Bowenpally
-
అనుమానంతో ప్రాణాలు తీశాడు
రసూల్పురా: భార్య ప్రవర్తనపై అనుమానంతో దారుణానికి తెగబడ్డాడు ఓ భర్త. కట్టుకున్న ఇల్లాలితో పాటు పదకొండు నెలల కన్నకూతురును చంపి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన ఆదివారం బోయిన్పల్లి పరిధిలో వెలుగులోకి వచి్చంది. బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్ డెక్లూర్కు చెందిన గణేష్ సంగ్రామ్ (35), స్వప్న దంపతులు. వీరికి ముగ్గురు కూతుళ్లు తరుణి (6), తరుణశ్రీ (4), నక్షత్ర (11 నెలలు) ఉన్నారు. గణేష్ సంగ్రామ్ జీవనోపాధి కోసం కొన్నాళ్ల క్రితం కుటుంబంతో సహా నగరానికి వలస వచ్చాడు. బోయిన్పల్లి ఆర్యసమాజ్ సమీపంలో అద్దె ఇంటిలో ఉంటూ ఆటో డ్రైవర్గా పని చేస్తూ భార్యాపిల్లలను పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కొంతకాలంగా గణేష్ సంగ్రామ్, స్వప్న దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న గణేష్ సంగ్రామ్.. శనివారం రాత్రి స్వప్నతో గొడవ పడ్డాడు. ఆవేశంలో ఆమె మెడకు తాడుతో ఉరి వేసి ప్రాణాలు తీశాడు. పదకొండు నెలల చిన్నారి నక్షత్ర గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఇంటి యజమానురాలికి, డయల్ 100కు ఫోన్ చేసి చెప్పాడు. సుచిత్ర– అల్వాల్ మార్గంలోని ట్రాక్పై గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా.. మిగతా ఇద్దరు చిన్నారులు మరో గదిలో నిద్రిస్తుండటంతో తండ్రి వారి జోలికి వెళ్లలేదు. సమాచారం అందుకున్న పోలీసులు బోయిన్పల్లిలోని ఇంటికి వెళ్లి చూడగా స్వప్న, చిన్నారి నక్షత్ర మృతదేహాలు కనిపించాయి. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బోయినపల్లి రోడ్డు ప్రమాదం.. తీవ్రంగా గాయపడిన వైష్ణవి మృతి
సాక్షి, హైదరాబాద్: బోయినపల్లి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న వైష్ణవి గురువారం తెల్లవారుజామున మృతి చెందింది. నాన్న ఎలా ఉన్నాడంటూ అడిగిన మాటలే వైష్ణవి చివరి మాటలయ్యాయి. కాగా బుధవారం తండ్రితో కలిసి స్కూటీపై వెళ్తుండగా అదుపుతప్పి వైష్ణవి రోడ్డుపై పడిపోవడంతో డీసీఎం ఢీకొట్టిన విషయం తెలిసిందే. వివరాలు.. ఆర్మీ విశ్రాంత ఉద్యోగి విజయ్ కుమార్ బుధవారం తన కుమార్తె వైష్ణవితో కలిసి స్కూటీపై కానాజీ గూడ నుంచి బోయిన్పల్లికి బయలుదేరారు. మార్గమధ్యలో ప్రియదర్శిని హోటల్ వద్ద స్కూటీ అదుపుతప్పి కిందపడిపోయారు. ఇంతలోనే ఆ మార్గంలో వేగంగా వస్తున్న డీసీఎం వాహనం వైష్ణవి మీదుగా వెళ్లిపోయింది. ఎమ్ఎన్ఆర్ కాలేజ్లో డిగ్రీ చదువుతున్న వైష్ణవిని కాలేజీ బస్సు ఎక్కించేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. దీంతో తీవ్ర గాయాల పాలైన వైష్ణవిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ గురువారం వైష్ణవి ప్రాణాలు విడిచింది. మరోవైపు వైష్ణవి నివాసముండే ఖానాజీగూడాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
బోయిన్పల్లిలో తీవ్ర విషాదం.. కుటుంబం ఆత్మహత్య!
సాక్షి, హైదరాబాద్: బోయినపల్లి ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు కూతుళ్లతో ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల విజ్ఞప్తితో ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచి.. పోస్టుమార్టం తర్వాత మృతదేహాల్ని స్వస్థలానికి పంపించినట్లు సమాచారం. తూర్పు గోదావరికి చెందిన విజయలక్ష్మీ భర్త, తన ఇద్దరు కూతుళ్లతో బోయినపల్లిలోని భవానీపురంలో నివసిస్తోంది. ఈ క్రమంలో ఇటీవలే ఆమె భర్త చనిపోగా.. అప్పటి నుంచి ఆమె డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. ఆ బాధలో కూతుళ్లు చంద్రకళ, దివ్యాంగురాలైన మరో కూతురు సౌజన్య పాలు పంచుకున్నారు. అంతా కలిసి ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నారే ఏమో పాపం.. వేర్వేరు గదుల్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. చంద్రకళ ఎంబీఏ చదువుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఘటనపై పోలీసుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదీ చదవండి: కాపీ కొడుతూ దొరికిన దీపిక!.. అందుకే సూసైడ్ చేసుకుందా? -
వ్యాయామం చేస్తూ కుప్పకూలిన విశాల్
-
బోయినపల్లి నుంచి ప్రారంభమైన రాహుల్ పాదయాత్ర
-
కూతురిపై కన్నేసిన తండ్రి.. కాపాడిన సవతి తల్లి
సాక్షి, కంటోన్మెంట్: కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడిన తండ్రిని బోయిన్పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గురువారం బోయిన్పల్లి పీఎస్లో బేగంపేట ఏసీపీ నరేశ్ రెడ్డి వివరాలు వెల్లడించారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రమేశ్ కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి చెత్త సేకరణతో ఉపాధి పొందుతున్నాడు. 15 ఏళ్ల క్రితం సరోజ అనే మహిళను వివాహం చేసుకున్న రమేశ్, వీరికి ఒక పాప జన్మించిన కొన్ని రోజులకే విడాకులు తీసుకున్నాడు. పదేళ్ల క్రితం మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య కూతురు, రెండో భార్య, ఆమె కుమారుడితో కలిసి బోయిన్పల్లిలో నివాసం ఉంటున్నాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన తండ్రి బుధవారం రాత్రి కుమార్తెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి కేకలు విన్న అతడి రెండో భార్య రమేశ్ను అడ్డుకుంది. కన్నకూతురు కాకపోయినా తల్లి ప్రేమతో ఆమెను కీచక భర్త నుంచి కాపాడింది. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో బోయిన్పల్లి పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని రమేష్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించారు. సమావేశంలో ఇన్స్పెక్టర్ రవికుమార్, సబ్ ఇన్స్పెక్టర్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
బోయిన్పల్లి కిడ్నాప్ కేసు: 75 పేజీల చార్జిషీట్ సిద్ధం
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో 75 పేజీల చార్జీషీట్ను సిద్ధం చేసినట్లు పోలీసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హఫీజ్పేట భూవివాదం నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 5న భూమా అఖిల ప్రియ, భార్గవ్ రామ్, జగత్ విఖ్యాత్ రెడ్డి అనుచరులతో కలిసి ఐటీ అధికారులమని చెప్పి ప్రవీణ్రావు ఇంట్లో ప్రవేశించారు. ఆ తర్వాత ప్రవీణ్రావు సోదరులను సినిఫక్కీలో కిడ్నాప్ చేసిన సంఘటన తెలిసిందే. కాగా, సంచలనంగా మారిన ఈ కేసులో.. అఖిల ప్రియ దంపతులతోపాటు, మరో 30 మందిపై బోయిన్పల్లి పోలీసులు కేసులను నమోదు చేశారు. ఈ క్రమంలో .. కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులు కిడ్నాప్ సమయంలో ఒక్కొక్కరి పాత్రను వివరించారు. చదవండి: Bhuma Akhila Priya: బోయిన్పల్లి పోలీసులపై అఖిలప్రియ ఫిర్యాదు -
బోయిన్పల్లి పోలీసులపై అఖిలప్రియ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి పోలీసులు కిటికీ అద్దాలను పగులగొట్టి తన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించారని, విలువైన ఆస్తి పత్రాలను తీసుకెళ్లారని మంగళవారం ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కేపీహెచ్బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెల మొదటివారంలో బోయిన్పల్లి పోలీసులు తన ఇంట్లోకి ప్రవేశించినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్న ఆమె.. దాదాపు నెల రోజుల తర్వాత కేపీహెచ్బీ పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. -
రూ.7వేల అప్పు.. మనిషి ఉసురు తీసింది
సాక్షి, కంటోన్మెంట్: ఏడు వేల రపాయల బాకీ ఓ వ్యక్తి ఉసురు తీసింది. ఫైనాన్స్ డబ్బుల వసూలుకు వచ్చిన, వడ్డీ వ్యాపారి హత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. బోయిన్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు.. మెదక్ జిల్లా దుబ్బాక మండలం పోతారెడ్డి పేట్కు చెందిన గంగారామ్ (44 ) బోయిన్పల్లి చిన్నతోకట్టాలో ఒంటరిగా నివాసముంటూ బోన్సెట్టర్గా పని చేస్తున్నాడు. ఈ నెల 2న గంగారమ్ తాను అద్దెకు ఉండే ఇంటి ఆవరణలో పడిపోయి ఉండగా స్థానికుల సమాచారం మేరకు ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతుడి గొంతుపై చేతులతో నులిమినట్లు గాయాలు ఉండటంతో అనువనాస్పద మృతి కేసు నమోదు చేశారు. గంగారాం ఇంటి సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా ఇద్దరు నిందితులు సాయిరాం, కమల్కిశోర్లను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. గంగారాం స్థానిక పాల వ్యాపారి గడ్డం సాయిరాం వద్ద తన ద్విచక్ర వాహనం తనఖా పెట్టి రూ.10వేలు అప్పుగా తీసుకున్నాడు. గత నెలలో రూ. 3వేలు చెల్లిం, మిగతా మొత్తం త్వరలోనే ఇస్తానని ద్విచక్ర వాహనాన్ని విడిపించుకున్నారు. ఈ క్రమంలో మిగతా సొమ్ము వసూలు కోసం సాయిరాం, గంగారాం ఇంటికెళ్లి తలుపుకొట్టగా ఎంతకీ బయటికి రాలేదు. దీంతో సంజీవయ్యనగర్కు చెందిన పెయింటర్ కమల్ కుమార్ను వెంటబెట్టుకుని మళ్లీ గంగారాం ఇంటికెళ్లి నిలదీశాడు. అప్పు చెల్లించే విషయంలో వాగ్వాదం మొదలైంది. నిందితులు ఇద్దరూ గంగారాం గొంతు నులిమి పట్టుకోవడంతో అపస్మారక స్థితిలోకి జారుకున్నాడు. నిందితులు గంగారాంకు చెందిన ల్యాప్ట్యాప్, ద్విచక్ర వాహనాన్ని తీసుకుని పారిపోయారు. -
తప్పించుకునేందుకు తప్పుడు సర్టిఫికెట్
సాక్షి, కంటోన్మెంట్: బ్యాడ్మింటన్ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్, అతని సోదరుల కిడ్నాప్ కేసులో కీలక నిందితులైన భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి, భార్గవ్రామ్లపై మరో కేసు నమోదైంది. కిడ్నాప్ కేసు విచారణలో భాగంగా కోర్టు హాజరును తప్పించుకునే క్రమంలో తప్పుడు కోవిడ్ ధ్రువీకరణ సర్టిఫికెట్ను సమర్పించి పోలీసులకు దొరికి పోయారు. దీంతో వీరిరువురితో పాటు మరో ముగ్గురిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. బోయిన్పల్లి పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ కేసుకు సంబంధించి ఈ నెల 3న టెస్టు ఐడెంటిఫికేషన్ పరేడ్ (టీఐపీ) నిర్వహించారు. అయితే తనకు కోవిడ్ సోకిందని భార్గవరామ్ పోలీసులకు వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చారు. లాయర్ ద్వారా సికింద్రాబాద్లోని 10వ ఏసీఎంఎం కోర్టుకు నివేదించారు. పోలీసులు ఆరా తీయగా నిందితుడు తప్పుడు కోవిడ్ ధ్రువీకరణ పత్రాలు సమరి్పంచినట్లు తేలింది. దీంతో భార్గవ రామ్కు సహకరించిన జగత్ విఖ్యాత్తో పాటు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేసే వినయ్, ల్యాబ్ టెక్నీషినయన్ శ్రీదేవి, గాయత్రిల్యాబ్లో పనిచేసే రత్నాకర్లపై కేసు నమోదు చేశారు. వినయ్, రత్నాకర్లను రిమాండ్కు తరలించారు. భార్గవరామ్, జగత్విఖ్యాత్ పరారీలో ఉన్నారు. కిడ్నాప్ కేసులో బెయిల్పై ఉన్న వీరిరువురిపై మరో కేసు నమోదు కావడం గమనార్హం. -
ప్రేమ పేరుతో మోసం; యువతిని లైంగికంగా వాడుకొని..
సాక్షి, కంటోన్మెంట్: ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని ఓ యువతిని మోసం చేసిన నిందితుడిని బోయిన్పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం గాందీనగర్లో తల్లిదండ్రులతో నివాసముండే యువతి (25) గతంలో బోయిన్పల్లి దుబాయ్ గేటు సమీపంలో నివాసముండేది. ఆమె అక్క పిల్లలకు కటింగ్ చేయించేందుకు వెళ్లే క్రమంలో స్థానిక సెలూన్లో పనిచేసే సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్కు చెందిన కనకరాజు (26)తో పరిచయం ఏర్పడింది. గతేడాది లాక్డౌన్ కారణంగా మూడు నెలల పాటు సొంతూరుకు వెళ్లిన కనకరాజు అదే ఏడాది జూన్లో తిరిగి బోయిన్పల్లికి వచ్చాడు. దీంతో కనకరాజును మళ్లీ కలుసుకున్న యువతికి ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి పలుమార్లు లైంగికంగా లోబరుచుకున్నాడు. గత ఫిబ్రవరి 24న తిరిగి సొంతూరుకు వెళ్లిన కనకరాజు మరుసటి రోజు యువతి ఫోన్ చేయగా షెడ్యూల్ కులానికి చెందిన ఆమెతో కులాంతర వివాహానికి తమ ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదని చెప్పాడు. తర్వాత బాధితురాలు ఎన్ని సార్లు ఫోన్ చేసినా కనకరాజు స్పందించలేదు. ఈ నేపథ్యంలో గత నెల 16న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇటీవలే కనకరాజును అదుపులోకి తీసుకుని శుక్రవారం రిమాండ్కు తరలించారు. చదవండి:కొవ్వును తగ్గిస్తానని చెప్పి.. గదిలోకి తీసుకెళ్లి ఆమెతో.. -
మిస్సింగ్ కేసు: బాలికకు మాయమాటలు చెప్పి..
కంటోన్మెంట్: మైనర్ బాలికపై లైంగికదాడిచేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బోయిన్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది. ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన మేరకు.. ఒంగోలుకు చెందిన బాలిక గతేడాది బోయిన్పల్లిలోని పెద్దమ్మ ఇంటికి వచ్చి ఇక్కడే ఉంటోంది. సంగారెడ్డి జిల్లా కోహిర్కు చెందిన ఇర్షాన్ (25)తో బాలికకు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో బాలికకు మాయమాటలు చెప్పిన ఇర్షాన్ పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. గత బుధవారం బాలిక పెద్దమ్మకు చెప్పకుండా వెళ్లింది. బాలిక ఆచూకీ దొరకకపోవడంతో బంధువులు బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ టీవీ కెమెరాల ద్వారా బాలిక ఇర్ఫాన్తో కలిసి వెళ్లడాన్ని గుర్తించిన పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. బాలిక గుంటూరుకు వెళ్లినట్లు ఇర్షాన్ ద్వారా తెలుసుకున్న పోలీసులు ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి బంధువులకు అప్పగించారు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం, పోక్సో, అత్యాచారం నేరాల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. బంధువుల ఆందోళన విషయం తెలుసుకున్న బీజేపీ, ఎమ్మార్పీఎస్, హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి, ఎమ్మార్పీఎస్ నేతలు బాధితురాలి కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం బోయిన్పల్లి పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. అమాయక ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నార్త్జోన్ డీసీపీ కల్మేశ్వర్, బేగంపేట ఏసీపీ నరేశ్ రెడ్డి సహా పెద్ద సంఖ్యలో పోలీసులు బోయిన్పల్లి పీఎస్కు చేరుకున్నారు. డీసీపీ కల్మేశ్వర్ ఆందోళన కారులకు నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది. హుస్సేన్ సాగర్లో దూకి యువకుడి ఆత్మహత్య రాంగోపాల్పేట్: హుస్సేన్ సాగర్లో దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాంగోపాల్పేట్ పోలీసులు తెలిపిన మేరకు..చిలకలగూడకు చెందిన అజీజ్ఖాన్ (23) మూర్ఛవ్యాధితో బాధపడుతున్నాడు. ఈ నెల 4వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఆయన శుక్రవారం హుస్సేన్ సాగర్లో శవమై తేలాడు. రాంగోపాల్పేట్ పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. చొక్కాపై ఉండే టైలర్ స్టిక్కర్ ఆధారంగా మృతుడిని గుర్తించారు. -
బోయినపల్లి కేసు: 14 మందికి బెయిల్ మంజూరు
సాక్షి, హైదరాబాద్ : బోయిన్పల్లి కిడ్నాప్ కేసులోని నిందితులకు సికింద్రాబాద్ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. 14 మందికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే ప్రతివారం పీఎస్లో సంతకం చేయాలని షరతు విధించింది. కాగా ఇప్పటికే అఖిలప్రియకు జనవరిలో కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఆమె సోదరుడు భార్గవ్రామ్ కోసం పోలీసుల గాలింపు ఇంకా కొనసాగుతోంది. చదవండి: భార్గవ్రామ్కు కోర్టులో చుక్కెదురు.. -
భార్గవ్రామ్కు కోర్టులో చుక్కెదురు..
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్రామ్కు సికింద్రాబాద్ కోర్టులో చుక్కెదురయ్యింది. భార్గవ్రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో 19 మందిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. హఫీజ్పేట భూవివాదం నేపథ్యంలో జరిగిన ఈ కిడ్నాప్ కేసులో ముఖ్య నిందితులు అఖిలప్రియ భర్త భార్గవ్రామ్, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి, అనుచరుడు గుంటూరు శ్రీను, భార్గవ్రామ్ తల్లిదండ్రులతో సహా మరో 9 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. (చదవండి: ఈవెంట్లా కిడ్నాప్.. ఎవరెవరి పాత్రలు ఏంటంటే) అఖిలప్రియకు బెయిల్ మంజూరు అఖిలప్రియకు శుక్రవారం సెసెషన్స్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేల పూచీకత్తుతో ఇద్దరు షూరిటీలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టై రిమాండ్లో ఉన్న అఖిలప్రియ.. రేపు(శనివారం) జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. చదవండి: డిసెంబర్లోనే స్కెచ్ వేశారు! -
డిసెంబర్లోనే స్కెచ్ వేశారు!
సాక్షి, హైదరాబాద్: హఫీజ్పేట భూ వివాదానికి సంబంధించి ప్రవీణ్రావు తదితరుల్ని కిడ్నాప్ చేసేందుకు ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ డిసెంబర్లోనే స్కెచ్ వేసినట్లు వెలుగులోకి వచ్చింది. అయితే అనివార్య కారణాలతో ఈ నెల మొదటి వారానికి వాయిదా పడింది. మరోపక్క కిడ్నాప్ చేసే సమయంలో భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు చేజిక్కించుకోవడానికి భార్గవ్ విశ్వప్రయత్నం చేశాడు. ఈ కేసులో బందిపోటు అభియోగాలను కూడా పోలీసులు చేరుస్తూ సోమవారం సికింద్రాబాద్ న్యాయస్థానానికి సమాచారం ఇచ్చారు. అయితే ఈ తరహా నేరాలకు సంబంధించిన పిటిషన్లను నాంపల్లి సెషన్స్ కోర్టు మాత్రమే విచారించాల్సి ఉండటంతో అఖిలప్రియ బెయిల్ పిటిషన్ను కోర్టు రిటర్న్ చేసింది. స్కెచ్ ఇలా వేశారు.. హఫీజ్పేటలోని భూమిని చేజిక్కించుకోవడానికి ప్రవీణ్రావు తదితరులను కిడ్నాప్ చేయడమే మార్గమని అఖిలప్రియ, భార్గవ్రామ్ గత నెల నిర్ణయించుకున్నారు. గుంటూరు శ్రీను ద్వారా మాదాల సిద్ధార్థ్కు సమాచారం ఇచ్చి కొందరు అనుచరులతో రావాలని చెప్పారు. దాదాపు 10 మందిని వెంట తీసుకుని డిసెంబర్ 25న హైదరాబాద్కు సిద్ధార్థ్ చేరుకున్నాడు. వారికి శివార్లలోని ఓ లాడ్జిలో బస కల్పించిన భార్గవ్రామ్, గుంటూరు శ్రీనులు కుట్ర అమలుకు ఆలస్యమవు తుందని, డిసెంబర్ 31 తర్వాత అమలు చేద్దామని చెప్పి పంపారు. తిరిగి ఈ నెల 2న హైదరాబాద్ రావాలని సమాచారం ఇవ్వడంతో సిద్ధార్థ్ దాదాపు 25 మందిని తీసుకురావడానికి సిద్ధమయ్యాడు. విజయవాడ, పరిసర ప్రాంతాల వారికి ఒకే బస్సులో టికెట్లు బుక్ చేశాడు. షేర్ల వ్యాపారానికి సంబంధించి బోయిన్పల్లికి చెందిన కొందరు ‘మంత్రి గారిని’(అఖిలప్రియ) మోసం చేయడంతో వారిపై ఐటీ దాడులు చేయిస్తోందని సిద్ధార్థ్ తన అనుచరులకు చెప్పాడు. ఆ అధికారులకు మనం సహాయంగా ఉండాలని నమ్మబలికాడు. ఇలా వచ్చిన వారంతా కూకట్పల్లిలోని ఓ హోటల్లో బస చేశారు. కిడ్నాప్ చేసే రోజు బాధితుల ఇంటికి వెళ్లకూడదని భార్గవ్ రామ్ తొలుత భావించాడు. అయితే బాధితులతో బలవంతంగా ఖాళీ పత్రాలపై సంతకాలు చేయించుకున్నా.. హఫీజ్పేట స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు చేజిక్కించుకోకపోతే దాన్ని సొంతం చేసుకోవడం కష్టమవుతుందని అనుకున్నాడు. చదవండి: (ఈవెంట్లా కిడ్నాప్.. ఎవరెవరి పాత్రలు ఏంటంటే) దీంతో కిడ్నాప్ రోజు భార్గవ్రామ్, అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్రెడ్డి కూడా బాధితుల ఇంటికి వెళ్లారు. కుటుంబీకులను ఓ గదిలో, ముగ్గురు అన్నదమ్ములను హాలులో నిర్బంధించాక వీరిద్దరూ ఇల్లంతా గాలించారు. అయితే ఆ పత్రాలను ప్రవీణ్రావు బ్యాంకు లాకర్లో ఉంచడంతో అవి దొరకలేదు. ముగ్గురు బాధితులను కిడ్నాప్ చేసిన ఈ ముఠా ఇంట్లోని ల్యాప్టాప్తోపాటు సెల్ఫోన్లు ఎత్తుకెళ్లింది. మరోవైపు ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుడు, ప్రధాన నిందితురాలు అఖిలప్రియ భర్త భార్గవ్రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన సికింద్రాబాద్ 11వ అదనపు మెట్రో పాలిటన్ కోర్టు, కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా బోయిన్పల్లి పోలీసులకు నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది. -
అఖిలప్రియకు మరోసారి చుక్కెదురు..
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలు భూమా అఖిలప్రియకు మరోసారి కోర్టులో చుక్కెదురయ్యింది. సికింద్రాబాద్ కోర్టు అఖిలప్రియ బెయిల్ పిటిషన్ని తిరస్కరించింది. సోమవారం భూమా అఖిలప్రియ బెయల్ పిటిషన్ని విచారించిన సికింద్రాబాద్ కోర్టు.. జీవిత కాలం శిక్ష పడే నేరాలు తమ పరిధిలోకి రావని స్పష్టం చేసింది. పిటిషన్ని రిటర్న్ చేసింది. ఈ నేపథ్యంలో అఖిలప్రియ మరోసారి నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ని దాఖలు చేయనున్నారు. ఇక అఖిలప్రియపై అదనపు సెక్షన్లు నమోదు చేసినట్లు మెమో ధాఖలు చేసిన పోలీసులు.. ఐపీసీ సెక్షన్ 395 డెకయిట్ (దోపిడీ)కేసు నమోదు చేశారు. (చదవండి: ఐటీ అధికారులుగా ఎలా నటించారంటే.. ) -
ఈవెంట్లా కిడ్నాప్.. ఎవరెవరి పాత్రలు ఏంటంటే
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో మరో 15 మందిని హైదరాబాద్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఇప్పటికే టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియతో పాటు మల్లికార్జునరెడ్డి, బోయ సంపత్, బాలా చెన్నయ్లకు సంకెళ్లు వేయగా.. తాజాగా పట్టుబడిన వారితో ఈ సంఖ్య 19కి చేరింది. హఫీజ్పేట భూవివాదం నేపథ్యంలో జరిగిన ఈ కిడ్నాప్ కేసులో ముఖ్య నిందితులు అఖిలప్రియ భర్త భార్గవ్రామ్, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి, అనుచరుడు గుంటూరు శ్రీను, భార్గవ్రామ్ తల్లిదండ్రులతో సహా మరో 9 మంది కోసం గాలిస్తున్నారు. అఖిలప్రియ పోలీసు కస్టడీలో చెప్పిన వివరాలతో పాటు ఆ నేరం జరిగిన సమయంలో ఉపయోగించిన సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఈ కేసులో నిందితులను అరెస్టు చేస్తున్నారు. అచ్చం ఓ ఈవెంట్లో ప్లాన్ చేసిన ఈ కేసు వివరాలను ఆదివారం బషీర్బాగ్లోని హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ అంజనీకుమార్, నార్త్జోన్ డీసీపీ కల్మేశ్వర్ మీడియాకు తెలిపారు. ముందస్తు వ్యూహం... కిడ్నాప్ ఎలా చేయాలన్న దానిపై అఖిలప్రియ.. భార్గవ్రామ్, జగత్ విఖ్యాత్ రెడ్డి, గుంటూరు శ్రీనులతో జనవరి 2న కేపీహెచ్బీలోని లోధా అపార్ట్మెంట్లోని నివాసంలో, 4న యూసుఫ్గూడలోని ఎంజీహెచ్ పాఠశాలలో సమావేశమయ్యారు. గుంటూరు శ్రీను.. సిద్ధార్థను కలసి కిడ్నాప్ చేసేందుకు 15 నుంచి 20 మందిని సమకూర్చాలంటూ కోరాడు. దీనికోసం అతనికి రూ.5 లక్షలు, మిగిలిన వారికి రూ.25,000ల చొప్పున ఇస్తామని చెప్పాడు. ముందుగా రూ.74,000లు చెల్లించాడు. ఆ తర్వాత సిద్ధార్థ పంపిన వారందరికి కూకట్పల్లి ఫోరమ్ మాల్కు సమీపంలోని ‘ఎట్ హోమ్’లాడ్జ్లో వసతి కల్పించాడు. అనంతరం కిడ్నాప్ చేసే సమయంలో వీరు అధికారులుగా నటించేందుకు ఫార్మల్ డ్రెస్సుల కోసం కొలతలు కూడా తీసుకున్నాడు. మల్లికార్జున్రెడ్డి, సంపత్ల ద్వారా 10 స్టాంప్ పేపర్లు.. భార్గవ్రామ్, విఖ్యాత్రెడ్డి పేరులతో 10 స్టాంప్ పేపర్లు ఉండేలా కొన్నాడు. అలాగే ఆరు సెల్ఫోన్లు, బొమ్మ తుపాకీ కొనుగోలు చేశాడు. ఓ జిరాక్స్ షాప్ వద్ద ఓ పేపర్పై నకిలీ వాహన నంబర్లు ముద్రించి కిడ్నాప్ సమయంలో ఉపయోగించిన కారు నంబర్ ప్లేట్లపై అతికించారు. (చదవండి: మంత్రిగా ఉన్నప్పటి నుంచే ‘మ్యాన్పవర్’!) పక్కాగా కిడ్నాప్.. జనవరి 5న సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఎంజీహెచ్ పాఠశాల వద్ద నిందితులు అందరూ కలిశారు. ఈ కేసులో ఏ2–గా ఉన్న భార్గవ్రామ్ ఐటీ అధికారులు, పోలీసు ఆఫీసర్లుగా ఎలా వ్యవహరించాలనే దానిపై మిగిలినవారికి వివరించాడు. బోయ సంపత్, బాలా చెన్నై మనోవికాస్నగర్లోని కృష్ణా రెసిడెన్సీకు మధ్యాహ్నం సమయంలో వెళ్లి రెక్కీ నిర్వహించారు. బాధితుల కదలికలను ఎప్పటికప్పుడూ చేరవేశారు. అనుకున్న ప్రణాళిక ప్రకారం ఐదు కార్లలో బాధితుల ఇంటికి వెళ్లి ఐటీ, పోలీసులుగా చెబుతూ ఐటీ కార్డులు, సెర్చ్ వారంట్లు చూపెట్టి సోదాలు చేశారు. సెల్ఫోన్లు, ట్యాబ్లు తీసుకున్నారు. కూర్చోబెట్టి విచారణ చేశారు. అనంతరం ప్రవీణ్కుమార్, నవీన్కుమార్, సునీల్ కుమార్ల చేతులు తాళ్లతో కట్టేశారు. కళ్లు కనపడకుండా ఉండేందుకు ముఖాలకు మాస్కులు కట్టారు. ఆ తర్వాత ముగ్గురిని వేర్వేరు వాహనాల్లో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. మొయినాబాద్లోని భార్గవ్రామ్ గెస్ట్హౌస్కు తీసుకెళ్లి ఖాళీ స్టాంప్ పేపర్లపై సంతకాలు తీసుకున్నారు. ఆ తర్వాత కర్రలతో కొడతామంటూ, చంపుతామంటూ బెదిరించి రాసిన పేపర్లపై కూడా సంతకాలు చేయించారు. అయితే బాధితుల గురించి పోలీసులు వెతుకుతున్నారని సమాచారం తెలుసుకున్న వీరు బాధితులను ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలోని సన్సిటీ దగ్గరలో అదే రోజూ రాత్రి వదిలివెళ్లారు. వాడిన వాహనాలివే... భార్గవ్రామ్ తల్లి కిర్మణ్మయి నాయుడు పేరుతో రిజిష్టర్ అయిన ఏపీ21 సీకే 2804 నంబర్ ప్లేట్ గల ఇన్నోవా కారు. దీనికి టీఎస్09 బీజెడ్ 9538(నకిలీ నంబర్) స్టిక్కర్ను అంటించారు. అలాగే ఏపీ21సీఈ 1088 నంబర్ ప్లేట్ గల స్కార్పియోకు టీఎస్09 ఎఫ్ఎక్స్ 3625 నంబర్ను, ఏపీ07 ఈడీ 0875 నంబర్ గల స్విఫ్ట్ డిజైర్కు టీఎస్07 యూవీ 2583 నంబర్ను వినియోగించారు. అలాగే ఏపీ21 బీకే 3999 నంబర్ ప్లేట్ గల ఎక్స్యూవీ 500 వాహనానికి, వోక్స్వ్యాగన్ పోలోలకు ఉపయోగించిన నకిలీ నంబర్లను ఇంకా కనుక్కోవాల్సి ఉందని డీసీపీ కల్మేశ్వర్ తెలిపారు. ఎవరెవరి పాత్రలు ఏంటంటే.. మాదాల సిద్ధార్థ: ఈవెంట్ మేనేజర్ అయిన ఇతను కిడ్నాప్నకు సహకరించేందుకు 20 మందిని సమకూర్చడంతో పాటు స్విఫ్ట్ డిజైర్ కారును కూడా వినియోగించాడు. ఏపీ 09 ఈడీ 0875 కారుతో పాటు సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. బొజ్జగని దేవప్రసాద్: కారును డ్రైవ్ చేయడంతో పాటు కిడ్నాప్లో పాల్గొన్నాడు. దేవరకొండ కృష్ణవంశీ, కందుల శివ: పోలీసు డ్రెస్సు ధరించి కానిస్టేబుల్స్గా నటించారు. వీరంతా..: మొగిలి భాను, రాగోలు అంజయ్య, పదిర రవిచంద్ర, పంచిగలి రాజా, బానోత్ సాయిలు, దేవరకొండ కృష్ణ సాయి, దేవరకొండ నాగార్జున, బొజ్జగాని సాయి, మీసాల శ్రీను, అనీపాక ప్రకాష్, షేక్ దావూద్ కూడా కిడ్నాప్లో పాల్గొన్నారు. -
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో కొత్త మలుపు
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో నిందితుల జాబితా రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ కేసులో అఖిలప్రియ భర్త భార్గవ్రామ్ కుటుంబం మొత్తానికీ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. కిడ్నాప్కు సంబంధించిన కుట్రలో పాలు పంచుకున్నారని భార్గవ్ తండ్రి మురళి, తల్లి కిరణ్మయి, సోదరుడు చంద్రహాస్లను నిందితులుగా చేర్చారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వీరి కోసం అధికారులు గాలిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో భూమా అఖిలప్రియ సోదరుడు జగద్విఖ్యాత్రెడ్డిని కూడా నిందితుడిగా చేర్చిన విషయం తెలిసిందే. దీంతో అఖిలప్రియ–భార్గవ్రామ్ కుటుంబాల్లో ఒక్క మౌనిక రెడ్డి తప్ప మిగిలిన వారంతా కిడ్నాప్ కేసులో నిందితులుగా మారారు. హఫీజ్పేట భూ వివాదానికి సంబంధించి ప్రవీణ్రావుతో పాటు అతడి సోదరులను కిడ్నాప్ చేయడానికి భూమా అఖిలప్రియ, భార్గవ్రామ్ కొన్నాళ్ల క్రితమే పథకం వేసినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. దీన్ని ఎలా అమలు చేయాలనే అంశంపై తమ కుటుంబీకులతో కలసి పదేపదే చర్చలు జరిపారు. గుంటూరు శ్రీను నేతృత్వంలో కిరాయి మనుషులతో కిడ్నాప్ చేయించాలని నిర్ణయించుకున్నారు. ఈ కుట్ర చేసే సందర్భంలో మురళి, కిరణ్మయి, చంద్రహాస్లు భార్గవ్రామ్తోనే ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. చదవండి: బోయిన్పల్లి కేసు: వెలుగులోకి కీలక సూత్రధారి మరోపక్క కిడ్నాప్ను అమలు చేయడానికి భార్గవ్ రామ్, గుంటూరు శ్రీను వివిధ ప్రాంతాల నుంచి తమ అనుచరులను, కిరాయి గూండాలను హైదరాబాద్కు రప్పించారు. వీరికి కూకట్పల్లిలోని పార్థ గ్రాండ్ హోటల్లో బస కల్పించారు. అక్కడ నుంచి యూసుఫ్గూడలోని స్కూలుకు తీసుకువచ్చారు. అక్కడే వీరిలో ఐటీ అధికారులుగా నటించే వారికి కొత్త బట్టలు ఇవ్వగా.. గుంటూరు ప్రాంతానికి చెందిన వంశీకి మాత్రం అద్దెకు తీసుకువచ్చిన పోలీసు యూనిఫాం ఇచ్చారు. ఆదాయపు పన్ను అధికారుల దాడి నేపథ్యంలో తాను బందోబస్తుగా వచ్చినట్లు ఇతడు బాధిత కుటుంబానికి తెలిపినట్లు వెలుగులోకి వచ్చింది. పరారీలో ఉన్న వారి జాబితాలో వంశీ కూడా ఉన్నాడు. భార్గవ్రామ్, అతడి కుటుంబీకులు, గుంటూరు శ్రీను తదితరులు ప్రస్తుతం బెంగళూరులో తలదాచుకున్నట్లు తెలిసింది. వీరిలో కొందరికి నేరచరిత్ర ఉండటంతో పోలీసుల దర్యాప్తు తీరుతెన్నులపై మంచి పట్టుంది. ఈ నేపథ్యంలో నిందితులు ప్రత్యేక బృందాలకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు. అజ్ఞాతంలో ఉంటూనే నిందితులు ముందస్తు బెయిల్కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. చదవండి: ఐటీ అధికారులుగా ఎలా నటించారంటే.. -
బోయిన్పల్లి కేసు: వెలుగులోకి కీలక సూత్రధారి
సాక్షి, హైదరాబాద్ : బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో మరో కొత్త పేరు వెలుగులోకి వచ్చింది. విజయవాడకు చెందిన సిద్దార్ధ కిడ్నాప్లో కీలక సూత్రధారిగా వ్యవహరించాడు. భార్గవ్రామ్కి మనుషులను సరఫరా చేసింది కూడా ఇతడే. సిద్దార్థ విజయవాడ కేంద్రంగా బౌన్సర్లను సరఫరా చేస్తున్నాడు. అఖిలప్రియ, భార్గవ్కు పర్సనల్ గార్డ్గా ఉంటున్నాడు. హైదరాబాద్లో ఐటీ రైడ్స్ కోసం రావాలని భార్గవ్ సిద్దార్థకు చెప్పాడు. భార్గవ్ ఆదేశంతో అతడు 15 మందితో హైదరాబాద్కు వచ్చాడు. సిద్దార్థ అండ్ గ్యాంగ్ ముగ్గురిని కిడ్నాప్ చేసి వెళ్లిపోయింది. ప్రస్తుతం సిద్దార్థతో పాటు అతడి గ్యాంగ్లో 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. ( ఐటీ అధికారులుగా ఎలా నటించారంటే.. ) కాగా, భార్గవ్రామ్, గుంటూరు శ్రీను, అఖిలప్రియ సోదరుడు జగద్విఖ్యాత్రెడ్డి తదితరులు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. పోలీసుల ఉదాసీనతలను తమకు అనుకూలంగా మార్చుకున్న ఈ నిందితులు ఉత్తరాదికి పారిపోయారు. నిందితులు అప్పటికే నేరచరిత్ర కలిగి ఉండటం, పోలీసుల దర్యాప్తు తీరుతెన్నులపై కొంత అవగాహన కలిగి ఉండటంతో ఎత్తులకు పైఎత్తులు వేస్తూ పారిపోయారు. భార్గవ్రామ్ బెంగళూరు నుంచి, గుంటూరు శ్రీను పుణే నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. వీళ్లు బస చేసిన హోటళ్లపై పోలీసులు దాడి చేయడానికి కొద్దిసేపటి ముందే బయటకు జారుకున్నారు. వీరితోపాటు జగద్విఖ్యాత్రెడ్డి, చంద్రహాస్ తదితరుల కోసం హైదరాబాద్ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. -
ఐటీ అధికారులుగా ఎలా నటించారంటే..
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసు నిందితులు చాకచక్యంగా తప్పించుకు తిరుగుతున్నారు. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చి 9 రోజులైంది. పోలీసులు సూత్రధారిని అరెస్టు చేసినా ప్రధాన నిందితులను మాత్రం పట్టుకోలేకపోతున్నారు. పోలీసుల నుంచి త్రుటిలో తప్పించుకుంటూ చుక్కలు చూపిస్తున్నారు. ఈ నెల 5న అర్ధరాత్రి కిడ్నాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వెంటనే స్పందించిన పోలీసులు సూత్రధారి భూమా అఖిలప్రియను అదుపులోకి తీసుకుని బాధితుల్ని విడిపించారు. ఆ తర్వాతి రోజే ఆమెను అరెస్టు చేశారు. అప్పటికే ఈ కేసులో ఆమె భర్త భార్గవ్రామ్, అనుచరుడు గుంటూరు శ్రీను కీలకంగా వ్యవహరించారని పోలీసులు గుర్తించారు. అయితే అఖిలప్రియ అరెస్టు తర్వాత మిగిలిన నిందితులు అంతా తమ అదుపులోనే ఉన్నట్లుగా పోలీసులు వ్యవహరించారు. మళ్ళీ ఆదివారం నుంచి వేగంగా స్పందించిన ప్రత్యేక బృందాలు ఆ మరుసటిరోజు అఖిలప్రియ పీఏ బోయ సంపత్, భార్గవ్రామ్ పీఏ నాగరదొడ్డి మల్లికార్జున్రెడ్డిలతోపాటు గుంటూరు శ్రీను అనుచరుడు డోర్లు బాల చెన్నయ్యలను పట్టుకున్నారు. చదవండి: ముగిసిన అఖిలప్రియ పోలీస్ కస్టడీ ఈలోపు భార్గవ్రామ్, గుంటూరు శ్రీను, అఖిలప్రియ సోదరుడు జగద్విఖ్యాత్రెడ్డి తదితరులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పోలీసుల ఉదాసీనతలను తమకు అనుకూలంగా మార్చుకున్న ఈ నిందితులు ఉత్తరాదికి పారిపోయారు. నిందితులు అప్పటికే నేరచరిత్ర కలిగి ఉండటం, పోలీసుల దర్యాప్తు తీరుతెన్నులపై కొంత అవగాహన కలిగి ఉండటంతో ఎత్తులకు పైఎత్తులు వేస్తూ పారిపోయారు. భార్గవ్రామ్ బెంగళూరు నుంచి, గుంటూరు శ్రీను పుణే నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. వీళ్లు బస చేసిన హోటళ్లపై పోలీసులు దాడి చేయడానికి కొద్దిసేపటి ముందే బయటకు జారుకున్నారు. వీరితోపాటు జగద్విఖ్యాత్రెడ్డి, చంద్రహాస్ తదితరుల కోసం హైదరాబాద్ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. చదవండి: అతడి అరెస్టుతో సంచలన విషయాలు వెలుగులోకి కిడ్నాప్ ఎలా జరిగిందంటే.. అఖిలప్రియ పోలీసు కస్టడీ బుధవారంతో ముగిసింది. మూడు రోజులపాటు ఈమెను విచారించిన బోయిన్పల్లి పోలీసులు అనేక కీలకాంశాలు రాబట్టారు. కిడ్నాప్ జరిగినరోజు బా ధితుల ఇంటికి భార్గవ్రామ్తోపాటు జగద్వి ఖ్యాత్రెడ్డి కూడా వెళ్లినట్లు తేలింది. అపహరణకు ముందు కూకట్పల్లిలో ఉన్న పార్థ గ్రాండ్ హోటల్లో భార్గవ్రామ్ మిగిలిన నిందితులతో సమావేశం ఏర్పాటు చేశాడు. అక్కడ నుంచి వారిని యూసుఫ్గూడలోని ఎంజీఎం ఇంటర్నేషనల్ స్కూల్కు తీసుకువచ్చారు. అక్కడి ప్రొజెక్టర్లో గ్యాంగ్, స్పెషల్ 26 సినిమాల్లోని కొన్ని సీన్స్ ప్రదర్శించారు. ఐటీ అధికారులుగా ఎలా నటించాలనేది ఆ సీన్ల ద్వారా చూపించారు. అక్కడే అద్దెకు తెచ్చిన పోలీసు దుస్తులు, కొత్తగా ఖరీదు చేసిన ఫార్మల్ డ్రెస్సులను నిందితులు ధరించారు. అక్కడ నుంచి బోయిన్పల్లి వరకు భార్గవ్రామ్, జగద్విఖ్యాత్రెడ్డి ఒకే వాహనంలో ప్రయాణించారు. కిడ్నాప్ జరిగిన తర్వాత నేరుగా మొయినాబాద్లోని ఫామ్హౌస్కు చేరుకున్న భార్గవ్ అక్కడే బాధితులతో సంతకాలు చేయించాడు. ఈ కేసులో మొత్తం30 మంది ప్రమేయముందని అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే నలుగురిని అరెస్టు చేశారు. మరో పది మంది అదుపులో ఉండగా మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. -
ముగిసిన అఖిలప్రియ పోలీస్ కస్టడీ
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అఖిల ప్రియ పోలీస్ కస్టడీ ముగిసింది. కాసేపట్లో గాంధీ ఆసుపత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం జడ్జి నివాసంలో అఖిల ప్రియను హాజరపరిచి.. చంచల్గూడ జైలుకు తరలించనున్నారు. కాగా, ఆమె భర్త భార్గవ్రామ్ సొంత పాంహౌజ్లో.. బాధితుల నుంచి సంతకాలు సేకరించినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. (చదవండి: కిడ్నాప్ ప్లానంతా అతని కనుసన్నల్లోనే..) ఇప్పటి వరకు అఖిలప్రియకు 300 ప్రశ్నలు సంధించిన పోలీసులు.. ఈ కేసులో నిందితులైన భార్గవ్రామ్, చంద్రహాస్, గుంటూరు శ్రీను ఆచూకీపై ఆరా తీశారు. టెక్నికల్ సాక్ష్యాలను అఖిలప్రియ ముందు ఉంచటంతో.. పలు ప్రశ్నలకు ఆమె సమాధానం దాటవేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. భార్గవ్, గుంటూరు శ్రీను, జగత్ విఖ్యాత్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. చదవండి: అక్షయ్ సినిమా నుంచి స్ఫూర్తి పొందిన అఖిలప్రియ -
అతడి అరెస్టుతో సంచలన విషయాలు వెలుగులోకి
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఏ1గా ఉన్న టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు జగత్విఖ్యాత్రెడ్డి కారు డ్రైవర్ అరెస్టుతో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విచారణలో భాగంగా.. కిడ్నాప్లో జగత్విఖ్యాత్కు ప్రమేయం ఉన్నట్లు అతడు వెల్లడించినట్లు సమాచారం. అఖిలప్రియ భర్త భార్గవ్రామ్తో పాటు అతడు కూడా.. బాధితుడు ప్రవీణ్రావు ఇంట్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఐటీ అధికారులమంటూ.. వారిని బెదిరించినట్లు సమాచారం. వీరిద్దరు స్పాట్లో ఉండగా... లోథా అపార్ట్మెంట్లో ఉన్న అఖిలప్రియ ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. అదే విధంగా కిడ్నాప్ తర్వాత.. భార్గవ్, జగత్విఖ్యాత్ ఒకే వాహనంలో వెళ్లినట్లు కూడా విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జగత్ విఖ్యాత్ను కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చనున్నట్లు తెలుస్తోంది. (చదవండి: అక్షయ్ సినిమా నుంచి స్ఫూర్తి పొందిన అఖిలప్రియ) మూడోరోజు విచారణ.. 300 ప్రశ్నలు ఈ కేసులో నిందితురాలిగా ఉన్న భూమా అఖిలప్రియ మూడోరోజు విచారణ ముగిసింది. ఈ క్రమంలో.. ఆమె భర్త భార్గవ్రామ్ సొంత పాంహౌజ్లో.. బాధితుల నుంచి సంతకాలు సేకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు అఖిలప్రియకు 300 ప్రశ్నలు సంధించిన పోలీసులు.. ఈ కేసులో నిందితులైన భార్గవ్రామ్, చంద్రహాస్, గుంటూరు శ్రీను ఆచూకీపై ఆరా తీశారు. టెక్నికల్ సాక్ష్యాలను అఖిలప్రియ ముందు ఉంచటంతో.. పలు ప్రశ్నలకు ఆమె సమాధానం దాటవేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. భార్గవ్, గుంటూరు శ్రీను, జగత్ విఖ్యాత్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. -
అక్షయ్ సినిమా నుంచి స్ఫూర్తి పొందిన అఖిలప్రియ
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అఖిలప్రియ అండ్ గ్యాంగ్ సినిమా తరహాలో కిడ్నాప్కు ప్లాన్ చేసింది. భార్గవ్ సోదరుడు చంద్రహాస్ కిడ్నాప్కు ముందు అక్షయ్ కుమార్ నటించిన ‘స్పెషల్ 26’ అనే సినిమాని అఖిలప్రియ అండ్ గ్యాంగ్కు చూపెట్టాడు. అలానే ఐటి అధికారులుగా ఎలా నటించాలి అనే దానిపై వారం రోజుల పాటు శిక్షణ కూడా ఇచ్చినట్లు తెలిసింది. యూసుఫ్ గూడలోని ఎంజీఎం స్కూల్లో చంద్రహాస్, అఖిలప్రియ అండ్ గ్యాంగ్కి కిడ్నాప్కు సంబంధించి శిక్షణ ఇచ్చాడు. ఇక అఖిలప్రియ ఆదేశాలకు అనుగుణంగానే అక్షయ్ కుమార్ సినిమా చూపెట్టి కిడ్నాప్ చేయించినట్లు భార్గవ్, చంద్రహాస్ తెలిపారు. అలానే ఐటి అధికారుల చెకింగ్ డ్రెస్సులు, ఐడి కార్లను చంద్రహాస్ తయారు చేశాడు. శ్రీ నగర్ కాలనీలోని ఒక సినిమా కంపెనీ నుంచి ఐటి అధికారుల డ్రెస్లను వీరు అద్దెకు తీసుకున్నారు. (చదవండి: పోలీసుల అదుపులో భార్గవ్రామ్!?) -
పోలీసుల అదుపులో భార్గవ్రామ్!?
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో హైదరాబాద్ పోలీసులు పురోగతి సాధించారు. గోవాలో నలుగురు నిందితులను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. సిద్ధార్థ్తో పాటు ముగ్గురిని హైదరాబాద్కు తీసుకువస్తున్నారు. అయితే ఈ కేసులో ఏ1 నిందితురాలిగా ఉన్న టీడీపీ నేత, మాజీ మంత్రి అఖిలప్రియ భర్త, నిందితుడు భార్గవ్రామ్ ఆచూకీ మాత్రం లభించలేదు. అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. బెంగళూరు, చెన్నై, గోవా, ఏపీలో ప్రత్యేక బృందాలు అతడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఇక ఈ కేసులో అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డికి కూడా ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే అతడి కారు డ్రైవర్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. భార్గవ్ రామ్, గుంటూరు శ్రీనుతో పాటు మరికొంత మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.(చదవండి: కథ.. స్క్రీన్ప్లే.. దర్శకత్వం.. అఖిలప్రియ!) ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంది: డీసీపీ బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితులు పరారీలోనే ఉన్నారని నార్త్జోన్ డీసీపీ కల్మేశ్వర్ సింగెన్వర్ తెలిపారు. భార్గవరామ్, గుంటూరు శ్రీను ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా.. న్యాయవాది సమక్షంలో అఖిల ప్రియ విచారణ సాగుతోందన్న డీసీపీ.. రెండో రోజు విచారణ పూర్తయినట్లు వెల్లడించారు. గురువారం మధ్యాహ్నం వరకు అఖిలప్రియ తమ కస్టడీలోనే ఉంటుందని తెలిపారు. ఆమె హెల్త్ కండీషన్ బాగుందని పేర్కొన్నారు. ఇక విచారణలో భాగంగా కొన్ని కాగా కిడ్నాప్ చేయడానికి గల ఉద్దేశంపైనే ప్రధానంగా విచారణ సాగినట్లు సమాచారం. ఈ క్రమంలో నిందితుల సెల్ టవర్ లొకేషన్, కాల్ డేటా వివరాలను పోలీసులు అఖిల ప్రియ ముందు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రశ్నలకు మాత్రమే అఖిల ప్రియ జవాబు ఇచ్చారని.. మరికొన్నింటికి గుర్తు లేదంటూ సమాధానం దాట వేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బుధవారం నాటి దర్యాప్తు కీలకంగా మారనుంది. -
కిడ్నాప్ కేసు: అఖిలప్రియ వాడిన సిమ్ నంబర్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో పోలీసులు ముగ్గురుని అరెస్ట్ చేడమే కాక.. కీలక ఆధారాలు సేకరించారు. ఈ సందర్భంగా సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. ‘మల్లికార్జున్రెడ్డి, సంపత్కుమార్, అఖిలప్రియ పీఏ బాలచెన్నయను అరెస్ట్ చేశాం. నిందితులు ఉపయోగించిన సెల్ఫోన్లు, కార్లు స్వాధీనం చేసుకున్నాం. నిందితులు ఫేక్ నంబర్ ప్లేట్లు ఉన్న కార్లను వాడారు. బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియ ప్రధాన సూత్రధారి. కిడ్నాప్ చేయడానికి ముందు నిందితులు మియాపూర్లో ఆరు సిమ్ కార్డులు కొన్నారు. కాగా వీటిలో 70956 37583 నంబర్ని అఖిలప్రియ వాడారు. మల్లికార్డున్రెడ్డి ద్వారా 6 సిమ్లు, మొబైల్స్ కొనుగోలు చేశారు. కిడ్నాప్నకు ముందు నిందితులు రెక్కి నిర్వహించారు. భార్గవ్రామ్, గుంటూరు శ్రీను పథకం ప్రకారం కిడ్నాప్ చేశారు. ఈ ఘటనలో మొత్తం 19 మంది పాత్ర ఉంది’ అని సీపీ తెలిపారు. (చదవండి: అఖిలప్రియ రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు) అఖిలప్రియ ఆరోగ్యం బాగానే ఉంది : సీపీ ఇద్దరు మహిళా అధికారుల సమక్షంలో అఖిలప్రియని అరెస్ట్ చేశాం. గాంధీ ఆస్పత్రిలో ఆమెకు అన్నివైద్య పరీక్షలు చేయించాం. అఖిలప్రియ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని రిపోర్టుల్లో వచ్చింది. మెడకల్ రిపోర్టును కోర్టుకు సమర్పించాం అని సీపీ అంజనీకుమార్ తెలిపారు. అఖిలప్రియను చంచలగూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. చంచలగూడ జైలు నుంచి బేగంపేట మహిళా పోలీసు స్టేషన్కు తరలించారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలపై కూపీ లాగనున్నట్లు పోలీసులు తెలిపారు. -
మా అక్కకు జైల్లో భోజనం పెట్టడం లేదు: భూమా మౌనిక
సాక్షి, హైదరాబాద్: ‘టెర్రరిస్టులను కూడా బాగా చూసుకునే దేశం మనది. జైల్లో మా అక్కకు కనీసం భోజనం పెట్టడం లేదు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మా అక్క జైలు నుంచి ప్రాణాలతోనే వస్తుందా అని భయం వేస్తుంది’ అంటూ టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరి మౌనిక ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో మౌనిక మాట్లాడుతూ.. ‘జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పొలిటికల్ గేమ్ నడుస్తోంది అనిపిస్తోంది. అఖిలప్రియ ఆధారాలు ట్యాంపరింగ్ చేశారు అని పోలీసులు ఆధారాలు కోర్టుకు ఇవ్వకుండా రిమాండ్ రిపోర్టులో చెప్పారు. అఖిలప్రియ హెల్త్ కండిషన్ సరిగ్గా లేకున్నా అంతా బాగుంది అని పోలీసులు చెప్తున్నారు. టెర్రరిస్టులను అయినా సరిగ్గా చూసుకుంటారు. అంతకంటే దారుణమా. ఏ-1 ఏవీ సుబ్బారెడ్డిని పట్టుకొని వదిలేశారు. ప్రవీణ్ రావును కొట్టారు, తిట్టారు అన్నారు.. మరి కోర్టుకు ఎందుకు ఆధారాలు చూపించలేదు. గాంధీ హాస్పిటల్ నుంచి మీడియా, కరెంట్ తీసివేసి ఎందుకు తీసుకెళ్లారు’ అంటూ మౌనిక పలు ప్రశ్నలు సంధించారు. వేరే రాష్ట్రం నుంచి వస్తే.. ఇక్కడ ఉండనివ్వరా? ఇక ‘ల్యాండ్ సమస్య మా నాన్న ఉన్నప్పటి నుంచి కొనసాగుతుంది. వాళ్ళ మరణం తరువాత మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు. భూమా కుటుంబం ఏపీకే కాదు ఇరు ప్రాంతాలకు సేవలు చేశారు. ఆళ్లగడ్డ నుంచి వస్తే సంస్కారం లేని వ్యక్తులా. సెటిలర్లు ఓట్లు వేస్తేనే కదా జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్కు సీట్లు వచ్చాయి. ఆ విషయం మర్చిపోయారా. పోలీసుల స్టేట్మెంట్ సరిగ్గా లేదు. ఒక మాజీ మంత్రిని ట్రీట్ చేసే విధానం ఇదేనా. అఖిల-సుబ్బారెడ్డి ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు అని పోలీసులు చెప్పి.. రాత్రికి రాత్రి పూర్తిగా మార్చేశారు. గాంధీ హాస్పిటల్ సీసీటీవీ ఫూటేజ్ బయటపెట్టాలి. పోలీసులు జడ్జీలు అన్నట్లు చెప్తున్నారు. అఖిలప్రియ నేరం చేసినట్లు కోర్టుకు ఒక్క ఆధారం కూడా చూపించలేదు. ప్రజలకు సేవ చేసే వృత్తిలో ఉంటే ఇంత ఇబ్బంది పడాలా. వైద్యుల డ్యూటీ కూడా పోలీసులే చేస్తున్నారు. పోలీసులపై రాజకీయ ఒత్తిడి ఉంది అని అనుమానం కలుగుతోంది. వేరే రాష్ట్రం నుంచి వస్తే రాష్ట్రంలో ఉండనివ్వరా. అఖిలప్రియపై పోలీసులు రోజుకో కొత్త కేసు పెడుతున్నారు’ అని మౌనిక ఆరోపించారు. (చదవండి: ఎందుకు చంపాలనుకున్నారు?) ఇక భార్గవ్ రామ్ వస్తే ఏం చేస్తారో ‘ఆ ల్యాండ్ మా నాన్నది... అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. మేము పుట్టింది ఆళ్లగడ్డలో అయినా పెరిగింది సిటీలోనే. మేము హైదరాబాద్లో ఉన్నామా.. పాకిస్తాన్లో ఉన్నామా అని అనిపిస్తోంది. మా జీవితాలు సినిమా చూసినట్లు ఉంది. మేము సీఎం కేసీఆర్ని రిక్వస్ట్ చేస్తున్నాం.. మధ్య వర్తిత్వం వహించి సమస్యను పరిష్కరించండి. పోలీసులు కనీసం ప్రోటోకాల్ ఫాలో కాకుండా మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్నారు. ల్యాండ్ ధర పెరిగింది అని పోలీసులు అంటున్నారు.. ధర పెరిగినట్లు వాళ్లకు ఎలా తెలుసు. భూమా కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ కుళ్లు రాజకీయాలు మాకు వద్దు.. మా కుటుంబ పరంగా వస్తున్న రాజకీయ సేవలు మేము చేస్తున్నాము. 70 ఎకరాల ల్యాండ్ సమస్య ఉంది. మా కుటుంబానికి కావాల్సింది ల్యాండ్ కాదు.. మా అక్క కావాలి. మమ్మల్ని సెటిలర్లుగా.. ఔట్ సైడర్స్గా, ఫ్యాక్షనిస్టులుగా చూపిస్తున్నారు. మా అక్కను ఇలా ట్రీట్ చేస్తున్నారు.. ఇక భార్గవ్ రామ్ వస్తే ఏం చేస్తారో. ప్రవీణ్ రావు హెల్త్ రిపోర్ట్స్ ఎందుకు కోర్టులో చూపించలేదు. సూపరింటెండెంట్ నాకు కాల్ చేసి హెల్త్ రిపోర్ట్స్ కావాలని అడిగారు’ అని తెలిపారు. (చదవండి: అఖిలప్రియకు బెయిల్ ఇవ్వొద్దు..) కేసీఆర్ పెద్ద మనసు చేసుకోని సమస్యను పరిష్కరించాలి. 2006 లేదా 2007లో చాలా మంది పై అక్కడ ల్యాండ్ రిజిస్ట్రేషన్ జరిగింది. ఏవీ సుబ్బారెడ్డి, మేము కలిసి కిడ్నాప్ చేసినట్లు పోలీసులు చెప్పారు. కానీ సీన్ మారింది. ఏవీ సుబ్బారెడ్డి ఆధారాలు ట్యాంపర్ చేయడని పోలీసులకు ఏంటి నమ్మకం. ఏ-1కి నోటీసులు ఇచ్చి... ఏ-2ని పిక్ చేసి అరెస్ట్ చేస్తారా. మేము కూర్చొని మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాము. ఆ ల్యాండ్ ఒక్కరి పేరుమీద లేదు. చాలా కంపెనీలు ఉన్నాయి. రాజకీయ ఒత్తిడి లేకపోతే ఇంత హడావుడి జరుగదు అనిపిస్తుంది. నేను కేసీఆర్ ఫ్యామిలీని విజ్ఞప్తి చేస్తున్నాను.. దయచేసి సమస్యను పరిష్కారించండి’ అని మౌనిక అభ్యర్థించారు. -
కిడ్నాప్ ప్లానంతా అతని కనుసన్నల్లోనే..
సాక్షి, హైదరాబాద్: హఫీజ్పేట భూ వ్యవహారంలో కిడ్నాప్ ముఠా నాయకుడు మాడాల శ్రీను నేరచరిత్రపై టాస్క్ఫోర్స్ పోలీసులు ఆరా తీస్తున్నారు. కిడ్నాప్ ముఠాలో కీలక వ్యక్తి గుంటూరుకు చెందిన శ్రీనుకు.. అఖిలప్రియ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరు ఉంది. నంద్యాల ఉపఎన్నికలో శ్రీను కీలకంగా వ్యవహరించారు. కిడ్నాప్ ప్లాన్ అంతా అతని కన్నుసన్నల్లోనే జరిగినట్లు సమాచారం. శ్రీనగర్ కాలనీలో ఐటీ అధికారుల డ్రెస్లను అద్దెకు తీసుకున్న శ్రీను.. సినీఫక్కీలో కిడ్నాప్కు ప్లాన్ చేసినట్లు తెలిసింది. భార్గవ్రామ్కు రైట్హ్యాండ్గా శ్రీను వ్యవహరిస్తున్నారు (చదవండి: అఖిలప్రియను అరెస్టు చేయకుంటే అనర్థాలెన్నో!) కాగా, ప్రవీణ్ రావు తదితరుల్ని కిడ్నాప్ చేయడానికి అఖిలప్రియ దాదాపు 6 నెలల క్రితమే పథకం వేశారని అనుమానిస్తున్నారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న గుంటూరు శ్రీను నకిలీ నంబర్ ప్లేట్తో కూడిన వాహనంలో సంచరిస్తుండగా బోయిన్పల్లి పోలీసులు ఐదు నెలల క్రితమే పట్టుకున్నారు. అలా ఎందుకు చేశారని పోలీసులు ప్రశ్నించగా... తాను కొందరి కోసం పనిచేస్తుంటానని, ఈ నేపథ్యంలోనే ముప్పు పొంచి ఉండటంతో తరచూ వాహనం నంబర్ ప్లేట్లు మారుస్తుంటానని చెప్పి తప్పించుకున్నట్లు తెలిసింది. వాస్తవానికి అప్పట్లో నకిలీ నంబర్ ప్లేట్తో ప్రవీణ్రావు ఇంటి వద్ద రెక్కీ కోసమే గుంటూరు శ్రీను వెళ్లినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.(చదవండి: అఖిల ప్రియకు కోర్టులో చుక్కెదురు) -
అఖిలప్రియను అరెస్టు చేయకుంటే అనర్థాలెన్నో!
సాక్షి, హైదరాబాద్: ఏపీ మాజీ మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి భూమా అఖిలప్రియ రిమాండ్ రిపోర్టులో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న అఖిలప్రియను అరెస్టు చేయకపోతే అనేక అనర్థాలు చోటు చేసుకుంటాయని హైదరాబాద్ పోలీసులు పేర్కొంటున్నారు. ఇదే విషయాన్ని న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు. హఫీజ్పేటలో ప్రవీణ్రావు 2016లో ఖరీదు చేసిన 25 ఎకరాల భూమికి సంబంధించిన వివాదాన్ని అఖిలప్రియ తండ్రి భూమా నాగిరెడ్డి తదితరులు పరిష్కరించారు. అప్పట్లోనే ఒప్పందం ప్రకారం నిర్ణీత మొత్తాన్ని ప్రవీణ్రావు చెల్లించారు. ఇటీవల ఆ భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో తమకు అప్పట్లో ఇచ్చిన మొత్తం చాలదని, భారీ మొత్తం చెల్లించాలని, లేదంటే ఆ భూమిలో వాటా కావాలని అఖిలప్రియ, ఆమె భర్త భార్గరామ్ కలసి ప్రవీణ్రావుపై ఒత్తిడి తెచ్చారు. ఇందులో భాగంగా నెరవేర్చుకోవడానికే గుంటూరు శ్రీను, సాయి, చంటి, ప్రకాశ్ తదితరులతో కలసి మంగళవారం రాత్రి బాధితుల్ని కిడ్నాప్ చేయించారు. ఈ క్రమంలో చిలుకూరులో ఉన్న ఓ ఫామ్హౌస్లో నిర్బంధించి సెటిల్మెంట్ చేసుకో వాలని బెదిరిస్తూ కర్రలతో వారిపై దాడి చేశారు. ఆపై ఖాళీ బాండ్ పేపర్లపై సంతకాలు చేయించు కున్నారు. ఈ కిడ్నాపులకు సంబంధించిన వార్త మీడియాలో రావడంతో తీవ్ర కలకలం రేగిందని, పోలీసుల వేట ముమ్మరం కావడంతో అఖిలప్రియ తదితరులు అప్రమత్తమయ్యారు. ఆమె సూచన మేరకు ప్రవీణ్, సునీల్, నవీన్లను మెహిదీపట్నం సన్సిటీ సమీపంలోని కాళీమాత దేవాలయం వద్ద వదిలి వెళ్లారు. అఖిలప్రియ రాజకీయంగా పలుకు బడి ఉన్న నేత కావడంతో సాక్ష్యాలు తారుమారు చేయడంతోపాటు సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ పోలీసులు కోర్టుకు నివేదిం చారు. దర్యాప్తునకు కూడా ఆటంకం కలిగించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.(చదవండి: బెంగళూరులో ఏ-3 భార్గవరామ్?) అరెస్టు చేయకపోతే... పరారీలో ఉన్న ఆమె భర్త భార్గవ్రామ్కు నేరచరిత్ర ఉందని, అఖిలప్రియను అరెస్టు చేయకపోతే ఇద్దరూ కలిసి నేరాలు కొనసాగించవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా అనేక మంది నిందితులు పరారీలో ఉన్నారని కోర్టుకు తెలిపారు. బాధితులతోపాటు వారి కుటుంబీకులపై మరోసారి దాడికి పాల్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిందితుల్ని అరెస్టు చేయడం ద్వారా బాధితులకురక్షణ కల్పించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. భార్గవ్రామ్తోపాటు ఇతర నిందితుల్ని అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి. ఏపీలోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో భార్గవ్రామ్ ఉన్నాడని అనుమానిస్తున్న పోలీసులు ఓ టీమ్ను అక్కడకు పంపారు. 6 నెలల క్రితమే పథకం! కాగా ప్రవీణ్ రావు తదితరుల్ని కిడ్నాప్ చేయడానికి అఖిలప్రియ దాదాపు 6 నెలల క్రితమే పథకం వేశారని అనుమానిస్తున్నారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న గుంటూరు శ్రీను నకిలీ నంబర్ ప్లేట్తో కూడిన వాహనంలో సంచరిస్తుండగా బోయిన్పల్లి పోలీసులు ఐదు నెలల క్రితమే పట్టుకున్నారు. అలా ఎందుకు చేశారని పోలీసులు ప్రశ్నించగా... తాను కొందరి కోసం పనిచేస్తుంటానని, ఈ నేపథ్యంలోనే ముప్పు పొంచి ఉండటంతో తరచూ వాహనం నంబర్ ప్లేట్లు మారుస్తుంటానని చెప్పి తప్పించుకున్నట్లు తెలిసింది. వాస్తవానికి అప్పట్లో నకిలీ నంబర్ ప్లేట్తో ప్రవీణ్రావు ఇంటి వద్ద రెక్కీ కోసమే గుంటూరు శ్రీను వెళ్లినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అతడిని పట్టుకోవడానికి ఓ ప్రత్యేక బృందాన్ని ఏపీకి పంపారు. -
అఖిల ప్రియకు కోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: హాకీ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్రావు ,అతని ఇద్దరు సోదరుల కిడ్నాప్ కేసులో ఏ-1గా ఉన్న భూమా అఖిలప్రియకు గురువారం సికింద్రాబాద్ కోర్టులో చుక్కెదురైంది. మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. కాగా ప్రవీణ్రావు కిడ్నాప్ కేసులో అఖిలప్రియ ప్రస్తుతం చంచల్గూడ జైలులో 14 రోజుల రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే. (చదవండి: అఖిలప్రియ రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు) ఆమె పిటిషన్ను పరిశీలించిన కోర్టు.. జైలులోనే అఖిలప్రియకు అవసరమైన వైద్య సదుపాయాలు ఉన్నాయని.. వైద్యులు కూడా అందుబాటులో ఉన్నారని తెలిపింది. ఒకవేళ అఖిలప్రియ ఆరోగ్యం బాగాలేదని.. మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించాలని జైలు అధికారులు సూచిస్తే ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది. కాగా అఖిలప్రియ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై శుక్రవారం సికింద్రాబాద్ కోర్టులో విచారణకు రానుంది. అఖిలప్రియ బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలంటూ కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు రేపు బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయనున్నారు. -
అఖిలప్రియ రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన బోయిన్పల్లి కిడ్నాప్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. హఫీజ్పేట్ భూ వివాదంలో సూత్రధారి భూమా అఖిలప్రియగా పోలీసులు తేల్చారు.. ఈ కేసులో ఏ-1గా భూమా అఖిలప్రియను పేర్కొంటూ, ఎఫ్ఐఆర్లో పోలీసులు మార్పులు చేశారు. ఏ-2గా ఏవీ సుబ్బారెడ్డి, ఏ-3గా భార్గవ్రామ్, నిందితులుగా శ్రీనివాసరావు, సాయి,చంటి, ప్రకాశ్ పేర్లను పోలీసులు నమోదు చేశారు. (చదవండి: బోయిన్పల్లి కిడ్నాప్: వెలుగులోకి సంచలన విషయాలు) కళ్లకు గంతలు కట్టి తీసుకెళ్లినట్ల పోలీసులకు బాధితులు తెలిపారు. హఫీజ్పేట సర్వే నం.80లో 2016లో 25 ఎకరాలను బాధితులు కొనుగోలు చేశారని పోలీసులు వెల్లడించారు. భూమి తమదేనని అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి, భార్గవ్రామ్ వాదిస్తున్నారని, ఏవీ సుబ్బారెడ్డికి ప్రవీణ్రావు డబ్బులిచ్చి సెటిల్ చేసుకున్నారు.. భూమి ధర పెరగడంతో నిందితులు సమస్యలు సృష్టించారని, ఇంకా డబ్బులు కావాలని నిందితులు డిమాండ్ చేశారని పోలీసులు పేర్కొన్నారు. భూమా అఖిలప్రియపై అదనంగా మరో రెండు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఐపీసీ 147, 385 సెక్షన్ల కింద కేసులను పోలీసులు నమోదు చేశారు. అఖిలప్రియ బెయిల్ పిటిషన్పై కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పు సికింద్రాబాద్ కోర్టు రేపటికి వాయిదా వేసింది. టీడీపీ నేత అఖిలప్రియ రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ల్యాండ్ వ్యవహారంలో ఏవీ సుబ్బారెడ్డి పెద్ద ఎత్తున లాభం పొందగా, ల్యాండ్ వ్యవహారంలో వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు పోలీసులు పేర్కొన్నారు. 2016లో ప్రవీణ్కుమార్ సర్వే నంబర్ 80లో 25 ఎకరాల భూమి కొన్నారు. అదే భూమి తమదంటూ ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియ, భార్గవ్రామ్ లిటిగేషన్ పెట్టారు. భూ వివాదంపై ఇరు వర్గాల మధ్య చర్చలు జరగ్గా, చర్చల్లో ఏవీ సుబ్బారెడ్డికి ప్రవీణ్.. డబ్బు చెల్లించారు. సెటిల్మెంట్ విషయం తెలిసి అఖిలప్రియ మండిపడ్డారు ఏవీ సుబ్బారెడ్డితో ఎలా ఒప్పందం చేసుకున్నారని అఖిలప్రియ బెదిరింపులకు దిగారు. పెరిగిన భూమి విలువ ప్రకారం మరికొంత డబ్బు చెల్లించాలని బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రవీణ్రావు దగ్గర ఎలాగైన డబ్బు రాబట్టాలని అఖిలప్రియ దంపతులు ప్లాన్ వేశారు. సాయి అనే వ్యక్తితో కలిసి అఖిలప్రియ దంపతులు కిడ్నాప్ చేయించారు. కిడ్నాప్ తర్వాత ఓఆర్ఆర్ వద్ద ఖాళీ బాండ్ పేపర్పై కిడ్నాపర్లు సంతకాలు చేయించారు. సంతకాల సమయంలో ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియ పేర్లను కిడ్నాపర్లు ప్రస్తావించారు. సంతకాలు తీసుకునే సమయంలోకిడ్నాపర్లు కర్రలతో దాడి చేశారు. కిడ్నాప్ వ్యవహారంలో అఖిలప్రియను ముందే అదుపులోకి తీసుకోకుంటే.. సాక్ష్యాధారాలు తారుమారు చేసేవారని పోలీసులు భావించారు. అఖిలప్రియ, భర్త భార్గవ్రామ్కు నేర చరిత్ర ఉందని పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. -
బోయిన్పల్లి కిడ్నాప్: వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్ : బోయిన్పల్లి కిడ్నాప్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఆ వివరాలు.. కొన్నేళ్ల క్రితం భూమా నాగిరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డిలు హఫీజ్ పేట్లో భూములు కొనుగోలు చేశారు. ప్రవీణ్రావ్ తండ్రి కిషన్ రావ్.. భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు. నాగిరెడ్డి బతికి ఉన్న సమయంలో కిషన్ రావు కీలకంగా వ్యవహరించారు. భూమా మరణం తర్వాత ఏవీ సుబ్బా రెడ్డి ల్యాండ్ విషయంలో రంగంలోకి దిగారు. ఏవీ ఎస్టేట్స్ పేరుతో ల్యాండ్లోకి ప్రవేశించారు. ( బెంగళూరులో ఏ-3 భార్గవరామ్? ) ఈ నేపథ్యంలో 2020లో ఏవీ సుబ్బారెడ్డిపై కేపీ ఎస్టేట్స్ ఓనర్ ప్రవీణ్రావ్ ట్రెస్ పాస్ కేసు పెట్టారు. గతంలోనే 50 ఎకరాల భూమిలో చెరో 25 ఎకరాల ల్యాండ్ చెందేట్లు ఏవీ సుబ్బారెడ్డి మీడియేషన్ చేశారు. సెటిల్మెంట్ కూడా జరిగిపోయింది. కానీ, మిగతా 25 ఎకరాలు కూడా తమకే కావాలని ప్రవీణ్రావ్పై భూమా కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చారు. పక్కా ప్లాన్తో కిడ్నాప్కు పాల్పడ్డారు. -
అఖిలప్రియకు 14 రోజుల రిమాండ్
సాక్షి, హైదరాబాద్: హాకీ మాజీ ఆటగాడు ప్రవీణ్రావు, అతని ఇద్దరు సోదరుల కిడ్నాప్ కేసులో అరెస్టయిన టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు సికింద్రాబాద్ కోర్టు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు ఆమెను చంచల్గూడ జైలుకు తరలించారు. అంతకుముందు అఖిలప్రియకు గాంధీ ఆస్పత్రిలో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అఖిల ప్రియ వైద్య పరీక్షల రిపోర్టులో ఎలాంటి సమస్య లేదని వైద్యులు తేల్చారు. నీరసంతో కళ్లు తిరిగి పడిపోయినందునే అస్వస్థకు గురైనట్టు పేర్కొన్నారు. అనంతరం పోలీసులు ఆమెను జడ్జి నివాసంలో ప్రవేశపెట్టారు. కాగా, బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అఖిల ప్రియ ఏ2 గా ఉండగా.. ఆమె భర్త భార్గవ్రామ్ ఏ3గా, ఆళ్లగడ్డ టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి ఏ1 ఉన్నారు. ఏవీ సుబ్బారెడ్డిని బుధవారం సాయంత్రం హైదరాబాద్లో పోలీసులు అరెస్టు చేశారు. భార్గవ్రామ్ పరారీలో ఉన్నాడు. ఇదిలాఉండగా.. బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ అఖిలప్రియ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కిడ్నాప్ కేసుతో ఎలాంటి సంబంధం లేదని అఖిలప్రియ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో బెయిల్ పిటిషన్పై పబ్లిక్ ప్రాసిక్యూషన్కు న్యాయమూర్తి నోటీసులు జారీ చేశారు. అఖిలప్రియ బెయిల్ పిటిషన్పై రేపు సికింద్రాబాద్ కోర్టులో విచారణ జరగనుంది. (చదవండి: కిడ్నాప్ కేసు: ఏ1 ఏవీ సుబ్బారెడ్డి అరెస్టు) -
కిడ్నాప్ కేసు: ఏ1 ఏవీ సుబ్బారెడ్డి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: హాకీ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్రావు, అతని సోదరుల కిడ్నాప్ కేసులో ఏ1 గా ఆరోపణలు ఎందుర్కొంటున్న ఆళ్లగడ్డ టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిని మాదాపూర్లోని అతని నివాసంలో హైదరాబాద్ పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్టు చేశారు. తాజా అరెస్టుతో ప్రవీణ్రావు కిడ్నాప్ కేసులో అరెస్టయినవారి సంఖ్య మూడుకు చేరింది. ఏ2 అఖిలప్రియ, భార్గవ్రామ్ సోదరుడు చంద్రబోసును పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఏ3గా ఉన్న అఖిలప్రియ భర్త భార్గవ్రామ్ పరారీలో ఉన్నాడు. ఏ1 గా ఎందుకు చేర్చారో అర్థం కావడం లేదు అంతకు ముందు తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఏవీ సుబ్బారెడ్డి మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు. తనను ఎందుకు ఏ1గా చేర్చారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ‘కిడ్నాప్ కేసుతో నాకు ఎటువంటి సంబంధం లేదు. ప్రవీణ్రావుతో విభేదాలు ఉన్నది వాస్తవమే. హఫీజ్పేట్ భూ వివాదంపై ఇప్పుడు నేను మాట్లాడలేను. అఖిలప్రియ నన్ను చంపడానికి సుపారీ ఇచ్చిందని గతంలో కేసు పెట్టా. అలాంటి వారితో కలిసి నేనెందుకు కిడ్నాప్ చేయిస్తా. ఈ కేసు విషయంలో పోలీసులకు పూర్తిగా సహకరిస్తాను. ఈ కేసు తో సంబంధం ఉంటే ఇప్పటికే నన్ను పోలీసులు అరెస్ట్ చేసే వారు కదా?’అని ఏబీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. (చదవండి: కిడ్నాప్ కేసు: ఏ1 గా ఏవీ సుబ్బారెడ్డి) -
ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్టు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ సమీప బంధువుల కిడ్నాప్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ అరెస్ట య్యారు. హాకీ మాజీ ఆటగాడు ప్రవీణ్రావుతోపాటు ఆయన సోదరులను మంగళవారం రాత్రి సినీఫక్కీలో కిడ్నాప్ చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో అఖిలప్రియను ఏ1గా నిర్ధారించిన హైదరాబాద్ పోలీసులు.. బుధవారం ఆమెను అరెస్టు చేసి మారేడుపల్లిలోని 11వ ఏసీఎంఎం కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆశాలత 14 రోజుల రిమాండ్ విధించడంతో అఖిలప్రియను చంచల్గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న అఖిలప్రియ భర్త భార్గవరామ్ పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనతోపాటు మిగిలిన నిందితులను అరెస్టు చేయడానికి 15 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్టు సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. భూవివాదమే కారణం.. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని హఫీజ్పేటలో 40 ఎకరాల భూమికి సంబంధించిన వివాదమే ఈ కిడ్నాప్నకు కారణమని తెలుస్తోంది. ప్రవీణ్రావుతో పాటు ఆయన సోద రులు సునీల్రావు, నవీన్రావులను కిడ్నాప్ చేసి బెదిరించడం ద్వారా ఆ స్థలాన్ని తమ పేరుతో రాయించుకోవాలని అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ్రామ్ పథ కం వేశారు. ఈ బాధ్యతల్ని తమ అనుచరుడైన శ్రీనివాస్ చౌదరి అలియాస్ గుంటూరు శ్రీనుకు అప్పగించారు. నేరచరిత్ర ఉన్న ఇతడిపై గుంటూరులో రౌడీషీట్ ఉన్నట్లు తెలిసింది. మంగళవారం సాయంత్రం రంగంలోకి దిగిన గుంటూరు శ్రీను.. సాయి, చంటి, ప్రకాష్ సహా 14మంది శ్రీకృష్ణనగర్లో ఉన్న భార్గవ్కు చెందిన ఎంజీఎం ఇంటర్నేషనల్ స్కూల్లో సమావేశమయ్యారు. అక్కడే తాము వినియోగించుకోవాలని నిర్ణయించుకున్న ఇన్నోవా, స్విఫ్ట్ డిజైర్, మహేంద్ర వాహనాల నెంబర్ ప్లేట్లు మార్చి నకిలీవి తగిలించారు. అధికారుల్లా కనిపించేందుకు అందరూ ఫార్మల్ వస్త్రాలు, మెడలో టైలు ధరించారు. ఓ నిందితుడు పోలీసు యూనిఫాం వేసుకుని చేతితో లాఠీ కూడా పట్టున్నాడు. ఇవన్నీ ఫిల్మ్నగర్లో సినిమా షూటింగ్స్కు అద్దెకు ఇచ్చే దుకాణం నుంచి తెచ్చినట్లు అనుమానిస్తున్నారు. నకిలీ గుర్తింపుకార్డులు, బోగస్ సెర్చ్ వారెంట్లు కూడా తయారు చేసుకున్నారు. సోదాల పేరుతో హడావుడి చేసి... అంతా సిద్ధమైన తర్వాత మూడు వాహనాల్లో బయలుదేరి రాత్రి 7.20 గంటల ప్రాంతంలో బోయిన్పల్లిలో ప్రవీణ్ ఇంటికి చేరుకున్నారు. ఆదాయపు పన్ను అధికారులమని చెప్పి ఇంట్లోకి వెళ్లారు. ప్రవీణ్, సునీల్, నవీన్లను హాలులో ఉంచిన నిందితులు.. మిగిలిన కుటుంబ సభ్యులందరినీ ఓ బెడ్రూమ్లో బంధించారు. దాదాపు 20 నిమిషాలు సోదాల పేరుతో హడావిడి చేశారు. అనంతరం ఆ ముగ్గురి కళ్లకూ గంతలు కట్టి బయటకు తీసుకొచ్చారు. ముగ్గురినీ వేర్వేరు వాహనాల్లో ఎక్కించుకుని వారి చేతులు, కాళ్లూ కట్టేశారు. బోయిన్పల్లి నుంచి సికింద్రాబాద్, ప్యాట్నీ, మెహదీపట్నం మీదుగా చిలుకూరులో ఉన్న భార్గవ్ స్నేహితుడి ఫామ్హౌస్కు తీసుకెళ్లారు. అక్కడే ముగ్గురినీ నిర్బంధించి ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించుకున్నారు. మరోవైపు రాత్రి 8.20 గంటల ప్రాంతంలో పొరుగింట్లో ఉండే సచిత అనే మహిళ ప్రవీణ్రావు ఇంటికి వచ్చారు. ఓ గది నుంచి శబ్దాలు రావడం, బయట నుంచి గడియపెట్టి ఉండటం గమనించిన ఆమె.. తలుపు తీశారు. దీంతో గది బయటకు వచ్చిన కుటుంబీకులు ప్రవీణ్, నవీన్, సునీల్ కనిపించకపోయే సరికి సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించి కిడ్నాప్ జరిగినట్టు నిర్ధారణకు వచ్చారు. జల్లెడ పట్టిన ప్రత్యేక బృందాలు... ప్రవీణ్రావు తదితరులు కిడ్నాప్ అయిన విషయాన్ని వారి బంధువు కె.మనీష్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అఖిలప్రియతోపాటు ఆమె భర్త భార్గవరామ్, ఏవీ సుబ్బారెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. 15 బృందాలను రంగంలోకి దింపారు. మూడు కమిషనరేట్లలో పోలీసులు జల్లెడ పడుతుండటం, ఇరుగుపొరుగు రాష్ట్రాలకూ సమాచారం ఇవ్వడం, మీడియా హడావుడి నేపథ్యంలో నిందితులు పునరాలోచనలో పడ్డారు. బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో కోకాపేట వద్ద బందీలను వదిలేశారు. బాధితులు ఆ విషయాన్ని నార్త్జోన్ డీసీపీ కల్మేశ్వర్కు చెప్పడంతో పోలీసులు అక్కడకు వెళ్లి ముగ్గురినీ ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం బుధవారం ఉదయం 11.20 గంటలకు బోయిన్పల్లి పోలీసులు అఖిలప్రియను అదుపులోకి తీసుకుని బేగంపేటలోని మహిళా ఠాణాకు తీసుకువచ్చారు. విచారణ అనంతరం 12.40కి అరెస్టు చేసి వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీలో హైడ్రామా.. అఖిలప్రియ అరెస్టు అనంతరం గాంధీ ఆస్పత్రి వద్ద స్వల్ప హైడ్రామా చోటుచేసుకుంది. ఆస్పత్రి ప్రాంగణంలో వాహనం దిగుతూనే తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆమె.. స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అత్యవసర విభాగంలో చేర్పించి వైద్యసేవలు అందించడంతో కోలుకున్నారు. ఈ క్రమంలో అఖిలప్రియతోపాటు కుటుంబసభ్యులు హంగామా చేశారు. అఖిలప్రియకు ఫిట్స్ వచ్చి ప్రాణాపాయస్థితిలో ఉన్నారని వైద్యులపై ఒత్తిడి తెచ్చారు. ఆమె గర్భవతి అని కూడా అబద్ధాలు చెప్పారు. ఈ నేపథ్యంలో దాదాపు ఐదు గంటలపాటు అఖిలప్రియకు అన్ని రకాల పరీక్షలు చేసిన వైద్యులు.. ఆమె గర్భవతి కాదని, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని నిర్దారించారు. అనంతరం అఖిలప్రియను మీడియా కంటపడనీయకుండా పోలీసులు అక్కడ నుంచి న్యాయమూర్తి వద్దకు తీసుకెళ్లారు. పోలీసుల అదుపులో సుబ్బారెడ్డి ఈ కిడ్నాప్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏవీ సుబ్బారెడ్డిని నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలిలో నివసించే సుబ్బారెడ్డి.. ఈ కేసులో తన పేరు రావడంతో మీడియాతో మాట్లాడారు. మాదాపూర్లోని ఓ రెస్టారెంట్ వద్ద మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ విషయం గుర్తించిన టాస్క్ఫోర్స్ పోలీసులు అక్కడకు వెళ్లి ఆయన్ను అదుపులోకి తీసుకుని సికింద్రాబాద్లోని టాస్క్ఫోర్స్ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఫిర్యాదులోని అంశాల ఆధారంగానే సుబ్బారెడ్డిని నిందితుడిగా చేర్చి అదుపులోకి తీసుకున్నామని, విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాలను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. కిడ్నాప్లతో నాకు సంబంధం లేదు ప్రవీణ్రావుతో కొన్ని అంశాల్లో వివాదాలు ఉన్నాయి. బోయిన్పల్లిలో జరిగిన కిడ్నాప్లతో ఎలాంటి సంబంధం లేదు. ఆ కేసులో నన్ను నిందితుడిగా ఎందుకు పెట్టారో అర్థం కావడం లేదు. గతంలో భూమా అఖిలప్రియ తదితరులు నన్ను చంపడానికి ప్రయత్నించారు. కొందరికి సుపారీ కూడా ఇచ్చారు. అలాంటివారితో కలిసి ఎలా పనిచేస్తాను? – మీడియాతో ఏవీ సుబ్బారెడ్డి ఆ భూమి విలువ రూ.400 కోట్ల పైమాటే.. హఫీజ్పేట్: ఈ కిడ్నాప్ వ్యవహారానికి కారణమైన భూమి అత్యంత విలువైనదేనని తెలుస్తోంది. శేరిలింగంపల్లి మండలం న్యూ హఫీజ్పేట్లోని సర్వే నంబర్ 80లోని 25 ఎకరాల భూమిపై ఏళ్లుగా వివాదం నెలకొంది. బహిరంగ మార్కెట్లో ఈ భూమి విలువ రూ.400 కోట్ల పైమాటే. ఈ భూమి తమదంటే తమదంటూ ప్రభుత్వానికి, ప్రైవేటు వ్యక్తుల మధ్య వివాదం కొనసాగుతోంది. అయితే, అది ప్రభుత్వ భూమేనని ఆధారాలతో నిర్ధారించలేకపోవడంతో 2003లో హైకోర్టులో ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే, ఆ భూమిపై యాజమాన్య హక్కులు కలిగి ఉన్నామని కిడ్నాప్కు గురైన ప్రవీణ్రావు తదితరులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈ వివాదం ముదిరి కిడ్నాప్కు దారితీసినట్టు తెలుస్తోంది. 17 ఏళ్ల క్రితం ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చినా.. సర్కారు మాత్రం అది ప్రభుత్వ భూమేనని పేర్కొంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఈ కేసును పున:సమీక్షించాలని గత నెలలో సుప్రీంకోర్టు హైకోర్టును ఆదేశించినట్లు రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. (చదవండి: సికింద్రాబాద్ కోర్టుకు అఖిలప్రియ!) -
హైదరాబాద్ బోయిన్పల్లిలో అగ్నిప్రమాదం
-
భర్త కాపురం చేయకపోవడంతో భారీ చోరీ!
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గత సోమవారం రాత్రి జరిగిన చోరీ కేసులో.. సొంత కోడలే అత్తింట్లో భారీ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. భర్తతో కాపురం సజావుగాలేని కారణంగానే కోడలు ఈ చోరీకి పథకం పన్నిందని వెల్లడించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. వారం రోజుల్లో కేసును ఛేదించి సోమవారం వివరాలు వెల్లడించారు. గత సోమవారం (ఈ నెల 21న) సాయంత్రం సరళ తన కొడుకును సికింద్రాబాద్లో డ్రాప్ చేసి వచ్చేసరికి ఆగంతకులు ఇంట్లోకి చొరబడి బంగారం, నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై సరళ ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా కేసును చేధించిన పోలీసులు.. ఈ చోరీకి సరళ కోడలు సుప్రియతోపాటు ఆమె తల్లిదండ్రులు, సోదరుడు సహకరించారనే విషయం కనుగొన్నారు. సుప్రియ, ఆమె భర్త ధీరజ్ మధ్య కాపురం సజావుగా సాగకపోవడంతోనే.. వారు ఈ దుస్సాహసానికి ఒడిగట్టారని వివరించారు. దొంగతనానికి సుప్రియ సోదరుడు సాత్విక్ సూత్రధారని, అతనే పథకం పన్నాడని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రెండు కేజీల బంగారు అభరణాలు, రూ. 80 లక్షల విలువైన 6.5 కేజీల వెండి, వెగనార్ కారు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొన్నామని పేర్కొన్నారు. నిందితులు మారు తాళంతో ఇంట్లోకి చొరబడి ఈ దొంగతనం చేశారని పోలీసులు తెలిపారు. చదవండి: రూ.18లక్షల నగదు, 3 కిలోల బంగారం మాయం -
3 కేజీల బంగారం,నగదు చోరీ
-
తెరపైకి ముంపు గ్రామాల ఉద్యమం
సాక్షి, బోయినపల్లి: శ్రీరాజరాజేశ్వర(మిడ్మానేరు) ప్రాజెక్టు నిర్వాసితులు తమ సమస్యలు పరిష్కరించాలని పోరుబాట పట్టారు. ఇదే సమయంలో కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆదేశాలతో ముంపు గ్రామాల్లో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందనివారి నుంచి ప్రత్యేకాధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద 2006లో రాజరాజేశ్వర(మిడ్మానేరు)రిజర్వాయర్ పనులు ప్రారంభించారు. పదేళ్ల అనంతరం ప్రాజెక్టులోకి నీరు చేరింది. ప్రాజెక్టు నిర్మాణంలో బోయినపల్లి మండలం కొదురుపాక, నీలోజిపల్లి, వరదవెల్లి, వేములవాడ మండలం అనుపురం, రుద్రవరం, సంకెపెల్లి, ఆరెపెల్లి కొడుముంజ, తంగళ్లపల్లి మండలం చీర్లవంచ, చింతలఠాణా, ఇల్లంతకుంట మండలం గుర్రంవానిపల్లి గ్రామాలు ముంపునకు గురయ్యాయి. అధికారులు ఆయా గ్రామాల్లో సర్వేచేసి 11,731 కుటుంబాలు ముంపునకు గురవుతున్నట్లు 2008–09లో గెజిట్ ప్రకటించారు. తెలంగాణ ఏర్పడ్డాక మెజార్టీ నిర్వాసితులకు పరిహారం, ప్యాకేజీలు అందాయని అధికారులు అంటుంటే.. చాలా మంది పరిహారం అందాల్సినవారున్నారని నిర్వాసితులు వాపోతున్నారు. స్థానిక నేతలకు సీఎం కేసీఆర్ ఫోన్ ప్రాజెక్టుకు వస్తున్న నీటి ప్రవాహం గురించి సీఎం కేసీఆర్ ఈ నెల 16న స్థానిక నేతలతో ఫోన్లో మాట్లాడారు.వారు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ రాని వారి సమస్యలపై సీఎంకు వివరించారు. సీఎం జిల్లా కలెక్టర్ను కలవాలని ఆదేశించారు.ఎంపీపీ పర్లపెల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తెరపాక ఉమ తదితరులు జిల్లా కలెక్టర్ను కలిశారు. సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు ప్యాకేజీలు రాని నిర్వాసితుల నుంచి ప్రత్యేకాధికారులు దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఇళ్ల నిర్మాణాలకు రూ.5.04 లక్షలు ఆర్అండ్ఆర్ కాలనీలకు తరలిన నిర్వాసితులకు ప్రభుత్వం 242చదరపు గజాల ఇంటి స్థలం మంజూరుచేసింది. ఇళ్ల నిర్మాణాలకు రూ.5.04 లక్షలు ఇస్తామని సీఎం కేసీఆర్ వేములవాడలో ఇచ్చిన హామీని అమలు చేయాలని ఐక్యవేదిక,అఖిలపక్షం నేతలు డిమాండ్ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడిన సందర్భంలో ఇళ్ల నిర్మాణాలకు రూ. 5.04 లక్షలు ఇవ్వాలనే విషయం దృష్టికి తీసుకువెళ్లినట్లు స్థానిక నేతలు తెలిపారు.ఆడిట్ ప్రాబ్లం అవుతుందని, మిగతా ప్రాజెక్టులకు ఇవ్వాల్సివస్తుందని సీఎం చెప్పారని అంటున్నారు.ఐక్యవేదిక నేతలు ఇళ్ల నిర్మాణాలకు రూ.5.04లక్షలు ఇవ్వాలనే ప్రధాన డిమాండ్తో ఉద్యమానికి ఊపిర్లూదుతున్నారు. 30 భారీ బహిరంగసభ ముంపు గ్రామాల ఐక్యవేదిక,అఖిలపక్షం ఆధ్వర్యంలో గతనెల 31న చలో కలెక్టరేట్ పేరిట మహాపాదయాత్ర నిర్వాహించారు. అదే ఊపుతో రాష్ట్రస్థాయిలో వివిధ పార్టీల ముఖ్య నేతలతో కలిసి ఈ నెల 30న భారీ బహిరంగసభ నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. సభ ద్వారా ఇండ్ల నిర్మాణానికి రూ.5.04లక్షల సీఎం కేసీఆర్ హామీ,18 ఏళ్లు నిండిన యువతీ, యువకులకు రూ. 2 లక్షల ప్యాకేజీ, పట్టా, ఇల్లు ఉండి గ్రామంలో లేరనే నెపంతో గెజిట్ జాబితా నుంచి తొలగించిన వారి పేర్లు మళ్లీ గెజిట్ జాబితాలో చేర్చి పరిహారం, అధికారులు ఎస్టిమేట్ చేసిన పరిహారం రాని ఇళ్లకు పరిహారం ఇవ్వాలని, కాలనీల్లో కుటీర పరిశ్రమలు నెలకొల్పాలనే డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచాలని సన్నాహాలు చేస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణ నిర్వాసితులు పోరుబాట పడుతుంటే ముంపు గ్రామాల్లో ఇప్పటికీ పరిహారం రానివారి నుంచి తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేకాధికారులు రెండు రోజులుగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.ఈ నెల 24వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొంటున్నారు. -
కారు బీభత్సం : రెండుకు చేరిన మృతుల సంఖ్య
సాక్షి, హైదరాబాద్ : బోయిన్పల్లి డైరీ ఫామ్ రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాగమణి అనే మహిళ ఆదివారం రాత్రి మృతి చెందింది. ఈ ఘటనపై బోయిన్పల్లి సీఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ‘‘ ఆదివారం ఓ మైనర్ బాలుడు మారుతి వాహనాన్ని అతి వేగంగా నడుపుతూ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొట్టాడు. బోయిన్పల్లిలో డైరీ ఫామ్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగినపుడు ఆటోలో ఇద్దరు కవల పిల్లలతో పాటు నాగమణి, సంధ్య అనే ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. నిన్న ప్రమాద స్థలంలోనే 14 నెలల పిల్లాడు మృతి చెందాడు. అదే రోజు రాత్రి చికిత్స పొందుతూ పిల్లాడి నాన్నమ్మ నాగమణి కూడా మృతి చెందింది. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగింది. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తాం. వారి తల్లిదండ్రులకు కూడా కౌన్స్లింగ్ ఇస్తాం. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని పదే పదే చెబుతున్నాం. మార్పు రావడం లేదు, మైనర్ ర్యాస్ డ్రైవింగ్ కారణంగా రెండు నిండు ప్రాణాలు బలయ్యాయ’’ని తెలిపారు. -
టిప్పర్ లారీ అదుపు తప్పి దారుణం..
-
బోయిన్పల్లిలో దారుణం..
హైదరాబాద్ : నగరంలోని బోయిన్పల్లి దారుణం చోటుచేసుకుంది. టిప్పర్ లారీ అదుపు తప్పి ఆరేళ్ల పాప మీదకు దూసుకురావడంతో చిన్నారి మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. హస్మత్పేట గల్లీలోకి కంకర లోడ్తో వచ్చిన టిప్పర్ లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో వెనక్కి దూసుకొచ్చింది. ఈ క్రమంలో అక్కడే ఆడుకుంటున్న చిన్నారిపై నుంచి లారీ వెళ్లింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఇది గమనించిన స్థానికులు కేకలు వేయడంతో డ్రైవర్ లారీ అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఘటన స్థలానికి పెద్ద ఎత్తున చేరుకున్న స్థానికులు ఆందోళన చేపట్టారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని వారు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి భారీ లోడ్తో కూడిన వాహనాలకు పగటి పూట నగరంలోకి అనుమతి లేకపోయినప్పటికీ.. కంకర లోడ్తో కూడిన టిప్పర్ను చిన్న గల్లీలోకి ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. నిందితున్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. -
బోయినపల్లి పోలీస్స్టేషన్ సమీపంలో కలకలం
హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధిలోని బోయినపల్లి పోలీస్స్టేషన్ సమీపంలో మంగళవారం తీవ్ర కలకలం చోటుచేసుకుంది. ఒక యువతి పోలీసు స్టేషన్ సమీపంలోనే ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. స్థానికులు వెంటనే స్పందించి మంటలార్పారు. తీవ్రగాయాలపాలైన ఆమెను హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించాగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతదేహాన్ని సబితగా గుర్తించారు. ఆమె ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియాల్సి ఉంది. -
బోయిన్పల్లిలో విద్యార్ధిని అదృశ్యం
-
బోయిన్పల్లిలో భారీ అగ్నిప్రమాదం
-
కుటుంబం పరువు తీస్తోందని..
హైదరాబాద్: వివాహేతర సంబంధం కొనసాగిస్తూ.. కుటుంబం పరువు తీస్తోందని ఓ యువకుడు తన పిన్నిపై కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటన నగరంలోని బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం వెలుగు చూసింది. స్థానికంగా నివాసముంటున్న జ్యోతి అనే మహిళ భర్త స్నేహితునితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం పై కుటుంబ సభ్యులు పలుమార్లు హెచ్చరించినా తీరు మార్చుకోలేదు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం జ్యోతికి వరుసకు కొడుకయ్యే గణేష్ ఆమెపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గణేష్ను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ : ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేయబోయింది. ఈ సంఘటన బోయినపల్లి పోలీసుస్టేషన్ ఎదుట శుక్రవారం జరిగింది. వివరాల ప్రకారం.. బోయినపల్లికి చెందిన కీర్తి రెడ్డి(18), భవానీ శంకర్(22)లు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి కులాలు వేరు కావడంతో తల్లిదండ్రులు ఒప్పుకోరనే అనుమానంతో రహస్యంగా 4 రోజుల క్రితం కూకట్పల్లిలోని ఆర్యసమాజ్లో ప్రేమవివాహం చేసుకున్నారు. కాగా శుక్రవారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని పోలీసులను ఆశ్రయించారు. అమ్మాయి తల్లిదండ్రులు,బంధువులు కలిపి సుమారు 60 మంది బోయినపల్లి పోలీసు స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. తమ అమ్మాయిని తమకు అప్పగించాలని ఆందోళన నిర్వహించారు. చర్చలు కొనసాగుతున్నాయి. -
పరీక్షలు సరిగ్గా రాయలేదని..
బోయిన్పల్లి (కరీంనగర్) : ఈ మధ్యకాలంలో యువత చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు ఎక్కువవుతున్నాయి. తాజాగా బీటెక్ పరీక్షలు సరిగ్గా రాయలేదని మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా బోయిన్పల్లి మండలం విలాసాగర్లో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొప్పుల శ్రీలేఖ(21) హైదరాబాద్లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ ఇనిస్టిట్యూట్స్లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. నాలుగు రోజుల క్రితమే పరీక్షలు ముగించుకొని ఇంటికి వెళ్లిన శ్రీలేఖ పరీక్షలు సరిగ్గా రాయలేదని అన్యమనస్కంగా ఉంటోంది. ఈ క్రమంలో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రెండు మెడికల్ షాపులు సీజ్
బోయిన్పల్లి (కరీంనగర్) : లైసెన్స్లు లేకుండా ఔషధాలు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రెండు మెడికల్ షాపులను ఔషధ తనిఖీ అధికారులు సీజ్ చేశారు. కరీంనగర్ జిల్లా బోయిన్పల్లి మండల వ్యాప్తంగా ఔషధ దుకాణాల్లో అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలకు దిగారు. ఏడీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆదిలాబాద్ నుంచి వచ్చిన టీమ్ తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా బోయిన్పల్లిలో ఓ షాపు, కుదురుపాకలో మరొక షాపులో లెసైన్స్లు లేకుండా ఔషధాలు విక్రయిస్తున్నట్టు బయటపడింది. రెండు షాపులు సీజ్ చేసి, రూ.90వేల విలువైన ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి
హైదరాబాద్: ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన నగరంలోని బోయిన్పల్లి చెక్పోస్టు వద్ద శనివారం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎస్బీఐ కార్యాలయంలో అగ్నిప్రమాదం
హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోయిన్పల్లి శాఖ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సెక్యూరిటీ సిబ్బంది సమాచారం అందించటంతో అగ్నిమాపక శకటాలు అక్కడికి చేరుకున్నాయి. భారీగా మంటలు వ్యాపించటంతో మూడు శకటాలతో మంటలు అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. -
బోర్డు తిప్పేసిన ట్రేడింగ్ కంపెనీ
హైదరాబాద్: హైదరాబాద్లో ఓ ట్రేడింగ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. బోయిన్పల్లి కేంద్రంగా నడుస్తున్న ఎక్స్పర్ట్ ట్రేడింగ్ కంపెనీ ఖాతాదారుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేసింది. స్టాక్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టి లాభాలు చూపుతామంటూ పలువురి నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసింది. వివిధ వ్యక్తులు, సంస్థల నుంచి దాదాపు రూ.నాలుగు కోట్ల వరకు డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. ఈ కంపెనీ గత కొద్ది రోజులుగా కార్యకలాపాలు నిర్వహించకపోవడంతో బాధితులు బుధవారం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
సికింద్రాబాద్ బోయిన్పల్లిలో చోరీ
-
బోయినపల్లిలో భారీ చోరీ
-
బోయినపల్లిలో భారీ చోరీ
హైదరాబాద్ : బోయినపల్లిలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. మంగళవారం అర్ధరాత్రి దొంగలు కిటికీ గ్రిల్స్ తొలగించి ఓ ఇంట్లో భారీ చోరికి పాల్పడ్డారు. 60 తులాల బంగారం, రూ.60 వేల నగదును దోచుకెళ్లారు. చోరీ జరిగిన సమయంలో కుటుంబసభ్యులు అందరు ఇంట్లోనే నిద్రపోతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరుకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వరుస చోరీలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అనుమానాస్పదరీతిలో వైద్యుడి మృతి
హైదరాబాద్లో ఘటన కారులో శవమై కనిపించిన రాఘవేందర్రావు హైదరాబాద్: అనుమానాస్పదరీతిలో ఓ వైద్యుడు కారులో శవమై కనిపించాడు. నగరంలోని బోయిన్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగుచూసిన ఈ ఘటన సంచనలం సృష్టించింది. పేట్ బషీరాబాద్లోని గేటేడ్ కమ్యూనిటీ కాలనీలో నివాసం ఉండే డాక్టర్ రాఘవేందర్రావు(60) గత 12 ఏళ్లుగా సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ఈఎన్టీ విభాగం అధిపతిగా పనిచేస్తున్నారు. ఆయన మంగళవారం ఉదయం 11.40 గంటలకు ఇంటి నుంచి ఆసుపత్రికి బయలుదేరారు. సాయంత్రం 6.30 గంటలైనా ఆయన ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు పలువూర్లు ఆయున సెల్కు ఫోన్ చేశారు. ఆయన ఫోను తీయుకపోవడంతో పేట్బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి అమెరికాలో ఉన్న రాఘవేందర్రావు కుమారుడు సుదీప్కు సమాచారమిచ్చారు. సుదీప్ జీపీఎస్ టెక్నాలజీ ద్వారా బోయినపల్లి హర్షవర్ధన్ కాలనీలో తన తండ్రికి సంబంధించిన బీఎండబ్ల్యూ కారు (ఏపీ 28 బీఎక్స్ 5675) ఉన్నట్లు గుర్తించి, తల్లి స్వర్ణలతకు చెప్పారు. కుటుంబసభ్యులు హర్షవర్ధన్ కాలనీలో వెతకగా పార్క్ చేసి ఉన్న కారును గుర్తించారు. కారులో రాఘవేందర్రావు మృతి చెంది కనిపించాడు. అతని ముక్కు, చెవి నుంచి రక్తం కారుతూ కనిపించింది. బోయిన్పల్లి పోలీసులకు సమాచారమివ్వగా వారు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కారులో రూ.14,500 నగదు, సెల్ఫోన్, మద్యంసీసా, ల్యాప్టాప్, కొన్ని మాత్రలు లభించాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాఘవేంద్రరావు గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. కడుపులో మత్తు, విషపదార్థాల అనవాళ్లు లేవని చెబుతున్నారు. -
బీఎండబ్ల్యూ కారులో మృతదేహం...
-
భార్యను, మరో వ్యక్తిని హత్య చేసిన భర్త
సికింద్రాబాద్లో జంటహత్యలు కలకలం సృష్టించాయి. కట్టుకున్న భార్యను, మరో వ్యక్తిని దారుణంగా హతమార్చాడో ఓ భర్త. ఈ ఘటన బోయిన్ పల్లి సమీపంలో చోటు చేసుకుంది. బోయిన్ పల్లికి చెందిన జయశ్రీ, రాకేష్లు 20 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజుల నుండి వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో..భార్య బోరబండలోని పుట్టింటికెళ్లింది. ఈ రోజు ఉదయం 4 గంటల ప్రాంతంలో భార్యను రాకేష్ బోయిన్ పల్లిలోని తన ఇంటికి తీసుకు వచ్చి... నల్ల పోచమ్మ గుడి వద్ద కత్తితో దారుణంగా హత్య చేశాడు. అనంతరం భార్యతో వివాహేతర సంబంధం ఉందని బేగంపేటకు చెందిన నరేన్ అనే వ్యక్తిని అతి కిరాతకంగా పొడిచి చంపాడు. అనంతరం నిందితుడు రాకేష్ బోయిన్ పల్లి వెళ్లి పోలీసుకు లొంగిపోయాడు. -
గంగాధర్ కుటుంబానికి ఎక్స్గ్రేషియా, ఉద్యోగం
హైదరాబాద్ : హైదరాబాద్ బోయిన్పల్లి వద్ద అర్థరాత్రి జరిగిన బస్సు ప్రమాదంలో సజీవ దహనం అయిన డ్రైవర్ గంగాధర్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి మంగళవార ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించి, సంఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. డ్రైవర్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే ఆరు లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. వివరాల్లోకి వెళితే బోయినపల్లి వద్ద డీసీఎం వ్యాన్ - ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. దాంతో బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు బస్సులో నుంచి కిందకి దిగిపోగా, బస్సు క్యాబిన్లో చిక్కుకున్న డ్రైవర్ గంగాధర్ సజీవ దహనమైయ్యాడు. మరో పది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు అగ్నిపమాక సిబ్బందికి సమాచారం అందించారు. మూడు ఫైరింజన్లతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది బస్సులో చెలరేగిన మంటలను అర్పివేశారు. క్షతగాత్రులను గాంధీ ఆసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని... ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 52 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
మంటల్లో చిక్కుకున్న RTC బస్సు
-
గౌరవ్, వినీతలకు టెన్నిస్ టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: ఏఐటీఏ ఆలిండియా ర్యాంకింగ్ టాలెంట్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో గౌరవ్ కుర్వ, ఎం.వినీతలు టైటిల్స్ చేజిక్కించుకున్నారు. బోయిన్పల్లిలోని టీఆర్ స్పోర్ట్స్ టెన్నిస్ సెంటర్లో మంగళవారం ఫైనల్ పోటీలు జరిగాయి. అండర్-14 బాలుర సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ గౌరవ్ 6-2, 7-6 (7/5)తో టాప్ సీడ్ సంచిత్ సిక్కాను కంగుతినిపించాడు. బాలికల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ వినీత 2-6, 6-0, 6-2తో సృ్మతి బాసిన్పై గెలుపొందింది. -
హైదరాబాద్ లో భారీ వర్షం
-
సెయింట్ ఆండ్రూస్ ముందంజ
జింఖానా, న్యూస్లైన్: దేవసియా ఇంటర్ స్కూల్ చెస్ టోర్నీ బాలికల విభాగంలో సెయింట్ ఆండ్రూస్ ‘ఎ’ జట్టు 6 పాయింట్లతో ముందంజలో ఉంది. బోయిన్పల్లిలోని సెయింట్ ఆండ్రూస్ స్కూల్లో జరుగుతున్న ఈ టోర్నీలో మంగళవారం మూడో రౌండ్లో సెయింట్ ఆండ్రూస్ జట్టు 6 పాయింట్లతో సికింద్రాబాద్ పబ్లిక్ స్కూల్పై విజయం సాధించింది. పల్లవి మోడల్ స్కూల్ జట్టు 4 పాయింట్లతో ఎన్ఎస్కేకే జట్టుపై నెగ్గగా, మెరిడియన్, సాధు వాస్వని జట్లు చెరో 3 పాయింట్లు సాధించి మ్యాచ్ను డ్రా చేసుకున్నాయి. బాలుర విభాగం మూడో రౌండ్ ముగిసే సమయానికి చిరెక్ పబ్లిక్ స్కూల్, సాధు వాస్వని జట్లు ఆధిక్యంలో ఉన్నాయి. సాధు వాస్వని 6 పాయింట్లతో హెచ్పీఎస్ గెలవగా, చిరెక్ పబ్లిక్ స్కూల్ 6 పాయింట్లతో మెరిడియన్ జట్టును ఓడించింది. సెయింట్ పీటర్స్ హైస్కూల్ 5 పాయింట్లతో సెయింట్ ఆండ్రూస్ ‘బి’పై, సెయింట్ ఆండ్రూస్ ‘ఎ’ జట్టు 5 పాయింట్లతో సెయింట్ ఆండ్రూస్ ‘సి’జట్టుపై గెలుపొందింది. -
పెంపుడు కూతురిపైనే అఘాయిత్యం
హైదరాబాద్ : తండ్రే కీచకుడయ్యాడు... పెంపుడు కూతుర్ని చెరబట్టి గర్భవతిని చేశాడు... ఆ దుర్మార్గుడ్ని బోయిన్పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. స్థానిక దుబాయ్ గేట్ సమీపంలో ఉండే ఓ వ్యక్తి తమ కూతురిని చిన్నతనంలోనే శ్రీకాకుళంలో ఉండే తోడల్లుడు రా మ్మూర్తి (42)కి దత్తత ఇచ్చాడు. ప్రస్తుతం ఆ అమ్మాయి వయసు 22 ఏళ్లు. మూడేళ్ల క్రితం తన భార్య గర్భం దాల్చిన సమయంలో రామ్మూర్తి చూపు పెంచుకుంటున్న కూతురుపై పడింది. అప్పటి నుంచి ఆమెను బలవంతంగా అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో ఆ యువతి గర్భం దాల్చింది. ఈ విషయం అతని భార్యకు తెలియడంతో గొడవపడి అమ్మాయిని సొంత తల్లిదండ్రుల వద్ద వదిలేసి రమ్మని ఒత్తిడి చేసింది. దీంతో ఇటీవల బోయిన్పల్లికి వచ్చిన రామ్మూర్తి.. అమ్మాయి చెడుతిరుగుళ్లకు అలవాటుపడిందంటూ నిందవేయడంతో పాటు మీ కూతురిని పంపేస్తానని ఆమె తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో వారు కూతురుని ఫోన్లో నిలదీయగా అసలు విషయం వెల్లడించింది. తాను పెంపుడు తండ్రి కారణంగానే గర్భం దాల్చానని బోరుమంది. ఆమె తల్లిదండ్రులు బోయిన్పల్లి పోలీసులను ఆశ్రయించగా, వారు బేగంపేట మహిళా పోలీస్స్టేషన్కు కేసును బదిలీ చేశారు. మహిళా పోలీసులు బాధిత అమ్మాయిని ఫోన్లో విచారించి... ఆమె వాంగ్మూలాన్ని సేకరించారు. ఇదిలా ఉండగా.. నిందితుడు బాధితులతో రాజీ కుదుర్చుకొనేందు శుక్రవారం అమ్మాయిని తీసుకొని రామ్మూర్తి నగరానికి వచ్చాడు. ఈ సమాచారం అందుకున్న బోయిన్పల్లి పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.