లైన్మెన్ వెంకటయ్య, ఆపరేటర్ ఎ.సుదర్శన్, హెల్పర్ కొమ్మాలు అకౌంటింగ్ విభాగం అకౌంటెంట్ జాకీర్ హూస్సేన్, సీనియర్ అడిటర్ బి.రాజు, సీనియర్ అసిస్టెంట్ చార్లెస్ బ్రోవ్సన్. ఉద్యాన విభాగం హెడ్ మాలీ ఎండీ సిద్దిఖ్, సీనియర్ అసిస్టెంట్ ఎస్.సంజయ్కుమార్, మాలీ యండీ.రఫీయోద్దీన్లు స్వీకరించారు. ‘కుడా’ కార్యాలయంలో.... హన్మకొండలోని కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) కార్యాలయంలో వైస్ చైర్మన్ సర్ఫరాజ్ అహ్మద్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కుడా ప్లానింగ్ అధికారి అజిత్ రెడ్డి, ఈఈ భీం రావు, డీఈలు,ఏఈలు,సిబ్బంది పాల్గొన్నారు. హన్మకొండ పబ్లిక్ గార్డెన్లో కమిషనర్ సర్ఫ ాజ్ అహ్మద్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన వన అధికారి సదానందం తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో... జిల్లా పోలీసు కార్యాలయంలో, రూరల్ డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్ ఎదుట వరంగల్ రూరల్ అదనపు ఎస్పీలు కె.శ్రీకాంత్, జాన్వెస్లీలు జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించారు. ఎంజీఎంలో ఎంజీఎం : ఎంజీఎం ఆస్పత్రిలో సూపరింటెండెంట్ మనోహర్, కేఎంసీలో ప్రిన్సిపాల్ అబ్బగాని విద్యాసాగర్, ఆర్డీ కార్యాలయంలో ఆర్డీ నాగేశ్వర్రావు, రీజినల్ ఐ ఆస్పత్రిలో సూపరింటెండెంట్ పాండురంగజాదవ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డీఎంహెచ్ఓ బొజబోయిన సాంబశివరావు పతాకావిష్కరణ చేశారు. కేఎంసీ వైస్ ప్రిన్సిపాల్ వి. చంద్రశేఖర్, ఆర్ఎంఓలు హేమంత్, శివకుమార్, డిడి శ్రీనివాసులు, అడిషనల్ డిఎంహెచ్ఓ శ్రీరాం, ఎన్ఆర్హెచ్ఎం డీపీఎం రాజిరెడ్డి, డీఐఓ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్రాజు పతాకవిష్కరణ చేశారు. వైద్యులు అన్వర్, బందెల మోహన్రావు, కూరపాటి రమేశ్, కంకల మల్లేశం, భూమిగారి మోహన్రావు, విజయ్చందర్రెడ్డి, కస్తూరి ప్రమీళ, సంద్యరాణి, మెరుగు సుధాకర్, మన్మోహన్ రాజు, తాళ్ళరవి, తదితరులు పాల్గొన్నారు. కేయూలో కేయూక్యాంపస్: యూనివర్సిటీ అభివృద్ధికి పునరంకితమవుదామని కేయూ ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్తాఫ్హుస్సేన్ అన్నారు. క్యాంపస్లోని పరిపాలనాభవనం ఆవరణలో ఆయన జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. క్రీడాపోటీల విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్ రామస్వామి , వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, ఉద్యోగసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిట్లో కాజీపేట రూరల్ : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో శనివారం స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. నిట్ డైరక్టర్ టి.శ్రీనివాస్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఎన్సీసీ క్యాడెట్స్ పరేడ్ నిర్వహించారు. ఆవరణంలో డెరైక్టర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బాస్కెట్ బాల్ కోర్టును ప్రారంభించినట్లు నిట్ పీఆర్వో ఫ్రాన్సెస్ సుధాకర్ తెలిపారు. కలెక్టరేట్లో.. కలెక్టరేట్లో జేసీ ప్రశాత్ జీవన్ పాటిల్ పతాకావిష్కరణ చేశారు. డీఆర్వో కె.శోభ, లక్ష్మిపతి, సూరింటెండెంట్లు పాల్గొన్నారు. హన్మకొండ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాజ్కుమార్, డీఆర్డీఏలో పీడీ వెంకటేశ్వర్రెడ్డి , డ్వామా కార్యాలంలో పీడీ శేఖర్రెడ్డి, రిజిస్ట్రార్ కార్యాలయంలో డీఆర్ సుభాషిణి పతాకావిష్కరణచేశారు. వేయిస్థంభాల దేవాలయంలో హన్మకొండ కల్చరల్ : చారిత్రక శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్థంభాల దేవాలయంలో కేంద్రపురావస్తుశాఖ జిల్లా అధికారి కె. మల్లేషం జెండా ఆవిష్కరణ చేశారు ఈఓ వద్దిరాజు రాజేందర్రావు, ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ , బసవయ్య పాల్గొన్నారు. గ్రామజ్యోతిలో భాగస్వాములు కావాలి ఖిలావరంగల్ : ప్రభుత్వం చేపట్టిన గ్రామజ్యోతి పథకంలో భాగస్వాములు కావాలని ఇన్చార్జీ ఉపరవాణాశాఖ కమిషనర్, ఆర్టీఓ మాధవరావు పిలుపునిచ్చారు. శనివారం వరంగల్ ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాధవరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలని సూచించారు. సీనియర్ ఎంవీఐలు సత్యనారాయణ, రాంచందర్, జూనియర్ ఏఎంవీఐలు వెంకన్న, ఫహీమాసుల్తాన్, వేణుగోపాల్రెడ్డి, కవిత, రవికుమార్, ఏఓ జగన్మోహన్ , కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు. -
పాకిస్తాన్ భారీ విజయం
కొలంబో: పాకిస్తాన్ ఆల్రౌండ్ షో ముందు ఆతిథ్య శ్రీలంక జట్టు పూర్తిగా తేలిపోయింది. సర్ఫరాజ్ అహ్మద్ (74 బంతుల్లో 77; 7 ఫోర్లు), హఫీజ్ (64 బంతుల్లో 54; 4 ఫోర్లు) అర్ధ సెంచరీలకు తోడు బౌలర్లు కూడా చెలరేగడంతో మూడో వన్డేలో పాకిస్తాన్ 135 పరుగుల తేడాతో నెగ్గింది. దీంతో ఐదు వన్డేల సిరీస్లో పర్యాటక జట్టు 2-1 ఆధిక్యంతో కొనసాగుతోంది. నాలుగో వన్డే 22న జరుగుతుంది. ఆదివారం ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన పాక్ 50 ఓవర్లలో నాలుగు వికెట్లకు 316 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ అజహర్ అలీ (59 బంతుల్లో 49; 4 ఫోర్లు), షెహజాద్ (54 బంతుల్లో 44; 4 ఫోర్లు), షోయబ్ మాలిక్ (29 బంతుల్లో 42 నాటౌట్; 5 ఫోర్లు), రిజ్వాన్ (22 బంతుల్లో 35; 2 ఫోర్లు; 1 సిక్స్) రాణించారు. అనంతరం లక్ష్యం కోసం బరిలోకి దిగిన లంక 41.1 ఓవర్లలో 181 పరుగులకు కుప్పకూలింది. తిరిమన్నె (67 బంతుల్లో 56; 4 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. యాసిర్ షాకు నాలుగు, అన్వర్, వసీంలకు రెండేసి వికెట్లు దక్కాయి. అంతకుముందు 34వ ఓవర్లో స్టాండ్స్ నుంచి పాక్ ఫీల్డర్ వైపు ఓ అభిమాని రాయి విసరడంతో కలకలం రేగింది. కొద్దిసేపు మ్యాచ్ను నిలిపివేయడంతో పాటు ప్రేక్షకులందరినీ ఖాళీ చేయించాక ఆటను కొనసాగించారు. -
నిజమే చెప్పండి
►కచ్చితత్వం కోసమే కుటుంబసర్వే ►అపోహలు, అనుమానాలు వద్దు ► పథకాల అమలుకు సర్వే ప్రాతిపదిక కాదు ►స్థానికత’కోసం కాదు ►19న కుటుంబసభ్యుల హాజరు తప్పనిసరి ►గల్ఫ్ వెళ్లిన వారి వివరాలు నమోదు చేయం ►జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ప్రజల సామాజిక స్థితిగతులు తెలుసుకునేందుకోసమే 19న కుటుంబసర్వే నిర్వహిస్తున్నట్లు ఇన్చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. సర్వేపై ప్రజల్లో అనేక అపోహలు... సందేహాలు నెలకొన గా వాటిని నివృత్తి చేసేందుకు కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి సమగ్రంగా వివరించారు. రాష్ట్ర సమగ్ర సమాచారంతో ప్రభుత్వానికి అర్హులకు సంక్షేమ ఫలాలను అందించడం, పథకాల రూపకల్పన లబ్ధిదారుల ఎంపిక సులభతరమవుతుందని తెలిపారు. ఈ సర్వేలో స్థానికతను నిర్ధారించడం లేదన్నారు. ప్రతి పౌరుడి సమాచారం సేకరిస్తామని చెప్పారు. సూక్ష్మంగా నిర్వహించే ఈ సర్వేతో ప్రతి కుటుంబానికి సంబంధించిన సమాచారం ప్రభుత్వ రికార్డుల్లోకి చేరుతుందని, తద్వారా సంక్షేమ ఫలాలు దుర్వినియోగం కాకుండా దోహదపడతుందనిస్పష్టం చేశారు. కొందరికి మినహాయింపు ఇంటింటి సర్వేకు కుటుంబసభ్యుల హాజరు తప్పనిసరి అని కలెక్టర్ తెలిపారు. పాఠశాలలు, హాస్టల్లో ఉండే పిల్లలు, అత్యవసర వైద్య సేవలు తీసుకునేవారు, సర్వే విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు మాత్రమే మినహాయింపు ఉంటుందని వెల్లడించారు. ఇతర దేశాల్లో నివసిస్తున్న కుటుంబసభ్యుల వివరాలు నమోదు చేయబోమని స్పష్టం చేశారు. ఉపాధి నిమిత్తం గ్రామీణ ప్రాంతాలనుంచి పట్టణాల్లోకి వచ్చి స్థిరపడిన వారు ఒకేచోట వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. అయితే పట్టణాల్లో లేదంటే సొంత గ్రామానికి వెళ్లి నమోదు చేసుకోవచ్చని తెలిపారు. సర్టిఫికెట్లలో ఏదో ఒకటి చూపాలి సర్వేకు వచ్చే ఎన్యుమరేటర్కు కుటుంబసభ్యులు ధ్రువీకరణ పత్రాలు చూపించాల్సి ఉంటుందని కలెక్టర్ వివరించారు. వికలాంగులు సదెరమ్ సర్టిఫికెట్లు ఉంటే చూపించాలని సూచించారు. రేషన్కార్డు, బ్యాంకు, పోస్టాఫీస్ ఖాతా, కరెంటుబిల్లు, ఆధార్కార్డును ధ్రువీకరణగా చూపాలని చెప్పారు. కుటుంబాల విభజనకు మాత్రమే వంట గదులను ప్రామాణికంగా తీసుకుని వివరాలు నమోదు చేస్తామని వెల్లడించారు. తప్పుడు సమాచారమిస్తే భవిష్యత్తులో ఇబ్బందులెదురవుతాయని తెలిపారు. ఉదాహరణకు భూములు, వాహనాలు ఉన్నప్పటికీ లేవనే సమాధానం చెబితే భవిష్యత్తులో వాటిని విక్రయించుకోరాదని, రిజిస్ట్రేషన్లో ఆ వివరాలు తేలిపోతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. పక్కా ఏర్పాట్లు జిల్లాలో కుటుంబాల సమాచారం నమోదులో కచ్చితత్వమే లక్ష్యంగా ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో 9.76 లక్షల కుటుంబాలున్నాయని, వాటన్నింటికీ నోషనల్ నంబర్లు ఇస్తున్నామని తెలిపారు. నంబర్ల ప్రకారం 10.20 లక్షల కుటుంబాలు కావచ్చని అంచనా వేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ లెక్కన సర్వేకు 35 నుంచి 36 వేల మంది ఎన్యుమరేటర్లు అవసరముందని అంచనా వేశామన్నారు. సర్వే ఉదయం 8 గంటలకు ప్రారంభమై 10 గంటలపాటు సాగుతుందని, సర్వే రోజు సాయంత్రమే ఫ్రీజ్ చేస్తామని పేర్కొన్నారు. -
ఉద్యమంలా.. సర్వే!
ముకరంపుర : రాష్ట్ర సర్కారు ఆదేశాల మేరకు ఈనెల 19న ఇంటింటి సర్వేను జిల్లాలో ఉద్యమంలా చేపట్టి విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. కుటుంబ సర్వే ను పకడ్బందీగా పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ఇన్చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ గురువారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలతో సమావేశమయ్యా రు. సర్వే నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. నాలుగు గంటలపాటు పవర్ పాయింట్ ప్రజెం టేషన్ ద్వారా అధికారులకు అవగాహన కల్పిం చారు. సర్వేపై జిల్లావ్యాప్తంగా విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. సిబ్బంది లభ్యత, కొరతపై దృష్టి సారించాలని సూచించారు. అప్పగించిన బాధ్యతలను సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని ఆదేశించారు. 9.70 లక్షల కుటుంబాలు జిల్లాలో 9.70 లక్షల కుటుంబాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందుకు 32,500 మంది ఉద్యోగులు అవసరమని గుర్తించి ఆ మేరకు క్షేత్రస్థాయిలో ప్రణాళిక రూపొందించారు. ప్రతి ఉద్యోగి 25 నుంచి 30 ఇళ్లు సర్వే చేసే లా సన్నద్ధం చేస్తున్నారు. ప్రతి 30 కుటుంబాలకు ఒక ఎన్యుమరేటర్, 20 మంది ఎన్యుమరేటర్లకు ఒక సూపర్వైజర్ను నియమించారు. గ్రామస్థాయి లో విలేజ్ ఆఫీసర్ అందుబాటులో ఉంటారు. సర్వేకు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, గురుకుల పాఠశాల, కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులను ఉపయోగించాలని ఇన్చార్జి కలెక్టర్ సూచించారు. నేటి నుంచి నోషనల్ సీరియల్ నంబర్ జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో అన్ని ఇళ్లకు నంబర్లు వేయాలని సర్ఫరాజ్ సూచించారు. వరుస క్రమంలో ఒకటి నుంచి మొదలుపెట్టి ప్రక్రియను ( నోషనల్ సీరియల్ నంబర్) ఈ నెల 12లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వే సిబ్బందికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలని సూచించారు. వంద మంది ఎన్యుమరేటర్లకు ఒక మాస్టర్ ట్రైనర్ను నియమించాలని, వారితో శిక్షణ ఇప్పించాలని సూచించారు. మున్సిపాలిటీల్లో సర్వే బాధ్యత కమిషనర్లదేనని, మండల స్థాయిలో తహశీల్దార్లు బాధ్యత వహించాలని ఆదేశించారు. ఆగస్టు 19న ఇంటింటి సర్వే గురించి అన్ని గ్రామాల్లో ప్రతి రోజు చాటింపు వేయించాలన్నారు. మున్సిపాలిటీల్లో ఆటోల ద్వారా విస్తృత ప్రచారం చేయించాలని సూచించారు. డివిజన్, మండల స్థాయి అధికారులు పత్రికల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అవగాహన కల్పించాలన్నారు. సర్వే ఇలా.. ఇంటింటి సర్వే సందర్భంగా ఎన్యుమరేటర్లు ముఖ్యంగా గ్యాస్ కనెక్షన్, వయసు ధ్రువీకరణపత్రాలు, పోస్టాఫీస్, బ్యాంకు పుస్తకాలు, పింఛన్ గుర్తింపుకార్డు, స్వశక్తి సంఘాల పాస్బుక్లు, ఆధార్ కార్డులు, వికలాంగుల సదరన్ సర్టిఫికెట్లు, విద్యుత్ బిల్లులు, భూములకు సంబంధించిన పట్టాదారు పాస్బుక్కులు, టైటిల్డీడ్, వాహనాలకు సంబంధించిన ఆర్సీ బుక్లు, పశుసంపద వివరాలు, ఓటరు గుర్తింపుకార్డులను పరిశీలించి వివరాలు నమోదు చేసుకుంటారని తెలిపారు. ప్రజలు పత్రాలన్నింటినీ ఇంటికొచ్చే ఎన్యుమరేటర్కు చూపించాలని, అందుకనుగుణంగా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. మండలస్థాయి సిబ్బందికి తహశీల్దార్లు సర్వేపై శిక్షణ ఇవ్వాలన్నారు. సమావేశంలో అదనపు జేసీ టి.నంబయ్య, డీఆర్వో టి.వీరబ్రహ్మయ్య, డీఆర్డీఏ పీడీ విజయగోపాల్, జెడ్పీ సీఈవో సదానందం, సీపీవో సుబ్బారావు తదితరులు ఉన్నారు. -
దిశానిర్దేశకుడు పీవీ
- పీవీ ఇంటిని మ్యూజియంగా మార్చేందుకు కృషి - మాజీ ప్రధాని జయంతి సభలో ఇన్చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ వంగర(భీమదేవరపల్లి) : దేశానికి దిశా..దశ నిర్దేశించిన గొప్ప మేధావి మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు అని, ఆయన ఆశయూలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇన్చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. శనివారం మండలంలోని వంగరలో పీవీ నర్సింహరావు 93వ జయంతి అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ పీవీ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. వంగరలోని పీవీ ఇంటిని మ్యూజియంగా మార్చేందకు సీఎం కేసీఆర్కు విన్నవిస్తామన్నారు. ఈ సందర్భంగా పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు పీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగదును అందించారు. కార్యక్రమంలో కరీంనగర్ ఆర్డీవో చంద్రశేఖర్, పీవీ సొదరుని కుమారుడు, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు పీవీ మదన్మోహన్, జెడ్పీటీసీ సభ్యురాలు మాలోతు రాంచందర్నాయక్, సర్పంచ్ ఉపసర్పంచ్ వొల్లాల రమేశ్, కాల్వ సునీత, మండల ప్రత్యేకాధికారి నర్సింహరావు, తహశీల్దార్ కృష్ణవేణి, ఎంపీడీవో నర్సింహారెడ్డి, హౌసింగ్ డీఈఈ మహేశ్, ఏఈలు రాజమల్లారెడ్డి, కిషన్ పాల్గొన్నారు. సాగుకు యోగ్యమైన భూమే పంపిణీ దళితులకు పంపిణీ చేయనున్న భూమి సాగుకు యోగ్యంగా ఉంటుందని ఇన్చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. మొదటి విడతగా ప్రతి నియోజకవర్గానికి ఓ గ్రామాన్ని ఎంపికచేసి భూ పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. భూమిలేని దళితులకు 3 ఎకరాలు అందిస్తామన్నారు. పంపిణీ చేసిన భూమిలో బోరుబావి, విద్యుత్ సౌకర్యంతో పాటుగా డ్రిప్ సౌకర్యం అందిస్తామన్నారు. ప్రభుత్వానికి రుణపడి ఉంటాం... తమ కుటుంబం టీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటుందని పీవీ నర్సింహరావు సొదరుడి కుమారుడు మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు పీవీ మదన్మోహన్రావు చెప్పారు. ఇంత కాలానికి పీవీకి గుర్తింపు వచ్చిందన్నారు. వంగరలోని పీవీ విగ్రహానికి శాశ్వత నిచ్చెన ఏర్పాటు చేరుుంచాల్సిన అవసరం ఉందన్నారు. -
అన్నంత పని చేశారు
=ఐటీడీఏ పీఓ సర్ఫరాజ్ అహ్మద్ బదిలీ =ఫలించిన కేంద్ర మంత్రి పైరవీ =తనకు అనుకూలంగా ఉండే అధికారిని రప్పించేందుకు యత్నాలు =మహాజాతర ముందు బదిలీ చేయడంపై విమర్శలు సాక్షి ప్రతినిధి, వరంగల్: మేడారం మహాజాతరకు గడువు ముంచుకొస్తుంటే... అన్నీ తెలిసిన అధికారి ఉండాలని అందరూ భావిస్తారు. మన జిల్లా ప్రజాప్రతినిధులు మాత్రం తమకు ‘తెలిసిన’ వారే ఉండాలని పట్టుబడుతున్నారు. జాతర పనులు, కాంట్రాక్టులను అనుచరులకు కట్టబెట్టేందుకు అడ్డుగా ఉన్న ఉన్నతాధికారిని పంపించేశారు. ములుగు డివిజన్లో అన్ని అంశాలపై బాగా పట్టున్న ఏటూరునాగారం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్ట్ అధికారి సర్ఫరాజ్ అహ్మద్ బదిలీ అయ్యారు. ఆయనను కరీంనగర్ జాయింట్ కలెక్టర్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సర్ఫరాజ్ అహ్మద్కు జాయింట్ కలెక్టర్ పోస్టు ఇవ్వడం బాగానే ఉన్నా... జాతర సమయంలో బదిలీ చేయడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి బలరాంనాయక్ పట్టుబట్టడం వల్లే ఈ బదిలీ జరిగినట్లు తెలుస్తోంది. మేడారం జాతర పనుల కాంట్రాక్టులను అప్పగించే విషయంలో చెప్పినట్లు చేసే అధికారిని ఐటీడీఏ పీఓగా నియమించుకునేందుకు సర్ఫరాజ్ను ఇక్కడి నుంచి మార్చినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేంద్ర మంత్రికి బాగా నమ్మకస్తుడైన ఓ అధికారికి జాతర సమయంలో ఇక్కడ పోస్టింగ్ ఇప్పించుకునేందుకే ఇప్పుడున్న పీఓను మార్చినట్లు తెలుస్తోంది. సర్ఫరాజ్ అహ్మద్ 2012 ఆగస్టు 7న పీఓగా బాధ్యతలు చేపట్టారు. గిరి జన సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయిస్తున నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు గట్టి చర్యలు తీసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో పని చేసే అధికారులు సమయపాలన పాటిం చేలా చేశారు. నిధుల ఖర్చు విషయంలోనూ పారదర్శకతకు పెద్దపీట వేశారు. అన్నింటికంటే ముఖ్యంగా గోదావరి నదిలో ఇసుక తవ్వకాలపై కఠినంగా వ్యవహరించారు. ఇది రాజ కీయ నేతలకు మింగుడుపడలేదు. జిల్లాలోని మంత్రులు ఒత్తిడి తెచ్చినా... అహ్మద్ నిబంధనల ప్రకారం వ్యవహరించారు. దీంతో అధికార పార్టీ నేతలు ఆయన బదిలీ కోసం మంత్రులపై ఒత్తిడి తీసుకొచ్చారు. సర్ఫరాజ్ను బదిలీ చేయడంతోపాటు తమకు పూర్తిగా అనుకూలంగా ఉండే అధికారిని నియమించుకునేలా కేంద్ర మంత్రి ప్రయత్నాలు చేశారు. జాతర సమయంలో మార్చితే విమర్శలు వస్తాయని తెలి సినా ఉత్తర్వులు జారీ అయ్యేలా పట్టుబట్టారు. గతంలో ఐటీడీఏ పీఓగా పనిచేసి అవినీతి ఆరోపణలతో బదిలీ అయిన అధికారినే పీఓగా తీసుకువచ్చేందుకు మంత్రి ఇదే స్థాయిలో ప్రయత్నిస్తున్నట్లు తెలిస్తోంది. జాతర సమయంలో సమర్థులైన అధికారులు ఉన్నా... కొత్త సమస్యలు ఎదురుకావడం సహజం. సర్ఫరాజ్ అహ్మద్ గతంలో ములుగు సబ్ కలెక్టరుగానూ పని చేశారు. ఈ అనుభవం జాతర ఏర్పాట్లు, నిర్వహణలో బాగా ఉపయోగపడేది. ఇవేమీ పట్టని ప్రజాప్రతినిధులు సొంత ప్రయోజనాల కోసం... ఆరోపణలు ఉన్న అధికారులను తీసుకొచ్చేందుకు సర్ఫరాజ్ను బదిలీ చేయడం విమర్శలకు తావిస్తోంది.