beats
-
నిమ్మకాయ, పచ్చిపసుపుతో సిద్ధు భార్య కేన్సర్ ఖతం: నిపుణుల హెచ్చరికలివే!
మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇటీవల కీలక విషయాన్ని ప్రకటించిన సోషల్ మీడియాలో సంచలనంగా మారారు. తన భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ స్టేజ్-4 కేన్సర్ని విజయవంతంగా ఓడించిందని మీడియా సమావేశంలో ప్రకటించారు. కేవలం వైద్యులమీదే ఆధారపడకుండా కొన్ని ప్రత్యేక మైన చికిత్సా పద్దతులను అవలంబించామని క్రమశిక్షణ, కఠినమైన జీవనశైలి,ఆయుర్వేద పద్ధతులు, ఆహార నియమాలతో తీవ్రమైన స్టేజ్-4 కేన్సర్నుంచి బయటపడినట్టు వెల్లడించారు. ముఖ్యంగా నిమ్మరసం, పచ్చి పసుపు, యాపిల్ సైడర్ వెనిగర్, వేపాకులు, తులసి వంటి వాటి ద్వారా కేన్సర్ మహమ్మారిని జయించినట్టు ప్రకటించడం చర్చకు దారి తీసింది. మరి కేవలం స్ట్రిక్ట్ డైట్ మాత్రమే క్యాన్సర్ రికవరీకి సహాయపడుతుందా? నిపుణులు ఏమంటున్నారు?కొన్నాళ్ల క్రితం కేన్సర్ బారిన పడిన నవజ్యోత్ కౌర్ చికిత్స తీసుకుంది. తగ్గిపోయిందని అనుకున్నారు. కానీ కుమారుడి పెళ్లి తర్వాత స్టేజ్-3 రూపంలో తీవ్రంగా మళ్లీ వచ్చింది. చికిత్స తీసుకున్నా ఫలితం లేదు సరికదా మరింత ముదిరింది. కేవలం 5 శాతం మాత్రమే చాన్స్ ఉందని, కోలుకోవడం కష్టం అని వైద్యులు తేల్చేశారు. కానీ కఠినమైన ఆహార నియమాలు, జీవన శైలి మార్పులతో ఆమె క్యాన్సర్ను ఓడించిందని, అయితే ఇది దగ్గర డబ్బు ఉన్నందున కాదు, క్రమశిక్షణ, ఆహార నియమాలను పాటించి 40 రోజుల తర్వాత ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యిందంటూ సోషల్మీడియా ద్వారా వెల్లడించారు సిద్దూ. ఆమె ఇపుడు వైద్యపరంగా కేన్సర్ను ఓడించిందని సిద్దూ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఉపవాసం ప్రాముఖ్యత, చక్కెర , కార్బోహైడ్రేట్లు లేని ఆహారం కేన్సర్ను దూరం చేస్తుందన్నారు. ఆమె తన రోజును నిమ్మరసంతో ప్రారంభించేదని, పచ్చి పసుపు తినేదని, ఆపిల్ సైడర్ వెనిగర్, వేపాకులు, తులసి లాంటి తీసుకునేదన్నారు. ఇంకా సిట్రస్ పండ్లు,గుమ్మడికాయ, దానిమ్మ, ఉసిరి, బీట్రూట్ , వాల్నట్స్ వంటి రసాలు ఆమె రోజువారీ ఆహారంలో భాగంగా ఉండేవన్నారు.My wife is clinically cancer free today ….. pic.twitter.com/x06lExML82— Navjot Singh Sidhu (@sherryontopp) November 21, 2024అందరికీ వర్తించదు: నిపుణుల హెచ్చరిక కేన్సర్ చికిత్సలో పోషకాహార పాత్ర కీలకమైనదే, కానీ అది మాత్రమే రికవరీకి ఆహారం మాత్రమే సరిపోదని హెచ్చరిస్తున్నారు. వ్యాధినుంచి కోలుకోవడానికి ఆహారం గణనీయంగా తోడ్పడుతుంది. కానీ కీమోథెరపీ, రేడియేషన్ లేదా శస్త్రచికిత్స వంటి సాంప్రదాయ చికిత్సలకు ఎంతమాత్రం సరిపోదు. కేన్సర్ బహు ముఖమైంది. తీవ్రతను బట్టి, కేన్సర్ కణాలను నాశనం చేయడానికి పలు చికిత్సల కలయిక అవసరం అంటున్నారు వైద్య నిపుణులుఅలాగే ఉపవాసం కేన్సర్ రోగులకు ఉపవాసం అస్సలు పనికిరాదని, కేన్సర్ రోగులను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, లేదా ఉపవాసంలో ఉంచడం నేరమంటున్నారు మరికొందరు నిపుణులు. ఇది కోలుకోవడానికి అవసరమైన పోషకాహారాన్ని నిరోధిస్తుందన్నారు.తక్కువ-గ్లైసెమిక్ డైట్, న్యూట్రాస్యూటికల్స్ గ్లూకోజ్-ఆధారిత కేన్సర్లలో చికిత్సల సామర్థ్యాన్ని పెంచగలవని డాక్టర్ మల్హోత్రా ట్వీట్ చేశారు. అయితే అందరికీ ఇది వర్తించదన్నారు. కేన్సర్ రకం, దశ ఆధారంగా, జీవక్రియ అవసరాలకు అనుగుణంగా ఉండేలా ఆహార ప్రణాళికలను రూపొందించుకోవాలి. ముఖ్యంగా రోగులు ఆంకాలజిస్టులు, డైటీషియన్ల సలహాలను తీసుకోవాలని డాక్టర్ మల్హోత్రా జోడించారు.కేన్సర్నుంచి బయటపడాలంటే.. తొలి దశలోనే గుర్తించడం,కేన్సర్ రకం, లక్షణాలతో పాటు అత్యాధునిక చికిత్స, రోగి విల్ పవర్, ఆహార నియమాలు, రోగి శారీరక, మానసిక స్థితి, కుటుంబ సభ్యుల సహకారం, మద్దతు ఇవన్నీ కీలకమైనవి. -
బాటిల్ కోసం వ్యక్తిని చెప్పుతో కొట్టిన పాపులర్ సింగర్.. వీడియో వైరల్
ఒక్కోసారి సెలెబ్రెటీలు వింతగా ప్రవర్తిస్తుంటారు. కోపం వస్తే తమ అనుచరులపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. చిన్న చిన్న వాటికి సిబ్బందిపై చేయి చేసుకుంటారు. తాజాగా పాకిస్తాన్కు చెందిన పాపులర్ సింగర్ రాహత్ ఫతేహ్ అలీఖాన్.. ఓ బాటిల్ కోసం తన శిష్యుణ్ని చెప్పుతో కొట్టాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో ఎక్స్(ట్విటర్)లో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్కు చెందిన పాపులర్ సింగర్ రాహత్ ఫతేహ్ అలీ ఖాన్ గురించి తెలిసిందే. పాకిస్తాన్లో కాకుండా ఆయనకు భారత్లో సైతం అభిమానులు ఉన్నారు. అనేక హిందీ సినిమాలకు ఆయన పాటలను ఆలపించాడు. తాజాగా ఆయన ఇంట్లో పవిత్ర జలానికి సంబంధించిన బాటిల్ కనిపించకుండా పోయిందట. (చదవండి: ‘గుంటూరు కారం’ ఎఫెక్ట్.. ‘గురూజీ’కి బన్నీ షాక్!) దానికి కారణంగా శిష్యుడే కావడంతో అతన్ని బూతులు తిడుతూ.. చెప్పుతో కొట్టాడు. అతని జట్టు పట్టుకొని లాగుతూ నేలపై కూర్చోబెట్టి ‘నా బాటిల్ ఎక్కడ’ అంటూ గట్టి గట్టిగా అరుస్తూ దారుణంగా కొట్టాడు. తనని వదిలేయాలంటూ బాధితుడు ప్రాధేయపడినా పట్టించుకోలేదు. చివరకు ఇతర సిబ్బంధి వచ్చి అతన్ని నిలువరించారు. ఇదంతా ఓ వ్యక్తి వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అది కాస్త వైరల్ అయింది. సింగర్ చర్యపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. బాటిల్ కోసం అతన్ని అంతలా చితక్కొట్టాలా? ఎంత పెద్ద సెలెబ్రెటీ అయినా..ఇలా చేయడం మంచిది కాదంటూ రాహత్ ఫతేహ్ అలీ ఖాన్ని ట్రోల్ చేస్తున్నారు. క్షమాపణలు చెప్పిన అలీఖాన్ చెప్పుతో కొడుతున్న వీడియో వైరల్ కావడంతో అలీఖాన్ ఈ ఘటనపై వివరణ ఇస్తూ ఓ వీడియోని విడుదల చేశాడు. ఇది గురు, శిష్యుల మధ్య జరిగిన విషయమని, స్టూడెంట్ తప్పు చేస్తే గురువు దండించినట్లుగానే దీన్ని చూడాలని విజ్ఞప్తి చేశాడు. బాధితుడు తన శిష్యుడే అయినప్పటికీ.. అలా కొట్టడం తప్పేనని క్షమాపణలు చెప్పాడు. ఇదే వీడియోలో బాధితుడు మాట్లాడుతూ.. పవిత్ర జలానికి సంబంధించిన బాటిల్ కనిపించకుండా పోవడానికి తానే కారణమని.. అందుకే అలీఖాన్ దండించారని తెలిపారు. అలీఖాన్ తనకు తండ్రిలాంటి వాడని, తనను ప్రేమగా చూసుకుంటాడని చెప్పారు. కోపంలో ఆయన తనను కొట్టాడని.. అంతకు మించి దీంట్లో ఎలాంటి దురుద్దేశం లేదన్నాడు. తమ గురువు పరువుకు భంగం కలిగించాలనే ఉద్దేశంతోనే ఎవరో ఈ వీడియోను వైరల్ చేశారని బాధితుడు చెప్పడం గమనార్హం. Famous singer Rahat Fateh Ali khan beating his servent for bottle of Alcohol pic.twitter.com/9DZwYxgPmV — Ghulam Abbas Shah (@ghulamabbasshah) January 27, 2024 Update : Rahat Fateh Ali Khan ( @RFAKWorld )issued a clarification regarding his viral video, There was holy water in the bottle pic.twitter.com/oIStHwWXFp — Ghulam Abbas Shah (@ghulamabbasshah) January 27, 2024 -
భారత్దే ఆసియా కప్.. ఫైనల్లో పాకిస్తాన్పై విజయం
సలాలా (ఒమన్): ఆద్యంతం తమ ఆధిపత్యాన్ని చాటుకున్న భారత హాకీ జట్టు ఆసియా కప్ జూనియర్ టోర్నమెంట్లో టైటిల్ను నిలబెట్టుకుంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన టీమిండియా గురువారం జరిగిన ఫైనల్లో 2–1 గోల్స్ తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టును ఓడించింది. భారత్ తరఫున అంగద్బీర్ సింగ్ (13వ ని.లో), అరైజీత్ సింగ్ హుండల్ (20వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... పాకిస్తాన్ జట్టుకు అలీ బషారత్ (38వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. ఓవరాల్గా ఆసియా కప్ టైటిల్ నెగ్గడం భారత్కిది నాలుగోసారి. గతంలో భారత్ 2004, 2008, 2015లలో విజేతగా నిలిచింది. తాజా టైటిల్తో ఆసియా కప్ను అత్యధికంగా నాలుగుసార్లు నెగ్గిన జట్టుగా భారత్ గుర్తింపు పొందింది. పాకిస్తాన్ మూడుసార్లు చాంపియన్గా నిలిచింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్లో దక్షిణ కొరియా 2–1తో మలేసియాపై గెలిచింది. ఆసియా కప్ టోర్నీలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన భారత్, పాకిస్తాన్, కొరియా జట్లు ఈ ఏడాది డిసెంబర్లో కౌలాలంపూర్లో జరిగే జూనియర్ ప్రపంచకప్ టోర్నమెంట్కు అర్హత సాధించాయి. తాజా టోర్నీలో భారత్ సంపూర్ణ ఆధిపత్యాన్ని కనబరిచింది. టోర్నీ మొత్తంలో భారత్ 50 గోల్స్ సాధించి... కేవలం నాలుగు గోల్స్ సమర్పించుకుంది. ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన భారత హాకీ జట్టుకు హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ అభినందించారు. జట్టులోని ప్రతి సభ్యుడికి రూ. 2 లక్షలు నగదు పురస్కారం ప్రకటించారు. -
మారువేషంలో దొంగగా వచ్చి అత్తను చితకబాదిన కోడలు.. కానీ..!
తమిళనాడులో అమానవీయ ఘటన జరిగింది. మారువేశంలో దొంగగా వచ్చిన కోడలు అత్తను చితకబాదింది. తీవ్ర గాయాలపాలైన అత్త ప్రాణాలు కోల్పోయింది. తిరునల్వేలి జిల్లాలోని వడుకనపట్టి గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామంలో శణ్ముగవేలు భార్య సీతారామలక్ష్మి (57). వారికి కుమారుడు రామస్వామి, కోడలు మహాలక్ష్మి ఉన్నారు. ఇంట్లో అత్తాకోడళ్లు తరచూ గొడవ పడుతుండేవారు. దీంతో పరిస్థితిని మెరుగుపరచడానికి రామస్వామి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి మకాం మార్చినా.. ప్రయోజనం లేకపోయింది. ఇటీవల జరిగిన గొడవ అనంతరం అత్తపై కక్ష పెంచుకున్న మహాలక్ష్మి పథకం వేసింది. మగవారి వేశం వేసి హల్మెట్ పెట్టుకుని అత్త నిద్రిస్తున్న సమయంలో ఆమెపై దాడి చేసింది. అత్త నుంచి బంగారం గొలుసు లాక్కెళ్లింది. తీవ్ర గాయాలపాలైన అత్త ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ చనిపోయింది. అయితే.. కేసు నమోదు చేసిన పోలీసులకు సీసీటీవీ అధారాలతో అసలు విషయం బయటపడింది. కోడలే ఈ ఘటనకు కారకురాలని తేల్చారు. చదవండి:కంపెనీ డబ్బుతో డ్రైవర్ పరార్... ఓనర్ ఏం చేశాడంటే... -
అంచనాలను అందుకున్న సిప్లా
న్యూఢిల్లీ: ప్రముఖ ఫార్మా కంపెనీ సిప్లా లిమిటెడ్ సెప్టెంబర్ త్రైమాసికానికి (202–23లో క్యూ2) బలమైన పనితీరు ప్రదర్శించింది. నికర లాభంలో 12 శాతం వృద్ధి నమోదైంది. రూ.797 కోట్ల లాభాన్ని కంపెనీ ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి వచ్చిన లాభం రూ.709 కోట్లుగా ఉంది. దేశీయ, యూఎస్ మార్కెట్లలో బలమైన అమ్మకాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలోని ఆదాయంతో పోలిస్తే రూ.5,520 కోట్ల నుంచి రూ.5,829 కోట్లకుపెరిగింది. భారత్లో ఉన్న అమెరికా వ్యాపారాన్ని బదలాయించాలన్న ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. ప్రస్తుత వాతావరణం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. క్యూ2 ఫలితాలపై సిప్లా ఎండీ, గ్లోబల్ సీఈవో ఉమంగ్ వోహ్రా మాట్లాడారు. యూఎస్ మార్కెట్లో వివిధ పోర్ట్ఫోలియోల పరంగా అమలు చేసిన విధానం, దేశీ మార్కెట్లో బలమైన పనితీరు ఫలితాల్లో కనిపించినట్టు చెప్పారు. దేశీ అమ్మకాల ఆదాయం 6 శాతం పెరిగి రూ.2,563 కోట్లుగా ఉంటే, నార్త్ అమెరికా వ్యాపారం 35 శాతం పెరిగి రూ.1,432 కోట్లకు చేరింది. కలిసొచ్చిన లెనలిడోమైడ్ ముఖ్యంగా లెనలిడోమైడ్ డ్రగ్ను విడుదల చేయడం అమ్మకాల వృద్ధికి తోడ్పడినట్టు ఉమంగ్ వోహ్రా తెలిపారు. వెలుపలి మార్కెట్లో సవాళ్లు ఉన్నప్పటికీ లాభాలను నమోదు చేసినట్టు వివరించారు. నిర్వహణ లాభం 22.3 శాతంగా ఉందని, పూర్తి ఆర్థిక సంవత్సరానికి తమ అంచనాలైన 21–22 శాతం పరిధిలోనే ఇది ఉన్నట్టు వివరించారు. వ్యయాలు తగ్గించుకోవడం, ధరలు పెంచడం తదితర చర్యలతో కమోడిటీ ధరల పెరుగుదల ప్రభావాన్ని కంపెనీ అధిగమించింది. -
స్టడీ అవర్కు రాలేదని చితగ్గొట్టిన హెచ్ఎం
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: స్టడీ అవర్కు రాలేదనే కోపం తో ఒక ప్రధానో పాధ్యా యుడు నలుగురు విద్యార్థులను కట్టెతో చితక బాదారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ గిరిజన ఆశ్రమ బాలుర హాస్టల్లో బుధవారం ఉదయం 8.30 గంటలకు స్టడీ అవర్ ఏర్పాటు చేశారు. కానీ తొమ్మిదో తరగతి విద్యార్థులు రాంచరణ్, నవీన్, దీపక్, పవన్ నాయక్ రాలేదు. ఈ విషయం గమనించిన ప్రధానోపాధ్యాయుడు బుచ్చిరాములు వారిని పిలిపించారు. స్టడీ అవర్కు ఎందుకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెత్తంతో విద్యార్థుల వీపులు, చేతులపై కొట్టడంతో వాతలు తేలాయి. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా, వారితో పాటు గిరిజన సంఘం నేత రమేష్ తదితరులు హాస్టల్కు చేరుకుని ప్రధానోపాధ్యాయుడితో గొడవకు దిగారు. దీనిపై హెచ్ఎం బుచ్చిరాములును వివరణ కోరగా విద్యార్థులు స్టడీ అవర్కు రాలేదని, క్రమశిక్షణతో ఉండాలనే కొట్టాను తప్ప మరో ఉద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు. -
అమానుషం! బాలికను కొట్టి, అగరబత్తులతో కాల్చి...
Exorcist was arrested in Jharkhand: ఇంకా చాలా చోట్ల మూఢనమ్మకాలను విశ్వాసించే వాళ్లు ఉన్నారు. వాళ్ల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఆ దర్మార్గులు చేసే అకృత్యాలకు అంతేలేదు. చిన్న పెద్ద అనే భేదం లేకుండా మూఢనమ్మకాల పేరుతో సాగిస్తున్న హింసకు బలవుతున్నావారు కోకొల్లలు. అచ్చం అలాంటి సంఘటనే జార్ఖండ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...పోలీసుల కథనం ప్రకారం....జార్ఖండ్లోని చత్రా జిల్లాలో ఒక బాలిక హోలీ ఆడిన తర్వాత అస్వస్థతకు గురైంది. ఈ మేరకు మౌలానా ఎమ్డి వాహిద్ అనే భూతవైద్యుడు ఆ బాలిక భూతవైద్యం ద్వారా బాగుపడుతుందని ఆ బాలిక కుటుంబ సభ్యులకు చెప్పాడు. దీంతో ఆ బాలికను అతని వద్దకు తీసుకువచ్చారు. అతను ఆ బాలికను భూత వైద్యం పేరిట చిత్రహింసలకు గురిచేశాడు. అంతేకాదు ఆమెను కొట్టి, అగరబత్తీలతో కాల్చాడం వంటి అకృత్యాలను చేశాడు. దీంతో ఆ బాలిక మానసిక స్థితి పూర్తిగా దెబ్బతింది. ఆ తరువాత ఆ బాలికను కుటుంబ సభ్యులు చత్రలోని సదర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె పరిస్థితి క్షీణించడంతో రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (రిమ్స్)కి తరలించారు. ఈ మేరకు బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు వాహిద్ (35)ను అరెస్టు చేసినట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాకేష్ రంజన్ తెలిపారు. (చదవండి: నొప్పి భరించలేక యువతి ఆత్మహత్య) -
కొడుకును కొడుతున్న దృశ్యాలను .. కూతురుతో తీయించి..
సాక్షి, చాంద్రాయణగుట్ట(హైదరాబాద్): కుమారుడు అల్లరి చేస్తున్నాడని ఇరుగు పొరుగు వారు చెప్పడంతో సహనం కోల్పోయిన ఓ వ్యక్తి తన ఎనిమిదేళ్ల కొడుకును చితకబాదాడు. ఛత్రినాక పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. తన కుమారుడికి భయం చెబుతున్నానని.. అందరికీ చూపించేందుకు సదరు వ్యక్తి తన కూతురుతోనే కొట్టే దృశ్యాలను వీడియో తీయించి, ఇరుగు పొరుగు వారికి పంపడంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. లాల్దర్వాజాలోని నాగం కాంప్లెక్స్లో కర్ణాటక చెందిన అశోక్ ఘంటే భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడి ఎనిమిదేళ్ల కుమారుడు అల్లరి చేస్తున్నాడని ఇరుగు పొరుగు వారు పలుమార్లు చెప్పడంతో శనివారం మధ్యాహ్నం కొడుకును కర్రతో ఇష్టానుసారంగా చితకబాదాడు. వీడియోను చూసిన అతడి భార్య ఛత్రినాక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
విద్యార్థులను కర్రలతో చితకబాదిన టీచర్లు..
సాక్షి, అనంతగిరి(విశాఖపట్నం): స్టడీ అవర్కు రాలేదని విద్యార్థులను చితకబాదిన ఘటన విశాఖ జిల్లా అనంతగిరి మండలం గుమ్మకోట గురుకుల పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకుంది. గురుకుల పాఠశాలలో గుమ్మకోట పంచాయతీ భీమవరం గ్రామానికి చెందిన 8మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలకు సమీపంలో గ్రామం ఉండటంతో వారంతా రాత్రివేళ పడుకునే సమయంలో ఇంటికి వెళ్లి వస్తుంటారు. గురువారం వెళ్లి ఇంటికెళ్లిన విద్యార్థులు శుక్రవారం ఉదయం స్టడీ అవర్కు రాకపోవడంతో సోషల్ టీచర్ పీతాంబరం, పీఈటీ నాగభూషణం విద్యార్థులను కర్రలతో చితకబాదారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులను నిలదీశారు. అనంతరం విద్యార్థుల్ని పీహెచ్సీకి తీసుకునివెళ్లి చికిత్స చేయించారు.విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని ప్రిన్సిపాల్ వేణుప్రసాద్ చెప్పారు. -
కుక్కని కుక్కా అన్నందుకు తలలు పగలగొట్టారు..
-
కుక్కని కుక్కా అన్నందుకు తలలు పగలగొట్టారు..
న్యూఢిల్లీ: కుక్కని కుక్కా అని పిలిచినందుకు చిన్న గొడవ.. చిలికి చిలికి గాలివానలా మారింది. పెద్ద గొడవకు దారితీసింది. హర్యానాలోని గురుగ్రామ్ చెందిన జ్యోతిపార్క్ ప్రాంతంలో ఓ కుటుంబం టామీ అనే కుక్కని పెంచుకుంటున్నారు. ఆయితే ఆ కుక్క స్థానికుల్ని కరవడం, భయపెట్టడం చేస్తుండేది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉండే సుధీర్ అనే వ్యక్తి కుక్కని చైన్కి కట్టేయొచ్చు కదా, మా పిల్లల్ని కరుస్తోంది అని, కుక్క యజమానిని రిక్వెస్ట్ చేశాడు. అంతే మా టామీని కుక్క అని పిలుస్తావా? నీకెంత ధైర్యం అంటూ దాని యజమాని, యజమాని కుటుంబ సభ్యులు సుధీర్ కుటుంబంపై దాడికి దిగారు. రాడ్లు,కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో సుధీర్ కుటుంబానికి చెందిన ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇదే సమయంలో ఘర్షణ జరుగుతుండగా స్థానికులు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఈ ఘర్షణ అనంతరం సుధీర్ సదరు కుక్క యజమాని మా కుటుంబసభ్యలపై దాడి చేశాడు. ఆ కుక్క మా పిల్లల్ని కరుస్తోందని యజమానికి చెప్పా. టామీని కుక్కా అని పిలుస్తావా అని కొట్టాడంటూ పోలీసులు ఫిర్యాదు చేశాడు. కాగా, గురుగ్రామ్లో కుక్కల వల్ల ఘర్షణ పడ్డ సంఘటనలు గతంలో చాలానే జరిగాయని పోలీసులు చెబుతున్నారు. అందరూ కరోనా వల్ల ఇబ్బంది పడుతుంటే వీళ్లు మాత్రం కుక్క గురించి తలలు పగిలేలా కొట్టుకోవడం ఏమిటోనని గురుగ్రామ్ పోలీసులు నిట్టూరుస్తున్నారు. నెటిజన్లు సైతం ఈ ఘర్షణపై తమదైన స్టైల్లో కామెంట్లు చేస్తున్నారు. అరె ఏంట్రా ఇది..కుక్కని కుక్కా అని పిలవకూడదా? అంత మాత్రనికే తలలు పగలగొట్టాలా అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
గూగుల్ పేకు మరో ఝలక్
సాక్షి, న్యూఢిల్లీ: వరుసగా రెండో నెలలో కూడా పేమెంట్ యాప్ ఫోన్పే టాప్లో నిలిచింది. ఫ్లిప్కార్ట్ మద్దతున్న ఫోన్పే మళ్లీ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యుపీఐ) చార్టులో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. తద్వారా వాల్మార్ట్కు చెందిన ఈ పేమెంట్ యాప్ గూగుల్ పేని అధిగమించి, టాప్ యూపీఐ యాప్గా ఫోన్పే నిలిచింది. జనవరిలో మొత్తం యుపీఐ లావాదేవీల్లో 41శాతం వాటాతో 968.72 మిలియన్ల లావాదేవీల వాల్యూమ్తో ఉన్న ఫోన్పే వరుసగా రెండవ నెలలో పరంపరను కొన సాగించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం ఫోన్పే లావాదేవీలు 7 శాతం పెరిగాయి, ట్రాన్సాక్షన్స్ విలువ జనవరిలో 5 శాతం పెరిగింది. ఫోన్పే తరువాత రూ .1.71 లక్షల కోట్ల విలువైన 853.53 మిలియన్ లావాదేవీలతో గూగుల్ పే రెండవ స్థానంలో ఉంది. 33,910 కోట్ల రూపాయల విలువైన 281.18 మిలియన్ లావాదేవీలను రికార్డు చేసిన పేటీఎం మూడో స్థానంలో నిలిచింది. అమెజాన్ పే, భీమ్, వాట్సాప్ పే లావాదేవీల విలువ వరుసగా రూ .4,004 కోట్లు, రూ .7,463 కోట్లు, రూ .36 కోట్లుగా ఉన్నాయి. జనవరిలో యూపీఐ ద్వారా మొత్తం రూ .4.2 లక్షల కోట్ల 2.3 బిలియన్ లావాదేవీలు నమోదయ్యాయని, నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ గతవారం ట్విటర్లో వెల్లడించారు. ఈ ఘనతను ఇది అసాధారణమైన ఘనత అని పేర్కొన్నారు. నెలకు ఒక బిలియన్ లావాదేవీలను దాటడానికి యూపీఐకి 3 సంవత్సరాలు పట్టిందని, అయితే ఆ తరువాతి బిలియన్ టార్గెట్ను ఏడాదిలోపే సాధించామన్నారు. లావాదేవీలు 76.5 శాతం పెరుగుదలను నమోదు చేయగా, లావాదేవీల విలువ దాదాపు 100 శాతం పెరిగిందని ట్వీట్లో పేర్కొన్నారు. కాగా డిసెంబరులో, ఫోన్పే 1.82 లక్షల కోట్ల రూపాయల విలువైన 902 మిలియన్ లావాదేవీలతో ఫోన్పే టాప్ ప్లేస్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. గూగుల్ పే 854 మిలియన్ లావాదేవీలను 1.76 లక్షల కోట్ల రూపాయలను నమోదు చేసింది. Phenomenal ! UPI recorded 2.3 billion transactions worth ₹ 4.3 trillion in Jan 2021. On a YOY basis, UPIs transaction value jumped 76.5 % while transaction value jumped nearly 100%. Took UPI 3 years to cross 1 billion transactions a month. Next billion came in less than a year.— Amitabh Kant (@amitabhk87) February 3, 2021 -
10 లాటరీలు ఒకేసారి తగిలాయా, ఏంటి?
సాక్షి, న్యూఢిల్లీ: ఏ రంగంలోనైనా సెలబ్రిటీలుగా ఉన్నవారికి భారీ క్రేజ్ ఉంటుంది. అందులోనూ వ్యాపార రంగంలో దూసుకుపోతూ, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా రాణిస్తోంటే.. యువత ఆసక్తి మామూలుగా ఉండదు. తాజాగా టెస్లా సహ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ బిల్ గేట్స్ దాటేయడంతో ట్రెండింగ్లో నిలిచారు. దీంతో ఆయనపై సోషల్మీడియా అంతా మంగళవారం మీమ్స్ సందడి నెలకొంది. తమాషా వ్యాఖ్యలు, క్లిప్లు, ఇమేజ్లతో ట్విటర్ యూజర్లు సందడి చేస్తున్నారు. అతడు సినిమాలో తనికెళ్ల భరణి ‘ఆడు మగాడ్రా బుజ్జా’ అన్నట్టు కమెంట్ చేస్తున్నారు. మచ్చుకు కొన్ని ఇక్కడ అందిస్తున్నాం.. మీరూ సరదాగా నవ్వుకోండి. (మస్క్ దూకుడు: మరోసారి బిల్ గేట్స్కు షాక్) #ElonMusk beats #BillGates to become second richest person Meanwhile Elon Musk:- pic.twitter.com/b2fhwx47ks — Raj Aditya (@chiku_9693) November 24, 2020 #ElonMusk ELON MUSK TO BILL GATES pic.twitter.com/GoDyFsgtLC — fᵣₑₑ wₐy (@T_O_freeway) November 24, 2020 #ElonMusk beats #BillGates to become second richest person Meanwhile Jeff bezos: pic.twitter.com/slamrRpdCu — Naveen Kumar (@Navikumar108) November 24, 2020 #ElonMusk becomes 2nd richest person after overtaking #BillGates Jeff Bezoz be like: pic.twitter.com/0EN0kAtdxn — Adarsh Adhar (@AdarshAdhar) November 24, 2020 #ElonMusk become 2nd richest person by surpassing #BillGates * Meanwhile Bill Gates to Elon pic.twitter.com/vuVvRk79FA — Chayan Jain (@ChayanJ20734351) November 24, 2020 -
మస్క్ దూకుడు: మరోసారి బిల్ గేట్స్కు షాక్
ప్రముఖ కార్ల కంపెనీ టెస్లా అధినేత ఎలన్ మస్క్ (49) అరుదైన ఘనతను సాధించారు. అపర కుబేరుడు బిల్గేట్స్ను అధిమించి మరీ ప్రపంచంలో రెండవ అతిపెద్ద ధనవంతుడిగా దూసుకు వచ్చారు. ప్రపంచ అపర కుబేరుల్లో ఒకరైన మస్క్ సంపద 127.9 బిలియన్ డాలర్లకు చేరింది. అతని నికర విలువ 7.2 బిలియన్ డాలర్లు పుంజుకోగా, బిల్గేట్స్ ఆదాయం 127.7 బిలియన్ డాలర్లుగా ఉంది. మస్క్కు చెందిన టెస్లా స్టాక్ సోమవారం ట్రేడింగ్లో దాదాపు 6.58 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 521.85 డాలర్లకు చేరింది. ఇదే అత్యధిక సింగిల్-డే లాభాలకు కారణమైంది. అతని మరో కంపెనీ స్పేస్ ఎక్స్ మార్కెట్ వ్యాల్యూ 500 బిలియన్లకు చేరడం విశేషం. ఈ ఏడాది జనవరి నుండి తన నికర విలువ 100 బిలియన్ల డాలర్లకు పైగా ఎగిసింది. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న 500 మంది ధనవంతులలో ఒకరిగా నిలిచాడు. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ రెండవస్థానం కంటే కిందికి పడిపోవడం బ్లూమ్బెర్గ్ ఇండెక్స్ ఎనిమిదేళ్ల చరిత్రలో ఇది రెండవసారి. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్బెజోస్ 2017లో గేట్స్ను అధిగమించి ప్రపంచంలోని అత్యంత ధనవంతుడుగా నిలిచారు. అంతుకుముందు వరకు బిల్గేట్స్ రిచెస్ట్ పర్స్న్గా నిలుస్తూ వచ్చారు. ప్రస్తుతం బెజోస్ 182 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోని సంపన్న వ్యక్తిగా అగ్రస్థానంలో ఉన్నారు. ఈ ఏడాది అతని నికర విలువ 67 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. కాగా బిల్ గేట్స్ తన సంపాదనంలో ఏటా కొంత భాగాన్ని డొనేషన్లకు ఇస్తారు. 2006 నుంచి ప్రతి ఏటా 27 బిలియన్ డాలర్లను నేమ్సేక్ ఫాండేషన్కు గేట్స్ ఛారిటీగా ఇస్తున్నారు. -
కరోనా నుంచి కోలుకున్న 93 ఏళ్ల వ్యక్తి
న్యూఢిల్లీ : 93 ఏళ్ల పద్మశ్రీ అవార్డు గ్రహీత కేవలం 8 రోజుల్లోనే కరోనాను జయించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ప్రముఖ కవి, సాహిత్య విభాగంలో పద్మశ్రీ అందుకున్న ఆనంద్ మోహన్ జుష్తీ గుల్జార్ దెహల్వి శ్వాసకోశ సమస్యతో జూన్ 1న నోయిడాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. అప్పటికే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే ఐసీయాకి తరలించి డాక్టర్ అభిషేక్ దేశ్వాల్ నాయకత్వంలోని ప్రత్యేక బృందం ఆయనకు చికిత్స అందించింది. ఆదివారం నిర్వహించిన పరీక్షలో కరోనా నెగిటివ్ అని తేలడంతో ఆయన కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. అంతేకాకుండా జుష్తీ కూడా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తనకు సహకారం అందించిన వైద్య సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన జుష్తీ.. ఆరోగ్యం పూర్తిగా కోలుకున్నాక మీరంతా మా ఇంటికి విందుకు రావాలి అంటూ వైద్య సిబ్బందిని ఆహ్వానించారు. 93 ఏళ్ల వయసులోనూ చాలా త్వరగా కోలుకున్న జుష్తీకి అభినందనలు అంటూ హాస్పిటల్ ప్రతినిధి డాక్టర్ అజిత్ కుమార్ ట్వీట్ చేశారు. జుష్తీ రికవరీపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. రచనలతోనే కాదు అతి తక్కువ రోజుల్లోనే కరోనాపై విజయం సాధించి ఎంతోమందికి ప్రేరణగా నిలిచారు. మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మరింత కాలం జీవించాలని కోరుకుంటున్నాం’ అంటూ నెటిజన్లు ట్వీట్ చేశారు. (కేజ్రీవాల్కు రేపు కరోనా పరీక్షలు? ) -
విద్యార్థిపై దంపతుల దాష్టీకం
-
టీచర్ను తాళ్లతో కట్టి.. రోడ్డుపై ఈడ్చి..
బలుర్ఘాట్: రోడ్డు వేసేందుకు స్థలం ఇవ్వడం లేదన్న కారణంతో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని కాళ్లు, చేతులు కట్టేసి, రోడ్డుపై ఈడ్చిన దారుణ దుర్ఘటన పశ్చిమబెంగాల్లోని దీనజ్పూర్లో జరిగింది. ఆ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నేతలే ఈ దారుణానికి ఒడిగట్టడంతో రాజకీయ సెగ అలుముకుంది. గత శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గంగారాంపూర్ బ్లాక్కు చెందిన ప్రభుత్వ టీచర్, బీజేపీ మద్దతుదారు స్మృతికానా దాస్ స్థలంలో రోడ్డు నిర్మాణం చేపట్టేలా పంచాయతీ నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి ఆమె అంగీకరించకపోవడంతో తృణమూల్ కాంగ్రెస్కు చెందిన ఉప ప్రధాన్ (డిప్యూటీ చీఫ్) అమల్ సర్కార్.. స్మృతికానా దాస్ కుటుంబాన్ని హింసించారు. టీచర్ కాళ్లను, చేతులను కట్టేయడంతో ఆమె కిందపడిపోవడం, ఆమెను కొందరు దుండగులు దాదాపు 30 అడుగులు ఈడ్చుకుంటూ గదిలోకి తీసుకెళ్లి బంధించడం వీడియోలో రికార్డయ్యింది. దీంతో ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. దీనిపై రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి సయంతన్ బసు మాట్లాడుతూ.. తృణమూల్ కాంగ్రెస్ పాలనలో గూండాయిజం సాగుతున్నదనడానికి ఇది ఉదాహరణ అంటూ విమర్శించారు. ఈ చర్యకు పాల్పడిన వ్యక్తిని పార్టీ నుంచి బహిష్కరించినట్లు తృణమూల్ ప్రధాన కార్యదర్శి పార్థ చటర్జీ చెప్పారు. -
బాన్సువాడలో పోకిరికి దేహశుద్ధి
-
470 కోట్ల కాన్పులకు ఒకటి!
హూస్టన్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఓ మహిళ ఒకే కాన్పులో ఆరుగురికి జన్మనిచ్చి అత్యంత అరుదైన గుర్తింపు సొంతం చేసుకుంది. ఒకేసారి ఆరుగురికి జన్మనివ్వడం 470 కోట్ల ప్రసవాల్లో ఒకరికే సాధ్యమవుతుందని అంచనా. హూస్టన్కు చెందిన తెల్మా చియాకా అనే మహిళ శుక్రవారం ఉదయం 4.50–4.59 గంటల మధ్య నలుగురు మగబిడ్డలు, ఇద్దరు ఆడ శిశువులను ప్రసవించిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. శిశువులు తక్కువ బరువుతో పుట్టడంతో వారికి కొంతకాలం అడ్వాన్స్డ్ చికిత్స కొనసాగుతుందని వైద్యులు చెప్పారు. -
చిల్లర అడిగితే.. చితక్కొట్టాడు..!
సాక్షి, వనపర్తి : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ బస్ కండక్టర్ రౌడీలా ప్రవర్తించాడు. ఈ ఘటన వనపర్తి బస్టాండ్లో చోటుచేసుకుంది. వివరాలివి.. ఓ యువకుడు తనకు రావాల్సిన రూ.3 చిల్లరను కండక్టర్ను అడిగాడు. కోపంతో ఆ కండక్టర్ రెచ్చిపోయి ఆ యువకుడ్ని బస్టాండ్లోని కంట్రోల్ రూమ్లో వేసి చితకబాదాడు. అతనిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లేకపోతే తమదైన శైలిలో పోక తప్పదని వారు హెచ్చరించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న డ్రైవర్లు, కండక్టర్లు, సంబంధిత అధికారులు ఎవరూ కూడా అడ్డుచెప్పలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అంచనాలను మించిన ఎం అండ్ ఎం
సాక్షి,ముంబై: దేశీయ ఆటో రంగ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్ఎం) మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. గత ఆర్థిక సంవత్సరం(2017-18) చివరి త్రైమాసికంలో 50 శాతం వృద్ధితో రూ. 1,155 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. కాగా నికర లాభం 1,037 కోట్ల రూపాయలుగా ఉండనుందని విశ్లేషకులు అంచనా అంచనా వేశారు. మొత్తం ఆదాయం 26 శాతం పెరిగి రూ. 13,189 కోట్లకు నమోదైంది. నిర్వహణ లాభం మరింత అధికంగా 70 శాతం ఎగసి రూ. 1995 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 15.1 శాతంగా నమోదుకాగా.. ఆటో విభాగం ఆదాయం 20 శాతం పుంజుకుని రూ. 9105 కోట్లకు చేరింది. -
విద్యార్థిని చితకబాదిన టీచర్
-
స్టూడెంట్ను చితకబాదిన నారాయణ ప్రిన్సిపల్
-
స్టూడెంట్స్ను చితకబాదిన ‘నారాయణ’ ప్రిన్సిపల్ !
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లాలోని నన్నూరు నారాయణ కాలేజీలో శనివారం దారుణం చోటు చేసుకుంది. కాలేజ్లో చదువుతున్న కొంతమంది విద్యార్థులను ప్రిన్సిపల్ రక్తం వచ్చేలా చితకబాదాడు. దీంతో బాధిత విద్యార్థులు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో వారు యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షల్లో ఫీజలు కట్టి కాలేజీకి పంపుతుంటే.. ఇలా హింసిస్తారా అని మండిపడ్డారు. ఒకవేళ విద్యార్థులు తప్పు చేసినా.. రక్తం వచ్చేలా కొట్టడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. కనీసం ఫస్ట్ ఎయిడ్ కూడా చేయించలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఛీఛీ.. వీడసలు మనిషేనా..?
సాక్షి, భువనేశ్వర్ : మనుషుల్లో మానత్వం చచ్చిపోతోందో.. లేక తాము మనుషులమన్న ఊహే ఉండటం లేదో తెలియదుకానీ.. కొందరు మాత్రం రాక్షసత్వానికి పరాకాష్టలా మారుతున్నారు. అత్యంత క్రూరంగా మూగజీవాలను హింసిస్తూ.. పైశాచికానందాన్ని పొందుతున్నారు. తాజాగా ఇటువంటి ఘటన ఒక ఒడిశా రాజధాని భువనేశ్వర్లో జరిగింది. ఒక వ్యక్తి తన పెంపుడు కుక్కని.. అత్యంత కిరాతకంగా, రాక్షసంగా.. బెల్టుతో హింసిస్తున్న ఘటన వెలుగు చూసింది. దాదాపు 21 సెకెన్లు ఉన్న వీడియోలో.. పెంపుడు కుక్కను బెల్టుతో.. విరామం లేకుండానే ఒక వ్యక్తి కొడుతూనే ఉన్నాడు. కుక్క పారిపోయే ప్రయత్నం చేసినా.. పట్టుకుని మరీ చితకబాదాడు. ఈ ఘటనపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యక్తిపై కేసు నమోదు చేయాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. #WATCH Man caught on camera brutally thrashing a dog in Odisha's Bhubaneswar. pic.twitter.com/K3uDZsqHTi — ANI (@ANI) December 20, 2017 -
పసిమొగ్గలపై పైశాచికం
-
ప్రేమ మైకంలో ఖాకీ కాఠిన్యం
ప్రియురాలి మోజులో భార్యపై కానిస్టేబుల్ దాడి మూడేళ్లుగా ఫిర్యాదు చేస్తున్నా కేసు పెట్టలేదు.. ఎస్పీకి ఫిర్యాదు చేసినందుకు చావబాదాడు.. ఆస్పత్రిలో కోలుకుంటున్న బాధితురాలు న్యాయం చేయాలని వేడుకోలు వివాహేతర సంబంధం నెరపుతూ భార్య పై దాడి చేసిన కానిస్టేబుల్ రాజమహేంద్రవరం క్రైం (రాజమహేంద్రవరం) : వివాహేతర సంబంధం నెరపుతూ భార్యను వదిలించుకోవాలనే ఆలోచనతో ఆమెపై ఓ కానిస్టేబుల్ దాడి చేసిన ఘటన నగరంలో సంచలనమైంది. కానిస్టేబుల్ చేతిలో చావుదెబ్బలుతిన్న బాధితురాలి కథనం ప్రకారం రాజమహేంద్రవరం వన్టౌన్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా పని చేస్తున్న నరసయ్య 2002లో రాజమహేంద్రవరం, ఆర్యాపురం, మూలగొయ్యి ప్రాంతానికి చెందిన సంగీత అనే మహిళను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. వివాహ సమయంలో నరసయ్య పాల వ్యాపారం చేసేవాడు. అనంతరం కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు. మొదట త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే సమయంలో ఎక్సైజ్ కానిస్టేబుల్గా పని చేసే ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో అసలు భార్యను వదిలించుకుని ఆమెతో జీవించేందుకు సిద్ధమయ్యాడు. దీనిపై మూడేళ్లుగా సంగీత త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని పేర్కొంది. నాలుగు రోజుల క్రితం సంగీత రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజ కుమారిని కలసి తన గోడు వెళ్లబొసుకున్నట్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న నరసయ్య మంగళవారం రాత్రి మూలగొయ్యిలో ఉంటున్న సంగీత ఇంట్లోకి వెళ్లి చావబాదాడు. అపస్మారక స్థితిలో ఉన్న సంగీతను ఆమె సోదరులు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. భార్యను వదలించుకునేందుకు చిత్రహింసలు మరో మహిళా కానిస్టేబుల్తో వివాహేతర సంబంధం పెట్టుకున్న నరసయ్య తనను వదిలించుకునేందుకు అనేక సార్లు చిత్రహింసలకు గురి చేశాడని, తనను వదిలేస్తే కొంత సొమ్ము ఇస్తానని బెదిరించేవాడని బాధితురాలు తెలిపింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ సైతం నీ భర్తను వదిలేస్తే నేను కూడా కొంత సొమ్ము ఇస్తానని నాపై వత్తిడి తెచ్చేవారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా కేసు నమోదు చేయలేదని ఇప్పటికైనా తనకు, తన బిడ్డలకు న్యాయం చేయాలని వేడుకున్నారు. -
ఆడవాళ్ల జోలికొస్తే ఖబడ్తార్ అంటూ ఉతికేసింది
-
అంచనాలను బీట్ చేసిన టైటన్
ముంబై: టాటా గ్రూప్ దిగ్గజం టైటన్ బుధవారం భారీగా దూసుకుపోతోంది. కంపెనీ ఈ ఏడాది డిసెంబర్ క్వార్టర్ ఫలితాలు ఎనలిస్టుల అంచనాలను బీట్ చేయడంతో ఒక దశలో 10 శాతానిపైగా ఎగిసింది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ఆకట్టుకోవడంతో ఈ కౌంటర్లో మదుపర్లు కొనుగోళ్ల జోరందుకుంది. క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో నికర లాభం 13 శాతం పెరిగి రూ. 255.75 కోట్లను అధిగమించింది. మొత్తం అమ్మకాలు 14 శాతం పెరిగి రూ. 3926 కోట్లను తాకాయి. టైటాన్ ఈబీఐటీడీఏ లేదా ఆపరేటింగ్ లాభం గత ఏడాది ఇదే కాలంలో రూ. 309 కోట్ల పోలిస్తే 21 శాతం ఎగసింది. ఈ ఏడాది రూ. 373 కోట్లగా నమోదుచేసింది. ఇబిటా మార్జిన్లు 9 శాతం నుంచి 9.5 శాతానికి బలపడ్డాయి. అమ్మకాలలో జ్యువెలరీ విభాగం నుంచి 15 శాతం అధికంగా రూ. 3255 కోట్లు లభించగా.. వాచీల బిజినెస్ ఆదాయం 5 శాతం పెరిగి రూ. 508 కోట్లను తాకింది. జ్యువెలరీ ఇబిటా 15 శాతం ఎగసి రూ. 334 కోట్లయ్యింది. వాచీల ఇబిటా మరింత అధికంగా 63 శాతం జంప్చేసి రూ. 53 కోట్లను తాకింది. మంచి ఫెస్టివల్ సీజన్, పెళ్లిళ్ల సీజన్ ,టైటాన్ రిటైల్ అమ్మకాల వృద్ధికి దోహదపడిందని, లాభాలకు తోడ్పడిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. డిమానిటైజేషన్ తరువాత చాలా బంగారం షాపులు మూతపడడంతో తమకు డిమాండ్ ఏర్పడిందని టైటాన్ కంపెనీ సీఎఫ్వో ఎస్ సుబ్రమణ్యం చెప్పారు. దీపావళివ కి గోల్డ్ కాయిన్ అమ్మకాలు భారీగా పుంజుకున్నాయన్నారు. మొత్తంగా ఈ క్వార్టర్ వృద్ధి ప్రోత్సాహకరంగా ఉందని పేర్కొన్నారు. -
పసిమొగ్గలపై పైశాచికత్వం
పరుగుపెట్టించి కొట్టిన హోలీ ఏంజెల్స్ డైరెక్టర్ ఐటీడీఏ పీవోకు ఫిర్యాదు చేసిన గిరిజన బాలికలు డైరెక్టర్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి డిమాండ్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం)/ రంపచోడవరం : పైశాచికత్వం పెల్లుబికింది... పసిమొగ్గలని కూడా చూడలేదు వారిని..చేతులపై బొబ్బలు వచ్చేలా.. కాళ్లు వాచేలా చితకబాదాడు...రోజూ అతడు స్కూలుకు వస్తున్నాడంటేనే వణికిపోతున్న విద్యార్థులకు ఒక రోజంతా తన విశ్వరూపం చూపించాడు. రాజమహేంద్రవరంలోని హోలీ ఏంజెల్స్ పాఠశాలలో చదువుతున్న గిరిజన విద్యార్థినులు పాఠశాల డైరెక్టర్ పైశాచికత్వానికి బలయ్యారు. ఈ సంఘటన రాజమహేంద్రవరంలో మంగళవారం వెలుగుచూసింది. దీనికి సంబంధించి విద్యార్థులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. బెల్ట్ దెబ్బలు తట్టుకోలేక రోడ్డుపైకి పరుగులు ఐటీడీఏ ప్రతిభ పాఠశాల పేరుతో గిరిజన విద్యార్థులను రాజమహేంద్రవరంలోని ప్రైవేట్ పాఠశాల అయిన హోలీ ఏంజెల్స్లో చేర్పిస్తున్నారు. వీరికి ఐటీడీఏ ఫీజులు చెల్లిస్తోంది. సోమవారం ఉదయం పాఠశాల క్యాంపస్కు డైరెక్టర్ మధుసూధనరావు వచ్చారు. ఆయన గిరిజన విద్యార్థుల వద్దకు వెళ్లారు. ఏం చేస్తున్నారురా అంటూ తిట్ల పురాణం మొదలుపెట్టాడు. అక్కడితో చాలక వారిని ఇష్టారాజ్యంగా చితకబాదాడు. విషయాన్ని తమ వారికి తెలపాలంటూ ఏదోలా వారంతా బయటపడ్డారు. మంగళవారం రంపచోడవరం ఐటీడీఏ పీవో ఏఎస్ దినేష్కుమార్, స్థానిక ఏఎస్పీ నయీం ఆస్మీకి ఫిర్యాదు చేశారు. పదో తరగతి చదువుతున్న ఎం. జ్యోత్స్నకుమారి అనే విద్యార్థిని మాట్లాడుతూ తమను అకారణంగా కొడుతున్న డైరక్టర్ సార్ని కొట్ట వద్దంటూ కాళ్లు పట్టుకున్నామని, అయినా బెల్ట్తో కొట్టారంటూ వాచి పోయిన తన చేతులను చూపింది. పి సోనియా అనే మరో బాలిక మాట్లాడుతూ డైరెక్టర్ ఎప్పుడు వచ్చినా ఎవర్ని కొడతారోననే భయంతో వణుకుతూ దాకుంటున్నామని తెలిపింది. సోమవారం ఉదయం ఐదు గంటలకు వచ్చిన డైరెక్టర్ గిరిజన విద్యార్థినులను తిడుతూ ‘ఐటీడీఏ ఇచ్చే డబ్బులు మీకు భోజనానికి కూడా సరిపోవడం లేదు మీకు చెట్లు కింద చదువే మీకు సరిపోతుంది’ అంటూ కర్ర విరిగిపోయేలా కొట్టారని వాపోయింది. దెబ్బలు తట్టుకోలేని కొంత మంది రోడ్డుపైకి పరుగులు తీశారని తెలిపింది. జరిగిన సంఘటన పోలీసులకు తెలియడంతో పాఠశాలకు పోలీసులు వచ్చారని, బాగా దెబ్బలు తగిలిన జ్యోత్స్న కుమారిని గదిలో దాచిపెట్టారంది. నరకం అంటే ఎలా ఉంటే మీకు రోజూ చూపిస్తానని బెదిరించి, జరిగిన సంఘటన ఎవరికి చెప్పిన మీ సంగతి తేల్చుతానని హెచ్చరించారని తెలిపింది. ఆ పాఠశాలలో ఇక చదువును కొనసాగించలేమని విద్యార్థులు వాపోయారు. అందరి దుస్తులూ ఉతకండి.. డైరెక్టర్ వచ్చే సయమానికి ఉతికిన దుస్తులు ఆరబెట్టుకుంటే .. పాఠశాలలో అందరి దుస్తులూ మీరే ఉతకండని తిట్టారని దుర్గవిజయలక్ష్మి అనే బాలిక తెలిపింది. సుమారు 200 మంది గిరిజన విద్యార్థినులు హోలి ఏంజెల్స్లో చదువుతున్నారని డైరెక్టర్ వస్తే బాత్రూమ్లో ఉన్న బయటకు పిలిచి మరీ కొడుతున్నారని వివరించింది. కనీసం జ్వరం వచ్చినా పట్టించుకోరని, ఇంటి నుంచి ఫోన్ వచ్చినా ఆ విషయం చెప్పరని వివరించింది. క్రిమినల్ కేసులు నమోదు చేయాలి గిరిజన విద్యార్థినులపై అమానుషంగా ప్రవర్తించిన హోలి ఏంజెల్స్ పాఠశాల డైరెక్టర్ మ«ధుసూధనరావుపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి డిమాండ్ చేశారు. విద్యార్థి పట్ల జరిగిన సంఘటనపై కలెక్టర్, ఐటీడీఏ పీవోలతో చర్చించి విద్యార్థినులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఆ పాఠశాలలో విద్యార్థినులు చదివే పరిస్థితి లేదు కాబట్టి మరో పాఠశాలలో చదివేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థినుల తల్లిదండ్రులు, ఆదివాసీ సంక్షేమ సాంస్కృతిక సంఘం నాయకుడు కడబాల రాంబాబులు డిమాండ్ చేశారు. ఐటీడీఏ రూ.లక్షలు కార్పొరేట్ పాఠశాలకు ఇస్తుంటే అక్కడ కనీసం సరైన భోజనం కూడా పెట్టకుండా కొట్టడం దారుణమన్నారు. గిరిజన సంక్షేమ సహాయ అధికారి ఆకుల వెంకటేశ్వరరావు హోలి ఏంజెల్స్ పాఠశాలకు వెళ్లి బాలికల తల్లిదండ్రులు రాకుండానే సర్దుబాటు చేయాలని చూడడం వెనుక కారణాలు ఏమిటని జగ్గంపాలెం సర్పంచ్ రంగబాబు ఆరోపించారు. -
పసిమొగ్గలపై పైశాచికత్వం
పరుగుపెట్టించి కొట్టిన హోలీ ఏంజెల్స్ డైరెక్టర్ ఐటీడీఏ పీవోకు ఫిర్యాదు చేసిన గిరిజన బాలికలు డైరెక్టర్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి డిమాండ్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం)/ రంపచోడవరం : పైశాచికత్వం పెల్లుబికింది... పసిమొగ్గలని కూడా చూడలేదు వారిని..చేతులపై బొబ్బలు వచ్చేలా.. కాళ్లు వాచేలా చితకబాదాడు...రోజూ అతడు స్కూలుకు వస్తున్నాడంటేనే వణికిపోతున్న విద్యార్థులకు ఒక రోజంతా తన విశ్వరూపం చూపించాడు. రాజమహేంద్రవరంలోని హోలీ ఏంజెల్స్ పాఠశాలలో చదువుతున్న గిరిజన విద్యార్థినులు పాఠశాల డైరెక్టర్ పైశాచికత్వానికి బలయ్యారు. ఈ సంఘటన రాజమహేంద్రవరంలో మంగళవారం వెలుగుచూసింది. దీనికి సంబంధించి విద్యార్థులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. బెల్ట్ దెబ్బలు తట్టుకోలేక రోడ్డుపైకి పరుగులు ఐటీడీఏ ప్రతిభ పాఠశాల పేరుతో గిరిజన విద్యార్థులను రాజమహేంద్రవరంలోని ప్రైవేట్ పాఠశాల అయిన హోలీ ఏంజెల్స్లో చేర్పిస్తున్నారు. వీరికి ఐటీడీఏ ఫీజులు చెల్లిస్తోంది. సోమవారం ఉదయం పాఠశాల క్యాంపస్కు డైరెక్టర్ మధుసూధనరావు వచ్చారు. ఆయన గిరిజన విద్యార్థుల వద్దకు వెళ్లారు. ఏం చేస్తున్నారురా అంటూ తిట్ల పురాణం మొదలుపెట్టాడు. అక్కడితో చాలక వారిని ఇష్టారాజ్యంగా చితకబాదాడు. విషయాన్ని తమ వారికి తెలపాలంటూ ఏదోలా వారంతా బయటపడ్డారు. మంగళవారం రంపచోడవరం ఐటీడీఏ పీవో ఏఎస్ దినేష్కుమార్, స్థానిక ఏఎస్పీ నయీం ఆస్మీకి ఫిర్యాదు చేశారు. పదో తరగతి చదువుతున్న ఎం. జ్యోత్స్నకుమారి అనే విద్యార్థిని మాట్లాడుతూ తమను అకారణంగా కొడుతున్న డైరక్టర్ సార్ని కొట్ట వద్దంటూ కాళ్లు పట్టుకున్నామని, అయినా బెల్ట్తో కొట్టారంటూ వాచి పోయిన తన చేతులను చూపింది. పి సోనియా అనే మరో బాలిక మాట్లాడుతూ డైరెక్టర్ ఎప్పుడు వచ్చినా ఎవర్ని కొడతారోననే భయంతో వణుకుతూ దాకుంటున్నామని తెలిపింది. సోమవారం ఉదయం ఐదు గంటలకు వచ్చిన డైరెక్టర్ గిరిజన విద్యార్థినులను తిడుతూ ‘ఐటీడీఏ ఇచ్చే డబ్బులు మీకు భోజనానికి కూడా సరిపోవడం లేదు మీకు చెట్లు కింద చదువే మీకు సరిపోతుంది’ అంటూ కర్ర విరిగిపోయేలా కొట్టారని వాపోయింది. దెబ్బలు తట్టుకోలేని కొంత మంది రోడ్డుపైకి పరుగులు తీశారని తెలిపింది. జరిగిన సంఘటన పోలీసులకు తెలియడంతో పాఠశాలకు పోలీసులు వచ్చారని, బాగా దెబ్బలు తగిలిన జ్యోత్స్న కుమారిని గదిలో దాచిపెట్టారంది. నరకం అంటే ఎలా ఉంటే మీకు రోజూ చూపిస్తానని బెదిరించి, జరిగిన సంఘటన ఎవరికి చెప్పిన మీ సంగతి తేల్చుతానని హెచ్చరించారని తెలిపింది. ఆ పాఠశాలలో ఇక చదువును కొనసాగించలేమని విద్యార్థులు వాపోయారు. అందరి దుస్తులూ ఉతకండి.. డైరెక్టర్ వచ్చే సయమానికి ఉతికిన దుస్తులు ఆరబెట్టుకుంటే .. పాఠశాలలో అందరి దుస్తులూ మీరే ఉతకండని తిట్టారని దుర్గవిజయలక్ష్మి అనే బాలిక తెలిపింది. సుమారు 200 మంది గిరిజన విద్యార్థినులు హోలి ఏంజెల్స్లో చదువుతున్నారని డైరెక్టర్ వస్తే బాత్రూమ్లో ఉన్న బయటకు పిలిచి మరీ కొడుతున్నారని వివరించింది. కనీసం జ్వరం వచ్చినా పట్టించుకోరని, ఇంటి నుంచి ఫోన్ వచ్చినా ఆ విషయం చెప్పరని వివరించింది. క్రిమినల్ కేసులు నమోదు చేయాలి గిరిజన విద్యార్థినులపై అమానుషంగా ప్రవర్తించిన హోలి ఏంజెల్స్ పాఠశాల డైరెక్టర్ మ«ధుసూధనరావుపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి డిమాండ్ చేశారు. విద్యార్థి పట్ల జరిగిన సంఘటనపై కలెక్టర్, ఐటీడీఏ పీవోలతో చర్చించి విద్యార్థినులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఆ పాఠశాలలో విద్యార్థినులు చదివే పరిస్థితి లేదు కాబట్టి మరో పాఠశాలలో చదివేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థినుల తల్లిదండ్రులు, ఆదివాసీ సంక్షేమ సాంస్కృతిక సంఘం నాయకుడు కడబాల రాంబాబులు డిమాండ్ చేశారు. ఐటీడీఏ రూ.లక్షలు కార్పొరేట్ పాఠశాలకు ఇస్తుంటే అక్కడ కనీసం సరైన భోజనం కూడా పెట్టకుండా కొట్టడం దారుణమన్నారు. గిరిజన సంక్షేమ సహాయ అధికారి ఆకుల వెంకటేశ్వరరావు హోలి ఏంజెల్స్ పాఠశాలకు వెళ్లి బాలికల తల్లిదండ్రులు రాకుండానే సర్దుబాటు చేయాలని చూడడం వెనుక కారణాలు ఏమిటని జగ్గంపాలెం సర్పంచ్ రంగబాబు ఆరోపించారు. -
టీచర్ రాక్షసత్వానికి విద్యార్థి ఒంటిపై వాతలు
-
చేయని నేరాన్ని చితక్కొట్టి ఒప్పించారు
-
బాల శిక్ష
-
ప్రభుత్వ హైస్కూల్లో శాడిస్ట్ టీచర్
-
ఇంటర్ విద్యార్థిని చితకబాదిన లెక్చరర్
-
బాలుడిపై ట్యూషన్ మాస్టర్ దాష్టీకం
-
అంచనాలకు మించి రాణించిన ఎం అండ్ ఎం
ముంబై: దేశీయ ఆటో దిగ్గజం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి మహీంద్రా అండ్ మహీంద్రా మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. స్ట్రీట్ అంచనాల ఓడించి, జూన్ క్వార్టరు కు రూ 955 కోట్ల స్వతంత్ర నికర లాభాన్ని నమోదుచేసింది. దేశీయ టాప్ సెల్లింగ్ యుటిలిటీ వెహికల్ మేకర్ ఎం అండ్ ఎం నికర విక్రయాల్లో 14 శాతం వృద్ధితో రూ 11, 942 కోట్ల సాధించినట్టు బుధవారం వెల్లడించింది. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న వినియోగ వాహనాల తయారీ లో 9.7 శాతం వృద్ధి సాధించింది. జూన్ త్రైమాసికంలో సమయంలో 1,10,959 యూనిట్లు విక్రయించింది. యుటిలిటీ వాహనాల అమ్మకాలు 13 శాతం ప జంప్ అయ్యాయి. ఈ త్రైమాసికంలో 55.909 యూనిట్లను విక్రయించి, 31.6 శాతం మార్కెట్ వాటాతో విభాగంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ట్రాక్టర్ అమ్మకాలు 21 శాతం పెరిగాయి. 71, 785 యూనిట్ల అమ్మకాలతో ఎం అండ్ ఎం జూన్ త్రైమాసికం ముగిసేనాటికి ట్రాక్టర్ విభాగంలో 44 శాతం మార్కెట్ షేర్ సాధించింది. క్యూ1(ఏప్రిల్-జూన్)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఎంఅండ్ఎం నికర లాభం రూ. 955 కోట్లను తాకగా, నిర్వహణ లాభం(ఇబిటా)11 శాతం పెరిగి రూ. 1489 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ. 10,525 కోట్లుగా నమోదైంది. 14.1 శాతం ఇబిటా మార్జిన్లు సాధించింది. క్యూ1లో దేశీ ట్రాక్టర్ మార్కెట్లో రెండంకెల వృద్ధిని సాధించినట్లు కంపెనీ పేర్కొంది. ఆటో విభాగం మార్జిన్లు 5.9 శాతం నుంచి 4.3 శాతానికి తగ్గినట్లు తెలియజేసింది. దేశీయ మార్కెట్లో తమకు మంచి వృద్ధి ఉందని, మంచి భవిష్యత్తు ఉందని ఎంఅండ్ ఎం ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా, మార్కెట్లలో నెలకొన్న నష్టాల పరంపరలో ఎంఅండ్ఎం షేరు అనంతరం నష్టాల్లోకి జారుకుంది. -
అంచనాలను మించిన అమెరికా జాబ్ గ్రోత్
అమెరికా ఉద్యోగాలు పెరుగుదల అంచనాలకు మించి గణాంకాలను నమోదు చేసింది. జూలై జాబ్ గ్రోత్ లో బలమైన వృద్ధిని సాధించి 255,000 ఉద్యోగాలను జోడించింది. జూన్ మాసంలోని 292,000 ఉద్యోగాలతో పోలిస్తే వృద్ధిలో క్షీణించినప్పటికీ ఎనలిస్టులు ఊహించిన దానికంటే ఎక్కువ నమోదు చేసింది. ఇది 175,000- 180,000 మధ్య ఉంటుందని ఎనలిస్టులు అంచనా వేశారు. దీంతో ఫెడ్ సంవత్సరాంతానికి వడ్డీరేట్లను పెంచనుందనే ఊహాగానాలను మరింత పెంచింది. అయితే అన్ ఎంప్లాయ్ మెంట్ రేట్ (నిరుద్యోగుల )4.9% వద్ద స్థిరంగా ఉండిపోయింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నప్పటికీ అద్భుతంగా లేదని విశ్లేషకుడు డెన్నిస్ డె జాంగ్ అభిప్రాయపడ్డారు. మొదటి ఆరు నెలల లెక్కలే సంవత్సరం మొత్తం ఫలితాలను ప్రతిబింబిస్తాయన్నారు. క్షీణించిన ఉపాధి అవకాశాలతో వడ్డీ రేట్లను పెంచాలనే సంకేతాలను ఫెడ్ అందించిందని తెలిపారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ రెండవ త్రైమాసికంలో అంచనాలకన్నా కంటే నెమ్మదిగా వృద్ధి చెందిందని ఆ తర్వాతి డేటా వెల్లడి చేసిందని పేర్కొన్నారు. కాగా ఫెడ్ తదుపరి పాలసీ రివ్యూ సెప్టెంబర్ లో జరగనుంది. అయితే మందకొడిగా ఉన్న ఆర్థిక వృద్ధి, దిగజారుతున్న ఉత్పాదకత, అధ్యక్ష ఎన్నికలతో నెలకొన్న అనిశ్చితి ఆందోళనల నేపథ్యంలో డిసెంబర్ వరకు ఆలస్యం కావచ్చని మరో ఆర్థికవేత్త అభిప్రాయపడ్డారు. ఉద్యోగ మార్కెట్ అభివృద్ధితో మళ్ళీ ఈ సంవత్సరం ఫెడ్ రేట్లు పెంచే అవకాశం ఉందన్నారు. బ్యాంక ఆఫ్ ఇంగ్లాండ్ తీసుకున్న పటిష్టమైన నిర్ణయం లాంటి ప్రపంచ పరిణామాలను ఫెడ్ నిశితంగా పరిశీలిస్తోందని వాషింగ్టన్ ఆర్థిక వేత్త తెలిపారు. బ్రెగ్జిట్ పరిణామాలు, బ్రిటన్ ఆర్థిక వ్యవస్థపై బలంగా ఉంటాయనీ, ఇది యూరోపియన్ బ్యాంకులపై కూడా ఉండనుందని పేర్కొన్నారు. -
యాపిల్ కు బ్యాడ్ న్యూస్
సియోల్ : స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో కొరియా సంస్థ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ మరోసారి తన సత్తాను చాటుకుంది. నువ్వా నేనా అన్నట్టుగా తలపడి యాపిల్ వెనక్కి నెట్టి అగ్రభాగంలో నిలిచిన శాంసంగ్ తన హవాను కొనసాగిస్తోంది. ప్రధాన ఉత్పత్తుల అమ్మకాల్లో గణనీయమైన ఆదాయ అభివృద్ధిని నమోదు చేసింది. గురువారం విడుదల చేసిన రెండవ త్రైమాసిక ఫలితాల్లో 18 శాతం వృద్ధిని సాధించింది. ఇయర్ ఆన్ ఇయర్ ఆపరేటింగ్ లాభాల్లో 8.14 ట్రిలియన్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఫ్టాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ అమ్మకాల్లో గెలాక్సీ ఎస్ 7, గాలక్సీ తో ఎస్ 7 ఎడ్జ్ బలమైన వృద్ధిని నమోదు చేసింది. టాబ్లెట్ పీసీల అమ్మకాలు సుమారు ఆరు మిలియన్ యూనిట్లుగా నమోదైంది. శాంసంగ్ ప్రకటన ప్రకారం మొత్తం అమ్మకాల్లో 80 శాతం వృధ్దిని , స్మార్ట్ ఫోన్ విక్రయాల్లో 90మిలియన్ల యూనిట్ల అమ్మకాలతో టాప్ ప్లేస్ లో నిలిచింది. 72 మిలియన్ల ఫోన్లను విక్రయిస్తుందనే అంచనాలను అధిగమించి యాపిల్ కు మరోసారి సవాల్ విసిరింది. ఇదే త్రైమాసికంలో యాపిల్ ఐ ఫోన్ అమ్మకాలతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. థర్డ్ క్వార్టర్ లో తాము విడుదల చేసే అతిపెద్ద స్ర్కీన్ ఫ్లాగ్ షిప్ హ్యాండ్ సెట్ ఈ స్థాయి అమ్మకాలను నిలబెట్టుకోవడంలో తోడ్పడుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ఈ ఏడాది గెలాక్సీ ఎ, జె సిరీస్ రిలీజ్ పై దృష్టి పెట్టనున్నట్టు పేర్కొంది. ప్రత్యేకంగా చైనా మార్కెట్ లో గెలాక్సీ సీ ని పరిచయం చేయనున్నట్టు వివరించింది. కాగా గతవారం యాపిల్ ప్రకటించిన ఫలితాల్లో 15 శాతం క్షీణతను నమోదు చేసింది. యాపిల్ ఐ ఫోన్ అమ్మకాల్లో ఎనలిస్టుల అంచనాలను అధిగమించినప్పటికీ శాంసంగ్ అమ్మకాలతో పోలిస్తే.. (40.4 మిలియన్ల అమ్మకాలతో) యాపిల్ వెలవెలబోయింది. ఇది నిజంగా యాపిల్ కు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. మరోవైపు యాపిల్ రెండవ అతిపెద్ద మార్కెట్ చైనా నిషేధంతో యాపిల్ కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఈ పరిణామం ఐ ఫోన్ అమ్మకాలపై భారీ ప్రభావాన్ని చూపించింది. -
దుస్తులిప్పించి, కారుకు కట్టేసి కొట్టారు
-
హిల్లరీని మళ్లీ దెబ్బకొట్టాడు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికోసం నామినీ అభ్యర్థుల మధ్య రేసు అనూహ్యంగా మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రిపబ్లికన్ పార్టీ నుంచి ఇప్పటికే తన అభ్యర్థిత్వాన్ని డోనాల్డ్ ట్రంప్ ఖరారు చేసుకోగా.. డెమొక్రటిక్ నామినీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ మాత్రం ఇంకా ఆ దిశగా ముందుకు వెళ్లలేకపోతున్నారు. ఆమెను అదే పార్టీకి చెందిన బెర్నీ సాండర్స్ గండం ఎదురవుతోంది. వెస్ట్ వర్జినీయాలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో బెర్నీ సాండర్స్ విజయం సాధించారు. అంతకుముందు ఇండియానాలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో కూడా ఆయన క్లింటన్ ను దెబ్బకొట్టారు. దీంతో ఇప్పుడు రేసులో ఇద్దరు సమ ఉజ్జీలుగా ముందుకు వెళ్లినట్లవుతుంది. ఈ విజయం అనంతరం సాండర్స్ మాట్లాడుతూ మొత్తం 19 రాష్ట్రాల్లో తాము విజయం సాధించినట్లు చెప్పారు. దీంతో తాము అభ్యర్థిత్వ రేసులో సురక్షితంగా ఉన్నట్లయిందని, చివరి ఓటు వరకు తాను రేసులోనే ఉంటానని ఆయన చెప్పారు. అలాగే, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ కూడా ఇక్కడ విజయం సాధించారు. వెస్ట్ వర్జినీయాలోని బొగ్గు మైనింగ్ వ్యవహారాలను ఎన్నికల ప్రచారంలో చెప్పడంలో హిల్లరీ క్లింటన్ విఫలమైనట్లు రాజకీయ నిపుణులు చెప్తున్నారు. -
యాపిల్ , శాంసంగ్ రారాజు ఎవరు?
ఇండియన్ మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న శాంసంగ్ కంపెనీ.. మరో దిగ్గజం యాపిల్కు చెక్ పెట్టింది. ప్రపంచ మొబైల్ టెక్నాలజీలో దిగ్గజాలైన యాపిల్, శాంసంగ్ మధ్య పోటీలో శాంసంగ్ భారత్లో రారాజుగా నిలిచింది. స్మార్ట్ ఫోన్ సెగ్మంట్లో నెంబర్ 1 స్థానం కోసం హోరాహోరీగా జరిగిన పోటీలో శాంసంగ్ పైచేయి సాధిచింది. ఇటీవల యాపిల్ సంస్థ ప్రకటించిన నిరాశాజనక ఫలితాలు, శాంసంగ్ ప్రకటించిన బంపర్ ఫలితాల నేపథ్యంలో మార్కెట్ ఎనలిస్టులు ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. శాంసంగ్, యాపిల్ రెండూ టెక్నాలజీ దిగ్గజాలే.. రెండూ దేనికదే సాటి. అయితే ఈ మధ్య కాలంలో శాంసంగ్ బాగా పుంజుకుని పోటీలో ముందంజ వేసింది. జనవరి- మార్చి త్రైమాసిక ఫలితాల్లో 35 నుంచి 62 శాతం శాంసంగ్ వృద్ధిని నమోదు చేయగా.. యాపిల్ 55 నుంచి 37 శాతానికి పడిపోయింది. శాంసంగ్ భారతదేశంలో ప్రీమియం సెగ్మెంట్లో నంబర్ 1 స్థానానికి ఎగబాకిందని సీఎంఆర్ వ్యాఖ్యానించింది. గత ఏడాదితో పోలిస్తే శాంసంగ్ మార్కెట్ గణనీయంగా విస్తరించిందని మార్కెట్ పరిశోధన కంపెనీ జీఎఫ్కె పేర్కొంది. జనవరి మార్చి త్రైమాసికంలో యాపిల్ మార్కెట్ షేర్ 41 శాతంగా ఉంటే శాంసంగ్ మార్కెట్ షేర్ 50 శాతంగా నమోదైందని తెలిపింది. మరోవైపు భారతదేశంలో ఐఫోన్ అమ్మకాలు ఆదాయంలో 56 శాతం క్షీణించాయి. బుధవారం వెల్లడించిన త్రైమాసిక అమ్మకాల్లో 13 సంవత్సరాలలో తొలిసారి తాము భారీగా నష్టపోయినట్టు కంపెనీ నివేదించింది. ఈ సందర్భంగా కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ భారతదేశంలో తమ వ్యాపారం పై ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా గత నెలలో లాంచ్ చేసిన బ్లాక్బస్టర్ మోడల్ గెలాక్సీ ఎస్ 7 అందించిన సక్సెస్ , గెలాక్సీ ఎస్ 6 ఎస్ 5 ధరల తగ్గింపు శాంసంగ్ హవా కొనసాగడానికి దోహదపడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
మోదీని అధిగమించిన ప్రియాంకా చోప్రా
న్యూయార్క్ః బాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరైన ప్రియాంకా చోప్రా ఆన్ లైన్ పోల్ లో ప్రధాని మోదీని దాటేశారు. టైమ్ మ్యాగజిన్ నిర్వహించిన ఆన్ లైన్ పోల్ లో ఒక శాతం అధిక ఓట్లను సాధించి భారత్ ప్రధానినే మించిపోయారు. ప్రపంచంలోని వందమంది మోస్ట్ ఎఫెక్టివ్ పర్సన్స్ ను ప్రచురించే టైమ్స్ పత్రిక నిర్వహించిన పోల్ లో ప్రధాని మోదీకంటే ముందంజలో ఉన్నారు. టైమ్స్ మ్యాగజిన్ ప్రతి సంవత్సరం ఆన్ లైన్ పోల్ నిర్వహిస్తుంటుంది. ఇదే నేపథ్యంలో ఈసారి నిర్వహించిన పోల్ లో ప్రభావవంతమైన ప్రముఖులు వందమందిలో ప్రియాంకా చోప్రా భారత ప్రధాని మోదీని మించిపోయారు. దీంతోపాటు డెమొక్రెటిక్ ప్రెసిడెన్షియల్ అభ్యర్థి బెర్నీ శాండర్స్ కూడ ఈసారి ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ తో పాటు అధ్యక్షుడు బారాక్ ఒబామా, మయన్మార్ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీతో పాటు పాకిస్తాన్ కార్యకర్త మలాలాను కూడ మూడు రెట్ల ఓట్లతో అధిగమించినట్లు టైమ్స్ తెలిపింది. అత్యంత ప్రభావవంతమైన వందమంది వ్యక్తుల జాబితాకోసం మ్యాగజిన్ ఏప్రిల్ 13 బుధవారం రాత్రి ఆన్ లైన్ పోల్ నిర్వహించింది. ఏప్రిల్ 21న దీనికి సంబంధించిన జాబితా వెలువడనుంది. అయితే అమెరికాలో ప్రసిద్ధి చెందిన టీవీ సీరియల్ 'క్యాంటికోగా' లో నటించి తన పాత్రతో మెప్పించిన ప్రియాంకా చోప్రా మోదీకి వచ్చిన 0.7 ఓట్ల కంటే ఒక శాతం అధికంగా 0.8 ఓట్లను పొంది ముందు వరుసలో నిలిచింది. అలాగే 1 శాతం ఓట్లను పొందిన క్లింటన్ కన్నా శాండర్స్ 3.3 శాతం అధిక ఓట్లను సాధించారు. ఇకపోతే శాండర్స్ తర్వాత సౌత్ కొరియన్ బాయ్ బ్యాండ్ బిగ్ బ్యాంగ్ రెండో స్థానంలో నిలవగా అత్యధిక వాక్చాతుర్యాన్ని ప్రదర్శించి ప్రజల దృష్టిలో ముందు కనిపిస్తున్న ట్రంప్ మాత్రం 0.6 శాతం ఓట్ల ను సాధించి ఆన్ లైన్ పోల్లో పూర్తిగా వెనుకబడ్డారు. -
ఎస్ఐ కాలు విరగ్గొట్టిన మహిళా నేత
మీరట్: ఉత్తర ప్రదేశ్ లోని సమాజ్ వాదీ పార్టీ మహిళా నేత స్థానిక పోలీస్ స్టేషన్లో వీరంగం సృష్టించింది. స్వల్ప విషయానికే ఆగ్రహంతో రెచ్చిపోయింది. తన అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్ పై దౌర్జన్యం చేసింది. అడ్డొచ్చిన పోలీస్ అధికారిపై దాడి చేసి అతని కాలు విరగ్గొట్టింది. స్నేహితులతో కలిసి కారులో మద్యం సేవిస్తూ వెళుతున్న ఎస్పీ నేత సంగీత రాహుల్ కొడుకును చెక్పోస్ట్ దగ్గర అడ్డుకోవడమే ఆ పోలీసులు చేసిన నేరం. నా కొడుకునే అడ్డుకుంటారా..అంటూ సదరు మహిళ నేత ఆగ్రహంతో ఊగిపోయింది. కొంతమంది అనుచరులను వెంటేసుకొని పోలీస్ స్టేషన్పై దాడికి దిగడమే కాకుండా అడ్డొచ్చిన ఎస్ఐ సర్వేష్ పై దాడి చేసింది. దీంతో అతని కాలు విరిగింది. -
కోరిక తీర్చలేదని భర్తపై దాడి
న్యూయార్క్: కోరిక తీర్చలేదనే అక్కసుతో భర్తపై ఓ మహిళ తీవ్రంగా దాడిచేసిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. దక్షిణ కరోలినా కు చెందిన ఎర్లీ కెల్లి(50) ఈ దారుణానికి పాల్పడింది. కోరికను తిరస్కరించిన కారణంగా భర్తపై దాడికి దిగిన కెల్లి బీభత్సాన్ని సృష్టించిందని స్థానిక మీడియా రిపోర్టు చేసింది. శృంగారానికి నిరాకరించిన భర్తపై అసహనంతో రెచ్చిపోయిన కెల్లి దొరికిన వస్తువును దొరికినట్టు విసిరి పారేసింది. అందమైన సిరామిక్ బొమ్మలను ధ్వంసం చేసింది. చివరికి నాన్ చాక్ తో ఎటాక్ చేసి భర్తను తీవ్రంగా గాయపర్చింది. దీంతో పోలీసులు ఆమెపై గృహ హింస కేసు నమోదు చేశారు. అయితే ఎర్లీ కెల్లి తీవ్రమైన మానసిక ఒత్తిడి నివారణ మందులు వాడుతున్నట్టు సమాచారం. -
విద్యార్ధిని గొడకేసి కొట్టిన టీచర్
-
ఇష్టంలేదని చెప్పిందని కూతుర్నే చంపేశాడు
రియాద్: రక్తం పంచుకుపుట్టిన కన్న కూతురినే కొట్టి చంపాడో తండ్రి. ఈ సంఘటన సౌదీ అరేబియాలోని రియాద్లో చోటు చేసుకుంది. నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పడమే ఆ చిన్నారి తండ్రితో చెప్పటమే ఆమె పాలిట మృత్యువైంది. ఏడేళ్ల యర... నువ్వంటే ఇష్టం లేదని తండ్రితో చెప్పడంతో కోపోద్రిక్తుడైన అతను కర్రతో పాటు ఎయిర్ కండీషనర్ గొట్టంతో తీవ్రంగా కొట్టాడు. అనంతరం ఆ చిన్నారిని బెడ్ రూంలో వేసి తాళం వేశాడు. చాలాసేపటి తర్వాత ఆ చిన్నారి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందామని తండ్రి తలుపు తెరిచి చూశాడు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కూతుర్ని చివరికి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే మార్గ మధ్యలోనే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కాగా యర తల్లిదండ్రులు మనస్పర్థలు కారణంగా విడిగా ఉంటున్నారు. వీరి విడాకులు మంజూరు కోసం పిటిషన్ కోర్టులో నడుస్తుండగా ఇష్టం లేకపోయినా తండ్రి దగ్గరికి ఇటీవలే వెళ్లిందని యర తల్లి తెలిపింది. తండ్రి అంటే చిన్నారికి అస్సలు ఇష్టం లేదని, అతని దగ్గరికి వెళ్లడానికి కూడా నిరాకరించిందని కన్న తల్లి కన్నీరుమున్నీరైంది. -
ఆలస్యంగా వచ్చారని చితకబాదిన టీచర్
-
ఆలస్యంగా వచ్చారని చితకబాదిన టీచర్
హైదరాబాద్: ఆలస్యంగా వచ్చారంటూ నలుగురు విద్యార్థులను మంగళవారం ఓ టీచర్ చితకబాదారు. ఈ దాడిలో ఒక విద్యార్థి చేయి విరగగా, మిగతా ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మీర్ పేట గౌతమి స్కూల్లో చోటు చేసుకుంది. దీనికి నిరసనగా స్కూల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. -
వేద పాఠశాలలో టీచర్ కిరాతకం
-
టీచర్ దెబ్బలకు ఇరిగిపోయిన బాలుడి పళ్లు
-
విద్యార్ధిని కర్రతో చితకబాదిన టీచర్
-
భారత్ పరాజయం
-
ధర్డ్ డిగ్రీ చదువులు
-
నేరస్తులపై కానిస్టేబుళ్ల ఆటవిక న్యాయం
-
బరితెగించిన భర్తకు బడితె పూజ..
-
హోంవర్క్ చేయలేదని .. చితకబాదింది!
-
విద్యార్ధిని వాతలు తేలేలా కొట్టిన టీచర్
-
ప్రకాష్ రాజ్కు ఎదురైన అనుభవమే....
మొన్న నటుడు ప్రకాష్ రాజ్ ఎదుర్కొన్న అనుభవమే... తాజాగా మరో మహిళకు ఎదురైంది. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే విషయంలో మనుషులు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్న సంఘటనలు తరచు చోటుచేసుకుంటున్నాయి. సాయం చేయాలని అర్ధిస్తున్నా పట్టించుకోకుండా వినోదం చూస్తున్నట్లు సెల్ఫోన్లలో ఆ సంఘటను బంధించటంలో కొందరు పోటీలు పడ్డారు. రోడ్డుమీద ఏం జరిగినా సాయం చేయడం మానేసి వీడియోలు తీసి ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను పెట్టడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో పదే పదే చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని మీరట్లో పట్టపగలు.. నడిరోడ్డుమీద తన భర్తపై దాడి చేస్తున్న ఇద్దరు యువకులను ఓ మహిళ ధైర్యంగా ఎదుర్కొంది. దంపతుల బైకును కారుతో ఢీకొట్టిన యువకులు, ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తించటంతో పాటు ఆమె భర్తపై దాడికి దిగారు. తమకు సాయం చేయాలంటూ ఆ మహిళ అక్కడున్న వారిని ప్రాధేయపడినా ఎవరూ ముందుకు రాలేదు. పైగా చోద్యం చూస్తూ. ఈ సంఘటనను తమ సెల్ఫోన్లలో చిత్రీకరించటంలో నిమగ్నమైపోయారు. దాంతో భర్తను రక్షించుకునేందుకు ఆ మహిళే రంగంలోకి దిగింది. అపరకాళిలా విరుచుకుపడి ...దాడికి దిగిన యువకులకు దేహశుద్ధి చేసింది. ఈ ఘటనను చూసిన ఓ హోం గార్డు తీరిగ్గా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వీడియో తీసినవాళ్లు దాన్ని సోషల్ మీడియాలో కూడా షేర్ చేయడంతో.. ఆ వీడియోను చూసిన పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. రోడ్డుమీద సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేకపోయినా... సామాజిక వెబ్సైట్లలో ఆమెకు పెద్ద ఎత్తున సానుభూతితో పాటు అభినందలు తెలపటం విశేషం. సరిగ్గా ప్రకాష్రాజ్కు కూడా ఇలాంటి అనుభవమే ఇంతకుముందు ఎదురైంది. దాని గురించి ఆయన ట్విట్టర్లో కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రమాదం జరిగిన సమయంలో ప్రమాదం కన్నా ఘటనా స్థలంలో జరిగిన సంఘటనలు మరింత బాధించాయి. ప్రమాదాన్ని పట్టించుకోకుండా కొందరు యువకులు తమ సెల్ఫోన్లతో ఫొటోలు తీసుకోవడంలో బిజీగా కనిపించారు. ఆ పరిస్థితి చూసి సిగ్గుతో తలవంచుకున్నాను. నా ప్రాణం మీద భయం కన్నా మానవత్వం లేకుండా ప్రవర్తించే అలాంటి మనుషులను చూసి భయమేసింది’ అంటూ ట్వీట్ చేశారు. -
అక్కడలా.. ఇక్కడిలా..
-
వేధింపులకు గురి చేస్తావారా..?
-
మైక్రోసాఫ్ట్ తొలి డ్యుయల్ సిమ్ లూమియా
న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ కంపెనీ తొలి డ్యుయల్ సిమ్ హ్యాండ్సెట్ లూమియా 630 స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్పై పనిచేసే ఈ ఫోన్ ధర రూ.11,500. నోకియా హ్యాండ్సెట్స్ వ్యాపారాన్ని కొనుగోలు చేసిన మైక్రోసాఫ్ట్ ఈ ఫోన్ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ నెల 16 నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి. వన్ డ్రైవ్ ఫీచర్ ఈ మోడల్లో సింగిల్ సిమ్ వేరియంట్ ధర రూ.10,500 అని నోకియా ఇండియా ఎండీ, పి. బాలాజీ పేర్కొన్నారు. రెండు రకాల ఫోన్లలలో ఫీచర్లు, స్పెసిఫికేషన్లు అన్నీ ఒకే విధంగా ఉన్నాయి. 4.5 అంగుళాల క్లియర్ బ్లాక్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, వన్ డ్రైవ్(డాక్యుమెంట్లు, ఫొటోలు, మ్యూజిక్లను ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేసుకునే క్లౌడ్ స్టోరేజ్ సౌకర్యం), రియర్ షెల్స్ను మార్చుకునే సౌకర్యం, 1.2 గిగాహెట్జ్ క్వాడ్ కోర్ స్నాప్డ్రాగన్ 400 ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్, 8 జీబీ స్టోరజ్, 5 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, స్వైప్ సౌకర్యమున్న కొత్త కీబోర్డ్ వంటి ఫీచర్లున్నాయి. పెడో మీటర్స్ వంటి ఆరోగ్య సంబంధిత యాప్స్ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా లేదు. 3జీ డ్యుయల్ సిమ్ సపోర్ట్ ఉన్న ఈ ఫోన్ బరువు 134 గ్రాములు. -
గదిలో వేసి 2వ తరగతి విద్యార్థిని చితకబాదిన టీచర్
-
విద్యార్ధులను చితకబాదిన టీచర్,HMలు
-
సమైక్యవాదిపై చేయిచేసుకున్న చంద్రబాబు