child deaths
-
బ్రెయిన్ ఈటింగ్ అమీబా జాగ్రత్త సుమా!
హెల్త్డెస్్క : కేరళలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా కారణంగా ఇటీవల ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన దేశవాప్తంగా సంచలనం సృష్టించడంతో పాటు అన్ని రాష్ట్రాలనూ అప్రమత్తం చేసింది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఈ తరహా అమీబా అనవాళ్లు లేకపోయినా వైద్య ఆరోగ్య శాఖలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కలుషితమైన చెరువులు, నీటివనరులతో పాటు సరైన నిర్వహణ లేని స్విమ్మింగ్ పూల్లలో చిన్నారులు ఈదడం వల్ల ఈ తరహా అమీబా వ్యాపించే అవకాశం ఉంది. చిన్నారుల్లో రోగ నిరోధకత తక్కువ కాబట్టి వారిపై ఇది ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ముక్కు రంధ్రాల్లోంచి మెదడుకు.. నెగ్లేరియా ఫౌలేరీ అని పిలిచే ఈ అమీబా ప్రపంచవ్యాప్తంగా లోతుతక్కువ ఉండే చెరువులు, సరస్సులు, కాల్వలతో పాటు పంటపొలాలు, నేలల్లోనూ నివసిస్తుంది. బాగా వేడిగా ఉండే నీటి బుగ్గల్లో (హాట్ స్ప్రింగ్స్) కూడా ఇది మనుగడ సాగించగలుగుతుంది. ఇది మెదడులో ‘ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్కెఫలైటిస్ – (పామ్)’ అనే తీవ్రమైన ఇన్ఫెక్షన్ను కలుగజేస్తుంది. (ఈ కారణంగానే దీనిని బ్రెయిన్ ఈటింగ్ అమీబాగా పేర్కొంటున్నారు) నాడీ వ్యవస్థను దెబ్బతీయడం వల్ల మరణించే అవకాశమూ ఉంది. చిన్నారులు చెరువులు, ఈత కొలనుల్లాంటి వాటిల్లో ఈదుతున్నప్పుడు ఈ అమీబా వాళ్ల ముక్కు రంధ్రాల్లోంచి మెదడుకు చేరి ‘పామ్’ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది. లక్షణాలు» తీవ్రమైన జ్వరం » తీవ్రమైన తలనొప్పి » వికారం, వాంతులు » వణుకు ళీ అయోమయం చివరగా కోమాలోకి వెళ్లే ప్రమాదం » మెదడువాపులో కనిపించే అన్నిలక్షణాలతో పాటు మెడకదలించలేకపోవడం (స్టిఫ్ నెక్), వెలుతురు చూడలేకపోవడం. నిర్ధారణ» లంబార్ పంక్చర్ ప్రక్రియ ద్వారా వెన్నుపాము చివరి భాగం నుంచి నీరు (సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్) తీసి పరీక్షించాల్సి ఉంటుంది. » కొన్నిసార్లు మెదడు బయాప్సీ నిర్వహించి అక్కడ అమీబా ఉనికిని గుర్తించాల్సి ఉంటుంది. నివారణ» కలుíÙత నీటితో కూడిన చెరువులు, కాల్వలు,సరస్సుల వంటి వాటిల్లోకి పిల్లలు వెళ్లకుండా చూసుకోవాలి. వ్యాధి నిరోధక శక్తి తక్కువగాఉండే పిల్లల విషయంలో ఇది మరీ ప్రమాదం. » నగరాల్లోని స్విమ్మింగ్ పూల్స్లో వాటి నిర్వహణ సరిగా (క్లోరినేషన్ చేయడం, పరిశుభ్రమైన నీటినే వాడటం) ఉందా లేదా? అనే విషయాలను పరిశీలించాకే పిల్లలను పంపాలి. » కొందరు యోగా నిపుణులు ఓ కొమ్ము చెంబు నుంచి నేరుగా ముక్కు రంధ్రం ద్వారా నీటిని బయటకు స్రవించేలా చేసే ‘నేతి’ప్రక్రియ చేయిస్తుంటారు. అయితే మామూలు నల్లా / కొళాయి నీళ్లతో చేసేవారు బాగా మరగబెట్టి చల్లార్చిన నీటితోనే దీన్ని చేయాలి. కలుషితమైన నీళ్లతో చేస్తే పెద్దవారిలోనూ బ్రెయిన్ఈటింగ్ అమీబా తాలూకు ‘పామ్’ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. ఎంత వేగంగా చికిత్స చేస్తే అంత మేలు దీనికి నిర్దిష్ట చికిత్స అంటూ ఏదీ లేదు. కరోనా కేసుల్లో మెదడుకు బ్లాక్ ఫంగస్ వచ్చినప్పుడు ఉపయోగించిన యాంఫోటెరిసిన్–బి వంటి మందులతో పాటు రిఫాపిన్, ఫ్లుకోనాజోల్, మిల్టెఫొసైన్ వంటి మందులను ఉపయోగిస్తారు. (మిల్టెఫొసైన్ను.. శాండ్ఫ్లై అనే కీటకాల్లో ఉంటూ లీష్మానియాసిస్ అనే వ్యాధిని కలిగించే పరాన్నజీవి సంబంధిత ఇన్ఫెక్షన్కు ఉపయోగించడానికి ‘ఎఫ్డీఏ’అనుమతించింది). త్వరగా వ్యాధిని గుర్తించి చికిత్స అందిస్తే అంత మేలు. చిన్నారులకు చల్లటి నీళ్లతో (మరీ చల్లటివి కాదు) స్పాంజింగ్ చేస్తూ జ్వరం తగ్గేలా చేయడం వల్ల వేగంగా కోలుకుంటారు. డా. విజయ్, న్యూరాలజిస్ట్,కిమ్స్ ఐకాన్, వైజాగ్ -
కామారెడ్డి జిల్లాలో అంతుచిక్కని శిశు మరణాలు
కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో శిశు మరణాలు వెనుక కారణం ఏమిటనేది అంతుచిక్కడం లేదు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఏడుగురు చిన్నారులు మృతి చెందడంతో వైద్యులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నెల రోజులుగా కలవరపెడుతున్న ఈ శిశు మరణాల్లో మృతి చెందిన శిశువులంతా నాలుగు నెలలలోపు చిన్నారులే. ఆసుపత్రిలో చేరిన చిన్నారులకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తుండగానే వారి ఊపిరి ఆగిపోతోంది. దీని వెనుక కారణాలు ఏమిటనేది వైద్యులకు అంతుచిక్కడం లేదు. వరుసగా జరుగుతున్న శిశు మరణాల గురించి వైద్యులు రాష్ట్ర అధికారులకు సమాచారమిచ్చారు. ఇది కూడా చదవండి: జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం -
శ్మశానానికి తీసుకెళ్లగా చిన్నారిలో కదలికలు.. ఒక్కసారిగా..
కర్ణాటక: చికిత్స పొందుతున్న 8 నెలల చిన్నారి చనిపోయిందని వైద్యులు భావించి తల్లిదండ్రులకు అప్పగించారు. కన్నీరు మున్నీరైన దంపతులు చిన్నారిని శ్మశానానికి తీసుకెళ్లగా కదలికలు కనిపించాయి. వెంటనే ఆస్పత్రికి తరలించగా 90 శాతం నాడి కొట్టుకుంటోందని వైద్యులు గుర్తించి చికిత్సలు ప్రారంభించారు. ధార్వాడ జిల్లా నవలగుంద తాలూకా బసాపుర గ్రామానికి చెందిన బసప్ప పూజార్ కుమారుడు (8 నెలలు) ఊపిరి సరిగా ఆడకపోవడంతో హుబ్లీ కిమ్స్లో చేర్పించారు. నాలుగు రోజుల పాటు చికిత్స అందించిన వైద్యులు గురువారం సాయంత్రం.. పల్స్రేట్ తక్కువగా ఉందని, ఆక్సిజన్ తొలగిస్తే బిడ్డ బతకదని తెలిపారు. అనంతరం చిన్నారి చనిపోయిందని చెప్పి తల్లిదండ్రులతో సంతకం తీసుకొని శిశువును అప్పగించారు. శ్మశానానికి తీసుకెళ్లి ఆచారం ప్రకారం నోట్లో పసుపు నీరు పోస్తుండగా బాలుడు ఆశ్చర్యకరంగా చేతులు, కాళ్లను ఆడించాడు. తక్షణమే నవలగుంద ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం ధార్వాడ సివిల్ ఆస్పత్రికి తరలించారు. నవలగుంద తాలూకా ఆస్పత్రి వైద్యురాలు వై.విద్య మాట్లాడుతూ 90 శాతం మేరకు బిడ్డ ఆరోగ్యంగానే ఉందన్నారు. కిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ్కుమార్ మాట్లాడుతూ ఈ బిడ్డ విషయంలో పూర్తిగా కేసు ఫైల్ను, ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను తెలుసుకొని సమగ్రంగా పరిశీలించాక పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. -
భారత్కు చెందిన ఆ రెండు దగ్గు మందులు వాడకండి.. డబ్ల్యూహెచ్వో హెచ్చరిక!
చిన్న పిల్లల కోసం భారత్లో తయారైన రెండు దగ్గు మందులు(సిరప్స్) వాడొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) హెచ్చరించింది. డాక్-1 మ్యాక్స్ సిరప్, అంబ్రోనల్ సిరప్ మందుల్లో విషపూరితమైన ఇథిలీన్ ఉన్నట్టు డబ్ల్యూహెచ్వో గుర్తించింది. ఈ క్రమంలో చిన్నారులకు ఈ సిరప్స్ ఇవ్వకూడదని ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వానికి సూచించింది. అయితే, గతేడాది డిసెంబర్లో ఉజ్బెకిస్థాన్లో 19 మంది చిన్నారులు ఆకస్మికంగా మృతిచెందారు. వారికి మృతికి డాక్-1 మ్యాక్స్ సిరప్, అంబ్రోనల్ దగ్గు మందులే కారణమని డబ్ల్యూహెచ్వో తెలిపింది. మారియన్ బయోటెక్ తయారుచేసిన దగ్గు మందు తాగడం వల్ల 19 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని ఉజ్బెకిస్థాన్ ఆరోపించింది. 21 మంది చిన్నారులు ఈ సిరప్లను తాగగా.. వారిలో 19 మందికి శ్వాసకోశ ఇబ్బందులు వచ్చాయని వెల్లడించింది. దీంతో, అప్రమత్తమైన ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వం.. మందులను ల్యాబ్లో పరిశీలించగా వాటిలో విషపూరితాలు ఉన్నట్టు గుర్తించింది. దగ్గు మందులో ఇథిలీన్ గ్లైకాల్ ఉన్నట్టు తెలిందని పేర్కొన్నది. అనంతరం, ఈ విషయాన్ని డబ్ల్యూహెచ్వో దృష్టికి తీసుకువెళ్లింది. నాణ్యమైన మందులను అందిచండలో మారియన్ బయోటెక్ విఫమైందని, సిరప్ల తయారీలో నిర్ణీత ప్రమాణాలను పాటించలేదని వెల్లడించింది. ఈ నేపథ్యంలో సంస్థ తయారుచేసిన రెండు సిరప్లు చిన్నారులకు ప్రాణాంతకమైనవని, వాటిని ఉపయోగించకూడదని డబ్ల్యూహెచ్తో సూచించింది. దీంతో, డబ్ల్యూహెచ్తో సైతం వీటిని వాడరాదంటూ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉండగా.. గతేడాది అక్టోబర్లో కూడా భారత్ చెందిన దగ్గు మంది తాగి గాంబియాలో 66 మంది పిల్లల మరణించారు. మైడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ తయారు చేసిన నాలుగు దగ్గు, జలుబు సిరప్ల వల్లే వారు మృతిచెందినట్టు డబ్ల్యూహెచ్వో పేర్కొంది. దీంతో, ఆ ముందులను కూడా వాడరాదని డబ్ల్యూహెచ్వో హెచ్చరించింది. "Substandard": WHO Alert On 2 Indian Syrups After Uzbekistan Child Deaths https://t.co/SKxgzPbNy0 NDTV's Vedanta Agarwal reports pic.twitter.com/JMzxKEpZBE — NDTV (@ndtv) January 12, 2023 -
విషాదం: ఫుడ్ పాయిజన్తో ఇద్దరు చిన్నారులు మృతి
సాక్షి, మెదక్: మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఫుడ్ పాయిజన్ కారణంగా ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. గ్రామంలోని పౌల్ట్రీ ఫామ్లో పనిచేసే ఓ కుటుంబం శీతల పానియం తాగి పడుకున్నారు. తల్లి బాలమణి(35)తో పాటు, కూతురు మనీషా(13), కొడుకు కుమార్కు తీవ్రమైన కడుపు నొప్పి రావటంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తల్లి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. తండ్రి క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరు తూప్రాన్ మండలం వెంకటాయ పల్లి గ్రామానికి చెందిన కుటుంబీకులుగా గుర్తించారు. -
కన్నీటి బావి
కలలకు ప్రతిరూపం వాళ్లు.. ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నారు.. తల్లీదండ్రులకు ఆశలు నెరవేర్చే∙సారథులుగా నడుస్తున్నారు.. మంచి చదువు చదివించాలని తాపత్రయం.. కూలీనాలీ చేసుకుని ఉన్నతులుగా చూడాలని ఆశ.. సాఫీగా సాగుతున్న కుటుంబాల్లో ఓ కుదుపు. పిడుగులాంటి వార్త. ఆశల సౌధం కూలిపోయింది.. ఇప్పటి వరకు కబుర్లు చెప్పిన చిన్నారులు కనిపించడం లేదు.. చలనం లేని శరీరాలను చూసి ‘తల్లి’డిల్లిపోయారు.. రెండు కుటుంబాల్లో విషాదం. ఈ ఘటన కలగరలో చోటుచేసుకుంది. విస్సన్నపేట(తిరువూరు): ఇద్దరు చిన్నారులు బావిలో మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని కలగర పంచాయతీ రామచంద్రాపురానికి గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు సమీపంలోని రావికుంట చెరువు వద్దకు చేపల పట్టుకునేందుకు వెళ్లారు. ముగ్గురిలో దుబ్బాకు శాంతకమలాకర్ కుమారుడు కౌశిక్(8), సిరెల్లి జక్రయ్య కుమార్తె శ్రావణి(12), జస్వంత్ ఉన్నారు. ముగ్గురు సరదాగా చెరువులో చేపలు పట్టేందుకు ప్రయత్నించారు. మధ్యలో వీరికి దాహం వేసింది. వెంటనే సమీపంలో ఉన్న వ్యవసాయ పొలంలో ఉన్న చిన్న బావి గుర్తుకు వచ్చింది. వెంటనే ముగ్గురు బయలుదేరి వెళ్లారు. అక్కడకు వెళ్లిన తరువాత ముగ్గురు చేతికి అందె ఎత్తులో ఉన్న నీటిని తాగేందుకు ప్రయత్నించారు. కౌశిక్, శ్రావణి ఒక వైపునే ఉన్నారు. ఈ క్రమంలో బావి అంచు జారిపడిపోయింది. ఇద్దరు బావిలో పడిపోయారు. గమనించిన తోడుగా వచ్చిన జస్వంత్ పెద్దగా కేకలు వేయడంతో సమీపంలో పొలం పనులు చేసుకుంటున్న వారు వచ్చి బయటికి తీశారు. అప్పటికే చిన్నారులు ఇద్దరు మృతి చెందినట్లు గుర్తించారు. కుటుంబాల్లో విషాదం సిరెల్లి జక్రయ్య, సువార్తకు ఇద్దరు కుమార్తెలు. శ్రావణి ఏడో తరగతి చదువుతోంది. శ్రావణి అక్క పదో తరగతి చదువుతోంది. వీరిద్దరు సమీపంలో గురుకుల పాఠశాలలో చదువుతున్నారు. జక్రయ్య కొంతకాలం కిందట మృతి చెందగా తల్లి ఇద్దరు పిల్లలను కూలీ పనులు చేసుకుంటూ చదివిస్తోంది. విషాద ఘటన తెలుసుకున్న తల్లి కుప్పకూలిపోయింది. కౌశిక్ తండ్రి దుబ్బాకు శాంతకుమలాకర్ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కౌశిక్కు సోదరి ఉంది. కేసు నమోదు.. ప్రమాద ఘటన తెలుసుకున్న వెంటనే ఏఎస్ఐ ఏఎస్ఐ సత్యనారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికులను విచారించారు. ప్రమాదం జరిగిన నేపథ్యంతో పాటు బావి ఉన్న పొలం రైతులతోనూ మాట్లాడారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. -
దగ్గు మందు తాగి 9మంది మృతి
సాక్షి, శ్రీనగర్: ఫార్మాసుటికల్ కంపెనీలు మందులు తయారు చేసే ప్రదేశాలు ఎక్కడున్నా ఉత్పత్తులు మాత్రం దేశం నలుమూలలకి వెళ్తుంటాయి. ఏ కొంత నిర్లక్ష్యం వహించినా వాటి వలన జరిగే నష్టం అంచనా వేయలేం. తాజాగా జమ్మూలో చిన్నారులకు దగ్గు మందు కావాల్సి వచ్చింది. హిమాచల్ప్రదేశ్కు చెందిన ఓ కంపెనీ వాటి ఉత్పత్తులను జమ్ములోని ఉదంపూర్ జిల్లా చిన్నారులకు పంపింది. అందులో పాయిజన్ కాంపౌండ్ కలిపిన సంగతి తెలియని చిన్నారులు 17 మంది తాగి అస్వస్థతకు గురయ్యారు. గత నెలరోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పరిస్థితి విషమించి 9మంది ప్రాణాలు కోల్పోయారు. 'ప్రైమా ఫేసీ', 'డై ఇథిలీన్ గ్లైకాల్' అనే రెండు విష పదార్థాలు కోల్డ్ బెస్ట్ పీసీ టానిక్లో కలిశాయి. వీటి కారణంగానే ఉదంపూర్, ఛండీఘర్లోని చిన్నారుల ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందని' డ్రగ్ అండ్ ఫుడ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ డ్రగ్స్ కంట్రోలర్ వెల్లడించారు. ఈ దగ్గుమందు కారణంగా ఊపిరితిత్తులు చెడిపోయి మరణాలు సంభవించినట్లు డైరక్టర్ హెల్త్ సర్వీస్కు చెందిన డా.రేణు శర్మ తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ఆ కంపెనీ ఉత్పత్తులను 8 రాష్ట్రాల్లో మొత్తంగా 5,500 మందు బాటిళ్లను సీజ్ చేశారు. తయారీ యూనిట్ను కూడా మూసివేసినట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ కంపెనీ మందులు సరఫరా అయ్యే ఉత్తరాఖండ్, హర్యానా, తమిళానాడు, ఉత్తరప్రదేశ్, మేఘాలయ, త్రిపురలో తనిఖీలు చేపడుతున్నట్లు హిమాచల్ప్రదేశ్ ఉన్నతాధికారులు వెల్లడించారు. -
దవాఖానాకు సుస్తీ : గాల్లో కలుస్తున్న పిల్లల ప్రాణాలు
అహ్మదాబాద్ : రాజస్థాన్లోని కోట ప్రభుత్వ ఆస్పత్రుల్లో చిన్నారుల మరణాలు కలకలం రేపిన నేపథ్యంలో తాజాగా గుజరాత్లోని రాజ్కోట్, జామ్నగర్ ఆస్పత్రుల్లో కూడా గత ఏడాది డిసెంబర్లో 179 మంది చిన్నారులు మరణించడం వెలుగుచూసింది. రాజ్కోట్లో 111 మంది, జామ్నగర్లో నవంబర్ మాసంలో 71 మంది, డిసెంబర్లో 68 మంది నవజాత శిశువులు మరణించారని గణాంకాలు వెల్లడించాయి. రాజ్కోట్ ప్రభుత్వ ఆస్పత్రిలో డిసెంబర్లో 111 మంది శిశివులు మరణించారని, వీరిలో కొందరు అండర్వెయిట్ చిన్నారులు కాగా, మరికొందరు సెప్పిస్ ఇన్ఫెక్షన్తో మృత్యువాత పడ్డారని ఆస్పత్రి సివిల్ సూపరింటెండెంట్ మనీష్ మెహతా చెప్పారు. ఇక జామ్నగర్లో గత ఏడాదిగా 639 మంది నవజాత శిశువులు మరణించారు. అహ్మదాబాద్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని గడిచిన ఏడాది డిసెంబర్లో 85 మంది చిన్నారులు మరణించారని ఆస్పత్రి సూపరింటెండెంట్ గన్వంత్ ఠాకూర్ వెల్లడించారు. ఈ ఆస్పత్రిలో నెలకు సగటున 70 నుంచి 80 మంది చిన్నారులు మరణిస్తున్నారని, పోషకాహారలోపమే చిన్నారుల మృతికి ప్రధాన కారణమని ఆయన చెప్పుకొచ్చారు. చోటా ఉదయ్పూర్ జిల్లాలో గత తొమ్మిదినెలలుగా 614 మంది చిన్నారులు మరణించడం కలకలం రేపింది. ఆయా ఆస్పత్రుల్లో పిల్లల వైద్యులు, చైల్డ్ స్పెషలిస్టులు లేకపోవడం కూడా పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రోగుల సంఖ్యతో పోలిస్తే అందుకు అనుగుణంగా గైనకాలజిస్టులు, వైద్యులు, వైద్య సిబ్బంది లేకపోవడంతో పిల్లల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. -
జవాబుదారీతనం ఉండాలి
కోటా (రాజస్తాన్): రాజస్థాన్లోని కోటాలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న జేకే లోన్ ఆస్పత్రిలో 107 మంది చిన్నారుల మరణాలపై ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ విమర్శించారు. చిన్నారుల మరణం చాలా బాధించిందని, దీనికి ఎవరో ఒకరు జవాబుదారీతనం వహించాలని వ్యాఖ్యానించారు. శిశువుల మరణాలపై ప్రభుత్వ స్పందన సంతృప్తికరంగా లేదన్నారు. ఈ విషయంపై తాము మరింత సున్నితంగా వ్యవహరించి ఉండాల్సిందన్నారు. పిల్లలను కోల్పోయిన కుటుంబాలను పైలట్ శనివారం పరామర్శించి ఆస్పత్రిని సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ ఘటనపై తాము మరింత బాధ్యతగా ఉండాలి, ఆ తర్వాత వచ్చే పరిణామాలను ఎదుర్కోవాలన్నారు. -
మానవత్వం మరుస్తున్న కఠిన హృదయాలు
సాక్షి , ఒంగోలు : కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తల్లిదండ్రులే తమ బిడ్డలను చిదిమేస్తున్నారు.. మానవత్వం మరిచి పేగు బంధాన్ని సైతం తెంచుకుంటున్నారు.. భార్యపై అనుమానంతో ఆమెతో పాటు బిడ్డలను సైతం హతమార్చేందుకు వెనుకాడడం లేదు.. పేగు తెంచుకు పుట్టిన బిడ్డలనే కర్కశంగా రోడ్లపై, వాగుల్లో విసిరి పడేస్తున్నారు.. ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులనే కడతేరుస్తున్న కసాయి కొడుకులు.. వృద్ధాప్యంలో తల్లిని భారంగా భావించి రోడ్లపై పడేసి వెళ్తున్న దుర్మార్గపు బిడ్డలు.. కామంతో కళ్లు మూసుకుపోయి కూతురు, మనమరాళ్ళ వయస్సు ఉన్న చిన్నారులు, యువతులపై కన్నేస్తున్న మృగాళ్ళు.. జిల్లాలో జరుగుతున్న వరుస సంఘటనలు మానవ సంబంధాలు, రక్తసంబంధాలను సైతం మరిచి కర్కశత్వంతో చిన్నారుల జీవితాలను కాలరాస్తున్న వైనాన్ని చూసి పరిస్థితి ఎటువైపు వెళుతోంది.. ఎక్కడకు దారితీస్తుందో అని జిల్లా వాసులు హడలిపోతున్నారు. జిల్లాలో మూడు నెలలుగా జరుగుతున్న వరుస ఘటనలు అందరి మనస్సులను కలిసి వేస్తున్నాయి. దర్శి పట్టణంలోని సాయిబాబా దేవాలయం సమీపంలో నివాసం ఉంటున్న అన్నపురెడ్డి వెంకటరెడ్డి, ఆదెమ్మ అనే వృద్ధ దంపతులు జులై 22వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరపడంతో కొడుకే కన్న తల్లిదండ్రులను కర్కశంగా హతమార్చినట్లు తేలింది. వ్యసనాలకు బానిసై అప్పులు చేసి అవి తీర్చేందుకు పథకం ప్రకారం తల్లిదండ్రుల పేరుతో బీమా చేయించి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా అర్ధరాత్రి వారిని దారుణంగా హతమార్చాడు. భార్యపై అనుమానం పెంచుకుని అతి కిరాతకంగా హతమార్చిన సంఘటన ఆగస్టు 17వ తేదీన తాళ్ళూరు మండలం తూర్పు గంగవరం గ్రామంలో జరిగింది. 11 ఏళ్లు కాపురం చేసిన భార్యపై అనుమానం పెనుభూతంలా మారి మద్యం మత్తులో ఆమె తలను గోడకేసి కొట్టి చంపాడు. తల్లి మృతి చెందడం, తండ్రి జైలు పాలు కావడంతో వారి ఇద్దరు బిడ్డలు అనాధలుగా మారి అమ్మమ్మ ఆసరాతో జీవనం సాగించాల్సిన దుస్థితి ఏర్పడింది. తల్లిదండ్రులు క్షణికావేశంలో చేసిన తప్పులకు బిడ్డలు బలికావాల్సి వచ్చింది. తెలిసి చేసిన పాపమో.. తెలియక చేసిన పాపమో తెలియదుగానీ కొందరు యువతులు పెళ్లి కాకముందే తల్లులుగా మారి పుట్టిన వెంటనే బిడ్డలను విసిరి పారేసి తమ తప్పును కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కనిగిరి పట్టణంలోని గార్లపేట రోడ్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జులై 30వ తేదీన ఆడ బిడ్డకు జన్మనిచ్చిన ఓ అవివాహిత బిడ్డ పుట్టగానే అక్కడే వదిలేసి వెళ్లింది. చీరాల పట్టణంలోని విఠల్ నగర్లో ఆగస్టు 29వ తేదీ రాత్రి ఓ గర్భిణీ నడి రోడ్డుపై పురుడు పోసుకుంది. పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఏం అయిందో ఏమో తెలీదుగానీ పసికందుకు అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. రోడ్డుపై ఏడుస్తూ కొంత సేపటికి ప్రాణాలు విడిచింది. తప్పు చేసిన వారి కడుపున పుట్టడమే ఆ పసికందులు చేసుకున్న పాపం. మద్దిపాడు మండలం గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ వద్ద సెప్టెంబర్ 27వ తేదీ అర్ధరాత్రి వృద్ధురాలైన కన్న తల్లిని కొడుకులు ఆటోలో తీసుకొచ్చి నడి రోడ్డుపై పడేసి వెళ్ళారు. వర్షంలో తడిచి, చీమలు కుట్టి తీవ్ర అస్వస్థతతో ఉన్న ఆమెను స్థానికులు 108 ద్వారా ఒంగోలు రిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ ఆ తల్లి మృతి చెందింది. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కూడా కొడుకులు రాకపోవడంతో పోలీసులే ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. తాజాగా నవంబర్ 1వ తేదీన మరో తల్లిని కొడుకులు ఒంగోలు నగరంలోని భాగ్యనగర్ 4వ లైన్లో నడి రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. హాస్టల్ విద్యార్థినులు గమనించి ఆమెకు అల్పాహారం పెట్టి వృద్ధాశ్రమంలో చేర్చారు. వ్యసనాలకు బానిసైన భర్త వేధింపులు తాళలేక పేగు తెంచుకు పుట్టిన మూడేళ్ళ పాపను చంపి తానూ ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన దుర్ఘటన గుడ్లూరు మండలం చేవూరులో అక్టోబర్ 20వ తేదీన జరిగింది. తాను చనిపోతే తన బిడ్డ అనాథగా మారుతుందనుకుందో ఏమోగానీ తల్లితనాన్నే మరిచి కంటిపాపనే చిదిమేసింది. ఈనెల 9వ తేదీన రాచర్ల బీసీ కాలనీలో ఘోర ఘటన చోటు చేసుకుంది. పుట్టిన బిడ్డ తన పోలికలతో లేడని ఏడెనిమిది నెలల వయసున్న కుమారుడిని నేలకేసి కొట్టాడు ఆ కిరాతక తండ్రి. అంతటితో ఆ పసి బిడ్డ గొంతుపై కాలేసి తొక్కి హతమార్చాడు. ఆ ఘోరం చూసి కేకలు పెడుతున్న భార్యను రోకలిబండతో దాడి చేశాడు. ఇటీవల జరుగుతున్న ఈ ఘటనలు జిల్లా ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. -
మన్యంలో ఆగని చిన్నారుల మరణాలు..
మాయ రోగాలు ఆ ముక్కుపచ్చలారని పసికందులను బలితీసుకున్నాయి. కన్నవారికి గర్భశోకాన్ని మిగిల్చాయి. పుట్టిన రెండు నెలలకే పిల్లలు కన్నుమూయడంతో ఆ చిన్నారుల తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. సాక్షి, వీఆర్ పురం (తూర్పు గోదావరి): రెండురోజుల వ్యవధిలో ఇద్దరు పసికందులు మృతి చెందిన ఘటన మండలంలోని ఉమ్మిడివరం గ్రామంలో చోటు చేసుకొంది. గ్రామానికి చెందిన కురసం రవి, మంగవేణి దంపతులకు చెందిన రెండు నెలల బాబు అనారోగ్యంతో ఆదివారం మృతి చెందగా.. అదే గ్రామానికి చెందిన కుర్సం నాగరాజు, అశ్వని దంపతులకు చెందిన రెండు నెలల బాబు కూడా అనారోగ్యంతో సోమవారం ఉదయం మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషయమై రేఖపల్లి పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుందర్ప్రసాద్ను వివరణ కోరగా.. మంగవేణికి మే నెలలో స్థానిక పీహెచ్సీలో కాన్పు జరిగిందన్నారు. గత నెల 29వతేదీ తెల్లవారు జామున బాబు అనారోగ్యంగా ఉన్నాడని ఆస్పత్రికి తీసురావడంతో పరీక్షించగా గుండె నిమ్ముతో బాధపడుతున్నట్టు నిర్ధారణ కావడంతో భద్రాచలం ఆసుపత్రికి రిఫర్ చేశామన్నారు. అక్కడ ఏరియా ఆస్పత్రి వైద్యులు బాబుకు మెరుగైన చికిత్స అవసరం, వరంగల్ తరలించాలని చెప్పినా శిశువు తల్లిదండ్రులు మాత్రం అక్కడే వైద్యం అందించాలని కోరారన్నారు. ఈ క్రమంలో ఆ శిశువు ఆదివారం మృతి చెందాడన్నారు. అలాగే అదే గ్రామానికి చెందిన కురసం నాగరాజు అశ్వని దంపతులకు చెందిన రెండు నెలల బాబు నాలుగైదు రోజుల నుంచి విరేచనం కాక ఇబ్బంది పడుతున్నారన్నారు. ఆ శిశువును గత శనివారం రేఖపల్లి పీహెచ్కి తీసుకురాగా అతడికి చికిత్స చేస్తే విరేచనం అయిందని చెప్పారు. శిశువుకు మెరుగైన వైద్యం అందించాలని చింతూరు ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పినా ఆ దంపతులు పట్టించుకోకుండా ఇంటికి తీసుకువెళ్లారన్నారు. ఆ శిశువు సోమవారం మృతి చెందాడని పేర్కొన్నారు. కాగా శిశువుల మృతితో తల్లడిల్లుతున్న తల్లిదండ్రులను వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు మాచర్ల గంగులు, ఇతర నాయకులు బొడ్డు సత్యనారాయణ మాచర్ల వెంగళరావు, పిట్టా రామారావు, కడుపు రమేష్, చీమల కాంతారావు పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ఏపీ చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యుడి పరామర్శ ఉమ్మిడివరం గ్రామంలో రెండురోజుల వ్యవధిలో రెండు శిశు మరణాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఏపీ చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యుడు వి.గాంధీబాబు, ఐసీడీఎస్ పీడీ సుఖజీవన్బాబు సోమవారం బాధిత కుటుంబసభ్యులను పరామర్శించి జరిగిన ఘటనపై విచారణ చేపట్టారు. మృతి చెందిన శిశువుల, తల్లుల ఆరోగ్య విషయాలపై ఆరా తీశారు. ఆశాకార్యకర్త చేసిన విజిట్స్పై, అంగన్వాడీ కేంద్రం ద్వారా అందించిన పోషకాహారాలపై వివరాలను సేకరించి నమోదు చేసుకున్నారు. ఏయే సమయాల్లో ఏయే ఆస్పత్రుల్లో చికిత్సలు పొందిందీ అడిగి తెలుసుకున్నారు. శిశు మరణాల విషయమై ఇంకా విచారణ చేపట్టాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో సీడీపీఓ శంషాద్బేగం ఉన్నారు. -
‘చిన్నారుల మరణానికి బాధ్యత సీఎందే’
పట్నా : బిహార్లోని ముజఫర్పూర్లో మెదడువాపు వ్యాధితో 150 మందికి పైగా చిన్నారుల మరణానికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బాధ్యత వహించాలని ఆర్ఎల్ఎస్పీ చీఫ్, మాజీ కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వహ ఆరోపించారు. బిహార్ను కాపాడేందుకు నితీష్ కుమార్ను సీఎం పీఠం నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. నితీష్ వైఫల్యాలను వెల్లడిస్తూ తాను జులై 2 నుంచి 6 వరకూ ప్రజల మద్దతు కోరుతూ ప్రదర్శన చేపడతానని వెల్లడించారు. బిహార్లో జేడీ(యూ) నేతృత్వంలోని ప్రభుత్వంలో గతంలో భాగస్వామిగా ఉన్న కుష్వహ ప్రజల్లో పార్టీ కోల్పోయిన పట్టును పెంచుకునేందుకు చిన్నారుల మరణాలను హైలైట్ చేస్తూ ప్రదర్శన నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఆర్ల్ఎస్పీ వర్గాలు పేర్కొన్నాయి. నితీష్ కుమార్ గత 14 ఏళ్ల తన పాలనలో మెదడువాపు వ్యాధిని నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారని విమర్శించారు. నితీష్ సీఎం పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించేవరకూ తన నిరసన కొనసాగుతుందని కుష్వహ స్పష్టం చేశారు. -
‘మగవాళ్లు గ్రామం విడిచి వెళ్లారు’
పట్నా : బిహార్లో మెదడువాపు వ్యాధి కారణంగా దాదాపు 160 మంది చిన్నారులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవాల్సింది పోయి.. పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రుల మీద కేసు నమోదు చేశారు అధికారులు. వివరాలు.. రాష్ట్రంలోని పలు గ్రామాల్లో మెదడువాపు వ్యాధి విజృంభిస్తూ.. చిన్నారులను పొట్టన పెట్టుకుంది. ఈ క్రమంలో హరివంశపూర్ గ్రామస్థులు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే తమ పిల్లలు మరణించారంటూ ఆందోళన చేపట్టారు. బాధితుల కడుపుకోతను అర్థం చేసుకుని.. ఓదార్చాల్సింది పోయి.. వారి మీదనే కేసు నమోదు చేశారు పోలీసులు. ఇలా దాదాపు 39 మంది మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఈ విషయం గురించి బాధితుల బంధువులు మాట్లాడుతూ.. ‘మా పిల్లలు చనిపోయారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది. ఆ కోపాన్ని తెలియజేయడానికి రోడ్డు బ్లాక్ చేసి నిరసన తెలిపాం. కానీ అధికారులు మా వాళ్ల మీద కేసు నమోదు చేశారు. దాంతో మగవారు తమను అరెస్ట్ చేస్తారనే భయంతో గ్రామం విడిచి వెళ్లారు. కుటుంబాన్ని పోషించేవారిని అరెస్ట్ చేస్తే.. మా బతుకులు సాగెదేలా’ అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. Bihar: FIR lodged against 39 people in Harivanshpur, in Vaishali district after they protested over lack of water supply & death of several children due to Acute Encephalitis Syndrome (AES) in the area. pic.twitter.com/opxil6NhL6 — ANI (@ANI) June 25, 2019 చిన్నారుల మృతులపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. చిన్నారుల మృతులపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, బిహార్, యూపీ ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్ధానం నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగే నోటీసులకు బదులు ఇవ్వాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. -
చిన్నారుల మరణాలపై కేంద్రానికి సుప్రీం నోటీసులు
-
చిన్నారుల మరణాలపై కేంద్రానికి సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్లో మెదడువాపు వ్యాధితో 160 మందికి పైగా చిన్నారులు మరణించిన ఉదంతంపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. చిన్నారుల మృతులపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, బిహార్, యూపీ ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్ధానం నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగే నోటీసులకు బదులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. చిన్నారుల మరణాలకు బిహార్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, చిన్నారులు మరణించిన ముజఫర్పూర్ సహా ఇతర ప్రాంతాలకు వైద్య నిపుణులతో కూడిన ప్యానెల్ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ పిటిషన్ దాఖలైంది. బిహార్లో మెదడువాపు వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న ప్రాంతాలకు వంద మొబైల్ ఐసీయూ యూనిట్లను పంపాలని పిటిషన్ కోరింది. యూపీలోనూ ఈ వ్యాధి లక్షణాలు బయటపడితే ఎదుర్కొనేందుకు సరైన సన్నాహక చర్యలు చేపట్టాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కూడా పిటిషనర్ తన పిటషన్లో డిమాండ్ చేశారు. బిహార్లో మరణించిన చిన్నారులకు రూ పది లక్షలు పరిహారం అందచేయాలని, ఈ వ్యాధిపై బిహార్, యూపీ, కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అవగాహన కల్పించేలా ప్రచారం చేపట్టాలని ఆదేశించాలని కూడా పిటిషన్ కోరింది. పిటిషన్లో పేర్కొన్న అంశాలను ప్రస్తావించిన సర్వోన్నత న్యాయస్ధానం దీనిపై వారంరోజుల్లోగా బదులివ్వాలని ఆయా ప్రభుత్వాకు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను పదిరోజుల పాటు వాయిదా వేసింది. -
చిన్నారుల మృతికి కారణాలివే..
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్లోని ముజఫర్పూర్లో వందకు పైగా చిన్నారులు ఎక్యూట్ ఎన్ఫలైటిస్ సిండ్రోమ్ (ఏఈఎస్)తో బాధపడుతూ మరణించిన ఘటనపై స్ధానిక ఎంపీ అజయ్ నిషాద్ స్పందించారు. చిన్నారుల మృతులను తగ్గించేందుకు తక్షణ చర్యలు చేపట్టాల్సి ఉందని అన్నారు. వడగాడ్పులతో పాటు అపరిశుభ్ర వాతావరణం, పేదరికం, మారుమూల ప్రాంతాల్లో నివసించడం చిన్నారులు ఈ వ్యాధితో మృత్యువాత పడటానికి ప్రధాన కారణాలని ఎంపీ విశ్లేషించారు. రోగులంతా నిరుపేద కుటుంబాలకు చెందిన వారని, వారు ఉంటున్న ప్రాంతాల్లో అపరిశుభ్రత రాజ్యమేలుతోందని ఈ పరిస్ధితులను చక్కదిద్దాల్సిన అవసరం ఉందని ఎంపీ పేర్కొన్నారు. మరోవైపు చిన్నారులు చికిత్స పొందుతున్న ముజఫర్పూర్లోని కృష్ణ మెడికల్ కాలేజి ఆస్పత్రిని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సందర్శించి చిన్నారుల ఆరోగ్య పరిస్ధితిని సమీక్షించారు. ముజఫర్పూర్లో ఏఈఎస్ వ్యాప్తి ప్రబలిన రెండు వారాల తర్వాత సీఎం ఆస్పత్రిని సందర్శించడం పట్ల రోగుల బంధువులు బిహార్ సీఎం నితీష్ కుమార్ రాకను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. -
సర్వజనాస్పత్రిలో పసికందుల మృతి
అనంతపురం న్యూసిటీ: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని ఎస్ఎన్సీయూలో ఆదివారం ఇద్దరు పసికందుల మృతి తీవ్ర వివాదానికి దారి తీసింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే పసికందులు మృత్యువాత పడ్డారని బాధిత కుటుంబీకులు ఎస్ఎన్సీయూ ముందు ఆందోళన చేపట్టారు. దీంతో కాసేపు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. బుక్కరాయసముద్రం మండలం వడియంపేటకి చెందిన లక్ష్మిదేవి, ఎర్రిస్వామిల పాప(1.3 కేజీలు), కళ్యాణదుర్గానికి చెందిన గీతమ్మ, గంగయ్య పాప(2కేజీలు) ప్రీమెచ్యుర్డ్ బేబీలు. వీరిని ఆస్పత్రిలోని ఎస్ఎన్సీయూలో ఔట్బార్న్ యూనిట్లో చేర్పించారు. వీరు సాయంత్రం 6 గంటల సమయంలో మృతి చెందారు. దీంతో బాధిత కుటుంబీకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బతికున్న పిల్లలను ఇస్తే, వారి ప్రాణం లేకుండా ఇచ్చారని కన్నీరుపెట్టారు. యూనిట్లో ఏసీలు పనిచేయడం లేదని, ఉదయం నుంచి ఐదు మంది చనిపోయారంటూ వైద్యులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ఔట్పోస్టు ఏఎస్ఐ రాము తదితరులు బాధిత కుటుంబీకులను నచ్చజెప్పడంతో సమస్య సద్దుముణిగింది. వద్దు బాబోయ్ ఎస్ఎన్సీయూలో ఇద్దరు చిన్నారులతో మృతి కలకలం రేగడంతో అక్కడే ఉన్న రెండు కుటుంబాలు తమ పిల్లలను ఇక్కడి నుంచి తీసుకెళ్దామని నిర్ణయించుకున్నారు. ఆస్పత్రిలోని వైద్యులు చెబుతున్నా..హైయ్యర్ ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్తామంటూ వెళ్లిపోయారు. చివరకు వైద్యులు వారితో సంతకాలు చేయించుకుని డిశ్చార్జ్ చేశారు. మెరుగైన సేవలందించాం ఇద్దరు పసికందుల ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు. రెండు ప్రీమెచ్యూర్డ్ బేబీలు. పుట్టగానే ఏడవలేదు. దీంతో వారు కోలుకోవడానికి తక్కువ ఆస్కారం ఉంటుంది. కానీ రౌండ్ ద క్లాక్ మెరుగైన సేవలందించాం. అమాయక ప్రజలకు తెలియక మాపై ఆరోపణలు చేస్తున్నారు. – డాక్టర్ శ్రీధర్ -
ఉసురు తీస్తున్న నిర్లక్ష్యం
సాక్షి, సిటీబ్యూరో :గోల్కొండ పరిధిలోని కుతుబ్షానగర్కు చెందిన ఫాతిమా (2) ఇంటి ముందు ఆడుకుంటూ మూతలేని నీటి సంపులో పడి కన్నుమూసింది. ♦ డీడీ కాలనీకి చెందిన చిన్నూ (3) ఆడుకుంటూ బాత్రూమ్లోకి వెళ్లి నీళ్ల బక్కెట్లో పడి చనిపోయింది. మైలార్దేవ్పల్లి పరిధిలో ఓ ఇంటి వెనుక భాగంలో నిర్మించిన డ్రైనేజ్ గుంతలో పడి రియా (2) అశువులు బాసింది. ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చిన నిర్లక్ష్యం తాలూకు ఘోరాలు ఇవి. ♦ తాజాగా గురువారం మూసారంబాగ్ డివిజన్ బడా మజీద్ లైన్లో షేక్ యాకుబ్ కుమారుడు రెహమాన్›(5) ఆడుకుంటూ సంపులో పడి చనిపోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఇలాంటి దుర్ఘటనల్లో కన్ను మూసిన వారంతా లోకం పోడక తెలియని పసిమొగ్గలు... తల్లిదండ్రులు, అధికారుల నిర్లక్ష్యంతో పాటు అనాలోచిత నిర్ణయాల కారణంగా నిత్యం పలువురు మృత్యువాత పడుతున్నారు. చిన్నారులకు కుతూహలమే... అప్పుడప్పుడే ప్రపంచాన్ని చూస్తున్న చిన్నారులకు ప్రతి అంశం పట్ల కుతూహలం, నేర్చుకోవాలని, దగ్గరగా చూడాలనే తపన ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేయవద్దని పెద్దలు వారిస్తుంటారో... అదే చేసేందుకు వారు ఆసక్తి చూపుతారు. ఇంట్లో ఉన్న వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు నీళ్లు సైతం వీరిని ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి. తరచూ వాటి వద్దకు వెళ్లాలని, ఆడుకోవాలని చూస్తుంటారు. వేసవి తాపం ఎక్కువగా ఉన్న సందర్భాల్లో నీటితొట్టెలు, బక్కెట్లు, సంపులు వీరికి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అయితే చిన్నారుల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రం తల్లిదండ్రుల పైనే ఉంది. దిగువ మధ్య తరగతివారే ఎక్కువ... ఇటీవల నగరంలో చోటు చేసుకున్న చిన్నారులకు సంబంధించిన అపశృతులను పరిశీలిస్తే ఇలాంటి ఉదంతాలు ఎక్కువగా దిగువ మధ్య తరగతి అంతకంటే కింది స్థాయిలో ఉన్న కుటుంబాల్లోనే జరుగుతున్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. వారిలో విద్యాప్రమాణాలు తక్కువగా ఉండటం, అవసరమైన స్థాయిలో పరిపక్వత లేకపోవడం కూడా పిల్లల పట్ల నిర్లక్ష్యానికి కారణంగా మారుతున్నట్లు చెబుతున్నారు. అలాగని మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి కుటుంబాల్లోని చిన్నారులు పూర్తిగా సురక్షితంగా ఉంటున్నారనీ చెప్పలేమని స్పష్టం చేస్తున్నారు. అక్కడే అడపాదడపా అపశృతులు చోటు చేసుకుంటున్నాయని వివరిస్తున్నారు. మరెన్నో కారణాలు... ‘సంపు’ బాధిత కుటుంబాల్లో అనేకం వలస వచ్చినవే ఉంటున్నాయి. వీరికి స్థానిక పరిస్థితులపై అవగాహన ఉండకపోవడం, ప్రస్తుతం జరుగుతున్న సంపుల నిర్మాణం, వాటి వల్ల జరిగే ప్రమాదాల తీవ్రత తెలియట్లేదు. ఫలితంగానే చిన్నారుల విషయంలో కాస్త నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. దీనికితోడు ఇటీవల కాలంలో అన్నీ చిన్న కుటుంబాలే కావడంతో పాకాడే పసి పిల్లల ఆలనాపాలనా, ఇంటి పనులు రెండూ తల్లిదండ్రులే చూసుకోవాల్సి వస్తోంది. ఈ కారణంగానూ పిల్లలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారు. వీరి కదలికల్ని కనిపెట్టడం, కట్టడి చేయడంలోనూ విఫలం కావడం పూడ్చలేని నష్టాన్ని మిగుల్చుతూ కుటుంబాన్నే దుఃఖసాగరంలో ముంచేస్తోంది. ఇవి చాలవన్నట్లు ప్రభుత్వ యంత్రాంగాల నిర్లక్ష్యమూ చిన్నారుల ఉసురు తీస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో ఉండే గోతులు, సంపులు, నీటి గుంటలు, ఫౌంటేన్లు, ఇంకుడు గుంతల నిర్వహణ, వీటికి సరైన రక్షణ కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఒక ఓపెన్ నాలాలు, మ్యాన్హోళ్ల విషయం వేరే చెప్పాల్సిన పనే లేదు. ఇవన్నీకూడా అపశృతులకు కారణంగా మారుతున్నాయి. సంపులో పడి బాలుడు మృతి మలక్పేట: సంపులో పడి బాలుడు మృతిచెందిన సంఘటన గురువారం మలక్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఆయూబ్, శంషాద్ బేగం దంపతులు మూసారంబాగ్ డివిజన్, బడా మజీద్ లైన్లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం. ఆయూబ్ అంబర్పేటలో తాళాలు రిపేర్ చేస్తు జీవనం సాగిస్తున్నాడు. వారి ఇంటికి ఎదురుగా ఓల్డ్మలక్పేటకు చెందిన సయ్యద్ అతియా ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా భవనం గ్రౌండ్ ఫ్లోర్లో నీటి సంపు ఏర్పాటు చేశాడు. అయితే భవనం చుట్టు ఎలాంటి రక్షణ లేకపోవడంతో సంపుపై మూత బిగించలేదు. ఆయూబ్ కుమారుడు షేక్ అబ్ధుల్ రెహమాన్›(5) గురువారం ఉదయం ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు సంపులో పడిపోయాడు. అతడి ఆచూకీ కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టగా రహమాన్ ఎదురుగా ఉన్న భవనం నీటి సంపులో తేలియాడుతూ కన్పించాడు. కుటుంబసభ్యులు అతడిని మూసారంబాగ్ చౌరస్తాలోని సేఫ్ చిల్డ్రన్ ఆసుపత్రికి తరలింయగా పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. దీనిపై సమాచారం అందడంతో ఎమ్మెల్యే అహ్మద్ బలాల, మాజీ కార్పొరేటర్ మహ్మద్ అస్లాం, ఎంఐఎం నాయకులు ఇలియాస్, ఎన్ఎస్యూఐ జిల్లా కార్యదర్శి సోహేల్, పోలం రవీందర్యాదవ్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మలక్పేటఇన్స్పెక్టర్ కేవీ సుబ్బారావు పర్యవేక్షలో ఎస్సై శ్రీనునాయక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కనీస జాగ్రత్తలు అవసరం ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా తల్లిదండ్రులు సైతం కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. చిన్నారులు ఇంట్లో, ఇంటి బయట ఆడుకునేప్పుడు వారిపై ఓ కన్నేసి ఉంచాలి. ఎవరికి వారు తమ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళు, భవనాలకు సంబంధించిన సంపులు, డ్రైనేజీలు, పిల్లర్ గుంతల విషయంలో జాగ్రత్తగా ఉంటూ అవసరమైతే వాటి యజమానులు, అధికారుల్ని అప్రమత్తం చేయాలి. మూతలేని మ్యాన్హోళ్లు, ప్రమాదకరంగా మారిన ఓపెన్ నాలాలు కనిపిస్తేప్రతిఒక్కరూ బాధ్యతగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి సమస్య పరిష్కారమ య్యేలా చూడాలి. – నగర పోలీసు ఉన్నతాధికారి -
అందమైన లోకం.. పుట్టుకే శోకం
మాతా శిశు సంరక్షణ అంటూ ప్రభుత్వాలు గొప్పగా ప్రచారం చేస్తుంటే అమ్మ కడుపులో ఉన్న శిశువులు ఎంతో సంతోషించారు. తమ ఆరోగ్యం కోసం ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారా.. అంటూ ఆశ్చర్యపోయారు. అందమైన లోకాన్ని చూసేందుకు తొమ్మిది నెలలు ఎప్పుడు పూర్తవుతాయా అని వేయి కళ్లతో నిరీక్షించారు. అయితే వైద్యుల నిర్లక్ష్యంతో ఒకరు లోకాన్ని చూడకనే అమ్మ గర్భంలోనే కన్నుమూయగా.. మరో చోట పుట్టిన శిశువు అనారోగ్యంతో ఆసుపత్రికి చేరినా బతకలేక పోయింది. బిల్లు కడితేనే మృత శిశువును అందిస్తాన్న ఆసుపత్రి సిబ్బంది నిర్వాకాన్ని చూసి ఇదేం లోకం.. పుట్టుకే శోకం అంటూ ఆ శిశువు ఆత్మ ఘోషించింది. ఆదివారం జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ రెండు ఘటనలు అటు ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం.. ఇటు ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీని తేటతెల్లం చేశాయి. కర్నూలు, బొమ్మలసత్రం: వైద్యం.. వ్యాపారంగా మారిన నేపథ్యంలో కొందరు ప్రైవేటు ఆసుపత్రి నిర్వాహకులు మానవత్వం మరిచి వ్యవహరిస్తున్నారు. ఆదివారం నంద్యాలలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. నంద్యాల మండలం అయ్యలూరు గ్రామానికి చెందిన ఖాజా హుస్సేన్ తన భార్య హుసేన్బీని ప్రసవం నిమిత్తం గత నెల 28న పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించాడు. మరుసటి రోజు ఉదయం ఆమె ఆడశిశువుకు జన్మనిచ్చింది. కాన్పు సమయంలో ఉమ్ము నీరు తాగిన శిశువు అస్వస్థతకు గురి కావడంతో పక్కనే ఉన్న లిటిల్ స్టార్ చిన్న పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో తల్లిదండ్రులు చిన్నారిని అక్కడికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యుడు పాప ఆరోగ్యం బాగా లేదని ఇక్కడే వారం రోజులు చికిత్స అందించాలని చెప్పారు. ఈనెల 6వ తేదీ వరకు చికిత్స అందించి దాదాపు రూ.1.55 లక్షలు బిల్లు కావడంతో బంధువులు, స్నేహితుల నుంచి అప్పు తీసుకొచ్చి వైద్యునికి చెల్లించారు. అదే రోజు శిశువును ఐసీయూ గది నుంచి సాధారణ వార్డుకు మార్చారు. అయితే ఆయాసంతో బాధపడుతుండటంతో మళ్లీ పరీక్షలు చేశారు. కిడ్నీకి ఇన్ఫెక్షన్ సోకిందని, రక్తంలో ప్లేట్లేట్స్ తక్కువగా ఉన్నాయని, వీటన్నింటికీ చికిత్స అందించాలంటే భారీగా ఖర్చువుతుందని చెప్పారు. తల్లిదండ్రులు ఇందుకు ఒప్పుకోవటంతో తిరిగి చికిత్స ప్రారంభించారు. ఆ సమయంలోనే మందులు, అడ్వాన్స్ అంటూ డబ్బులు భారీగా వసూలు చేశారు. అయితే శనివారం శిశువు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, బతకడం కష్టమని.. మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని చేతులెత్తేశారు. ఇప్పటికే చాలా ఖర్చు పెట్టామని, ఎలాగైనా బతికించాలని శిశువు తల్లిదండ్రులు వేడుకున్నా రు. 20 రోజులకే రూ. 3 లక్షల బిల్లు కాగా రూ. 2.70 లక్షలు చెల్లించారు. అయితే శనివారం రాత్రి 12 గంటల ప్రాంతంలో శిశువు మృతి చెందిందని ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. అయితే మిగతా రూ.30 వేలు కట్టి మృత శిశువును తీసుకెళ్లాలని నిర్దాక్షిణ్యంగా చెప్పడంతో తల్లిదండ్రులు, బంధువులు ఆవేదనకు గురయ్యారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి తమ బిడ్డ చివరి చూపు చూసేందుకు అనుమతించాలని కోరినా ఒప్పుకోలేదు. అప్పటికే లక్షలు ఖర్చు చేసినా వారికి పాప దక్కక పోవడంతో కన్నీరుమున్నీరుగా విలపించినా ఆసుపత్రి యాజమాన్యం చలించలేదు. సమాచారం తెలుసుకున్న ఏఐఎస్ఎఫ్, పీడీఎస్టీ, ఆర్వైయూ తదితర ప్రజా సంఘాలు నాయకులు రాజు నాయుడు, ధనుంజేయుడు, రఫి తదితరులు ఆసుపత్రికి చేరుకొని ఆందోళన నిర్వహించారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగ ప్రవేçశం చేశారు. పూర్తి వివరాలు తెలుసుకున్న పోలీసులు తెలుసుకొని సంబంధిత ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ ఆనంద్ను అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం చిన్నారి మృత దేహాన్ని బంధువులకు అప్పజెప్పడంతో ఆందోళన విరమించారు. పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత పుట్టిన పాపను ఎలాగైనా బతికించుకోవాలనే తల్లిదండ్రుల ఆరాటాన్ని ఆసుపత్రి యాజమాన్యం సొమ్ము చేసుకునే ప్రయత్నం చేసేందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆదోని టౌన్: ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో ఓ మహిళకు కడుపుకోత మిగిలింది. ఆదోని మండలం పెద్ద పెండేకల్ గ్రామానికి చెందిన మహబూబ్ బాషా, ఎస్.మోయిద్దీన్బీ దంపతులకు ముగ్గురు కుమారులు. కుమార్తె కోసం నాలుగో కాన్పునకు మోయిద్దీన్బీని శనివారం సాయంత్రం ఆదోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రిలో చేర్చుకున్న వైద్య సిబ్బంది ఆస్పత్రి సూపరింటెండెంట్ మాధవీలతకు సమాచారాన్ని అందించారు. విషయం తెలుసుకున్న ఆమె ఆస్పత్రికి వచ్చి గర్భిణినిని పరీక్షించి కడుపులో బిడ్డ చనిపోయిందని తేల్చి చెప్పారు. మృత శిశువును బయటకు తీసేందుకు మోహిద్దీన్బీని వార్డులో అడ్మిట్ చేశారు. అర్ధరాత్రి సమయం కావస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. కడుపు నొప్పితో ఆమె తీవ్రంగా బాధపడుతున్నా అటు వైపు సిబ్బంది కూడా రాలేదు. నొప్పిని భరించలేక వార్డు నుంచి ఆసుపత్రి గేట్ వద్దకు రాగానే కింద పడిపోయింది. ఆ సమయంలోనే కడుపులో ఉన్న మృత ఆడ శిశువు బయటపడింది. కాన్పు తర్వాత అస్వస్థతకు గురైన ఆమెకు చికిత్స అందించారు. సకాలంలో వైద్యం చేసి ఉంటే ఇంతటి పరిస్థితి ఉండేది కాదని బాధితురాలు రోదించింది. కుమార్తె కావాలన్న ఆమె కల కరిగిపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపించింది. -
పెద్ద వయసు డాడీ.. పెను సమస్యల దాడి
మగాడికేముంది? ఏ వయసులోనైనా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనొచ్చు. కానీ మహిళలకు అలా కాదు కదా.. సమాజంలో పేరుకుపోయిన ఓ అభిప్రాయం ఇది. శరీర నిర్మాణ వైవిధ్యాలు కూడా దీనికి అనుగుణంగా ఉండడంతో ఇది అంతకంతకూ బలపడుతూ వచ్చింది. అయితే పెద్ద వయసులో తండ్రి కావడం వల్ల మగవాళ్లకు కాకపోయినా అలా పుట్టే పిల్లలకు రకరకాల సమస్యలు తప్పవని హెచ్చరిస్తోంది ఓ సర్వే. తగిన వయసులో పెళ్లి, పిల్లల్ని కనడం అవసరమని సూచిస్తోంది. సాక్షి, సిటీబ్యూరో : కేరీర్, ఆర్థిక భద్రత కోసం.. నలభై ఏళ్లకు కాస్త అటూ ఇటూగా వయసు ఉండే మగవాళ్ల చేతుల్లో నెలల పసికూనలు.. కనపడడం ఇప్పుడు నగరంలో సర్వసాధారణం. రకరకాల కారణాలు పెళ్లిని, ఆ తర్వాత సంతాన భాగ్యానికి అడ్డుతగులుతున్నాయి. ఎంచుకున్న కెరీర్కు అనుగుణంగా చదివే చదువులు పూర్తయ్యేటప్పటికి కనీసం పాతికేళ్లు నిండుతున్నాయి. ఆ తర్వాత ఉద్యోగమో, మరో రంగంలోనో స్థిరపడేటప్పటికి మరో ఐదేళ్లు, ఇల్లు, తగినంత ఆర్థిక భద్రత కోసం మరో నాలుగైదేళ్లు.. ఇలా ప్రస్తుతం మగవాళ్లు పెళ్లి చేసుకునే వయసు అటూ ఇటుగా 35 ఏళ్లకు చేరింది. ఆ తర్వాత వీళ్లకి సంతానం కలిగేసరికి మధ్యవయసు వస్తోంది. గుండెలపై చిన్నారి పాదాలు నృత్యం చేయడం, కన్నబిడ్డ చేత నాన్నా అని పిలిపించుకోవడం.. పురుషులకి ఓ మధురానుభూతి. పితృత్వపు ఆనందం సంపూర్ణంగా పొందాలంటే తగిన వయసులోనే పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి లేని పక్షంలో ఎదురయ్యే సమస్యలు ఆ అనుభూతిని హరించివేసే ప్రమాదం ఉంది. దీనిపై నగరంలోని ఇందిరా ఐవీఎఫ్ సెంటర్కు చెందిన ఐవీఎఫ్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ డాక్టర్ స్వాతి మోతె చెప్పిన విశేషాలివీ.. పిల్లల ఆరోగ్యంపై ప్రభావం.. మహిళల్లో పెద్ద వయసు కారణంగా సంతాన ప్రాప్తికి అవసరమైన పునరుత్పత్తి వ్యవస్థ బలహీనపడడం, మోనోపాజ్ సమీపించే ప్రమాదాలు ఉంటాయి. మగవాళ్లలో అలాంటి సమస్య ఉండదని భావిస్తారు. ఈ తరహా ఆలోచనలతో పెద్ద వయసు తండ్రులకు పిల్లలు జన్మించడం అనేది ఒకప్పటితో పోలిస్తే బాగా పెరిగింది. ఉదాహరణకు 40 ఏళ్లు దాటిన తర్వాత తండ్రులు కావడం అనేది దశాబ్దాల క్రితం 4శాతం కాగా ఇప్పుడు 10శాతం. మగవాళ్లలో మధ్య వయసు దాటాక సంతానలేమితో పాటు ఒకవేళ పిల్లలు పుట్టినా.. వారు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి అని అమెరికాలో నిర్వహించిన ఓ పరిశోధన తేల్చింది. సర్వే ‘జననా’.. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ), నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ స్టాటిస్టిక్స్లు నమోదు చేసిన దాదాపు 40 మిలియన్ల జననాల రికార్డ్స్ను విశ్లేషించిన తర్వాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకుల బృందం ఈ అంశాలను వెల్లడించింది. గత అక్టోబరు 21న బ్రిటిష్ మెడికల్ జర్నల్లో ప్రచురితమైన ఆ పరిశోధనా ఫలితాల ప్రకారం.. తండ్రి వయసు కూడా తల్లీ, పిల్లలపై ప్రతికూల ప్రభావాలకు కారణమవుతోంది. తండ్రి వయసు సగటు 35 ఏళ్ల అయిన పక్షంలో జనన ప్రమాదాల్లో కొద్దిగా హెచ్చుదల ఉంటుందని, వయసు పెరుగుతున్న కొద్దీ ప్రతి పురుషుడి డీఎన్ఎలో జరిగే రెండు నూతన ఉత్పరివర్తనలు జనన శిశువులకు ప్రమాదకరంగా పరిణమిస్తాయి స్పష్టం చేసింది. కనీసం 35ఏళ్లు దాటిన తండ్రులు కన్న బిడ్డల్లో అత్యధికులకు జనన సమయంలో ప్రమాదావకాశాలు హెచ్చుగా ఉంటున్నాయి. అలాగే మధ్య వయసు తండ్రుల పిల్లలు తక్కువ బరువుతో పుడుతున్నారు. అంతేకాదు పుట్టిన వెంటనే వెంటిలేషన్ అవసరం ఏర్పడుతోంది. తండ్రి అయ్యే వయసు మరింత పెరుగుతున్న కొద్దీ పిల్లలకు ప్రమాదావకాశాలు కూడా పెరుగుతున్నాయి. వయసు 35 కన్నా మించిన వయసులో తండ్రి అవుతున్నవారికి నెలలు నిండని పిల్లలు పుట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వయసు 50 దాటిన తండ్రుల్లో 28 శాతం మందికి పుట్టిన బిడ్డ నియోన్యాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ)లో చేరాల్సిన అవసరం ఏర్పడుతోంది. తల్లికీ ముప్పే.. వయసు దాటాక తండ్రి అవుతున్న పురుషుల కారణంగా ఆ బిడ్డలను కన్న తల్లులు సైతం కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కుంటున్నారని పరిశోధన వెల్లడించింది. తండ్రి వయసు ప్రభావం తల్లి గర్భధారణపై రకరకాలుగా ఉంటుంది. ఇలాంటి తల్లులకు ప్రసూతి సమయంలో మధుమేహంవచ్చే అవకాశాలు ఉన్నాయి. తగిన వయసులోనే మేలు.. తగిన వయసులో పెళ్లి చేసుకుని పిల్లలను కనడం మంచిది. వీలైనంత వరకూ పెళ్లయిన తర్వాత ఎక్కువ కాలం పిల్లలను వాయిదా వేయకపోవడం అవసరం. వయసు మీరాక పెళ్లి– పిల్లలు అనే పరిస్థితి నుంచి పుట్టే సమస్యలపై ప్రస్తుత తరంలో అవగాహన పెరగాల్సి ఉంది. – డాక్టర్ స్వాతి మోతె -
డెలీ'వర్రీ'
రాజమహేంద్రవరం రూరల్, బొమ్మూరు కు చెందిన శీలం కనక దుర్గ గర్భిణి. నెలలు నిండడంతో నవంబర్ 25న పురుడు పోసుకునేందుకు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. 26వ తేదీన ఆపరేషన్ చేయగా ఆడపిల్లకు జన్మనిచ్చింది. పుట్టిన నవజాత శిశువుకు మంగళవారం వ్యాక్సిన్ వేశారు. సాయంత్రం పాపకు జ్వరం రావడంతో కంగారు పడిన కుటుంబసభ్యులు వెంటనే డాక్టర్ల వద్దకు తీసుకువెళ్లగా వ్యాక్సిన్ వేసిన పాపకు జ్వరం అలానే వస్తుందని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. అయితే రాత్రంతా పాప జ్వరంతో బాధపడగా 27వ తేదీ మధ్యాహ్నం ఆమెను డాక్టర్ల వద్దకు తీసుకువెళితే మృతి చెందినట్టు చెప్పారు. డాక్టర్లు పాపను పట్టించుకోకపోవడం వల్లే మృతి చెందినట్టు ఆరోపించి ఆసుపత్రి వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి , తాడితోట (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలోని తల్లీబిడ్డల విభాగంలో మాతా శిశుమరణాలు తగ్గడం లేదు. ఈ ఆసుపత్రిలో వారంలో ఎవరో ఒకరు మృత్యువాతపడుతూనే ఉన్నారు. ప్రభుత్వ డాక్టర్లు తమ తప్పులేదని చేతులు దులుపుకొంటున్నా భారీ మూల్యం చెల్లించేది మాత్రం రోగులే. డబ్బులు పెట్టి ప్రైవేటు వైద్యం చేయించుకోలేని ఎందరో ఈ ఆసుపత్రికి వస్తున్నా.. ఇక్కడ వైద్యం అందని ద్రాక్షగానే ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి గ్రామానికి చెందిన పెన్నింటి నాగలక్ష్మి నవంబర్ 14న పురుడు కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. 15వతేదీ డ్యూటీ డాక్టర్ శాంతి ప్రియ ఆపరేషన్ చేయగా మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆపరేషన్ చేసి బిడ్డను తీయడం వల్ల కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉంచారు. మధ్యాహ్నం బాత్ రూమ్కు వెళ్లేందుకు బెడ్ నుంచి కిందకి దిగిన నాగలక్ష్మి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందింది. బాలింతలకు సమీపంలో బాత్ రూమ్లు ఏర్పాటు చేయకపోవడం వల్లే ఆమె మృతి చెందిందని నాగలక్ష్మి బంధువులు ఆరోపిస్తూ ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవని, పురుడుపోసుకునేందుకు వచ్చే రోగుల పట్ల సిబ్బంది దారుణంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. సిబ్బంది కొరతతో ఇబ్బందులు ఒకే సారి సీనియర్ సిబ్బందిని బదిలీచేయడంతో గైనిక్ విభాగంలో వైద్య సేవల్లో తీవ్ర జాప్యం నెలకొంటోందని రోగులు పేర్కొంటున్నారు. గర్భిణులకు పరీక్షలు చేసే సమయం కూడా సిబ్బందికి ఉండడం లేదు. రోజుల తరబడి పురుడుపోసుకునేందుకు వేచి ఉండాల్సి వస్తోంది. ప్రçసూతి విభాగంలో ప్రస్తుతం ఏడుగురు డాక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. వారిలో ఒక డాక్టర్ మెటర్నటీ లీవ్లో ఉన్నారు. మిగిలిన ఆరుగురు డాక్టర్లలో ఒకరు రాత్రి సమయాల్లో డ్యూటీ నిర్వహించేందుకు కేటాయించగా ఐదుగురు రోజు వారీ విధులు నిర్వహిస్తుంటారు. రోజుకు కనీసం 10 నుంచి 15 వరకు పురుళ్లు పోయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. విపరీతమైన ఒత్తిడిలో డాక్టర్లు విధులు నిర్వహించాల్సి వస్తోంది. వీటితోపాటు గర్భిణుల్లో రక్తహీనత సమస్యలు తలెత్తి వారికి రక్తం ఎక్కించడంలో జాప్యం చోటు చేసుకుంటోంది. దీంతో తల్లి గాని నవజాత శిశువుల గాని మృత్యువాత పడుతుండడం సర్వసాధారణమైంది. ఒకేసారి సిబ్బంది బదిలీ వైద్య విధాన పరిషత్లో సిబ్బంది బదిలీలు రోగుల పాలిట శాపంగా మారింది. ఏళ్ల తరబడి ఒకే చోట తిష్టవేసిన వారిని బదిలీలు చేయడం వల్ల రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న 69 మందిని ఒకే సారి బదిలీలు చేయడం వల్ల పలు విభాగాల్లో సకాలంలో సరైన వైద్య సేవలు అందక ఇబ్బందులు పడుతున్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా వైద్య సేవలు పొందేందుకు వస్తుంటారు. వీరితో పాటు రోజు సుమారు 600 మంది వరకు అవుట్ పేషంట్లు వస్తుంటారు. వారికి సరైన వైద్య సేవలు అందడం లేదు. ఇక్కడ పని చేసే నలుగురు ల్యాబ్ టెక్నీషియన్లు, ఇద్దరు ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్లు, ఒక ల్యాబ్ అటెండెంట్, ఇద్దరు ఓటీలు, 15 మంది స్టాఫ్ నర్సులు, ఏడుగురు ట్రామా కేర్ సిబ్బంది, ఏడుగురు ఎంఎన్ఓలు, నలుగురు ఎఫ్ఎన్ఓలు, ఒక జేఎస్డబ్ల్యూ, జిల్లా కేడర్కు చెందిన 44 మంది, జోనల్ కేడర్కు చెందిన 25 మంది మొత్తం 69 మంది సిబ్బంది బదిలీ అయ్యారు. దీంతో మెరుగైన వైద్య సేవలు అందించలేకపోతున్నారు. కొత్త ఐసీయూ ఏర్పాటు చేశాం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రసూతి విభాగంలో కొత్తగా ఐసీయూ ఏర్పాటు చేశాం. డాకర్లు, సిబ్బంది కొరత ఉంది. కనీసం 10 మంది డాక్టర్లు, మరో 20 మంది స్టాఫ్ నర్సులు ఉండాలి. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాం. త్వరలోనే పరిష్కారం అవుతుంది. ఎక్కువ సంవత్సరాలు ఒకే చోట విధులు నిర్వహించిన వైద్య సిబ్బందిని ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బదిలీ చేశాం. కొత్తవారు విధుల్లోకి చేరారు. ఉన్న వారితో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం.– టి.రమేష్ కిశోర్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ -
బాలలను వెంటాడుతున్నపౌష్టికాహార లోపం
జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన మూడేళ్ల చిన్నారి తరచూ అనారోగ్యం పాలవుతోంది. వైద్యుల వద్దకు తీసుకెళ్తే చిన్నారిలో పోషకాహార లోపం ఉందని చెప్పారు. దీనివల్లే తరచూ అనారోగ్యానికి గురవుతోందని నిర్ధారించారు. ఆ పాప వయసును బట్టి చూస్తే.. 10 కిలోల వరకు బరువు ఉండాలి. కానీ ఆరున్నర కిలోలు మాత్రమే ఉంది. ఈ ఒక్క చిన్నారే కాదు.. జిల్లాలోని చాలా మంది బాలలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. చలాకీగా ఆడుతూ.. పాడుతూ ఎదగాల్సిన బాల్యం పోషకాహార లేమితో బక్కచిక్కి పోతోంది. అధికారులు బయటకు చెప్పకపోయినా జిల్లాలో రక్తహీనత.. పోషకాహార లోపంతో మరణించే వారి సంఖ్య అధికమవుతోంది. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో పోషకార లోపంతో తీవ్రంగా బాధపడుతున్న పిల్లల సంఖ్య 1849 కాగా అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా అధికంగా ఉండే అవకాశం ఉంది. సాక్షి కడప : బాల్యం పౌష్టికాహారం కొరతతో హాహాకారాలు చేస్తోంది. అభం శుభం తెలియని చిన్నారులు ఆనందంగా ఎగరలేని పరిస్థితి. ఆటలు ఆడాలని ఉన్నా.. పాటలు పాడాలని ఉన్నా... ఏమీ చేయలేని నిస్సహాయత... అందరిలాగా ఉత్సాహంగా ఉరకలెత్తాలనే ఆశ ఉన్నా బాల్యంపై రక్తహీనత నాట్యం చేస్తోంది. ఎన్నో ఆశలు.. మరెన్నో ఆకాంక్షలు వారి మనసుల్లో పుట్టుకొస్తున్నా పౌష్టికాహార లోపం అనే రోగం వారిని నిత్యం కుంగదీస్తోంది. వయస్సు పెరుగుతున్నా.. బరువు మాత్రం పెరగకుండా అనారోగ్యం చిన్నారులను చిదిమేస్తోంది. ఒకవైపు పేదరికం.. మరోవైపు అధికసంతానం...ఇంకోవైపు ఆర్థిక సమస్యలతో పిల్లలకు సక్రమంగా... సంపూర్ణంగా ఆహారం అందించలేక తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. కళ్లెదుటే చిక్కి శల్యమవుతున్న పిల్లలను చూస్తూ.. ఏమీ చేయలేని దీనస్థితిని తలుచుకుంటూనే కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. ప్రభుత్వం ప్రత్యేక పథకాల పేరుతో హడావుడి చేస్తున్నా... పాలకులు కంప్యూటర్ యుగంలో ఆకాశాన్ని తాకేలా అభివృద్ధి చేశామని జబ్బలు చరుచుకుంటున్నా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. పథకాల ఫలం పూర్తి స్థాయిలో అందక అల్లాడిపోతున్న బాలల దయనీయ స్థితిని బాలల దినోత్సవం రోజైనా అధికారులు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. వేటాడుతున్న పౌష్టికాహార లోపం జిల్లాలో 30 లక్షలకు పైగా జనాభా ఉండగా, 1,74,212 మంది చిన్నారులు ఉన్నారు. 0–1 నెలల చిన్నారులు 22,814 మంది ఉండగా, 1–3 నెలల చిన్నారులు 73,824 మంది, 3–6 నెలల చిన్నారులు 77,574 మంది జిల్లాలోఉన్నారు. అయితే ఇందులో రక్తహీనతతో వేలాది మంది చిన్నారులు బాధపడుతున్నారు. పౌష్టికాహారం పేదరికంపై పడగవిప్పి నాట్యం చేస్తోంది. అనేక సంక్షేమ పథకాలు ఉన్నా పిల్లలకు పూర్తి స్థాయిలో అందలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే సాధారణ చిన్నారుల కంటే కూడా లోపంతో ఉన్న చిన్నారులకు అధికంగా ఇస్తున్నామని సంబంధిత శాఖలు చెబుతున్నా వాస్తవ పరిస్థితిలో చిన్నారుల ఎదుగుదల అంతంత మాత్రంగా ఉండడం ఆందోళన కలిగించే పరిణామం. చిన్నారులను శాసిస్తున్న మరణం జిల్లాలో పౌష్టికాహార లోపం జబ్బుకు గురిచేస్తే...ఆ వ్యాధి కాస్త చిన్నారులను బలి తీసుకుంటోంది. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వారిని కాపాడలేకపోతున్నారు. హంగు, ఆర్భాటాలకు లక్షలాది రూపాయలు తగలేస్తున్నా కళ్లెదుటే సరైన ఆహారం లేక తనువు చాలిస్తున్న చిన్నారుల గురించి ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ప్రధానంగా జిల్లా యంత్రాంగం చిన్నారుల మరణాలపై కూడా ›ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. బాలలకు అందించాల్సిన పౌష్టికాహార విషయంలో రాజీలేని ధోరణి అవలంబించి చిన్నారుల ప్రాణాలు కాపాడటానికి నడుం బిగించాలి. ప్రతినెల పదుల సంఖ్యలో రక్తహీనత చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంటున్న వైనం తలుచుకుంటూనే కన్నీళ్లు ఆగని పరిస్థితి. తల్లిదండ్రులు ఆలోచించాలి బిడ్డలు చదువులోగానీ, ఆటపాటల్లోగానీ వెనుకబడి పోవాలని కోరుకోరు. కానీ వాళ్లలో నిరుత్సాహాన్ని నింపి.. వారు వెనుకబడిపోయేలా చేసేది పౌష్టికాహార లోపం. దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తల్లిదండ్రులు ప్రణాళిక రూపొందించుకోవాలి. బిడ్డ ఉత్సాహంగా లేకపోవడం... ఇతర అనేక కారణాలతో సన్నగిల్లిపోతుండడంపై కూడా తల్లిదండ్రులు ఆలోచించాలి. రక్తహీనత అన్న అనుమానం రాగానే సత్వరమే వైద్యులను సంప్రదించి అత్యుత్తమ వైద్య సేవలు అందించడంతోపాటు అవసరమైన పౌష్టికాహారాన్ని అందించేలా చూడాలి. తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు చిన్నారుల పౌష్టికాహార విషయంలో కూడా కొంత శ్రద్ధ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కాగా, పౌష్టికాహార లోపంతో ఉన్న చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల్లో అందించే ఆహారం కాకుండా అదనంగా ప్రతిరోజు గుడ్డు, 100 ఎంఎల్ పాలను కూడా అందిస్తున్నట్లు ఐసీడీఎస్శాఖ పేర్కొంటోంది. ఏడు వేల మందికిపైగాచిన్నారులకు రక్తహీనత జిల్లాలో రక్తహీనత చిన్నారులను పట్టిపీడిస్తోంది. ఎన్నో సమస్యలు...మరెన్నో కష్టాలతో కుటుంబాలను సాగదీస్తున్న అనేక మంది చిన్నారుల విషయంలో చేతనైనంత ఆహారాన్ని అందిస్తున్నా కానీ ఎక్కడో ఒకచోట లోపం కనిపిస్తోంది. ఎన్ని రకాలుగా కన్న బిడ్డలను తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నా పౌష్టికాహార లోపం మాత్రం వారిని ఎదగనీయడం లేదు. జిల్లాలో తీవ్ర లోపంతో అల్లాడుతున్న చిన్నారులు 1849 మంది ఉన్నారు. అందులో చాలామందికి సీహెచ్సీలు, రిమ్స్, పీహెచ్సీలలో వైద్య సేవలు అందిస్తూ ఎదగడానికి ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నారు. 24 గంటలు వారిని పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా సాధారణ పౌష్టికాహార లోపంతో మరో 5341 మంది బాధపడుతున్నారు. రక్తహీనత లక్షణాలు ♦ వయస్సుకు తగ్గ బరువు మరియు పొడవు ఉండకపోవడం ♦ బలహీనంగా ఉండడం... తరుచూ అనారోగ్యానికి గురికావడం ♦ ఎల్లప్పుడూ నీరసంగా ఉండడంతోపాటు చురుగ్గా ఉండకపోవడం ♦ బిడ్డ అభివృద్ధి దశలో ఎదుగుదల లేకపోవడం -
ముగ్గురు పసికందులు మృతి
హిందూపురం అర్బన్: హిందూపురంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఒకే రోజు ముగ్గురు పసికందులు మృతి చెందటం కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే.. ఈ నెల 18న మడకశిర మండల పాపసానిపల్లికి చెందిన కవిత తన నాలుగు నెలల ఆడ శిశువుకు ఆరోగ్యం బాగలేకపోవడంతో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి వైద్యసేవలు పొందుతున్న పసిబిడ్డ బుధవారం ఉదయం చనిపోయింది. ప్రాణం పోస్తారని బిడ్డను తీసుకువస్తే బిడ్డ శవాన్ని చేతికిచ్చారని కవిత కన్నీరుమున్నీరైంది. ♦ ఇలా ఉండగానే గంట తర్వాత చౌళూరు గ్రామానికి చెందిన సుకన్య మూడునెలల ఆడశిశువుకు దగ్గు ఉందని, సరిగా పాలు తాగలేకపోతోందని ఆస్పత్రిలో చేర్చింది. చికిత్స పొందుతూ పాప 10 గంటల సమయంలో మృతి చెందింది. అక్కడి సిబ్బంది విషయం తెలిస్తే రచ్చ అవుతుందని భావించి పాప బతకదని ముందే చెప్పామని చెప్పి బాధితులను ఆటో ఎక్కించి పంపించేశారు. ♦ మధ్యాహ్నం 12 గంటల సమయంలో బిసలమానేపల్లికి చెందిన శ్రావణి రెండు నెలల మగశిశువు ఆరోగ్యం బాగలేదని ఆస్పత్రికి తీసుకువచ్చింది. వైద్యుల సూచన మేరకురక్త పరీక్షలు చేయించి తీసుకొచ్చిన కొద్దిసేపటికే బిడ్డ శీరీరం చల్లబడిపోయింది. వైద్యులు పరీక్షించి చనిపోయినట్లు చెప్పారు. దీంతో తల్లి శ్రావణి సొమ్మసిల్లి పడిపోయింది. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో లేపాక్షి పీహెచ్సీ ఆస్పత్రిలో చేర్పించారు. పేరుకే జిల్లా ప్రభుత్వాస్పత్రి హిందూపురంలో రూ.23 కోట్లు వెచ్చించి జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి ఏ మాత్రం తీసిపోని రీతిలో హంగు అర్భాటంతో ప్రభుత్వ ఆస్పత్రి భవనాలు, సదుపాయాలు కల్పించారు. అయితే ఇక్కడ వైద్యం అందించడానికి వైద్యులు, సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించలేదు. పేరుకే జిల్లా ఆస్పత్రి. సేవల్లో పీహెచ్సీ కన్నా అధ్వానంగా మారిందని ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. వైద్యసేవలపై ఎమ్మెల్యే బాలకృష్ణ ఏమాత్రం పట్టించుకోవడం లేదని రోగులు వాపోతున్నారు. ఆరోగ్యం బాగాలేదని చెబితే ‘ఇక్కడ పదిమంది లేరు.. వచ్చి చూస్తారు.. కాస్త ఓపిక ఉండాలి’ అంటూ చీదరించుకుంటున్నారని తెలిపారు. వైద్యులు వచ్చి చూసేసరికి ఉన్న ప్రాణం పోయే పరిస్థితి నెలకొంటోందన్నారు. విచారణకు కలెక్టర్ ఆదేశం అనంతపురం న్యూసిటీ: హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం చోటు చేసుకున్న పసికందుల మరణాలపై కలెక్టర్ వీరపాండియన్ విచారణకు ఆదేశించారు. జేసీ–2 సుబ్బరాజు, డీఎంఅండ్హెచ్ఓ అనీల్కుమార్, డీసీహెచ్ఎస్ డాక్టర్ రమేష్నాథ్తో కమిటీగా వేశారు. కమిటీ రెండు రోజుల్లోపు లోతుగా ఆరా తీసి నివేదిక ఇవ్వాలని సూచించారు. చిన్నారుల మృతి పట్ల కల్టెకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అన్నీ సహజ మరణాలే ఒకేరోజు ముగ్గురు పసికందులు చనిపోయారు. అన్నీ సహజ మరణాలే. పాపసానిపల్లి కవితకు మేనమామతో పెళ్లయ్యింది. మేనరికం వల్ల బిడ్డ ఆరోగ్యం దెబ్బతిని చనిపోయింది. చౌళూరు సుకన్య బిడ్డ కుపోషణకు గురై చనిపోయింది. బిసలమానేపల్లి శ్రావణి బిడ్డకు రక్తం తక్కువగా ఉండటంతో మృతి చెందింది.– డాక్టర్ కేశవులు, సూపరింటెండెంట్, హిందూపురం ప్రభుత్వాస్పత్రి వైద్యసేవల్లో నిర్లక్ష్యం లేదు హిందూపురం ఆస్పత్రిలో బుధవారం చోటు చేసుకున్న మరణాలపై వైద్యశాఖ నిర్లక్ష్యం లేదు. కేసులన్నీ చివరిలో ఆస్పత్రికి వచ్చాయి. ఆస్పత్రి వైద్యులు మెరుగైన వైద్యమే అందించారు. –రమేశ్నాథ్, డీసీహెచ్ఎస్ -
తల్లి గర్భంలో చావుగంట!
కోడుమూరులో మూడేళ్ల క్రితం ఓ నర్సింగ్ హోమ్పై అధికారులు దాడులు నిర్వహించి లింగనిర్ధారణ చేస్తుండగా పట్టుకున్నారు. ఆ తర్వాత స్కానింగ్ యంత్రాన్ని సీజ్ చేశారు. కానీ ఆ మిషన్ పక్కనే మరో మిషన్ను అనధికారికంగా తెచ్చుకుని అక్కడి వైద్యులు స్కానింగ్ చేస్తూ ఆపై అబార్షన్లు చేస్తున్నారు. కర్నూలు ఎన్ఆర్ పేటలోని ఓ స్కానింగ్ కేంద్రంలోనే ఓ మహిళా వైద్యురాలు ఇదే విధంగా అనధికార స్కానింగ్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో స్కానింగ్ కేంద్రాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ప్రస్తుతం అధికారికంగా 230కి పైగా స్కానింగ్ యంత్రాలు పనిచేస్తున్నాయి. అనధికారికంగా 450కి పైగా నడుస్తున్నాయని అంచనా. అనుమతి తీసుకున్న కేంద్రాల కంటే అనుమతి లేని కేంద్రాల్లోనే లింగనిర్ధారణ అధికంగా జరుగుతోంది. కర్నూలు కొత్తబస్టాండ్ పరిసర ప్రాంతాల్లోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, ఎన్ఆర్ పేట, ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న పలు క్లినిక్లు, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, గూడూరు, డోన్, నంద్యాల, నందికొట్కూరు తదితర ప్రాంతాల్లో యథేచ్ఛగా లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తేలితే చాలు అధిక శాతం అబార్షన్కు సిద్ధమవుతున్నారు. ఇరువర్గాల సమ్మతి మేరకు జరుగుతున్న ఈ తంతులో అటు గర్భిణి కుటుంబసభ్యులు, ఇటు వైద్యవర్గాలు విషయాన్ని బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నాయి. ఇద్దరికీ శిక్ష పడుతుందని భావించి గుట్టుగా లింగనిర్ధారణ, అబార్షన్లు చేస్తున్నారు. తగ్గుతున్న స్త్రీ, పురుషుల నిష్పత్తి.. జిల్లాలో పురుషులు, మహిళల నిష్పత్తిలోభారీగా వ్యత్యాసం కనిపిస్తోంది. 1000 మంది పురుషులకు ప్రస్తుతం జిల్లాలో 932 మంది మాత్రమే స్త్రీలు ఉన్నారు. 2011 లెక్కల ప్రకారం డోన్లో 889, ప్యాపిలిలో 894, గడివేములలో 899, శ్రీశైలంలో 892 మాత్రమే స్త్రీలు ఉన్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. దీంతో పాటు ఆదోని డివిజన్లోనూ 1000 మంది పురుషులకు అధిక శాతం మండలాల్లో 900 నుంచి 910లోపే స్త్రీలు ఉన్నారు. దీన్ని బట్టి జిల్లాలో మహిళల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం అవుతోంది. ఆర్ఎంపీలకు భారీగా కమీషన్లు స్కానింగ్ కేంద్రాలు, క్లినిక్లు, ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రధాన పాత్ర వహించేది ఆర్ఎంపీలేనన్న విషయం బహిరంగ రహస్యం. ఏ మాత్రం పేరులేని ఈ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయంటే ఆర్ఎంపీలకు వారు ఇస్తున్న భారీ కమీషన్లే కారణంగా చెప్పుకోవచ్చు. అధికంగా ఆదోని, తెలంగాణ రాష్ట్రంలోని పలు మండలాల నుంచి నిరక్షరాస్యులైన గర్భిణిలకు మాయమాటలు చెప్పి ఆర్ఎంపీలు కర్నూలుకు తీసుకొస్తున్నారు. ఈ మేరకు లింగనిర్ధారణకు స్కానింగ్ చేయించడానికి గర్భిణిని తీసుకొస్తే రూ.4వేల నుంచి రూ.6వేలను వైద్యులు వసూలు చేస్తారు. అందులో ఆర్ఎంపీ కమీషన్ రూ.2000 ముట్టచెబుతున్నారు. పీసీపీఎన్డీటీ చట్టం అంటే లెక్కేలేదు వరకట్న చట్టం, ధూమపాన నిషేధ చట్లాల్లాగే జిల్లాలో లింగనిర్ధారణ, భ్రూణహత్యలను నివారించేందుకు ఉద్దేశించిన పీసీ పీఎన్డీటీ చట్టం అభాసుపాలవుతోంది. ఈ చట్టం ఉన్నట్లు ఆయా స్కానింగ్ కేంద్రాల్లో పోస్టర్లు అతికించి, లోపల మాత్రం యదేచ్ఛగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఈ చట్టం ఏర్పడి పాతికేళ్లు అవుతోంది. దీనిని ఉల్లంఘిస్తే భారీ జరిమానాతో పాటు జైలుశిక్ష కూడా ఉంటుంది. కానీ జిల్లాలో ఏ ఒక్కరికీ ఇప్పటి వరకు ఈ శిక్షలు అమలు కాలేదు. ఒక్కరు కూడా జైలు గడప కాదు కదా కోర్టు మెట్లు కూడా ఎక్కలేదు. దీన్ని బట్టి జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ అధికారుల పనితీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ శాఖలో లెప్రసి కార్యాలయానికి చెందిన ఓ ఉద్యోగి గతంలో పీసీపీఎన్డీటీ యాక్ట్ బాధ్యతలు చూసేవారు. ఆయనపై ఆరోపణలు రావడంతో ఇటీవల ఆయనను లెప్రసి కార్యాలయానికి పంపించారు. ఏమైందో ఏమో మళ్లీ ఆయనను తిరిగి వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి తెచ్చుకున్నారు. దాడులు ముమ్మరం చేస్తాంజిల్లాలో లింగనిర్ధారణ, భ్రూణహత్యల (అబార్షన్లు)పై ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ విషయమై ఒక ప్రణాళిక రూపొందిస్తున్నాం. త్వరలో స్కానింగ్ సెంటర్లు, క్లినిక్లు, ప్రైవేటు ఆసుపత్రులపై మూకుమ్మడి దాడులు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాం. – డాక్టర్ జేవీవీఆర్కె ప్రసాద్, డీఎంహెచ్వో -
ఈ పాపం ఎవరిది?
నెల్లూరు, పొదలకూరు: అసలే పేదరికం. భార్యాభర్తలు దివ్యాంగులు. ముగ్గురు ఆడ పిల్లలకు జన్మనిచ్చారు. నాలుగో సంతానం మగబిడ్డ కావాలనుకుని గర్భం దాల్చడమే ఆ కుటుంబం పాలిట శాపంగా మారింది. ఏడో నెలలో పౌష్టికాహార లోపం వల్ల బిడ్డ కడుపులోనే మృతి చెందగా, తల్లి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. దీంతో ముగ్గురు ఆడ పిల్లలు దిక్కులేని వారయ్యారు. ప్రభుత్వం గర్భిణి, బాలింత, పురిటి బిడ్డలను స్త్రీ, శిశు సంక్షేమశాఖ ద్వారా ఆదుకుంటున్నామని, శిశు మరణాలను గణనీయంగా తగ్గిస్తున్నామని ఊదరగొట్టుకుంటోంది. స్త్రీ, శిశు మరణం నెలకొన్నా ఒక్క అధికారి సైతం అటు వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. ఆకలితో అలమటిస్తూ.. ఏ పాపం చేశారో ఏమో ఆ చిన్నారులు ఆకలితో అలమటిస్తూనే ఉన్నారు. పొదలకూరు ఏసీనగర్ కాలనీలో కొంగి వెంకటేశ్వర్లు, వెంకటరమణమ్మ ముగ్గురు ఆడబిడ్డల పరిస్థితి ఘోరంగా ఉంది. తల్లిదండ్రులు దివ్యాంగులు (తండ్రి అంధుడు, తల్లికి అంగవైకల్యం). ఈ నేపథ్యంలో గర్భిణిని గుర్తించి పౌష్టికాహారం అందించాల్సిన ఐసీడీఎస్, వైద్యపరీక్షలు చేయించాల్సిన వైద్య ఆరోగ్యశాఖల సిబ్బంది వద్ద కనీస సమాచారం కూడా లేకపోవడం గమనార్హం. కాలనీవాసులు ద్వారా సమాచారం తెలుసుకున్నా అధికారులు అటు కేసి వెళ్లకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తల్లి ఎలాగో పోయినా ఉన్న బిడ్డలకు తండ్రి పట్టెడన్నం పెట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. పిల్లలను చైల్డ్కేర్ సెంటర్కు తరలించాలి దిక్కులేని ముగ్గురు ఆడపిల్లలను అధికారులు చొరవ తీసుకుని చైల్డ్ కేర్ సెంటర్కు తరలించాల్సిందిగా కాలనీ వాసులు పేర్కొంటున్నారు. ముగ్గురు ఆడపిల్లల్లో దివ్య(11), శ్రావ్య(8) దివ్యాంగులు. సుమతి(4) స్థానిక అంగన్వాడీ కేంద్రంకు వెళుతోంది. తండ్రి పుట్టు అంధుడు కావడంతో ఆడ పిల్లలను చూసుకునే పరిస్థితి లేదంటున్నారు. మృతి చెందిన భార్య వెంకటరణమ్మకు దశదిన కర్మ చేసేందుకు సైతం స్తోమత లేదని కాలనీవాసులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తరఫున అధికారులు స్పందించి చేయూత నివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐసీడీఎస్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలంటున్నారు. -
తీరని గర్భశోకం!
నలుగురు చేయాల్సిన పనిని ఒక్కరే చేస్తూ పనిభారాన్ని మోస్తున్న సిబ్బంది.. దీర్ఘకాలికంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయని ప్రభుత్వం.. వైద్యులు అందుబాటులో ఉండి కూడా పర్యవేక్షణ లేకపోవటం.. వెరసి ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో తరుచూ శిశు మరణాలు సంభవిస్తున్నాయి. అయితే ఈ పాపానికి బాధ్యులెవరనేది ప్రశ్నగా మారింది. నవమాసాలు మోసి పండంటి బిడ్డను కనేందుకు ఎంతో ఆశగా వస్తుంటే తమకు తీరని గర్భశోకాన్ని మిగులుస్తున్నారని తల్లులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ ఈ దుస్థితికి బాధ్యులెవరని వారు ప్రశ్నిస్తున్నారు. గుంటూరు, నరసరావుపేట టౌన్: ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు పల్నాడు ప్రాంతంతో పాటు ప్రకాశం, నల్గొండ జిల్లాల నుంచి వందల సంఖ్యలో గర్భిణులు సేవల కోసం వస్తుంటారు. ప్రతిరోజు వస్తున్న ఓపీ లో 60 శాతం గర్భిణులే అధికంగా ఉంటున్నారు. నెలకు 400 నుంచి 450 వరకు డెలివరీలు అవుతున్నాయి. గుంటూరు ప్రభుత్వ వైద్యశాల తరువాత జిల్లాలో అధికంగా ప్రసవాలు జరుగుతున్న ఏరియా వైద్యశాలలో నరసరావుపేట వైద్యశాల ప్రథమంగా ఉంది. రోజుకు సగటున 20 వరకు డెలివరీలు జరుగుతున్నాయి. ఉన్న కొద్దిపాటి సిబ్బంది కారణంగా గర్భిణీలకు మెరుగైన సేవలు అందించలేక పోతున్నామని వైద్యవర్గాలు చెప్పుకొస్తున్నాయి. కొరవడిన పర్యవేక్షణ.. మూడురోజుల క్రితం ప్రకాష్నగర్కు చెందిన కండెల తిరుపతమ్మ కాన్పు కోసం ఏరియా వైద్యశాలలో చేరి బిడ్డను కోల్పోయింది. డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా సిబ్బంది ఇష్టారాజ్యంగా డెలివరీ చేయటంతో శిశువు మృతి చెందిందని ప్రజాసంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. గతంలో కూడా పసికందులు మృతి చెందిన ఘటనలు అనేకం ఉన్నప్పటికి అందులో కొన్ని మాత్రమే వెలుగులోకి వచ్చాయి. నెలకు కనీసం ఐదుగురు పసికందులు మృతిచెందటం ఏరియా వైద్యశాలలో పరిపాటిగా మారింది. ఈ నెలలో గత 20 రోజుల వ్యవధిలో ఐదుగురు పసికందులు మృతి చెందినట్లు వైద్యవర్గాల ద్వారా సమాచారం. అయితే విచారణ జరిపి అధికారులు బాధ్యులపై చర్యలు తీసుకున్న దాఖలాలు నేటివరకు లేవు. మాతా శిశుమరణాల నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టామని చెబుతున్నప్పటికీ చోటు చేసుకుంటున్న మరణాల బట్టి ఆచరణలో సాధ్యం కావటం లేదనేది అవగతమవుతుంది. తీవ్రమైన పని భారం ... వైద్యశాలకు వస్తున్న రోగుల సంఖ్యను బట్టి నలుగురు గైనకాలజిస్టు డాక్టర్లు అవసరం. అయితే ఇద్దరు డాక్టర్లే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు కాన్పుల విభాగంలో 24 మంది సిబ్బంది అవసరం ఉండగా 20 మందే ఉన్నారు. దీంతో డాక్టర్లు, సిబ్బంది తీవ్రమైన పని ఒత్తిడికి గురవుతున్నారు. ఆ ప్రభావం సేవలపై పడి రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వంద పడకల ఆసుపత్రిగా పేరొందినప్పటకీ ప్రస్తుతం మూడు వందల పడకలు నిండుతున్నాయి. గతంలో నియమించిన సిబ్బందే నేటికీ విధులు నిర్వహిస్తున్నారు. కాలానుగుణంగా వైద్యులు, సిబ్బందిని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవటంతో సమస్య తీవ్రరూపం దాల్చుతుంది. అవసరం మేర పోస్టుల భర్తీకి కృషి చేయాలని స్థానిక వైద్యాధికారులు ప్రభుత్వానికి నివేదించినా ఫలితం లేకుండా పోయింది. -
అసువులు బాస్తున్న శిశువులు
పశ్చిమగోదావరి, ఏలూరు (టూటౌన్): జిల్లాలో ఏటా వందల సంఖ్యలో ఉంటున్న శిశు మరణాల సంఖ్య వైద్యశాఖ నిర్లక్ష్యాన్ని చెప్పకనే చెబుతోంది. ప్రభుత్వ డొల్లతనాన్ని కూడా వెల్లడిస్తోంది. శిశుమరణాల నియంత్రణకు మెరుగైన చర్యలు తీసుకుంటున్నామనిరాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో ఎక్కడా అమలు కావడం లేదు. శిశు మరణాలను అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందుతోంది. 0 నుండి 5 సంవత్సరాల వయస్సు కలిగిన చిన్నారులు పలు రకాల కారణాలతో ఇంకా వందల సంఖ్యలో ఏటా మృత్యువాత పడుతూనే ఉన్నారు. ఇటీవల ఉమ్మడి హైకోర్టు శిశు మరణాలపై స్పందిస్తూ శిశు మరణాలు తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వంతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ప్రశ్నించింది. మరణాల పెరుగుదలకు కారణాలు శిశు మరణాల పెరుగుదలకు అనేక కారణాలను వైద్యులు చెబుతున్నారు. ప్రధానంగా చిన్న వయస్సులోనే వివాహాలు చేయడం, రక్త హీనత, సరైన పోషకాహారం అందకపోవడం, వంశపారంపర్యంగా వచ్చే లోపాలు వల్ల ఈ మరణాలు అధికంగా ఉంటున్నట్లు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. గిరిజన ప్రాంతాల్లోని పిల్లలు, తల్లులకు పూర్తిస్థాయిలో పోషకాహారం అందకపోవడం మరో కారణంగా చెబుతున్నారు. బాల్యవివాహాలు కూడా జిల్లాలో బాల్య వివాహాలను అరికడుతున్నామని జిల్లా యంత్రాంగం చెబుతున్నా ఇంకా ఇవి జరుగుతూనే ఉన్నాయి. బాల్య వివాహాలు జరుగుతున్న సమాచారం అందిన వెంటనే అంగన్వాడీ సూపర్ వైజర్, అంగన్వాడీ టీచర్, ఏఎన్ఎం, స్థానిక పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఓలు వెళ్లి వాటిని ఆపినా అవి తాత్కాలికమే. ఒక ప్రాంతంలో జరిగే దాన్ని ఆపితే కొద్ది రోజులు పోయిన తర్వాత వేరే ప్రాంతానికి వెళ్లి పెళ్లి తంతు కానిచ్చేస్తున్నారు. అంటే బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు సరైన అవగాహన కల్పించడంలో సంబంధిత శాఖ వైఫల్యం పూర్తిగా కన్పిస్తుంది. జిల్లాలోని ఆస్పత్రుల వివరాలు జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 635 ఆరోగ్య ఉపకేంద్రాలు, 91 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 17 ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు, 2 పట్టణ ఆరోగ్యకేంద్రాలు (కొవ్వూరు, నిడదవోలు) ఉన్నాయి. వైద్య విధాన పరిషత్ పరిధిలో జిల్లా కేంద్రం ఏలూరులో ఒకటితో పాటు తాడేపల్లిగూడెం, తణుకు, జంగారెడ్డిగూడెం పట్టణాల్లో ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 14 పనిచేస్తున్నాయి. వీటితోపాటు జిల్లాలో 522 ప్రైవేటు ఆస్పత్రులు, ఆరు కార్పొరేట్ ఆస్పత్రులు, 327 ల్యాబ్లు ఉన్నాయి. 33 చోట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 24 గంటలు ప్రసూతి వైద్య సేవలు అందించే సదుపాయం ఉంది. జిల్లాలో 49 శాతం ప్రసవాలు ప్రభుత్వాసుపత్రుల్లోనే జరుగుతున్నాయి. అయినా శిశు మరణాల సంఖ్య తగ్గకపోవడంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. పౌష్టికాహార లోపమే ప్రధానం జిల్లాలో శిశు మరణాలకు వివిధ రకాల వైద్య కారణాలు ఒక వంతైతే దాని తర్వాత లోపం పోషకాహారమే. ఎక్కువ మంది పేద ప్రజలు సరైన పోషకాహారం అందకపోవడంతో మృత్యువాత పడుతున్నారు. గర్భిణులు, బాలింతలకు జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పోషకాహారం పూర్తిస్థాయిలో పోషకాలను అందించలేక పోతున్నదనే వాదనలు ఉన్నాయి. రోజుకు 125 గ్రాముల బియ్యం, 30 గ్రాముల పప్పు, 16 గ్రాముల ఆయిల్ను అందిస్తున్నారు. వీటితో పాటు గుడ్డు, పాలు కూడా ఇస్తున్నారు. లావు బియ్యం ఇస్తుండటంతో వాటిని తీసుకునేందుకు చాలా వరకూ ఇష్టపడటం లేదు. అలాగే ఆయా అంగన్వాడీ కేంద్రాలకు ఒకటికి నాలుగు సార్లు తిరగాల్సి రావడం వల్ల కూడా వాటిని తీసుకునేందుకు లబ్ధిదారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఉడికీ ఉడకని పప్పు, మింగుడు పడని బియ్యం తినలేకపోతున్నామని వారు చెబుతున్నారు. ఎన్ని పథకాలు ఉన్నా జిల్లాలోని శిశువులు, గర్భిణులు, బాలింతలకు పూర్తి స్థాయిలో పోషకాహారాన్ని అందించడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెరుగైన వైద్య సౌకర్యాలతో పాటు సరైన పోషకాహారం అందితేనే జిల్లాలో మాతా, శిశు మరణాలను పూర్తి స్థాయిలో అరికట్ట కలుగుతామనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. -
మన్యంలో... మృత్యు ఘోష
రంపచోడవరం: తూర్పు ఏజెన్సీలో వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో గిరిజనుల పరిస్ధి తి దయనీయంగా మారుతోంది. ఆగస్టు నెలలో వర్షాలతోపాటు సీజనల్ వ్యాధులు విజృంభించి లోతట్టున ఉన్న ప్రతి గ్రామంలో ప్రజలు రోగాలతో సతమతమవుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోవడంతో ఇప్పటి వరకూ ఏజెన్సీలో వైద్య సేవలు అందించిన తొమ్మిది మంది వైద్యులు రాజీనామా చేసి వెళ్లిపోవడంతో పరిస్ధితి దయనీయంగా మారింది. గత ఏడాది ఇదే సీజన్లో వై రామవరం మండలం చాపరాయిలో నెల రోజుల వ్యవధిలో16 మందికి పైగా గిరిజనులు మృత్యువాత పడినప్పటికీ వైద్య సేవలు మెరుగుపరచడంలో ప్రభుత్వం ఎటువంటి చొరవ చూపించకపోవడం పట్ల గిరిజనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏజెన్సీలో గైనకాలజిస్ట్లతోపాటు చిన్న పిల్లల వైద్యులు కూడా లేకపోవడంతో మాతాశిశు మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇక్కడ ఏజెన్సీలో గత ఆరేళ్లు కాలంలో దాదాపు వెయ్యికిపైగా శిశు మరణాలు సంభవించాయంటే ఆధ్వాన పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 40 మంది వరకు తల్లులు మృత్యువాత పడ్డారు. మలేరియా జ్వరాలు బారిన పడ్డవారి సంఖ్య తక్కువేమీ లేదు. వ్యా«ధిని గుర్తించి సకాలంలో చికిత్స అందించకపోవడం వల్లనే ఈ మరణాలు సంభవిస్తున్నాయి. ఇద్దరే రెగ్యులర్ వైద్యులు... రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వాటిలో 42 మంది అసిస్టెంట్ సివిల్ సర్జన్స్ పనిచేయాలి. కానీ 33 మంది పనిచేస్తున్నారు. వీరిలో ఇద్దరు మాత్రమే రెగ్యులర్ వైద్యులు ఉన్నారు. మిగిలిన వారు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. ఇటీవల తొమ్మిది మంది పీహెచ్సీ వైద్యులు తమ పోస్టులకు రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఆరేళ్లు కాలం నుంచి పనిచేస్తున్న కాంట్రాక్ట్ వైద్యులను రెగ్యులర్ చేసి బదిలీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం వాటిని అమలు చేయకపోవడంతో వైద్యులు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఏజెన్సీలో పీహెచ్సీల పనితీరును పర్యేవేక్షించే ఏజెన్సీ డీఎంహెచ్ఓ పోస్టు ఖాళీగా ఉంది. పీహెచ్సీ పరిధిలో వైద్యులు ఉండేందుకు ఎటువంటి వసతులు కల్పించడం లేదు. ఆగని శిశు మరణాలు... ఏజెన్సీలో శిశు మరణాలు ఆగడం లేదు. తాజాగా రాజవొమ్మంగి మండలం జడ్డంగి గ్రామానికి చెందిన పూసం రాము రెండు నెలల పసిపాప సకాలంలో వైద్యం అందక మృత్యువాత పడింది. గత ఆరేళ్లు కాలంలో ఏజెన్సీలో మతాశిశు మరణాలు పరిశీలిస్తే ఏజెన్సీలో వైద్య సేవల దుస్థితి ఎలా ఉందో అద్దం పడుతుంది. ఏజెన్సీలో గర్భిణులను గుర్తించి వారిని సకాలంలో కాన్పు కోసం పీహెచ్సీలకు తరలించాలనే ఐటీడీఏ అధికారి ఆలోచన కార్యరూపం దాల్చడం లేదు. ప్రధానంగా గర్భిణీలకు పౌష్టికాహారం అందకపోవడం శాపంగా మారుతోంది. ఏజెన్సీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 24 గంటలు ఆసుపత్రులుగా స్ధాయి పెంచిన వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. ఫలితంగా రాత్రి సమయంలో అత్యవసర వైద్యం కోసం వచ్చిన రోగులకు అక్కడ ఉన్న సిబ్బంది సేవలే గతి. ఇంకా పూర్తికాని మలేరియా మందు పిచికారీ... ఏజెన్సీలో దోమలు, లార్వా నివారణకు గ్రామాల్లో మలేరియా మందు పిచికారీ రెండో దశ ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికే రెండు రౌండ్లు మలేరియా మందు పిచికారీ పూర్తికావాలి. ఏజెన్సీలో 931 గ్రామాల్లో పిచికారీ పూర్తికా వాల్సి ఉండగా ప్రస్తుతం 636 గ్రా మాల్లో పూర్తి చేశారు. రంపచోడవ రం ఐటీడీఏ పరిధిలో గంగవరం, చవిటిదిబ్బలు, గుర్తేడు, వాడపల్లి, మారేడుమిల్లి పీహెచ్సీల పరిధి లోని కొన్ని గ్రామాల్లో మలేరియా తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాడపల్లి పీహెచ్సీ పరిధిలో వాడపల్లి గ్రామంలో 602 మంది జ్వరాలు బారిన పడితే రక్త పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి మలేరియా ఉన్నట్లు నిర్ధారించారు. బూసిగూడెంలో 274 మందికి జ్వర పీడితులకు రక్త పరీక్షలు నిర్వహించగా పది మందికి మలేరియా ఉన్నట్లు గుర్తించారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో సీజనల్ వ్యాధులు విభృంజించే అవకాశం ఉంది. పంచాయతీలకు మలేరియా నిర్మూలనకు ఫాగింగ్ యంత్రాలు ఇచ్చినా నిరుపయోగంగా మారాయి. యంత్రాలు వినియోగించేందుకు పంచాయతీలకు ఎటువంటి డబ్బులు ఇవ్వకపోవడంతో వాటిని వాడేందుకు పెట్రోల్ కొనుగోలు చేయలేకపోతున్నారు. గిరిజనులకు వైద్యం అందడం లేదు... పీహెచ్సీ ద్వారా గిరిజనులకు వైద్యం అందడం లేదు. రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో కనీసం కాన్పులు కూడా చేయడం లేదు. ప్రతి కేసు రిఫర్ చేస్తున్నారు. గైనిక్ సేవలు అందడం లేదు. పూర్తిస్ధాయిలో వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలి. పీహెచ్సీలను 24 గంటల పీహెచ్సీలుగా ఆప్గ్రేడ్ చేసినా ఫలితం లేదు. అత్యవసర సమయంలో వైద్యం కోసం వెళ్లిన గిరిజనులకు వైద్యులు అందుబాటులో ఉండడం లేదు.– జుత్తుక కుమార్, సీపీఐ డివిజన్ కన్వీనర్, రంపచోడవరం వైద్య పోస్టుల భర్తీకి చర్యలు... ఏజెన్సీ పరిధిలో పీహెచ్సీలో ఖాళీగా ఉన్న తొమ్మిది సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటాం. మంగంపాడు, గుర్తేడు, కొండమొదలు, జడ్డంగి, పెదగెద్దాడ, లాగరాయి, బోదులూరు, వాడపల్లి పీహెచ్సీల్లో ఒక్కో పోస్టు నింపేందుకు అన్ని చర్యలూ తీసుకున్నాం. గిరిజన ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య సేవలు మరింత బలోపేతం చేయడానికి చర్యలు చేపడతాం. – నిషాంత్కుమార్, రంపచోడవరం ఐటీడీఏ పీవో -
రోడ్డు ప్రమాదంలో పసికందు మృతి
నవమాసాలు మోసి కని పెంచిన చిన్నారులు ఏడాదైనా నిండకుండానే కళ్లెదుటే మృత్యువాత పడడంతో ఆ ఇద్దరి తల్లుల గర్భశోకం తీర్చడం ఎవరి తరం కావడం లేదు. భగవంతుడు ఇంతటి దుఃఖాన్ని ఎందుకిచ్చాడంటూ వారు రోదిస్తున్న తీరు పలువురిని కంటనీరు పెట్టించింది. భార్య, ఇద్దరు పిల్లలతో బైక్పై కాకినాడ వెళుతుండగా ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిదేళ్ల సూర్యకుమార్, సకాలంలో వైద్యం అందక రాజవొమ్మంగి మండలంలో రెండు నెలల పసికందు మృత్యువాత పడ్డారు. ప్రత్తిపాడు రూరల్ (ప్రత్తిపాడు): రోడ్డు ప్రమాదంలో తొమ్మిది నెలలు బాలుడు మృతి చెందాడు.ధర్మవరం గ్రామానికి చెందిన రాకేటి వెంకటేశ్వరరావు భార్య రమాదేవి ఇద్దరు పిల్లలతో కలిసి శనివారం బైక్ పై కాకినాడ బయలు దేరాడు. ధర్మవరం సమీపంలోని పెట్రోలు బంకులో పెట్రోలు నింపుకొని రహదారి దాటుతుండగా కత్తిపూడి వైపు వెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బైక్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో రాకేటి సూర్యకుమార్ (9 నెలలు) బాలుడు తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. భార్యాభర్తలకు, మరో నాలుగేళ్ల చిన్నారికి గాయాలయ్యాయి. వారిని ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి తరలించారు. చిన్నారి మరణవార్త తల్లికి చెప్పలేక బంధువులు తల్లడిల్లిపోయారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ముదునూరి మురళీకృష్ణంరాజు ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్రులను పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రత్తిపాడు ఎస్సై ఎం.అశోక్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రత్తిపాడు పోలీసులు కేసు దర్యప్తు చేస్తున్నారు. సకాలంలో వైద్యం అందక... రాజవొమ్మంగి (రంపచోడవరం): రెండు నెలల మగ శిశువుకు సకాలంలో వైద్య సహాయం అందక మరణించింది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటనకు చెందిన వివరాలు ఇలా ఉన్నాయి. జడ్డంగి గ్రామానికి చెందిన పూసం రాము పుట్టిలైన దూసరపాము కాన్పుకి రాగా, జూన్ 26న మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాబుకు ఈ నెల 24వ తేదీ శుక్రవారం సాయంత్రం ఊపిరి అందక ఇబ్బంది పడ్డాడని తల్లి తెలిపింది. దీంతో రాజవొమ్మంగి పీహెచ్సీకి తీసుకొని వెళ్లగా అక్కడ వైద్యులు లేరని తెలిపారు. సిబ్బంది పరీక్షించి ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లమని సూచించారన్నారు. అక్కడ నుంచి ఏలేశ్వరం తీసుకువెళ్లగా, రూ.రెండు వేలు కట్టించుకొని జాయిన్ చేసుకున్నారని, కొద్ది సేపటికే బాబు మరణించాడని రాము, ఆమె భర్త వెంకట దుర్గాప్రసాద్ కన్నీరుమున్నీరయ్యారు. ఆస్పత్రిలో వైద్యులేకే తన బిడ్డ చనిపోయాడని వాపోయారు. -
హిందూపురం ఆస్పత్రిలో మరణమృదంగం
హిందూపురం ఆస్పత్రి పేరుచెబితేనే గర్భిణులు హడలిపోతున్నారు. రూ.23 కోట్లు ఖర్చు చేసి అట్టహాసంగా ప్రారంభించిన మెటర్నిటీ చైల్డ్ హాస్పిటల్ (ఎంసీహెచ్)కు సిబ్బందిని నియమించకపోవడంతో దిష్టిబొమ్మలా మారింది. 150 పడకలు కలిగిన ఈ ఆస్పత్రిలో కేవలం ఒకే ఒక గైనకాలజిస్ట్ విధులు నిర్వర్తిస్తుండటంతో సకాలంలో వైద్యం అందక మాతాశిశు మరణాలు పెరిగిపోతున్నాయి. అందువల్లే చిన్నారుల కేరింతలు వినిపించాల్సిన ఆస్పత్రిలో మరణమృదంగం వినిపిస్తోంది. హిందూపురం అర్బన్: హిందూపురంలోని ఎంసీహెచ్లో మాతృరోదనలు వినిపిస్తున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి వియ్యంకుడు బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురంలో రూ.23 కోట్ల ఖర్చు చేసి మెటర్నిటీ చైల్డ్ హాస్పిటల్ (ఎంసీహెచ్) నిర్మించినా ప్రయోజనం లేకుండా పోయింది. ముఖ్యంగా ప్రసవం కోసం ఇక్కడికొచ్చే మహిళలకు నరకం కనిపిస్తోంది. వైద్యుల కొరత... వైద్యసిబ్బంది నిర్లక్ష్యంతో మాతాశిశు మరణాల సంఖ్య పెరిగిపోతోంది. దాదాపు 150 పడకలు కలిగిన ఈ ఆస్పత్రిలో ఒకే ఒక గైనాకాలాజిస్ట్ ఉండటంతో వైద్యసేవలు అందడం లేదు. రిస్క్ ఎందుకని రెఫర్ మెటర్నిటీ చైల్డ్ హాస్పిటల్లో ఎక్కువగా ప్రసవాలు జరగాలి...కానీ సిబ్బంది లేక ఈ ఆస్పత్రి సాధారణ ప్రసాలకే పరిమితమైంది. రాజకీయ సిఫార్సులు చేయించుకుంటే అప్పడప్పుడూ సిజేరియన్లు చేస్తున్నారు. ఇక రిస్క్ కేసులు.. అర్ధరాత్రి వస్తున్న కేసులను అనంతపురానికి రెఫర్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో సుదూరం నుంచి ఈ ఆస్పత్రికి వచ్చిన గర్భిణులు అనంతపురం వెళ్లలేక స్థానికంగా ఉన్న ప్రవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. పెరిగిన మాతా శిశు మరణాలు ఆస్పత్రుల్లో ప్రసవాలు చేయించుకుంటే తల్లీబిడ్డ క్షేమంగా ఉంటారని ఓ వైపు ప్రభుత్వం ప్రచారం హోరెత్తిస్తోంది. కానీ ఆస్పత్రుల్లో సిబ్బందిని మాత్రం నియమించడం లేదు. అందువల్లే హిందూపురం ఆస్పత్రిలో ప్రసవాలు జరుగుతున్నా...శిశువులు మాత్రం తల్లిఒడి చేరడం లేదు. గత ఏడాది 2017 జనవరి నుంచి నేటి వరకు ప్రసవ సమయంలో ముగ్గరు బాలింతలు ముగ్గురు మృత్యుఒడికి చేరగా... 157 మంది పురిటి బిడ్డలు తల్లిఒడికి చేరకముందే కళ్లుమూశారు. ఇక గర్భంలోనే చనిపోయిన శిశువుల సంఖ్య 87కు చేరింది. అందువల్లే ఇక్కడ మాతాశిశుమరణాలు... బాధితుల ధర్నాలు మామూలైపోయాయి. అయినప్పటికీ ఇటు ప్రభుత్వం..అటు ప్రజాప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఎందరో మాతృమూర్తులకు తీరని శోకం మిగులుతోంది. = ఈనెల 2న మడకశిర మండలం చీపురుపల్లికి చెందిన నాగలక్ష్మికి సిజేరియన్ చేసినా మగబిడ్డ మృత్యువాతపడింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిశువు చనిపోయిందంటూ కుటుంబసభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. = జూన్ 30న రొద్దం మండలం కంబాలపల్లికి చెందిన శాంతమ్మకు సిజేరియన్ చేశారు. అనంతరం శిశువు ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని ఐసీయూలో ఉంచామని వైద్యులు చెప్పారు. ఆ తర్వాత మృత శిశువును చేతిలో పెట్టారు. దీంతో శాంతమ్మ కుటుంబీకులు న్యాయం చేయాలని రోడ్డెక్కెరు.. ఇలా ఆస్పత్రిలో తరచూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అయినా వైద్యాధికారులు నిమ్మకునీరెత్తినట్లు ఉండటం విమర్శలకు తావిస్తోంది. ఇలాంటి మరణాలు మామూలే ఆస్పత్రిలో ఇలాంటి మరణాలు మామూలే. అయితే ఇటీవల పెరగడం దురదృష్టకరం. బాధితుల చెప్పినట్లు వెంటనే వైద్యులపై చర్యలు తీసుకోలేము. దీనిపై విచారణ జరగాలి.. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆస్పత్రిలో కూడా వైద్యుల నియామకానికి చర్యలు తీసుకుంటున్నారు. – కేశవులు,సూపరింటెండెంట్, హిందూపురం -
మంచమెక్కిన మన్యం
రాజవొమ్మంగి (రంపచోడవరం): తూర్పు మన్యం రాజవొమ్మంగిని మాతాశిశు మరణాలు పట్టి పీడిస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు మూడు మాతా, మరో ఆరు శిశు మరణాలు సంభవించాయి. ఒక్క మే నెలలోనే ఓ నిండు గర్భిణి, మరో ముగ్గురు నవజాత శిశువులు మరణించారు. రక్తహీనత కారణంగా 8వ నెల గర్భిణి మృతశిశువుకు జన్మనీయడం గిరిజన ప్రాంతంలో తల్లిబిడ్డల ఆరోగ్య పరిస్థితిని తేటతెల్లం చేస్తుంది. గుక్కపెట్టి ఏడుస్తున్న బిడ్లను రాజవొమ్మంగి లేదా జడ్డంగి 24 గంటల తల్లీబిడ్డల ఆస్పత్రికి తీసుకువస్తుంటే.. అక్కడ చిన్నపిల్లల వైద్య నిపుణులు, అధునాతన వైద్య పరికరాలు, మందులు లేకపోవడంతో వారికి సకాలంలో వైద్యం అందడం లేదు. రాజవొమ్మంగి ఆస్పత్రిలోని వైద్యులు కాకినాడ జీజీహెచ్కు రిఫర్ చేస్తున్నారు. కాకినాడకు వారిని చేర్చేలోపుగా ప్రాణాలు విడుస్తున్నారు. లేదా చికిత్స పొందుతూ మరణిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మన్యంలో వైద్య సేవలు ఏరీతిలో ఉన్నాయనేది ఇట్టే అర్థమవుతుంది. ప్రభుత్వ యంత్రాంగం స్పందించి మాతాశిశు మరణాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గిరిజనులు కోరుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరించడం ఆందోళన కలిగిస్తోందని స్థానిక గిరిజన ప్రతినిధులు అంటున్నారు. ♦ ముర్లవానిపాలేనికి చెందిన పప్పుల లోవకుమారికి పుట్టిన 3 నెలల మగశిశువు మే 3వ తేదీన ఊపిరి అందక కాకినాడ జీజీహెచ్లో మరణించింది. ♦ మే 21వ తేదీన అప్పలరాజుపేట గ్రామానికి చెందిన 8 నెలల గర్భిణి చిన్ని ప్రేమజ్యోతి రాజవొమ్మంగి పీహెచ్సీలో తీవ్రమైన రక్తస్రావంతో మృత శిశువుకు జన్మనిచ్చింది. తీవ్ర రక్తహీనతతో బాధపడుతోన్న ఆమెను మే 9న పీహెచ్సీలో నిర్వహించిన జననీ సురక్ష యోజన వైద్య శిబిరంలో పరీక్షించారు. ఆమె కడుపులో బిడ్డకు ఎదుగుదల లేదని, వెంటనే పట్టణ ప్రాంతానికి వెళ్లి స్కానింగ్ చేయించుకోవాలని వైద్య నిపుణులు చెప్పారు. అయితే ఆమె కుటుంబానికి ఆర్థిక స్తోమత లేక స్కానింగ్ చేయించుకోలేదు. దీంతో కడుపులోనే బిడ్డ మరణించగా రెండు రోజుల తరువాత ఆమె మృత శిశువుకు జన్మనిచ్చింది. ♦ మే 28వ తేదీన మద్దికొండ సుగుణ అత్తవారి ఇల్లు వై.రామవరం మండలం చవిటిదిబ్బల నుంచి పుట్టిల్లు రాజవొమ్మంగి మండలం వాతంగి వచ్చింది. ఇంతలో ఆమె చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురైతే జడ్డంగి 24 గంటల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడు వైద్య నిపుణులు అందుబాటులో లేకపోవడంతో కింది స్థాయి వైద్య సిబ్బంది కాకినాడకు రిఫర్ చేసింది. అతడు కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ చనిపోయాడు. ♦ మే 29వ తేదీనే మండలంలోని జి.కొత్తపల్లికి చెందిన నిండు గర్భిణి నందపు వెంకటలక్ష్మి కాకినాడలో చికిత్స పొందుతూ మరణించింది. అత్తిల్లు రంపచోడవరం సబ్ప్లాన్ ఏరియా బవురువాక గ్రామం నుంచి పుట్టిల్లు జి.కొత్తపల్లికి పురిటి కోసం వచ్చింది. పురిటినొప్పులతో గుర్రపు వాతం (ఫిట్స్) రావడంతో ఆమెను కుటుంబీకులు వెంటనే కాకినాడ జీజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. -
ఇంకా ఆడ పిల్లనే!
ఈ సృష్టికి క్షేత్రం స్త్రీ. క్షేత్రమే లేకపోతే సృష్టి పతనం ప్రారంభమవుతుంది. ఇప్పుడు జిల్లాలో అదే జరుగుతోంది. ఆడపిల్ల జన్మిస్తే ఆర్థిక భారమని, ఆమెను కనిపెంచడం కష్టమని, ఎప్పుడైనా ఒకరింటికి వెళ్లాల్సిందే కదా అని.. తదితర కారణాలు చెబుతూ ఆడపిల్లలను కనడం తగ్గిస్తున్నారు. ఫలితంగా జిల్లాలో పురుషుల కంటే స్త్రీల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. దీనికితోడు పలువురు వైద్యుల సహాయంతో కడుపులోనే ఆడపిల్లను(భ్రూణహత్య) చంపేస్తున్నారు. కర్నూలు (హాస్పిటల్): ఆడపిల్ల.. పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు భారంగా భావించే నేపథ్యంలో ఆ అపోహను తొలగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నా ఇంకా మార్పు రావడం లేదు. చదువు, పెళ్లికి ప్రోత్సాహాకాల పేరుతో భరోసానిస్తున్నా తల్లిదండ్రులు.. ‘ఆడ’ పిల్లగానే చూస్తున్నారు. అందమైన లోకంలోకి అడుగు పెట్టకుండా అడ్డుకుంటున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో కలిపి 2011 జనాభా లెక్కల ప్రకారం 40,53,463 మంది ఉన్నారు. ఇందులో 20,39,227 మంది పురుషులు, 20,14,236 మంది స్త్రీలు ఉన్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. ప్రతి 1000 మంది స్త్రీలకు 1012 మంది పురుషులు సగటున జిల్లాలో ఉన్నట్లు అధికారులు ప్రభుత్వానికి లెక్కలు పంపించారు. 8 ఏళ్ల తర్వాత ఈ లెక్కలు ఇప్పటికి ఇంకా పెరిగి ఉంటాయి. ప్రతి 1000 మంది స్త్రీలకు 1050 మంది పురుషులు ఉండే అవకాశం ఉంది. అధికారిక లెక్కల ప్రకారం లెక్కలు ఇవి. వాస్తవ పరిస్థితి క్షేత్రస్థాయిలో మరింత దారుణంగా ఉంటుంవదని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆదోని, కర్నూలు డివిజన్లో పురుషుల కంటే స్త్రీల సంఖ్య చాలా తక్కువగా ఉంది. కడుపులోనే చిదిమేస్తున్నారు... జిల్లాలో భ్రూణహత్యలకు అదుపులేకుండా పోతోంది. అధికారికంగా జిల్లాలో 200కు పైగా స్కానింగ్ కేంద్రాలు ఉండగా, అనధికారికంగా రెట్టింపు సంఖ్యలో ఉంటాయి. ఇప్పటి వరకు అధికారుల వద్ద స్కానింగ్ కేంద్రాల కోసం 120 దాకా దరఖాస్తులు ఉన్నాయి. కర్నూలు నగరంలోని ఎన్ఆర్ పేట, కొత్తబస్టాండ్ పరిసర ప్రాంతాలు, ఆదోని, కోడుమూరు, నంద్యాలలోని కొన్ని స్కానింగ్ కేంద్రాల్లో యథేచ్ఛగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. సాధారణంగా స్కానింగ్కు రూ.600 నుంచి రూ.800 వరకు చార్జ్ చేస్తారు. లింగనిర్ధారణ చేయడానికి మాత్రం డిమాండ్ను బట్టి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు తీసుకుంటున్నారు. గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే నిర్దాక్షిణ్యంగా చంపేయడానికి వెనుకాడటం లేదు. అనాథ ఆశ్రమాల్లో వారే అధికం.. గర్భస్రావానికి వీలుగాకపోతే ప్రసవించాక ఆ శిశువును అనాథలను చేస్తున్నారు. జిల్లాలోని అనాథాశ్రయాల్లో ఉన్న అనాథ పిల్లల్లో 80 శాతం ఆడపిల్లలే ఉండటం గమనార్హం. పుట్టిన వెంటనే ముళ్ల పొదల్లో పాడేసి చేతులు దులుపుకుంటున్నారు. అధికారుల చర్యలు శూన్యం కర్నూలు కొత్తబస్టాండ్లోని పలు ప్రైవేటు ఆసుపత్రులు, కోడుమూరు, ఆదోని, నంద్యాలలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో భ్రూణహత్యలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. తూతూ మంత్రంగా అధికారులు దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఆయా ఆసుపత్రులపై చర్యలు తీసుకోవడానికి భయపడుతున్నారు. కొన్ని ఆసుపత్రులను సీజ్ చేసినా మరో తలుపును తెరిచి ఆసుపత్రిని నిర్వహిస్తున్నా చర్యలు తీసుకునేందుకు అధికారులు జంకుతున్నారు. సెంట్రల్ కమిటీలు దాడులు చేస్తాయి.. గతంలో లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ సెంటర్లపై స్థానిక అధికారులు దాడులు చేస్తున్నా పెద్దగా ఫలితాలు లేవు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సెంట్రల్ కమిటీల ద్వారా దాడులు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశాయి. ఇక జిల్లాపై స్కానింగ్ సెంటర్లపై ఎప్పుడైనా దాడులు జరగవచ్చు. – జేవీవీ ఆర్కే ప్రసాద్, డీఎంఅండ్హెచ్ఓ కర్నూలు నగరంలోని బుధవారపేట మాతా మారెమ్మ గుడి సమీపంలో ఈనెల 17వ తేదీన ఓ చెత్తకుప్ప వద్ద శిశువు ఆర్తనాదాలు వినిపించడంతో స్థానికులు గుర్తించి అక్కున చేర్చుకున్నారు. అనంతరం మూడవ పట్టణ పోలీసులకు చెప్పడంతో శిశువును చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలోని చిన్నపిల్లల వార్డులో చేర్పించారు. నెలలు నిండకముందే ఈ బిడ్డ జన్మించడం, చెత్తకుప్పల పాలు కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. స్కానింగ్లో ఒక్కోసారి లింగ నిర్ధారణ స్పష్టంగా కనిపించదు. ఈ కోవలోనే స్కానింగ్లో ఆడబిడ్డ అని రిపోర్ట్ రావడంతో అబార్షన్ చేయగా బిడ్డ బయటకు వచ్చాక మగ బిడ్డ అని నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. దీంతో చేసేదేమీ లేక అవయవ లోపం ఉన్న శిశువును వదిలించుకునేందుకు ముళ్ల కంపల మధ్య పడేసినట్లు తెలుస్తోంది. -
మెడికల్ భాషలో కారణాలు చెప్పొద్దు
చిత్తూరు అర్బన్: ‘‘గతేడాది జిల్లాలో 46 మాతాశిశు సంభవించాయి. ఈ సంవత్సరం ఐదుగురు చనిపోయారు. ఇందుకు మెడికల్ భాషలో మీరు చెప్పే వాటికి తలూపి వెళ్లిపోవడానికి నేను పేషెంట్ను కాదు. మీ పరిపాలన అధికారిని. మరణాలకు కారణాలు చెప్పొద్దు. ఎందుకు ముందే మరణాలను నివారించలేకపోయారో చెప్పండి. ఆస్పత్రిలో అపోలో యాజమాన్యం, ప్రభుత్వ వైద్యాధికారులు ఒకరికొకరు సర్దుకుని సమన్వయంతో పని చేయాలి’’ అంటూ జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న పేర్కొన్నారు. బుధవారం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి సంస్థ (హెచ్డీఎస్) సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేద ప్రజలకు కార్పొరేట్ వైద్య సంస్థతో కలిసి మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అపోలోకు క్లినికల్ అటాచ్మెంట్ కింద ఆస్పత్రిలో చోటు ఇచ్చిందన్నారు. మెమొరాండమ్ ఆఫ్ అండర్ స్టాండింగ్ (ఎంఓయూ) ప్రకారం ఇక్కడ మౌలిక వసతులు, సదుపాయాలను వీలైనంత త్వరగా కల్పించా లన్నారు. డయాలసిస్ యంత్రాన్ని ఎందుకు వినియోగంలోకి తీసుకురాలేద ని కలెక్టర్ అపోలో యాజమాన్యాన్ని ప్రశ్నించారు. నెలవారీ నిర్వహణపై స్పష్ట త లేదని వారు చెప్పడంతో హెచ్డీఎస్ నిధుల నుంచి నెలసరి నిర్వహణ భరిస్తామని జూన్ 2 నుంచి డయాలసిస్ కేంద్రాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే చనిపోయినవారికి ఉచితంగా అంత్యక్రియలు నిర్వర్తించడానికి మహాప్రస్థానం కూడా ఏర్పాటు చేయాలని, ఇందుకోసం తానే ఓ వాహనాన్ని సమకూరుస్తానన్నారు. ఆగస్టు 15వ తేదీకి నిర్మాణంలో ఉన్న ఓపీ భవనం పూర్తవ్వాలన్నారు. మాతాశిశు కేంద్రంలో ఏసీలు ఉంచాలన్నారు. ఇక కోతుల బెడద లేకుండా వార్డుల చుట్టూ కమ్మీలను సైతం ఏర్పాటు చేయాలన్నారు. అత్యవసర విభాగంలో అపోలో సైతం రాత్రి వేళల్లో ఇద్దరు వైద్యులు, సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. రోడ్డు ప్రమాద బాధితుల కోసం ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు భవన నిర్మాణం సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం అజెండాలోని అంశాలను కలెక్టర్ ఆమోదించారు. జేసీ–2 చంద్రమౌళి, డీఎంఅండ్హెచ్ఓ విజయగౌరి, డీసీహెచ్ఎస్ సరళమ్మ, ఆస్పత్రి పర్యవేక్షకులు పాండురంగయ్య. అపోలో అధికారి నరేష్కుమార్రెడ్డి, హెచ్డీఎస్ సభ్యులు పాల్గొన్నారు. -
ఆగని గర్భశోకం
మన్యంలో కన్నతల్లుల గర్భశోకం కొనసాగుతుంది. ఘటన జరిగిన సమయంలో అధికారులు చేసిన హడావుడి ...ఇచ్చిన హామీలు చేతల్లో కానరాకపోవడంతో కన్ను తెరవకముందు కొందరు...కన్ను తెరిచిన కొద్ది రోజులకు మరికొందరు కన్నుమూస్తున్నారు. రంపచోడవరం: స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మరో పసిపాప శనివారం మృతి చెందింది. అడ్డతీగల మండలం వంగలమడుగు గ్రామానికి చెందిన మడకం దొరబాబు, వెంకటలక్ష్మి దంపతుల రెండో బిడ్డ అయిన ఐదు నెలల పాప అనారోగ్యంతో బాధ పడుతోంది. ఆమెను అడ్డతీగల ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో 108లో రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడడంతో ఆ పాప మృతి చెందినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. -
ఆడపిల్ల.. అయితే చంపేయ్..
కరీంనగర్ సప్తగిరికాలనీకి చెందిన దంపతులకు తొలి సంతానంగా ఆడపిల్ల జన్మించింది. మూడేళ్ల తర్వాత రెండో సంతానం కోసం ఓ వైద్యుడి వద్ద చికిత్స తీసుకున్నారు. ఈ సమయంలో ఆ ఇల్లాలు మళ్లీ గర్భం దాల్చడంతో లింగ నిర్ధారణ కోసం స్కానింగ్ చేయించారు. తొలి సంతానం ఆడపిల్ల కావడంతో మళ్లీ ఎవరు పుడతారో తెలుసుకునేందుకు కరీంనగర్లోని ఓ స్కానింగ్ సెంటర్కు చెందిన నిర్వాహకులకు కొంత మొత్తం చెల్లించారు. కాగా.. కడుపులో ఉన్నది మళ్లీ ఆడపిల్లేనని చెప్పారు. దీంతో తమ వైద్య నిపుణురాలిని సంప్రదించి గర్భ విచ్ఛిత్తి (అబార్షన్) చేయించారు. సాక్షిప్రతినిధి, కరీంనగర్: ‘కంటే కూతుర్ని కనాలి’ అంటూ ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. బంగారుతల్లి, కల్యాణలక్ష్మి, బేటి బచావో బేటి పడావో అంటూ పథకాలను ప్రవేశపెడుతున్నాయి.. కానీ భ్రూణహత్యలకు తీసుకుంటున్న చర్యలు మాత్రం శూన్యంగా కనిపిస్తున్నాయి. అమ్మ కడుపులో పెరుగుతున్నది ఆడబిడ్డ అని తెలిస్తే చాలు.. బాహ్య ప్రపంచంలోకి రాకముందే ఛిదిమేస్తున్నారు కొందరు. రక్తమాంసాలు గూడుకట్టుకోక ముందే.. ఊపిరి తీసేస్తున్నారు. మహిళ గర్భం దాల్చిన విషయం తెలిసిందే తడువుగా మగబిడ్డా..? ఆడ బిడ్డా..? తెలుసుకోవడానికి ఆరాటపడుతున్నారు. ఇది కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులకు వ్యాపారంగా మారింది. కాసులకు కక్కుర్తి పడి లింగ నిర్ధారణ చట్టానికి తూట్లు పొడుస్తున్న వైనం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలుచోట్ల నిత్యకృత్యమైంది. ఇది భ్రూణహత్యలకు దారి తీస్తోం ది. కడుపులో శిశివులను కర్కశంగా పిండేస్తున్నారు. వెరసి రాష్ట్రంలో ఎందరో పసిపాపల జీవితాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. లింగ నిష్పత్తిలో అంతరమే ఈ అమానుషాన్ని మన ముందుంచుతోంది. అధికారులు భ్రూణహత్యల నివారణకు వంద శాతం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంటున్నా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆడ శిశువుల జననాలు తగ్గిపోతున్నాయి. కరీంనగర్ జిల్లాలో 1991 జనాభా లెక్కల ప్రకారం 0–6 బాలబాలికల నిష్పత్తి 1000ః981గా ఉంటే.. 2011 జనాభా లెక్కల వరకు 0–6 వయస్సు గల బాల బాలికల నిష్పత్తి 1000ః937కు పడిపోయింది. ప్రభుత్వం 1994లో గర్భస్త పిండ ప్రక్రియ నిరోధక చట్టాన్ని (పీఎన్డీటీ) ప్రవేశపెట్టింది. చట్టంపై అవగాహన కల్పించడానికి క్షేత్రస్థాయిలో నిధులు విడుదలవుతున్నా బాలికల నిష్పత్తి తగ్గుతూనే ఉంది. అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు మరిచారు. ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లపై పూర్తిగా నిఘా కొరవడింది. వైద్య, ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 117 వరకు స్కానింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 2002 నుంచి 2012 వరకు కేవలం నాలుగు కేసులు మాత్రమే నమోదయ్యాయి. 2012 నుంచి 2017 వరకు ఎనిమిది వరకు కేసులు నమోదైనా, ఆ స్కానింగ్ కేంద్రాలపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. నిబంధనలు పాటించకుండా స్కానింగ్ కేంద్రాలు వ్యవహరిస్తుంటే వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం మొద్దునిద్ర నటిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. స్కానింగ్ కేంద్రాలలో రికార్డుల నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా ఉంది. కనీసం గర్భిణీకి ఎన్నో కాన్పు..? గతంలో అబార్షన్లు జరిగాయా..? అన్న ప్రాథమిక సమాచారం లేకుండానే రికార్డులను నిర్వహించడం వారి డొల్లతనానికి అద్దం పడుతోంది. ప్రత్యేక బృందాల తనిఖీలు ఏవి..? నిత్యకృత్యంగా మారిన భ్రూణహత్యలను అరికట్టడంలో భాగంగా ఉన్నతాధికారులు మొబైల్ బృందంగా ఏర్పడి లింగ నిర్ధారణ చట్టం ఎలా అమలవుతోంది? ఆసుపత్రుల్లో పరిస్థితేంటి? స్కానింగ్ కేంద్రాలు లింగ నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నాయా? లేదా? అన్న అంశాలను పరిశీలిస్తారు. ఈ క్రమంలో ఎవరైనా చట్టాన్ని అతిక్రమించి వ్యవహరించినట్లయితే వారిపై వెంటనే చర్యలకు ఉపక్రమించే అధికారం ఈ బృందానికి ఉంది. ఎంతో గోప్యంగా సాధారణ వ్యక్తుల్లా వచ్చే ఈ బృందసభ్యులు ఓ గర్భిణిని వెంట తీసుకొచ్చి రహస్యంగా ఆపరేషన్ను పూర్తి చేస్తారు. చాలా కాలంగా ఇలాంటి ఆపరేషన్లేవి జిల్లాలో జరగడం లేదు. దీంతో ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాల నిర్వహకులు చట్టా మరచి అడ్డదారిలో అర్థిస్తున్నారు. చట్టం ఏం చెబుతోంది.. చట్టం? : గర్భంలోనే ఆడ శిశువులను చిదిమేసే వారిపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం 1994లో లింగ నిర్ధారణ నిరోధక చట్టాన్ని తెచ్చింది. పరిధి : ఈ చట్టాన్ని అనుసరించి గర్భిణి ఆరోగ్య పరిస్థితిలో మార్పులు, పిండం ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు తప్ప ఎలాంటి పరి స్థితిల్లోనూ పరీక్షలు చేయకూడదు. నిబంధన : గర్భస్థ శిశు పరీక్షలు జరపాలంటే ప్రైవే ట్, ప్రభుత్వ సంస్థలు, ఇతర కేంద్రాలు వైద్య ఆరో గ్యశాఖ వద్ద తప్పకుండా రిజిష్ట్రర్ చేయించుకోవాలి. శిక్ష : చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే వారికి జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు. ఒక్క కేసైనా.. : కానీ జిల్లాలో ఇటీవల కాలంలో అధికారులు తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేసిన దాఖలాల్లేవు. దీన్నిబట్టి జిల్లాలో సాగుతున్న భ్రూణహత్యల వ్యవహారంపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇంకా దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కరీంనగర్లోని మంకమ్మతోటలో శ్రీ సాయి వేంకటేశ్వర నర్సింగ్ హోమ్పై పోలీసులు, ఐసీడీఎస్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సంయుక్తంగా ఆధ్వర్యంలో టాస్క్పోర్సు దాడులు నిర్వహించి గర్భిణికి స్కానింగ్ నిర్వహిస్తుండగా 2017లో పట్టుకున్నారు. ఈ దాడిలో సీపీ కమలాహసన్రెడ్డి ప్రత్యక్షంగా పాల్గొని నర్సింగ్ హోమ్ను సీజ్ చేశారు. క్రైం నెంబర్ సీసీ 1801/2017 కేసు నమోదైంది. లింగనిర్ధారణ చట్టరీత్యా నేరం.. చట్టం ప్రకారం లింగ నిర్ధారణ చేయడం నేరం. చట్టానికి లోబడి పనిచేయాలి. ఆడపిల్లల పట్ల తల్లిదండ్రులే వివక్ష చూపుతున్నారు. సమాజంలో వివక్షచూపడం మానుకోవాలి. ఎవరు పుట్టినా వారికి జన్మనిచ్చింది తామేనని గుర్తించాలి. ఆడపిల్ల వద్దనుకునే సంస్కృతి మారాలి. ఇద్దరు ఒక్కటే అనే భావన రావాలి. కొంతమంది డబ్బులకు కక్కుర్తిపడి స్కానింగ్లు చేస్తున్నారు. ఇది సరైంది కాదు. – డాక్టర్ పుల్లెల సునీత,ప్రముఖ గైనకాలజిస్టు, కరీంనగర్ ఫిర్యాదులు అందితే తనిఖీలు.. స్కానింగ్ సెంటర్లపై ఫిర్యాదులు అందితే తనిఖీలు చేస్తాం. ప్రత్యేక నిఘా కమిటీ అంటూ ఏమీ లేదు. స్కానింగ్ సెంటర్ ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్నపుడే పరిశీలిస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ ఎం.రాజేశం, డీఎంహెచ్ఓ, కరీంనగర్ -
తల్లీ..బిడ్డా..బతికేదెట్టా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ వైద్య సేవలు ఇంకా లోపభూయిష్టంగానే ఉంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి అత్యవసర వైద్య సేవలు అందని ద్రాక్షగానే మిగులుతున్నాయి. ముఖ్యంగా కాన్పు సమయంలో తల్లులు, శిశువుల పరిరక్షణ సవాల్గా మారుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని రకాల కార్యక్రమాలను అమలుచేస్తున్నా మాతాశిశు మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తాజా నివేదిక ప్రకారం తెలంగాణలో మాతాశిశు సంరక్షణ ఆందోళనకరంగానే ఉందని స్పష్టమవుతోంది. మన రాష్ట్రంలోని పాత జిల్లాల ప్రాతిపదికన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆ సర్వేలో ఈ విషయం తేటతెల్లమైంది. రాష్ట్రంలో జరిగే ప్రతి లక్ష కాన్పులలో 92 మంది తల్లులు చనిపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రసవ సమయంలో తల్లుల మరణాలరేటు ఎక్కువగా ఉంది. అక్కడ ప్రతి లక్షకు 152 మంది తల్లులు మరణిస్తున్నారు. హైదరాబాద్లో మరణాల సంఖ్య 71 ఉంది. చిన్న వయసులో పెళ్లిళ్లు, రక్తహీనత బాలింతల మరణాలకు ఎక్కువగా కారణమవుతోంది. గర్భిణులలో 51 శాతం మందికి ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఔషధాలు చేరడంలేదు. గ్రామీణ ప్రాంతాల్లో కాన్పు సమయంలో రక్తస్రావం జరిగితే అందుబాటులో రక్తం లేకపోవడం వల్ల బాలింతల మరణాలు పెరుగుతున్నాయి. గర్భంలోని శిశువు పరిస్థితిని తెలుసుకుని మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమయ్యే స్కానింగ్ వ్యవస్థ గ్రామాల్లో లేకపోవడం వల్ల కాన్పు సమయంలో ఎక్కువ సమస్యలు వచ్చి మరణాలు జరుగుతున్నాయి. శిశుమరణాల పరిస్థితి సైతం రాష్ట్రంలో ఇలాగే ఉంది. రాష్ట్రంలో జన్మించే ప్రతి వెయ్యి మంది శిశువులలో 30 మంది చనిపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ మరణాల సంఖ్య 38, పట్టణ ప్రాంతాల్లో 20గా ఉంది. కాన్పు సమయం నుంచి కొన్ని రోజులలోపు ఇలా శిశువులు చనిపోతున్నారు. దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే శిశు మరణాల రేటు మన రాష్ట్రంలోనే ఎక్కువగా నమోదవుతోంది. కేరళలో 12, తమిళనాడులో 21 మంది శిశువులు చనిపోతున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో శిశు మరణాల రేటు మరీ ఎక్కువగా ఉంది. ఈ జిల్లాలో ప్రతి వెయ్యి మంది శిశువులలో 53 మంది మరణిస్తున్నారు. హైదరాబాద్లో ఈ సంఖ్య 20గా ఉంది. ప్రభుత్వం కొత్తగా ఆస్పత్రులను నిర్మిస్తున్నా అవసరమైన మేరకు సిబ్బంది లేకపోవడంతో శిశు మరణాల సంఖ్య తగ్గడం లేదని వైద్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాన్పులు చేసే ఆస్పత్రులలో కచ్చితంగా స్త్రీ వైద్య నిపుణులు, పిల్లల వైద్యుడు, మత్తు డాక్టరు ఉండాలి. 70 శాతం ఆస్పత్రులలో మత్తు వైద్యులు లేరు. మూడు కేటగిరీల వైద్యులు ఉన్న ఆస్పత్రులు తక్కువగా ఉండటమే మాతాశిశు మరణాలకు కారణమవుతోంది. -
ఎండిన పొట్టలు.. బాగా నిండిన పొట్టలు!
ఒక పొట్ట.. రెండు సమస్యలు.. ఒక దేశం.. రెండు పరస్పర విరుద్ధ పరిస్థితులు.. ఓవైపు పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్యలో మన దేశం ప్రపంచంలోనే తొలి స్థానంలో ఉంది.. అదే సమయంలో అధిక బరువుతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్యలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది.. జంక్ఫుడ్ అనేసరికి అమెరికన్లు వాళ్లు ఎక్కువగా తింటారు.. అందుకే వారంతా లావుగా ఉంటారు.. అని అనుకుంటుంటాం. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎందుకంటే మన దేశంలో ఊబకాయంతో బాధపడే చిన్నారుల సంఖ్య అమెరికాను దాటిపోయిందట. ఈ జాబితాలో చైనా తొలిస్థానంలో ఉంది. గత దశాబ్ద కాలంలో దేశంలో ఊబకాయంతో బాధపడేవారి సంఖ్య దాదాపు రెట్టింపైంది. లాన్సెట్ జర్నల్ తాజా నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 1975–2016 మధ్య 200 దేశాల్లో బీఎంఐ(బాడీ మాస్ ఇండెక్స్) ట్రెండ్స్పై ఈ సర్వే నిర్వహించారు. ఈ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 5–19 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఊబకాయంతో బాధపడే బాలికల సంఖ్య గత 40 ఏళ్ల కాలంలో 50 లక్షల నుంచి 5 కోట్లకు పెరిగింది. ఇదే వయసు కలిగిన బాలుర సంఖ్య 60 లక్షల నుంచి 7.4 కోట్లకు చేరింది. ఇక పోషకాహారలోపాన్ని ఊబకాయంతో పోల్చి చూస్తే పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. అటు పోషకాహారలోపం.. ఇటు ఊబకాయం దేశంపై దాదాపు సమానస్థాయిలో ప్రభావం చూపుతున్నాయి. పోషకాహార లోపం కలిగిన వారి సంఖ్య గత పదేళ్లలో మూడింట ఒక వంతు శాతం తగ్గినా.. ఇప్పటికీ దేశంలో నిర్దేశిత బరువు కంటే తక్కువ ఉన్న, వయసుకు తగ్గ ఎత్తు లేని, పోషకాహార లోపం కలిగిన చిన్నారుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఏ ఇతర దేశాలతో పోల్చి చూసినా ఈ సంఖ్య ఎక్కువే. అయితే, నిరుపేద ఆఫ్రికా దేశాల కంటే ఈ విషయంలో భారత్ వెనకబడి ఉండటానికి అధిక జనాభానే కారణం. మనకంటే తక్కువ ఆదాయం ఉన్న దేశాలు కూడా ప్రజలకు ఆరోగ్యకరమైన, స్థిరమైన ఆహారాన్ని అందిస్తున్నాయి. ఈ విషయంలో మనం వెనుకబడి ఉండటం గమనార్హం. దేశంలో ఊబకాయం కలిగి ఉన్న వారి సంఖ్య ఎక్కువున్న జిల్లాలు ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండగా.. పోషకాహారలోపం ఉన్నవారు ఎక్కువగా ఉన్న జిల్లాల సంఖ్య మధ్య భారతంలో అధికం. ఒబేసిటీ తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంటే.. పోషకాహారలోపం ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలకు కారణమవుతోంది. -
మరింత కృషి అవసరం
సహస్రాబ్ది లక్ష్యాల్లో ఒకటిగా ఐక్యరాజ్యసమితి నిర్ణయించిన శిశుమరణాల నియం త్రణ విషయంలో మన దేశం చెప్పుకోదగ్గ విజయం సాధించిందని అంతర్జాతీయ జర్నల్ లాన్సెట్ వెల్లడించిన గణాంకాలు ఊరటనిస్తాయి. ప్రభుత్వాలు తీసుకున్న వివిధ చర్యల కారణంగా 2000–15 మధ్య అయిదేళ్లలోపు పిల్లలు 10 లక్షలమంది మృత్యుపాశం నుంచి తప్పించుకోగలిగారని ఆ నివేదిక చెబుతోంది. భారత రిజిస్ట్రార్ జనరల్ నిరుడు విడుదల చేసిన నివేదిక కూడా శిశు మరణాల రేటు తగ్గిందని వివరించింది. 2015లో ప్రతి వెయ్యి శిశు జననాలకూ 37 మర ణాలుంటే... నిరుడు అది 34కి తగ్గింది. నెల కంటే తక్కువ వయసున్న శిశువుల్లో అంటురోగాలు 66 శాతం తగ్గగా, ఊపిరాడక కన్నుమూసే కేసులు 76 శాతం తగ్గాయి. అలాగే ధనుర్వాతం కేసులు 90 శాతం మేరా... న్యూమోనియా కేసులు 63శాతం, మలేరియా కేసులు 44 శాతం, మశూచి 92 శాతం, మెదడువాపు, నాడీమండల వ్యాధులు 61శాతం మేర తగ్గాయని లాన్సెట్ చెబుతోంది. మాతా శిశు సంరక్షణపై వివిధ పథకాల ద్వారా గణనీయంగా వ్యయం చేయడం వల్లనే ఈ నియంత్రణ సాధ్య మైందని లక్ష కుటుంబాల్లో చేసిన సర్వే వల్ల వెల్లడైంది. శిశు మరణాల తగ్గింపులో జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం), జననీ సురక్షా యోజన పథకాల పాత్ర ప్రధానమైనది. వీటివల్ల ఆస్పత్రుల్లో పురుడు పోసు కోవడం గణనీయంగా పెరిగింది. వాక్సిన్ల వినియోగం, తల్లిపాల ప్రాధాన్యతను తెలియజెప్పడం కూడా ఉపయోగపడింది. మరణించేవారిలో ఆడ శిశువుల శాతం ఇంతక్రితం అధికంగా ఉండేది. ఇప్పుడది బాగా తగ్గింది. ఇదే సమయంలో నెలలు నిండని శిశువుల మరణాలు, బలహీన శిశువుల మరణాలు 16 శాతం పెరగడం ఆందోళన కలిగించే విషయం. ఇంక్యుబేటర్లు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు వగైరాలు విస్తృతంగా అందుబాటులోకొస్తే తప్ప ఇవి తగ్గే అవకాశం లేదు. ఇందుకోసం గణ నీయంగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ తరహా మరణాలు ఇంచు మించు అన్ని రాష్ట్రాల్లోనూ ఒకేలా ఉండటాన్ని గమనిస్తే ఇదెంత ముఖ్యమో అర్ధమ వుతుంది. గోరఖ్పూర్, జంషెడ్పూర్, ఫరూఖాబాద్ తదితర ప్రాంతాల్లో ఎందరో పిల్లలు కనీస వైద్య సౌకర్యాలు కొరవడి కన్నుమూసిన ఉదంతాలు ఈమధ్యే వెల్లడై అంద రినీ కలవరపరిచాయి. వీటన్నిటా పాలకుల నిర్లక్ష్య వైఖరి కొట్టొచ్చినట్టు కన బడింది. కేవలం సరఫరాదారుకు సకాలంలో బకాయిలు చెల్లించకపోవడంవల్ల ఆక్సిజెన్ సిలెండర్లు కరువై గోరఖ్పూర్లో రోజుకు పదుల సంఖ్యలో పిల్లలు చని పోయారు. చిత్రమేమంటే మరికొన్ని రోజులకు ఫరూఖాబాద్లో సైతం ఈ కార ణమే పిల్లల ప్రాణాలు తీసింది. ఈ రెండూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవి. జార్ఖండ్లో నాలుగు నెలల్లో 170మంది పిల్లలు అత్యంత బలహీనంగా జన్మించడం వల్ల చనిపోయారు. ఆ రాష్ట్రంలో మాతా శిశు సంరక్షణకు సంబంధించిన కార్య క్రమాలేవీ సరిగా అమలు చేయకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని సులభం గానే తెలుస్తుంది. మొత్తంగా చూస్తే దేశంలో శిశు మరణాల సంఖ్య తగ్గినా ఇంకా వైద్య రంగంలో చేయాల్సింది మరెంతో ఉంది. ప్రసవానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగించడం, రక్తహీనత తదితర సమస్యలను గుర్తించి సలహాలివ్వడం, అవసరమైన మందులు సమకూర్చడం వంటివి చేస్తేనే నెలలు నిండని, బలహీన శిశు మరణాలు తగ్గడం సాధ్యమవుతుంది. లాన్సెట్ నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఈ తరహా మరణాలు అధికంగా ఉన్నాయి. వెయ్యి జననాలకు 2000లో 13.2 మరణాలుంటే... 2015కు అది 17కు చేరుకుంది. తల సరి ఆదాయం అధికంగా ఉన్న రాష్ట్రాలకూ, అది తక్కువగా ఉన్న రాష్ట్రాలకూ మధ్య కూడా శిశు మరణాల్లో వ్యత్యాసం ఉన్నట్టు నివేదిక చెబుతోంది. వచ్చే 2030 నాటికల్లా ప్రపంచ దేశాలన్నీ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధిం చాలని ఐక్యరాజ్యసమితి 2015 సెప్టెంబర్ 25న తీర్మానించింది. ఈ లక్ష్యాలు మొత్తం 17 ఉన్నాయి. 2015 కల్లా సాధించాల్సిన లక్ష్యాలుగా 2000 సంవత్సరంలో గుర్తించిన ఎనిమిదింటికి కొనసాగింపుగా సమితి ఈ తీర్మానం చేసింది. ఇందులో పేదరిక నిర్మూలన, ఆహారభద్రత, మంచి ఆరోగ్యం, నాణ్యతగల విద్య, స్త్రీ–పురుష సమానత్వం, స్వచ్ఛమైన తాగునీరు, పారిశుద్ధ్యం వగైరాలున్నాయి. మిగిలినవాటి సంగతలా ఉంచి మంచి ఆరోగ్యమనే లక్ష్యాన్ని సాధించాలంటే ఇప్పటినుంచి చేయాల్సింది ఎంతో ఉన్నదని లాన్సెట్ నివేదిక తెలియజెబుతోంది. నిజానికి ఈ లక్ష్యా లకు నిర్దేశించిన ప్రాతిపదికలు సహేతుకంగా లేవన్న విమర్శలుండగా వాటి సాధనలో సైతం మన దేశం వెనకబడుతోంది. సుస్థిరాభివృద్ధిపై 2015లో తీర్మానం చేశాక ఏడాది వ్యవధిలో ఏ దేశం ఏం సాధించిందో వివరించే సూచీని నిరుడు విడుదల చేసినప్పుడు మన దేశం 110వ స్థానంలో ఉంది. మనకంటే దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వంటివి ఎంతో మెరుగు. వైద్య ఆరోగ్య రంగంలో 2030నాటికి లక్ష్యాన్ని చేరుకోవాలంటే అయిదేళ్లలోపు శిశు మరణాల నియంత్రణలో ఇప్పుడు సాధించిన విజయాన్ని నిలబెట్టుకోవడంతోపాటు నెలలు నిండని, బలహీన శిశువుల మరణాల నియంత్రణలో కూడా సత్వర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. శిశు మరణాలు సంభవించినప్పుడు ఆస్పత్రులు జారీచేయాల్సిన డెత్ సర్టిఫికెట్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నమూనా విడుదల చేసింది. చైనా, థాయ్లాండ్ వంటి దేశాలు దాన్ని అనుసరిస్తున్నాయి. అందువల్ల శిశువు మరణానికి నిర్దిష్టమైన కార ణమేమిటో వెల్లడవుతుంది. లోపాలు సవరించుకోవడానికి వీలవుతుంది. అలాగే ఆరోగ్య రంగానికి మన దేశం చేస్తున్న బడ్జెట్ కేటాయింపులు చాలా వెనకబడిన దేశాలకంటే తక్కువగా ఉంటున్నది. తగినన్ని నిధులు వ్యయం చేస్తే ఎంత మెరుగైన ఫలితాలు సాధించవచ్చునో లాన్సెట్ నివేదిక చెబుతోంది. దాన్ని గమనించాకైనా ఆరోగ్య రంగం కేటాయింపులు బాగా పెంచాలి. జాతి సంపదగా భావించే శిశువుల శ్రేయస్సుకు తీసుకునే చర్యలే మెరుగైన రేపటి సమాజానికి పూచీపడతాయని గుర్తించాలి. -
గోరఖ్పూర్ ఘటన.. ఓ పనైపోయింది
సాక్షి, గోరఖ్పూర్: సుమారు 60 మంది చిన్నారులను బలి తీసుకున్న బాబా రాందేవ్ ఆస్పత్రి ఘటనలో ఓ పని పూర్తయిపోయింది. ఈ కేసులో నిందితుడు, ఆక్సిజన్ సిలిండర్ల సరఫరాదారుడు మనీశ్ బండారిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన తర్వాత పరారీలో ఉన్న మనీశ్ను డొరియా ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. గోరఖ్పూర్ ఘోరం.. ఎవరి నేరం? కాగా, 9 మంది నిందితులతో కూడిన ఎఫ్ఐఆర్లో పుష్ఫలీల కంపెనీ యాజమాని మనీశ్ బండారి పేరు కూడా ఉన్న విషయం తెలిసిందే. బీఆర్డీ ఆస్పత్రి యాజమాన్యం బకాయిలు చెల్లించకపోవటంతో సిలిండర్ల సరఫరాను నిలిపివేయటం.. తద్వారానే చిన్నారులు మృతి చెందారని ఆరోపణలు వినిపించాయి. నిందితులందరినీ అరెస్ట్ చేయటంతో ఇక విచారణను వేగవంతం చేయటమే మిగిలి ఉందని అధికారులు భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గం గోరఖ్పూర్ ప్రభుత్వ ఆసుపత్రి బాబా రాఘవదాస్ మెడికల్ కాలేజీలో చిన్నారులు ఆక్సిజన్ సరఫరా అందక మృతి చెందారు. దేశ చరిత్ర లోనే కనీవినీ ఎరుగని రీతిలో చోటుచేసుకున్న ఈ ఘోర కలిపై పెద్ద ఎత్తున్న విమర్శలు రావటంతో సీఎం ఆదిత్యానాథ్ అత్యున్నత దర్యాప్తునకు ఆదేశించారు. ఎఫ్ఐఆర్లో మాజీ ప్రిన్సిపాల్ రాజీవ్ మిశ్రా, ఆయన భార్య పూర్ణిమ శుక్లా, పిల్లల వైద్య విభాగం మాజీ చీఫ్ డాక్టర్ కఫీల్ ఖాన్, వైద్యులు, క్లర్కులు ఇలా 9 మంది పేర్లను పోలీసులు చేర్చారు. ముందే హెచ్చరించినా... -
గోరఖ్పూర్ విషాదం: కీలక నిందితుడి అరెస్ట్
సాక్షి, లక్నో: యూపీలోని గోరఖ్పూర్ బాబా రాఘవదాస్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చిన్నారుల మరణాల ఉదంతం కేసులో నాలుగో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఆగస్టు నెలలో ఆక్సిజన్కొరత కారణంగా దాదాపు 70 మంది చిన్నారులు మృతిచెందగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. ఈ కేసులో మరో కీలక నిందితుడు, బీఆర్డీ కాలేజీ సీఎంఎస్ ఆఫీస క్లర్క్ సుధీర్ పాండేను శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అదుపులోకి తీసుకున్నట్లు పోటీసులు శనివారం వెల్లడించారు. బీఆర్డీ కాలేజీకి చెందిన కొందరు వైద్యసిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా అందులో సుధీర్ పాండే నిందితుడిగా ఉన్నాడు. ఈ క్రమంలో గత కొన్నిరోజులుగా తప్పించుకు తిరుగుతున్న సుధీర్ను ఖాజంచి చౌక్లో గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. అప్పటి ప్రిన్సిపాల్ రాజీవ్ మిశ్రా సహకారంతో ఆక్సిజన్కు సంబంధించిన నగదును కమిషన్ల కోసం వాడుకుని, సరఫరాదారులకు చెల్లించడంలో జాప్యం చేయడం వల్లేచిన్నారుల మరణాలు సంభవించాయని ఆరోపణలున్నాయి. ఈ కేసులో ఇదివరకే వైద్య విద్య అడిషనల్ చీఫ్ సెక్రటరీ అనితా భట్నాగర్ జైన్ను బదిలీ చేస్తూ యూపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన నిందితులైన రాజీవ్మిశ్రా, పూర్ణిమా మిశ్రా, మెదడువాపు వ్యాధి విభాగం నోడల్ అధికారి కఫీల్ ఖాన్ లను యూపీ స్పెషల్ టాస్క్ఫోర్స్ దళాలు అదుపులోకి తీసుకున్నాయి. ప్రస్తుతం వీరు జ్యూడీషయల్ కస్టడీలో ఉన్నారు. తాజాగా సెప్టెంబర్ 1న కూడా ఈ ఆసుపత్రిలో 35మంది చిన్నారులు చనిపోయారు. -
యూపీ పిల్లల మరణాలు.. శివ సేన స్పందన
సాక్షి, ముంబై: ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాసుపత్రుల్లో పిల్లల మరణాల ఉదంతాలపై చర్యలు మచ్చుకైనా కనిపించటం లేదు. ఆక్సిజన్, మందుల కొరతతో మృత్యు ఘోష కొనసాగుతున్నా.. ఆదిత్యానాథ్ ప్రభుత్వం పట్టన్నట్లు వ్యవహరిస్తుందన్న విమర్శలు నానాటికీ ఎక్కువైపోతున్నాయి. ఈ నేపథ్యంలో మానస పు(ప)త్రిక సామ్నలో శివ సేన పార్టీ బీజేపీని ఏకీపడేసింది. మంగళవారం తన సంపాదకీయంలో ఉత్తర ప్రదేశ్ ఆస్పత్రుల వ్యవహారంపై వ్యాసం ప్రచురించింది. గోరఖ్ పూర్, ఫర్రూఖాబాద్ ఆస్పత్రిలో మరణించిన పిల్లలో చాలా మంది పేద కుటుంబాలకు చెందిన వాళ్లే ఉన్నారు. ఏమైనా జరిగితే వారికి ప్రభుత్వాసుపత్రులే గతి. తమ ప్రాణాలను కాపాడే గుడిగా వాటిని పేదవాళ్లు భావిస్తారు. కానీ, ప్రభుత్వాల నిర్లక్ష్యాల కారణంగా ఇప్పుడు అవే వారిపాలిట మృత్యు కుహరాలుగా మారిపోయాయి అని సామ్న తెలిపింది. ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా లేమితోనే పిల్లలంతా చనిపోతున్నారని ప్రభుత్వానికి తెలిసి కూడా దిద్దుబాటు చర్యలు తీసుకోవటం లేదు. సౌకర్యాలను మెరుగుపరచటం లేదు. అంటే ప్రజల ప్రాణాలపై అక్కడి బీజేపీ ప్రభుత్వానికి ఎంత పట్టింపు ఉందో అర్థమైపోతుంది అని వ్యాసంలో పేర్కొంది. కాగా, గోరఖ్ పూర్ బీఆర్డీ ఆస్పత్రిలో సుమారు 70 మంది, ఫర్రూఖాబాద్ రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో 50 మంది(ఇవాళ మరో చిన్నారి) ఆక్సిజన్, సరైన మందులు లేకపోవటం, సిబ్బంది కొరత తదితర కారణాలతో చనిపోయిన విషయం తెలిసిందే. -
గోరఖ్పూర్ ఉదంతం.. ఆ డాక్టర్ అరెస్ట్
సాక్షి, గోరఖ్పూర్: ఉత్తర ప్రదేశ్ లో బాబా రాఘవ దాస్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో 30 మంది చిన్నారుల ప్రాణాలు తీసిన ఉదంతంలో పోలీసులు మరొకరిని అరెస్ట్ చేశారు. ఘటనకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న వైద్యుడు డాక్టర్ కఫీల్ ఖాన్ను స్పెషల్ టాస్క్ఫోర్స్ దళాలు అదుపులోకి తీసుకున్నాయి. సిలిండర్ల కొరతకు ప్రధాన కారణం కఫీలేనన్న ఆరోపణలు ఉన్నాయి. మెదడువాపు వ్యాధి విభాగాన్ని నోడల్ అధికారిగా ఉన్న కఫీల్ ఖాన్, డెంటిస్ట్ అయిన భార్యతో కలిసి ఓ ప్రైవేట్ ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. తన ఆస్పత్రి కోసం బీఆర్డీ ఆస్పత్రి నుంచే సిలిండర్లను తరలించాడని, తద్వారా సిలిండర్ల కొరత ఏర్పడి పిల్లల మరణాలు సంభవించాయని ఆరోపణలు వినిపించాయి. ఇందుకు ఘటన జరిగిన సమయంలో కాలేజీ ప్రిన్సిపాల్ అయిన డాక్టర్ ఆర్కే మిశ్రా కూడా సహకరించాడని విచారణలో తేలింది. సొంత డబ్బులతో పిల్లల కోసం సిలిండర్లు కొంటున్నట్లు కలరింగ్ ఇచ్చి ‘హీరో’గా మీడియాకెక్కిన కఫీల్ తర్వాత అసలు విషయం వెలుగు చూడగా సస్పెన్షన్ కు గురికావటంతోపాటు ఇప్పుడు జైలు పాలయ్యారు. -
మృత్యు ఘోష.. 52 మంది చిన్నారుల మృతి
జంషెడ్పూర్: గోరఖ్పూర్ పిల్లల మరణాల ఘటన ఇంకా కళ్ల ముందు మెదులుతుండగానే మరో ఘోర కలి వెలుగు చూసింది. జార్ఖండ్ లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో 52 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. జంషెడ్పూర్లోని మహాత్మాగాంధీ మెమోరియల్ ప్రభుత్వ ఆస్పత్రిలో నెల రోజుల వ్యవధిలో 52 మంది పిల్లలు చనిపోయినట్లు తెలుస్తోంది. చిన్నారుల మరణాలు ధృవీకరించిన ఆస్ప్రతి సూపరిండెంట్ పౌష్టికాహార లోపంతోనే వారంతా మరణించినట్లు చెబుతున్నారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
గోరఖ్పూర్లో ఆగని మరణాలు
తాజాగా ఆరుగురు చిన్నారుల దుర్మరణం గోరఖ్పూర్: యూపీలోని గోరఖ్పూర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చిన్నారుల మరణాలు ఆగడం లేదు. తాజాగా మెదడువాపు వ్యాధితో మరో ఆరుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. దీంతో ఈ బాబా రాఘవ్దాస్ వైద్య కళాశాల ఆస్పత్రి(బీఆర్డీ)లో గత నాలుగురోజుల వ్యవధిలో మరణించిన చిన్నారుల సంఖ్య 70కి చేరింది. అయితే, చిన్నారులెవరూ చనిపోలేదని, ఈ ఆరుగురు చిన్నారులు కూడా ఆగస్టు 12 నుంచి 14 మధ్యే చనిపోయిన వారేనని ఆరోగ్యశాఖ అదనపు డైరెక్టర్ పుష్కర్ ఆనంద్ పేర్కొన్నారు. ప్రస్తుతం 75 మంది మెదడువాపు వ్యాధిగ్రస్తులకు బీఆర్డీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామన్నారు. ఆక్సిజన్ కొరత వల్లే చిన్నారులు చనిపోయారన్న వాదనను ఆనంద్ తోసిపుచ్చారు. మరోవైపు, గోరఖ్పూర్ దుర్ఘటనపై రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు పదునెక్కాయి. స్వాతంత్య్ర ప్రసంగంలో ఈ మరణాలపై ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. యూపీ ఆరోగ్యమంత్రి సిద్ధార్థనాథ్ సింగ్ తన తాత లాల్బహదూర్ శాస్త్రిలా నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింథియా డిమాండ్ చేశారు. మృతిచెందిన చిన్నారుల కుటుంబాలను యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ పరామర్శించారు. సుల్తాన్పూర్లోని ప్రభుత్వాసుపత్రిలో చిన్నపిల్లల విభాగం ఏర్పాటుకు ఎంపీ ల్యాడ్స్ నిధుల కింద రూ.5 కోట్లు కేటాయిస్తానని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ హామీ ఇచ్చారు. మరోవైపు ఈ దుర్ఘటనలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి సిద్ధార్థనాథ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆస్పత్రిలో చిన్నారుల మరణాలకు అధికారుల లంచగొండితనమే కారణమన్నారు. ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా కోసం ప్రభుత్వం రూ.68 లక్షలు విడుదల చేసినా..ఈ నెల 11 నాటికి కేవలం అధికారులు కేవలం రూ.11 లక్షలే ఎందుకు ఖర్చు చేశారని ప్రశ్నించారు. కాగా, బీఆర్డీ ఆస్పత్రి దుర్ఘటనకు బాధ్యునిగా చేస్తూ డాక్టర్ ఖఫీల్ఖాన్ను సస్పెండ్ చేయడంపై ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు మండిపడ్డారు. బాధితుల కోసం మానవత్వంతో సొంత డబ్బులు ఖర్చుపెట్టి ఆక్సిజన్ సిలిండర్లు తెప్పించిన ఖఫీల్ను బలిపశువు చేయడం సరికాదన్నారు. ఎన్హెచ్ఆర్సీ నోటీసులు: ఒకే ఆసుపత్రిలో 70 మంది చిన్నారులు చనిపోవడంపై కేంద్ర మానవహక్కుల సంఘం తీవ్రంగా స్పందించింది. నిందితులపై తీసుకున్న చర్యలతో పాటు బాధిత కుటుం బాలకు పునరావాసం కల్పించడంపై నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి సాక్షి, బెంగళూరు: గోరఖ్పూర్లోని ఆసుపత్రిలో 60 మందికి పైగా చిన్నారులు మరణించినందుకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలన్న కాంగ్రెస్ డిమాండ్ను బీజేపీ చీఫ్ అమిత్ షా తోసిపుచ్చారు. అదొక ప్రమాదమనీ, ఇంత పెద్ద దేశంలో అలాంటి దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయనీ, ఈ తరహా ఘటన జరగడం ఇది మొదటిసారి కాదని షా వ్యాఖ్యానించారు. కర్ణాటకలో పార్టీ బలోపేతానికి, రానున్న శాసనసభ ఎన్నికల వ్యూహరచనకు మూడురోజుల పర్యటన కోసం వచ్చిన ఆయన చివరిరోజు సోమవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. నిర్దిష్ట సమయంలోగా విచారణ పూర్తి చేయాల్సిందిగా ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారని వెల్లడించారు. చిన్నారుల మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ తన స్వాతంత్య్రదినోత్సవ ప్రసంగంలో దేశానికి క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పసిపిల్లల మరణంతో ఉత్తరప్రదేశ్ శోకంలో మునిగిపోయి ఉంటే క్రిష్ణాష్టమికి ‘ఘనంగా’ ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించినట్లు వార్తలు రావడంతో విమర్శలు వ్యక్తమయ్యాయి. -
అక్కడ పది నిమిషాలకో మృత్యువు
సనా: యెమెన్లో రెండేళ్లుగా కొనసాగుతున్న అంతర్యుద్ధానికి బాల్యం బలవుతోంది. పిల్లల ఎండిన డొక్కల్లో పేగులు ఆకలిదప్పులతో నకనకలాడుతున్నాయి. జీవచ్ఛవమవుతున్న బాల్యాన్ని మృత్యువు ఎప్పటికప్పుడు మింగేస్తుంది. ప్రస్తుతం యెమెన్లో 22 లక్షల మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్నారని యునిసెఫ్ ఓ నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. వారిలో నాలుగున్నర లక్షల మంది పిల్లల పరిస్థితి మరీ దారుణంగా ఉందని పేర్కొంది. సౌదీ మద్దతిస్తున్న ప్రభుత్వ దళాలకు, షియా తిరుగుబాటుదారుల మధ్య కొనసాగుతున్న అంతర్యుద్ధం వల్ల దేశం వైద్యరంగం కూడా పూర్తిగా కుప్పకూలిపోయింది. షియా తిరుగుబాటుదారుల ప్రాబల్యం ఎక్కువగావున్న సాదా ప్రావిన్స్లో ప్రతి పదిమంది పిల్లల్లో ఎనిమిది మంది పిల్లలు ఆహారం నోచుకోక అల్లాడిపోతున్నారు. ప్రపంచంలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా యెమెన్ పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని యునిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. అతిసారం, శ్వాస సంబంధిత సమస్యలతో పది నిమిషాలకు ఒక పిల్లా లేదా పిల్లాడు మరణిస్తున్నాడని పేర్కొంది. ఈ ఏడాది యెమెన్లోని రెండు లక్షల మంది పిల్లలకు మాత్రమే తాము విటమిన్ సప్లిమెంట్లు, పౌష్టికాహారాన్ని అందజేయగలిగామాని యునిసెఫ్ అధికారి మెరిటెక్సెల్ రెలానో తెలిపారు. నిధుల కొరత యుద్ధ ప్రాంతాలకు వెళ్లే అవకాశం లేకపోవడం వల్ల ఇంతమందికన్నా ఎక్కువ మంది పిల్లలకు తాము సరఫరాలు అందించలేకపోయామని రెలానో ఆందోళన వ్యక్తం చేశారు. దయచేసి పిల్లలను ఆదుకునేందుకు తమకు సహకరించాలని యుద్ధం చేస్తున్న ఇరు వర్గాలకు విజ్ఞప్తి చేశారు. -
రుయా ఆసుపత్రిలో ఆగని చిన్నారుల మరణాలు
-
'చిన్న పిల్లల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుంది'
హైదరాబాద్ : చిన్న పిల్లల జీవితాలతో టీడీపీ ప్రభుత్వం ఆడుకుంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆరోపించారు. బుధవారం అసెంబ్లీలో వైఎస్ జగన్ మాట్లాడుతూ ... వేల సంఖ్యలో పిల్లలు చనిపోతున్నా ప్రభుత్వం మాత్రం గొప్పలు చెబుతుందని విమర్శించారు. చిన్న పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నా... ఈ ప్రభుత్వానికి మాత్రం పట్టడం లేదన్నారు. ఇప్పటికైనా శిశుమరణాలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి వైఎస్ జగన్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. గతరెండేళ్లుగా మృతి చెందిన చిన్న పిల్లల గణాంకాలను ఈ సందర్భంగా సభలో వైఎస్ జగన్ వివరించారు. -
ఏటా 25 వేల మంది
రాష్ట్రంలో భీతి గొలుపుతున్న శిశు మరణాలు ♦ నెలలు నిండని ప్రసవాలే కారణం ♦ అందులో 60 శాతం నవజాత శిశువులే ♦ వీటి తగ్గింపునకు కార్యాచరణ ప్రణాళిక ♦ ఆదిలాబాద్, మహబూబ్నగర్లకు ప్రాధాన్యం ♦ ‘2016ను నవజాత శిశు సంవత్సరం’గా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: నెలలు నిండని ప్రసవాల వల్లే నవజాత శిశు మరణాలు సంభవిస్తున్నాయి. తొమ్మిది నెలలకు కాకుండా ఏడెనిమిది నెలలకే శిశువు పుట్టడం.. బరువు తక్కువగా ఉండటం.. తద్వారా రోగనిరోధక శక్తి లేకపోవడం వంటి కారణాలతోనే శిశువులు చనిపోతున్నారు. దేశంలో ప్రతీ వెయ్యి మందికి 28 మంది నవజాత శిశువులు మరణిస్తుంటే.. రాష్ట్రంలో ఆ సంఖ్య 25గా ఉంది. దక్షిణ భారత దేశంతో పోలిస్తే రాష్ట్రంలో నవజాత శిశు మరణాల రేటు ఎక్కువే. దీన్ని పది లోపు(ఒకే అంకె)నకు తీసుకురావాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. అందుకోసం ‘2016ను నవజాత శిశు సంవత్సరం’గా ప్రకటించింది. తద్వారా తల్లుల్లో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడంతోపాటు పెద్దఎత్తున కార్యక్రమాల రూపకల్పనకు నడుం బిగించింది. దీనికి యునిసెఫ్తోపాటు జాతీయ ఆరోగ్య మిషన్ సహకారం తీసుకోనుంది. ఏడాదికి 25 వేల శిశు మరణాలు రాష్ట్రంలో ఏటా సరాసరి 6.30 లక్షల మంది శిశువులు పుడుతుండగా, అందులో 25 వేల మంది మరణిస్తున్నారు. ఏడాదిలోపు శిశు మరణాల రేటు 39 ఉండగా, 28 రోజుల్లోపు చనిపోయే నవజాత శిశు మరణాల రేటు 25గా ఉంది. అంటే ఏడాదిలో చనిపోయే శిశువుల్లో 60 శాతం మంది నవజాత శిశువులే ఉంటున్నారు. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గిరిజన, మారుమూల ప్రాంతాల్లో ఇది అధికంగా ఉంది. మహిళల్లో పౌష్టికాహార లోపం, బాల్య వివాహాలు, పేదరికం వల్లే నవజాత శిశు మరణాలు అధికంగా ఉంటున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. పుట్టిన శిశువు అనారోగ్యానికి గురైతేనే వైద్యులను సంప్రదిస్తున్నారు. అలాకాకుండా ముందుగానే వైద్యులను సంప్రదించే పరిస్థితి పల్లెల్లో ఉండటంలేదు. యుక్త వయసు నుంచే ప్రత్యేక శ్రద్ధ శిశు మరణాలను తగ్గించాలంటే ముందస్తు ప్రణాళిక అవసరమని కేంద్రం భావిస్తోంది. యుక్త వయసు, పెళ్లయ్యాక, గర్భిణీగా ఉన్న సమయంలో ఆరోగ్యంపై ఎలా శ్రద్ధ తీసుకోవాలో అవగాహన కల్పించాలని యోచిస్తోంది. స్కూలు, కాలేజీల్లో చదివే యుక్త వయసు బాలికలకు రక్తహీనత సహజం. అందుకోసం ఐరన్ మాత్రలను పంపిణీ చేయడం, పౌష్టికాహారంపై అవగాహన కల్పించడం లాంటివి చేయాలని ప్రణాళిక రూపొందించింది. అలాగే, గర్భిణుల్లో అత్యంత రిస్క్ ఉన్న వారిని గుర్తించి అత్యాధునిక వైద్య సౌకర్యాలు ఉన్నచోట ప్రసవం చేయాలని, అందుకోసం ప్రత్యేకంగా టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఉన్న వంద ప్రసవ కేంద్రాలను మరింత ఆధునీకరిస్తారు. అత్యంత రిస్క్ ప్రసవ కేసులు హైదరాబాద్ నిలోఫర్, వరంగల్ ఎంజీఎంకు వస్తున్నాయి. రాష్ట్రంలో కనీసం మూడు ఆసుపత్రులను అత్యంత ఆధునీకరించాలనే ఆలోచన కూడా ఉంది. ఆశ కార్యకర్తలను పూర్తిస్థాయిలో వినియోగించుకొని ప్రతీ గర్భిణీ సమగ్ర సమాచారం సేకరిస్తారు. అలాగే ప్రసవించాక శిశు రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేస్తారు. తల్లుల సెల్ఫోన్ నంబర్లకు ఎప్పటికప్పుడు ఆటోమెటిక్గా ఎస్ఎంఎస్లు పంపేలా ఏర్పాట్లు చేస్తారు. ఎప్పుడెప్పుడు చెకప్లు చేయించుకోవాలో కూడా మెసేజ్ రూపంలో తెలియపరుస్తారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఆదిలాబాద్, మహబూబ్నగర్లను అత్యంత ప్రాధాన్యం గల జిల్లాలుగా గుర్తిం చిం ది. అందువల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇం దుకోసం కేటాయిం చే బడ్జెట్లో 30 శాతం ఆ జిల్లాలకే కేటాయిస్తారు. -
'చికిత్స నిరాకరించిన ఆస్పత్రులపై కేసు పెట్టండి'
న్యూఢిల్లీ: డెంగీతో చిన్నారి మృతి, కుటుంబం ఆత్మ హత్య కేసు పై ఢిల్లీ ప్రభుత్వం స్పందించింది. పలు ఆస్పత్రుల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చికిత్స నిరాకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆస్పత్రులపై కేసులు పెట్టాలని కేజ్రీవాల్ సూచించారు. వివరాలు..ఒక్కగానొక్క కొడుకు డెంగీతో చనిపోవడం తట్టుకోలేక తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఢిల్లీలోని లాడోసరాయ్లో జరిగింది. బిడ్డ అంత్యక్రియలు నిర్వహించిన 24గంటల్లోపే వారు ఆత్మహత్య చేసుకున్నారు. ఒడిశాకు చెందిన లక్ష్మీచంద్, బబితలు కొన్నేళ్లుగా లాడోసరాయ్ ఉంటున్నారు. ఇటీవల వారి కొడుకు అవినాశ్(7)కు డెంగీ సోకింది. దగ్గర్లోని ఆస్పత్రిలో చికిత్సచేసినా తగ్గలేదు. రెండు ఆస్పత్రులు పడకల్లేవని చేర్చుకోలేదు. మరో ఆస్పత్రిలో చేర్పించారు. వ్యాధి తీవ్రం కావడంతో అవినాశ్ సెప్టెంబర్ 8న చనిపోయాడు. అదే రోజు అంత్యక్రియలు నిర్వహించిన తల్లిదండ్రులు.. ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంటి దగ్గర్లోని పాఠశాలలో మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇద్దరూ చేతులు కట్టేసుకుని భవంతి పై నుంచి దూకారు. -
పీహెచ్సీని ప్రారంభించిన మంత్రి కామినేని
తూర్పుగోదావరి: శిశు మరణాలను అరికట్టడంలో కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రం వెనకబడిందని ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ఆయన కపిలేశ్వరపురం మండలంలోని అచ్యుతాపురంలో ఆదివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్సీ)ను ప్రారంభించారు. విభజన ప్రక్రియ పూర్తకాబోతున్న నేపథ్యంలో దాదాపు 100 మంది డాక్టర్లు రాష్ట్రానికి రానున్నారని తెలిపారు. వైద్యశాఖలో ఖాళీగా ఉన్న 541 పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని కామినేని అన్నారు. (కపిలేశ్వరపురం) -
మాతా, శిశు మరణాలు పట్టవా?
నెల్లూరు (అర్బన్): ‘మాతా, శిశు మరణాలు తగ్గించాలి... ఇవి ఎక్కడా చోటు చేసుకోకూడదు...’ వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల సమీక్షలో ఉన్నతాధికారులు ఎప్పుడూ చెప్పే మాటలివి. జిల్లా అధికారులు దీనిపై వారానికో, పదిహేను రోజులకో సమావేశాలు పెట్టి మరీ ఏమేం చర్యలు తీసుకోవాలో చెబుతుంటారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గతేడాదితో పోల్చుకుంటే జిల్లాలో మాతా, శిశు మరణాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే యంత్రాంగం ఎలా పనిచేస్తుందో అర్థమవుతోంది. ఇప్పటికే 38 నమోదు జిల్లావ్యాప్తంగా 74 పీహెచ్సీలుండగా ఇందులో 24 /7 పీహెచ్సీలు 28 ఉన్నాయి. వీటిలో, ఏరియా ఆసుపత్రుల్లో, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇప్పటి వరకు మాతా మరణాలు 38 చోటుచేసుకోగా శిశు మరణాలు 420 వరకు ఉన్నాయి. గతేడాదిలో మాతా మరణాలు 36, శిశు మరణాలు 487 చోటు చేసుకున్నాయి. ఈ సంవత్సరానికి సంబంధించి ఇంకా అధికారులు మార్చి నెల లెక్కలు తీసుకోవాల్సి ఉంది. పూర్తిస్థాయిలో వీటి తగ్గింపునకు తీసుకున్న చర్యలు దాదాపుగా శూన్యమనే చెప్పొచ్చు. జిల్లావ్యాప్తంగా హైరిస్క్ మదర్స్ గుర్తింపు చాలా తక్కువగా ఉంది. సాధారణంగా హైరిస్క్ మదర్స్ను గుర్తించి వారికి 9వ నెల వచ్చే లోపు నాలుగు సార్లు డాక్టర్ పరిశీలించాల్సి ఉంటుంది. వారికి ఎస్కార్ట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఏ ఆసుపత్రిలో డెలివరీ చేయించుకోవాలో చెప్పేందుకు బర్త్ప్లానింగ్ వేయాలి. అయితే జిల్లావ్యాప్తంగా ఎక్కడా ఇది సరిగ్గా అమలు కావడంలేదు. సుమారు నెలరోజుల క్రితం సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ఎంసీటీఎస్ (మదర్ అండ్ చైల్డ్ ట్రాకింగ్ సిస్టమ్)పై సమీక్ష నిర్వహించినప్పుడు ఈ విషయం బయటపడింది. హైరిస్క్ మదర్స్ను ఆన్లైన్లో నమోదు చేయడంలో క్లస్టర్ల పరిధిలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. అలాగే డబుల్ ఎంట్రీలు ఉన్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులే ఒప్పుకుంటున్నారు. హైరిస్క్ మదర్కు ఎస్కార్ట్ ఏర్పాటు చేస్తే మాతా, శిశు మరణాలు చాలావరకు తగ్గుతాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఎస్కార్ట్ పెట్టడం ద్వారా వారి ఆరోగ్య పరిస్థితి ఏంటి అనే విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. జిల్లాస్థాయిలో సమావేశాలు పెట్టి మరీ డీఎంహెచ్ఓ ఎస్కార్ట్ను ఏర్పాటుచేయాలని చెబుతున్నప్పటికీ అధికారులు దీనిని సీరియస్గా తీసుకోవడంలేదు. అలాగే కొన్ని మాతా, శిశు మరణాల వివరాలను జిల్లా కార్యాలయానికి చేరవేయడం లేదనే ఆరోపణలున్నాయి. ఈనెలాఖరులోగా కలెక్టర్ మరోమారు మాతా, శిశు మరణాలపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మరణాలు తగ్గాలంటే ఉన్నతాధికారులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ఆపదలో రేపటి అమ్మలు
సాక్షి, కర్నూలు : కాబోయే అమ్మలు ఆపదలో ఉన్నారు. మాతృమూర్తిగా మారే తరుణంలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇందుకు కారణాలు పేదరికం, అవగాహన లేమి, వైద్య సిబ్బంది పర్యవేక్షణ లోపం. జిల్లా వ్యాప్తంగా పరిశీలనతో వెలుగు చూసిన అంకెలు చెబుతున్న విస్తుపోయే నిజాలివి. మాతశిశు మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అధికారుల నిర్లక్ష్యం, ప్రజల అవగాహన లోపం వెరసి కాబోయే అమ్మలకు ముప్పు వాటిల్లుతోంది. గర్భిణులు పోషకాహార లోపంతో సతమతమవుతున్నారు. మరికొందరు రోగాలతో బాధపడుతూ దయనీయ స్థితికి చేరుకుంటున్నారు. దీంతో ఆయా పేద కుటుంబాల్లో ఆందోళన తప్పడం లేదు. ఇటీవల నిర్వహించిన ‘జన్మభూమి-మా ఊరు’ సందర్భంగా వైద్య బృందాలు గ్రామాల్లో 1,161 శిబిరాలను నిర్వహించాయి. జిల్లా వ్యాప్తంగా 1,11,345 మంది రోగులకు వైద్య సేవలు అందించారు. ఇందులో 6,500 మంది గర్భిణులను వైద్య సిబ్బంది పరీక్షించారు. ఇందులో 2,585 మంది షోషకాహార, హైరిస్క్(ప్రమాద లక్షణాలు)తో బాధపడుతున్నట్లు పేర్కొంటున్నారు. ఇవి అధికారుల ప్రాథమిక లెక్కలు మాత్రమే. అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చని ఓ అంచనా. ఈ స్థితిని గమనిస్తే జిల్లాలో గర్భిణుల పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థమవుతుంది. ఎందుకు ఇలా? జిల్లా వ్యాప్తంగా సుమారు 3,462 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. మరో విభాగం ద్వారా 100 వరకు పౌష్టికాహార కేంద్రాలు నిర్వహిస్తున్నారు. వీటి ద్వారా పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం రూ. కోట్లు వెచ్చిస్తోంది. అధికారుల పర్యవేక్షణ లోపం, కేంద్రాలుఆపదలో రేపటి అమ్మలు సక్రమంగా పనిచేయకపోవడం వంటి కారణాలతో పౌష్టికాహార పంపిణీ మొక్కుబడిగా మారుతోందని అవగతం అవుతోంది. ఇలా చేయాలి? ఏఎన్ఎంలు, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు గర్భిణులపై ప్రత్యేక దృష్టి సారించాలి. వారు తీసుకోవాల్సిన పౌష్టికాహారంతోపాటు జాగ్రత్తలపై అవగాహన కల్పించాలి. వీరంతా ఆసుపత్రులకు వచ్చే విధంగా చైతన్యం చేయాలి. లోపాలను గుర్తించి అవసరమైన మందులను అందించాలి. గర్భిణులకు నాలుగో నెల నుంచి తొమ్మిదో నెల వరకూ మూడు విడతలుగా 100 ఐరన్ మాత్రలు అందజేయాలి. వారిలో రక్తహీనతను నివారించాలి. రక్తహీనత ఉన్నవారికి 200 మాత్రలు ఇవ్వాలి. ప్రతి గర్భిణి ప్రసవం సమయానికి కనీసం 10 కిలోల బరువు పెరిగే విధంగా చూడాలి. గర్భం దాల్చిన నాలుగు నెలల తర్వాత ఆరు నెలల వరకు ప్రతి నెలా పరిశీలన చేయాలి. ఏడో నెల నుంచి తొమ్మిదో నెల వరకు 15 రోజులకు ఒకసారి పరిశీలన చేసి ఆరోగ్య పరిస్థితిని గమనించాల్సిన బాధ్యత ఆరోగ్య సిబ్బందిపై ఉంది. ఇందుకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో ప్రభుత్వ ఆసుపత్రులు, వేల సంఖ్యలో ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పనిచేస్తున్నా పూర్తిస్థాయిలో ప్రయోజనాలు కనిపించడం లేదు. ఫలితంగా అనేక మంది వివిధ రోగాలకు గురై చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. అవగాహన లోపం.. అనేక మంది గర్భిణిలు అవగాహన లేక పౌష్టికాహార లోపంతోపాటు ఇతర రోగాల బారిన పడుతున్నారు. దీంతో బిడ్డలో ఎదుగుదల ఉండదు. ప్రసవం తర్వాత తల్లి పాల ఉత్పత్తి తగ్గుతుంది. ఇటువంటి వారు ప్రసవ సమయంలో ఇబ్బందులు పడాల్సి వస్తుందని కొంత మంది వైద్యులు చెబుతున్నారు. గర్భిణిలు ఆకుకూరలు, ఖర్జూరం, ఎండుపండ్లతోపాటు పౌష్టికాహారం తీసుకోవాలి. ముఖ్యంగా ఐరన్, మినరల్స్ ఉన్న బెల్లం కూడా వినియోగిస్తే రక్తహీనత బారిన పడే అవకాశం ఉండదని వారు వివరిస్తున్నారు. ఇవి తక్కువ ధరకు లభ్యమయ్యే పరిస్థితి ఉన్నా అవగాహన లోపంతో తీసుకోవడం లేదని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రధాన సమస్య ఇదే! జిల్లా వ్యాప్తంగా సాగిన శిబిరాాల్లో గర్భిణుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలిస్తే.. అధిక శాతం మంది పౌష్టికాహారం లోపంతో ఉన్నట్లు గుర్తించారు. రక్తహీనత, చిన్న వయస్సు (18 ఏళ్లలోపు)లో గర్భం దాల్చడం, వయసు దాటిన(35 ఏళ్లుపైబడి) తర్వాత దాల్చడం, శిశువు ఎదగక పోవడం, మధుమేహం, రక్తపోటు, సిజేరియన్ తర్వాత గర్భం దాల్చడం, ఎక్కువ కాన్పులు వంటి కారణాలతో ఉన్న 2.585 మందిని గుర్తించారు. వీరిని ‘హైరిస్క్’ గర్భిణులుగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు బాధ్యత ఉండాలి జిల్లాలో చాలా మంది గర్భిణి స్త్రీలు వివిధ జబ్బులతో బాధపడుతున్నారు. పౌష్టికాహారం తీసుకుంటున్నప్పటికీ వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా ప్రసవ సమయంలో తల్లి మరణించడమో, లేదా తక్కువ బరువున్న పిల్లలు పుట్టడమో జరుగుతోంది. ఈ సమస్య ఆదోని, ఆలూరు, పత్తికొండ తదితర మండలాల్లో అధికంగా ఉన్నట్లు గుర్తించాం. ఎలాంటి పౌష్టికాహారం తీసుకోవాలన్న విషయంపై తాము ఎప్పటికప్పుడు గర్భిణులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ వివరిస్తున్నాం. గర్భిణుల ఆహార నియమాల విషయంలో కుటుంబ సభ్యులు కూడా బాధ్యత తీసుకోవాలి. ఐసీడీఎస్ సిబ్బంది అందిస్తున్నది కేవలం అనుబంధ ఆహారం మాత్రమే. పూర్తిస్థాయి పౌష్టికాహారం, ఇతరత్రా ఆహారం కుటుంబ సభ్యులు అందించాలి. - ముత్యాలమ్మ, పీడీ, ఐసీడీఎస్.