Dalit woman
-
దళిత మహిళా చైర్పర్సన్ని అవమానించిన అయ్యన్న
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ బలంగా ఉన్న స్థానిక సంస్థలపై కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. వాటిని నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తోంది. తాజాగా దళిత మహిళ అయిన నర్సీపట్నం చైర్పర్సన్ను అవమానించింది. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కూడా నిబంధనలు ఉల్లంఘించి మరీ నర్సీపట్నం కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించడం విమర్శలకు దారితీసింది. రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఇద్దరూ అధ్యక్షత వహించకుండా స్థానిక ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడి ఆధ్వర్యంలో నర్సీపట్నం కౌన్సిల్ సమావేశాన్ని.. అందులోనూ బడ్జెట్ సమావేశాన్ని కూటమి ప్రభుత్వం నిర్వహించింది.పైగా, అయ్యన్నపాత్రుడు కౌన్సిల్లో ఎక్స్ అఫీషియో సభ్యునిగా మంగళవారమే ప్రమాణ స్వీకారం చేయడం, అధ్యక్ష స్థానంలో ఎవరూ లేకపోయినప్పటికీ, ఆయన ఆధ్వర్యంలోనే సమావేశాన్ని నిర్వహించడం, బడ్జెట్ ఆమోదించాలని ఆయనే ఆదేశాలు జారీ చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చైర్పర్సన్గా వైఎస్సార్సీపీ నియమించిన దళిత మహిళ సుబ్బలక్షిని అవమానపరిచేలా అయ్యన్న వ్యవహరించారని పలువురు విమర్శిస్తున్నారు.నిబంధనల ఉల్లంఘన!ఆంధ్రప్రదేశ్ మునిసిపాలిటీ చట్టం–1965లోని సెక్షన్ 47 (బి), సెక్సన్ 51, సెక్షన్ 51 (1) బి, సెక్షన్ 50 (3) ప్రకారం.. మునిసిపల్ కౌన్సిల్ సమావేశాన్ని చైర్పర్సన్ అధ్యక్షతన నిర్వహించాలి. ఒకవేళ చైర్పర్సన్ అందుబాటులో లేకపోతే వైస్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో జరగాలి. ఇద్దరూ అందుబాటులోకి లేకుండా, మెజార్టీ సభ్యులు హాజరై కోరం ఉంటే.. ఆ సభ్యుల్లో నుంచి ఒకరిని తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకుని, వారి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించాలి. అయితే, మంగళవారం జరిగిన నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి చైర్పర్సన్, దళిత మహిళ అయిన సుబ్బలక్ష్మి హాజరు కాలేదు.మాజీ ప్రధాని మన్మోహనసింగ్ మృతికి సంతాప దినాలైనందున సమావేశాన్ని వాయిదా వేయాలని ఆమె అధికారులను కోరారు. అయినా సమావేశాన్ని నిర్వహించారు. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ సమావేశంలో లేరు. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయనే కౌన్సిల్ హాలులో సమావేశాన్ని నిర్వహించారు. కనీసం సభ్యుల నుంచి తాత్కాలిక అధ్యక్షుడిని కూడా ఎన్నుకోలేదు. నిబంధనలను విరుద్ధంగా సమావేశం జరుగుతున్నప్పటికీ అధికారులెవ్వరూ అడ్డుచెప్పలేదు. అంతేకాకుండా ఏకంగా బడ్జెట్కు ఆమోదముద్ర వేయాలని ఆదేశించారు. పైగా స్పీకరు స్థానంలో ఉన్న తాను ప్రమాణ స్వీకారానికి వస్తున్నానని చెబితే... గైర్హాజరైన చైర్పర్సన్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి లేఖ రాయాలని కూడా అధికారులను అయ్యన్న పాత్రుడు ఆదేశించడం గమనార్హం.స్థానిక సంస్థలపై కూటమి పెత్తనంవాస్తవానికి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి స్థానిక సంస్థలపై పెత్తనం చలాయిస్తోంది. ఇటీవల వైఎస్సార్ జిల్లా కడప మునిసిపల్ సమావేశంలో సీటు కేటాయించాలంటూ స్థానిక ఎమ్మెల్యే ఏకంగా మేయర్పైనే దాడి చేసినంత పని చేశారు. ఇప్పుడు నర్సీపట్నం కౌన్సిల్ సమావేశాన్ని స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్ కూడా అయిన అయ్యన్నపాత్రుడే నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించడం మరిన్ని విమర్శలకు దారితీసింది.వద్దని చెప్పినప్పటికీ.. కావాలనే సమావేశం పెట్టారుమాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప దినాల కారణంగా సమావేశం వాయిదా వేయాలని చెప్పాను. అయినా కావాలనే సమావేశం పెట్టారు. మన్మోహన్సింగ్ సంతాప దినాలు ఖచ్చితంగా పాటించాలని, ఎలాంటి వేడుకలూ నిర్వహించవద్దని సాక్షాత్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడే చెప్పారు. మరోపక్క రాజ్యాంగ పదవిలో ఉండి మొదటిసారిగా మున్సిపల్ సమావేశానికి విచ్చేస్తున్న స్పీకర్కు సముచిత గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో సంతాప దినాల అనంతరం కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను కోరాను. అయినా ఉద్దేశపూర్వకంగా సమావేశం ఏర్పాటు చేసి రాజకీయం చేశారు. – మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి -
యూపీలో కలకలం.. గోనె సంచిలో దళిత యువతి మృతదేహం
లక్నో: ఉత్తర ప్రదేశ్లో ఓ గోనె సంచిలో దళిత యువతి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపుతోంది. మెయిన్పురి జిల్లాలోని కర్హల్ నియోజకవర్గంలో బుధవారం ఉదయం ఈ ఘటన వెలుగుచూసింది. నేడు జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చినందుకు ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడి చంపినట్లు ఆమె కుటుంబం ఆరోపించింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ప్రశాంత్ యాదవ్, మోహన్ కతేరియాలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బీజేపీకి ఓటు వేయాలనే ఉద్దేశంతో నిందితులు ఆమెను హత్య చేశారని యువతి తల్లిదండ్రులు చెప్పారని మెయిన్పురి జిల్లా ఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు.అయితే మూడు రోజుల క్రితం ప్రశాంత్ యాదవ్ తమ ఇంటికి వచ్చి ఏ పార్టీకి ఓటు వేస్తారని అడిగారని బాధితురాలి తండ్రి తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తన కుటుంబానికి ఇల్లు లభించినందున బీజేపీ గుర్తుకు ఓటు వేస్తానని తన కూతురు చెప్పినట్లు పేర్కొన్నారు. దీంతో ప్రశాంత్ యాదవ్ ఆమెను బెదిరించి, సమాజ్వాదీ పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్కు ఓటు వేయమని అడిగాడని తెలిపారు. బీజేపీకి ఓటు మద్దతు ఇచ్చినందుకు యువతిని కిడ్నాప్ చేసి హత్య చేశారని ఆరోపించారు. మహిళ మృతిపై సమాజ్ వాదీ పార్టీపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. మెయిన్పురి జిల్లాలోని కర్హాల్లో, సమాజ్వాదీ పార్టీకి చెందిన ప్రశాంత్ యాదవ్, అతని అనుచరులు తమ పార్టీకి ఓటు వేసేందుకు నిరాకరించినందుకు దళిత కుమార్తెను దారుణంగా హత్య చేశారు’ అని బీజేపీ చీఫ్ భూపేంద్ర సింగ్ చౌదరి ఎక్స్లో పోస్ట్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై విచారణ జరిపి, దోషులను కఠినంగా శిక్షించాలని సమాజ్వాదీ పార్టీ కర్హల్ అభ్యర్థి తేజ్ ప్రతాప్ యాదవ్ అన్నారు. పి సమాజ్ వాదీ పార్టీ పరువు తీసేందుకు బీజేపీ పన్నిన కుట్ర అని, దీనికి ఎస్పీకి ఎలాంటి సంబంధం లేదని సమాజ్వాదీ పార్టీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి పేర్కొన్నారు. -
కొడుకు కోసం.. తల్లి నిర్బంధం
బషీరాబాద్: షాద్నగర్ దళిత మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటన మరవకముందే వికారాబాద్ జిల్లా బషీరాబాద్ పోలీస్స్టేషన్లో మరో దారుణం.. పదహారేళ్ల బాలిక కిడ్నాప్ కేసులో నిందితుడైన కొడుకు ఆచూకీ చెప్పాలంటూ బాలుడి తల్లిని పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు. రోజూ స్టేషన్కు పిలవడం.. కొడుకు గురించి వివరాలు చెప్పాలని ఒత్తిడి చేస్తూ సాయంత్రం వరకు కూర్చోబెట్టడం.. మధ్యలో లాఠీలతో విచక్షణారహితంగా కొట్టడం.. గడిచిన మే నుంచి ఆగస్టు 15 వరకూ ఇదే వరస.. కాలూచేయీ కూడ దీసుకోలేని స్థితిలో భర్త.. తను పనికి వెళ్తే కానీ పూట గడవని దుస్థితి.. పోలీసులు మాత్రం ఆమె పొట్టకొడుతూ మూడున్నర నెలలుగా ఠాణా చుట్టూనే తిప్పుతున్నారు.పంద్రాగస్టు సందర్భంగా వార్తా సేకరణకు బషీరాబాద్ పోలీస్స్టేషన్కు వెళ్లిన మీడియా ప్రతినిధులకు దీనస్థితిలో స్టేషన్ ముందు కూర్చున్న ఆమె కంటపడింది. ఆరా తీస్తే ఈ దారుణం వెలుగుచూసింది. బాధితురాలు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కుమారుడిపై కిడ్నాప్ కేసు.. బషీరాబాద్ మండలం నవల్గా గ్రామానికి చెందిన లోహడ నరేష్ (17), కాశీంపూర్ గ్రామానికి చెందిన బాలిక (16) ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని మే 2న ఇంట్లోంచి పారిపోయారు. తమ కూతురును నరేష్ కిడ్నాప్ చేశాడంటూ బాలిక కుటుంబసభ్యులు బషీరాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మే 4న నరే‹Ùపై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. బాలుడి తల్లి కళావతి, తండ్రి నర్సప్ప కూలి పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు. పోలీసులు కళావతిని మే నెలలోనే ఠాణాకు పిలిపించారు. ఎస్ఐ రమేశ్కుమార్ ఆమెను విచారిస్తూ.. ‘నీ కొడుకు మైనర్ పిల్లను ఎత్తుకొనిపోయాడు.వాడు ఎక్కడున్నాడో రెండు రోజుల్లో వెతికి తీసుకురావాలి. లేదంటే వాణ్ణి నేనే పట్టుకొచ్చి తుపాకీతో కాల్చి చంపేస్తా..’అంటూ బెదిరించాడు. దీనికి కళావతి స్పందిస్తూ.. ‘కూలి పనులు చేసుకునే మాకు ఏం తెలుసు సారూ.. వాడు పట్నంలో పనిచేసుకునేవాడు. కాశీంపూర్ పిల్లతో ప్రేమ కుదిరింట. అది పిల్ల తల్లికి కూడా తెలుసు. వారు ఎక్కడికి పోయారో నాకు తెలీదు’ అని చెప్పింది. దీంతో ఎస్ఐ ఒక్కసారిగా ఆవేశానికి లోనై లాఠీతో విచక్షణారహితంగా కొట్టారు. ఆ దెబ్బలకు చేతులు, కాళ్లు వాచిపోయాయని, నడవడానికి కూడా రాలేదని బాధితురాలు వాపోయింది. ‘ఆ రోజు నుంచి ప్రతీ రోజు పోలీస్ స్టేషన్కి వస్తున్నా. రోజూ ఉదయం 9 గంటలకు పోలీస్ స్టేషన్కి వచ్చి కూర్చోవాలి. తాగడానికి నీళ్లు కూడా ఇవ్వరు. ఆకలితో రాత్రి 9 గంటల వరకు ఉండి సారుకు చెప్పి ఇంటికెళ్తున్న. నిన్న ఒక్క రోజే (బుధవారం) స్టేషన్కు రాలేదు’అంటూ ఠాణాకు వెళ్లిన విలేకరులకు చెబుతూ కళావతి కన్నీటి పర్యంతమైంది. రోజు కూలి పనులు చేసుకునే తమకు మూడు నెలలుగా పనిలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఎస్ఐపై చట్టపరమైన చర్యలు తీసుకుని, కళావతికి న్యాయం చేయాలని సీపీఎం జిల్లా నాయకుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. విచారణ జరుపుతాం: అశోక్, సీఐ తాండూరు రూరల్ కిడ్నాప్ కేసు విషయం మా దృష్టిలో ఉంది. కిడ్నాపర్ మైనర్ అయినా అరెస్టు చేయాల్సిందే. విచారణలో భాగంగా బాలుడి తల్లిని బషీరాబాద్ ఎస్ఐ స్టేషన్కు పిలిచి విచారించారు. ఎస్ఐ ఆమెను కొట్టాడనే విషయం మా దృష్టికి రాలేదు. దీనిపై విచారణ జరుపుతాం. -
దళిత మహిళపై షాద్నగర్ పోలీసుల వీరంగం.. సీపీ చర్యలు
సాక్షి, హైదరాబాద్: షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో ఓదళిత మహిళను కర్రలతో కొట్టి హింసించిన పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో మహిళపై దాడి చేసిన షాద్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాంరెడ్డితోపాటు మరో అయిదుగురు కానిస్టేబుళ్లను సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి సస్పెండ్ చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన ఏసీపీ రంగస్వామి తన నివేదికను సీపీకి సమర్పించారు. నివేదిక ఆధారంగా బాధ్యులను గుర్తించి వారిని సస్పెండ్ చేసినట్లు సీపీ వెల్లడించారు.ఏం జరిగిందంటే.. సైబరాబాద్ పరిధిలోని షాద్ నగర్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన సునీత భీమయ్య దంపతులను పోలీసులు ఓ దొంగతనం ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. పక్కింట్లో నివాసముంటున్న నాగేందర్ అనే వ్యక్తి తమ ఇంట్లో బంగారం దొంగతనం జరిగిందని గత నెల 24వ తేదీన షాద్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్న సునీత, భీమయ్య దంపతులపై అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో డీఐ రామిరెడ్డి 26వ తేదీన వీరిని పోలీస్స్టేషన్కు పిలిపించారు. తాము చోరీ చేయలేదని వారు చెప్పడంతో ఇంటికి పంపేశారు. అనంతరం జూలై 30వ తేదీ రాత్రి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి మరో నలుగురు పోలీసు సిబ్బంది రఫీ, మోహన్ లాల్, కరుణాకర్,అ ఖిల.. మొత్తం ఐదుగురు పోలీసులు సునీత భీమయ్య దంపతులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత భర్త భీమయ్యను వదిలేసిన పోలీసులు కుమారుడు 13 ఏళ్ల జగదీష్ను అదుపులోకి తీసుకున్నారు. ఇష్టమొచ్చినట్లు హింసించారు.. అయితే డిఐ రాంరెడ్డి తనను చిత్రహింసలకు గురి చేసినట్టు బాధితురాలు సునీత పేర్కొంది. పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి కన్న కొడుకు జగదీశ్వర్ ముందే అతి దారుణంగా చితకబాదారని ఆరోపించింది. తన చీర విప్పేసి సగం నిక్కరు తొడిగారని, తన భర్త చొక్కా విప్పించి వేసుకోమంటూ కొట్టాురని ఆరోపించింది. ఆ సమయంలో మహిళా పోలీసులెవరూ పక్కన లేరని పేర్కొంది. తన కుమారుడిని కూడా రబ్బరుబెల్టుతో కొట్టారని తెలిపిందిరాత్రి 2 గంటల వరకు చితకబాదడంతో పోలీసుల దెబ్బలకు తాళలేక స్పృహ తప్పి పడిపోగా.. ఫిర్యాదుదారుకు చెందిన వాహనంలోనే తనను ఇంటికి పంపించారని తెలిపింది. మర్నాడు నా భర్తతో కలిసి స్టేషన్కు వెళ్తే.. పిలిచినప్పుడు రావాలని పోలీసులు చెప్పారు. తర్వాత చికిత్స కోసం నేను ఆసుపత్రిలో చేరాను’ అని బాధితురాలు సునీత వివరించారు. -
దళిత మహిళపై పోలీసుల కర్కశత్వం
షాద్నగర్ రూరల్: దొంగతనం కేసులో విచారిస్తామంటూ తీసుకొచ్చిన ఓ దళిత మహిళపై పోలీసులు కర్కషంగా వ్య హరించారు. అంతేకాకుండా ఆమె మైనర్ కుమారుడిపై సై తం విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఆలస్యంగా వె లుగులోకి వచ్చిన ఈ ఘటన సైబరాబాద్ పరిధిలోని రంగా రెడ్డి జిల్లా షాద్నగర్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జూలై 24న చోరీ : షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఫరూఖ్నగర్ ఎస్సీ కాలనీలో నివాసం ఉండే నాగేందర్ ఇంట్లో గత నెల 24న దొంగతనం జరిగింది. తన ఇంట్లో 24 తులాల బంగారంతో పాటు, రూ.2 లక్షల నగదు చోరీ జరిగిందని, దీనికి కాలనీకి చెందిన సునీత, భీమయ్య దంపతులే కారణమంటూ ఆయన షాద్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీసుకొచ్చి.. చితకబాది : కేసు విచారణలో భాగంగా పోలీసులు భీమయ్య అతని భార్య సునీతతో పాటు 13 ఏళ్ల వారి కుమారుడిని గత నెల 30న షాద్నగర్ స్టేషన్కు తీసుకొచ్చారు. దొంగతనాన్ని ఒప్పుకోవాలని డీఐ రామిరెడ్డితోపాటు ఇతర పోలీసు సిబ్బంది తనను, భర్తను విచక్షణారహితంగా కొట్టారని సునీత ఆరోపించింది. కాగా, తల్లి ముందే మైనర్ కొడుకును సైతం పోలీసులు దారుణంగా చితకబాది వారిని అర్ధరాత్రి ఇంటికి పంపించారు. కాగా, పోలీసులు కొట్టిన దెబ్బలకు తాళలేక సునీత నడవడానికి కూడా ఇబ్బందిపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆమెను మరుసటిరోజు స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. చివరకు ఈ విషయం బయటకు తెలియడంతో దళిత సంఘాల నేతలు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సాయంతో ఆదివారం సునీతను షాద్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విచారణకు ఆదేశం : దళిత మహిళపై పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పం కావడం, ఎస్సీ, ఎస్టీ కమిషన్ జోక్యం చేసుకోవడంతో ఉన్నతాధికారులు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని షాద్నగర్ ఏసీపీ రంగస్వామి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పరామర్శ : దళిత మహిళపై పోలీసులు చేసిన దాడి విషయాన్ని తెలుసుకున్న ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ భక్కి వెంకటయ్య, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతంలు షాద్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి బాధితురాలు సునీతను పరామర్శించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ వెంకటయ్య మాట్లాడుతూ.. మహిళ అని చూడకుండా పోలీసులు సునీతను కొట్టడం సరికాదని అన్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధిత మహిళకు న్యాయం చేయాలన్నారు. సైబరాబాద్ కార్యాలయానికి అటాచ్ : దొంగతనం కేసులో దళిత మహిళ, మైనర్ బాలుడిని షాద్నగర్ పోలీసులు చితకబాదిన ఘటనపై ఆదివారం సాయంత్రం సైబరాబాద్ సీపీ మహంతి స్పందించారు. షాద్నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ (డీఐ) రామిరెడ్డిని సైబరాబాద్ కార్యాలయానికి అటాచ్ చేశారు. షాద్నగర్ ఘటనపై సీఎం రేవంత్ సీరియస్ సమగ్ర విచారణకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: బంగారం చోరీ కేసులో ఓ దళిత మహిళ, ఆమె భర్తపై షాద్నగర్ పోలీసులు థర్డ్డిగ్రీ ప్రయోగించి చిత్ర హింసలకు గురి చేసిన ఘటనపై సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం దృష్టికి ఈ విషయం వెళ్లడంతో ఆయన పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఘటనతో సంబంధం ఉందని భావించిన వారిని వెంటనే అక్కడి నుంచి తప్పించి పోలీస్ హెడ్క్వార్టర్స్కు అటాచ్ చేయాలని ఆదేశించారు. ఘటనకు బాధ్యులైన వారు ఎవరూ తప్పించుకోలేరని రేవంత్రెడ్డి స్పష్టంచేశారు. బాధితులకు న్యాయం చేయడంతోపాటు వారికి అండగా ఉంటామని హామీఇచ్చారు. దళిత మహిళపై దౌర్జన్యం హేయమైన చర్య: మాజీ మంత్రి హరీశ్రావు దళిత మహిళపట్ల పోలీసులు కర్కషంగా వ్యవహరించిన తీరుపై మాజీ మంత్రి హరీశ్రావు ఎక్స్ వేదికగా స్పందించారు. ఇది హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకోవాలని దళిత దంపతులను చిత్రహింసలకు గురిచేయడం మానవ హక్కుల ఉల్లంఘనకు నిదర్శనమన్నారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
దళితులపై దాష్టీకం
ధర్మవరం: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో టీడీపీ నాయకుల దాషీ్టకాలు మరింత పెచ్చుమీరాయి. దళిత మహిళలను అకారణంగా చిత్రహింసలకు గురిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ధర్మవరం పట్టణంలోని లక్ష్మీనగర్ బండగుంత వద్ద దళిత మహిళలు పద్మ, కల్పన నివాసం ఉంటున్నారు. ఇంటికి ఎదురుగా ఉన్న కంపచెట్ల వల్ల ఇళ్లలోకి పాములు చేరుతున్నాయని, వాటిని తొలగించాలని మునిసిపల్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో మునిసిపల్ సిబ్బంది సోమవారం కంపచెట్లు తొలగించేందుకు పూనుకున్నారు. విషయం తెలుసుకున్న 34వ వార్డు టీడీపీ ఇన్చార్జ్ ముతుకూరు బీబీ.. ‘వాళ్లు వైఎస్సార్సీపీ వలంటీర్లుగా పనిచేశారు. వాళ్లు చెబితే కంపచెట్లు ఎలా తొలగిస్తార’ంటూ మునిసిపల్ సిబ్బందిపై దౌర్జన్యం చేశారు. దీంతో దళిత మహిళలకు, టీడీపీ వార్డు ఇన్చార్జ్ ముతుకూరు బీబీకి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బీబీ దళిత మహిళలపై చేయిచేసుకుంది. దీంతో వారు కూడా ఆమెను ప్రతిఘటించారు. దీన్ని అవమానంగా భావించిన బీబీ తన సోదరుడైన నాగూర్ హుస్సేన్కు జరిగిన విషయం చెప్పింది. దీంతో అతను అనుచరగణంతో దళిత మహిళలను ఇష్టానుసారం చితకబాదారు. మహిళల ఛాతి, తలపై దాడి చేశారు. కొట్టొద్దంటూ కాళ్లు పట్టుకుని వేడుకున్నా కనికరించలేదు. నాగూరు హుస్సేన్ గతంలో నేరచరితుడు కావడంతో మహిళల హాహాకారాలు విన్న స్థానికులు కనీసం విడిపించే ప్రయత్నం కూడా చేయలేదు. చివరకు బాధిత మహిళలు ఘటనా స్థలంలోనే అపస్మారక స్థితిలో పడిపోయారు. పట్టించుకోని పోలీసులు ఈ అమానుష దాడి సోమవారం జరిగింది. తీవ్రగాయాలతో ఉన్న బాధిత మహిళలు పద్మ, కల్పనను బంధువులు ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. బాధితుల బంధువులు ధర్మవరం టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రభుత్వాస్పత్రిలో సైతం ఎంఎల్సీ (మెడికో లీగల్ కేస్) నమోదు చేయాల్సి ఉన్నప్పటికీ అక్కడా పట్టించుకోలేదు.‘చంపేస్తారు.. కాపాడండి’ ‘సార్.. మేం దళిత మహిళలం. ఇంటిముందు కంపచెట్లు తొలగించమని మునిసిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినందుకు టీడీపీ నాయకులు చెప్పుకోలేని రీతిలో కులం పేరుతో తిడుతూ ఇష్టానుసారం చిత్రవథ చేసి కొట్టారు. పోలీసులకు చెబితే ఎవరూ పట్టించుకోలేదు. మేం సాధారణ మహిళలం. భవిష్యత్లో మమ్మల్ని బతకనిస్తారన్న నమ్మకం లేదు. కచి్చతంగా చంపేస్తారు. దయవుంచి కాపాడండి’ అంటూ ధర్మవరం ఎమ్మెల్యే, మంత్రి సత్యకుమార్ను, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ను సెల్ఫీ వీడియో ద్వారా వేడుకుంటూ బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. బాధితులు ధర్మవరం టూటౌన్ పోలీస్ స్టేషన్లో నాగూర్హుస్సేన్, ముతుకూరు బీబీ, స్టాలిన్, జగ్గు, కుళ్లాయప్ప, జగదీ‹Ù, అల్లాబకాష్ తమపై దాడి చేసినట్టు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై వివరణ కోరేందుకు టూటౌన్ సీఐ అశోక్కుమార్ను సంప్రదించేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. -
Shambhavi Choudhary: అతి చిన్న వయసు దళిత అభ్యర్థి
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిహార్ నుంచి 25 ఏళ్ల శాంభవి చౌదరి ఎన్నికల్లో పోటీ చేయనుంది. దేశంలో అతి చిన్నవయసు మహిళా దళిత అభ్యర్థిగా శాంభవి వార్తల్లో నిలిచింది. రాజకీయ కుటుంబం నుంచి వచ్చినా తాను వేయదగ్గ ముద్ర... తనదైన దృష్టికోణం ఉన్నాయంటున్నది శాంభవి. ‘నేను పనిచేసే చోట స్త్రీలు, యువతే నా లక్ష్యం. వీరికి ఆర్థిక స్వావలంబన, ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తే అభివృద్ధి దానంతట అదే జరుగుతుంది’ అంటోంది శాంభవి చౌదరి. 25 ఏళ్ల 9 నెలల వయసు వున్న ఈ డాక్టరెట్ స్టూడెంట్ బిహార్లోని ‘సమస్తిపూర్’ పార్లమెంట్ స్థానం నుంచి లోక్ జనశక్తి పార్టీ (రామ్విలాస్) తరఫున పోటీ చేయనుంది. ఇది రిజర్వ్డ్ స్థానం. బహుశా శాంభవి దేశంలోనే అత్యంత చిన్న వయసు కలిగిన దళిత మహిళా అభ్యర్థి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో. అందుకే అందరూ ఆమెవైపు ఆసక్తిగా చూస్తున్నారు. రాజకీయ కుటుంబం నుంచి ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఎం.ఏ. సోషియాలజీ చేసి ఇప్పుడు ‘బిహార్ రాజకీయాల్లో కులం, జెండర్ ప్రాధాన్యత’ అనే అంశం మీద పీహెచ్డీ చేస్తున్న శాంభవి రాజకీయ కుటుంబం నుంచి వచ్చింది. ఈమె తండ్రి అశోక్ కుమార్ చౌదరి జెడి (యు)లో మంత్రి. తాత మహదేవ్ చౌదరి కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పని చేశారు. శాంభవి భర్త సాయన్ కునాల్ సామాజిక రంగంలో ఉన్నాడు. ఈమె మామగారు మాజీ ఐ.పి.ఎస్ అధికారి ఆచార్య కిశోర్ కునాల్ దళితుల కోసం చాలా పోరాటాలే చేశాడు. చాలా గుడులలో దళిత పురోహితులను ఆయన నియమించాడు. వీరందరి మధ్యలో చదువు మీద దృష్టి పెట్టి, పరిశోధన కొనసాగిస్తున్న శాంభవి ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో దిగింది. నాకంటూ వ్యక్తిత్వం ఉంది శాంభవి పోటీ చేస్తున్న లోక్ జనశక్తి పార్టీ ఎన్డిఏ కూటమిలో ఉంది. బిజెపి కుటుంబ వారసత్వం గురించి అభ్యంతరం చెప్పడం తెలిసిందే. ‘మీ నాన్నగారు మంత్రి. మరి మీకు సీటిచ్చారు’ అనే ప్రశ్నకు ‘నిజమే. కాని నాకు సీటు రావడంలో ఆయన ప్రమేయం మాత్రం లేదు. చిన్నప్పటి నుంచి నేను మా తాత, నాన్న పేదవాళ్ల సమస్యలు వింటూ వారి కోసం పనిచేయడం చూస్తూ పెరిగాను. అది నామీద ఎక్కడో ప్రభావం చూపింది. దళితుల్లో పుట్టి పెరిగిన వ్యక్తిగా, చదువుకున్న మహిళగా దళితుల పట్ల నాకు అవగాహన ఉంది. రాజకీయ కుటుంబం నుంచి రావడం వల్ల ప్రజలను ఎలా అర్థం చేసుకోవాలో తెలుసు. ఎలక్షన్లు సమీపించేవరకూ నేను నిలబడాలని అనుకోలేదు. కాని సమీపించాక లోక్ జనశక్తి చీఫ్ చిరాగ్ పాశ్వాన్తో చెప్పాను. ఆయన నా భర్తను సొంత తమ్ముడిలా చూస్తారు. అంతేకాదు, బిహార్ రాజకీయాలలో యువత రాణించాలని భావిస్తారు. నాకు అన్ని అర్హతలు ఉన్నాయన్న కారణం రీత్యానే సీట్ ఇచ్చారు’ అని తెలిపిందామె. అత్తగారి ఊరు పట్నాలో పుట్టి పెరిగిన శాంభవి తన అత్తగారి ఊరైన సమస్తిపూర్లో గెలవడానికి సిద్ధమవుతోంది. ‘ఆ ఊరి గురించి నిజం చెప్పాలంటే నాకేమీ తెలియదు. ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. మొదట అక్కడ ఒక ఇల్లు కొని అక్కడే ఉంటానన్న భరోసా కల్పించాలి. ఆ ఊరి యువతతో ఇప్పటికే కాంటాక్ట్లోకి వెళ్లాను. ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుని గెలిపిస్తారు. అవి వమ్ము చేయకుండా ఉండటమే నా ప్రథమ లక్ష్యం’ అంటున్న శాంభవి రాజకీయ జీవితాన్ని త్వరలో ఓటర్లు నిర్ణయిస్తారు. -
బిహార్ బరిలో ఈ 25 ఏళ్ల యువతి హైలైట్!
పాట్నా: లోక్సభ ఎన్నికలకు బిహార్లో లోక్జనశక్తి పార్టీ (రామ్విలాస్) అభ్యర్థులను ప్రకటించింది. ఎన్డీఏ సీట్ల పంపకాల ఒప్పందంలో భాగంగా ఈ పార్టీకి ఐదు సీట్లు దక్కగా మొత్తం ఐదు స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ హాజీపూర్ నుండి పోటీ చేస్తుండగా.. ఆయన లోక్సభకు రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన జామయి సీటును నిలబెట్టుకునేందుకు తన బావ అరుణ్ భారతి ఇక్కడ నుంచి పోటీకి నిలబెట్టారు. ఇక పార్టీ జాబితాలో వైశాలి నుండి టిక్కెట్ పొందిన ఏకైక సిట్టింగ్ ఎంపిగా వీణాదేవి ఉన్నారు. అలాగే రాజేష్ వర్మకు ఖగారియా నుండి టిక్కెట్ ఇచ్చారు. హైలైట్గా శాంభవి చౌదరి జేడీయూ మంత్రి అశోక్ కుమార్ చౌదరి కుమార్తె శాంభవి చౌదరిని రంగంలోకి దింపడం ఈ జాబితాలో హైలైట్. చిరాగ్ బంధువు ప్రిన్స్ రాజ్ ప్రాతినిధ్యం వహించిన సమస్తిపూర్ రిజర్వు స్థానం నుండి ఈమె పోటీ చేస్తున్నారు. 25 సంవత్సరాల తొమ్మిది నెలల వయస్సులో మూడవ తరం రాజకీయవేత్త అయిన శాంభవి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అతి పిన్న వయస్కురాలైన దళిత మహిళ కావచ్చు. ఆమె తాత మహావీర్ చౌదరి కాంగ్రెస్ నుండి బీహార్ మంత్రిగా పనిచేశారు. శాంభవి లేడీ శ్రీ రామ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి సోషియాలజీలో మాస్టర్స్ పూర్తి చేశారు. "బీహార్ రాజకీయాల్లో లింగ, కులాల విభజన"పై డాక్టరేట్ చేస్తున్నారు. బీహార్లోని దేవాలయాలలో అనేక మంది దళిత పూజారులను నియమించిన ఘనత పొందిన మాజీ ఐపీఎస్ అధికారి ఆచార్య కిషోర్ కునాల్ కుమారుడు సాయన్ కునాల్ను వివాహం చేసుకున్నారు. -
దళిత మహిళపై దారుణం: అత్యాచారం, ఆపై ముక్క ముక్కలుగా చేసి..!
ఉత్తరప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. 40 ఏళ్ల దళిత మహిళపై అత్యాచారం చేసి, ముక్కలు ముక్కలుగా నరికి చంపిన ఘటన కలకలం రేపింది. బందా లోని గిర్వాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పటౌరా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండాపోయిందంటూ ప్రతిపక్షం మండి పడింది. పోలీసు అధికారి సమాచారం ప్రకారం రాజ్కుమార్ శుక్లాకు చెందిన పిండి మిల్లును శుభ్రం చేసేందుకు బాధిత మహిళ వెళ్లింది. అయితే ఆమె ఎంతకీ తిరిగి రావడంతో ఆమె కుమార్తె అక్కడికి చేరుకుంది. అయితే అక్కడున్న గది లోపనుంచి గడియ వేసి ఉండటం, తల్లి అరుపులు వినిపిస్తుండటాన్ని గమనించింది. దీంతో స్థానికుల సాయంతో కాసేపటి తలుపులు తెరిచి చూడగా ముక్క ముక్కలుగా పడి ఉన్న తలి మృతదేహాన్నిచూసి తీవ్ర భయాందోళకు లోనైంది. దీంతో ఈఘటనపై పోలీసులను ఆశ్రయించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రధాన నిందితులుగా రాజ్కుమార్ శుక్లా, అతని సోదరుడు బౌవా శుక్లా, రామకృష్ణ శుక్లాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామనీ, ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసు అధికారి తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ హత్యోదంతంతన హృదయాన్ని కలచి వేసిందని, బీజేపీ ప్రభుత్వంపై మహిళలు పూర్తిగా విశ్వాసం కోల్పో యారంటూ ట్వీట్ చేశారు. యూపీలో క్షీణిస్తున్న శాంతిభద్రతలపై బీజేపీ ప్రచారం చేస్తున్న అబద్ధాలకు ఈ ఘటన చెంప పెట్టు లాంటిదంటూ వ్యాఖ్యానించారు. అలాగే ఐఐటి-బిహెచ్యు విద్యార్థినిపట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించి, వీడియో తీసిన ఘటనను యాదవ్ ప్రస్తావించారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ట్విటర్లో షేర్ చేశారు. बांदा में एक दलित के साथ बलात्कार व जघन्य हत्या की जो ख़बर आई है, वो दिल दहला देने वाली है। उप्र की महिलाएं डरी हुई हैं और अंदर-ही-अंदर आक्रोशित भी। साथ ही आईआईटी बीएचयू की महिला छात्रा के साथ अभद्रता के बाद निर्वस्त्र कर वीडियो बनाने की घटना उप्र की क़ानून-व्यवस्था के मुँह पर… pic.twitter.com/g96iu9MFIK — Akhilesh Yadav (@yadavakhilesh) November 2, 2023 -
అదనపు వడ్డీ కట్టలేదని వివస్త్రను చేసి..
పట్నా: సభ్య సమాజం తలదించుకోవాల్సిన దారుణ ఘటన బిహార్లో జరిగింది. ఆపదలో అక్కరకొస్తాయని రూ.1,500 అప్పు తీసుకున్న పాపానికి దళిత మహిళ ఒకరు దారుణ అవమానానికి గురికావాల్సి వచి్చంది. విషయం తెల్సి నిందితులకు కఠిన శిక్ష పడేలాచూడాలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పోలీసులను ఆదేశించారు. బిహార్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్నా జిల్లాలోని ఖుస్రూపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని గ్రామంలో ఈనెల 23వ తేదీ రాత్రి జరిగింది. కొన్ని నెలల క్రితం దళిత మహిళ భర్త.. ప్రమోద్ సింగ్ అనే వ్యక్తి వద్ద రూ.1,500 అప్పుగా తీసుకున్నారు. తర్వాత కొంతకాలానికి వడ్డీతోసహా అసలు మొత్తాన్నీ ప్రమోద్కు చెల్లించేశారు. ఇది సరిపోదని, ఇంకా అదనంగా వడ్డీ కట్టాలని ప్రమోద్ వేధింపులు మొదలుపెట్టారు. అదనంగా ఇచ్చేదేమీలేదని దళిత వ్యక్తి భార్య కరాఖండీగా చెప్పేసింది. దీంతో ఆమెకు ఫోన్ చేసి ‘ అదనపు వడ్డీ కట్టకపోతే నిన్ను నగ్నంగా ఊరిలో ఊరేగిస్తా’ అంటూ ప్రమోద్ చేసిన బెదిరింపులను ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు ఆ గ్రామానికొచ్చి విచారించి వెళ్లారు. పోలీసులు వచి్చన విషయం తెల్సి ప్రమోద్ కోపంతో ఊగిపోయాడు. ఈనెల 23వ తేదీన రాత్రి పదింటికి కొంత మందితో కలిసి దళితుడి ఇంటికొచ్చి అతిని భార్యను బలవంతంగా తన ఇంటికి లాక్కెళ్లాడు. వివస్త్రను చేసి పిడిగుద్దులు కురిపిస్తూ కర్రలతో చావబాదాడు. ప్రమోద్ కుమారుడు అన్షుతో ఆమె నోట్లో మూత్రం పోయించాడు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్న మహిళ మళ్లీ పోలీసులుకు ఫిర్యాదుచేసింది. ప్రమోద్, కుమారుడు అన్షు పరారీలో ఉన్నారని పట్నా సీనియర్ ఎస్పీ రాజీవ్ మిశ్రా చెప్పారు. -
అదనపు వడ్డీ కోసం దళిత మహిళను వివస్త్రను చేసి మూత్రం తాగించి..
పాట్నా: బీహార్లోని పాట్నా జిల్లా మొశింపుర్ గ్రామంలో ఖుర్సుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. రూ.1500 అదనపు వడ్డీ చెల్లించాలంటూ తండ్రీ కొడుకులు ఒక దళిత మహిళపై దారుణానికి ఒడిగట్టారు. ఆమెను వివస్త్రను చేసి కర్రలతో చితకబాది బలవంతంగా ఆమెతో మూత్రం తాగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలి భర్త ప్రమోద్ సింగ్ వద్ద రూ.9000 అప్పుగా తీసుకున్నారని ఆ నగదు మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించినా కూడా రూ.1500 అదనంగా వడ్డీ చెల్లించాలని ప్రమోద్ సింగ్ పలుమార్లు వారిని వేధించాడన్నారు. భార్యభర్తలు ఇద్దరూ అప్పటికే మొత్తం అప్పు తిరిగి చెల్లించామని చెప్పి అదననపు వడ్డీ చెల్లించడానికి తిరస్కరించడంతో శనివారం ప్రమోద్ సింగ్ తన కుమారుడు అన్షు తోపాటు మరో నలుగురు ఆమె ఇంటికి వెళ్లి బలవంతంగా బయటకు లాక్కొచ్చి అందరూ చూస్తుండగానే ఆమెను వివస్త్రను చేశారన్నారు. అనంతరం కర్రలతో చితకబాదాక ప్రమోద్ ఆదేశించగా అన్షు బలవంతంగా ఆమెతో మూత్రం తాగించాడు. అక్కడినుండి ఎలాగోలా తప్పించుకున్న ఆమె పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. బాధితురాలి తలకు తీవ్రగాయాలవ్వడంతో ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ప్రధాన నిందితుడు ప్రమోద్ సింగ్ అతని కుమారుడు అన్షు సహా మిగిలిన ఆనలుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: హైదరాబాద్లో క్షుద్రపూజలు.. నకిలీ ఆయుర్వేద వైద్యుడి అరెస్ట్ -
దివ్యాంగురాలిపై హత్యాచారం ?
రాయచూరు రూరల్: యాదగిరి జిల్లాలో నాలుగు రోజులు క్రితం ఓ యువతిని అటకాయించిన కొందరు దుండగులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన యాదగిరి తాలుకా కంచగారహళ్లి క్రాస్ వద్ద జరిగింది. సచిన్ అనే యువకుడు ఈ ఘటనకు బాధ్యుడిగా పోలీసులు గుర్తించారు. వివరాలు... తల్లిదండ్రులు లేని దివ్యాంగురాలు సవిత (35) సోదరుడితో కలిసి నివాసం ఉంటోంది. నాలుగు రోజుల క్రితం ఆమెకు నిశ్చితార్థం జరిగింది. శనివారం యథావిధిగా ఆమె పొలం పనులకు వెళ్లింది. ఈక్రమంలో సచిన్, అతని స్నేహితులు ఆమెను ఎత్తుకుని ఓ నిర్జన ప్రదేశంలో అత్యాచారం చేసి కత్తితో తీవ్రంగా గాయపరిచి చిత్రహింసలకు గురిచేశారు. చెవి, మెడ, గొంతు వద్ద తీవ్రంగా గాయపరిచారు. సృహతప్పి పడిఉన్న బాధితురాలిని స్థానికులు కలబుర్గి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు -
బొట్లపాలెం ఘటనలో నిందితుల అరెస్ట్
ఒంగోలు టౌన్/దర్శి: కులాంతర వివాహం కేసులో దళిత మహిళను బంధించి పెట్రోలు పోసి హతమార్చేందుకు ప్రయత్నించిన ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఎస్పీ మలికా గర్గ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. దర్శి మండలం బొట్లపాలేనికి చెందిన గంగిరెడ్డి బ్రహ్మరెడ్డి, పుల్లమ్మల కుమార్తె భార్గవి.. అదే గ్రామానికి చెందిన దళితుడు జక్కుల సాయిరాంను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తమ కుమార్తె కులాంతర వివాహం చేసుకోవడం ఇష్టంలేని బ్రహ్మారెడ్డి దంపతులు ఆ కుటుంబంపై కక్ష పెంచుకున్నారు. సోమవారం అర్ధరాత్రి మంచినీళ్లు పట్టుకునేందుకు కొళాయి వద్దకు వెళ్లిన సాయిరాం తల్లి అనురాధ, సోదరి కామునూరి మౌనిక మీద దాడి చేసి విచక్షణరహితంగా కొట్టారు. మౌనికను దుస్తులు చింపేసి ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. తమ ఇంటి వరండాలో ఆమెను తాళ్లతో కట్టేసి పెట్రోలు పోసి హతమార్చేందుకు యత్నించారు. అయితే ఈ లోపు అనురాధ స్థానికుల సాయంతో 100కు కాల్ చేయడంతో వెంటనే దర్శి ఎస్ఐ డి.రామకృష్ణ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని యువతిని కాపాడారు. చికిత్స నిమిత్తం పోలీస్ వాహనంలో దర్శి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఎస్పీ ఆదేశాల మేరకు ట్రైనీ ఐపీఎస్ అంకితా సురాన ఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేసిన దర్శి డీఎస్పీ టి.అశోక్వర్థన్.. మంగళవారం మధ్యాహ్నం తూర్పు గంగవరం బస్టాండ్ సెంటర్లో నిందితులను అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన నిముషాల్లోపే అక్కడికి చేరుకున్న పోలీసులు గంటలోపే కేసు రిజిస్టర్ చేశారు. వీలైనంత త్వరగా కోర్టులో చార్జిషీటు దాఖలు చేస్తామని, నిందితులకు శిక్ష పడేలా చేస్తామని ఎస్పీ వివరించారు. కాగా, దళిత మహిళలపై దాడి ఘటనలో నిందితులు గంగిరెడ్డి బ్రహా్మరెడ్డి, భార్య పుల్లమ్మలకు ఈ నెల 29 వరకు రిమాండ్ విధిస్తూ బుధవారం దర్శి ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ తీర్పునిచ్చారు. -
రాజస్తాన్లో ఘోరం.. మహిళపై రేప్.. ఆపై సజీవదహనం
జైపూర్: రాజస్తాన్లో ఘోరం జరిగింది. ఓ దుర్మార్గుడు దళిత మహిళపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం ఆమెకు నిప్పంటించాడు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచింది. బార్మెర్ జిల్లాకు చెందిన దళిత మహిళ(30) ఈ నెల 6న రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన షకూర్ఖాన్ అనే వ్యక్తి బలవంతంగా లోపలికి ప్రవేశించాడు. ఆమెపై లైంగికదాడికి పాల్పడిన అనంతరం యాసిడ్ వంటి ద్రావకాన్ని ఒంటిపై పోసి, నిప్పంటించి పరారయ్యాడు. 50 శాతం గాయాలపాలైన బాధితురాలు జోథ్పూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి చనిపోయారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు నిందితుడు ఖాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
దళిత మహిళ ఆదిలక్ష్మిపై పరిటాల సునిత వర్గీయుల దాడి
-
అనంత: టీడీపీ నేతల దౌర్జన్యకాండ.. మహిళపై సునీత వర్గీయుల దాడి
సాక్షి, అనంతపురం: జిల్లాలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ దళితురాలిపై పరిటాల సునీత వర్గీయులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఆమెను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు బంధువులు. ఈ దాడిలో గాయపడిన ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పరిటాల వర్గీయులు తనను వేధిస్తన్నారని, వాళ్ల నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఆదిలక్ష్మి చెబుతోంది. అంతేకాదు బాధితురాలు గత నెలలో పరిటాల సునీతకు తన సమస్య చెప్పే ప్రయత్నం చేసినా.. ఫలితం లేకుండా పోయిందని చెబుతోందామె. -
ఆత్మగౌరవ వజ్రాయుధం... దాక్షాయణి వేలాయుధం
రాజ్యాంగ రూపకల్పన ఒక మహాయజ్ఞంలా సాగింది. ఆనాటి రాజ్యాంగ సభలో మొత్తం సభ్యుల సంఖ్య 299 కాగా, అందులో 15 మంది మహిళలు ఉన్నారు. వారిలో ఒకరైన దాక్షాయణి వేలాయుధం రాజ్యాంగ సభకు ఎంపికైన తొలి దళిత మహిళగా చరిత్రలో నిలిచిపోయారు. కొచ్చి (కేరళ)లోని ములవుకాడ్ అనే లంక గ్రామంలో పులయార్ కమ్యూనిటికీ చెందిన ఒక కుటుంబంలో 1912లో జన్మించింది దాక్షాయణి. పులయార్లు ప్రధానంగా వ్యవసాయకూలీలు. శ్రమదోపిడికి, అవమానాలకు గురయ్యేవాళ్లు. వాళ్ల చుట్టూ ఎన్నో ముళ్లకంచెలు ఉండేవి. ‘అందరూ నడిచే బాటలో నడవకూడదు’ ‘అందరూ వెళ్లే బావిలో నుంచి నీళ్లు తీసుకోకూడదు’ ‘ఖరీదైన దుస్తులే కాదు ఒక మాదిరి దుస్తులు కూడా ఒంటి మీద కనిపించకూడదు’... వంటివి. అయితే, దాక్షాయణి పుట్టిన కాలంలోనే ఒక ప్రశ్న కూడా పుట్టింది.‘అయ్యా! మేమూ మీలాగే మనుషులం కదా. మమ్మల్ని ఇలా ఎందుకు హీనంగా చూస్తున్నారు?’ అని అడిగింది ఆ ప్రశ్న.పులయార్ల సంస్కర్త అయ్యన్కాలీ ఉద్యమ గొంతు సవరించడానికి సిద్ధమవుతున్న కాలం అది. సాధారణంగా పులయార్ల ఇండ్లలో అమ్మాయి పుడితే అజ్కి, పుమల, చక్కి, కిలిపక్క.. అనే పేర్లు మాత్రమే పెట్టేవారు. అయితే ఒక అమ్మాయికి ‘దాక్షాయణి’ అని నామకరణం చేయడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. నామకరణ సరళిలో మార్పు తీసుకువచ్చింది. ‘ఆమె జీవితంలో ఎన్నో ఉద్యమాలు, ఎన్నో చారిత్రక అస్తిత్వాలు ఉన్నాయి’ అంటారు దాక్షాయణి కూతురు మీరా వేలాయుధం. ఆరోజుల్లో నిమ్నవర్గాలకు చెందిన పిల్లలు స్కూలు గడప తొక్కడం అనేది ఊహకు అందని విషయం. ఎన్నో ప్రతికూల పరిస్థితులు, అవమానాలను తట్టుకొని ఉన్నత చదువులు చదువుకుంది దాక్షాయణి. 1945లో కొచ్చి లెజిస్లేటివ్ కౌన్సిల్కు ఎంపికైంది. విశిష్టమైన రాజ్యాంగ నిర్మాణంలో భాగమై తన సమకాలీన తరానికి, భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచింది దాక్షాయణి వేలాయుధం. -
దళిత బాలికపై అమానుషం.. కాళ్లు కట్టేసి.. కర్రతో కొట్టి
లక్నో: ఉత్తర ప్రదేశ్లో అమానుష ఘటన చోటుచేసుకుంది. దొంగతనం పేరుతో ఓ దళిత బాలికను చిత్రహింసలు పెట్టారు. కాళ్లు చేతులు కట్టేసి, తీవ్ర వేధింపులకు గురిచేశారు. యూపీలోని అమేథీ జిల్లాలోని రాయ్పూర్ పుల్వారీ పట్టణంలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొందరు వ్యక్తులు 16ఏళ్ల దళిత బాలికను బంధించి చితకబాదారు. దొంగతనం పేరుతో కాళ్లు చేతులు కట్టేసి దాడి చేశారు. ఇద్దరు వ్యక్తులు బాలికను కింద పడేయగా.. మరో వ్యక్తి ఆమె రెండు కాళ్ల కళ్ల మధ్య కర్రను ఉంచి మరో కర్రతో కొడుతూ క్రూరంగా ప్రవర్తించాడు. అక్కడే ఉన్న ముగ్గురు మహిళలు సైతం దాడిని అడ్డుకోకుండా నిందితులకు సహకరించారు. బాలిక నొప్పి పుడుతుందని చెబుతున్నా కూడా ఎలాంటి కనికరం లేకుండా వ్యక్తి ఆమెను నేల మీద జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ యూపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ అమానవీయ చర్యకు పాల్పడిన నేరస్థులను 24 గంటల్లో పట్టుకోకపోతే, తీవ్ర ఆందోళనలతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ కృషి చేస్తోందని ట్వీట్ చేశారు. ‘అమేథీలో దళిత బాలికపై నిర్దాక్షిణ్యంగా కొట్టిన ఘటనను ఖండిస్తున్నాం. యోగీ ఆదిత్యానాథ్ పాలనలో ప్రతిరోజూ సగటున 34 దళితులపై, మహిళలపై 135 నేరాలు జరుగుతున్నాయి, అయినా మీ శాంతిభద్రతలు నిద్రపోతున్నాయి.’ అంటూ చురకలంటించారు. చదవండి: వివాహితకు మరో వ్యక్తితో పరిచయం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి अमेठी में दलित बच्ची को निर्ममता से पीटने वाली ये घटना निंदनीय है। @myogiadityanath जी आपके राज में हर रोज दलितों के खिलाफ औसतन 34 अपराध की घटनाएं होती हैं, और 135 महिलाओं के ख़िलाफ़, फिर भी आपकी कानून व्यवस्था सो रही है।…1/2 pic.twitter.com/mv1muAMxkr — Priyanka Gandhi Vadra (@priyankagandhi) December 29, 2021 అదే విధంగా అమేథీ ఎంపీ, మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ సైతం ఈ ఘటనపై స్పందిస్తూ.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఇక అమేథీ ఎస్పీ స్పందిస్తూ.. ముగ్గురు నిందితులు శుభ గుప్తా, రాహుల్ సోని, సూరజ్ సోనిని అరెస్ట్ చేశామని తెలిపారు. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. తన కూతురికి మతిస్థిమితం సరిగా లేదని, దారి మరిచిపోవడం వల్ల ఆ ఇంట్లోకి పొరపాటున వెళ్లిందని బాధితురాలి తండ్రి తెలిపారు. దీంతో దొంగతనం చేసిందనన్న నెపంతో కూతురిపై ఇలా దాడి చేశారని ఆరోపించారు. చదవండి: బాలిక హత్యాచార కేసు: జడ్జికి చేదు అనుభవం! -
‘భోజనమాత’పై వివక్ష.. దళిత మహిళ వండిన ఆహారం మాకొద్దు
డెహ్రడూన్: కుల వివక్ష ఇప్పటికీ ఎంత తీవ్రంగా ఉందో చెప్పే ఘటన ఉత్తరాఖండ్లోని చంపావత్ జిల్లా సుఖిందాంగ్లో చోటుచేసుకుంది. దళిత మహిళ వండిన ఆహారాన్ని తినడానికి అగ్రవర్ణ పిల్లలు నిరాకరించారు. దాంతో పాఠశాల బాధ్యులు ఆమెను తొలగించి మరో వివక్షాపూరిత చర్యకు పాల్పడ్డారు. పాఠశాలల్లో మధ్యాహ్నభోజనం వండి, వడ్డించే మహిళలను ఉత్తరాఖండ్లో ‘భోజనమాత’గా సంబోధిస్తారు. కొద్దిరోజుల కిందట ఈ బడిలో భోజనమాత పోస్టు కోసం ఇంటర్వ్యూలు నిర్వహించారు. అగ్రవర్ణ మహిళ కూడా ఇంటర్వ్యూకు వచ్చినా ఆమెను కాదని దళిత మహిళను ఎంపిక చేయడంపై పిల్లల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తర్వాత సదరు మహిళ వండిన ఆహారాన్ని తినడానికి పిల్లలు నిరాకరించారు. మొత్తం 66 మంది పిల్లల్లో 40 మంది పాఠశాలలో పెట్టే మధ్యాహ్న భోజనాన్ని తినడం మానివేసి ఇంటి నుంచి లంచ్ బాక్స్లు తెచ్చుకోవడం మొదలుపెట్టారు. దీంతో దళిత మహిళను తొలగించి ఆమె స్థానంలో మరొకరికి తాత్కాలికంగా నియమించారు పాఠశాల బాధ్యులు. అయితే చంపావత్ జిల్లా విద్యాధికారి పి.సి.పురోహిత్ వాదన మాత్రం భిన్నంగా ఉంది. దళిత మహిళ నియామకంలో నిబంధనలను పాటించలేదని, ఉన్నతాధికారులు ఆమోదముద్ర వేయకుండానే సదరు మహిళను భోజనమాతగా నియమించారని పురోహిత్ చెప్పుకొచ్చారు. అందుకే ఆమె నియామకాన్ని రద్దు చేశామని చెప్పారు. (చదవండి: మతమార్పిడి నిరోధక బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం) -
MadhyaPradesh: దళిత కుటుంబంపై దాష్టీకం
మధ్యప్రదేశ్లో దాష్టీకం చోటు చేసుకుంది. పిలిస్తే పనులకు రాలేదని ఓ దళిత కుటుంబంపై దాడి చేసి మూడు రోజులపాటు బంధించారు. గర్భవతి అని కూడా చూడకుండా ఓ మహిళను కిరాతకంగా హింసించారు. ఈ ఘటన అక్కడి సోషల్ మీడియాను కుదిపేయడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. భోపాల్: మధ్యప్రదేశ్ ఛాతర్పూర్ జిల్లా బండార్ఘడ్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. పొలం పనులకు రాలేదని ఓ దళిత కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. గర్భంతో ఉన్న మహిళపై రాడ్లతో దాడి చేశారు. ఆపై మూడు రోజులు ఇంట్లోనే బంధించారు. ఆలస్యంగా ఈ ఘటన పోలీసుల దృష్టికి వెళ్లడంతో నిందితుల కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గ్రామంలో స్వర్ణ కులానికి చెందిన ఓ వ్యక్తి, బాధిత కుటుంబాన్ని పోలం పనులకు రావాలని పిలిచాడు. అయితే వేరే పనులు ఉండడంతో తర్వాత వస్తామని వాళ్లు చెప్పారు. దీంతో కోపంతో ఊగిపోయిన ఆ వ్యక్తి కొందరిని వెంటేసుకుని ఆ ఇంటికి వెళ్లాడు. బాధిత మహిళను, ఆమె అత్తను కులం పేరుతో దూషిస్తూ.. దాడికి పాల్పడ్డాడు. ఆపై ఇంట్లో మగవాళ్లను చంపుతామని బెదిరించాడు. మూడు రోజులపాటు ఇంట్లోనే బంధించి.. ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించి వదిలేశారు. అయితే కొందరు యువకుల సాయంతో విషయం పోలీసులకు చేరడంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్తో నిందితుల కోసం గాలిస్తున్నామని రాజ్నగర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ పంకజ్ శర్మ తెలిపారు. అత్యాచారం? కాగా, ఈ ఘటనలో బాధితురాలిపై అత్యాచారం జరిగిందని దళిత సంఘాలు సోషల్ మీడియాలో ఉద్యమిస్తున్నాయి. ఐదు రోజులు ఆ కుటుంబం నరకం అనుభవించిందని, పిల్లల కళ్లెదుటే ఆమెపై నిందితులు అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై పోలీసులు స్పందించకపోగా.. కేసు దర్యాప్తు పూర్తయ్యాకే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అంటున్నారు. #Horrific A pregnant dalit woman from Chattarpur MP brutally beaten and raped by caste Hindu patel community. The Dalit refuses to work on the fields of Patel, then the oppressed hold the family hostage for 5 days, raping the pregnant mother in front of the children for 4 days... pic.twitter.com/3iMUNqOHjV — The Dalit Voice (@ambedkariteIND) May 29, 2021 -
కన్నీటి రుచి తెలిసింది మాకే
మధ్యప్రదేశ్లో ఓ కుగ్రామం. పేరు కుంజన్ పూర్వ. అక్కడ దాదాపుగా అన్ని కుటుంబాలూ చదువుసంధ్యల పట్ల పెద్దగా పట్టింపులేనివే. పుట్టింది ఆడపిల్ల అని తెలిసినప్పటి నుంచి ఎంత త్వరగా పెళ్లి చేసి అత్తవారింట్లో వదిలి పెడదామా అనే ధ్యాస తప్ప ఆడపిల్లను కూడా చదివిద్దాం అనే ఆలోచన ఏ మాత్రం లేని అనేక కుటుంబాల్లో అదీ ఓ కుటుంబం. తన చుట్టూ చాలామంది ఆడపిల్లల్లాగానే ఈ అమ్మాయి కూడా పన్నెండేళ్లకే పెళ్లి పీటల మీద కూర్చోవాల్సి వచ్చింది. అక్కడితో తన ఆలోచనలకు పరిసమాప్తి పలికి వంటగది కే పరిమితమై ఉంటే ఈ రోజు ఆమె గురించి మాట్లాడుకోవడానికి ఏ ప్రత్యేకతా ఉండేది కాదు. అయితే ఆమె వేసిన అభ్యుదయపు అడుగులే కవితాదేవి అనే ఒక సామాన్య దళిత మహిళను ఈ రోజు ఎడిటర్స్ గిల్డ్ మెంబర్ను చేశాయి. కన్నీటి రుచి తెలిసింది మాకే కవితాదేవి ‘ఖబర్ లహరియా’ అనే పత్రికకు ఎడిటర్. ఆమె స్థాపించిన డిజిటల్ రూరల్ నెట్వర్క్లో ముప్పై మంది రిపోర్టర్లు సేవలందిస్తున్నారు. అందరూ మహిళలే. రిపోర్టందరూ మహిళలే ఎందుకని ఆమెను అడిగిన వాళ్లకు ‘మా వెనుకబడిన ప్రాంతంలో జర్నలిజం మగవాళ్ల కే పరిమితం అనే అపోహ ఇంకా రాజ్యమేలుతూనే ఉంది. ఆ అపోహను తుడిచేయడానికే’ అంటారామె. అలాగే ‘మా పత్రికలో ప్రధానం గా మహిళల సమస్యలను, ముఖ్యంగా దళిత మహిళలు సమాజంలో ఎదుర్కొనే సమస్యలనే ప్రస్తావిస్తాం. అలాగే కష్టాలకు ఎదురు నిలిచి మేము సాధించిన విజయాలను కూడా గొప్పగా చెప్పుకుంటాం. మగవాళ్లకు అది చిన్న విజయంగా తోచవచ్చు. కానీ మా కష్టాలు మాకే బాగా అర్థమవుతాయి. మా చిన్న గెలుపు కూడా మాకు గొప్పగానే ఉంటుంది. మాకు ఎదురయ్యే కష్టం మరో మగవాడి నుంచే. ఒక మగవాడి కారణంగా మాకు కలిగే బాధను మరో మగవాడు మనసు పెట్టి అర్థం చేసుకోగలడా అనేది కూడా సందేహమే. కన్నీళ్ల రుచి ఎరిగిన మగవాళ్లు ఎంతమంది ఉంటారు? అందుకే మా పత్రిక కు వార్తలను, వార్తాకథనాలను అందించే రిపోర్టర్లందరూ మహిళలే’ అంటూ సున్నితమైన మరో కారణాన్ని కూడా వివరించారు కవితాదేవి. ఇలా మొదలైంది కవితాదేవి పెళ్లయి అత్తగారింట్లో అయోమయంగా రోజులు గడుపుతున్న కాలమది. దళిత వాడల్లో మహిళలకు ఎదురయ్యే కష్టాలను అక్షరబద్ధం చేయాలనే ఉద్దేశంతో ఆ గ్రామానికి ఒక ఎన్జీవో వచ్చింది. ఆ ఎన్జీవో సభ్యులు ఉత్సాహవంతులైన మహిళలకు వార్తలు రాయడంలో శిక్షణనిచ్చారు. ఆ శిక్షణకు హాజరు కావడం కోసం ఇంట్లో వాళ్ల అనుమతి కావాలి. అనుమతి సంపాదించడం కవితాదేవికి ఒక పోరాటమే అయింది. శిక్షణ తర్వాత బుందేలీ భాషలో విడుదలయ్యే ‘మహిళాదకియా’ మంత్లీ న్యూస్లెటర్కు రిపోర్టర్గా సేవలందించింది కవితాదేవి. ఉత్తరప్రదేశ్లోని కుగ్రామాల మహిళలకు ఆ పత్రిక ఒక ఆశ్చర్యం, తమ గురించి కూడా పేపర్లో అచ్చు కావడం వాళ్లకు పెద్ద అబ్బురం. పత్రిక కోసం ఎదురు చూడడం అలవాటైంది వాళ్లకు. కొంతకాలానికి ఆ పత్రిక ఆగిపోవడంతో తీవ్రమైన నిరుత్సాహానికి లోనయ్యారంతా. అప్పుడు కవితాదేవి ఢిల్లీకి చెందిన మరో ఎన్జీవో సహకారంతో తనే స్వయంగా ‘ఖబర్ లహరియా’ అనే డిజిటల్ మ్యాగజైన్ను ప్రారంభించింది. ప్రధాన స్రవంతి మీడియా దృష్టి పెట్టని మహిళల కష్టాలను మహిళ కళ్లతో చూసి, మహిళ మనసుతో అర్థం చేసుకుని అక్షరీకరించడం వల్లనే తమ పత్రిక అనతికాలంలోనే పాఠకాదరణ పొందిందని చెబుతారు కవితాదేవి. ప్రస్తుతం ఖబర్ లహరియాకు వివిధ డిజిటల్ మాధ్యమాల్లో కోటి మంది పాఠకులున్నారు. -
కోర్టులో హాజరైన హాథ్రస్ బాధిత కుటుంబీకులు
లక్నో: యూపీలోని హాథ్రస్లో నలుగురు యువకుల చేతిలో సామూహిక అత్యాచారానికి, హత్యకు గురైన దళిత యువతి కుటుంబ సభ్యులు అలహాబాద్ హైకోర్ట్ లక్నో బెంచ్ ఎదుట హాజరయ్యారు. కేసును కోర్టు విచారించి తదుపరి విచారణను నవంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది. బాధితురాలి తల్లి, తండ్రి, ఆమె ముగ్గురు సోదరులు కోర్టుకొచ్చారు. బాధిత యువతి శవాన్ని దహనం చేయడంలో, పై అధికారుల నుంచి ఎటువంటి ఒత్తిళ్లు లేవని, శాంతి భద్రతలను పరిగణనలోనికి తీసుకొని, రాత్రే దహనసంస్కారాలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు జిల్లా కలెక్టర్ కోర్టుకి తెలిపారు. కేసు విచారణ ప్రస్తుతం ఏ స్థాయిలో ఉందో తెలియజేయాలంటూ కోర్టు అధికారులకు ఆదేశాలు జారీచేసింది. సెప్టెంబర్ 14న అత్యాచారానికి గురైన యువతి ఢిల్లీ ఆసుపత్రిలో మరణించింది. ఆ తరువాత హడావిడిగా యువతి భౌతిక కాయాన్ని దహనం చేశారంటూ జిల్లా అధికార యంత్రాంగం ఆరోపణలెదుర్కొంటోంది. -
నేడు హైకోర్టుకు హాథ్రస్ బాధిత కుటుంబం
లక్నో/హాథ్రస్: ఉత్తరప్రదేశ్లోని హాథ్రస్ జిల్లాలో కామాంధుల రాక్షసత్వానికి ప్రాణాలు కోల్పోయిన దళిత యువతి కుటుంబ స భ్యులు సోమవారం అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ముందు హాజరు కానున్నారు. పటిష్టమైన భద్రత మధ్య వారిని న్యాయస్థానానికి తీసుకెళ్లేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. యువతిపై అత్యాచారం, హత్య కేసు లో బాధిత కుటుంబ సభ్యుల వాదనను కోర్టు నమోదు చేయనుంది. జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ రంజన్ రాయ్తో కూడిన డివిజన్ బెంచ్ ఈ కేసును సోమవారం విచారించనుంది. ధర్మాసనం ముందు హాజరు కావాలని యూపీ అదనపు చీఫ్ సెక్రెటరీ(హోం), డీజీపీ, జిల్లా కలెక్టర్, ఎస్పీని సైతం హైకోర్టు ఆదేశించింది. ప్రభు త్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ వీకే సాహిని హాజరుకానున్నారు. రంగంలోకి దిగిన సీబీఐ.. హాథ్రస్ ఘటనను విచారించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) రంగంలోకి దిగింది. ఆదివారం ఉదయం సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సామూహిక అత్యాచారం, హత్య, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసింది. సీబీఐ ఘజియాబాద్కు చెందిన ప్రత్యేక టీమ్ ఈ కేసును విచారిస్తుందని అధికారులు తెలిపారు. -
న్యాయం జరిగేదాకా పోరుబాటే
లక్నో/హాథ్రస్/న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని హాథ్రస్ గ్రామంలో కామాంధుల కిరాతకానికి బలైపోయిన 19 ఏళ్ల దళిత యువతి కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేదాకా తమ పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ తేల్చిచెప్పారు. శనివారం వారు హాథ్రస్లో బాధితురాలి కుటుంబ సభ్యులను ఆమె ఇంట్లో పరామర్శించారు. ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలంటూ ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అన్యాయానికి వ్యతిరేకంగా.. బిడ్డను కోల్పోయిన బాధిత కుటుంబానికి న్యాయం జరిగేదాకా పోరాడుతామని ప్రియాంక అన్నారు. బాధితుల గొంతును ఎవరూ నొక్కలేరని రాహుల్ అన్నారు. రాహుల్, ప్రియాంక రాక సందర్భంగా హాథ్రస్లో బాధిత యువతి ఇంటి వద్దకు భారీగా జనం చేరుకున్నారు. కాగా, హత్యాచార ఘటనపై సీబీఐ విచారణకు ముఖ్యమంత్రి యోగి ఆదేశించారు. ఢిల్లీ–యూపీ సరిహద్దులో హైడ్రామా ఢిల్లీ–ఉత్తరప్రదేశ్ సరిహద్దులోని ఢిల్లీ–నోయిడా డైరెక్టు ఫ్లైవే(డీఎన్డీ) వద్ద శనివారం హైడ్రామా చోటుచేసుకుంది. ఢిల్లీకి 180 కిలోమీటర్ల దూరంలోని హాథ్రస్కు వెళ్లి, బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంకా అక్కడికి చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి రావడం, పోలీసులు భారీగా మోహరించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు, కేకలతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది. చివరకు, కోవిడ్ నిబంధనల దృష్ట్యా రాహుల్, ప్రియాంకసహా ఐదుగురు కాంగ్రెస్ నేతలనే హాథ్రస్కు వెళ్లడానికి యూపీ పోలీసులు అంగీకరించారు. దీంతో శనివారం సాయంత్రం వారు తమ వాహనాల్లో ముందుకు కదిలారు. మరోవైపు హాథ్రస్ చుట్టూ ఉన్న బారికేడ్లను పోలీసులు శనివారం తొలగించారు. ఆంక్షలను ఎత్తి వేశారు. గ్రామంలోకి మీడియా ప్రతినిధులను వెళ్లనిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ అదనపు చీఫ్ సెక్రెటరీ(హోం) అవనీశ్ అవస్తి, డీజీపీ హెచ్సీ అవస్తి కూడా శనివారం హాథ్రస్లో యువతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం న్యాయం చేస్తుందని, యువతి మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షిస్తుందని హామీ ఇచ్చారు. వారణాసిలో శనివారం కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ వాహన శ్రేణిని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. అనంతరం స్మతి ఇరానీ విలేకరులతో మాట్లాడారు. హాథ్రస్ అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. దళిత యువతిపై జరిగిన కిరాతకం విషయంలో సాధారణ దర్యాప్తుతో ప్రజలు సంతృప్తి చెందడం లేదని బీఎస్పీ చీఫ్ మాయావతి చెప్పారు. హాథ్రస్కు వెళ్లకుండా ప్రియాంక దుస్తులు పట్టుకుని అడ్డుకుంటున్న పోలీసు -
కృష్ణా పోలీసుల పెద్ద మనసు
సాక్షి, కృష్ణా/కైకలూరు: దళితులపై దాడులకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించవద్దన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. బాధితులకు అండగా నిలవడమే కాకుండా తమ సేవాగుణాన్ని కూడా చాటుకుంటున్నారు. కృష్ణా జిల్లాలో ఒక దళిత యువతి విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం అయినంపూడి గ్రామానికి చెందిన దళిత యువతి (22) అదే మండలం వడాలికి చెందిన మంద సాయిరెడ్డి(24) నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. అయితే యువతిని వివాహం చేసుకునేందుకు సాయిరెడ్డి నిరాకరించడంతో ఆమె ముదినేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు సాయిరెడ్డిని రిమాండ్కు తరలించారు. యువతిని కొంతమంది బెదిరించడంతో మరో కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు యువతి ఇంటికి నిప్పుపెట్టారు. ఈ ఘటనపైనా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: నెల్లూరులో బాలుడి కిడ్నాప్ కలకలం) పోలీసుల సేవా గుణం ఇంటి దగ్ధం విషయం తెలుసుకున్న కృష్ణా జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్బాబు వెంటనే స్పందించి బాధితులను ఆదుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. దీంతో గుడివాడ డీఎస్పీ ఎన్. సత్యానందం సిబ్బందితో గురువారం బాధితుల వద్దకు వెళ్లి రూ.25 వేలు నగదు, మరో రూ.25వేలు విలువ చేసే నిత్యావసర సరుకులు, నూతన వస్త్రాలు అందించారు. ఇంటి నిర్మాణానికి పోలీసుల తరఫున పూర్తి సాయం అందిస్తామని ఎస్పీ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఇల్లు దగ్ధం కేసులో విచారణ జరుపుతున్నామని చెప్పారు. ముఖ్యంగా అర్ధరాత్రి ఇల్లు దగ్ధమవుతున్న సమయంలో ఎస్ఐ మణికుమార్ తన సిబ్బందితో కలిసి మంటలు అదుపు చేయడానికి చేసిన ప్రయత్నాన్ని స్థానికులు అభినందిస్తున్నారు. దాడులకు పాల్పడుతున్నవారి విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు బాధితులకు భరోసా కల్పిస్తోందని దళిత సంఘాలు అభినందిస్తున్నాయి. -
దళిత మహిళకు సీటు.. ఎన్నికల బహిష్కరణ
చెన్నై: కుల వివక్ష నేటికీ కొనసాగుతోందనడానికి ఉదాహరణగా నిలిచారు తమిళనాడుకు చెందిన తూత్తుకుడి గ్రామస్తులు. అక్కడ పంచాయతీ ప్రెసిడెంట్ కోసం శుక్రవారం నిర్వహించిన ఎన్నికల్లో దళిత మహిళకు సీటు కేటాయించడంతో నాడార్ కులానికి చెందిన వారు ఏకంగా ఆ ఎన్నికలనే బహిష్కరించారు. పిచ్చావిళై గ్రామంలో 785 ఓటర్లలో ఆరుగురు దళితులు పంచాయతీ ప్రెసిడెంట్ కోసం నిర్వహించిన ఎన్నికల్లో ఓటు వేశారు. నాడార్ కులానికి చెందిన మిగతా 779 మంది ఓటర్లు ఎన్నికల్లో ఓటు వేయకుండా వారి ఇళ్ల ముందు నల్లటి జెండాలను ఉంచి నిరసనలను తెలిపారు. తాలూకా అధికారి వారిని ఓటు వేయాలని కోరినప్పటికీ వారు దాన్ని పెడచెవిన పెట్టి బహిష్కరించారు. ‘సీట్ల కేటాయింపు న్యాయంగా లేదు. మేం ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ మాకు నచ్చిన అభ్యర్థిని ఉంచడానికి అనుమతించలేదు. అందుకే మేం ఎన్నికలను బహిష్కరించాం’అని మడిసుదు అనే స్థానికుడు తెలిపారు. -
దళిత మహిళకు అన్యాయం
-
ప్రతి దానికీ పితాని ఇబ్బంది పెట్టారు
-
దళితురాలిననే వివక్ష
పశ్చిమగోదావరి ,ఏలూరు (మెట్రో) : ‘దళిత మహిళను కాబట్టే నాకు తీవ్ర అన్యాయం చేశారు. ప్రజలచే ఎన్నుకోబడినా మంత్రి పితాని అధికారంతో ఏ పనులూ చేయలేకపోయా, అవమానం భరించలేక, అడుగడుగునా మంత్రి పితాని అడ్డుపడటంతోనే ఎంపీపీ పదవికి రాజీనామా చేస్తున్నాను’ ఇవి అధికార పార్టీకి చెందిన పెనుగొండ మండల ఎంపీపీ సురేఖ వ్యాఖ్యలు. తెలుగుదేశంలో అంతర్గత విభేదాలు ఒక్కొక్కటిగా బయట పడుతూనే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా పెనుగొండ మండల ఎంపీపీ పదవి వివాదం రాజీనామా వరకు వెళ్లింది. పెనుగొండ ఎంపీపీగా ఎప్పటి నుండో పార్టీని అంటిపెట్టుకుని ఉండే సురేఖకు పార్టీ నాయకులు పగ్గాలు అందించారు. అయితే చివరి నిమిషంలోటీడీపీలో చేరిన పితాని సత్యనారాయణ ఎమ్మెల్యేగా విజయం సాధించి అనంతరం మంత్రి పదవి చేపట్టారు. ఇక్కడ వరకూ బాగానే ఉన్నప్పటికీ సురేఖ పితాని వర్గం కాకపోవడంతో మరో వ్యక్తిని ఎంపీపీగా నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో సురేఖ ఎంపీపీగా రెండున్నరేళ్లు, పితాని వర్గం వ్యక్తి మరో రెండున్నరేళ్లు ఎంపీపీగా కొనసాగుతారనే అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. దీంతో రెండున్నరేళ్ల అనంతరం సురేఖను రాజీనామా చేయించి పితాని వర్గం వ్యక్తికి ఎంపీపీ పదవి అప్పగించాలని ఒత్తిడి తీసుకొచ్చారు. సురేఖ వినకుండా నాలుగు సంవత్సరాల పాటు విధులు నిర్వహించారు. ఇక చేసేది లేక మంత్రి పితాని సురేఖపై అవిశ్వాసం అస్త్రం ప్రయోగించేందుకు రంగం సిద్ధం చేశారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన సురేఖ నేరుగా జిల్లా కేంద్రానికి చేరుకుని జిల్లా పరిషత్ సీఈఓ నాగార్జునాసాగర్కు తన రాజీనామా పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ తనకు జరిగిన అన్యాయాన్ని జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మికి, రాష్ట్ర నాయకులు కళా వెంకట్రావుకు, అయ్యన్నపాత్రుడుకి చెప్పానని, అయినా మంత్రి మాటకే పెద్దపీట వేసి తన మాటను ఏమాత్రం పట్టించుకోలేదని సురేఖ వాపోయారు. ఈ నాలుగు సంవత్సరాల కాలంలో దళితురాలిని, మంత్రి పితాని వర్గం మనిషి కాకపోవడంతో అధికారులెవరూ తనకు సహకరించలేదని ఆమె తెలిపారు. నాలుగు సంవత్సరాల పాటు అడుగడునా మంత్రి అడ్డుతగులుతూనే ఉన్నారని ఆమె వాపోయారు. ప్రొటోకాల్ ప్రకారం వడలి పశుశుల ఆసుపత్రి నిర్మాణంలో శిలాఫలకంపై పేరు వేయకపోవడంతో ఆందోళన చేసి పేరు వేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందనీ, పెన్షన్లు ఇవ్వాలన్నా దళిత మహిళనని పితాని తనమాటను చెల్లుబాటు కానీయలేదని సురేఖ పేర్కొన్నారు. నాయకులెవరూ సహాయం చేయకున్నా టీడీపీలోనే కొనసాగుతానని ఆమె ఈ సందర్భంగా చెప్పారు. -
దళిత మహిళ ఎంపీపీ కావడంతో చిన్నచూపు
-
ఆలయంలోకి దళిత ఎమ్మెల్యే ప్రవేశించారని...
లక్నో : ఆలయాలు ప్రైవేటు ఆస్తులు కావని, మహిళలను ఆలయంలోకి రాకుండా ఆడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీం కోర్టు (శబరిమల ఆలయం గురించి) ఇటీవలే తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎన్ని తీర్పులు వచ్చినా, సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందినా తమ నమ్మకాలను వదులుకోవడానికి చాలా మంది ఇష్టపడరు. ఉత్తరప్రదేశ్లోని ముస్కారా ఖుర్ద్ గ్రామస్తులు కూడా ఆ కోవకు చెందిన వారే. తామెంతో నిష్ఠగా కొలుచుకునే ధ్రుమ్ రుషి ఆలయంలోకి ఓ మహిళ ప్రవేశించడంతో అపచారం జరిగిపోయిందని ఆగ్రహించారు. కానీ సదరు మహిళ అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఏం చేయలేక.. ఆమె వెళ్లిపోగానే ఆలయ సంప్రోక్షణ చేసి, విగ్రహాలను ప్రయాగకు పంపించి మరీ గంగాజలంతో శుద్ది చేయించారు. అసలేం ఏం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్లోని రాత్ నియోజక వర్గ ఎమ్మెల్యే మనీషా అనురాగి(బీజేపీ) తన పర్యటనలో భాగంగా జూలై 12న ముస్కారా ఖుర్ద్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సమీపంలోని ధ్రుమ్ రుషి ఆలయాన్ని సందర్శించాలంటూ పార్టీ కార్యకర్తలు పట్టుబట్టారు. అయితే ఆ ఆలయంలోకి మహిళలకు అందులోనూ దళితులకు ప్రవేశం లేదని పూజారి, గ్రామస్తులు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ కార్యకర్తల ఒత్తిడితో ఆమెను ఆలయంలోకి అనుమతించక తప్పలేదు. పూజలు నిర్వహించడంతో పాటు, రుషి ధ్యానం చేసుకున్న ప్రదేశంలో మనీషా కాలు పెట్టారని, ఇక తమ గ్రామానికి కీడు తప్పదని గ్రామస్తులంతా ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో పూజారులచే ఆలయాన్ని శుద్ధి చేయించి, విగ్రహాలను ప్రయాగకు పంపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఓ మహిళ అందులోనూ దళిత వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించడంతో గ్రామస్తులు ఆందోళన చెందారని, వారి భయాన్ని పోగొట్టేందుకే ఇలా చేశామని హమీర్పూర్ పంచాయతీ పెద్దలు తెలిపారు. తమ నియమాలను, ఆచారాలను మంటగలిపాలని చూస్తే సహించలేమని పేర్కొన్నారు. ఆలయ నేపథ్యం.. మహాభారత కాలానికి చెందినదిగా ప్రాశస్త్యం పొందిన ధ్రుమ్ రుషి ఆలయం ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలోని ముస్కారా ఖుర్ద్ గ్రామంలో ఉంది. ఆలయ నిబంధనల ప్రకారం.. మహిళలు ఆలయ పరిసరాల్లో తిరిగినా, కనీసం గోడలను తాకినా ప్రకృతి విపత్తులు సంభవిస్తాయని గ్రామస్తులు విశ్వసిస్తారు. -
ఆమెకు అవమానం
కూరగాయలు విక్రయిస్తున్న ఈమె పేరు కూరపాటి సుంకులమ్మ. కృష్ణగిరి మండల పరిషత్ అధ్యక్షురాలు. వాస్తవానికి మండల పాలనా వ్యవహారాల్లో కీలకంగా ఉండాలి. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పాటుపడాలి. తనను ఎన్నుకున్న ప్రజల బాగోగులు చూడాలని ఈమెకూ ఉంది. కానీ అక్కడి అధికార పార్టీ నాయకుడు అవకాశం ఇవ్వడం లేదు. సోదరుడు డిప్యూటీ సీఎం కావడంతో అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. సొంత పార్టీకే చెందిన దళిత మహిళా ఎంపీపీని అడుగడుగునా అవమానాలకు గురిచేస్తున్నాడు. కర్నూలు టాస్క్ఫోర్స్ : డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఇలాకాలో దళిత మహిళా ప్రజాప్రతినిధి ఆత్మగౌరవాన్ని అధికార పార్టీ నాయకులు మంటగలిపారు. పత్తికొండ నియోజకవర్గం కృష్ణగిరి ఎంపీపీ కూరపాటి సుంకులమ్మను సొంత పార్టీ వారే తీవ్ర అవమానాలకు గురిచేస్తున్నారు. కనీసం మండల పరిషత్ సమావేశాలకు కూడా ఆహ్వానించడం లేదు. మహిళా ప్రజాప్రతినిధి అనే మర్యాద కూడా ఇవ్వకుండా డిప్యూటీ సీఎం సోదరుడు కేఈ జయన్న రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నట్లు బాధితురాలు ఆరోపిస్తున్నారు. కృష్ణగిరి మండలం ఆలంకొండ ఎంపీటీసీ సభ్యురాలిగా ఎన్నికైన సుంకులమ్మను ఎంపీపీగానూ ఎన్నుకున్నారు. ఎన్నికైన నాటి నుంచి నేటి వరకు ఏ ఒక్క సమావేశానికీ అధికారులు ఆహ్వానించడంలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు చేసిన అప్పులు తీర్చేందుకు స్వగ్రామం ఆలంకొండలోనిఇల్లు, పొలం సైతం విక్రయించామని, ఇప్పుడు తనతో పాటు కుటుంబ సభ్యులు కూడా కూలి పనులకు వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. సుంకులమ్మకు భర్త రంగస్వామితో పాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు దివ్యాంగుడు. అప్పులు కట్టేందుకు సొంతూరిలోని ఇంటిని సైతం అమ్మేయడంతో ప్రస్తుతం వీరు డోన్ పట్టణంలోని కొత్త బస్టాండు వెనుక చిన్న ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. రూ.700లకు అద్దెకు తీసుకున్న ఆ ఇంట్లో దుర్భర జీవితం గడుపుతున్నారు. రంగస్వామి డోన్ పాతబస్టాండ్లో హమాలీగా పనిచేస్తున్నాడు. ఎంపీపీ సుంకులమ్మ పట్టణంలో కూరగాయలు విక్రయిస్తున్నారు. ఈ నాలుగేళ్లలో ఎంపీపీగా కార్యాలయం ముఖం రెండుసార్లు మాత్రమే చూశానని, మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఏమిటనే విషయం కూడా తనకు తెలపడం లేదని ఆమె వాపోతున్నారు. ‘కేఈ జయన్న కనుసన్నల్లోనే అధికార యంత్రాంగమంతా నడుస్తోంది. నా సంతకాలు కూడా వారే ఫోర్జరీ చేస్తున్నారు. దళిత తేజం లాంటి కార్యక్రమాల్లో దళితుల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఆయన ఇలాకాలో దళితులకు తన కుటుంబ సభ్యులు ఏ మాత్రం గౌరవం ఇస్తున్నారనే దానిపై ప్రజలకు స్పష్టం చేయాల’ని అన్నారు. హక్కులనుకాలరాసే కుట్ర... కృష్ణగిరి మండలంలో ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులను దళితులకు కేటాయించినా.. వారు మాత్రం ఉత్సవ విగ్రహాలే. దళితులను అడ్డం పెట్టుకొని మండలంలో ప్రజాధనాన్ని కేఈ సోదరులు లూటీ చేస్తున్నారు. ఈ దుర్భర పరిస్థితి నుంచి వారిని గట్టెక్కించేందుకే నోరు తెరవాల్సి వస్తోంది.– తొర్రి రంగన్న, కృష్ణగిరి మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు పురుగుల కంటే హీనంగా చూస్తున్నారు... ‘ఎంపీపీగా ఎన్నికై నాలుగేళ్లు గడిచినా ఒక్క పేపర్ మీద కూడా నా సంతకాలు తీసుకోలేదు. మండల పరిషత్ సమావేశాలకు కూడా ఆహ్వానించడం లేదు. అధికార పార్టీ నాయకుల మాటలు నమ్మి ఉన్న ఆస్తిని ఎన్నికల్లో హారతి కర్పూరంలా ఖర్చుచేయాల్సి వచ్చింది. ఆత్మ గౌరవం కాపాడుకునేందుకే నేడు గళం విప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. మమ్మల్ని పురుగుల కంటే హీనంగా చూస్తున్నార’ని ఎంపీపీ సుంకులమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. -
మా ముందే కుర్చీలో కూర్చుంటావా?
అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్లో ఓ దళిత మహిళ తమముందు కుర్చీపై కూర్చుని పనిచేయడం నచ్చని రాజ్పుత్ వర్గీయులు ఆమెపై దాడికి పాల్పడ్డారు. బాధితురాలి కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడి వారిని సజీవదహనం చేసేందుకు యత్నించారు. అహ్మదాబాద్ జిల్లా వాల్తేరాలోని అంగన్వాడీ కేంద్రంలో పల్లవిబెన్ జాదవ్(45) పనిచేస్తున్నారు. గ్రామస్తులకు మంజూరైన ఆధార్ కార్డుల్ని పంచే బాధ్యతను అధికారులు ఆమెకు అప్పగించారు. దీంతో పల్లవిబెన్ బుధవారం గ్రామంలో ఆధార్కార్డులు పంచుతుండగా అక్కడికి చేరుకున్న కరదియా రాజ్పుత్ వర్గానికి చెందిన జయరాజ్ వేగద్ ‘దళితురాలివైన నువ్వు మాముందే కుర్చీలో కూర్చుంటావా?’ అని తిడుతూ దాడికి పాల్పడ్డాడు. అదేరోజు రాత్రి జయరాజ్ నేతృత్వంలో 25 మంది దుండగులు పల్లవి ఇంటివద్ద ఆమె కుటుంబ సభ్యులపై కర్రలు, పదునైన ఆయుధాలతో దాడికి దిగారు. ఆమె కుటుంబ సభ్యుల్ని సజీవదహనం చేసేందుకు యత్నించారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్టుచేశారు. -
సంచిలో పిండంతో పోలీస్స్టేషన్కు
సత్నా: మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ దళిత మహిళ(20)పై కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడిన నలుగురు దుండగులు ఆమె గర్భవతి కావడంతో ఓ నర్సుతో బలవంతంగా అబార్షన్ చేయించారు. దీంతో ఆమె నాలుగు నెలల వయసున్న పిండాన్ని ఓ సంచిలో వేసుకుని బుధవారం సత్నా నగర ఎస్పీ వీడీ పాండే కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. సత్నాకు చెందిన నీరజ్ పాండే, ధీరజ్ పాండే, ప్రేమ్ కుమార్, రాజ్కుమార్లు తనపై కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డారని సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. సప్నా అనే నర్సు సాయంతో తనకు బలవంతంగా అబార్షన్ చేయించారని వెల్లడించింది. ఈ విషయం బయట ఎక్కడైనా చెబితే చంపేస్తామని బెదిరించారంది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా నిందితులపై ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదుచేశామని, దోషుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని సత్నా నగర ఎస్పీ వీడీ పాండే ప్రకటించారు. -
మంత్రి నారాయణ సమక్షంలో...
సాక్షి, నెల్లూరు సిటీ: తెలుగుదేశం పార్టీలో దళితులకు ఇచ్చే ప్రాధాన్యమెంతో మరోసారి తేటతెల్లమైంది. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం సందర్భంగా నాయుడుపేట మున్సిపల్ చైర్పర్సన్ శోభారాణిని నిలబెట్టే ఉంచడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం గోమతినగర్లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో నారాయణ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం అక్కడే విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, టీడీపీ నగర ఇన్చార్జి ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి, విజయా డెయిరీ చైర్మన్ రంగారెడ్డి, కార్పొరేటర్ రాజానాయుడు పాల్గొన్నారు. వీరందరూ కుర్చీల్లో కూర్చున్నారు. అక్కడే ఉన్న నాయుడుపేట మున్సిపల్ చైర్పర్సన్ శోభారాణికి మాత్రం కుర్చీ కేటాయించలేదు. దీంతో ఆమె సమావేశం జరుగుతున్నంత సేపూ నాయకుల వెనుక నిల్చొనే ఉండాల్సి వచ్చింది. మంత్రి నారాయణ తదితర టీడీపీ నేతలు చైర్పర్సన్ నిలుచుని ఉన్నా పట్టించుకోకుండా విలేకరుల సమావేశం ముగించారు. -
పవరు హత్య
చెట్టు స్త్రీలాంటిది. బీడులోంచి కూడా శక్తిని లాగి, నీడను ఇస్తుంది! అలాంటి చెట్టును ఏ ఊరు కోరుకోదు? ఏ ఊరు ఆ చెట్టును మోడువారుస్తుంది? ఏ ఊరు తన కాళ్లను తానే గొడ్డలితో నరుక్కుంటుంది? అలాంటి ఊరు ఉండదు. ఉంటే.. అది మూర్ఖత్వమే. కాదు.. కాదు.. వివక్ష. వృక్షాన్ని కూడా నిలవనివ్వకుండా పడగొట్టేయాలనుకునే వివక్ష! సర్పంచ్ ఇంటికి పాలుబోస్తే 500 జరిమానా! ఆ ఇంట్లో వాళ్లతో మాట్లాడితే జరిమానా! సర్పంచ్ భర్త బండిమీద ఎక్కితే జరిమానా! వాళ్ల పొలంలోనికి ట్రాక్టర్ తోలితే జరిమానా! పరువు హత్యల గురించి విన్నాం. ఈ ‘పవరు హత్య’ ఏంటి?! పెళ్లిలో ఎంపిక చేసుకుంటారు. అక్కడ పరువు హత్యలు జరుగుతున్నాయి. పవర్లో ఎన్నుకుంటారు. అక్కడ పవర్ హత్యలు జరుగుతున్నాయి. ఒక దళిత మహిళా సర్పంచ్ పవర్పై జరిగిన హత్య ఇది. చట్టం కూడా చూస్తూ కూర్చున్న కథ ఇది! గ్రామ పంచాయతీ వైపు విసురుగా వెళ్లాడు గ్రామ పెద్ద. ‘‘అరేయ్ ఆ కుర్చీ తేరా..’’ పాలేరుని గదిమి అతను తెచ్చిన కుర్చీలో దర్జాగా కూర్చున్నాడు. పంచాయతీ సెక్రటరీని పిలిచి చెప్పాడు. ‘‘ఇక నుంచి ఏ ఫైల్ మీదా సర్పంచ్ సంతకం తీసుకోవద్దు. ఆమె ఏ కార్యక్రమాలకీ హాజరు కాకూడదు. ఆమె ఇంటికెవ్వరూ వెళ్లకూడదు. ఆమెతో ఎవ్వరూ మాట్లాడకూడదు. ఆమె భర్త బండి మీద కూడా ఎవరూ ఎక్కకూడదు..’’ హుకుం జారీ చేసి, కుర్చీలోంచి లేచి వెళ్లిపోయాడు ఆ గ్రామపెద్ద. స్త్రీ.. ఆపై దళిత స్త్రీ నిజానికి ఆ గ్రామ సర్పంచి మమత. పంచాయతీలో ఆమె నిర్ణయం ప్రకారమే అన్నీ జరగాలి. ఏ సభ జరిగినా, ఏ మీటింగ్ పెట్టినా ఆమె ఉండి తీరాలి. అలాంటిది.. సర్పంచిగా ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనప్పటి నుంచీ గ్రామంలోని అగ్రవర్ణాలవారి నుండి వివక్ష మొదలైంది. దానికి కారణం.. మమత కుటుంబీకుల భూమిపై పెద్దవాళ్ల కన్ను పడటం. దానిని సొంతం చేసుకునేందుకు వారంతా కలిసి మమత కుటుంబంపై వేధింపులు మొదలుపెట్టారు. పైగా.. ఏకగ్రీవ ఎన్నిక! భర్త ఎం.పి.పి.గా పని చేసినా, మమత పదవ తరగతి వరకు చదువుకోవడంతో కాస్తో కూస్తో పాలనా వ్యవహారాలను అర్థం చేసుకోగలిగింది. సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైంది. లోకల్గా ‘పెద్దవాళ’్ల మాట విన్నంత వరకూ ఆమెకు ఏ ఇబ్బందీ కలగలేదు. అయితే మమత కుటుంబానికి చెందిన భూమిని తమకు రాసివ్వాలనీ, అదెప్పుడో ఆమె తాత ముత్తాతలు తమకు అమ్మేశారనీ మమతను, ఆమె భర్త శ్రీనివాస్నీ బలవంతపెట్టారు ఊరి అగ్రవర్ణ పెద్దలు. చప్పుడు చెయ్యకుండా భూమిని అమ్మేసినట్టు సంతకం పెట్టాలని కూడా నయానా భయానా చెప్పి చూశారు. ‘సర్పంచి ఆడమనిషే కదా, మేం చెపితే వినదా’ అన్నది వాళ్ల ధీమా! గ్రామ బహిష్కారం భార్యాభర్తలిద్దరూ లొంగకపోవడంతో వాళ్ల అహంకారం బుసలు కొట్టింది. ఆడ సర్పంచినే చెప్పుచేతల్లో పెట్టుకోలేకపోతే, రేప్పొద్దున తమ పెద్దరికాన్ని ఎవరు గౌరవిస్తారు? ఊళ్లో పరువు పోదా? ఏదో ఒకటి చేసి వాళ్లని దారికి తేవాలని అనుకున్నారు పెద్దలు. ఆ రాత్రి అంతా కూర్చొని... సర్పంచిని గ్రామం నుంచి బహిష్కరించాలని నిర్ణయించారు. అలా నిజామాబాద్ జిల్లా, ఆర్మూరు దగ్గరలోని మిండోరా మండలం, బుస్సాపూర్ గ్రామ సర్పంచ్ జక్కుల మమతను వెలివేశారన్న విషయం చుట్టుపక్కల గ్రామాల్లో గుప్పుమంది. ఒక్కొక్కరూ దూరం అయ్యారు ‘‘ఆ పదకొండెకరాలు మావేనని సంతకం పెట్టండి. అంతవరకు మిమ్మల్ని గ్రామం నుంచి వెలేస్తున్నాం. ఎవ్వరూ మీతోని మాట్లాడరు. మీరు ఎవ్వరిళ్లకెళ్లొద్దు. మా కట్టుబాటు ధిక్కరిస్తే జరిమానా కట్టాల్సిందే’’ అన్న ఆ ఊరి పెద్ద హెచ్చరిక గుర్తొచ్చింది మమతకి. పొలం దున్నాలని ట్రాక్టర్ మాట్లాడితే రాత్రి వస్తానని చెప్పిన వ్యక్తి పొద్దున్నే ఫోన్ చేస్తే ‘‘నువ్విచ్చే దానికన్నా నీకు ట్రాక్టర్ తోలితే మాకయ్యే ఖర్చే ఎక్కువ’’ అన్నప్పుడు కానీ తనకు అర్థం కాలేదు.. అతను జరిమానాకు భయపడుతున్నాడని. మమతని భోజనానికి పిలిచినందుకు ఆ పిలిచిన కుటుంబంపై కూడా జరిమానా విధించారు. ఫిర్యాదు చేసినా.. చర్యల్లేవు! సమానత్వం, రాజ్యాంగం అని పెద్ద పెద్ద మాటలు చెపుతారు. కానీ ఇక్కడేం జరుగుతోంది? భర్తను నెమ్మదిగా పిలిచి చెప్పింది మమత. ‘‘పోలీసు కంప్లైంట్ ఇద్దాం’’ అని. 2018 జనవరి 7వ తేదీన స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ చేశారు వెలివేత మీద. పాలు కూడా పోయనివ్వడం లేదనీ, పాలుపోసే అతణ్ణి బెదిరించి మాన్పించారని ఫిర్యాదు చేశారు భార్యాభర్తలిద్దరూ. జనవరి 11న ఆర్డీవో, ఏసీపీ సహా వచ్చి గ్రామసభ పెట్టారు. మహిళా సర్పంచ్ కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేసినట్టు ఒప్పుకున్నారు పెద్దవాళ్లంతా. అది కుల నిర్ణయం అన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ ఇంతవరకు దోషులపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ఇవ్వరు.. ఇచ్చినా ఉండనివ్వరు! అవమానమిది. స్త్రీల రాజకీయ సాధికారతను గురించి గొప్పలు చెప్పే రాజ్యాధినేతలు సైతం తలలు దించుకోవాల్సిన ఘటన ఇది. ఏం చేస్తున్నారు పాలకులు? గ్రామసభలో అది నిజమని తేలినా ఎందుకు ఇంకా చర్యలు తీసుకోరు? అంటే నిర్లక్ష్యం. వాళ్లు దళితులన్న నిర్లక్ష్యం. మామూలుగానే మహిళలను రాజకీయాల్లోనికి రానివ్వరు. ఇక దళిత సర్పంచిని వేధించకుండా ఉంటారా? 33 శాతం మహిళా రిజర్వేషన్ అంటారు. కానీ ఇంత వరకు అది చట్టంగా రాలేదు. రిజర్వేషన్లు ఇచ్చిన చోటేమో ఇలా దౌర్జన్యం చేస్తారు. దీనికి ఒకటే పరిష్కారం... దామాషా ప్రాతినిధ్యం. ఓట్ల శాతాన్ని బట్టి సీట్లనివ్వడం. – కె.లలిత, సమాజిక కార్యకర్త, ‘యుగాంతర్’ సంస్థ డైరెక్టర్ స్త్రీలు రాజ్యాధికారంలో భాగం కాకూడదా? ఇది రాజ్యాంగ విరుద్ధం. భారతీయ సమాజంలో కొనసాగుతోన్న వివిధ వివక్షల్లో మహిళల అణచివేత తీవ్రంగా పరిణమిస్తోంది. పురుషాధిపత్య భావజాలం కారణంగానే ఈ అమానుషాలు కొనసాగుతున్నాయి. రాజ్యాంగం అందించిన ప్రాథమిక హక్కులను కూడా పురుషాధిపత్య పెత్తందారీ సమాజం కాలరాసి, స్త్రీలను అణచివేస్తోంది. – పి. శంకర్, ప్రెసిడెంట్, దళిత బహుజన ఫ్రంట్, తెలంగాణ తక్కువ కులపోల్లని చిన్నచూపే కదా..! ఇప్పటికి నెలదాటింది. ఇంత వరకు దోషులపై చర్య తీసుకోలేదు. ఒక ఆడ మనిషి సర్పంచ్గా ఉండబట్టేగదా ఇట్ల జేస్తుండ్రు. అదే మగ సర్పంచ్ అయితే ఇట్ల జేస్తరా? దీనిపైన కంప్లైంట్ ఇస్తే డీఎస్పీ గూడ వచ్చి వెలివేసింది నిజమేనని జెప్పిండ్రు. ఎఫ్ఐఆర్ గూడ అయ్యింది. అయిన గూడ వాళ్లపైన ఏమీ చర్యలు దీసుకోలే. దీనికెవ్వరు సమాధానం జెప్తరు? ఇదంతా ఒక ఆడామె ఏం జెయ్యలేదనేగదా? లేకుంటే తక్కువకులపోల్లని చిన్నచూపేగదా? – మమత, బుస్సాపూర్ గ్రామ సర్పంచ్ -
నాడు సర్పంచ్..నేడు స్వీపర్
మహిళా సాధికారత అంటూనే ఆ మహిళను వివక్షకు గురి చేస్తోంది. ప్రజాపాలనలో సమానత్వం కల్పిస్తున్నామని చెబుతున్న రాజకీయ పెత్తందారులు మహిళను ఉత్సవ విగ్రహంగా మార్చేస్తున్నారు. చట్ట సభలు, ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పన అనే అధికారికంగా చట్టానికి నోచుకోకపోయినా ‘స్థానిక’ సంస్థల్లో సగం రిజర్వేషన్ పుణ్యమా అని ప్రజాప్రతినిధులుగా పదవులను అలకరించినా.. ఆ గౌరవం కొన్నాళ్లే. తిరిగి పాత జీవితం గడపాల్సిందే. సూళ్లూరుపేట మండలంలోని మంగళంపాడు మాజీ సర్పంచ్ జీవితమే ఉదాహరణ. నెల్లూరు జిల్లా / సూళ్లూరుపేట: మండలంలోని మంగళంపాడుకు ఐదేళ్ల పాటు సర్పంచ్ స్థానంలో గ్రామ ప్రథమ పౌరురాలిగా ఇంగిలాల సుబ్బమ్మ ప్రజల ప్రజాప్రతినిధిగా వ్యవహరించారు. ఆమె ఇప్పుడు చెంగాళమ్మ ఆలయంలో స్వీపర్గా పని చేస్తోంది. సర్పంచ్గా ఐదేళ్లు పని చేసినా పాలనలో ఆమె పెత్తనం ఏమీ లేకుండా పోయింది. సర్పంచ్ కాక ముందు కంటే సర్పంచ్ అయ్యాక ఆమె పరిస్థితి దయనీయంగా మారింది. అప్పుడు ఉన్న పూరింట్లోనే ఇప్పుడూ ఉంటుంది. కనీసం పక్కా ఇల్లు కూడా కట్టుకోలేకపోయింది. ఆమె పాలనపై పెత్తనం చెలాయించిన పెత్తందారులు మాత్రం నాలుగు రాళ్లు వెనకేసుకుని దర్జా.. డాబు ప్రదర్శిస్తున్నారు. 2006లో మంగళంపాడు పంచాయతీని ఎస్సీ మహిళకు కేటాయించడంతో టీడీపీ మద్దతురాలిగా ఆ గ్రామంలోని ఆ పార్టీ నాయకులు ఆమెను బరిలోకి దింపారు. ఆమె సర్పంచ్ కాక ముందు కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకునేది. సర్పంచ్ అయ్యాక కూలి పనులకు వెళ్లలేకపోయింది. పూటగడవటం కష్టంగా మారింది. అయినా తెలుగుదేశం పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు జనాలను సమీకరించడం, ఇతర కార్యక్రమాలకు వెళ్లడం మినహా ఆమె తనకంటూ నాయకత్వ పటిమను పాదుగొల్పులేకపోయింది. ఆమెను శాసించిన నాయకులు ఉత్సవ విగ్రహంగా మార్చేసుకున్నారు. సంతకాలు అవసరమైన చోట సంతకాలు చేయించుకున్నారు. ఇలా ఐదేళ్లు గడిచిపోయాయి. తిరిగి ఆమె జీవితం దుర్భరంగా మారింది. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక కుమారుడికి పెళ్లయి వేరుగా ఉంటున్నాడు. మరో కుమారుడు చదువుతున్నాడు. ఐదేళ్ల పాటు పైసా కూడా కూడబెట్టుకోకపోవడంతో ప్రస్తుతం కుటుంబ పోషణ కష్టతరం కావడంతో స్థానికంగా ఓ హోటల్లో పాచి పనికి చేరింది. ఆమె దుస్థితిని చూసిన కొంతమంది చలించిపోయి ఆమెను చెంగాళమ్మ ఆలయంలో స్వీపర్గా చేర్చారు. ఐదేళ్లు ప్రజాప్రతినిధిగా పనిచేసిన ఉన్నత వర్గాల వారు మాత్రం స్థిర పడిపోతున్నారు. చదువు లేని ఇలాంటి మహిళలు మాత్రం సంతకాలకే పరిమితం కావడంతో మహిళా సాధికారత అపహాస్యం పాలవుతోంది. ఇలాంటి సుబ్బమ్మలు ఇంకా ఎంతో మంది ఉన్నారు. అధికారం వచ్చినా అనుభవించనీకుండా పెత్తనం చేసే ఉన్నత వర్గాల వారు చెప్పినట్టుగా చేయాల్సి ఉండటం చూస్తే మహిళకు సాధికారత వచ్చిందా? ఇంకా వివక్షకు గురవుతుందా? అనే ప్రశ్నలకు సమాధానాలు కనపించడం లేదు. కనీసం ఇల్లు కూడా కట్టుకోమన లేదు ఐదేళ్లు సర్పంచ్గా పనిచేశాను. ప్రస్తుతం అమ్మవారి సేవలో జీవితం గడిచి పోతుందని అనుకుంటున్నాను. సర్పంచ్గా పని చేసి కనీసం ఇల్లు కూడా నిలబెట్టుకోలేకపోయాను. తెలుగుదేశం పార్టీ నాయకులు అన్ని రకాలుగా ఉపయోగించుకున్నారు. ఒక ఇల్లు కట్టుకోమని ఎవరూ చెప్పలేకపోవడంతో ఇప్పటికీ పూరి గుడిసెలోనే జీవితం గడుపుతున్నాం. సర్పంచ్గా ఉన్న కాలంలో కూడా సంతకాలనే పరిమితమయ్యాను. కనీసం రూపా యి సంపాదన లేకుండా పోయింది. భర్త పనికి పో లేకపోవడంతో నేను చెంగాళమ్మ ఆలయంలో స్వీపర్గా పనిచేసి ఆయన్ను పోషించుకుంటున్నాను. – ఇంగిలాల సుబ్బమ్మ, మాజీ సర్పంచ్ మంగళంపాడు -
జెర్రిపోతులపాలెం ఘటనతో ఇబ్బందే
సాక్షి, అమరావతి: విశాఖజిల్లా జెర్రిపోతులపాలెంలో దళిత మహిళను వివస్త్రను చేసి దాడి చేసిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఇలాంటి ఘటనలు జరక్కుండా పార్టీ నాయకులు చూడాలని, లేకపోతే ఇబ్బందులు వస్తాయని చెప్పారు. జనవరి రెండో తేదీ నుంచి జన్మభూమి–మన ఊరు కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు.తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఇలాంటి పనులు చేస్తే సమాధానం చెప్పుకోలేకపోతున్నామన్నారు. జెర్రిపోతులపాలెంలో జరిగిన ఘటన మరెక్కడా జరక్కుండా, పునరావృతం కాకుండా చూసుకోవాలని నేతలకు సూచించారు. ప్రజాప్రతినిధులు తమ పనితీరు మెరుగుపరుచుకోకపోతే వారిని మార్చేసి కొత్త వారికి అవకాశం ఇస్తానన్నారు. గోదావరి జిల్లాల్లో కోడిపందాలను ప్రోత్సహించ వద్దంటూనే, దాన్ని సాంప్రదాయంగా చూడాలని చెప్పారు. కోడి పందేల విషయంలో నాయకులు అప్రమత్తంగా ఉండాలని, ఏ చిన్న తప్పు జరిగినా అభాసు పాలవుతామని హెచ్చరించారు. -
దుశ్శాసన పర్వంలో నిందితులకు రిమాండ్
-
దుశ్శాసన పర్వంలో నిందితులకు రిమాండ్
పెందుర్తి: విశాఖ జిల్లా పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో ఓ దళిత మహిళను వివస్త్రను చేసి, ఆమెతోపాటు ఇతర దళితులపై గత మంగళవారం దాడికి పాల్పడ్డ అధికార తెలుగుదేశం పార్టీ నాయకులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం ఏడుగురిని శుక్రవారం అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు. నిందితుల్లో టీడీపీకి చెందిన పెందుర్తి మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు మడక పార్వతి, ఆమె భర్త మడక అప్పలరాజు, మాజీ సర్పంచ్ వడిశల శ్రీను, రాపర్తి గంగరాజు, మడక రామునాయుడు, సాలాపు జోగారావు, సాలాపు గంగమ్మ ఉన్నారు. జెర్రిపోతులపాలెంలో ఎన్టీఆర్ గృహకల్ప పేరుతో దళితుల భూమిని స్వాధీనం చేసుకునే క్రమంలో హక్కుదారులైన దళితులు వీరిని అడ్డుకోవడంతో రంజా దుర్గమ్మ అనే దళిత మహిళను నడిరోడ్డుపై వివస్త్రను చేయడంతో పాటు దువ్వాడ అక్కమ్మ, ఇతర దళితులపై దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఈ నెల 19న పెందుర్తి పోలీస్స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేయగా సమగ్ర విచారణ అనంతరం నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్సీ, ఎస్టీ సెల్ విచారణ అధికారి, ఏసీపీ కె. ప్రవీణ్కుమార్ వెల్లడించారు. వీరిపై ఎస్సీ, ఎస్టీ (పీవో) యాక్ట్తో పాటు ఐపీసీ 447, 354, 323 సెక్షన్లు నమోదు చేసినట్లు తెలిపారు. -
టీడీపీ నేతల రాక్షసత్వంపై ఆగ్రహ జ్వాలలు
-
‘హేయమైన చర్య.. చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి’
సాక్షి, అనంతపురం: విశాఖ జిల్లాలో దళిత మహిళపై టీడీపీ నేతల దుశ్శాసన పర్వం ఘటనకుగానూ సీఎం చంద్రబాబు నాయుడు సిగ్గుతో తలదించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో దళిత మహిళపై అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల దాడి ఘటనను వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం, నల్లమడలో బహిరంగసభలో పాల్గొన్న వైఎస్ జగన్ అధికార టీడీపీ దాష్టీకాలపై నిప్పులు చెరిగారు. ‘టీడీపీ నేతలు విశాఖలో మానవత్వం మరిచిపోయి రాక్షసపర్వం ప్రదర్శించారు. జెర్రిపోతులపాలెంలో దళితుల భూమిని ‘ఎన్టీఆర్ గృహకల్ప’ పేరుతో ఆక్రమించుకునేందుకు ప్రయత్నించగా దళిత మహిళ తమకు జరుగుతున్న అన్యాయన్ని ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ నేతలు సభ్యసమాజం తలదించుకునేలా దళిత మహిళను వివస్త్రను చేసి దుశ్శాసన పర్వానికి తెరతీశారు. ప్రభుత్వం గతంలో వారికిచ్చిన భూమిని కాపాడుకునే యత్నం చేయగా.. దళిత మహిళ చీర, జాకెట్టు చించేలా టీడీపీ నేతలను ఉసిగొలిపే హీనస్థితికి చంద్రబాబు దిగజారారు. నిజంగా ఈ ఘటనతో సీఎం చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి. దళిత మహిళపై ఆ దాష్టీకానికి పాల్పడ్డ వారిని అరెస్ట్ చేయించి, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి కఠినచర్యలు తీసుకోవాల్సింది పోయి తనకేమాత్రం సంబంధం లేదన్నట్లుగా చంద్రబాబు వ్యవహరించడం కంటే దుర్మార్గమైన చర్య ఇంకేమైనా ఉంటుందా?. మహిళలపై ఇంత నీచానికి పాల్పడుతున్నా చర్యలు తీసుకోలేని చంద్రబాబు సర్కార్ పాలనకు ఏపీ ప్రజలు త్వరలోనే ముగింపు పలకాలంటూ’ వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. మరోవైపు ఈ ఘటనపై మంగళవారం బాధితులు పెందుర్తి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పెందుర్తి వైస్ ఎంపీపీ మడక పార్వతి, ఆమె భర్త, టీడీపీ నేత మడక అప్పలరాజు, మాజీ సర్పంచ్ వడిశల శ్రీను, టీడీపీ నాయకులు సాలాపు జోగారావు, రాపర్తి గంగమ్మ, మడక రాము నాయుడిపై బాధితురాలు ఫిర్యాదు చేశారు. నిందితులంతా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి అనుచరులు కావడంతో కేసు నమోదుకు పోలీసులు వెనుకాడుతున్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
టీడీపీ నేతలు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు..
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు మొదటి నుంచి దళిత వ్యతిరేకేనని ఆయన మండిపడ్డారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెం ఘటనను మేరుగ నాగార్జున తీవ్రంగా ఖండించారు. బుధవారం ఆయన విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... టీడీపీ నేతలు, కార్యకర్తలు దళితులపై ఎటువంటి ఘాతుకాలకు పాల్పడినా ప్రభుత్వం చర్యలు తీసుకోదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ దారుణ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దళిత మహిళను వివస్త్రను చేసిన ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాగా విశాఖ జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు రాక్షసంగా వ్యవహరించారు. సభ్యసమాజం తలదించుకునేలా దళిత మహిళను వివస్త్రను చేసి దుశ్శాసన పర్వానికి తెర తీశారు. జెర్రిపోతులపాలెంలో దళితుల భూమిని ‘ఎన్టీఆర్ గృహకల్ప’ పేరుతో ఆక్రమించుకునేందుకు ప్రయత్నించగా అడ్డుకోవడమే ఆ మహిళ చేసిన తప్పు. తమ కబ్జాకాండను అడ్డుకున్నారన్న నెపంతో మహిళ అని చూడకుండా దుస్తులు చింపేసి ఈడ్చేశారు. బండ బూతులు తిడుతూ ఇతర దళితులను వెంటాడి కొట్టారు. ఈ ఘటనపై మంగళవారం బాధితులు పెందుర్తి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
మహిళను వివస్త్రను చేసి రాక్షస పర్వం
-
టీడీపీ నేతల దుశ్శాసన పర్వం
పెందుర్తి: విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు రాక్షసంగా వ్యవహరించారు. సభ్యసమాజం తలదించుకునేలా దళిత మహిళను వివస్త్రను చేసి దుశ్శాసన పర్వానికి తెరతీశారు. జెర్రిపోతులపాలెంలో దళితుల భూమిని ‘ఎన్టీఆర్ గృహకల్ప’ పేరుతో ఆక్రమించుకునేందుకు ప్రయత్నించగా అడ్డుకోవడమే ఆ మహిళ చేసిన తప్పు. తమ కబ్జాకాండను అడ్డుకున్నారన్న నెపంతో మహిళ అని చూడకుండా దుస్తులు చింపేసి ఈడ్చేశారు. బండ బూతులు తిడుతూ ఇతర దళితులను వెంటాడి కొట్టారు. ఈ ఘటనపై మంగళవారం బాధితులు పెందుర్తి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పెందుర్తి వైస్ ఎంపీపీ మడక పార్వతి, ఆమె భర్త, టీడీపీ నేత మడక అప్పలరాజు, మాజీ సర్పంచ్ వడిశల శ్రీను, టీడీపీ నాయకులు సాలాపు జోగారావు, రాపర్తి గంగమ్మ, మడక రాము నాయుడిపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. నిందితులంతా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి అనుచరులు కావడంతో కేసు నమోదుకు పోలీసులు వెనుకాడుతున్నారు. అసలేం జరిగింది? పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెం సర్వే నంబరు 77లో ఉన్న భూమిని కొన్నేళ్ల క్రితం స్థానిక దళిత కుటుంబాలకు కేటాయించారు. తరువాత కొన్నాళ్లకు అదే భూమిలో ఏపీ బేవరేజేస్ బాట్లింగ్ కంపెనీకి కొంత స్థలం కేటాయించారు. మిగిలిన 80 సెంట్ల స్థలాన్ని 14 దళిత కుటుంబాలు సాగు చేసుకుంటున్నాయి. విలువైన ఈ స్థలం కబ్జా చేసేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నించగా దళితులు హైకోర్టును ఆశ్రయించారు. తీర్పు వారికి అనుకూలంగా వచ్చింది. అధికారులపై ఒత్తిడి తెచ్చి ఇదే స్థలాన్ని టీడీపీ మద్దతుదారులకు కేటాయిం చేలా చేశారు. మంగళవారం ఆ స్థల స్వాధీనానికి టీడీపీ నాయకులు వెళ్లారు. దళితులు అడ్డుకునే ప్రయత్నం చేయగా ఈ దారుణానికి పాల్పడ్డారు. మహిళను వివస్త్రను చేసి దుశ్శాసన పర్వం -
చెప్పిన పని చేయలేదని ముక్కు కోశారు
భోపాల్ : మధ్యప్రదేశ్ లో ఓ దళిత కుటుంబంపై కుల వివక్ష దాడి జరిగింది. తాము చెప్పిన పని చేయలేదని అగ్రవర్ణానికి చెందిన ఓ కుటుంబం ఆమెపై దాడి చేసి ముక్కును కోసేశారు. రజ గ్రామంలో మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జానకీ భాయ్(35) అనే మహిళ చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. తమ ఇంట్లో పనిలోకి రాలేదన్న కారణంతో ఓ కుటుంబం దాడికి తెగబడింది. "వారంతా నా భార్యపై దాడికి తెగబడ్డారు. అందులో ఇద్దరు వ్యక్తులు గొడ్డలితో ఆమె ముక్కును నరికేశారు. అడ్డుకోవటానికి వెళ్లిన నాపైనా దాడి చేశారని" ఆమె భర్త రాఘవేంద్ర చెబుతున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం మహిళ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది. -
ఒంటరి మహిళపై దౌర్జన్యం
- సామాన్లు బయటపడేసి ఇంటి నుంచి గెంటివేత - అమలాపురంలో ఘటన ఆత్మకూరురూరల్: చిట్ సొమ్ము చెల్లించలేదనే కారణంగా ఒంటరి జీవితం గడుపుతున్న ఓ దళిత మహిళపై మండల పరిధిలోని అమలాపురానికి చెందిన కొందరు శనివారం దౌర్జన్యం చేశారు. ఆమె ఇంటిలోని సామాన్లు బయటపడేసి తాళం వేశారు. ఆశా వర్కర్గా పనిచేస్తున్న లక్ష్మిదేవి భర్త చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తోంది. తన అవసరం నిమిత్తం అదే గ్రామంలో కొందరి వద్ద చిట్ వేసి పాడుకుంది. అయితే చీటీ కిస్తిలు సక్రమంగా చెల్లించడం లేదంటూ చీటి నిర్వాహకులు తరుచూ ఆమెను దూషించడం, బెదిరించడం చేసేవాళ్లు. తీసుకున్న లక్ష రూపాయలకు వడ్డీ కలిపి రూ. 2లక్షలు అయిందని, ఇందుకుగాను ఇంటిని స్వాధీనం చేయాలని ఒత్తిడి తెచ్చేవారు. ఈ మేరకు శనివారం వచ్చిన అడగగా లక్ష్మిదేవి నిరాకరించడంతో ఈశ్వరమ్మ నాయకత్వంలోని మహిళలంతా మూకుమ్మడిగా దాడి చేసి చేశారు. సామాన్లను బయటకు విసిరి ఇంటిని స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలియడంతో ఆత్మకూరు డీఎస్పీ వినోద్ కుమార్ ఆదేశాల మేరకు సీఐ కృష్ణయ్య, ఎస్ఐ వెంకట సుబ్బయ్య వచ్చి వివరాలు తెలుసుకున్నారు. ఆమెను ఇంటి తాళం తెరిపించి అప్పంగించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
రేషన్ కార్డు ఇప్పిస్తానని తీసుకెళ్లి..
మోరెనా: ఓ బీజేపీ నేత దారుణానికి పాల్పడ్డాడు. ఓ దళిత మహిళకు రేషన్ కార్డు ఇస్తానని హామీ ఇచ్చి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్లోని కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న సుమావళి భోజ్పాల్ జాడోన్ అనే వ్యక్తి మోరెనా తన ప్రాంతానికి చెందిన ఓ దళిత స్త్రీకి బియ్యం కార్డు ఇప్పిస్తానని హామీ ఇచ్చి తనతో తీసుకెళ్లాడు. అయితే, అనంతరం తిరిగి సాయంత్రం వరకు రాలేదు. అయితే, సిటీకి తీసుకెళ్లిన భోజ్పాల్ ఆమెను మరో మహిళ ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు తదనంతరం బాధితురాలి ఫిర్యాదు ద్వారా తెలిసింది. తొలుత కేసు పెట్టని పోలీసులు ఫిర్యాదు పూర్వకంగానే నమోదుచేసుకున్నారు. ప్రస్తుతం కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
దళిత మహిళ కుల బహిష్కరణ
⇒ మాట్లాడితే 5 వేలు జరిమానా ⇒ ఇది ‘పెదరాయుళ్ల’ తీర్పు మధిర: ఇరవై ఏళ్లుగా భర్తకు దూరంగా ఉంటూ.. కూలీ చేసుకుంటూ ఒంటరిగా జీవిస్తున్న దళిత మహిళను భర్త చేసిన అప్పులు తీర్చాలంటూ కుల బహిష్కరణ చేశారు. ఆమెతో ఎవరు మాట్లాడినా రూ.5 వేల జరిమానా కట్టాలంటూ తీర్పు చెప్పారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా మధిర పంచాయతీ పరిధిలోని ఇల్లెందులపాడులో జరిగింది. గ్రామానికి చెందిన నండ్రు సాయి, మరియమ్మ దంపతులు. వారికిద్దరు కుమార్తెలు, కొడుకు. సాయి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించడంతో మరియమ్మ 20 ఏళ్లుగా అతనికి దూరంగా ఉంటోంది. తనకున్న రెండున్నర సెంట్ల ఇంటి స్థలంలో రేకుల షెడ్డు వేసుకుని నివసిస్తోంది. కాగా, సుమారు మూడేళ్ల క్రితం నండ్రు సాయి కుల సంఘంలో ఉన్న రూ. 50 వేలను వడ్డీకి తీసుకున్నాడు. సాయి తీసుకున్న డబ్బులకు స్థానికుడు తాళ్లూరి నరేశ్ (యేసు) హామీగా ఉన్నాడు. సాయి ఆ డబ్బులు చెల్లించకపోవడంతో కుల సంఘానికి నరేశ్ చెల్లించాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి కుల పంచాయతీ పెట్టారు. సాయి తీసుకున్న డబ్బులను భార్య మరియమ్మ చెల్లించాలని, లేదంటే ఆమె నివసిస్తున్న ఇంటిని బాకీ కింద నరేశ్కు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. దీనికి ఒప్పుకోకపోతే వేర్వేరుగా నివసిస్తున్న సాయి, మరియమ్మలను కులం నుంచి బహిష్కరించాలని తీర్మానించా రు. ఆమెతో ఎవరూ మాట్లాడవద్దని, పాలు విక్రయించినా జరిమానాగా రూ. 5 వేలు చెల్లించాలని తీర్పునిచ్చారు. మరియమ్మ ఇద్దరు కుమార్తెలు, అల్లుళ్లకూ ఇదే తీర్పు వర్తిస్తుందన్నారు. దీంతో మరియమ్మ కులపెద్దలపై టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. -
పోలీస్ ఇంట్లో యువతిపై దారుణం
తిరువనంతపురం: కేరళలో మరో దారుణ సంఘటన వెలుగు చూసింది. శనివారం తిరువనంతపురం సమీపంలో ఓ పోలీస్ కానిస్టేబుల్ ఇంట్లో తనపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారని 22 ఏళ్ల దళిత యువతి ఆరోపించింది. కాగా బాధితురాలు కాని, ఆమె కుటుంబ సభ్యులు కాని ఫిర్యాదు చేయలేదని పోలీసులు చెప్పారు. అదే రోజు ఆత్మహత్యాయత్నం చేసిన ఆమెను ఆస్పత్రికి తీసుకురావడంతో ఈ విషయం తమ దృష్టికి వచ్చినట్టు తెలిపారు. నలుగురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీస్ కానిస్టేబుల్ సహా నిందితులందరినీ అరెస్ట్ చేశారు. నిందితుల్లో బాధితురాలి స్నేహితుడు, సహోద్యోగి ఉన్నారని పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. మూడో నిందితుడు పోలీస్ కానిస్టేబుల్తో మాట్లాడి ఆమెను అతని ఇంటికి తీసుకువెళ్లినట్టు తెలిపారు. బాధితురాలు తమను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేసిందని నిందితులు ఆరోపించారు. అయితే బాధితురాలి వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు. కేరళలోనే ఇటీవల విహార యాత్రకు వచ్చిన జపాన్ యువతి లైంగిక దాడికి గురయినట్టు వార్తలు వచ్చాయి. -
బిహార్లో అమానుషం
దర్భాంగా: బిహార్ లోని దర్భాంగా జిల్లా పిప్రాలో ఓ దళిత మహిళ పట్ల అదే గ్రామానికి చెందిన కొందరు అమానుషంగా ప్రవర్తించిన సంఘటన సంచలనం రేపింది. మంత్రాలు, చేతబడులు చేస్తున్నదని, ఊళ్లో చిన్న పిల్లల అనారోగ్యానికి కారణమైందనే నెపంతో మహిళను చావబాదిన నలుగురు యువకులు.. ఆమె చేత మూత్రం తాగించారు. సమాచారం అందిన వెంటనే గ్రామానికి వెళ్లి దర్యాప్తు చేసి, ఎఫ్ఐఆర్ నమోదుచేశామని దర్భాంగ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి అంజని కుమార్ తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు ఊరు విడిచి వెళ్లిపోయిందని చెప్పారు. పలు రాష్ట్రాల్లో దళితులపై దాడులు, వాటిని నిరసిస్తూ ఆందోళనలను జరుగుతున్న తరుణంలోనే బిహార్ లో ఈ అమానుష ఘటన వెలుగులోకిరావడం గమనార్హం. -
దళిత మహిళపై అత్యాచారం.. హత్య!
ముజఫర్నగర్(ఉత్తరప్రదేశ్): బీఎస్పీ ఎమ్మెల్యేకు చెందిన ఓ పేపర్ మిల్లులో దారుణం చోటుచేసుకుంది. 38 ఏళ్ల దళిత మహిళపై అత్యాచారం జరిపి ఆపై ఆమెను చంపేశారని పోలీసులు శనివారం తెలిపారు. మిల్లులో కార్మికురాలిగా పని చేస్తున్న మహిళపై శుక్రవారం దారుణంగా లైంగికదాడి జరిగిందని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామని, ఘటనపై విచారణ జరుగుతోందని వెల్లడించారు. ఘటన జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న లేబర్ కాంట్రాక్టర్ ఖుర్షీద్ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
ఎమ్మెల్యే పేపర్ మిల్లులో అత్యాచారం, హత్య
లక్నో: ఉత్తరప్రదేశ్ లో ఓ రాజకీయ పార్టీ ఎమ్మెల్యే కు చెందిన మిల్లులో ఓ దళిత మహిళ అత్యాచారం, హత్యఘటన కలకలం రేపింది. ముజఫర్ నగర్ లో ని పేపర్ మిల్లు లో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. బీఎస్పీ ఎమ్మెల్యే కు చెందిన పేపర్ మిల్లులో పనిచేసే దళిత కార్మికురాలు (38) అనుమానాస్పద స్థితిలో మరణించింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ముజఫర్ నగర్ లోని జనసాత్ లో వున్న పేపర్ మిల్లులో పనిచేస్తున్న దళిత మహిళ శుక్రవారం శవమై తేలింది. ఇది బీఎస్పీ ఎమ్మెల్యే కు చెందినదనీ, ఆమెపై అత్యాచారం చేసిన గొంతు నులిమి చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. పరారీలో ఉన్న లేబర్ కాంట్రాక్టర్ కోసం గాలిస్తున్నామని, విచారణ అనంతరం పూర్తి వివరాలు అందిస్తామని పోలీసులు తెలిపారు. -
ఆఫీస్ నుంచి ఈడ్చుకుపోయి అత్యాచారం చేశాడు
ముక్త్సర్: ఓ ఆడబిడ్డని కీచకుడు నడిరోడ్డుపై చెరపట్టాడు. బలవంతంగా లాక్కెళ్లి కారులో కుదేసి కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత ఆమెపై దారుణంగా అత్యాచారం చేశాడు. పట్టపగలు నడిరోడ్డుపై బలవంతంగా లాక్కుపోతున్నా ఏంటిది? అని ఎవ్వరూ అడగలేదు. విలవిలలాడిపోయిన ఆమెను ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. ఆఖరికి పోలీసులు కూడా! ముక్త్సర్ (పంజాబ్) నగరంలోని ఓ కంప్యూటర్ సెంటర్ లో పనిచేస్తోన్న దళిత యువతిని ఆమె ఊరికే చెందిన ఓ వ్యక్తి ఆఫీసు నుంచి బయటికి ఈడ్చుకెళ్లాడు. 100 మీటర్ల దూరంలో నిలిపిన కారు దగ్గరికి గుంజుకెళ్లి, ఆమెను కారులో పడేశాడు. నిత్యం జనం సంచరించే మెయిన్ రోడ్డుపై వాడు తన పశుబలాన్ని ప్రదర్శిస్తుంటే అందరూ చూస్తూ నిల్చున్నారేతప్ప ఏ ఒక్కరూ అడ్డుకోలేదు. కనీసం ఇదేంటని అడగలేదు. వాడు ఆమెను కారులో ఫామ్ హౌస్ కు తీసుకెళ్లి రాత్రంతా బంధించి పలుమార్లు అత్యాచారం చేశాడు. మార్చి 24న చోటుచేసుకున్న ఈ సంఘటనపై తర్వాతి రోజే బాధితురాలు ముక్త్సర్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. నిందితుడు బాధిత యువతిని ఆమె ఆఫీసు నుంచి యువతిని లాక్కెళ్లిన దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఒకరిద్దరు కొలిగ్స్ కూడా వాంగ్మూలం ఇస్తామన్నారు. అయినాసరే పోలీసులు ఇంకా ఆ కీచకుణ్ని అరెస్ట్ చేయలేదు. దీంతో యువతి జాతీయ ఎస్సీ కమిషన్ ను ఆశ్రయించింది. ఇంత ఘోరం జరిగి, సాక్ష్యాధారాలున్నా నిందితుణ్ని ఎందుకు అరెస్ట్ చేయలేదో చెప్పాలంటూ కమిషన్ తాజాగా పోలీసులకు నోటీసులు జారీచేసింది. -
మండ్యలో పరువు హత్య?
బెంగళూరు: కర్ణాటకలోని మండ్య జిల్లాలో దళిత యువతిని ప్రేమించాడనే కారణంతో ఓ యువకుడు హత్యకు గురయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పోలీసులు మాత్రం ఇది హత్య కాదని, ఆత్మహత్య అని చెబుతున్నారు. వివరాలు... మండ్య జిల్లాలోని కె.ఆర్.పేట తాలూకాలో సిందఘట్ట గ్రామానికి చెందిన నాగేష్, అదే ప్రాంతానికి చెందిన దళిత యువతి భవ్యా ప్రేమికులు. ఈ నేపథ్యంలో వీరిద్దరి ప్రేమను నాగేష్ కుటుంబం వ్యతిరేకిస్తూనే వస్తోంది. కాగా, ఈనెల 17న మండ్యలో మతాంతర వివాహం జరిగిన సమయంలో నాగేష్, భవ్యాల ప్రేమను సైతం విమర్శిస్తూ స్థానికంగా ఉన్న కొన్ని సంఘాలు కరపత్రాలను ముద్రించి పంచాయి. దీంతో నాగేష్ కుంగుబాటుకు గురయ్యాడు. అంతేకాక ఎనిమిది నెలల గర్భిణిగా ఉన్న భవ్యా, నాగేష్ తనను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ కె.ఆర్.పేట పోలీస్ స్టేషన్లో పదిహేను రోజుల క్రితం ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం నాగేష్ మృతదేహం ఉరి వేసుకున్న స్థితిలో గ్రామ శివార్లలో కనిపించింది. దళిత యువతితో ప్రేమ, ఆపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు వంటి ఘటనలతో గ్రామంలో తమ పరువు పోయిందని భావించిన నాగేష్ కుటుంబసభ్యులు అతడిని హత్య చేశారన్న వాదన గ్రామంలో వినిపిస్తోంది. -
రాజకీయం చేయొద్దు
► గ్యాంగ్రేప్ నిందితులను కఠినంగా శిక్షిస్తాం ► ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని లేఖ రాశాం ► మహిళలపై సమాజంలో మార్పు రావాలి ► ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల కరీంనగర్ సిటీ : వీణవంక మండలం చల్లూరుకు చెందిన దళిత యువతి(20)పై గ్యాంగ్రేప్ ఘటనను రాజకీయం చేయడం తగదని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని, ప్రభుత్వ పరంగా బాధితురాలికి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. కేసు విచారణ కోసం ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని, రెండుమూడు నెలల్లో తీర్పు వచ్చేలా చూడాలని జడ్జికి లేఖ రాసినట్లు వెల్లడించారు. శుక్రవారం ఆయన కరీంనగర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతనెల 26న రాత్రి 8 గంటలకు గ్రామస్తుల ద్వారా తనకు విషయం తెలిసిందని, వెంటనే ఎస్పీకి ఫోన్చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించానని తెలిపారు. మరుసటి రోజు గ్రామానికి వెళ్లి బాధితురాలిని పరామర్శించి, ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చానన్నారు. ఇలాంటి ఘటనలను రాజకీయాలకతీతంగా చూడాలని, పునరావృతం కాకుండా చర్యలకు సహకరించాలని కోరారు. కాని పరిపాలనా అనుభవం ఉన్న వాళ్ల తీరు చూస్తుంటే బాధిత కుటుంబాన్ని ఆదుకోవడం కన్నా రాజకీయ కోణంలోనే మాట్లాడినట్లు కనిపిస్తోందని విమర్శించారు. ఈ కేసును ఎస్పీ జోయల్ డేవిస్ స్వయంగా విచారిస్తున్నారని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సైని, కానిస్టేబుల్ను సస్పెండ్ చేశామన్నారు. నిందితుల్లో అంజయ్య, రాకేశ్లు సర్టిఫికెట ప్రకారం మైనర్లని, వైద్యపరీక్షల ద్వారా అంజి మేజర్ అని తేలిందని, రాకేశ్ వయస్సు తేలాల్సి ఉందని చెప్పారు. కొత్త చట్టం ప్రకారం 16 సంవత్సరాలు నిండిన వాళ్లను కూడా మేజర్ల తరహాలోనే విచారిస్తారన్నారు. సామాజిక ఉద్యమాలు రావాలి.. ఢిల్లీ నుంచి గల్లీ దాకా లైంగికదాడులు పెరిగిపోతున్నాయని మంత్రి ఆవేదన చెందారు. వీటిని అరికట్టాలంటే కేవలం శిక్షలతోనే సరిపోదని, మానవ విలువలను పెంచేలా సమాజంలో మార్పు రావాలని అన్నారు. సినిమా, సెల్ఫోన్, టీవీల్లో అశ్లీల దృశ్యాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సాంకేతిక పరిజ్ఞానం మానవ సంబంధాలను దెబ్బతీసే విధంగా ఉండొద్దన్నారు. గతంలో సారాకు వ్యతిరేకంగా ఉద్యమం వచ్చినట్లు ఇలాంటి ఘటనలపై సామాజిక ఉద్యమం రావాలని అయన అభిప్రాయపడ్డారు. విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అత్యాచార నిందితులను శిక్షించాల్సిందే..
కలెక్టరేట్ ఎదుట దళిత, విద్యార్థి, ప్రజాసంఘాల ధర్నా ముకరంపుర : వీణవంక మండలం చల్లూరులో దళిత యువతిపై సామూహిక అత్యాచారం చేసిన నిందితులను ప్రజాకోర్టులో కఠినంగా శిక్షించాలని పలు ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం చేయూలని, సంఘటనకు బాధ్యులైన పోలీసుల ను సస్పెండ్ చేయూలంటూ దళిత, విద్యార్థి, మహిళ, ప్రజాసంఘాల నాయకులు గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ స్థారుు వరకూ పోలీసుల నిర్లక్ష్యంతోనే యువతిపై అఘాయిత్యం జరిగిందని ఆరోపించారు. కలెక్టర్, జేసీ మహిళలై ఉండీ.. బాధితురాలికి న్యా యం చేయలేకపోతున్నారని ఆరోపించారు. గ్రామీణ స్థాయిలో షీటీంలను బలోపేతం చేసి నిఘా నిర్వహించాలన్నారు. కళాశాలలు, శిక్షణ కేం ద్రాలు, రద్దీ ప్రదేశాల్లో సీసీ కెమెరాలు అమర్చి నిఘా పెంచాలన్నారు. బాధితురాలికి ప్రభుత్వ ఉద్యోగం, రూ.కోటి ఎక్స్గ్రేషియా ఇప్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరపల్లి సుజాత, బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కనపల్లి గణేశ్, మూల్నివాసి సంఘ్ రాష్ట్ర కార్యదర్శి మార్వాడి సుదర్శన్, ఆదివాసీ హక్కుల పోరాట కమిటీ జిల్లా ప్రధా న కార్యదర్శి గుర్రాల రవీందర్, కుల నిర్మూల న పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు అభినవ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యుడు జన్ను జయరాజ్, తెలంగాణ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూసాల సంపత్, చైతన్య మహిళా సంఘం అధ్యక్షురాలు శోభారాణి, పౌరహక్కు ల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాదన కుమారస్వామి, జిల్లా అధ్యక్షుడు జిందం ప్రసా ద్, ఉపాధ్యక్షురాలు పుల్ల సుచరిత, ప్రైవేట్ రిజర్వేషన్ సాధన సమితి అధ్యక్షుడు సుంకరి సంపత్, పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంతోష్, టీవీవీ జిల్లా అధ్యక్షుడు మహేశ్, తెలంగాణ ప్రజాప్రంట్ నాయకులు వీరగోని పెంటయ్య, సీపీఐ నాయకుడు పైడిపల్లి రాజు, తెలంగాణ జనసమితి జిల్లా కన్వీనర్ సి.రమేశ్, తెలంగాణ బహుజన కార్మిక సంఘం నాయకు లు నగునూరి ఎల్లయ్య, పోలు శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొయ్యల సత్యంలు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు
♦ సానియామీర్జాకు రూ. కోటి ఇచ్చారు.. ♦ దళిత యువతికి అన్యాయం జరిగితే ఇవ్వరా ♦ మాజీ మంత్రులు గీతారెడ్డి, సబిత, సునీత వీణవంక : రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని, స్వేచ్ఛ గా ఉండలేని పరిస్థితి నెలకొందని మాజీ మంత్రి గీతారెడ్డి ధ్వజమెత్తారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరులో ఇటీవల గ్యాంగ్రేప్కు గురైన బాధితురాలిని మాజీ మంత్రులు సబితారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారదలతో కలసి బుధవారం పరామర్శించారు. ఎస్ఐని, కానిస్టేబుల్ను మాత్రమే సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నాన్నారు. విచారణ పేరుతో బాధితురాలిని వేధించిన సీఐని, డీఎస్పీని ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. జిల్లాకు మహిళా కలెక్టర్ ఉండి కూడా ఇంతవరకు బాధితురాలిని పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం యువతికి పోలీసు ఉద్యోగం, ఐదెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇల్లు, కోటి రూపాయల ఎక్స్గ్రేషియూ ప్రకటించాలని డిమాండ్ చేశారు. సబితారెడ్డి మాట్లాడుతూ సానియామీర్జాను పిలిచి కోటి రూపాయలు ఇచ్చిన సీఎం... దళిత బిడ్డకు అన్యాయం జరిగితే ఇవ్వలేరా అని అన్నారు. సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బాధిత కుటుం బానికి కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. -
దళిత మహిళపై టీడీపీ కౌన్సిలర్ దాడి
హిందూపురం: అధికార తెలుగుదేశం దౌర్జన్యాలు ఆగేట్టుగా లేవు. మహిళలు అని కూడా చూడకుండా దాడులు చేస్తున్నారు. సర్పంచ్ స్థాయి నుంచి మంత్రుల దాకా అన్ని స్థాయిల్లోనూ ఈ దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లా హిందూపురంలో ఓ దళిత మహిళపై టీడీపీ కౌన్సిలర్ ఒకరు దాడికి పాల్పడ్డారు. పట్టణంలోని 11వ వార్డు మోడరన్ కాలనీలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం నీటి విషయంలో సుగాల లక్ష్మికి స్థానిక మహిళల మధ్య చిన్న ఘర్షణ జరిగింది. అది కాస్త పెద్దదై స్థానిక కౌన్సిలర్ రామ్మూర్తి జోక్యం చేసుకుని, మరికొందరితో కలసి లక్ష్మిపై దాడి చేసి కొట్టారు. సమాచారం తెలుసుకుని వచ్చిన పోలీసులపై కూడా వారు అసభ్యకరంగా దూషించి దౌర్జన్యం చేయబోయినట్టు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
నీళ్లు పట్టుకుందని... చితక్కొట్టారు!
వీధిపంపు వద్ద నీళ్లు పట్టుకుందని.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ దళిత మహిళను పట్టుకుని చితక్కొట్టారు. ఈ దారుణ ఘటన షామ్లి జిల్లాలో జరిగింది. గంగేటు గ్రామానికి చెందిన రామో దేవి (55) అనే మహిళ వీధిపంపు వద్ద నీళ్లు పట్టుకోడానికి వెళ్లింది. అది చూసిన తెహసిన్ ఖురేషి, మొహిసిన్ అనే ఇద్దరు సోదరులు ఆమెను తీవ్రంగా అవమానించి, చితక్కొట్టారు. దాంతోపాటు ఆమెను కులం పేరుతో దూషించినట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు సోదరులిద్దరిపై ఐపీసీ సెక్షన్లు 323, 506లతో పాటు ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కూడా కేసులు నమోదు చేశారు. వారిలో తెహసిన్ను అరెస్టు చేయగా.. మొహిసిన్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
పరదేశంలో పదేళ్లు నరకయాతన
దేవగుప్తం (అమలాపురం టౌన్) : పొట్టకూటికోసం పరాయిదేశానికి వెళ్లిన ఓ దళిత మహిళ అక్కడ ఓ షేక్ ఇంట వెట్టిచాకిరీ చేసింది. తన రెండో భార్య ఇంటి వద్ద కూడా చాకిరీ చేయాలని షేక్ ఆంక్షలు విధించడంతో అందుకు ఆమె నిరాకరించింది. ఫలితంగా ఆ మహిళ పాస్పోర్టు కాజేసి అష్టకష్టాల పాల్జేశాడు ఆ షేక్. భర్త చనిపోయినా కనీసం కడచూపునకు నోచుకోలేకపోయింది. చివరకు ఓ స్వచ్ఛంద సంస్థ, ఆ దేశంలోని భారత రాయబారి కార్యాలయ చొరవతో ఆమె ఎట్టకేలకు పదేళ్ల నరకయాతన అనంతరం సొంతగడ్డకు చేరుకుంది. అల్లవరం మండలం దేవగుప్తం శివారు పెద ఆంధ్రపేటకు చెందిన వ్యవసాయ కూలీ ఉప్పే సత్యవతి 2005లో ఉపాధి కోసం అప్పులు చేసి దోహా ఖత్తర్ వెళ్లి ఓ షేక్ ఇంట పనికి చేరింది. ఇంతలో ఆ షేక్ మొదటి భార్యకు విడాకులు ఇచ్చి.. రెండో పెళ్లి చేసుకున్నాడు. తన వద్ద పనిమనిషిగా కుదిరిన సత్యవతిని రెండో భార్య ఇంట్లోనూ చాకిరీ చేయాలని రాచిరంపానపెట్టాడు. అయితే షేక్ మొదటి భార్య మంచిది కావడంతో ఆమె వద్దే ఉండేందుకు సత్యవతి ఆసక్తి చూపింది. ఇందుకు ఆగ్రహించిన షేక్ సత్యవతి పాస్పోర్టు కాజేసి వెళ్లిపోయాడు. స్వదేశానికి వచ్చే ఆధారం కోల్పోవడంతో సత్యవతి అతనిని పాస్పోర్టు కోసం ప్రాధేయపడింది. అతని మనసు కరగలేదు. ఎందరికో గోడు వెళ్లబోసుకుంది. ఫలితం శూన్యం. 2005లో ఆమె వెళ్లినప్పుడు తన ఇద్దరు కుమార్తెలు, కుమారుడు, భర్తను వదిలి వెళ్లింది. పదేళ్లుగా వారంతా ఎలా ఉన్నారో.. కళ్లారా చూసే అవకాశం లేక కుమిలిపోయింది. తరచూ షేక్ వద్దకు వెళ్లి తనను క్షమించాలని, పాస్పోర్టు ఇచ్చి మా ఊరుకు పంపించాలని వేడుకుంది. సత్యవతి దీనావస్థను చూసి షేక్ మొదటి భార్య పాస్పోర్టు కోసం తనవంతు యత్నాలు చేసి విఫలమైంది. ఆదేశంలో వర్కరు ఐడీ కార్డు లేకుండా పనిచేయడం తీవ్రమైన గూఢచర్య నేరం కాబట్టి దొరకకుండా కూడా సత్యవతి నానా పాట్లు పడింది. భర్త మరణ వార్త విని.. ‘మిమ్మల్నందరినీ చూడాలనిపిస్తున్నా పాస్పోర్టు లేక రాలేకపోతున్నా’నని సత్యవతి తరచూ కుటుంబ సభ్యుల వద్ద ఫోన్లో ఆవేదన వ్యక్తం చేసేది. ఆమె భర్త అర్జునరావు భార్య ఎంతకీ రాకపోవడంతో మనోవేదనకు గురై బీపీ షుగరుతో మంచానపడ్డాడు. చివరకు ఈ ఏడాది జనవరి 10న మరణించాడు. ఈ వార్త ఫోన్లో తెలుసుకుని సత్యవతి కన్నీరుమున్నీరుగా విలపించింది. అయితే వచ్చేదారిలేక గుండెల్లోనే బాధను భరించింది. స్పందించిన సామాజిక కార్యకర్త అమలాపురానికి చెందిన సామాజిక కార్యకర్త గాబ్రియేలుకు సత్యవతి కుటుంబ సభ్యులు విషయాన్ని చెప్పారు. దీంతో గాబ్రియేలు ఆ దేశ ప్రభుత్వానికి , అక్కడి భారత రాయబారి కార్యాలయానికి, హైదరాబాద్లోని మైగ్రేడ్స్ రైట్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు ఎం.భీమారెడ్డికి సమాచారం అందించారు. సత్యవతి వర్కర్ ఐడీ లేకుండా ఇన్నేళ్లు ఆ దేశంలో గడపడం అక్కడి చట్టాల ప్రకారం నేరం. ఇందుకు తొమ్మిదేళ్లు శిక్షపడుతుంది. అయితే అక్కడ భారత రాయబారి, తెలుగు దౌత్యాధికారిణి అనుపమ మానవతాదృక్ఫథంతో స్పందించారు. అక్కడి ప్రభుత్వంతో మాట్లాడారు. దీంతో సత్యవతికి కేవలం నాలుగు రోజుల సాధారణ శిక్ష విధించారు. అనంతరం అధికారి అనుపమ కొత్తగా పాస్పోర్టు చేయించి సత్యవతిని భారతదేశానికి పంపారు. ఎదిగిన పిల్లలను చూసి ఉద్వేగానికి గురైన క్షణం 2005లో చిన్నపిల్లలను వదిలి వెళ్లిన సత్యవతి తిరిగి వచ్చి పెద్దవాళ్లైన వారిని చూసి ఉద్వేగానికి గురైంది. పిల్లల ఆలనాపాలనా దగ్గరుండి చూడలేకపోయానని ఆమె బాధపడినా ఇద్దరు కుమార్తెలు పెళ్లిళ్లు చేసుకుని పిల్లాపాపలతో కనిపించడంతో సంతోష పడింది. ఉద్వేగంతో కన్నీళ్లు పెట్టింది. ఆనందభాష్పాలతో పరవశించిపోయింది. భర్త మరణించడం ఒక్కటే తనను తీవ్రంగా కలిచివేసిందని, నా ప్రాణం అక్కడే పోతుందనుకున్నాననని, భగవంతుడు మళ్లీ మనల్ని కలిపాడని కూతుళ్లు, కొడుకు, మనవళ్లను కౌగిలించుకుని విలపించింది. తనను స్వదేశానికి రప్పించడంలో చొరవ చూపిన సామాజిక కార్యకర్త గాబ్రియేలుకు చేతులెత్తి నమస్కరించి కృతజ్ఞతలు తెలిపింది. -
దళిత మహిళపై పది మంది గ్యాంగ్ రేప్
బారేలీ: దళిత మహిళపై పది కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణోదంతం ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. బారేలోని కంటోన్మెంట్ ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పొలం నుంచి ఇంటికి తిరిగొస్తున్న 40 ఏళ్ల దళిత మహిళను ఎత్తుకెళ్లి పది మంది సామూహిక అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. ఆమె భర్త, కొడుకు కట్టేసి వారీ దారుణానికి ఒడిగట్టినట్టు చెప్పారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన బాధితురాలి బంధువులపై దుండగులు దాడి చేశారు. పది మంది నిందితులపై కేసు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేయడంలో అలసత్వం ప్రదర్శించిన పోలీసులపైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు.