Bidar
-
Afzalgunj Incident: చెన్నైకి చెక్కేశారు!
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలోని బీదర్తో పాటు నగరంలోని అఫ్జల్గంజ్లో కాల్పులు జరిపిన బీహార్ నేరగాళ్లు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తు అధికారులకు ఎలాంటి ఆధారాలు దొరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీళ్లు రోషన్ ట్రావెల్స్ వద్ద కాల్పుల తర్వాత తిరుమలగిరి నుంచి ఉత్తరాదికి పారిపోయి ఉంటారని అధికారులు భావించారు. అయితే పోలీసుల్ని తప్పుదోవపట్టిస్తూ చెన్నైకి పారిపోయినట్లు తాజాగా వెలుగులోకి వచ్చిందని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ బుధవారం పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని పట్టుకుంటామని, ప్రత్యేక బృందాలు ఆ కోణంలోనే ముందుకు వెళ్తున్నాయని స్పష్టం చేశారు. బీహార్లోని హాజీపూర్ జిల్లాకు చెందిన ఇరువురు దుండగులు అక్కడ నుంచే ద్విచక్ర వాహనం తీసుకుని నగరానికి చేరుకున్నారు. ఇక్కడే ఓ లాడ్జిలో బస చేసి బీదర్లో రెక్కీ నిర్వహించి మరీ పంజా విసిరింది. ఆపై నగదుతో సహా నగరానికి చేరుకున్న ఇరువురూ బైక్ను ఎంజీబీఎస్ పార్కింగ్లో పెట్టారు. ఆటోలో బయలుదేరి అఫ్జల్గంజ్లోని రోషన్ ట్రావెల్స్ వద్దకు వచ్చారు. ప్రైవేట్ బస్సులో రాయ్పూర్కు టిక్కెట్ బుక్ చేసుకున్న తదనంతర పరిణామాలతో మేనేజర్ జహంగీర్ను కాల్చడం, పారిపోవడం జరిగాయి. దర్యాప్తు అధికారులు నిందితుల రాకపోకలు కనిపెట్టడానికి వందల సంఖ్యలో సీసీ కెమెరాలను జల్లెడపడుతున్నారు. అఫ్జల్గంజ్ నుంచి ఆటోలో సికింద్రాబాద్కు వెళ్లిన ద్వయం..అక్కడి నుంచి మరో ఆటోలో గజ్వేల్ వెళ్లే ప్రయత్నం చేసింది. అయితే ఆటోడ్రైవర్ వ్యవహార శైలితో అనుమానించి తిరుమలగిరిలో దిగిపోయారు. అక్కడే నగదును మరో బ్యాగ్లోకి మార్చడంతో పాటు తాము ధరించిన వ్రస్తాలను మార్చుకున్నారు. అక్కడ నుంచి బోయిన్పల్లి వరకు వచ్చిన ఇద్దరు దుండగులూ..మరో ఆటోలో కూకట్పల్లి మీదుగా మియాపూర్ చేరుకున్నారు. అర్ధరాత్రి మియాపూర్లో ఆంధ్రప్రదేశ్ ఆరీ్టసీకి చెందిన తిరుపతి వెళ్లే బస్సు ఎక్కారు. టిక్కెట్ సైతం తిరుపతి వరకు తీసుకున్న ఈ ద్వయం.. కడప బైపాస్ రోడ్డులో దిగిపోయారు. ఆ సమయంలో డ్రైవర్ ఇక్కడ ఎందుకు దిగుతున్నారని ప్రశి్నంచగా..పని ఉందంటూ సమాధానం ఇచ్చారు. కడప నుంచి మరో బస్సులో నెల్లూరు, అక్కడ నుంచి ప్రైవేట్ బస్సులో చెన్నై చేరుకున్నట్లు ఇప్పటి వరకు గుర్తించారు. చెన్నై చేరుకున్న నగర పోలీసు బృందాలు అక్కడ నుంచి ఈ ఇద్దరూ ఎక్కడకు వెళ్లారనే కోణంలో ఆరా తీస్తున్నాయి. ఈ ఇద్దరిలో కీలకమైన ప్రధాన నిందితుడు ఏడాదిన్నర క్రితం ఉత్తరప్రదేశ్లోనూ ఓ భారీ నేరం చేశాడు. అప్పటి నుంచి ఇతడి కోసం గాలిస్తున్న అక్కడి స్పెషల్ టాస్్కఫోర్స్ అధికారులు ఆచూకీ చెప్పిన వారికి రూ.4 లక్షల పారితోíÙకం కూడా ఇస్తామని ప్రకటించారు. ప్రస్తుతం ఈ దుండగుల కోసం తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్ పోలీసులు సమన్వయంతో గాలిస్తున్నారు. -
నింగి నుంచి ఊడిపడ్డ భారీ యంత్రం..ఉలిక్కిపడ్డ గ్రామస్తులు
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం బీదర్(Bidar)లోని జల్సంగి గ్రామ వాసులకు శనివారం(జనవరి 18) ఓ వింత అనుభవం ఎదురైంది. గ్రామంలోని ఓ ఇంటిపై ఆకాశం నుంచి ఒక్కసారిగా పెద్ద బెలూన్(Baloon) పడింది. బెలూన్కు పెద్ద పేలోడ్ యంత్రం కూడా ఉండడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. దీనికి తోడు బెలూన్కు అమర్చి ఉన్న యంత్రానికి రెడ్ లైట్ వెలుగుతూ ఉండడంతో గ్రామస్తులకు భయం ఎక్కువైంది. వెంటనే బెలూన్తో పాటు భారీ యంత్రమొకటి ఆకాశంలో నుంచి ఊడిపడినట్లు జల్సంగి గ్రామస్తులు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే హొమ్నాబాద్ తాలూకా పోలీసులు స్పాట్కు చేరుకుని బెలూన్ను దానికి ఉన్న యంత్రాన్ని పరిశీలించారు. దానిపై ఉన్న ఒక లేఖ ఆధారంగా ఆ బెలూన్ యంత్రం టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్(Tifr)కు చెందినదని పోలీసులు తేల్చారు. విషయం క్లారిటీ రావడంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు. హైదరాబాద్లోని తమ కేంద్రం నుంచి టీఐఎఫ్ఆర్ ఆకాశంలోకి బెలూన్ యంత్రాలను వదిలి వాతావరణంపై పరిశోధనలు చేస్తుంటుంది. హొమ్నాబాద్ పోలీసులు బెలూన్ గురించి సమాచారమివ్వడంతో టీఐఎఫ్ఆర్ బృందం అక్కడికి బయలుదేరి వెళ్లింది. బెలూన్ యంత్రం నింగిలో నుంచి ఊడిపడిన విషయాన్ని సోషల్మీడియాలో పలువురు నెటిజన్లు షేర్ చేస్తున్నారు. A satellite payload #baloon of #TIFR , #Hyderabad fell on a house from sky in Bidar with a huge machine.A huge size balloon (looks like an airbag) fell from the sky, created panic among the villagers Jalsangi village in #Homnabad Taluk, #Bidar district, #Karnataka , early… pic.twitter.com/Dri4CikSdE— Surya Reddy (@jsuryareddy) January 18, 2025 -
బిహార్ గ్యాంగ్ పనేనా?
సాక్షి, హైదరాబాద్ : బీదర్లో డబ్బు దోచుకోవడానికి.. పట్టుబడతామనే భయంతో అఫ్జల్గంజ్లో కాల్పులు జరిపిన దుండగులు బిహార్కు చెందిన వారై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిలో ఒకరిని బిహార్కు చెందిన పాతనేరగాడు మనీశ్కుష్వాడగా గుర్తించినట్టు తెలిసింది. గురువారం చోటు చేసుకున్న ఈ ఉదంతాల్లో నిందితులను పట్టుకోవడానికి పోలీసులు పది ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపగా, శుక్రవారం తెలంగాణతోపాటు ఛత్తీస్గఢ్, బిహార్ల్లో గాలిస్తున్నా యి. మరోపక్క కర్ణాటక పోలీసులు నగరానికి చేరుకొని కేసు దర్యాప్తులో పాలుపంచుకున్నారు. ఆటోలో ఎంజీబీఎస్ వైపు నుంచి ..: బీదర్లో దుండగులిద్దరూ ‘ఏపీ’రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న బైక్పై రూ.93 లక్షలున్న అల్యూమినియం డబ్బా ఎత్తుకొని ఉడాయించారు. అక్కడ నుంచి హైదరాబాద్ వైపు వచ్చి మార్గమధ్యలో ఆ డబ్బును బ్యాగ్లోకి మార్చుకున్నారు. తెలంగాణ సరిహద్దు గ్రామమైన సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ గ్రామంలోని ßæనుమాన్ టెంపుల్ వద్ద గల సీసీ ఫుటేజీల్లో దుండగులు కనిపించారు. సుల్తాన్పూర్, డప్పూర్, హత్నూర్, న్యాల్కల్ మీదుగా హైదరాబాద్ వెళ్లారు. అయితే ఆ డబ్బా, బైక్ ఎక్కడ వదిలేశారన్నది ఇంకా తేలలేదు. ఒకరు ఈ పెద్ద బ్యాగ్ పట్టుకొని, మరొకరు బ్యాక్ ప్యాక్ తగిలించుకొని గురువారం సాయంత్రానికి రోషన్ ట్రావెల్స్ వద్దకు వచ్చారు. ఈ ద్వయం ఎంజీబీఎస్ వైపు నుంచి ఆటోలో వచ్చి ట్రావెల్స్ వద్ద దిగినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ ఫోన్ నంబర్ ఇచ్చి... రాయ్పూర్ వెళ్లడానికి అమిత్కుమార్ పేరుతో రెండు టికెట్లు బుక్ చేసుకున్నారు. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ సెల్నంబర్ ఇచ్చారు. బస్సు, సీట్ల నంబర్లు ఎస్ఎంఎస్ రూపంలో వస్తాయని, సరిచూసుకోవాలని ట్రావెల్స్ నిర్వాహకులు చెప్పారు. దీంతో ఓ దుండగుడు తన ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యిందని, ఇక్కడే ఉండి మీతోనే వచ్చి బస్సు ఎక్కుతామని వారికి చెప్పాడు. ఆ బస్సు ప్రయాణించే మార్గం, మార్గమ«ధ్యలో దాని స్టాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనే వివరాలు ట్రావెల్స్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. మదీనాలో రెండు బ్యాగ్స్ ఖరీదు.... రూ.93 లక్షలతో కూడిన బ్యాగ్ను చేత్తో పట్టుకొని మోయడం కష్టంగా ఉండటంతో ట్రాలీ బ్యాగ్ ఖరీదు చేయాలని భావించారు. అవి ఎక్కడ దొరుకుతాయంటూ ట్రావెల్స్ నిర్వాహకులను అడిగారు. మదీనా ప్రాంతంలో దుకాణాలు ఉన్నాయని చెప్పగా, అక్కడకు వెళ్లి రెండు ట్రాలీ బ్యాగ్స్ ఖరీదు చేశారు. మూసీనది సమీపంలో లేదా పబ్లిక్ టాయిలెట్లోకి వెళ్లి పెద్ద బ్యాగ్లో ఉన్న నగదును ఓ ట్రాలీలోకి మార్చారు. మరో దాంట్లో కొన్ని వ్రస్తాలతోపాటు హెల్మెట్ పెట్టారు. బ్యాక్ ప్యాక్లో మాత్రం తుపాకీ దాచి ఉంచారు. కాల్పులు జరిపింది మినీ బస్సులోనే... రోషన్ ట్రావెల్స్ కార్యాలయం అఫ్జల్గంజ్ బస్టాప్లోనే ఉంటుంది. అక్కడ మినీ బస్సుల్ని ఆపడానికి అవకాశం ఉండదు. దీంతో తమ ప్రయాణికుల్ని ట్రావెల్స్ బస్సుల వరకు చేర్చే మినీ బస్సుల్ని సమీపంలో ఉన్న మెట్రో ట్రావెల్స్ వద్ద ఆపుతారు. గురువారం సైతం ఇలానే ఆగడంతో..రోషన్ ట్రావెల్స్ నుంచి మిగిలిన ప్రయాణికులు, బీదర్ పోలీసులతో కలిసి ఇద్దరు దుండగులూ ఆ బస్సు ఎక్కారు. బస్సులో ప్రయాణికుల లగేజీ తనిఖీ చేస్తున్న ట్రావెల్స్ ఉద్యోగి జహంగీర్ దుండగుల ఓ ట్రాలీని తెరిచి చూసి హెల్మెట్, వస్త్రాలు గుర్తించారు. రెండోది తెరవడానికి ప్రయత్నిస్తుండగా, అందులో నగదు ఉండటంతో ఓ దుండగుడు తన బ్యాక్ ప్యాక్ నుంచి తుపాకీ బయటకు తీసి ఒక రౌండ్ కాల్చాడు. ఈ శబ్దం విన్న బస్సు డ్రైవర్ తొలుత టైరు పగిలిందని భావించి కిందకు దిగాడు. అదే అదనుగా ఇద్దరు దుండగులూ తమ ట్రాలీలతో సహా కిందకు దిగి ట్రాఫిక్కు రాంగ్ సైడ్లో నడుచుకుంటూ వెళ్లారు. పోలీస్స్టేషన్ ఎదురుగా ఆటో ఎక్కి... అదే మినీ బస్సులో ఉన్న ఇద్దరు బీదర్ పోలీసు కానిస్టేబుళ్లు వీరిని పట్టుకునే ప్రయత్నం చేసినా ఫలించలేదు. అఫ్జల్గంజ్ పోలీస్స్టేషన్ సమీపం వరకు నడుచుకుంటూ వెళ్లిన దుండగులు ఓ ఆటో ఎక్కి ఎంజే మార్కెట్ మీదుగా ఉడాయించారు. ఠాణా సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను బట్టి రాత్రి 7.09 గంటలకు దుండగులు ఆటో ఎక్కారు. దీని ప్రకారం కాల్పులు 7 గంటల ప్రాంతంలో జరిగినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. క్షతగాత్రుడు మినీ బస్సు దగ్గర నుంచి రోషన్ ట్రావెల్స్ వరకు వచ్చి, వారికి విషయం చెప్పి, పోలీసులకు సమాచారం ఇచ్చేసరికి సమయం దాదాపు రాత్రి 7.30 గంటలైంది. సికింద్రాబాద్ మీదుగా పరారీ... దుండగులు ప్రయాణించిన ఆటో ఎంజే మార్కెట్, అబిడ్స్, ట్యాంక్బండ్ మీదుగా సికింద్రాబాద్ వరకు వెళ్లినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఆటో నంబర్, దాని ద్వారా డ్రైవర్ను గుర్తించిన అధికారులు శుక్రవారం సాయంత్రం ప్రశ్నించారు. తాను ఇద్దరినీ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న ఆల్ఫా హోటల్ వరకు తీసుకెళ్లానని చెప్పాడు. దీంతో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రైలులో ఛత్తీస్గఢ్ లేదా బిహార్కు పారిపోయి ఉంటారని భావిస్తున్నారు. -
బీదర్ గ్యాంగ్ కోసం పోలీసుల వేట.. హైదరాబాద్ హై అలర్ట్
-
అఫ్జల్గంజ్ టూ ట్యాంక్బండ్ అలర్ట్.. బీదర్ ముఠా ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: నగరంలోని అఫ్జల్గంజ్ కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ట్రావెల్స్ ఆఫీసు మేనేజర్పై దుండగులు కాల్పులు జరిపారు. ఇక, ఈ కాల్పులకు పాల్పడిన ముఠాను బీదర్ ఏటీఎం దొంగల ముఠాగా పోలీసులు తేల్చారు. దీంతో, నిందితుల కోసం పోలీసుల దర్యప్తు కొనసాగుతోంది.అఫ్జల్గంజ్ కాల్పుల కలకలం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుల కోసం ఎనిమిది ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. నిందితులు ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్కు చెందినట్లు గుర్తించారు. అడ్డ దారుల్లో రాయ్పూర్ పారిపోయినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. నిందితులు అఫ్జల్ గంజ్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఆటోలో వెళ్లినట్లు సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు. అయితే, అక్కడి నుంచి ఎటువైపు వెళ్లారనేది మాత్రం తెలియరాలేదు. దీంతో, గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.ఏం జరిగిందంటే..?కర్ణాటకలోని బీదర్లో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. బీదర్లో గురువారం ఉదయం ఏటీఎంకు డబ్బులు తరలిస్తున్న వాహనంపై దోపిడీ దొంగలు దాడి చేశారు. బైక్పై వచ్చిన దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు మృతి చెందారు. దాడి అనంతరం డబ్బు పెట్టెతో దుండగులు అక్కడి నుంచి ఉడాయించారు. అందులో సుమారు రూ.93 లక్షల నగదు ఉన్నట్లు సమాచారం. మరోవైపు దాడి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిని అక్కడికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు.ఇక దొంగలు తెలంగాణ వైపు తమ బైక్ను మళ్లించినట్లు బీదర్ పోలీసులు నిర్ధారించుకున్నారు. దీంతో పోలీసులు బీదర్ నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ క్రమంలో అఫ్జల్గంజ్ వద్ద దొంగలకు బీదర్ పోలీసులు కనిపించారు. దొంగల ముఠా.. తప్పించుకునేందుకు అఫ్జల్గంజ్లో ఉన్న ఓ ట్రావెల్స్ కార్యాలయంలోకి ప్రవేశించారు. పోలీసులపై కాల్పులు జరుపుతుండగా.. అక్కడే ఉన్న ట్రావెల్స్ కార్యాలయం మేనేజర్కు బుల్లెట్లు తగిలాయి. దీంతో అతనికి తీవ్ర రక్తస్రావం జరిగింది. అప్రమత్తమైన హైదరాబాద్ పోలీసులు కూడా బీదర్ పోలీసులతో పాటు దొంగల ముఠాను పట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
కాల్పుల కలకలం.. అప్జల్గంజ్లో బీదర్ ఏటీఎం దొంగలు
సాక్షి, హైదరాబాద్: అప్జల్ గంజ్(Afzal Gunj)లో కాల్పుల కలకలం రేగింది. ట్రావెల్స్ కార్యాలయంలో ఉన్న వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపారు. బీదర్ ఎటీఎం దొంగల(Bidar ATM thieves) ముఠాగా పోలీసులు తేల్చారు. బీదర్ పోలీసులను చూసి దుండగులు కాల్పులు జరిపారు. పోలీసులపై 3 రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు. దుండుగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. బీదర్లో రూ.93 లక్షల నగదును ఎత్తుకెళ్లిన దొంగలు.. అక్కడ నుంచి తప్పించుకుని.. హైదరాబాద్కు చేరుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకుని ట్రావెల్స్ ఆఫీస్లోకి వెళ్లిన దుండగులు.. ఓ వ్యక్తిపై కాల్పులు జరిపారు.కర్ణాటకలోని బీదర్లో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. శివాజీ చౌక్లోని ఓ ఏటీఎం కేంద్రంలో డబ్బు పెట్టేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులకు పాల్పడ్డారు. బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.దుండగులు ఏటీఎం సొమ్ముతో బైక్పై అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. దుండుగులు.. అక్కడ నుంచి తప్పించుకుని.. హైదరాబాద్కు వచ్చారు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ట్రావెల్స్ ఆఫీస్లోకి వెళ్లిన దుండగులు.. ఓ వ్యక్తిపై కాల్పులు జరిపారు.ఇదీ చదవండి: కేరళ సమాధి కేసులో అదిరిపోయే ట్విస్ట్! -
కర్ణాటకలో దొంగల బీభత్సం
-
షిర్డీ టూ కాకినాడ రైలులో భారీ చోరీ.. ప్రయాణీకుల ఆందోళన
సాక్షి, బీదర్: షిర్డీ టూ కాకినాడ పోర్టు ఎక్స్ప్రెస్ రైలులో దొంగలు రెచ్చిపోయారు. రైలులో ప్రయాణీకులు నిద్రిస్తున్న సమయాన్ని ఆసరాగా చేసుకుని మూడు బోగీల్లో బంగారం, నగదు, లగేజీని దొంగలించారు. దీంతో, బీదర్ వద్ద రైలును నిలిపివేసి ప్రయాణీకులు ఆందోళనకు దిగారు.వివరాల ప్రకారం.. సాయినగర్ షిర్డీ టూ కాకినాడ పోర్టు ఎక్స్ప్రెస్ రైలులో భారీ దోపిడీ జరిగింది. మహారాష్ట్రలోని వర్లీ సమీపంలో రైలులో ఎక్కిన దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. ప్రయాణీకులు నిద్రిస్తున్న సమయంలో వారి వద్ద నుంచి బంగారం, నగదు, లగేజీని దొంగలించారు. ఈ క్రమంలో దోపిడీని గుర్తించిన ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.అయితే, దోపిడీ అనంతరం దొంగలు బీదర్కు ముందున్న పర్లీ స్టేష్లన్లో దిగిపోయినట్టు ప్రయాణికులు గుర్తించారు. దీంతో, తమకు న్యాయం జరగాలని ప్రయాణికులు ఆందోళనలు చేస్తున్నారు. బీదర్లో రైలును నిలిపివేసి ఆందోళనకు దిగారు. -
ఒంటిపై 20 లక్షల బంగారం, 5 లక్షల క్యాష్.. 30 సార్లు కత్తితో పొడిచి..
-
బీదర్లో అంధుడి నామినేషన్
బీదర్: లోక్సభ ఎన్నికలకు కర్ణాటకలో నామినేషన్ల పర్వం శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా శక్తివంతమైన ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఒక భావోద్వేగ ఉదాహరణ బీదర్లో ఆవిష్కృతమైంది. బీదర్ లోక్సభ స్థానానికి ఒక అంధుడు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. బీదర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ప్రాతినిధ్యం వహించాలనే ఆశయంతో అసమానతలు, అడ్డంకులను ధిక్కరిస్తూ ముందుకు వచ్చారు. బీదర్ తాలూకాలోని కడ్వాడ్ గ్రామానికి చెందిన దిలీప్ నాగప్ప భూసా తన మద్దతుదారులతో డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. బ్రెయిలీ లిపిలో ఉన్న ప్రమాణాన్ని దిలీప్ చదివి వినిపించి జిల్లా ఎన్నికల అధికారికి నామినేషన్ సమర్పించారు. మూడవ దశలో అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, గోవా, గుజరాత్, జమ్మూ కశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా లోక్సభ సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ముగుస్తాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. -
వెంకటేశ్ 'సైంధవ్' కొత్త షెడ్యూల్.. అక్కడ షూటింగ్
వెంకటేశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్’. ఈ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా హీరోయిన్స్గా నటిస్తున్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ కర్ణాటకలోని బీదర్లో ప్రారంభమైంది. వెంకటేశ్ పాల్గొంటున్న ఈ షెడ్యూల్లో ఓ యాక్షన్ సీక్వెన్స్ ను ప్లాన్ చేశారట శైలేష్ కొలను. తాజాగా మొదలైన బీదర్ షెడ్యూల్ ఈ నెలాఖరు వరకూ సాగుతుందట. సెప్టెంబరులో ప్లాన్ చేసిన ఓ విదేశీ షెడ్యూల్తో ‘సైంధవ్’ చిత్రీకరణ దాదాపు పూర్తవుతుందని, వినాయక చవితి పండగ సందర్భంగా టీజర్ను విడుదల చేసే ఆలోచనలో చిత్రయూనిట్ ఉన్నారని ఫిల్మ్నగర్ సమాచారం. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ‘సైంధవ్’ చిత్రం డిసెంబరు 22న విడుదల కానుంది. ఈ సినిమాకు సహ నిర్మాత: కిషోర్ తాళ్లూరు, సంగీతం: సంతోష్ నారాయణ్. -
‘ప్రధానిని తిట్టడం దేశద్రోహమేం కాదు!’
బెంగళూరు: దేశ ప్రధానిని తిట్టడం దేశద్రోహమేం కాదని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానించింది. అలాగని రాజ్యాంగబద్ధమైన పదవిని కించపరిచేలా మాట్లాడడమూ మంచిది కాదని తెలిపింది. ఈ మేరకు ఓ స్కూల్ యాజమాన్యంపై దాఖలైన కేసును కొట్టేస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బీదర్లోని షాహీన్ స్కూల్ మేనేజ్మెంట్పై ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారనే అభియోగాల మీద దేశద్రోహం కేసు నమోదు అయ్యింది. చెప్పుతో కొడతామంటూ ఓ నాటకంలో పిల్లలతో చెప్పించారని న్యూటౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. తద్వారా మత సమూహాల మధ్య గొడవలు కలిగించేందుకు యత్నించారనే ఆరోపణలపై.. ఐపీసీ సెక్షన్ 153(ఏ) ప్రకారం దేశద్రోహం కేసు నమోదు చేశారు. అయితే ఇది దేశ ద్రోహం కిందకు రాదని కర్ణాటక హైకోర్టు కల్బుర్గి బెంచ్ స్పష్టం చేసింది. ‘‘ప్రధానిని చెప్పుతో కొడతానని అనడం ఆ హోదాని అవమానించడం మాత్రమే కాదు.. బాధ్యతారాహిత్యం కూడా. ఒక పద్దతి ప్రకారం చేసే విమర్శలకు సహేతుకత ఉంటుంది. అంతేగానీ.. ఇలా ఇష్టానుసారం మాట్లాడడం సరికాదు. అలాగని ప్రధానిని కించపర్చడం దేశద్రోహం కిందకు రాదు అని జస్టిస్ హేమంత్ చందన్గౌడర్ తీర్పు సందర్భంగా స్పష్టం చేశారు.. అయితే ఈ కేసు ఇప్పటిది కాదు.. 2020 నాటిది. ఆ సమయంల సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ (CAA), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్షిప్(NRC)లకు వ్యతిరేకంగా స్కూల్లో 4,5,6వ తరగతి విద్యార్థులతో ఓ నాటకం ప్రదర్శించారు. ఆ నాటకంలోనే ప్రధాని మోదీని తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ డైలాగులు రాసి పిల్లలతో ప్రదర్శించారు. దీనిపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ABVP) నేత నీలేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో.. కాలేజీ మేనేజ్మెంట్లోని నలుగురిపై భారత శిక్షాస్మృతి(IPC) సెక్షన్ 504, 505(2), 124A(దేశద్రోహం), 153ఏ రీడ్ విత్ సెక్షన్ 34ల ఆధారగా కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రధాని వంటి రాజ్యాంగాధికారులను అవమానించవద్దని తీర్పు సమయంలో అభిప్రాయపడ్డ కోర్టు.. పిల్లలచేత రాజకీయ విమర్శలు చేయించడం సరికాదని, బదులుగా వాళ్ల అకడమిక్ ఇయర్కు సంబంధించిన అంశాలపై నాటకాలు వేయించడం మంచిదని స్కూల్ యాజమాన్యాన్ని సూచిస్తూ దేశద్రోహం కేసును కొట్టేసింది. ఇదీ చదవండి: రాజకీయాల్లో రాహుల్తో పోలికా? సరిపోయింది -
సమీపిస్తున్న ఎన్నికల తేదీ.. ‘హైదరాబాద్ కర్ణాటక’లో దిగ్గజ నేతల ఢీ
బీదర్ నుంచి కల్వల మల్లికార్జున్ రెడ్డి: ఉత్తర కర్ణాటకలో అంతర్భాగమైన ‘హైదరాబాద్ కర్ణాటక’లోని బీదర్ జిల్లాలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. ఈ నెల 10న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ప్రధాన రాజకీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, జేడీ (ఎస్) నుంచి దిగ్గజ నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వరుస విజయాలు సాధిస్తూ వస్తున్న జేడీ (ఎస్) అభ్యర్థి బందెప్ప కాశెంపూర్ (బీదర్ దక్షిణ), కాంగ్రెస్ అభ్యర్థులు రహీమ్ ఖాన్ (బీదర్ ఉత్తర), ఈశ్వర్ ఖండ్రే (బాలీ్క), రాజశేఖర పాటిల్ (హుమ్నాబాద్), బీజేపీ అభ్యర్థి ప్రభు చౌహాన్ (ఔరాద్– ఎస్సీ) నుంచి తమ రాజకీయ అనుభవానికి పదును పెడుతున్నారు. మరోవైపు సూర్యకాంత నాగమరపల్లి (జేడీఎస్– బీదర్ ఉత్తర), విజయ్ సింగ్ (కాంగ్రెస్– బసవకళ్యాణ్), సిద్ధూ పాటిల్ (బీజేపీ– హుమ్నాబాద్), సీఎం ఫైజ్ (జేడీ ఎస్– హుమ్నాబాద్), భీంసేన్రావు సింధే (కాంగ్రెస్– ఔరాద్) వంటి కొత్తతరం నేతలు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ధీటైన సవాలు విసురుతున్నారు. బీఎస్పీ, ఆమ్ ఆద్మీ, కళ్యాణరాజ్య ప్రగతిపక్ష, కర్ణాటక రాష్ట్ర సమితి వంటి పార్టీలు అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నా ఓటర్లపై పెద్దగా ప్రభావం చూపించక పోవచ్చని ‘సాక్షి’క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. బీదర్ ఉత్తర కాంగ్రెస్కు పట్టు ఉన్న బీదర్ ఉత్తర నియోజకవర్గంలో ప్రస్తుతం కాంగ్రెస్, జేడీ (ఎస్) మధ్య ప్రధాన పోటీ నెలకొంది. 2009, 2016 ఉప ఎన్నికలతో పాటు 2018 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన రహీమ్ఖాన్ ప్రస్తుత ఎన్నికలోనూ బీదర్ (ఉత్తర) నియోజకవర్గం నుంచి వరుసగా ఐదోసారి బరిలో నిలిచారు. అయితే రెండు పర్యాయాలు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సూర్యకాంత నాగమరపల్లికి ఈసారి టికెట్ నిరాకరించడంతో చివరి నిమిషంలో జేడీ(ఎస్) నుంచి బరిలోకి దిగారు. ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చి న ఈశ్వర్ సింగ్ ఠాకూర్కు బీజేపీ అభ్యర్థిగా టికెట్ దక్కింది. కాంగ్రెస్కు చెందిన శేషి పాటిల్ చావ్లీ తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీదర్ దక్షిణ 2008, 2018 ఎన్నికల్లో జేడీ (ఎస్) నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ మంత్రి బందెప్ప కాశెంపూర్ మరోమారు అదే పార్టీ నుంచి బరిలోకి దిగారు. బీజేపీ అభ్యర్థిగా వరుసగా రెండుసార్లు పోటీ చేసి ఓడిన డాక్టర్ శైలేంద్ర బెల్దాలే, కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే అశోక్ ఖేనీ పోటీలో ఉన్నారు. బాల్కీ కాంగ్రెస్ కంచుకోటగా పేరొందిన బాల్కీలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ నడుమ సాగుతోంది. బాల్కీ నుంచి వరుసగా నాలుగోసారి విజయం కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈశ్వర్ ఖండ్రే పోటీ చేస్తున్నారు. ఈశ్వర్ ఖండ్రే తండ్రి భీమన్న ఖండ్రే 1962, 1967, 1978, 1983లో, సోదరుడు విజయ్ ఖండ్రే 1989, 1994లో గెలుపొందారు. ఇక ఈశ్వర్ ఖండ్రే 2008, 2013, 2018లో వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించారు. గతంలో ఐదుసార్లు ఓటమి పాలైన ప్రకాశ్ ఖండ్రే బీజేపీ నుంచి, రవూఫ్ పటేల్ జేడీ(ఎస్) నుంచి పోటీ చేస్తున్నారు. బసవకల్యాణ్ బీజేపీ సిట్టింగ్ స్థానమైన బసవకళ్యాణ్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా మాజీ సీఎం ధరమ్సింగ్ కుమారుడు, స్థానికేతరుడైన విజయ్ సింగ్ను బరిలోకి దించింది. 2018లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన బి.నారాయణరావు కరోనాతో మరణించడంతో 2021లో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేసిన శరణు సలగర గెలుపొందారు. ప్రస్తుతం శరణు సలగర మరోమారు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. రిటైర్డ్ ఆర్టీవో సంజయ్ వడేకర్ జేడీ (ఎస్) నుంచి పోటీ చేస్తున్నారు. ఔరాద్ (ఎస్సీ రిజర్వుడు) బీజేపీ కంచుకోట ఔరాద్లో వరుసగా నాలుగో విజయం కోసం పశు సంవర్ధక శాఖ మంత్రి ప్రభు చౌహన్ శ్రమిస్తున్నారు. కాంగ్రెస్, జేడీ (ఎస్) పార్టీలు కొత్త ముఖాలను బరిలోకి దింపాయి. విద్యావంతుడైన డాక్టర్ భీంసేన్రావ్ సింధే కాంగ్రెస్ నుంచి, జే సింగ్ రాథోడ్ జేడీ (ఎస్) నుంచి బరిలో ఉన్నారు. హుమ్నాబాద్ కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న హుమ్నాబాద్లో కాంగ్రెస్, బీజేపీ, జేడీ (ఎస్) నడుమ త్రిముఖ పోటీ నెలకొంది. 2013 ఉప ఎన్నికతో పాటు 2008, 2013, 2018లో వరుస విజయాలు సాధించిన మాజీ మంత్రి రాజశేఖర పాటిల్ మరోమారు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి వరుస ఓటములు పొందుతూ వచ్చి న సుభాష్ కల్లూర్ స్థానంలో తొలిసారిగా సిద్ధూపాటిల్ పోటీ చేస్తున్నారు. జేడీ (ఎస్) కర్ణాటక శాఖ అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి సీఎం ఇబ్రహీం కుమారుడు సీఎం ఫైజ్ జేడీ (ఎస్) అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఫలితాలను శాసించేది డబ్బే పార్టీల కంటే వ్యక్తుల మీద ఆధారపడే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. గతంతో పోలిస్తే ఈ ఎన్నికల్లో ధన ప్రభావం బాగా పెరిగినట్లు కనిపిస్తోంది. రైతులు, పేదలకు మేలు చేసే ఉచిత పథకాలు పెద్దగా లేవు. స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. వ్యవసాయం లాభసాటిగా లేకపోవడంతో రైతులు అసంతృప్తితో ఉన్నారు. – శ్రీనివాస్ భురే, ఆనంద్వాడీ, బాల్కీ -
గోదాములు ఫుల్.. ఇక్కడ స్థలం లేక.. బీదర్కు మన బియ్యం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రంలో ఉన్న ఎఫ్సీఐ గోదాముల్లో స్థలసమస్య తలెత్తింది. దీని ప్రభావం ఈ యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లపై పడుతోంది. సంగారెడ్డితోపాటు మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన సీఎంఆర్ బియ్యాన్ని మిల్లర్లు ఇప్పటివరకు హైదరాబాద్లోని సనత్నగర్ ఎఫ్సీఐ గోదాములకు డెలివరీ చేసేవారు. అయితే ఈ గోదాముల్లో ఇప్పుడు స్థలం లేకపోవడంతో నిల్వలన్నీ పేరుకుపోయాయి. దీంతో కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఉన్న ఎఫ్సీఐ గోదాములకు తరలించాలని నిర్ణయించారు. అక్కడ కూడా స్థల సమస్య తలెత్తడంతో రాష్ట్రం నుంచి వెళ్లిన లారీలు అన్లోడ్ కావడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో సంగారెడ్డి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు బీదర్కు వెళ్లి అక్కడి ఎఫ్సీఐ అధికారులతో చర్చలు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క సంగారెడ్డి జిల్లా నుంచే 1.02 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని బీదర్కు తరలించాలని ఎఫ్సీఐ నిర్ణయించింది. ఆ బియ్యం రవాణా అయితేనే... మిల్లుల్లో గత యాసంగి, వానాకాలం సీజన్లలో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన బియ్యం రవాణా అయితేనే స్థలం ఖాళీ అవుతుంది. అప్పుడే ఈ యాసంగి సీజన్లో కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లు దించుకునేందుకు వీలవుతుంది. కానీ ఎఫ్సీఐ గోదాముల్లో స్థలాలు లేక గత యాసంగి, వానాకాలం సీజన్లకు సంబంధించిన బియ్యమే మిల్లుల్లో ఉండిపోయింది. దీంతో ఈ యాసంగి సీజనులో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేయాలని మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు. మిల్లర్ల వద్ద స్థలం లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ కారణంగానే చాలాచోట్ల కొనుగోలు కేంద్రాలు తెరిచినా, ధాన్యం తూకాలు జరగడంలేదు. ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే 77 కొనుగోలు కేంద్రాలు తెరిచారు. కానీ ఇప్పటివరకు 400 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా ఆ కేంద్రాల నుంచి మిల్లులకు రవాణా చేయలేకపోయారు. -
కాంగ్రెస్ నన్ను 91 సార్లు తిట్టింది.. ప్రతి సారి ఆ పార్టీ ఖతమైంది: మోదీ
బెంగళూరు: కాంగ్రెస్ తనను పదే పదే తిడుతోందని ధ్వజమెత్తారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇప్పటికే ఆ పార్టీ నేతలు 91 సార్లు తన గురించి అభ్యంతరకరంగా మాట్లాడారని పేర్కొన్నారు. కానీ తాను అవేం పట్టించుకోనని, ప్రజల కోసం మంచి పనులు చేసుకుంటూ ముందుకు సాగుతానని పేర్కొన్నారు. అలాగే తనను తిట్టిన ప్రతిసారి కాంగ్రెస్ ఘోర పరాభవం చవిచూస్తోందని మోదీ సెటైర్లు వేశారు. కర్ణాటక బీదర్ జిల్లా హుమ్నాబాద్లో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీకి హాజరయ్యారు మోదీ. ప్రధాని మోదీ విష సర్పం, తాకితే ఖతం అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే చేసిన వివర్శలకు ఈ సందర్భంగా కౌంటర్ ఇచ్చారు. తనను తిట్టినప్పుడల్లా ప్రజలు కాంగ్రెస్ను చిత్తుగా ఓడిస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీని మరోసారి గెలిపించాలని, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. కాగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న ఒకే విడతలో జరగనున్నాయి. మే 13న కౌంటింగ్, ఫలితాలు ప్రకటిస్తారు. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్నాయి. మెజార్టీకి 113 సీట్లు అవసరం. చదవండి: రాజకీయాల్లో నటీనటులు -
మరోసారి రాష్ట్రానికి అమిత్ షా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ సిద్ధమవుతున్న తీరును పరిశీలించేందుకు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి రాష్ట్రానికి వస్తున్నారు. ఇప్పటికే గత నెల 10న నేషనల్ పోలీస్ అకాడమీ పాసింగ్ అవుట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలతో ప్రత్యేకంగా భేటీ అయిన షా.. ఈ నెల 11న రాత్రి మళ్లీ రాష్ట్రానికి రానున్నారు. అదేరోజు మరోసారి హైదరాబాద్లో కోర్కమిటీతో ఆయన భేటీకానున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. 12న ఉదయం హకీంపేటలో జరిగే అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ వస్తున్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలో మేధావులతోనూ ప్రత్యేకంగా సమావేశమై రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న వివిధ అంశాలపై ఫీడ్బ్యాక్ తీసుకోనున్నారు. త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు అమిత్ షా దృష్టిసారిస్తున్నారు. 12న రాష్ట్రంలో సమావేశాలు ముగించుకున్నాక కర్ణాటకలోని బీదర్కు పయనమవుతారు. ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ముగిసే దాకా నెలకు రెండు, మూడుసార్లు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో అమిత్ షా పర్యటించనున్నారు. ఈ పర్యటనలకు వచ్చినప్పుడల్లా తెలంగాణపైనా దృష్టిపెట్టి పార్టీని ఎన్నికలకు సిద్ధం చేయనున్నారు. ఈ నెలలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, ముఖ్య నేతలు రాష్ట్రానికి రానున్నట్లు సమాచారం. వచ్చే నెలలో పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే భారీ బహిరంగసభలో ప్రధాని మోదీ పాల్గొంటారని తెలుస్తోంది. ముఖ్యనేతల మధ్య సమన్వయమే ప్రధానం మార్చి, ఏప్రిల్లలో రాష్ట్ర పార్టీ నాయకులు, జాతీయ పార్టీ ముఖ్యనేతలు ముమ్మరంగా ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణ సిద్ధమైంది. అయితే రాష్ట్ర పార్టీ ముఖ్యనేతల మధ్య చోటుచేసుకుంటున్న సమన్వయలోపంపై జాతీయ నాయకత్వం దృష్టిపెట్టింది. మంగళవారం ఢిల్లీలో రాష్ట్ర పార్టీ మినీ కోర్కమిటీ భేటీలోనూ దీనిపైనే అమిత్ షా, నడ్డా ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు సానుకూల పరిస్థితులున్నా, ప్రజల్లో కేసీఆర్ సర్కార్పై వ్యతిరేకత ఉన్నా రాష్ట్ర నేతలు దాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేకపోతు న్నారనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. రాష్ట్ర కోర్కమిటీ నేతలు కనీసం వారం, పది రోజులకోసారి కలుసుకొని పార్టీ కార్యక్రమాలపై చర్చించాలని, సమష్టిగా ముందుకెళ్లాలని ఆదేశించినట్లు సమాచారం. నేతల మధ్య సమన్వయ బాధ్యతలను రాష్ట్ర పార్టీ సంస్థాగత ఇన్చార్జ్ సునీల్ బన్సల్కు అప్పగించినట్లు తెలిసింది. చేరికలు ఆగడంపై జాతీయ నాయకత్వం ఆరా ఇతర పార్టీల నుంచి చేరికల ప్రక్రియను వేగవంతం చేయాలని, ఇది ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడానికి కారణాలేమిటని బీజేపీ జాతీయ నాయకత్వం ఆరాతీసినట్లు తెలిసింది. దీనికి సంబంధించి కూడా ముఖ్యనేతల నుంచి జిల్లాల వారీగా జాబితాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. -
కొండగట్టు చోరీ కేసు: ఛేదనలో పోలీస్ డాగ్ ప్రధాన పాత్ర
సాక్షి, కరీంనగర్: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో చోరీచేసింది కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాకు చెందిన దొంగలని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు పాల్గొన్నారని గుర్తించారు. అందులో ముగ్గురిని అరెస్ట్ చేసి, వారినుంచి 5 కేజీల వెండి అభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మిగతావారి కోసం మూడు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఈ మేరకు జగిత్యాల ఎస్పీ భాస్కర్ కొండగట్టు చోరీ, నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించారు. దొంగల ముఠా కర్ణాటక నుంచి కొండగట్టుకు మోటార్ సైకిళ్లపై ఫిబ్రవరి 2న రాత్రి చేరుకుంది భక్తుల మాదిరిగా తెలుపు, కాషాయ వస్త్రాలు ధరించి అదేరోజు రాత్రి అంజన్నను దర్శించుకుంది. మరుసటిరోజు (ఫిబ్రవరి 23)న మరోసారి స్వామివారిని దర్శించుకుంది. ఈ సమయంలోనే పరిసరాలపై రెక్కీ నిర్వహించింది. అదేరోజు అర్ధ రాత్రి(శుక్రవారం వేకువజామున) దాటాక ఆలయం వెనకాల అటవీ ప్రాంతం నుంచి ఆలయంలోకి ప్రవేశించింది. స్వామివారిపై ఉన్న మకర తోరణం, కిరీటం, ఆలయంలోని రెండు శఠగోపాలు, ఒకవెండి గొడుగు, రామరక్ష. ద్వారాలకు ఉన్న కవచ ముఖాలు దొంగిలించింది. ఆ తర్వాత మళ్లీ మోటార్ సైకిళ్లపైనే కర్ణాటకకు బయలుదేరి వెళ్లింది. దాదాపు రూ.3 లక్షల విలువైన 15 కేజీల వెండి అభరణాలు చోరీకి గురైనట్టు పూజారులు మల్యాల పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీరియస్గా తీసుకున్న పోలీసులు ఇటీవల కొండగట్టు ఆలయానికి సీఎం కేసీఆర్ వచ్చి వెళ్ళిన తరవాత దొంగతనం జరగడంతో పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకున్నారు. జగిత్యాల ఎస్పీ భాస్కర్.. డీఎస్పీ ప్రకాశ్ ఆధ్వర్యంలో 10 పోలీసు బృందాలను నియమించారు.దొంగలను పట్టుకునేందుకు గాలింపులు తీవ్రతరం చేశారు. అంతకుముందే ఫింగర్ ప్రింట్, డాగ్ స్క్వాడ్ ఆధునిక శాస్త్ర, సాంకేతిక సాయంతో 24 గంటల్లోనే దొంగలపై అవగాహనకు వచ్చారు. కర్ణాటకకు చెందిన దొంగల ముఠా పనేనంటూ, వారిని పట్టుకునేందుకు ఆ రాష్ట్రంలో గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఏడుగురు నిందితుల్లో ఎ-1 బాలాజీ కేశవ రాథోడ్, ఎ-5 నర్సింగ్ జాదవ్ ఏ-7 విజయ్ కుమార్ రాథోడ్ ను అదుపులోకి తీసుకున్నారు.. వారినుంచి 3.50 లక్షల విలువైన 5 కిలోల వెండి ఆభరణాలు (వెండి శఠగోపం, ఒకవెండి గొడుగు. ఒకవెండి పెద్ద రామరక్ష, రెండు ద్వారాలకు గల కవచం ముఖాలు, మోటార్ సైకిల్, రెండు సెల్ ఫోన్ల)ను స్వాధీనం చేసుకున్నారు. ఎ-2 రామరావు జాదవ్, ఎ-3 రాంశెట్టి జాదవ్, ఎ-4 విక్రమ్ జాదవ్, ఎ-6 దేవిదాస్ జాదవ్ ఆచూకీ కోసం మూడు. పోలీసు బృందాలు కర్ణాటక రాష్ట్రంలో గాలింపు చేస్తున్నాయి.. పోలీస్ డాగ్ది ప్రధాన పాత్ర కొండగట్టు దొంగల పట్టుకోవడంలో పోలీసు డాగ్ పాత్ర ప్రధానం అని చెప్పాలి.. దొంగలు కొండగట్టు ఆలయానికి భక్తుల్లాగా వచ్చి రెక్కీ నిర్వహించారు.. బస్టాండ్ ప్రాంతం నుంచి ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుని చుట్టుపక్కల కలియ తిరిగారు. గుడిలోకి ఏవి ధంగా ప్రవేశించవచ్చనే విషయమై క్షుణ్నంగా పరిశీలించారు. ఆలయానికి వచ్చేది.. వెళ్లేది.. రెక్కీ నిర్వహించే దృశ్యాలన్ని సీసీ ఫుటేజీలో నిక్షిప్తమయ్యాయి. వాటన్నింటిని పోలీసులు సేకరించారు. దొంగలు చోరీ చేసిన అనంతరం ఆలయం వెనకవైపు వెళ్లి మద్యం సేవించారు.. పోలీసు జాగిలం ఆలయం నుంచి వెనకవైపు పడేసిన ఖాళీ బీరు సీసాల వరకూ వెళ్లి గుర్తించింది.. పోలీసులు వాటిపై వెలిముద్రలను సేకరించారు. వాటి ఆధారంగా ఆధార్ కార్డును గుర్తించేసరికి అసలు నిందితుల ఆచూకీ దొరికింది. వెంటనే కర్ణాటక రాష్ట్రం బీదర్ వెళ్లి ఏడుగు నిందితుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకు పట్టుకొచ్చారు. ఆలయంలో చోరీ చేసిన నిందితులు కేవలం వెండి వస్తువులు, ఆభరణాలు మినహా బంగారం, ఇతర వస్తువులు ముట్టుకోలేదు.. నిందితులు అంతా రక్త సంబంధీకులు కావడం మరో చెప్పుకోదగ్గ విషయం. ఏడుగురూ రక్త సంబంధీకులే కొండగట్టు చోరీ చేసిన ఏడుగురు రక్త సంబంధీకులు కావడం చెప్పుకోదగ్గ విషయం. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా ఔరద్ తాలుకా హులియట్ తండాకు చెందిన బాలాజీ కేశవ రాథోడ్, రామరావు జాదవ్, రాంశెట్టి జాదవ్, విక్రమ్ జాదవ్, నర్సింగ్ జాదవ్, దేవిదాస్ జాదవ్, విజయ్ కుమార్ రాథోడ్ ఒకే. ప్రాంతానికి చెందిన రక్తసంబంధీకులు. వీరు ముఠాగా ఏర్పడి ఆలయాల్లో దొంగతనాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.. ఇప్పటికే మహారాష్ట్రలోని పండరీపురం, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని చాముం డేశ్వరి తదితర ఆలయాల్లో చోరీచేశారు.. కొండగట్టు ఆలయంలో జరిగిన చోరీలోనూ వీరు పాల్గొన్నారు. ఇందులో తండ్రీకొడుకులు కూడా ఉండటం గమనార్హం. 24 గంటల్లోనే దొంగలను గుర్తించిన పోలీసులు కొండగట్టు చోరీ కేసును చాలెంజ్గా తీసుకుని, 24 గంటల్లోనే దొంగలను గుర్తించి, నాలుగైదు రోజుల్లోనే ముగ్గురు నిందితులను పట్టుకున్న పోలీసులను ఎస్పీ భాస్కర్ అభినందించారు. ఆపరేషన్ లో పాల్గొన్న 27 మంది పోలీసులకు ప్రభుత్వం తరఫున రివార్డులు అందించనున్నట్లు చెప్పారు. -
కొండగట్టు ఆలయంలో చోరీ.. దొంగలు ఎవరంటే?
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో ప్రముఖ ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయంలో దొంగతనం జరిగిన విషయం తెలిసిందే. కాగా, చోరీ కేసును పోలీసులు చేధించారు. ఆలయంలో చోరీకి పాల్పడిన దొంగను పోలీసులు పట్టుకున్నారు. సదరు దొంగను కర్నాటకలోని బీదర్లో పట్టుకున్నారు. వీరంతా మెదక్ జిల్లా నారాయణ్ఖేడ్ సమీపంలోని ఓ తండాకు చెందిన గ్యాంగ్గా గుర్తించారు. వివరాల ప్రకారం.. కొండగట్టు ఆలయంలో గత శుక్రవారం దొంగతనం జరిగింది. తొమ్మిది లక్షల విలువైన మకర తోరణం శఠగోపాలు, వెండి తొడుగు, వెండి వస్తువులు మొత్తం 15 కిలోల వెండి అపహరించారు. కాగా, ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు. చోరీ కోసం దొంగలు.. శుక్రవారం అర్ధరాత్రి 1.20 గంటలకు ఆలయం వెనుక నుంచి గుడిలోకి వెళ్లి దొంగతనం చేసి.. ఆ తర్వాత వెనుక వైపు నుంచి గుట్ట కిందకు దిగి వెళ్లిపోయినట్టు గుర్తించారు. అనంతరం, మెయిన్రోడ్డుకు వెళ్లి బైకులపై కోరుట్ల, మెట్పల్లి మీదుగా కామారెడ్డి, నారాయణ్ ఖేడ్ నుండి బీదర్ వెళ్లినట్టు పోలీసులు ట్రాక్ చేశారు. ఇక, ఈ దొంగతనానికి ఎనిమిది ఉన్న ఓ గ్యాంగ్ ప్లాన్ చేసినట్టు గుర్తించారు. ప్రస్తుతానికి వారి వద్ద నుంచి 60 శాతం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, ఆభరణాలు మొత్తం రికవరీ అయ్యాక ఈ ఘటన గురించి పోలీసులు వివరాలు తెలిపే అవకాశం ఉన్నట్టు సమాచారం. -
వార్నీ.. ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లారు!
యశవంతపుర(బెంగళూరు): బస్టాండ్లో బ్యాగ్, మొబైళ్లు చోరీ కావటం వినే ఉంటాం. అయితే ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన బస్సును దుండగులు ఎత్తుకెళ్లారు. వివరాలు... కల్యాణ కర్ణాటక రవాణాసంస్థ (కెకె ఆర్టీసీ) బస్సు చోరీకి గురైంది. కలబురిగి జిల్లా చించోళి బస్టాండ్లో బీదర్ డిపో–2కు చెందిన బస్ (కెఎ–38, ఎఫ్–971)ను సోమవారం రాత్రి నిలిపారు. మంగళవారం తెల్లవారుజామున బస్సును దుండగులు అపహరించారు. ఈ బస్సును ముగ్గురు వ్యక్తులు మిరియాణ, తాండూరు మార్గంలో తెలంగాణ వైపు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. చించోళి పోలీసులు ఆర్టీసీ అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించి బస్సు కోసం గాలింపు చేపట్టారు. చదవండి లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలి -
మదర్సా ప్రాంగణంలో మూక దుశ్చర్య
బీదర్(కర్ణాటక): బీదర్లో 1472లో నిర్మించిన మదర్సా, మసీదు ఉన్న ప్రాంగణంలో అన్యమత ప్రార్థనలకు ఒక గుంపు తెగించింది. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఆ ప్రాంగణంలో పూజలు చేసింది. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. తెల్లవారుజామున దుర్గామాత విగ్రహం నిమజ్జనం కోసం గుంపుగా వెళ్తున్న జనంలోని దాదాపు 60 మంది హఠాత్తుగా మదర్సా, మసీదు ఉన్న ప్రాంగణంలోకి చొరబడి అక్కడి శమీ చెట్టు ఉండే చోట పూజలుచేశారు. ఘటనపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర స్పందించారు. ‘ ఆ ప్రాంతంలో చాలా ఏళ్లుగా శమీ చెట్టు ఉండేది. ప్రతి ఏటా నలుగురైదుగురు వచ్చి దర్శించుకుని వెళ్లేవారు. ఇప్పుడా చెట్టు లేదు. అయినాసరే ఈ ఏడాదీ వచ్చారు. వీడియోలు తీసి వైరల్ చేయడంతో వివాదమైంది’ అని మంత్రి అన్నారు. దీంతో పట్టణంలో ముస్లింలు ఆందోళనకు దిగారు. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్చేశారు. పోలీసులు రంగంలోకి దిగి నలుగురిని అరెస్ట్చేశారు. -
వీధి కుక్కకు చికిత్స కోసం బీదర్ నుంచి సిటీకి..
సాక్షి, బంజారాహిల్స్: నగరానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీదర్లో ఓ వీధి కుక్క నడవలేని పరిస్థితుల్లో ఉందని.. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్లు ఇక్కడి యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ(ఏడబ్లూసీఎస్)కు ఈ నెల 21వ తేదీన ఫోన్ వచ్చింది. దీంతో ఈ సంస్థకు చెందిన షెల్టర్ నిర్వాహకులు సంతోషినాయర్, రెస్క్యూ కో ఆర్డినేటర్లు మనీష్, గణేష్ తదితరులు తమ సంస్థకు చెందిన రెస్క్యూ అంబులెన్స్లో బీదర్ చేరుకున్నారు. అక్కడ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వీధి కుక్కను అంబులెన్స్లో హైదరాబాద్కు తీసుకొచ్చారు. అల్వాల్ మిలటరీ డెయిరీఫామ్ రోడ్డులో ఉన్నో ఆంచల్ ఖన్నా జంతు సంరక్షణ కేంద్రానికి తీసుకొచ్చి రెండు రోజుల పాటు వైద్యం చేయించారు. శుక్రవారం మెడలో ఇరుక్కున్న ప్లాస్టిక్ పైప్ను సర్జరీ ద్వారా తొలగించారు. జంతు ప్రేమికులు ఈ బృందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. (చదవండి: పనసపొట్టు.. షుగర్ ఆటకట్టు) -
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు హైదరాబాదీలు మృతి
బెంగళూరు: కర్ణాటకలోని బీదర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ కారు కంటైనర్ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు హైదరాబాద్ బేగంపేట్ వాసులుగా గుర్తించారు. మృతుల్లో గిరిధర్(45), అనిత(30), ప్రియ(15), మహేష్(2), డ్రైవర్ జగదీష్(30)లుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను హర్షవర్దన జిల్లా ఆస్పత్రికి తరలించారు. కర్ణాటక కలబురిగి జిల్లా గంగాపూర్ దైవదర్శనానికి వెళ్లిన క్రమంలో కారు ప్రమాదానికి గురైంది. ఐదుగురు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇదీ చదవండి: యువతి చేష్టలతో విమానంలో గందరగోళం -
షాకింగ్ వీడియో: రైల్వే ట్రాక్పై ట్రక్కును ఢీకొట్టిన ప్యాసింజర్ రైలు
Train Rams Into A Truck On A Railway Crossing.. రైల్వే గేట్ క్రాసింగ్ వద్ద ట్రాక్పై నిలిచిపోయిన ఓ ట్రక్కును ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బీదర్లోని భాల్కీ రైల్వే క్రాసింగ్ వద్ద ట్రాక్పై ఓ ట్రక్కు నిలిచిపోయింది. అయితే, ట్రక్కు పట్టాలపైకి రాగానే ఇంజిన్ స్టార్ట్ కాకపోవడంతో అక్కడే నిలిచిపోయింది. ఇంతలో ట్రాక్పై వస్తున్న ప్యాసింజర్ రైలు ట్రక్కును ఢీకొట్టింది. కాగా, రైల్వే అధికారులు, స్థానికులు లోకోమోటివ్ పైలట్కు సకాలంలో సమాచారం అందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఎవరూ మృతి చెందకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Freak accident at a railway crossing in Bidar's Bhalki. Train rams into a truck that broke down at the railway track. Railway officials & locals managed to inform the locomotive pilot just in time to slow down averting a major tragedy. No injuries. More details awaited. pic.twitter.com/Q1g5QXsV0T — Deepak Bopanna (@dpkBopanna) July 7, 2022 ఇది కూడా చదవండి: జోర్దార్ వీడియో: జోరు వానలోనూ.. నీ యవ్వ తగ్గేదే లే! -
చెరువులో మునిగి నలుగురు హైదరాబాద్ యువకులు మృతి
బెంగళూరు: బీదర్ జిల్లా గోడివాడ దర్గా సమీపంలో ఉన్న చెరువులో హైదరాబాద్కు చెందిన నలుగురు మృతి చెందారు. ఈ విషాద సంఘటన ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. సలీంబాబా నగర్ బస్తీకి చెందిన జునైద్ఖాన్ (21), అతని సోదరుడు ఫహాద్ఖాన్(16), ఆదే ప్రాంతానికి చెందిన సయ్యద్ జునైద్(16), కిషన్బాగ్ ప్రాంతానికి చెందిన హైదర్ఖాన్ (16)లు ఆదివారం గోడివాడి దర్గాకు కారులో బయలుదేరారు. 11 గంటల ప్రాంతంలో గోడివాడకు దర్గా వద్దకు చేరుకున్నారు. పక్కనే ఉన్న చెరువులో స్నానం చేసేందుకు వెళ్లారు. ముందుగా హైదర్ వెళ్లగా అతను నీటిలో మునిగిపోతుండటాన్ని మిగతా ముగ్గురూ గమనించారు. చదవండి: Mumbai Cruise Rave Party: ఎవరీ సమీర్ వాంఖెడే..? అతన్ని కాపాడే క్రమంలో వీరు కూడా నీటిలో మునిగిపోయారు. చెరువులో నీరు ఎక్కువగా ఉండటం, వీరికి ఈత రాకపోవడంతో మృతిచెంది ఉంటారని భావిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దుస్తులు, గుర్తింపు కార్డుల ఆధారంగా గుర్తించారు. గజ ఈతగాళ్లతో గాలించి మృతదేహాలను వెలికి తీసి పోస్ట్మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ నలుగురి మృతితో సలీంబాబా నగర్లో విషాదం నెలకొంది. కుటుంబభ్యుల రోదనలు మిన్నంటాయి. నిన్నటి వరకు కళ్లముందు తిరిగిన యువకులు ఇక లేరనే బాధను కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. చదవండి: ఫేస్బుక్ ప్రేమ.. యువకుడి చేతిలో మోసపోయి -
అన్న ఐపీఎస్, తమ్ముడు ఐఏఎస్
సాక్షి, రాయచూరు రూరల్: తెలంగాణ రాష్ట్ర సరిహద్దు జిల్లా బీదర్లో ఇద్దరు సోదరులు ఉన్నత హోదా ఉద్యోగాలు పొందారు. వివరాలు... స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్న నదీముద్దీన్కు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు మహ్మద్ నదీముద్దీన్ గత ఏడాది నిర్వహించిన యూపీఎస్సీలో ఉత్తమ ర్యాంకు సాధించి ఐపీఎస్కు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన కేరళలో శిక్షణ పొందుతున్నారు. ఇక రెండో కుమారుడు మహ్మద్ హ్యారీస్ కూడా అన్న బాటలో నడి చాడు. తాజాగా వచ్చిన యూపీఎస్సీలో 270 ర్యాంకు సాధించి ఐఏఎస్కు ఎంపికయ్యారు. కుమారులు ఇద్దరు సివిల్స్ విజేతలు కావడంతో కుటుంబంలో ఆనందం నెలకొంది. -
చూడముచ్చటగా ఉన్నారు.. ఎంత పనై పోయింది
యశవంతపుర: సెల్ఫీ మోజులో ఎంతోమంది ప్రాణాలు గాల్లోకలుస్తున్నాయి. సెల్ఫీ వేళ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు ఉన్నా పట్టించుకోకుండా విగతజీవులవుతున్నారు. బీదర్ నుండి వచ్చిన విద్యార్థులు నది వద్ద సెల్ఫీ తీసుకుంటూ జారిపడి మరణించారు. బీదర్లోని కర్ణాటక కాలేజ్లో బీఏ విద్యార్థి పురుషోత్తమ పాటిల్, ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి రక్షిత స్నేహితులు. రక్షిత గుల్బర్గాలో ఇంజనీరింగ్ చదివేది. వీరిద్దరూ ప్రేమికులు కూడా. వరుస సెలవులు కావడంతో పర్యాటక యాత్రకు వచ్చారు. సోమవారం బాడుగ ఆటోలో దాండేలి నుండి జోయిడా వద్ద అంబికానగర గణేశ గుడి సమీపంలోని వంతెన వద్దకు వచ్చారు. అక్కడ ఎవరూ లేని సమయంలో మొబైల్ ఫోన్లో ఇద్దరు కలిసి సెల్ఫీ తీసుకొంటుండగా జారి వంతెన పైనుండి కాళీ నదిలోకి పడిపోయారు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయారు. వంతెనపై దొరికిన మొబైల్ ఫోన్ ఆధారంగా యువతి కుటుంబసభ్యులకు కొందరు సమాచారం అందించారు. మంగళవారం ఉదయం ఇద్దరి మృతదేహాలను పోలీసులు ఒడ్డుకు తెచ్చారు. బీదర్ జిల్లా రామనగర పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. కాగా వీరు నిజంగానే ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయారా లేదా ఆత్మహత్య చేసుకున్నారా అని స్థానికుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: కిరాతకం: అందరూ చూస్తుండగానే.. -
బీదర్ నుంచి వస్తున్న ‘రాణి’
సాక్షి, సిటీబ్యూరో: ‘రాణి’ బ్రాండ్ గుట్కాను వక్కల ముసుగులో కర్ణాటకలోని బీదర్ నుంచి నగరానికి అక్రమంగా రవాణా చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టును ఉత్తర మండల టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఇప్పటి వరకు సిటీలో దొరికిన నిషేధిత పొగాకు ఉత్పత్తులన్నీ పాన్ మసాలా, తంబాకు విడివిడిగా ప్యాక్ చేసి ఉన్నవే కాగా.. తొలిసారిగా పూర్తి గుట్కాను పట్టుకున్నారు. టాస్క్ఫోర్స్ ఓఎస్డీ పి.రాధాకిషన్రావుతో కలిసి గురువారం తన కార్యాలయంలో కొత్వాల్ అంజనీకుమార్ విలేకరులకు తెలిపిన వివరాలు ప్రకారం... (చదవండి: కూకట్పల్లిలో దారుణం) ► నగరానికి చెందిన అన్నదమ్ములు మహ్మద్ హసనుద్దీన్, మహ్మద్ మజారుద్దీన్, మహ్మద్ ఆరీఫ్ వ్యవస్థీకృత గుట్కా దందా ప్రారంభించారు. తమకు సహకరించడానికి అక్తర్, యాసీన్, మక్బూల్, దస్తగిరి, మీర్జా ఫజీ హుస్సేన్ బేగ్లను ఏర్పాటు చేసుకున్నారు. ► అఫ్జల్గంజ్, బహదూర్పుర ప్రాంతాల్లో ఉన్న గోదాముల్లో ఈ ముఠాలో కొందరు గోదాముల ఇన్చార్జ్లుగా, మరికొందరు ట్రాన్స్పోర్ట్ ఏజెంట్లుగా పని చేస్తున్నారు. బీదర్కు చెందిన రిజ్వాన్ ఈ ముఠాకు హోల్సేల్గా రాణి బ్రాండ్ గుట్కాను సరఫరా చేస్తున్నారు. ► వక్కల పేరుతో డీసీఎం వ్యాన్లలో బీదర్ నుంచి హైదరాబాద్కు వస్తున్న గుట్కా వివిధ గోదాములకు చేరుతోంది. అక్కడ నుంచి దీన్ని చిన్న చిన్న వాహనాల్లో పాన్షాపులు, కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. కొంత మొత్తం ట్రాన్స్పోర్ట్, కొరియర్ల్లో ఆంధ్రప్రదేశ్లోని నగరాలు, పట్టణాలకు వెళ్తోంది. ► పోలీసుల నిఘాకు చిక్కకుండా ఉండటానికి బీదర్ నుంచి సిటీలో గుట్కా దిగిన తర్వాత ఒకే గోదాములో ఉంచట్లేదు. నిత్యం ఒకచోటు నుంచి మరోచోటుకు మారుస్తున్నారు. ఈ గ్యాంగ్ ఇటీవలే బహదూర్పుర పరిధిలోని కిషన్బాగ్లో ఓ గోదాము అద్దెకు తీసుకుంది. ► ఈ వ్యవహారంపై నార్త్జోన్ టాస్క్ఫోర్స్కు సమాచారం అందడంతో ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వరరావు నేతృత్వంలో ఎస్సైలు జి.రాజశేఖర్రెడ్డి, కె.శ్రీకాంత్, బి.పరమేశ్వర్ తమ బృందాలతో ఏకకాలంలో వివిధ ప్రాంతాల్లో దాడులు చేశారు. ► మీర్జా, దస్తగిరిలను అరెస్టు చేసి వీరి నుంచి వాహనంతో పాటు రూ.63,96,000 విలువైన 31 బ్యాగుల్లో ఉన్న 639600 గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. ► నగరంలో ఉన్న కొరియర్, ట్రాన్స్పోర్ట్ సంస్థలు ఇలాంటి నిషేధిత ఉత్పత్తుల్ని రవాణా చేయవద్దని, అలా చేస్తే వారి పైనా కేసులు పెడతామని కొత్వాల్ అంజనీకుమార్ హెచ్చరించారు. ► ఈ కార్యక్రమంలో నగర కొత్వాల్ సిటీలోని గస్తీ వాహనాల సిబ్బందికి రిఫ్లెక్టివ్ జాకెట్లు పంపిణీ చేశారు. ఇళ్ల వద్దకే వెళ్లి ఫిర్యాదులు స్వీకరిస్తూ, కేసులు నమోదు చేస్తున్న వీరే పోలీసు విభాగానికి బ్రాండ్ అంబాసిడర్లని అన్నారు. (చదవండి: 300 పోలీసు అధికారుల ఇళ్లల్లోకి వరద నీరు) -
‘ఇడియట్’ సినిమాలో అలీ లాగే..
సాక్షి, హైదరాబాద్: ‘ఇడియట్’ సినిమాలో కమెడియన్ అలీ దొంగలించిన బైక్లను చాకచక్యంగా ఎత్తుకెళ్తాడు. మార్గంమధ్యలో అడ్డగించిన పోలీసులు ఆ బైక్పై ఉన్న ఇసుకను మాత్రమే చూస్తారు కానీ.. బైక్ వివరాలు మాత్రం అడగరు. సరిగ్గా ఇదే తరహాలో ముగ్గురు దొంగలు ఇలాగే దొంగలించిన బైక్లను ఎత్తికెళ్లిపోదామనే పన్నాగం పన్ని పోలీసులకు చిక్కారు. ఆసీఫ్నగర్ పీఎస్ పరిధిలో ఇటీవల చోరీకి గురైన బైక్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టగా.. ముగ్గురు దొంగలు దొరికారని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సోమవారం మీడియాకు వెల్లడించారు. రికవరీ చేసిన 12 ద్విచక్రవాహనాలను, ముగ్గురు నిందితులు ఎం.వెంకటేష్(22), వశీం అక్రమ అలియాస్ వసీం(27), సిరాజ్ఖాన్(28)లను సోమవారం మీడియాకు చూపించారు. కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం... దహిల్బాగ్ మహబూబ్ కాలనీకి చెందిన పాతనేరస్తుడు ఎం.వెంకటేష్ ఆసీఫ్నగర్లోని ఓ పెట్రోల్బంక్లో పని చేస్తున్నాడు. ఇతనిపై 12కు పైగా బైక్ చోరీ కేసులున్నాయి. కొద్దిరోజులు క్రితం బీదర్కు చెందిన వశీం అక్రం, సిరాజ్ ఖాన్లతో పరిచయం ఏర్పడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జైలుకు వెళ్లొచ్చిన వెంకటేష్.. వసీం, సిరాజ్ఖాన్లతో కలిసి బైక్ల చోరీకి పాల్పడ్డాడు. రాత్రి సమయంలో తన వద్ద ఉన్న తాళాలతో పార్క్ చేసిన ఉన్న బైక్ తాళాలను వెంకటేష్ ఓపెన్ చేయడానికి యత్నిస్తాడు. తాళం వేస్తే ఈ విషయాన్ని వసీం అక్రం, సిరాజ్ఖాన్లకు సమాచారం ఇస్తాడు. వారు వచ్చి ఆ బైక్లను వేరే ప్రాంతాల్లోని పార్కింగ్ ప్రదేశాల్లో పార్క్ చేస్తారు. నగరంలో అమ్మితే సమస్యలు వస్తాయని వేరే ప్రాంతాల్లో అమ్మేందుకు సిద్ధపడ్డారు. ఇలా పట్టేశారు... ‘ఇడియట్’ సినిమాలో అలీ ఏ విధంగా అయితే బైక్లను దొంగలించి ఆ బైక్లపై బీదర్కు ఇసుకను తరలిస్తూ.. పోలీసులకు చిక్కినట్టే.. వీరు కూడా ఇసుక బస్తాలను దొంగలించిన బైక్లపై పెట్టుకుని బీదర్ వెళ్లి అమ్మాలని పథకం వేశారు. అయితే..పోలీసులు ఫొటో అండ్ ఎనాస్మెంట్ ద్వారా వీరిని పట్టుకున్నారని కమిషనర్ తెలిపారు. వెంకటేష్పై పలు ఠాణాల్లో కేసులు వెంకటేష్ కొన్ని రోజుల పాటు మాత్రమే ఉద్యోగం చేస్తాడు. అతను సాధారంగా చేసేదంతా చోరీలే. ఇలా 2014 నుంచి చోరీలు చేస్తున్నాడు. వెంకటేష్పై మంగళ్హట్ పీఎస్లో 4 కేసులు, ఆసీఫ్నగర్ పీఎస్లో 3 కేసులు, రాయదుర్గం పీఎస్లో 2 కేసులు, లంగర్హౌస్, టప్పచబుత్ర పీఎస్ల్లో ఒక్కో కేసు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో దొంగలించిన 12 ద్విచక్ర వాహనాలను పోలీసులు రికవరీ చేశారు. కాగా.. 12 బైక్స్లో 11 బైక్ల సమాచారం మాత్రమే ఉంది. మరో బైక్ ఎక్కడ కొట్టేసింది స్పష్టత లేదు. -
భద్రాచలం టు బీదర్
సాక్షి, హైదరాబాద్: భద్రాచలం ఏజెన్సీ నుంచి కర్ణాటక రాష్ట్రంలోని బీదర్కు గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తోన్న గంజాయిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు పట్టుకున్నారు. శనివారం ఎల్బీనగర్ క్రాస్రోడ్ వద్ద ట్రక్కు (టీఎస్ 12సీ 5662), కారు (ఏపీ 29 ఏబీ 7351) లను తనిఖీ చేశారు. దీనిపై రూ.4,100 పెండింగ్ చలానాలు ఉన్నాయి. ట్రక్కులో పైన ఖాళీ ప్లాస్టిక్ కేసులను ఉంచి, ఎవరికీ అనుమానం రాకుండా అడుగున గంజాయి సంచులను జాగ్రత్తగా అమర్చారు. కానీ, తనిఖీల్లో 1,554 కిలోల 751 గంజాయి సంచులు బయటపడ్డాయి. వీటి విలువ రూ.3.10 కోట్లు ఉంటుందని అంచనా. ఈ ముఠాలోని ఆరుగురు సభ్యులు చాలా చాకచక్యంగా వ్యవహరించారు. పోలీసుల తనిఖీలను ముం దుస్తుగానే గుర్తించి, ట్రక్కులోని సరుకును తప్పించేందుకు కారును పైలట్ వాహనంగా వాడారు. కానీ, విశ్వసనీయ సమాచారం అందుకున్న డీఆర్ఐ అధికారులు రెండు వాహనాలను ఆపారు. సరుకు భద్రాచలం సమీపంలోని మోతుగూడెం నుంచి కర్ణాటకలోని బీదర్కు తరలిస్తున్నట్లుగా వెల్లడించారు. ఆరుగురిని అరెస్టు చేసిన అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్
సాక్షి, బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీదర్ మహిళలపై దేశద్రోహం కేసు పెట్టడాన్ని నిరసిస్తూ శనివారం ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద ఆందోళన చేసేందుకు ర్యాలీగా కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. రేస్కోర్స్ రోడ్ సమీపంలో సిద్ధరామయ్యతో పాటు దినేశ్ గుండురావు, రిజ్వాన్ అర్షద్, కె. సురేశ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ వ్యవస్థను యడియూరప్ప సర్కారు దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా విమర్శించారు. కర్ణాటకను పోలీస్ రాష్ట్రంగా మార్చిందని దుయ్యబట్టారు. బీదర్లోని షహీన్ పాఠశాలలో వేసిన నాటకంలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయన్న కారణంతో తొమ్మిది నుంచి పన్నేండేళ్ల పిల్లలను ఐదు రోజులపాటు పోలీసులు ప్రశ్నించారు. అంతేకాకుండా ప్రధానోపాధ్యాయురాలు, ఓ విద్యార్థి తల్లిపై దేశ ద్రోహం కింద కేసు నమోదు చేశారు. కర్ణాటక పోలీసుల చర్యను ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు తీవ్రంగా ఖండించారు. నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నేతలను అదుపు చేస్తున్న పోలీసులు యెడ్డీని క్షమించరు ఇద్దరు మహిళలను దేశద్రోహం కేసు కింద బలవంతంగా అరెస్ట్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని సిద్ధరామయ్య అంతకుముందు పేర్కొన్నారు. కుమార్తె నుంచి తల్లిని వేరు చేసినందుకు రాష్ట్ర మహిళలు ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పను క్షమించరని వ్యాఖ్యానించారు. సీఎం యడియూరప్ప విచక్షణ కోల్పోయినట్టుగా కన్పిస్తున్నారని సిద్ధరామయ్య తన ట్విటర్లో విమర్శించారు. వందేళ్ల క్రితం చేసిన అరాచక ఐపీసీ చట్టాలను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరముందని ట్వీట్ చేశారు. (చదవండి: ఈ స్క్రిప్ట్ రాసిందెవరు..?) -
బీదర్కు ట్రూజెట్ సర్వీసులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్రూజెట్ పేరుతో విమాన సేవల్లో ఉన్న హైదరాబాద్ సంస్థ టర్బో మేఘా ఎయిర్వేస్ తాజాగా తన నెట్వర్క్లోకి బీదర్ను చేర్చింది. ఉడాన్ సర్వీసుల్లో భాగంగా బెంగళూరు–బీదర్–బెంగళూరు మధ్య ఫ్లయిట్ను ప్రతిరోజూ నడుపుతారు. కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కొత్త సర్వీసును శుక్రవారం ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం మంత్రులు, కంపెనీ ప్రతినిధులతో కలిసి విమానంలో బీదర్ ప్రయాణించారు. బస్సులో 12 గంటల సమయం పడుతుందని, విమానంలో గంట 40 నిమిషాల్లోనే చేరుకున్నామని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. బీదర్ చేరికతో ట్రూజెట్ నెట్వర్క్లో డెస్టినేషన్ల సంఖ్య 24కు చేరుకుందని టర్బో మేఘా ఎయిర్వేస్ డైరెక్టర్ కె.వి.ప్రదీప్ వెల్లడించారు. కార్యకలాపాలు ప్రారంభించిన నాలుగేళ్లలోనే ఈ స్థాయికి చేరుకున్నామని కంపెనీ సీఈవో కల్నల్ ఎల్ఎస్ఎన్ మూర్తి తెలిపారు. కాగా, స్ప్రింగ్ సర్ప్రైజ్ పేరుతో నాలుగు రోజుల సేల్లో భాగంగా బెంగళూరు–బీదర్–బెంగళూరు రూట్లో బేస్ ఫేర్ రూ.699కే అందిస్తోంది. సర్వీసు ప్రారంభిస్తున్న కర్ణాటక సీఎం, తదితరులు -
బెంగళూరు నుంచి బీదర్కు ట్రూజెట్ సర్వీసులు
బెంగళూరు: ఉడాన్ నెట్వర్క్ సేవల విస్తరణలో భాగంగా హైదరాబాద్ టర్బో మేఘా ఎయిర్వేస్కు చెందిన ట్రూజెట్ కొత్తగా ఈశాన్య కర్ణాటకలోని బీదర్ నుంచి విమాన సేవలు ప్రారంభించింది. బీదర్ నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరు మధ్య శుక్రవారం నుంచి ప్రతీ రోజు విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయి. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప ఇవాళ బెంగళూరు విమానాశ్రయంలో ఈ సర్వీసు ప్రారంభించారు. బెంగళూరులో ట్రూజెట్ సర్వీసు ప్రారంభించిన అనంతరం అదే విమానంలో ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు బీదర్ వరకు ప్రయాణించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ బెంగళూరు విమానాశ్రయం నుంచి బీదర్కు కేవలం గంటా 40 నిమిషాల్లోనే చేరుకున్నామని, సాధారణంగా బెంగళూరు నుంచి బస్సులో బీదర్కు చేరుకోవాలంటే 12 గంటల ప్రయాణం అవుతుందన్నారు. ట్రూజెట్ విమాన సర్వీసుల వల్ల ప్రయాణ దూరం భారం తగ్గిందని విమాన సర్వీసుల పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు ఇక ట్రూజెట్ నెట్వర్క్లో బీదర్ 24వ స్టేషన్ కాబోతోంది. ప్రాంతీయ అనుసంధాన పథకం (ఆర్సీఎస్)- ఉడే దేశ్కా ఆమ్ నాగరిక్ (ఉడాన్), సామాన్య మానవులు కూడా విమానాల్లో ప్రయాణించాలన్న ప్రధానమంతి ప్రయత్నాల్లో భాగంగా ట్రూజెట్ విమానాల్లో 65 శాతానికి పైగా ప్రాంతీయ విమానాశ్రయాలకు అనుసంధానమై ఉన్నాయి. ఆర్సీఎస్ I, II, III కింద తనకు అప్పగించిన మార్గాల్లో పూర్తిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏకైక సంస్థ ట్రూజెట్. ఈ సందర్భంగా టర్బో మేఘా ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ప్రదీప్ మాట్లాడుతూ ‘మా మొదటి ప్రయాణాన్ని జూలై 12, 2015న మొదలపెట్టిన నాటి నుంచి మేము చాలా దూరం ప్రయాణించాం. భారత్లోని ప్రథమశ్రేణి నగరాల నుంచి సామాజిక-ఆర్థిక అభివృద్ధిని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాలన్న జాతి ఆకాంక్షలను మేము నెరవేర్చుతున్నామని గొప్పగా చెప్పుకుంటున్నాం. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విమాన సేవలు అందించడం ద్వారా ఆ ప్రాంతాల్లో వ్యాపారానికి, పర్యటక అభివృద్ధికి మేము దోహదపడుతున్నాం. విమాన అనుసంధానం అన్నది ఆర్థిక వ్యవస్థకు అండగా నిలవడమే కాకుండా ఉపాధి కల్పనకు సహకరిస్తుంది’ అని అన్నారు. సీఈఓ కల్నల్ ఎల్ఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ, ప్రాంతీయ విమాన అనుసంధానంలో బలమైన శక్తిగా ట్రూజెట్ నిలుస్తుంది. నాలుగేళ్ల స్వల్ప వ్యవధిలో మా నెట్వర్క్ను 24స్టేషన్లకు విస్తరించగలిగాం. దేశంలో ఆర్థికశక్తులుగా ఎదుగుతున్న ప్రాంతాల్లో బలమైన ప్రాంతీయ విమానయాన సంస్థగా ఎదిగేందుకు సుస్థిర అభివృద్ధి వ్యూహాన్ని రూపొందించామన్నారు. కాగా బెంగళూరు-బీదర్ బెంగళూరు మధ్య కొత్త సర్వీసు ప్రారంభించిన సందర్భంగా ట్రూజెట్ నాలుగు రోజుల పాటు టికెట్ బేస్ ధరను రూ.699 గా అందిస్తోంది. -
పౌర నిరసనలు: ‘ఈ స్క్రిప్ట్ రాసిందెవరు..?’
బెంగుళూరు : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనకారుల అరెస్టులు మనం చూస్తూనే ఉన్నాం..! అయితే, కర్ణాటకలోని బీదర్లో వెలుగుచూసిన ఓ ఘటన మాత్రం పోలీసుల అత్యుత్సాహానికి నిదర్శనంగా నిలిచింది. విద్యార్థులతో నాటక ప్రదర్శన పేరుతో పౌర చట్టంపై అనుచిత వ్యాఖ్యలు చేయించారని పేర్కొంటూ ఇద్దరు మహిళలపై రాజద్రోహం కేసు నమోదు చేశారు. వారిని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. అరెస్టైన వారిలో ఒకరు సదరు విద్యార్థి తల్లి కాగా, మరొకరు పాఠశాల ప్రిన్సిపల్. "వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం" అనే ఆరోపణల నేపథ్యంలో షాహీన్ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు. బూటుతో కొట్టు..! బీదర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో జవనరి 21న విద్యార్థుల నాటక ప్రదర్శన పోటీలు జరిగాయి. అయితే, నాటక ప్రదర్శనలో 9వ తరగతి విద్యార్థి ఒకరు.. సీఏఏపై అనుచితంగా ఓ వ్యాఖ్య చేశాడు. ‘జూతే మారేంగే’ (బూటుతో కొడతా) అన్నాడు. ఈ వీడియో బయటపడటంతో సామాజిక కార్యకర్త నీలేష్ రక్షాల్ జనవరి 26న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. స్కూల్ యాజమాన్యంపై, ప్రిన్సిపల్, విద్యార్థి తల్లిపై కేసులు నమోదు చేశారు. ప్రతి రోజు 4 గంటల విచారణ..! డీఎస్పీ రోజూ మధ్యాహ్న 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యార్థులను ప్రశ్నలతో వేధిస్తున్నారని స్కూల్ సీఈవో తౌసిఫ్ మేదికేరి వాపోయారు. విద్యార్థి పొరపాటు మాటలపై దేశద్రోహం కేసు ఎందుకు పెట్టారో అర్థకావడం లేదని అన్నారు. ఈ మాటలు చెప్పుమన్నదెవరు..? ఈ స్క్రిప్ట్ రాసిందెవరు..? అని పదేపదే ప్రశ్నించి పోలీసులు పిల్లల్ని హింస పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే విద్యార్థి వ్యాఖ్యలపై క్షమాపణలు కోరామని చెప్పారు. ఇక బీదర్ పోలీసుల చర్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో.. భావ ప్రకటనా స్వేచ్ఛకు తూట్లు పొడుస్తున్నారని నెటిజన్లు, పేరెంట్స్ గ్రూపులు మండిపడుతున్నాయి.‘బీదర్ పోలీసులు చట్టవిరుద్ధ, అమానవీయ చర్యలకు పాల్పడుతున్నారు’అని పేరెంట్స్ ఫర్ పీస్, జస్టిస్ అండ్ ప్లులారిటీ గ్రూప్ విమర్శించింది. ప్రిన్సిపల్, విద్యార్థి తల్లిని విడుదల చేయాలని, వారిపై కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. -
గుట్కా@ బీదర్ టు హుజూరాబాద్
సాక్షి, హుజూరాబాద్ : గుట్కా ప్రాణాంతకమైంది.. ప్రాణాలను హరించే గుట్కా అమ్మకాలను ప్రభుత్వం నిషేధించింది. అయితే కొందరు అక్రమార్కులు ఇదే అదునుగా భావించి నిషేధిక గుట్కా దందాను హుజూరాబాద్ కేంద్రంగా కొనసాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిషేధిక గుట్కాలను కొందరు అక్రమార్కులు మహారాష్ట్రలోని బీదర్ నుంచి కొనుగోలు చేసి హుజూరాబాద్కు తెచ్చి ఇక్కడి నుంచి పరిసర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రాణాంతకమైన గుట్కా అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించడంతో పోలీసులు గుట్కా అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. హుజూరాబాద్ కేంద్రంగా సాగుతున్న గుట్కా దందాను అడ్డుకునేందుకు పోలీసులు తరచూ దాడులు నిర్వహిస్తుండగా, రూ.లక్షల్లో గుట్కాలు పట్టుబడుతున్నాయి. తాజాగా హుజూరాబాద్ పరిసర ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా గుట్కా రవాణా చేస్తున్న ముగ్గురిని టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.2 లక్షల గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. ఆగని గుట్కా అమ్మకాలు.. గత కొన్నేళ్లుగా గుట్కా అమ్మకాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయినా కొందరు అక్రమార్కులు పోలీసుల కళ్లుగప్పి గుట్టుగా గుట్కా దందాను కొనసాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల దాడుల్లో తరచూ పట్టుబడుతున్నా.. అక్రమార్కులు మాత్రం గుట్కా అమ్మకాలను దర్జాగా కొనసాగిస్తున్నట్లు సమాచారం. అయితే గుట్కాలు తినడానికి అలవాటు పడి ఎంతో మంది యువకులు, వృద్ధులు క్యాన్సర్ వ్యాధి బారిన పడి విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఏడాది క్రితం కూడా గుట్కా ప్యాకెట్లను భారీ మొత్తంలో జీపులో తరలిస్తుండగా ఓ వ్యక్తి పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించగా రూ.లక్ష విలువ గల గుట్కా ప్యాకెట్లు దొరికాయి. నివాస గృహాల్లో నిల్వలు.. హుజూరాబాద్ కేంద్రంగా గుట్కా అమ్మకాల విక్రయాలు కొనసాగుతుండగా, నివాస గృహాలనే కేంద్రాలుగా ఏర్పరుచుకొని కొందరు అక్రమార్కులు భారీగా నిల్వలను ఉంచుతున్నట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో మరింత విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గానికి హుజూరాబాద్ పట్టణం కేంద్రం కావడంతో ఆయా మండలాలకు చెందిన గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇక్కడకు వస్తుంటారు. అయితే ఇదే అదునుగా భావిస్తున్న గుట్కా విక్రయదారులు గ్రామాల నుంచి వచ్చే కిరాణ కొట్టు దుకాణాదారులకు అంటగడుతూ జేబులు నింపుకుంటూ సొమ్ము చేసుకొంటుకున్నారు. ఆయా గ్రామాల నుంచి వచ్చే వారు కొన్ని పాన్ షాపుల్లో, కిరాణ దుకాణాల్లో గుట్టుగా విక్రయిస్తున్న గుట్కాలను కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. సరదాగా మొదలై.. వ్యసనంగా మారి ప్రాణాంతకమైన గుట్కాకు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే వ్యసనంగా మారుతున్నట్లు తెలుస్తోంది. పని ఒత్తిడిని తట్టుకునేందుకు వారు సరదాగా గుట్కా, అంబర్కు అలవాటు పడుతూ వ్యసనంగా మారి వ్యాధులను కొనితెచ్చుకుంటున్నారు. అయితే నిరక్షరాస్యులతో పాటుగా, పలువురు విద్యావంతులు కూడా అంబర్, గుట్కా వ్యసనంగా మారి వ్యాధుల బారినపడుతున్నారంటే అతిశయోక్తి కాదు. వీరి అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న కొందరు అక్రమార్కులు ధనార్జనే ద్వేయంగా గుట్కా అమ్మకాలను నిర్వహిస్తూ సొమ్ముచేసుకుంటున్నట్లు సమాచారం. -
మూక హింస
-
దేశంలోనే పొడగరి..జీవితం ఎలామరి?
యశవంతపుర: ఇతడి పేరు మారుతీ హనుమంత్... అయితే ఏమిటీ విశేషం అని అడగొచ్చు. ఇతని ఎత్తు 7 అడుగుల 9 అంగుళాలు. వయసు 36 ఏళ్లు. ఊరు కర్ణాటకలోని బీదర్ జిల్లా ఔరాద్ తాలూకా చింతాకి గ్రామం. భారతదేశంలోనే ఎత్తైన వ్యక్తిగా రికార్డ్ సృష్టించాడు. మారుతీని చూసిన కొత్తవారు అతడితో ఫోటోలు తీయించుకొని మురిసిపోతున్నారు. సాధారణ వ్యక్తి అతడి ముందు నిలుచుంటే మరుగుజ్జు అయిపోతాడు. మారుతి ఎత్తు ఎక్కువే అయినా, కుటుంబం మాత్రం నిరుపేదది. తల్లీ వీరవ్వ, ముగ్గురు సోదరులు రోజూ కష్టపడి కూలీ చేసి సంపాదిస్తేగానీ మారుతీకి పూటగడవటం కష్టం. నడుం వంచి పని చేయలేడనే నెపంతో గ్రామంలోనివారు ఎవరూ మారుతీని పనికి పిలవటం లేదు. నడిచేటప్పుడు భూమికి రాసుకుని రెండు కాళ్లకు పుండు కావటంతో నడవటం కూడా అతడికి కష్టంగా మారింది. ప్రభుత్వం దివ్యాంగుల కోటాలో రూ. వెయ్యి పెన్షన్ అందిస్తోంది. ఒక్క సెంట్ కూడా భూమి లేకపోవటంతో భవిష్యత్తు మీద బెంగ పెట్టుకున్నాడు. పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు కావాలని కోరికగా ఉన్నా ‘తగిన’సంబంధాలు దొరకటంలేదు. ప్రభుత్వం ఇచ్చిన పక్కా ఇల్లే ఆశ్రయం. ఇంత ఎత్తు ఉన్నా దానివల్ల తనకు, కుటుంబానికి ఎలాంటి ప్రయోజనం లేదని మారుతి, సోదరులు, తల్లి ఆవేదన చెందుతున్నారు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని మారుతీ తల్లి ప్రభుత్వాన్ని కోరారు. -
బీదర్లో కిరాతకం.. హైదరాబాదీలపై వందమంది దాడి!
సాక్షి, బీదర్ : కర్ణాటకలోని బీదర్లో దారుణం చోటుచేసుకుంది. పిల్లలను ఎత్తుకెళ్లే కిడ్నాపర్లనే అనుమానంతో హైదరాబాదీలపై స్థానికులు దాడి చేశారు. ఈ దాడిలో ఓ వ్యక్తి మృతిచెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బీదర్ జిల్లా ఔరాద్ తాలూకా ముర్కీ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో హైదరాబాద్కు చెందిన మహ్మద్ ఆజాం మృతిచెందగా.. నగరానికి చెందిన తహ్లా ఇస్మాయిల్, మహమ్మద్ సల్మాన్ గాయపడ్డారు. ఔరాద్ తాలూకా హండికేరాకు చెందిన మహమ్మద్ బషీర్ పిలుపు మేరకు వీరు అతడి స్వగ్రామాన్ని సందర్శించేందుకు నగరం నుంచి వెళ్లారు. బషీర్ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. వారు వాహనంలో హండికేరా వెళుతుండగా.. మార్గమధ్యంలో బాల్కూట్ తండా వద్ద అల్పాహారం తీసుకునేందుకు ఆగారు. ఈ సందర్భంగా ఇటీవల కతార్ నుంచి తిరిగివచ్చిన ఇస్మాయిల్ తాను తీసుకువచ్చిన చాక్లెట్లను స్థానిక బడి పిల్లలకు పంచినట్టు తెలుస్తోంది. వారు చేసిన ఈ మంచిపనే స్థానికులకు అనుమానం కలిగించినట్టు కనిపిస్తోంది. వాట్సాప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాలో ఇటీవల హల్చల్ చేసిన వదంతులు, పుకార్ల నేపథ్యంలో వారు పిల్లల కిడ్నాపర్లు అని స్థానికులు అనుమానించారు. అంతే విచక్షణ కోల్పోయి.. సాటి మనుషులన్న కనికరం లేకుండా మహ్మద్ ఆజాం, అతని స్నేహితులపై దాడి చేశారు. బషీర్ వారికి నిజానిజాలు వివరించేందుకు ప్రయత్నించినా.. కోపోద్రిక్తులైన స్థానికులు పట్టించుకోలేదు. దీంతో అక్కడి నుంచి వారు కారులో తప్పించుకున్నప్పటికీ.. సమీపంలోని ముర్కీ గ్రామంవద్ద రోడ్డుకు అడ్డంగా చెట్టును పడేసి.. వారిని అడ్డుకున్నారు. వారిని కారులో నుంచి బయటకు లాక్కొచ్చి.. రాళ్లతో, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో మహ్మద్ ఆజాం మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం వారిని హైదరాబాద్కు తరలించారు. విచక్షణ మరిచి దాదాపు 100 మంది స్థానికులు ఆటవికంగా ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో పోలీసులు 30మందిని అరెస్టు చేశారు. -
కర్ణాటక బీదర్ జిల్లా ఉద్గిర్లో దారుణం
-
పిల్లలు పుట్టక పోవడంతోనే కిడ్నాప్
-
భర్త వదిలేస్తాడనే కిడ్నాప్ చేసింది..!
సాక్షి, హైదరాబాద్: కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో సోమవారం (జూలై 2) నవజాత శిశువు కిడ్నాప్కు గురైంది. ఈ కేసును ఛేదించడంలో సీసీ కెమెరాలు కీలకంగా మారాయని హైదరాబాద్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. సీసీ కెమెరాల సాయంతోనే ఇప్పటివరకు చాలా కేసులను ఛేదించగలిగామని చెప్పారు. అందరూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే నేరాల సంఖ్య తగ్గుముఖం పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఇదివరకే రెండు సార్లు పిల్లలు పుట్టి చనిపోవడంతో నిందితురాలు తీవ్ర మనోవేదనకు గురైందని పోలీసులు తెలిపారు. మూడోసారి కూడా పిల్లలు కలగకపోతే భర్త వదిలేస్తాడనే భయంతో నయనారాణి ఈ కిడ్నాప్కు పాల్పడొచ్చని నిందితురాలి వదిన సునీత చెప్పారు. కిడ్నాప్ అనంతరం నయన బీదర్వైపు వెళ్లినట్టు సీసీ కెమెరాల సాయంతో తెలుసుకున్నామని కమిషనర్ అన్నారు. కర్ణాటక పోలీసుల సాయంతో బీదర్లో ప్రతి ఇంటిని తనిఖీ చేశామని వెల్లడించారు. ఈ కేసులో మీడియా సహకారం మరువలేనిదని కొనియాడారు. గాలింపు చర్యలు ముమ్మరం కావడంతో నిందితురాలు చిన్నారిని బీదర్ ప్రభుత్వాసుపత్రిలో వదిలి వెళ్లిందని తెలిపారు. నయనా, ఆమె భర్త సల్మాన్ హైదరాబాద్లోని ఎన్టీఆర్ నగర్లో నివాసముండేవారని కమిషనర్ తెలిపారు. పిల్లలు పుట్టక పోవడంతోనే ఈ కిడ్నాప్కు పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు. చిన్నారి కిడ్నాప్ కేసులో ఏసీపీ చేతన చాకచక్యంగా వ్యవహరించారనీ, ఆమె పేరునే పాపకు పెట్టామని తెలిపారు. నయనారాణిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. -
చిన్నారి.. చేతన
సాక్షి, హైదరాబాద్: సుల్తాన్బజార్ ప్రసూతి ఆస్పత్రి నుంచి కిడ్నాపైన తన బిడ్డను తిరిగి తన ఒడికి చేర్చడంలో కీలకపాత్ర పోషించిన ఏసీపీ చేతన పేరునే ఆ చిన్నారికి పెడుతున్నట్లు తల్లి సబావత్ విజయ ప్రకటించారు. తమకు దైర్యం చెప్పడానికి ఆస్పత్రికి వచ్చిన నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్కు ఈ విషయం తెలిపారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆ చిన్నారిని సైతం చేతన లాంటి అధికారిగా చేయాలని విజయ నుంచి మాట తీసుకున్నారు. బాలికల విద్యాశాతాన్ని పెంచడానికి ఇదో ఉత్తమ కేస్స్టడీగా మారాలని ఆయన ఆకాంక్షించారు. గురువారం ఆస్పత్రికి వెళ్లిన అంజనీకుమార్ శిశువు తల్లికి పుష్పగుచ్ఛం అందించారు. బీదర్కు చెందిన మహిళగానే అనుమానం... చిన్నారిని కిడ్నాప్ చేసిన మహిళ బీదర్వాసి అని పోలీసులు అనుమానిస్తున్నారు. శిశువును తీసుకొని ఎంజీబీఎస్ నుంచి బస్సులో వెళ్లిన ఆమె బీదర్ బస్టాండ్లో కాకుండా కాస్త ముందున్న నయాకమాన్ స్టాప్లో దిగింది. ఇలా కేవలం స్థానికులు మాత్రమే చేస్తారనే ఉద్దేశంతో పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు ముమ్మరం చేశారు. సోమవారం సైతం విజయ బిడ్డ కంటే ముందు మరో ఇద్దరు చిన్నారుల్ని ఎత్తుకు వెళ్లడానికి ప్రయత్నించి విఫలమైనట్లు బయటపడింది. మీడియాలో హడావుడి, పోలీసుల గాలింపు నేపథ్యంలో భయపడిపోయి బుధవారం సాయంత్రం బీదర్ ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువును వదిలివెళ్లింది. పోలీసులు బీదర్లో ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిన్నారి కిడ్నాప్నకు గురైన సోమవారంరాత్రి డ్యూటీ అధికారిణిగా ఏసీపీ చేతన ఉన్నారు. దీంతో కంటి మీద కునుకు లేకుండా రాత్రంతా అనేక ప్రాంతాల్లో తిరుగుతూ చిన్నారి ఆచూకీ కోసం గాలిస్తూనే ఉన్నారు. మంగళవారం ఉదయానికి ఆపరేషన్ బీదర్కు మారడంతో డీసీపీ ఎం.రమేశ్ అనుమతి తీసుకుని అక్కడకు వెళ్లి పర్యవేక్షించారు. సుల్తాన్బజార్ ఇన్స్పెక్టర్ పి.శివశంకర్రావు తన డ్రైవర్ను ఇచ్చి బీదర్కు అంబులెన్స్ పంపారు. ఏసీపీ చేతన గురువారం తెల్లవారుజామున చిన్నారిని తీసుకువచ్చి తల్లిఒడికి చేర్చారు. త్వరలో భద్రతాచర్యలకు సిఫారసులు.. ఆస్పత్రులు తీసుకోవాల్సిన భద్రతాచర్యల్ని నిర్దేశించడానికి అధ్యయనం చేస్తున్నట్లు కొత్వాల్ అంజనీకుమార్ తెలిపారు. ఈస్ట్జోన్ డీసీపీ ఎం.రమేశ్, సుల్తాన్బజార్ ఏసీపీ డాక్టర్ చేతన వీటిపై రెండు, మూడు రోజుల్లో ఖరారు చేసి నివేదిక ఇస్తారని తెలిపారు. చిన్నారికి తన పేరు పెట్టడం ఆనందంగా, గర్వంగా ఉందని చేతన అన్నారు. చిన్నారికి కామెర్ల లక్షణాలు కనిపించాయి. దీంతో మెరుగైన చికిత్స కోసం నీలోఫర్ ఆస్పత్రికి తరలిస్తామంటూ కుటుం బీకులు వైద్యుల్ని కోరినా కమిషనర్ వస్తున్నారంటూ వారు తరలించడానికి అంగీకరించలేదు. దీంతో చిన్నారి తండ్రి నారీ బయటకు వచ్చి పోలీసులతో పాటు మీడియాపై అసహనం ప్రదర్శిస్తూ చిన్నారి విషయం చెప్పారు. దీంతో స్పందించిన ఆస్పత్రి వర్గాలు చిన్నారిని బంధువుల సంరక్షణలో అంబులెన్స్లో నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. -
బీదర్లో ప్రత్యక్షమైన నవజాత శిశువు!
సాక్షి, హైదరాబాద్: కోఠిలోని సుల్తాన్ బజార్ ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాప్ చేసిన మహిళ, బీదర్లోని ప్రభుత్వాసుపత్రిలో శిశువును వదిలి పారిపోయింది. విషయం తెలియడంతో సుల్తాన్ బజార్ ఏసీపీ చేతన పోలీసులతో బీదర్ చేరుకుని పాపను స్వాధీనం చేసుకున్నారు. సుల్తాన్ బజార్ ప్రభుత్వాసుపత్రిలో ఆరు రోజుల పసికందు సోమవారం మధ్యాహ్నం అదృశ్యమైన సంగతి తెలిసిందే. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఎల్లమ్మ తండాకు చెందిన విజయ, ప్రసూతి కోసం గతవారం ఆసుపత్రికి వచ్చారు. ఆమె ఓ ఆడశిశువుకు జన్మనిచ్చారు. ఆమె కదల్లేని స్థితిలో ఆస్పత్రిలో ఉండటంతో.. పక్కనే ఉన్న ఓ గుర్తుతెలియని ఓ మహిళ ఈ విషయం గమనించి.. శిశువుకు టీకా ఇప్పిస్తానంటూ తీసుకెళ్లింది. ఎంతసేపటికీ ఆమె తన బిడ్డను తీసుకురాకపోవడంతో విజయ తల్లిడిల్లిపోయారు. వెంటనే ఆసుపత్రి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది స్థానిక సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా శిశువును అపహరించిన మహిళను గుర్తించేందుకు ప్రయత్నించారు. రెండు రోజులుగా మహిళా కిడ్నాపర్ కోసం మూడు బృందాలు తీవ్రంగా గాలించాయి. ఈ విషయం తెలిసి భయపడిపోయిన మహిళా కిడ్నాపర్, శిశువును బీదర్లోని ఆసుపత్రిలో వదిలి వెళ్లడంతో కథ సుఖాంతం అయింది. మహిళా కిడ్నాపర్ కోసం పోలీసులు తీవ్రంగా గాలింపులు చేపడుతున్నారు. సీసీ పుటేజీ ఆధారంగా మహిళను కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.శిశువు దొరకడంతో తల్లి విజయ సంతోషం వ్యక్తం చేసింది. పోలీసులకు ధన్యవాదాలు తెలిపింది. పోలీసులు ఆమెకు శిశువును వీడియో చాట్ ద్వారా చూయించడంతో ఆనందం వ్యక్తం చేసింది. -
కోఠి మెటర్నిటీ ఆస్పత్రిలో కిడ్నాపైన పాప సురక్షితం
-
పట్టాలెక్కేదెప్పుడో?
నారాయణఖేడ్: దశాబ్దాలు గడుస్తున్న బోధన్–బీదర్ రైల్వేలైన్కు మోక్షం కలగడం లేదు. ప్రతీసారి బడ్జెట్లో ఆశలు నెరవేరుతాయని ఎదురుచూడడం.. నిరాశే మూటగట్టుకోవడ పరిపాటిగా మారింది. ఒకటికాదు రెండు కాదు ఎనిమిది దశాబ్దాలుగా బోధన్– బీదర్ రైల్వేలైన్ పట్టాలెక్కడంలేదు. ప్రభుత్వాలు మారుతున్నా, నేతలు మారుతున్నా అడుగు మాత్రం ముందుకు పడడం లేదు. స్వరాష్ట్రంలోనైనా కలనెరవేరుతుందని ఆశించినా అడియాసే ఎదురవుతోంది. బోధన్–బీదర్ రైల్వే లైన్ పొడిగించేందుకు 1938లో నిజాం సర్కార్ హయాంలో ప్రతిపాదనలు చేశారు. బోధన్–బాన్సువాడ–పిట్లం– నారాయణఖేడ్–బీదర్ ప్రాంతాల ప్రజల కోరిక మేరకు 2010లో అప్పటి రైల్వే మంత్రి మమతాబెనర్జీ ఈ మార్గానికి లైన్ క్లియర్ చేశారు. ఆదిలాబాద్–పటాన్చెరు మధ్యకొత్తగా మరో రైల్వేలైన్ సర్వేకోసం ఆదేశించారు. 138 కిలోమీటర్ల బోధన్–బీదర్ రైల్వే లైన్ కోసం 2011 ఏప్రిల్లో ప్రారంభమైన సర్వే 2014లో పూర్తయింది. బోధన్ నుంచి రుద్రూర్, వర్ని, నస్రుల్లాబాద్, బాన్సువాడ, పిట్లం, నారాయణఖేడ్ మీదుగా బీదర్వరకు సర్వే పూర్తి చేశారు. సర్వే ప్రకారం మార్గమధ్యలో భారీ వంతెనలు లేవని తేలింది. రూ.1,029 కోట్ల వ్యయంతో లైన్ వేయొచ్చని అధికారులు తేల్చారు. నారాయణఖేడ్ సమీపంలోని జి.హుక్రాన సమీపంలో ఈమేరకు అధికారులు హద్దురాళ్లు పాతడం, రోడ్లపై మార్కింగ్ సైతం వేశారు. దశలవారీగా నిర్వహించిన ఈ సర్వేలో మార్గమధ్యలో వచ్చే నదులపై వంతెనలు, ఎత్తుపల్లాలు ఇతర అన్ని రకాల భౌగోళిక పరిస్థితిపై అంచనా వేసి రైల్వేశాఖ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. సర్వే విషయమై అప్పటి ఎంపీ సురేష్ షెట్కార్ పార్లమెంట్లోనూ ప్రస్తావించారు. రాష్ట్రం నుంచి స్పందన కరువు.. 2014లో సర్వే పూర్తవడంతో ఏటా రైల్వే బడ్జెట్లో ఎంతో కొంత నిధులు మంజూరవుతాయని అందరూ భావించారు. ఇప్పటివరకు నాలుగు బడ్జెట్లు పూర్తయినా పైసా విదిల్చింది లేదు. తెలంగాణలోని కొన్ని కొత్త మార్గాలకు నిధులు కేటాయించిన కేంద్రం బోధన్–బీదర్ రైల్వే లైన్కు మాత్రం మొండిచేయి చూపించింది. రూ.1,029 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును రూపొందించారు. జాప్యం కారణంగా వ్యయం రెట్టింపై రూ.2వేల కోట్లకు చేరింది. మారిన నిబంధనల ప్రకారం రైల్వేలైన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సగం నిధులు కేటాయిస్తే కేంద్రం సగం కేటాయించనుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం స్పందన కరువయ్యింది. ఇప్పటివరకు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. దీంతో ఇప్పట్లో ఈ రైలుమార్గానికి మోక్షం కలిగేలా లేదు. రైల్వేలైన్ ఏళ్లనాటి కల రైల్వే లైన్ ఏర్పాటు ఏళ్లనాటి కల. దీన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెరవేర్చాలి. బోధన్–బీదర్ రైల్వేలైన్ ఏర్పాటు జరిగితే రవాణా పరంగా ఎంతో మేలు చేకూరుతుంది. ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది. –చిరంజీవి, తుర్కాపల్లి, నారాయణఖేడ్ -
బీదర్లో సుశీల్కుమార్ అంత్యక్రియలు
సాక్షి, హైదరాబాద్/న్యాల్కల్(జహీరాబాద్) : తెలంగాణ–ఛత్తీస్గఢ్ సరిహద్దులో శుక్రవారం ఉదయం జరిగిన భారీ ఎన్కౌంటర్లో మృతి చెందిన బీదర్వాసి, గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ బి.సుశీల్కుమార్ (33) అంత్యక్రియలు శనివారం బీదర్ పట్టణంలో నిర్వహించారు. భద్రాద్రి నుంచి ఆయన మృతదేహాన్ని శనివారం తెల్లవారుజామున ప్రత్యేక వాహనంలో బీదర్కు తీసుకొచ్చారు. సుశీల్ మృతదేహం ఇంటికి రాగానే కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. పట్టణంలోని నయాకమాన్, అఫ్జల్గంజ్ మీదుగా మంగల్పేట్లోని మె«థడిస్టు చర్చి వరకు అంతిమయాత్ర కొనసాగింది. అనంతరం మంగల్పేట్లోని శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. నివాళులర్పించిన డీజీపీ రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్రెడ్డి కర్ణాటకలోని బీదర్లో ఉన్న సుశీల్కుమార్ ఇంటికి వెళ్లి ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. అలాగే అంత్యక్రియలకు నిఘా విభాగం అధిపతి నవీన్చంద్, సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి, బీదర్ కలెక్టర్ మహాదేవు, ఎస్పీ దేవరాజ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
బీదర్ ఎక్స్ప్రెస్లో చోరీ
అనంతపురం టౌన్: బీదర్ ఎక్స్ప్రెస్లో చోరీ జరిగింది. ప్రయాణికులు త్వరగా అప్రమత్తం కావడంతో దొంగలు చైన్లాగి పారిపోయారు. అనంతపురం మండలం తాటిచెర్ల రైల్వేస్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. బీదర్ నుంచి యశ్వంత్పూర్ వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు బుధవారం తెల్లవారుజామున వస్తోంది. 3.40 గంటలకు తాటిచెర్ల రైల్వేస్టేషన్ దాటుతుందన్న సమయంలో రాయచోటికి చెందిన నారాయణ తన జేబులోని రూ.22వేల నగదు కనిపించకపోవడంతో ‘దొంగలు జేబును కత్తిరించేశారం’టూ గట్టిగా కేకలు వేశాడు. అంతవరకూ ప్రయాణికుల మధ్యే కలిసిపోయిన దొంగలు బోగిలోంచి చైన్లాగి ఒక్క ఉదుటున బయటకు పరుగులు తీశారు. స్టేషన్ ప్లాట్ఫాంపై విధుల్లో ఉన్న రైల్వే పోలీసులు వెంబడించారు. అయితే ట్రాక్పక్కనే ఉన్న ముళ్లపొదల్లో దాక్కున్న దొంగలు రాళ్లను పోలీసులపైకి రువ్వారు. పోలీసులు ఫైరింగ్ చేసినప్పటికీ ఆగకుండా మరోసారి రాళ్లు రువ్వి దుంగలు ఉడాయించారు. ఈ ఘటన నేపథ్యంలో బీదర్ ఎక్స్ప్రెస్ అరగంటపాటు అక్కడే నిలిచింది. బాధితుడి ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది హైదరాబాద్ దొంగలపనే! రైల్వే ప్రయాణికుడి వద్ద నగదు చోరీ చేసిన ఇద్దరు దొంగలు హిందీలో మాట్లాడారని, వారి యాసను బట్టి హైదరాబాద్కు చెందిన దొంగలుగా రైల్వే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారు ప్రయాణికులను ఏమార్చి దొంగతనాలకు పాల్పడతారన్నారు. తాటిచెర్ల రైల్వేస్టేషన్ను పరిశీలించిన రైల్వే ఎస్పీ బీదర్ ఎక్స్ప్రెస్ రైల్లో చోరీ జరిగినట్లు సమాచారం అందుకున్న రైల్వే ఎస్పీ సుబ్బారావు, డీఎస్పీ పీఎన్బాబుతోపాటు సీఐ తబ్రేజ్లు బుధవారం ఉదయం తాటిచెర్ల రైల్వే స్టేషన్ ప్రాంతాన్ని పరిశీలించారు. రైలు ప్రయాణికులు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బందూక్ ఉఠావ్.. గాడీ చలావ్ అనంతపురం సెంట్రల్: పోలీసులు కాల్పులు జరిపినా తప్పించుకుని పారిపోయిన దొంగలను పట్టుకునేం దుకు రైల్వే సీఐ వినోద్కుమార్మీనా హుటాహుటిన తన (ఏపీ29ఏఆర్7744) పల్సర్ బైక్లో అనంతపురం నుంచి తాటిచెర్ల రైల్వేస్టేషన్కు బయల్దేరారు. సోములదొడ్డి సమీపంలో రోడ్డుపక్కన ఇద్దరు వ్యక్తులు ఆనుమానాస్పదంగా నిలబడి ఉండడంతో వారి వివరాలు ఆరా తీసేందుకు బైక్ నిలిపారు. ఎవరు మీరు? ఇక్కడెందుకు ఉన్నారని ప్రశ్నించారు. సదరు వ్యక్తులు హిందీలో మాట్లాడారు. తాము పోలీసులమని చెప్పడంతో.. ఐడెంటిటీ కార్డులు చూపించాలని సీఐ ఆదేశించారు. దీంతో ఆ ఇద్దరు వ్యక్తులు రెచ్చిపోయి ‘తూపాకీ తీసుకోరా.. కాల్చిపారేద్దాం’ అంటూ గద్దించడంతో సీఐ కాస్త వెనక్కు వెళ్లారు. అంతే పల్సర్ వాహనాన్ని తీసుకొని దుండగులు గుత్తివైపు ఉడాయించారు. జరిగిన ఘటనపై బాధిత సీఐ అనంతపురం రూరల్ సీఐ కృష్ణమోహన్కు ఫిర్యాదు చేశారు. -
సర్కారు సగమిస్తేనే..!
ఎనిమిది దశాబ్దాల కలకు.. ‘బంగారు తెలంగాణ’లోనూ మోక్షం కలగడం లేదు. బోధన్–బీదర్ రైల్వే లైన్ పొడిగింపు అడుగు ముందుకు పడట్లేదు. 1938లో నిజాం హయాంలో ప్రతిపాదించిన ఈ రైల్వే మార్గం.. ఇప్పటికీ పట్టాలెక్కలేదు. 2014లో సర్వే పూర్తయినా నిధుల కేటాయింపు లేక ‘లైన్ క్లియర్’ కావట్లేదు. ఈ ‘మార్గం’ సుగమం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తే, కేంద్రం కూడా ఆ మేరకు నిధులు ఇవ్వనుంది. అయితే, ఈసారి ప్రవేశపెట్టనున్న బడ్జెట్లోనైనా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందా..? దశాబ్దాల కల సాకారమవుతుందా? అన్న దానిపై ఆసక్తి నెలకొంది. బాన్సువాడ: అసంపూర్తిగా ఉన్న బోధన్ రైల్వే లైన్ను బీదర్ వరకు పొడిగిస్తే వెనుకబడిన ప్రాంతాలకు ఎంతో లబ్ధి చేకూరనుంది. ఆయా ప్రాంతాలకు రవాణా వసతులు పెరిగి అభివృద్ధి బాట పట్టే అవకాశముంది. అయితే, సర్కారు నిర్లక్ష్యం కారణంగా ఆయా ప్రాంతాలకు ఇప్పట్లో ‘రైలు బండి’ వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చట్లేదు. 201లో రూ.1,029 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ ప్రాజెక్టు.. జాప్యం కారణంగా ప్రస్తుత అంచనా వ్యయం రెట్టింపయింది. అయితే, మారిన నిబంధనల ప్రకారం ఈ రైల్వే లైన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టాల్సి ఉంది. ఈ లైన్ ప్రస్తుతం పట్టాలెక్కాలంటే సుమారు రూ.2 వేల కోట్ల వ్యయం కానుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం సగం కేటాయిస్తే, కేంద్రం సగం కేటాయించనుంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించని కారణంగా ఈ ‘మార్గానికి’ మోక్షం కలగట్లేదు. ఎనిమిది దశాబ్దాల కల.. బోధన్–బీదర్ రైల్వే లైన్ను పొడిగించేందుకు 1938లోనే నిజాం సర్కార్ హయాంలో ప్రతిపాదనలు చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష అయిన రైల్వే లైన్ నిర్మాణం కలగానే మారింది. బోధన్–బాన్సువాడ–బీదర్ ప్రాంత ప్రజల కోరిక మేరకు 2010లో అప్పటి రైల్వే మంత్రి మమతాబెనర్జీ ఈ మార్గానికి ‘లైన్ క్లీయర్’ చేశారు. దశాబ్దాల కల అయిన బోధన్–బీదర్ రైల్వే లైన్కు సర్వే కోసం పచ్చజెండా ఊపిన మమతా బెనర్జీ.. ఆదిలాబాద్–పటాన్చెరు మధ్య కొత్తగా మరో రైల్వే లైన్ కోసం సర్వే చేసేందుకు పచ్చ జెండా ఊపారు. దీంతో ఈ ప్రాంతం మీదుగా ఒకేసారి రెండు రైల్వే లైన్ల కోసం సర్వే చేయించేందుకు అనుమతి లభించడంతో అందరూ ఎంతో సంబర పడ్డారు. కానీ ఈ ప్రతిపాదనలు పట్టాలెక్కకుండానే కనుమరుగయ్యాయి. 2014లో సర్వే పూర్తి! 2010లో రైల్వే బడ్జెట్లో రెండు లైన్లకు లభించిన సర్వే అనుమతుల దృష్ట్యా సర్వే అయితే పూర్తి చేశారు. 138 కిలోమీటర్ల బోధన్–బీదర్ రైల్వే లైన్ కోసం 2011 ఏప్రిల్లో ప్రారంభమైన సర్వే 2014లో పూర్తయింది. బోధన్ నుంచి రుద్రూర్, వర్ని, నస్రుల్లాబాద్, బాన్సువాడ, పిట్లం మీదుగా నారాయణఖేడ్, బీదర్ వరకు వారు సర్వే నిర్వహించారు. సర్వే ప్రకారం మార్గమధ్యలో భారీ వంతెనలు లేవని తేలింది. కేవలం రూ.1,029 వ్యయంతో లైన్ వేయవచ్చని అధికారులు తేల్చారు. బాన్సువాడ–బోధన్ ప్రధాన రోడ్డుకు ఆవలి వైపు సుమారు 3 కిలోమీటర్ల వ్యత్యాసంలో సర్వే నిర్వహించి, హద్దు రాళ్లను పాతారు. ఈ మేరకు హద్దు రాళ్లు ఆయా పంట పొలాలు, అడవుల్లో ఇప్పటికీ ఉన్నాయి. దశల వారీగా నిర్వహించిన ఈ సర్వేలో మార్గ మధ్యలో వచ్చే నదులపై వంతెనలు, ఎత్తుపల్లాలు ఇతర అన్ని రకాల భౌగోళిక పరిస్థితులపై అంచనా వేసి రైల్వే శాఖ ఉన్నతాధికారులకు నివేదికను సమర్పించారు. నిధుల కేటాయింపుపై సందిగ్ధత 2014లో సర్వే పూర్తవడంతో ఏటా రైల్వే బడ్జెట్లో ఎంతో కొంత నిధులు మంజూరవుతాయని అంతా భావించారు. కానీ ఇప్పటివరకు మూడు బడ్జెట్లు పూర్తయినా పైసా కూడా మంజూరు కాలేదు. తెలంగాణలోని కొన్ని కొత్త మార్గాల్లో మెండుగా నిధులు కేటాయించిన కేంద్రం.. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న బోధన్–బీదర్ రైల్వే లైన్కు మొండి చేయి చూపింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తేనే ఈ లైన్ పట్టాలెక్కే అవకాశముంది. ఈ మార్గంలో సర్వే పూర్తయినందున రాష్ట్రప్రభుత్వం 50 శాతం నిధులు కేటాయిస్తే, మరో 50శాతం కేంద్రం కేటాయించనుంది. సుమారు రూ.2వేల కోట్ల అంచనా వ్యయం కాగా, ఇందులో 50శాతం నిధులను రాష్ట్రం కేటాయిస్తేనే కేంద్రం తన వాటా 50 శాతం నిధులు మంజూరు చేయనుం దని అధికారులు చెబుతున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం స్పందన కరువైంది. ఇప్పటివరకు ప్రవేశపెట్టిన బడ్జెట్లలో రూపా యి కూడా కేటాయించలేదు. త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లోనైనా నిధులు కేటాయిం చాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. 50 శాతం నిధులిస్తే.. బోధన్–బీదర్ రైలు మార్గానికి సర్వే పూర్త యింది. రూ.2వేల కోట్ల తో ఈ ప్రాజెక్టు చేపట్టా ల్సి ఉంది. మారిన నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం నిధులు కేటాయిస్తే 50 శాతం నిధులను కేంద్రం మంజూరు చేస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతోనే ప్రాజెక్టు ముందుకు సాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నిధుల కేటాయింపుపైనే ప్రాజెక్టు భవితవ్యం ఆధారపడి ఉంది. – బీబీ పాటిల్, జహీరాబాద్ ఎంపీ ♦ బోధన్–బీదర్ రైల్వేలైన్ ప్రతిపాదించింది 1938 నిజాం హయాంలో ♦ రైల్వే లైన్ పొడవు 138 కిలో మీటర్లు (తెలంగాణలో 90 కి.మీ., మహారాష్ట్ర, కర్ణాటకలో 48 కి.మీ.) ♦ లబ్ధి పొందే జిల్లాలు నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, బీదర్ ♦ సర్వే పూర్తయినది 2014లో ♦ అప్పట్లో అంచనా వ్యయం రూ.1,029 కోట్లు ♦ ప్రస్తుత అంచనా రూ.2 వేల కోట్లు -
కూతురిని వ్యభిచార ముఠాకు..
కూతురిని విక్రయించడానికి ప్రియునితో కలిసి తల్లి కుట్ర చాకచక్యంగా తప్పించుకున్న బాలిక పోలీసుల అదుపులో నిందితులు కూతురిని కంటికి రెప్పలా పెంచి, ఉజ్వల భవితను ఇవ్వాల్సిన తల్లి, తప్పుదారిని ఎంచుకుంది. విలాసాలు, డబ్బుల కోసం కూతురినే వ్యభిచార ముఠాకు అమ్మడానికీ వెనుకాడలేదు. మానవతా విలువలను ప్రశ్నించే ఈ సంఘటన బీదర్ నగరంలో వెలుగుచూసింది. బెంగళూరు (బీదర్): డబ్బుల కోసం తనను వేశ్యవాటికకు విక్రయించడానికి ప్రయత్నించిన తల్లిని, ఆమె ప్రియుడిని ఒక బాలిక చాకచక్యంగా పోలీసులకు పట్టించిన ఘటన బీదర్లో గురువారం వెలుగు చూసింది. బీదర్ పట్టణంలోని కాలేజీలో చదువుతున్న బాలిక (17), తల్లి, చెల్లెళ్లలతో కలసి శివార్లలోని ఓ లేఅవుట్లో ఉంటున్నారు. కొద్దికాలం క్రితం ఆ మహిళ ప్రవర్తనతో విసిగి భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో అదే ప్రాంతానికి చెందిన ఖాజామియా అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుంది. అప్పటి నుంచి ఖాజామియా ప్రతిరోజు వారింటికి వస్తూ బాలికను, ఆమె చెల్లెళ్లను దూషిస్తూ హింసించేవాడు. ఈ క్రమంలో డబ్బుపై మోజుతో ఇద్దరూ కలిసి బాలికను విక్రయించాలని కుట్ర పన్నారు. రాజస్థాన్ నుంచి పెళ్లి సంబంధం వచ్చిందని, వెంటనే దుస్తులు మార్చుకొని ప్రయాణానికి సిద్ధం కావాలంటూ బుధవారం కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన బాలికను ఒత్తిడి చేశారు. కొద్దిసేపటికి ఖాజామియా బాలికను తీసుకువస్తున్నామని, వెంటనే తన బ్యాంకు ఖాతాలోకి రూ. 2 లక్షలు జమ చేయాలంటూ ఫోన్లో వేరే వ్యక్తులతో మాట్లాడడాన్ని పసిగట్టిన బాలిక తనను వేశ్యవాటికకు విక్రయిస్తున్నట్లు తెలుసుకుంది. దీంతో కిటికీ నుంచి పక్కింటి వాళ్లకి విషయాన్ని తెలపడంతో వారు బాలిక బంధువులకు సమాచారమిచ్చారు. వెంటనే వారు బీదర్ గ్రామీణ పోలీసులకు తెలిపి, అందరూ కలిసి బాలిక ఇంటికి వచ్చి ఆమెను రక్షించారు. బాలిక ఫిర్యాదు మేరకు తల్లి, ఆమె ప్రియుడు ఖాజామియాలను అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ ప్రకాశ్ అమృత్ నికమ్ స్పందిస్తూ సమాచారం అందిన వెంటనే బీదర్ గ్రామీణ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని బాలికను రక్షించారని చెప్పారు. తన తల్లి రమా, ఆమె ప్రియునితో కలిసి వేశ్యవాటికకు విక్రయించడానికి ప్రయత్నించందని బాలిక ఫిర్యాదు చేయడంతో ఇద్దరిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
లక్షన్నర కోళ్లను చంపేశారు
చికెన్ కొనుగోలును నిలిపివేసిన మైసూరు జూ అధికారులు కొన్ని జాగ్రత్తలతో బర్డ్ఫ్లూ దూరం : నిపుణులు బెంగళూరు : రాష్ట్రంలో బర్డ్ఫ్లూ నివారణా చర్యలు యుద్ధ ప్రతిపాదికన సాగుతున్నాయి. అందులో భాగంగా బర్డ్ఫ్లూ సోకిన పక్షులను నిపుణులు బృందం వైజ్ఞానికంగా సంహరిస్తోంది. రాష్ట్రంలోని బీదర్ జిల్లా హొమ్నాబాద్ తాలూకా మార్కెర గ్రామంలో బర్డ్ఫ్లూతో 20 వేల కోళ్లు చనిపోగా అక్కడే వివిధ కోళ్ల ఫారంలలో ఉన్న మరో 1.50 లక్షల కోళ్లను చంపడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పశుసంవర్థకశాఖ అధికారులు 50 బృందాలను ఏర్పాటు చేసి బర్డ్ఫ్లూ సోకిన కోళ్లను మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ చంపేశారు. ఇందు కోసం నాలుగు వేల సంచులను సిద్ధం చేసుకుని 200 గుంతలను తవ్వారు. ఒక్కొక్క సంచిలో నలభై నుంచి యాభై కోళ్లను వేసి అటుపై గుంతల్లో వేసి మట్టితో కప్పేశారు. ఈ పనిలో నిమగ్నమైన వారికి మాస్క్లు, ప్రత్యేక దుస్తులను అందజేశారు. కాగా, పక్షలను వైజ్ఞానికంగా చంపే కార్యక్రమం సోమవారమే జరగాల్సి ఉండగా వర్షం వ ల్ల ఈ పనిని మంగళవారానికి వాయిదా వేయాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా బర్డ్ఫ్లూ విషయమై ప్రభుత్వం హై అలర్ట్ జారీ చేయడంతో రాష్ట్రంలోని వివిధ జూ సిబ్బంది అక్కడి జంతువులకు కోళ్లను ఆహారంగా వేయడాన్ని నిలిపివేశాయి. అంతేకాకుండా పక్షులు ఉన్న ఎన్క్లోజర్స్ను పూర్తిగా శుభ్రం చేసి వాటి శ్యాంపిల్స్ను కూడా పరీక్ష కోసం లాబొరేటరీలకు పంపించారు. ఈ విషయమై మైసూరు జూ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎస్.వెంకటేషన్ మాట్లాడుతూ...‘మా జూలో బర్డ్ఫ్లూ సోకిన దాఖలాలు ఏవీ కనబడలేదు. అయినా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా చికెన్ కొనుగోలును నిలిపివేశాం.’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పక్షుల ద్వారా మనుషులకు కూడా బర్డ్ఫ్లూ (ఏవీఎన్ ఇన్ఫ్లూఎంజా-ఎచ్5ఎన్1) వ్యాధి సోకే అవకాశం ఉంది. దీంతో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చునని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకూ రాష్ట్రంలో ప్రజలకు ఎవరికీ కూడా బర్డ్ఫ్లూ సోసిన దాఖలాలు లేవు. కాగా, బర్డ్ఫ్లూ సోకిన వారికి ప్రస్తుతం ఓసల్టామీవీర్ (టామీఫ్లూ) మందును అందజేస్తున్నారు. దీంతో పాటు జనామీవీర్ను కూడా కొన్నిచోట్ల బర్డ్ఫ్లూ వ్యాధి చికిత్సలో అందజేయవచ్చు. పక్షుల్లో బర్డ్ఫ్లూ లక్షణాలు ఇవి.. అకస్మాత్తుగా పెద్ద సంఖ్యలో పక్షులు చనిపోవడం పక్షుల్లో విసర్జక పదార్థాలు సాధారణం కంటే నీళ్లగా ఉండడం పక్షుల కాళ్లు, ముక్కు ఊదా రంగులోకి మారి పోవడం పక్షుల గుడ్డు పెంకులు పెలుసుగా మారిపోవడం పక్షులు ఆహారాన్ని తీసుకోవపోవడం కనురెప్పలు, తల, కాళ్ల గోళ్లు ఉబ్బిపోవడం ముక్కుల నుంచి నీరు కారడం మనుషుల్లో బర్డ్ఫ్లూ లక్షణాలు ఇవి... శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది, దగ్గు, ముక్కు నుంచి నీరు కారడం స్వల్ప పరిమాణంలో శరీర ఉష్ణోగ్రత పెరగడం చాలా కొంతమందిలో శరీరంపై దద్దుర్లు కూడా వస్తాయి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి... బర్డ్ఫ్లూ ఉన్న పరిసర ప్రాంతాల్లో కోడి మాంసంతో పాటు గుడ్డును పూర్తిగా ఉండికించిన తర్వాతనే తినాలి హాఫ్ బాయిల్డ్, స్మోక్డ్ చికెన్లను తినకపోవడం మంచిది కోళ్లను ముట్టుకున్న తర్వాత చేతిని సోపుతో శుభ్రపరుచుకోవాలి కోళ్ల వ్యర్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ చేతితో తాకకూడదు -
ఆ పని చేసింది అతని రెండో భార్యే
బీదర్లో సెకండ్ హ్యాండ్ వాహనాల కొనుగోలు ‘ట్రాన్స్పోర్టర్’ ద్వారా నగరానికి తరలింపు ఫైవ్ స్టార్ హోటల్ను తలపించే టకీ ఇల్లు సిటీబ్యూరో: సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) పోలీ సులు మంగళవారం అరెస్టు చేసిన అంతర్రాష్ట్ర నేరగాడు టకీ అలీకి నైతిక మద్దతు ఇస్తున్నది అతడి రెండో భార్యేనని పోలీ సులు చెప్తున్నారు. కర్ణాటకలోని బీదర్కు చెందిన టకీ.. ముఠా ఏర్పాటు చేసి ఓ పక్క చైన్స్నాచింగ్స్, మరోపక్క సూడో పోలీసు నేరాలతో దేశ వ్యాప్తంగా ఏడు నగరాల్లో హల్చల్ చేస్తుంటాడని తెలిపారు. బీదర్లోని ఇరానీ గల్లీలో ఉన్న హుస్సేనీ కాలనీకి చెందిన టకీ అలీ మహారాష్ట్రకు చెందిన యువతిని మొదట వివాహం చేసుకున్నాడు. ఇతడి వ్యవహారశైలి తెలి సిన ఆమె విడాకులు తీసుకుని ముంబైలో స్థిరపడింది. దీంతో టకీ తమ ప్రాంతానికే చెందిన షకైనా అలి యాస్ లాలను రెండో పెళ్లి చేసుకున్నాడు. పోలీసుల వేట నుంచి తప్పించుకోవడానికి ఉత్తప్రదేశ్లోని లక్నోతో పాటు ఢిల్లీ, అజ్మీర్, భోపాల్ల్లోనూషెల్టర్లు ఏర్పాటు చేసుకున్నాడు. ‘ట్రాన్స్పోర్టర్ల’ ద్వారా వాహనాలు... నిఘా కంట్లో పడకుండా ఉండటానికి తరచు మకాంతో పాటు సెల్ఫోన్లు, సిమ్కార్డులు మార్చేటకీ... ఫోన్ ద్వారా కేవలం తన భార్య లాలతో మాత్రమే సంప్రదింపులు జరుపుతాడు. ప్రతి నెల రోజులకు, అనుమానం వస్తే తక్షణం వీరిద్ద రూ తమ ఫోన్లు, సిమ్లను ధ్వంసం చేసి, కొత్తవి వినియోగిస్తారు. టకీ ఓ ప్రాంతాన్ని టార్గెట్ చేశాక ఆ విషయంతో పాటు ఏ రోజు నుంచి పంజా విసరాలనేది ఫోన్ ద్వారా భార్యకు చెప్తాడు. ఆమె ఇరానీ గల్లీలో ఉండే అలీ అనుచరుల్ని అప్రమత్తం చేస్తుంది. బీదర్లోని సెకండ్ హ్యాండ్ మార్కెట్ నుంచి పల్సర్, కరిజ్మా వంటి హైస్పీడ్ వాహనాలను ఖరీదు చేస్తుంది. వీటిని టకీ చెప్పిన ప్రాంతానికి తీసుకెళ్లడానికి స్థానికుల్ని ట్రాన్స్పోర్టర్స్గా వాడుకుంటుంది. టకీకి వాహనాలను అప్పగించి వచ్చినందుకు ఈ ‘ట్రాన్స్పోర్టర్స్’కు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు చెల్లిస్తుంది. నాలుగైదు రోజులు... 20-50 తులాలు... టకీ విమానంలో ఆ ప్రాంతానికి చేరుకోగా... మిగిలిన గ్యాం గ్ మెంబర్స్ బస్సు, రైళ్లల్లో వస్తారు. అంతా కలిసి లాడ్జీలు, చిన్న హోటల్స్లో షెల్టర్ తీసుకుంటారు. లాల పంపిన ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ వరుసపెట్టి చైన్స్నాచింగ్స్, అటెన్షన్ డైవర్షన్లు చేస్తారు. ఓ ప్రాంతంలో కేవలం నాలుగైదు రోజుల మాత్రమే ఉండి ‘పని’ చేసే టకీ గ్యాంగ్ కనిష్టంగా 20 తులాలు, గరిష్టంగా 50 తులాల బంగారం తస్కరిస్తుంది. ఈ సొత్తులో తన వాటా తీసుకుని టకీ విమానంలో ఎగిరిపోగా... మిగతా వారు ద్విచక్ర వాహనాలను అక్కడి బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలోని పార్కింగ్స్లో పెట్టి బీదర్ వచ్చేస్తారు. మరోసారి అదే ప్రాంతానికి వెళ్లినప్పుడు పార్కింగ్స్లోని వాహనాలను తీసుకుని పంజా విసురుతారు. ఒక్కరోజులో కనీసం ఆరు నేరాలు చేస్తారు. అవాక్కైన బెంగళూరు సీసీబీ కాప్స్... కర్ణాటకలోని బెంగళూరులో మధ్య వయస్కులైన మహిళల్ని టార్గెట్గా చేసుకుని, అటెన్షన్ డైవర్షన్లతో రెచ్చిపోయిన టకీ అలీ గ్యాంగ్ అక్కడి పోలీసులకు ముచ్చెమటలు పట్టించింది. 2011లో హుస్సేనీకాలనీకి చెందిన 26 మందితో ముఠా కట్టిన టకీ బెంగళూరులో 55 నేరాలు చేశాడు/చేయించాడు. రంగంలోకి దిగిన అక్కడి సీసీబీ పోలీసులు ఎట్టకేలకు 2012 ఫిబ్రవరిలో వీరిని పట్టుకుని రూ.65 లక్షల సొత్తు రికవరీ చేశారు. 26 మందితో ఎనిమిది గ్యాంగులు ఏర్పాటు చేసిన టకీ సీబీఐ, సీఐడీ అధికారులమంటూ మహిళలకు జాగ్రత్తలు చెప్తూ, వారి నుంచి బంగారం కాజేసే విధానం తెలుసుకుని సీసీబీ అధికారులు అవాక్కయ్యారట. అత్యంత విలాసవంత జీవితం... గ్యాంగ్ లీడర్ టకీ అలీతో పాటు అతడి భార్యదీ విలాసవంతమైన జీవితమే. హుస్సేనీకాలనీలో లాల నివసించే ఇంటితో పాటు లక్నోలో టకీ ఖరీదు చేసిన ఇల్లూ అణువణువూ సెంట్రల్ ఏసీతో ఉంటుందని చెప్తున్నారు. ఫైవ్స్టార్ హోటళ్లను తలపించేలా ఇంటి లోపలి డెకరేషన్ ఉంటుం దట. వీరు ఎక్కడకు వెళ్లినా విమానాల్లోనే తిరుగుతారని, బస చేసేది కూడా ఖరీదైన హోటళ్లలోనేనని పోలీసులంటున్నారు. టకీ గ్యాంగ్ కోసం సైబరాబాద్ పోలీసులు ఈ ఏడా ది అక్టోబర్ 7న ఆపరేషన్ ప్రారంభించారు. లక్నో నుంచి ఢిల్లీకి, అక్కడ నుంచి అజ్మీర్కు టకీ పారిపోతూ తప్పించుకోగా... సల్మాన్ బీదర్ నుంచి ఒడిశా, అట్నుంచి రాజస్థాన్ సర్వర్ ప్రాంతానికి జారుకున్నాడు. ఇక సలాల్ మధ్యప్రదేశ్లోని భోపాల్ పారిపోయాడు. 75 రోజుల ముమ్మర వేట తరవాత పోలీసులు వీరిని పట్టుకోగలిగారు. -
బీదర్ టు సిటీ
- బాకర్.. డేంజర్ స్నాచర్! - రెండున్నరేళ్లలో 102 స్నాచింగ్లు - టాస్క్ఫోర్స్కు చిక్కిన ఇరానీ గ్యాంగ్ లీడర్ - రూ.కోటి విలువైన 3.46 కిలోల బంగారం స్వాధీనం ఓ సినిమాలో కమెడియన్ అలీ ప్రతి రోజూ బైకుపై ఇసుక తీసుకుని బీదర్కు వెళ్లడం..చెక్పోస్టు వద్ద పోలీసులు అతన్ని చెక్ చేసినా ఏమీ దొరక్క పోవడం, చివరకు అతను నడిపే బైకులే చోరీ బైకులని తేలడం తెలిసిందే. కరుడుగట్టిన ఇరానీ గ్యాంగ్ లీడర్ బాకర్ సైతం బైకుపైనే బీదర్ నుంచి సిటీకి వస్తూ.. ఒకేరోజు నాలుగైదు స్నాచింగ్లకు పాల్పడుతూ.. చోరీ సొత్తుతో దర్జాగా తిరిగి బీదర్కు చెక్కేస్తూ రెండున్నరేళ్లుగా పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. నగరంలో 102 స్నాచింగ్లకు పాల్పడి రూ.కోటి విలువైన 3.46 కిలోల బంగారు ఆభరణాలను కొల్లగొట్టిన డేంజర్ స్నాచర్బాకర్ను ఎట్టకేలకు టాస్క్ఫోర్స్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. సాక్షి, సిటీబ్యూరో: బీదర్లో ఉంటూ హైదరాబాద్లో వందకుపైగా స్నాచింగ్లకు పాల్పడిన కరుడు గట్టిన ఇరానీ గ్యాంగ్ లీడర్ బాకర్ ఎట్టకేలకు నగర టాస్క్ఫోర్స్ పోలీసులకు చిక్కాడు. రెండున్నరేళ్ల నుంచి హైదరాబాద్, సైబరాబాద్, మెదక్ పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన ఇతగాడు..102 స్నాచింగ్లకు పాల్పడి రూ.కోటి విలువైన 3.46 కిలోల బంగారు ఆభరణాలను కొల్లగొట్టాడు. నిందితుడితో పాటు చోరీ సొత్తు కుదువబెట్టుకున్న నగల తయారీ దారుడిని సైతం టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ కోటిరెడ్డి అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ఐదుగురి కోసం గాలిస్తున్నారు. వీరి నుంచి మొత్తం సొత్తును రికవరీ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం బషీర్బాగ్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి వివరించారు. కర్ణాటకలోని బీదర్జిల్లా ఇరానీ కాలనీకి చెందిన బాబర్ అలియాస్ బాకర్..అక్రమ్ అలీ అలియాస్ బాకర్ (32)..కుటుంబ అవసరాలకు సంపాదన సరిపోకపోవడంతో 20వ ఏట నుంచే నేరాల బాట పట్టాడు. రాత్రి పూట ఇళ్లలో దొంగతనాలు చేయడం, ఒంటరిగా వెళ్తున్న మహిళను టార్గెట్ చేసుకుని స్నాచింగ్కు పాల్పడడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. చీటింగ్ కేసులో ముంబాయి పోలీసులకు చిక్కి జైలు కెళ్లిన బాకర్ 2011 డిసెంబర్లో బెయిల్పై విడుదలయ్యాడు. బీదర్ నుంచి బైక్పైనే... స్నాచింగ్లు చేసేందుకు బీదర్ నుంచి హైదరాబాద్కు బాకర్ తన బైక్పైనే వచ్చేవాడు. బైక్ వెంటన ఎవరైనా తన స్నేహితుడిని తీసుకువచ్చేవాడు. ఒకే రోజు నాలుగైదు స్నాచింగ్లు చేసి వెంటనే అదే రోజు తిరిగి బైక్పై బీదర్ చేరకుంటాడు. అయితే ఎలాంటి క్లూస్ పోలీసులకు దొరక్కుండా జాగ్రత్తపడేవాడు. బీదర్కు చెందిన స్నేహితుల సహకారం మాత్రమే తీసుకునేవాడు. ఒక్కోసారి ఒక్కో స్నేహితుడ్ని వెంట బెంటుకుని వచ్చేవాడు. ఒక్కోసారి అతడు ఒక్కడే బైక్ను నడిపిస్తూ కూడా స్నాచింగ్లకు పాల్పడ్డాడు. పట్టించిన హెడ్కానిస్టేబుల్... టాస్క్ఫోర్స్ ఈస్ట్జోన్ బృందంలో విధులు నిర్వహిస్తున్న హెడ్కానిస్టేబుల్ పి.వెంకటస్వామి, కానిస్టేబుళ్లు మహ్మద్ మోబినుద్దీన్, జి.సురేష్లు ఇచ్చిన అత్యంత విలువైన సమాచారం మేరకు అదనపు డీసీపీ కోటిరెడ్డి, ఇన్స్పెక్టర్ సీహెచ్.శ్రీధర్లు వలపన్ని బాకర్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో హైదరాబాద్లో 70, సైబరాబాద్లో 26, మెదక్లో ఆరు స్నాచింగ్లకు పాల్పడినట్లు వెల్లడించాడు. ఇతని నుంచి రూ.కోటి విలువైన 3.46 బంగారు ఆభరణాలతో పాటు కెటీఎం బైక్, కత్తి స్వాధీనం చేసుకున్నారు. ఇతనిచ్చిన చోరీ సొత్తును కుదువబెట్టుకున్న నగల తయారీ దారుడైన నాందేండ్కు చెందిన కె.రామ్ప్రసాద్ (27)ని సైతం అరెస్టు చేశారు. 102 కేసులలో బాకర్తో కలిసి స్నాచింగ్కు పాల్పడిన బీదర్, మహరాష్ట్రలకు చెందిన అతని అనుచరులు ఫిదాఅలీ (28), అసదుల్లా అబు ఇరానీ (30), ఇక్బాల్ (30), అషిక్ హుస్సేన్ (38), ఆర్.మల్లిఖార్జున్ (33)లు పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మీడియా సమావేశంలో అదనపు సీపీ అంజనీకుమార్, జాయింట్ సీపీ వై.నాగిరెడ్డి, టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ కోటిరెడ్డి, ఇన్స్పెక్టర్ సీహెచ్.శ్రీధర్, ఎస్ఐలు ఎ.సుధాకర్, ఎస్.శేఖర్రెడ్డి, ఎ.రవికుమార్.జి.రాజులు పాల్గొన్నారు. ఈ కేసు చేధించడంలో కీలక పాత్ర పోషించిన వెంకటస్వామి, మోబినుద్దీన్, సురేష్లను కమిషనర్ మహేందర్రెడ్డి అభినందించి వారికి రివార్డులు అందజేశారు. విదేశీయుడిపై పీడీయాక్ట్: మహేందర్రెడ్డి, పోలీసు కమిషనర్ డ్రగ్స్ సరఫరా చేస్తూ...పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చి, తిరిగి డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్కు చెందిన ఓలుసోల కెహిన్దె అలియాస్ సోల (30)పై జూబ్లీహిల్స్ పోలీసులు పీడీయాక్ట్ ప్రయోగించి జైలుకు పంపించారని కమిషనర్ మహేందర్రెడ్డి వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నగరంలో నేరాలు చేసే బాకర్ వంటి వారిపై కూడా పీడీయాక్ట్ ప్రయోగిస్తామన్నారు. -
బస్సు, కారు ఢీ : ముగ్గురికి తీవ్ర గాయాలు
మునిపల్లి : మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ బస్సు, కారు డీ కొన్న సంఘటన మండలంలోని కంకోల్ శివారు 65వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. బీదర్కు చెందిన సంగమేశ్వర్, ఖలీల్హైమద్, శివానంద్లు కారులో హైదరాబాద్ నుంచి బీదర్కు వస్తున్నారు. అయితే వీరు ప్రయాణిస్తున్న వాహనం కంకోల్ శివారులోకి రాగానే జహీరాబాద్ నుంచి హైదరాబాద్ వెళుతున్న మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్తో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో సదాశివపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఉండడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బుదేరా ఎస్ఐ అశోక్ తెలిపారు. -
గజగజ...
= గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు = గతంలో కనిష్ట ఉష్ణోగ్రత 8.4 డిగ్రీల సెల్సియస్ = ప్రస్తుతం ‘బెల్గాం’లో 5.9 డిగ్రీలుగా నమోదు 1970 నాటి రికార్డు బద్దలు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో చలి విశ్వ రూపం దాల్చుతోంది. గత రికార్డులను బద్ధలు కొడుతూ కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. బెల్గాం జిల్లాలో ఈ నెల 11న కనిష్ట ఉష్ణోగ్రత 5.9 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. 1970లో నమోదైన 8.4 డిగ్రీలే ఇప్పటి వరకు కనిష్ట ఉష్ణోగ్రతగా రికార్డుగా ఉంది. బీదర్లో ఈ నెల 13న ఆరు డిగ్రీల సెల్సియస్గా (1936లో 10) నమోదైంది. తుమకూరులో ఈ నెల 11న 8.7 (1981లో 10.4), చిత్రదుర్గలో 8.2 (1945లో 8.3), బళ్లారిలో 9.7 (1926లో 10.6), రాయచూరులో 9.7 (1945లో 10), గదగలో 8.7 (1925లో 10), శివమొగ్గలో 7.2 (1966లో 7.4), చిక్కమగళూరులో 9 (1975లో 11), దక్షిణ కన్నడలో 16.2 (1950లో 16.7), ఉత్తర కన్నడలో 9.5 (1966లో 15.6)గా నమోదయ్యాయి. బెంగళూరులో ఈ నెల 10న 10.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. అయితే 1883లో అతి తక్కువగా 8.9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. -
బోధన్-బీదర్ రైలు వచ్చేనా!
బాన్సువాడ, న్యూస్లైన్ : రెండేళ్ల క్రితమే ‘బోధన్-బీదర్’ రైల్వే లైన్ సర్వే పూర్తయింది. బోధన్ నుంచి రుద్రూర్, వర్ని, నస్రుల్లాబాద్, బాన్సువాడ, పిట్లం మీదుగా బీదర్ వరకు రైల్వేలైన్ నిర్మాణానికి సర్వే నిర్వహించి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించారు. బోధన్ నుంచి బీదర్కు 163 కిలోమీటర్ల దూరం ఉండగా, జిల్లాలో ఈ మార్గం సుమారు 55 కిలోమీటర్లు ఉంటుంది. 2010 మార్చి బడ్జెట్లో ఈ సర్వే కోసం అప్పటి రైల్వే మంత్రి మమ తా బెనర్జీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2011 జూన్ తొమ్మిదిన దక్షిణ మధ్య రైల్వే ముఖ్య కార్యనిర్వహణ అధికా రి సర్వే నిమిత్తం రూ. 10 లక్షల విలువ చేసే టెండర్ల ను ఖరారు చేశారు. తర్వాత ఎనిమిది నెలలలోనే సర్వే పూర్తయింది. బాన్సువాడ-బోధన్ ప్రధాన రహదారికి సుమారు మూడు కిలోమీటర్ల వ్యత్యాసంలో సర్వే నిర్వహించి, హద్దు రాళ్లను పాతారు. దశలవారీగా నిర్వహించిన ఈ సర్వేలో మార్గమధ్యంలో వచ్చే నదులపై వంతెనలు, ఎత్తుపల్లాలు ఇతర అన్ని రకాల భౌగోళిక పరిస్థితులను అంచనా వేశారు. కొల్లూరు వాగుకు కూతవేటు దూరంలోనే సౌత్ సెంట్రల్ రైల్వే పేరిట రాళ్లు పాతారు. ఐదు దశాబ్దాల డిమాండ్ బోధన్-బీదర్ రైల్వేలైన్ ఏర్పాటు డిమాండ్ సుమారు ఐదు దశాబ్దాలుగా ఉంది. 1964లోనే దీని కోసం అప్పటి ప్రజాప్రతినిధులు ప్రతిపాదనలు చేశారు. 2003లో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయ మరోమారు ఈ రైల్వే లైన్ గురించి ప్రతిపాదన చేశారు. సర్వే కోసం నిధులు మంజూరు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. లోక్సభ ఎన్నికలలు జరిగిన ప్రతిసారీ అభ్యర్థులు ఈ రైల్వేలైన్నే ప్రధాన హామీగా ఇస్తున్నారు. 2004 ఎన్నికలలో ఇదే హామీ ఇచ్చిన మధుయాష్కీగౌడ్ ఎంపీగా గెలిచిన తర్వాత పట్టించుకోలేదన్న విమర్శలు వచ్చాయి. నియోజకవర్గా ల పునర్విభజనలో భాగంగా బాన్సువాడ, జుక్కల్తోపాటు ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాలు జహీరాబాద్ లోక్సభ సెగ్మెంట్లో కలపడంతో, ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున గెలుపొందిన సురేష్ షెట్కార్ ఈ రైల్వేలైన్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేశారు. దీంతో 2010-11 రైల్వే బడ్జెట్లో మమతా బెనర్జీ సర్వేకు అనుమతించారు. రైల్వే లైన్తో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి బోధన్-బీదర్ రైల్వే మార్గం ఏర్పడితే దశాబ్దాలుగా వెనుకబడిన ప్రాంతాలు వ్యా పార, వాణిజ్య రంగాలలో అభివృద్ధి చెందుతాయి. జాన్కంపేట నుంచి బోధన్ వ రకే ఉన్న ఈ రైలు మార్గాన్ని బీదర్ వరకు పొడిగిస్తే బోధన్తో పాటు మార్గమధ్యం లో ఉన్న రుద్రూర్, వర్ని, బాన్సువాడ, పిట్లం, నారాయణఖేడ్ ద్వారా బీదర్ వర కు గల ప్రాంతాలకు మేలు జరుగుతుంది. కర్ణాటక ప్రజలతో సంబంధాలు వృద్ధి చెందుతాయి. బోధన్ రైల్వేలైన్ బిజీగా మారుతుంది. బోధన్-బాన్సువాడ-ని జాంసాగర్- జోగిపేట-సంగారెడ్డి మీదుగా చేగుంట వరకు రైల్వే లైన్ ఏర్పాటు చే యాలనే డిమాండ్ కూడా ఉంది. సికింద్రాబాద్-నిజామాబాద్ లైన్కు ఇది ప్రత్యామ్నాయంగా మారుతుంది. తెలంగాణ రాష్ట్రంలోనే నిధులు నేను చేసిన కృషితోనే బోధన్-బీదర్ రైల్వేలైన్ సర్వే పూర్తయింది. కేంద్రం తదుపరి నిధులు కేటాయించాలంటే, రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం నిధులు ఇవ్వాలి.ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి తెలంగాణకు ఎలాంటి నిధులు ఇవ్వడం లేదు. త్వరలో ఏర్పడే తెలంగాణ రాష్ట్రం లోనే 50 శాతం నిధులు కేటాయించే అవకాశాలున్నాయి. అప్పుడే పనులు ప్రారంభమవుతాయి. -సురేష్ షెట్కార్, ఎంపీ, జహీరాబాద్ -
ఆర్టీఏ చెక్పోస్టుపై ఏసీబీ దాడులు
జహీరాబాద్ టౌన్, న్యూస్లైన్ : పట్టణం సమీపంలో బీదర్ చౌరస్తా వద్ద గల ఆర్టీఏ చెక్ పోస్టుపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. మంగళవారం రాత్రి 11 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు చెక్ పోస్టులో సోదాలు నిర్వహించి అదనంగా ఉన్న రూ. 81 వేలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని బుధవారం మెదక్, నిజామాబాద్ జిల్లాల అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీఎస్పీ సంజీవ్రావ్ విలేకరులకు వివరించారు. ఆర్టీఏ రమేష్ బాబు బీదర్ చౌరస్తాలో గల చెక్ పోస్టులో ఇద్దరు ప్రైవేటు ఏజెంట్లను పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నాడని తమకు సమాచారం అందిందన్నారు. దీంతో తాము మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించామన్నారు. ఈ సమయంలో రమేష్ బాబుతో పాటు ఆయన నియమించుకున్న ఇద్దరు ఏజెంట్లు పాషా, రహమాన్లు కూడా చెక్పోస్టులో ఉన్నారన్నారు. వీరి నుంచి రూ.60 వేలు, ఏ లెక్కా లేని మరో రూ. 21 వేలు మొత్తం రూ.81 వేలును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చెక్పోస్టులోనే మరో 91,300 వేలు లభించగా.. అవి ప్రభుత్వానికి సంబంధించినవిగా గుర్తించినట్లు వివరించారు. అధికారి ఇంట్లో సోదాలు చేయగా రూ.13 వేలు దొరికాయని, ఆ డబ్బులు తన జీతానికి సంబంధించినవిగా రమేష్ బాబు పేర్కొన్నారని ఆయన చెప్పారు. ప్రైవేట్ వ్యక్తులను నియమించుకుని అక్రమాలకు పాల్పడుతున్న రమేష్బాబుతో పాటు విధుల్లో ఉండాల్సిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు రవీందర్రెడ్డి, జయప్రకాష్రెడ్డిలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఎవరైనా అధికారులు అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతుంటే 94404 46155 కు సమాచారం అందిస్తే తక్షణమే స్పందిస్తామన్నారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు కే శ్రీనివాస్ రెడ్డి, రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు. -
8వ తరగతి విద్యార్థిని కిడ్నాప్.. లైంగిక దాడి
కంగ్టి : ఓ బాలికను కిడ్నాప్ చేసి, లైంగిక దాడికి పాల్పడిన సంఘటన మెదక్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కంగ్టి మండలం నాగూర్(బి) లో ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... నాగూర్(బి) గ్రామానికి చెంది న ఓ బాలిక(14) ఎనిమిదో తరగతి చదువుతోంది. అదే పాఠశాలకు చెందిన హెచ్ఎం అంబాజీ, స్థానికులైన సంజీవ్, రవి అనే వ్యక్తులు ఈ నెల 8న పూజ అనే అమ్మాయి వెంట బాలికను బీదర్కు బలవంతంగా పంపారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించడంతో ఆ బాలిక ఇంట్లో చెప్పకుండా బీదర్ వెళ్లింది. అదే రోజు రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరు వచ్చి మత్తు మందు ఇవ్వడంతో ఆ బాలిక స్పృహ కోల్పోయింది. దాంతో వారు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇలా ఆ బాలికను వారంపాటు బీదర్లో రహస్యంగా ఉంచారు. ఈనెల 11న ఉదయం సదరు ఇద్దరు వ్యక్తులు ఆ బాలికను బీదర్ రైల్వే స్టేషన్ సమీపంలో వదిలి వెళ్లారు. అక్కడ బాలికకు తన గ్రామానికి చెందిన వారు కలవడంతో వారి సహకారంతో అదే రోజు రాత్రికి ఇంటికి చేరుకుంది. నాలుగు రోజులుగా తమ కూతురు కన్పించకపోవడంతో ఆమె తల్లి తల్లడిల్లిపోయింది. తనపై జరిగిన లైంగిక దాడి విషయాన్ని తల్లికి, బంధువులకు బాలిక శుక్రవారం వివరించింది. దీంతో బీదర్ వెళ్లాలని చెప్పిన స్థానికుల ఇంటికి బంధువులు ఈ విషయమై నిలదీయగా వారు దాడి చేసి బెదిరించారు. భయాందోళనకు గురైన తల్లి, కూతురు ఆదివారం కంగ్టి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఆరుగురిపై నిర్భయ చట్టం కింద కేసు.. ఈ కేసుకు సంబంధించి బాలికను బెదిరించి బీదర్కు పంపిన యూపీఎస్ హెచ్ఎం అంబాజీ, గ్రామానికి చెందిన సంజీవ్, రవితోపాటు బీదర్లో లైంగిక దాడికి పాల్పడిన గుర్తుతెలియని మరో ఇద్దరిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశామని కంగ్టి ఎస్ఐ కమలాకర్ తెలిపారు. బీదర్కు తీసుకెళ్లిన పూజ అలియాస్ సిద్ధమ్మపై కిడ్నాప్ కేసు నమోదు చేశామన్నారు. నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. కాగా నిందితుడిగా ఉన్న హెచ్ఎం అంబాజీ ఇటీవల ఉత్తమ ఉపాధ్యాయుడిగా పురస్కారం పొందాడు.