Digital Technology
-
డిజిటల్ ప్రపంచంలో.. సంపద ఇలా భద్రం..
డిజిటల్ టెక్నాలజీ వినియోగం వేగవంతం కావడంతో కమ్యూనికేషన్, వ్యాపారాల నుంచి హెల్త్కేర్, వినోదం వరకు మన జీవితాలన్నింటిలో చాలా మార్పులు వస్తున్నాయి. కృత్రిమ మేథ, మెషిన్ లెర్ణింగ్ మొదలైనవి డేటా విశ్లేషణ, ఆటోమేషన్ వంటి అంశాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అప్లికేషన్స్ సౌకర్యవంతంగా ఉంటున్నాయి. రోబోటిక్స్, ఆటోమేషన్లాంటివి తయారీ, లాజిస్టిక్స్, వ్యవసాయం లాంటి రంగాల్లో పెను మార్పులు తెస్తున్నాయి. ఇవన్నీ సౌకర్యవంతంగా ఉంటున్నప్పటికీ వీటి వినియోగం విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి పోర్ట్ఫోలియోలను ఆన్లైన్లో ట్రాకింగ్ చేయడం నుంచి పెట్టుబడుల వరకు అన్నీ కూడా ఫోన్ ద్వారానే చేసే వీలుంటోంది. అయితే, ఈ సౌకర్యం వెనుక మన డిజిటల్ భద్రతకు ముప్పులు కూడా పొంచి ఉంటున్నాయి. ఇన్వెస్టర్ల విషయానికొస్తే తమ పాస్వర్డ్లు లేదా యాప్లను సురక్షితంగా ఉంచుకోవడం ఒకెత్తైతే, ఏళ్లతరబడి ఆర్థిక ప్రణాళికలను సైబర్ నేరగాళ్ల నుంచి కాపాడుకోవడం మరో ఎత్తుగా ఉంటోంది. సైబర్ నేరగాళ్లు కేవలం పెద్ద వ్యాపారులు, సంపన్నులనే కాదు.. చిన్న చిన్న ఇన్వెస్టర్లను కూడా టార్గెట్ చేసుకుంటున్నారు. ఫిషింగ్, ర్యాన్సమ్వేర్లాంటివి ప్రయోగిస్తున్నారు. ఫిషింగ్ సంగతి తీసుకుంటే, ఆర్థిక సంస్థలు లేదా అడ్వైజర్ల నుంచి వచి్చనట్లుగా కనిపించేలా ఈమెయిల్స్, మెసేజీల్లాంటివి పంపిస్తారు. మిమ్మల్ని మాయ చేసి పాస్వర్డ్ల్లాంటి వ్యక్తిగత వివరాలు సేకరిస్తారు. ఆ తర్వాత మీ ప్రమేయం లేకుండానే మీ ఖాతాల్లోనుంచి విత్డ్రా చేసుకోవడం, ట్రేడింగ్ చేయడంలాంటివి చేసి ఖాతాలను కొల్లగొడతారు. ఇక ఐడెంటిటీ థెఫ్ట్ కేసుల్లో మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి, మీ పేరు మీద రుణాలు తీసుకోవడం, మీ ఖాతాలను ఖాళీ చేయడంలాంటివి జరుగుతుంటాయి. ర్యాన్సమ్వేర్ దాడులు మరింత అధునాతనంగా ఉంటాయి. సైబర్ నేరగాళ్లు మీ ఖాతాలను స్తంభింపచేసి, తిరిగి మీ చేతికివ్వాలంటే డబ్బు కట్టాలంటూ బెదిరింపులకు దిగుతారు. మిమ్మల్ని నేరుగా టార్గెట్ చేయకపోయినా మీరు ఆధారపడే ఆర్థిక సేవలను లక్ష్యంగా చేసుకుని మీ లావాదేవీలకు అంతరాయం కలిగించవచ్చు. కొన్నిసార్లు క్రిమినల్స్ నేరుగా పెట్టుబడి ప్లాట్ఫాంలలోకి చొరబడి నిధులను దొంగిలించవచ్చు. తప్పుడు ట్రేడింగ్ చేసి నష్టపర్చవచ్చు. అలాగని ఇలాంటి పరిణామాల వల్ల డిజిటల్ సాధనాల మీద నమ్మకాన్ని కోల్పోనక్కర్లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు ఇలాంటి సవాళ్లను అధిగమించవచ్చు. → మీ అకౌంట్లకు పటిష్టమైన పాస్వర్డ్లను వాడండి. తరచూ వాటిని అప్డేట్ చేస్తూ ఉండండి. పాస్వర్డ్లను భద్రపర్చుకునేందుకు ఒక పాస్ వర్డ్ మేనేజర్ వెబ్సైట్ను ఉపయోగించవచ్చు. → మల్టీ–ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ను ఉపయోగించండి. వీలైన సందర్భాల్లో మీ ఫోన్కు వెరిఫికేషన్ కోడ్లు వచ్చేలా జాగ్రత్తలు తీసుకోండి. పర్సనల్ డివైజ్లను అన్లాక్ చేసేందుకు బయోమెట్రిక్స్ను ఎనేబుల్ చేయండి. → ఫిషింగ్, సోషల్ ఇంజినీరింగ్ దాడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. బ్యాంకులు, మ్యుచువల్ ఫండ్లు లేదా ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి వచి్చనట్లుగా అనిపించేలా మోసగాళ్లు ఈమెయిల్స్ లేదా మెసేజీలు పంపిస్తుంటారు. వ్యక్తిగత సమాచారాన్ని ఇచ్చేలా మిమ్మల్ని మభ్యపెట్టొచ్చు. అప్రమత్తత వహించండి. అనుమానం వస్తే వెంటనే ఆ సంస్థను అధికారిక మాధ్యమాల ద్వారా సంప్రదించండి. → డివైజ్లను భద్రంగా ఉంచుకోండి. విశ్వసనీయ ప్లాట్ఫాంలు, యాప్ల ద్వారానే ఆర్థిక లావాదేవీలు నిర్వహించండి. సాఫ్ట్వేర్, ఓఎస్లు, యాంటీవైరస్ ప్రోగ్రాంలను అప్డేటెడ్గా ఉంచండి. కీలకమైన డేటా చోరీ కాకుండా డివైజ్ ఎన్క్రిప్షన్ను ఎనేబుల్ చేయండి. డివైజ్ల స్క్రీన్ను లాక్ చేసి ఉంచండి. ఆటోలాక్ను ఎనేబుల్ చేయండి. సెషన్ హైజాక్ కాకుండా, ట్రాకింగ్ను, ఆటో–లాగిన్ రిసు్కలను నియంత్రించేందుకు బ్రౌజర్ నుంచి కుకీలను, హిస్టరీని తొలగించండి. → ఆర్థిక లావాదేవీల కోసం పబ్లిక్ వై–ఫైను వాడొద్దు. ప్రయాణాల్లో కీలకమైన అకౌంట్లు, ఆర్థిక సేవల ప్లాట్ఫాంలలోకి లాగిన్ అయ్యేందుకు సురక్షితమైన వీపీఎన్ను ఉపయోగించండి. → వ్యక్తిగత సమాచారాన్ని ఆన్లైన్లో షేర్ చేసుకోవడం తగ్గించుకోండి. మీ పుట్టిన రోజు లేదా ఆర్థిక వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోకండి. సైబర్ నేరగాళ్ల బారిన పడే రిసు్కలు ఉన్నాయి.→ బ్యాంకు ఖాతా స్టేట్మెంట్లు, లావాదేవీలను తరచూ పరిశీలించండి. అనధికారిక లావాదేవీలేవైనా కనిపిస్తే సత్వరం గుర్తించొచ్చు. → కీలకమైన డాక్యుమెంట్ల వంటి వాటిని సురక్షితమైన, ఆఫ్లైన్ లొకేషన్లలో బ్యాకప్ తీసుకోండి. రాన్సమ్వేర్ రిసు్కలను తగ్గించుకోవచ్చు. → సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతుల్లో మోసాలు చేస్తున్నారు. ఇలాంటి వాటి గురించి ఆర్థిక సంస్థలు తరచుగా అప్డేట్లు, టిప్లు ఇస్తున్నాయి. వాటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, అప్డేట్గా ఉండాలి. -
సైబర్ సవాలు
అమృతంతో పాటు హాలాహలం పుట్టిందట. సౌకర్యాలెన్నో తెచ్చిన డిజిటల్ సాంకేతికత విసురు తున్న తాజా సవాళ్ళను చూస్తే అదే గుర్తొస్తుంది. రెచ్చిపోతున్న సైబర్ మోసగాళ్ళు, పెచ్చుమీరు తున్న డిజిటల్ స్కామ్ల సంఖ్యే అందుకు తార్కాణం. ‘డిజిటల్ అరెస్ట్ మోసాల’ బారినపడి ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ రూ. 75 లక్షలు, ఓ పారిశ్రామికవేత్త రూ. 7 కోట్లు నష్టపోయిన కథనాలు అమాయ కుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. చదువు లేని సామాన్యుల దగ్గర నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగుల వరకు చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ తమ కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్న వైనం అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. కొత్త సాంకేతికత వచ్చినప్పుడల్లా కొత్త రకం మోసాలూ అంతే వేగంగా ప్రభవించడం ఆది నుంచీ ఉంది. అయితే, అడ్డుకట్ట వేసినప్పుడల్లా మోస గాళ్ళు సైతం తెలివి మీరి కొత్త రీతుల్లో, మరింత సృజనాత్మకంగా మోసాలు చేయడమే పెను సవాలు. అనేక అంశాలతో ముడిపడ్డ దీన్ని గట్టిగా తిప్పికొట్టాలంటే ఏకకాలంలో అనేక స్థాయుల్లో చర్యలు చేపట్టాలి. అందుకు ప్రజా చైతన్యంతో పాటు ప్రభుత్వ క్రియాశీలత ముఖ్యం. సాక్షాత్తూ భారత ప్రధాని సైతం తన నెల వారీ ‘మన్ కీ బాత్’ రేడియో ప్రసంగంలో తాజాగా ఈ ‘డిజిటల్ అరెస్ట్ మోసాల’ గురించి ప్రస్తావించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. బాధితులను ముందుగా ఫోన్లో సంప్రతించడం, మీ ఆధార్ నంబర్ – ఫోన్ నంబర్పై వెళుతున్న డ్రగ్స్ పార్సిల్ను పట్టుకున్నామనడం, ఆపై వాట్సప్, స్కైప్లలో వీడియో కాల్కు మారడం, తాము నిజమైన పోలీసులమని నమ్మించడం, నకిలీ పత్రాలు చూపి ‘డిజిటల్ అరెస్ట్’ చేసినట్టు బాధితులను భయపెట్టడం, ఆఖరికి వారి కష్టార్జితాన్ని కొల్లగొట్టడం ‘డిజిటల్ అరెస్ట్ మోసాల’ వ్యవహారశైలి. మోసగాళ్ళు తమను తాము పోలీసులుగా, సీబీఐ అధికారులుగా, మాదకద్రవ్యాల నిరోధక శాఖకు చెందినవారిగా, రిజర్వ్ బ్యాంక్ అధికారులుగా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులుగా, చివరకు జడ్జీలమని కూడా చెప్పుకుంటూ... అమాయకులపై మానసికంగా ఒత్తిడి తెచ్చి, భయభ్రాంతులకు గురి చేసి ఆఖరికి వారి నుంచి లక్షల రూపాయల కష్టార్జితాన్ని అప్పనంగా కొట్టేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ స్కామ్, ట్రేడింగ్ స్కామ్, పెట్టుబడుల స్కామ్, డేటింగ్ యాప్ల స్కామ్... ఇలా రకరకాల మార్గాల్లో సైబర్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఏటేటా ఈ మోసాలు పెరుగు తున్నాయి. ఒక్క ఈ ఏడాదే కొన్ని వేల డిజిటల్ అరెస్ట్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. రోజూ లెక్కకు మిక్కిలిగా నమోదవుతున్న ఈ సైబర్ నేరాల గణాంకాలు చూస్తే కళ్ళు తిరుగుతాయి. 2021లో 4.52 లక్షల ఫిర్యాదులు వస్తే, 2022లో 9.66 లక్షలు, గత ఏడాది 15.56 లక్షల ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇక, ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లోనే ఏకంగా 7.4 లక్షల ఫిర్యాదులు అందా యని నేషనల్ సైబర్క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సీఆర్పీ) కథనం.ఆర్థిక నష్టానికొస్తే జనవరి – ఏప్రిల్ మధ్య డిజిటల్ మోసాల వల్ల భారతీయులు రూ. 120 కోట్ల పైగా పోగొట్టుకున్నారు. అలాగే, ట్రేడింగ్ స్కామ్లలో రూ. 1420.48 కోట్లు, పెట్టుబడుల స్కామ్లలో రూ. 222.58 కోట్లు, డేటింగ్ స్కామ్లలో రూ. 13.23 కోట్లు నష్టపోవడం గమనార్హం. చిత్రమేమిటంటే, ఈ డిజిటల్ మోసాల్లో దాదాపు సగం కేసుల్లో మోసగాళ్ళు మయన్మార్, లావోస్, కాంబోడియాల నుంచి కథ నడిపినవారే!గమనిస్తే, గత పదేళ్ళలో భారతీయ మధ్యతరగతి వర్గం వార్షికాదాయం లక్షన్నర – 5 లక్షల స్థాయి నుంచి రూ. 2.5 – 10 లక్షల స్థాయికి మారిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదిక. సహజంగానే ఆర్థిక స్థాయితో పాటు మధ్యతరగతి అవసరాలు, ఆకాంక్షలూ పెరిగాయి. కాలంతో పాటు జీవితంలోకి చొచ్చుకువచ్చిన డిజిటల్ సాంకేతికతను అందరితో పాటు అందుకోవాల్సిన పరిస్థితి. డిజిటల్ అక్షరాస్యత లేకపోయినా డిజిటల్ చెల్లింపు వేదికలు సహా అన్నీ అనివార్య మయ్యాయి. అయితే, సౌకర్యంతో పాటు సవాలక్ష కొత్త సవాళ్ళనూ ఆధునిక సాంకేతికత విసిరింది. అవగాహన లేమితో సామాన్యుల మొదలు సంపన్నుల దాకా ప్రతి ఒక్కరూ మోసపోతున్న ఘటనలు ఇటీవల పెరిగిపోతున్నది అందుకే. జీవితమంతా కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ము ఇలా మోసాల పాలవుతుండడంతో మధ్యతరగతి సహా అందరిలోనూ ఇప్పుడు భయాందోళనలు హెచ్చాయి. దీన్ని ఎంత సత్వరంగా, సమర్థంగా పరిష్కరిస్తామన్నది కీలకం. ప్రధాని చెప్పినట్టు ‘డిజిటల్గా అరెస్ట్’ చేయడమనేదే మన చట్టంలో లేదు. అసలు ఏ దర్యాప్తు సంస్థా విచారణకు ఫోన్ కాల్, వీడియో కాల్ ద్వారా సంప్రతించదు. కానీ, అలా అబద్ధపు అరెస్ట్తో భయపెట్టి డబ్బు గుంజడం మోసగాళ్ళ పని. అది జనం మనసుల్లో నాటుకొనేలా చేయాలి. డిజిటల్ నిరక్షరాస్యతను పోగొట్టి, సాంకేతికతపై భయాలను తొలగించాలి. సరిగ్గా వాడితే సాంకేతికతలో ఉన్న లాభాలెన్నో గ్రహించేలా చూడాలి. క్షణకాలం సావధానంగా ఆలోచించి, అప్రమత్తమైతే మోస పోమని గుర్తించేలా చేయాలి. ఒకవేళ మోసపోతే, ఎక్కడ, ఎలా తక్షణమే ఫిర్యాదు చేసి, సాంత్వన పొందాలన్నది విస్తృత ప్రచారం చేయాలి. మోసాలను అరికట్టి, అక్రమార్కుల భరతం పట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలను చేపట్టాలి. మన సైబర్ భద్రతా వ్యవస్థను ఎప్పటికప్పుడు తాజా అవస రాలకు అనుగుణంగా నవీకరించాలి. అన్ని రకాల సైబర్ నేరాలపై చర్యల్లో సమన్వయానికి కేంద్రం ఇప్పటికే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐసీ4)ను నెలకొల్పింది. తీరా దాని పేరు మీదే అబద్ధాలు, మోసాలు జరుగుతున్నందున అప్రమత్తత పెంచాలి. అవసరంతో పని లేకుండా వ్యక్తిగత సమాచారాన్ని అన్నిచోట్లా అడగడాన్నీ, అందించాల్సి రావడాన్నీ నివారించాలి. ఎంతైనా, నిరంతర నిఘా, నిర్దిష్టమైన అవగాహన మాత్రమే సైబర్ మోసాలకు సరైన విరుగుడు. -
గ్లోబల్ ఫ్రేమ్వర్క్ కావాలి
న్యూఢిల్లీ: ఆధునిక యుగంలో ప్రపంచ మొత్తం పరస్పరం అనుసంధానమైన నేపథ్యంలో డిజిటల్ టెక్నాలజీ, కృత్రి మేధ(ఏఐ)ని ఉపయోగించుకొనే విషయంలో స్పష్టమైన విధివిధానాలు అవసరమని ప్రధాని మోదీ చెప్పారు. గ్లోబల్ ఫ్రేమ్వర్క్ను ఏర్పాటు చేసుకొనే అంశంపై అన్ని దేశాలు దృష్టి పెట్టాలని సూచించారు. డిజిటల్ టెక్నాలజీని వాడుకొనే పౌరుల వ్యక్తిగత వివరాల భద్రత, గోప్యతను తప్పనిసరిగా కాపాడాలని పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో ‘ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్–డబ్ల్యూటీఎస్ఏ, ఇండియా మొబైల్ కాంగ్రెస్’ను మోదీ ప్రారంభించారు.డిజిటల్ సాంకేతికత విషయంలో నిబంధనల ఆధారిత ఫ్రేమ్వర్క్ ప్రాధాన్యతను ప్రపంచస్థాయి సంస్థలు గుర్తించాల్సిన సమయం వచ్చిందని స్పష్టంచేశారు. ఈ నిబంధనలు కేవలం వ్యక్తిగత భద్రత, టెక్నాలజీ సంస్థల పారదర్శకతకే కాదు, అంతర్జాతీయ డేటా ప్రవాహంపై ఆధారపడి ఉన్న వాణిజ్యం, వస్తు సేవలకు సైతం కీలకమేనని ఉద్ఘాటించారు. సైబర్ మోసాల నుంచి ఏ ఒక్క దేశమూ ఒంటరిగా తమ ప్రజలకు రక్షణ కలి్పంచలేదని అభిప్రాయపడ్డారు.అందుకే అంతర్జాతీయ స్థాయిలో నిబంధనలు ఏర్పాటు చేసుకోవాలని, ఇందుకు అంతర్జాతీయ సంస్థలు బాధ్యత తీసుకోవాలన్నారు. డిజిటల్ టెక్నాలజీ రంగంలో భారత్ సాధించిన ప్రగతిని ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశంలో మొబైల్ ఫోన్ల వినియోగదారుల సంఖ్య 120 కోట్లకు చేరిందని గుర్తుచేశారు. 95 కోట్ల మంది ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారని తెలిపారు. ప్రపంచంలోని మొత్తం డిజిటల్ లావాదేవీల్లో ఏకంగా 40 శాతం భారత్లోనే జరుగుతున్నాయని వివరించారు. డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల విషయంలో తమ అనుభవాన్ని ఇతర దేశాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. -
భారత్లో మైక్రోసాఫ్ట్ సీడబ్ల్యూబీ ప్రోగ్రాం..
బెంగళూరు: మైక్రోసాఫ్ట్ తమ ‘కోడ్ వితౌట్ బ్యారియర్స్’ (సీడబ్ల్యూబీ) ప్రోగ్రాంను భారత్లోనూ ప్రవేశపెట్టింది. దీని కింద ఈ ఏడాది 75,000 మంది మహిళా డెవలపర్లకు శిక్షణ కలి్పంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ చీఫ్ సత్య నాదెళ్ల తెలిపారు. క్లౌడ్, కృత్రిమ మేధ, డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో లింగ అసమానతలను తొలగించడంలో తోడ్పడే ఉద్దేశంతో ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని తొమ్మిది దేశాల్లో 2021లో ఈ ప్రోగ్రాంను ఆవిష్కరించినట్లు ఆయన చెప్పారు. దీని కింద మహిళా డెవలపర్లు, కోడర్స్కు శిక్షణ, నెట్వర్కింగ్ అవకాశాలు కల్పిస్తున్నట్లు సత్య నాదెళ్ల వివరించారు. మైక్రోసాఫ్ట్ ఏఐ టూర్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాలు చెప్పారు. మరోవైపు శిక్షణ ఫౌండేషన్, మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న శిక్షా కోపైలట్ ప్రోగ్రాం.. ప్రధానంగా ఉపాధ్యాయులకు సాధికారత కలి్పంచేందుకు ఉద్దేశించినదని సత్య నాదెళ్ల తెలిపారు. అజూర్ ఓపెన్ఏఐ మోడల్ తోడ్పాటుతో పాఠ్యాంశాలను విద్యార్థులు మరింత సులభంగా అర్థం చేసుకునేలా పాఠ్యప్రణాళికలను రూపొందించేందుకు శిక్షా కోపైలట్ ప్రోగ్రాం ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రస్తుతం బెంగళూరులోని 30 గ్రామీణ, పట్టణ పాఠశాలల్లో ఉపయోగిస్తున్న ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు కృషి చేస్తున్నట్లు సత్య నాదెళ్ల వివరించారు. -
కృత్రిమ మేధతో నవ ప్రపంచం?
స్మార్ట్ ఫోన్ల రాకతోనే జనం వాస్తవ ప్రపంచానికి దూరమయ్యారని ఒక విమర్శ. అలాంటిది జనరేటివ్ ఏఐ మనదాకా వస్తే? అప్పుడు వర్చువల్ ప్రపంచంలో మరింత కూరుకుపోతామా? మన చాలా పనులను ఏఐ చేయడం మొదలుపెడితే, మన చేతికి బోలెడు సమయం చిక్కుతుంది. అప్పుడు మనం తోటలో తిరుగుతూనో, వ్యాయామం చేస్తూనో గడపవచ్చు. విద్యార్థులకు పుస్తకాల బరువు తగ్గిపోతుంది. పిల్లల శక్తిసామర్థ్యాలకు తగ్గట్టుగా రోబోలు చదువులు చెబుతాయి. కానీ ఎప్పుడో మొదలైన డిజిటల్ విప్లవ ఫలాలు ఇప్పటికీ అందరికీ చేరనేలేదు. ఈ నేపథ్యంలో కృత్రిమ మేధ వంటి అత్యాధునిక టెక్నాలజీ కేవలం కొందరికి మాత్రమే ప్రయోజనం కలిగించేదిగా మారుతుందా అన్నది ప్రశ్న! ఒక సగటు భారతీయుడు ఏడాదికి 2,300 గంటల సమయం స్మార్ట్ ఫోన్ మీద గడిపే స్తున్నాడని ఒక అంచనా. 580 గంటలు ఓటీటీ(ఓవర్ ద టాప్) ప్లాట్ ఫామ్లలో కంటెంట్ను వెతుక్కుని వాటిని చూసేందుకు ఉపయోగి స్తున్నారు. సోషల్ మీడియాలోనూ దాదాపు ఇదే రకమైన ధోరణి కనిపి స్తోంది. సైబర్ మీడియా రీసెర్చ్ ద్వారా మేము జరిపిన అధ్యయనంలో ఈ పోకడలు వెల్లడయ్యాయి. కొన్నేళ్లుగా డిజిటల్ వినియోగ దారుల తీరుతెన్నులను పరిశీలించేందుకు మేము ఈ సర్వేల్లాంటివి చేస్తున్నాం. స్మార్ట్ ఫోన్లు, టెక్నాలజీలతో మన జీవితాలు ఎంతగా పెన వేసుకుపోయాయో సూచిస్తాయి ఈ సర్వే విశేషాలు. చేతిలో కావాల్సినంత సమయం 2024 అంటే ఈ ఏడాది ఇప్పటివరకూ చెప్పుకున్న అంశాలన్నింటిలోనూ విప్లవాత్మక మార్పులు వస్తే? జరగబోయేది ఇదే. అంతా జనరేటివ్ ఏఐ పుణ్యం! 2023లో కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్– ఏఐ), మరీ ముఖ్యంగా జనరేటివ్ ఏఐ అనేది ప్రపంచం మొత్తాన్ని ఒక్క కుదుపు కుదిపేసింది. అన్ని రంగాల్లోనూ తనదైన ముద్ర వేసింది. టెక్నాలజీ ధోరణులను నిత్యం పరిశీలించే విశ్లేషకుడిగా 2024లో ఈ ఏఐ విషయంలో ఏం జరగబోతోందన్నది నాకెంతో ఉత్సుకత రేకెత్తించే అంశం. అయితే ఒక్కటైతే నిజం. ఈ ఏడాది కృత్రిమ మేధ విస్తృత స్థాయికి చేరుతుందన్నది నా నమ్మకం. జనరేటివ్ ఏఐ అనేది మన చిన్న చిన్న పనులను ఇట్టే చేసేస్తుంది. టెక్ట్స్ జనరేట్ చేయడం, చిత్రాలు, మోడల్స్ను సిద్ధం చేయడం వంటి చాలా పనులను ఆటోమేట్ చేయనుంది. భవిష్యత్తులో ఏం జరుగు తుందన్నది ఒకసారి చూస్తే... ఏఐ, జనరేటివ్ ఏఐ నైపుణ్యాలు కలిగిన వారు మిగిలిన వారికంటే మెరుగైన స్థితిలో ఉంటారు. దీనివల్ల 2024 లోనే కాదు... ఆపై కూడా మన చేతుల్లో బోలెడంత సమయం మిగిలి పోనుంది. ఈ మార్పు పుణ్యమా అని ఉత్పాదకత పెరుగుతుంది. కాసేపు ప్రకృతి ఒడిలో సేద తీరడం మొదలుకొని మన ఫిట్నెస్ గోల్స్ను సాధించుకునేందుకు ప్రయత్నించడం, లేదా తోటపని చేసు కోగలగడం ఎంత గొప్ప అనుభూతిని ఇస్తుందో ఆలోచించండి. విద్యార్థుల నేస్తం మనుషులు సర్వవ్యాప్తమైన ఏఐ, జనరేటివ్ ఏఐలతో కలిసి జీవించడం అలవాటు అవుతున్న తరుణంలో జనరేషన్ ఆల్ఫా పరిస్థితి ఏమిటి? 2010, అటుపై పుట్టినవాళ్లను జనరేషన్ ఆల్ఫా అంటున్నాం. వీరు కృత్రిమ మేధకు స్థానికుల కింద లెక్క. వీరికి ఏఐ అనేది మునుపటి తరానికి స్మార్ట్ ఫోన్ మాదిరిగా మారి ఉంటుంది. మనతో మాట్లాడగలిగే ఆటబొమ్మలు ఇప్పుడు బోలెడు అందుబాటులోకి వచ్చే శాయి. భావోద్వేగాలను పలికించగల, ఏఐ భాగస్వామి అని పిలు స్తున్న తెలివైన రోబోలు పిల్లలకు వారి శక్తిసామర్థ్యాలకు తగ్గట్టు చదువులు చెప్పేందుకు సిద్ధమవుతున్నాయి. వారితోపాటు తాము ఎదిగేందుకు రోబోలు ప్రయత్నిస్తున్నాయి. పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకు జనరేటివ్ ఏఐ ఓ కొత్త ప్రపంచాన్ని వారి కళ్లముందు ఆవిష్కరించనుంది. భవిష్యత్తులో పిల్లల భుజాలపై పుస్తకాల సంచి బరువు ఉండకపోవచ్చు. ఇంటరాక్టివ్ సిము లేషన్ ్స, అడాప్టివ్ టెక్ట్స్ బుక్స్, ఏఐ మెంటర్స్... విద్యార్థుల అవస రాలు, ఆశయాలకు అనుగుణంగా బోధించడం మొదలవుతుంది. ఇప్పటిమాదిరిగా బట్టీపట్టే విషయం గత చరిత్ర కానుంది. పిల్లలు గొలుసులన్నీ తెంచుకుని, పిచ్చి పోటీని వదిలించుకుని తమకు నచ్చిన అంశాన్ని చదవుకునే వీలు ఏర్పడుతుంది. ప్రతి దశలోనూ కృత్రిమ మేధ వారికి తోడుగా నిలుస్తుంది. కృత్రిమ మేధ ప్రపంచంలో ఉపా ధ్యాయుల పాత్ర కూడా గణ నీయంగా మారనుంది. సృజనాత్మకత, ఇష్టాయిష్టాలకు అనుగుణంగా విద్యార్థులు చేసే ప్రయత్నాలకు సహాయం అందించే వారిగా వీళ్లు మారిపోతారు. ఇలాంటి వాతా వరణంలో పెరిగి పెద్దయిన పిల్లలు ఏఐ ఆధారిత టూల్స్, లాంగ్వేజ్ మోడళ్ల సాయంతో భాషా భేదాలను అధిగమిస్తారు. అంతరాలు తగ్గేనా? కృత్రిమ మేధ కచ్చితంగా ఓ అందమైన, సానుకూల భవి ష్యత్తును చూపుతున్నప్పటికీ దీనికి ఇంకో కోణమూ ఉంది. ఇప్పటికే ఉన్న డిజిటల్ అంతరం మరింత పెరుగుతుందా? ఫలితంగా ఏఐ లాంటి అత్యాధునిక టెక్నాలజీ ఫలాలు కేవలం కొందరికి మాత్రమే పరిమితమవుతాయా అన్నది ఇంకో ప్రశ్న. ఎప్పుడో దశాబ్దాల క్రితం మొదలైన డిజిటల్ విప్లవ ఫలాలు ఇప్పటికీ అందరికీ చేరనేలేదు. డిజిటల్ డివైడ్ అని పిలుస్తున్న ఈ అంతరమే పూర్తిగా పూడని నేపథ్యంలో కృత్రిమ మేధ వంటి అత్యాధునిక టెక్నాలజీ కేవలం కొందరికి మాత్రమే ప్రయోజనం కలిగించేదిగా మారితే ఎలా అన్నది అందోళన కలిగించే అంశం. ఇక మనుషుల మధ్య సంపర్కం ఇంతకుముందులానే ఉంటుందా? మానవ సంబంధాలు మునుపటి మాదిరిగానే కొనసాగుతాయా? ఈ నేపథ్యంలో కృత్రిమ మేధను బాధ్యతాయుతంగా వాడుకోవడం చాలా అవసరమవుతుంది. ప్రైవసీ, వివక్ష, విశ్వసనీయత వంటి విషయాల్లోనూ ప్రశ్నలు మిగిలే ఉంటాయి. ఒక్కటైతే వాస్తవం. ప్రపంచగతిని మార్చేసే శక్తి ఏఐ సొంతం. సమర్థత అనేది అన్ని రంగాల్లోనూ పెరిగిపోయేందుకు ఇది కారణమవుతుంది. ఈ తరం పిల్లలు ఏఐ నేతృత్వంలోని ప్రపంచంలో ఎదుగుతారు. తమ చుట్టూ ఉన్న ప్రపంచంతో మరింత సృజనాత్మకంగా మసలుకునేందుకు వీరికి అవకాశాలు ఎక్కువ. వ్యాసకర్త సైబర్ మీడియా రీసెర్చ్(సీఎంఆర్)లో ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూప్ విభాగాధిపతి (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
సాంకేతిక పోటీలో నిలబడాలంటే...
గౌరవనీయులైన ఛాన్సలర్ శ్రీ గిరిధర్ మాలవ్య, వైస్– ఛాన్సలర్ ప్రొఫెసర్ సుధీర్ జైన్ తదితరులకు నమ స్కారం. 103వ స్నాతకోత్స వానికి ముఖ్య అతిథిగా పాల్గొ నడం నాకు దక్కిన గౌరవం. ఈ రోజు డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు జ్ఞాపకాల పుస్త కంలో శాశ్వతంగా నిలిచిపోయే రోజు ఇది. తరగతి గదులనూ, పరీక్షలనూ దాటుకొని వాస్తవ ప్రపంచంలోకి మీ ప్రయాణం ప్రారంభమయ్యే రోజు ఇది. ఈ తరుణంలో రాబోయే కాలంలో శాస్త్ర, సాంకేతిక రంగాలలో భారతదేశం ఎదుర్కొనే సవాళ్లను, లభించే అవకాశాలను పరిశీలిద్దాం. విద్య, శాస్త్ర (సైన్స్), సాంకేతికత (టెక్నాలజీ), నూతన పరిశోధనలు – అనే నాలుగు స్తంభాలు ఏ దేశాన్నైనా బలంగా నిలబెట్టేవి. ఈ నాలుగు స్తంభాలూ దేనికదే గణనీయమైన బలాన్ని సము పార్జించుకున్నప్పటికీ దేనికదే ఒంటరిగా చాలా కాలం పయనించాయి. గతానుగతికమైన ఈ దృక్పథం మారాలి. అలా మారిన దృక్పథం ఎక్కువ ప్రయోజ నాలను పొందేలా చేస్తుంది. ఈ విధానం వలన ఉత్సుకతతో నడిచే ప్రాథమిక శాస్త్ర విజ్ఞాన పరిశో ధనలు, అనువర్తిత పరిశోధనలు అనే విభజనకు దారి తీసింది. నేటి ప్రాథమిక శాస్త్ర విజ్ఞానం త్వరలో సాంకే తికతా రూపంలోకి అనువర్తించ బడుతుందని గుర్తుంచుకోవాలి. గురుత్వాకర్షణ తరంగాలను కూడాఅంచనా వేసిన ఐన్స్టీన్ ‘సాపేక్షతా’ సిద్ధాంతం గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీ) అనే సాంకేతికతకు కచ్చితంగా అవసరమని ఆనాడు ఎవరూ ఊహించిఉండరు. ఐన్స్టీన్ ప్రతిపాదించిన సాధారణ సాపేక్ష సిద్ధాంతం లేకుండా ఉపగ్రహాలు ఎలా కదులుతాయో కచ్చితంగా అంచనావేసి చెప్పలేం కదా. ఈ సందర్భంలో భారత ప్రభుత్వ ప్రధాన సాంకేతిక సలహాదారుగా, నా సహచరులతో కలిసి సాంకేతికతకు సంబంధించి ప్రస్తుత, భవిష్యత్ అవసరా లను రూపొందించే క్రమంలో మా ఆలోచనలను మీతో పంచుకోవాలనుకుంటున్నాము. విఘాతం కలి గించే అభివృద్ధి కన్నా క్రమాభివృద్ధే మాకు ముఖ్యం. భారతదేశం అనేక రంగాలలో వైజ్ఞానిక విప్లవాల దిశగా దూసుకుపోతోంది. క్వాంటం టెక్నాలజీ, ఎమ ర్జింగ్ డిజిటల్ టెక్నాలజీ, ఆరోగ్య రక్షణ, క్లీన్ ఎనర్జీ వంటివి అందులో కొన్ని ముఖ్యమైనవి. క్వాంటం విప్లవం గురించి రెండు మాటలు చెబుతాను. మొదటి క్వాంటం విప్లవం 1913–1925 మధ్య సంభవించింది. దీనివల్ల హైడ్రోజన్ అణువు వర్ణపట రేఖలు క్వాంటం పద్ధతి ద్వారా మాత్రమే అర్థం చేసుకోగలిగాం. ప్రస్తుతం చూస్తున్న రెండవ క్వాంటం విప్లవంలో వ్యక్తిగతమైన, సంక్లిష్టమైన క్వాంటం సిస్టమ్లను నియంత్రించడంపై దృష్టి పెట్టడం కనిపిస్తుంది. అంటే సంప్రదాయ కంప్యూటర్లను ఉప యోగించి పరిష్కరించలేని సమస్యలను పరిష్కరించడమన్నమాట! ఉదాహరణకు ప్రకృతిలో సహజ సిద్ధంగా జరిగే కిరణజన్య సంయోగక్రియలో సౌరశక్తిని రసాయనశక్తిగా మార్చగలిగే పత్రహరిత రేణువులూ, అలాగే వాటి అనుబంధ ద్రవ్యాల శక్తినీ ‘క్వాంటం మోడల్’ అనే చిత్రపటం ద్వారా కిరణజన్య సంయోగ క్రియ సమర్థతను తెలుసుకోవచ్చు. కొన్ని ప్రయోగ శాలల్లో ఇప్పటికే క్వాంటం కంప్యూటర్స్ ద్వారా ఏర్పాటు చేసిన ‘క్యూ బిట్స్’ ఉండటాన్ని మనం గమ నిస్తున్నాము. భారతదేశం క్వాంటం టెక్నాలజీకిసంబంధించి ఇటీవల ఒక మిషన్ను ప్రారంభించింది. ఇవ్వాళ డిజిటల్ టెక్నాలజీ కృత్రిమ మేధ... యాంత్రిక శిక్షణ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియా లిటీ, మిక్స్డ్ రియాలిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇంట ర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి విషయాలపై దృష్టిని సారించింది. సాంకేతిక రంగంలో ప్రపంచపోటీలో నిలబడటానికి, పరిశోధన–అభివృద్ధి, లక్ష్యంగా సాంకే తిక అభివృద్ధి – విస్తరణయే సరైన మార్గం. అందు వల్ల, మేము ఇప్పటికే అమెర్జింగ్, ఫ్యూచరిస్టిక్ టెక్నా లజీస్లపై వివిధ జాతీయ మిషన్లను రూపకల్పన చేశాం. సైబర్ ఫిజికల్ సిస్టమ్పై జాతీయ మిషన్, సెమీకండక్టర్లపై జాతీయ మిషన్, కృత్రిమ మేధపై జాతీయమిషన్ వంటివి ఇటువంటివే. భారత్ కృత్రిమమేధ, యంత్ర అభ్యాసాన్ని, రోబోటిక్స్, టెలిహెల్త్ను ఉపయోగించుకొని స్వదేశీ యమైన కొత్త వైద్య పరికరాల తయారీలో ముంద డుగులో ఉంది. సాంకేతికంగా స్వాలంబనతో ఉండా లంటే మెరుగైన సాంకేతిక ఆధారిత ఉత్పత్తులనూ, సాంకేతిక ఆధారిత వ్యవస్థాపకతనూ సమాంతరంగా ప్రోత్సహించాలి. శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించిన విషయాలలో ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో భాగం కావడానికి మీ తరానికి ఇది అద్భుతమైన అవ కాశం. మీలో చాలా మంది భవిషత్తులో శాస్త్ర, సాంకే తిక రంగాలకు సంబంధించిన సవాళ్ళనూ, సామాజి కంగా ఎదురయ్యే అవరోధాలనూ పరిష్కరించడానికి కృషి చేస్తారని భావిస్తున్నాను. (బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక సలహా దారు ఆచార్య అజయ్ కుమార్ సూద్ ప్రసంగ సంక్షిప్త రూపం. అనువాదం: ఆచార్య బూదాటి వేంకటేశ్వర్లు) - ఆచార్య అజయ్ కుమార్ సూద్ -
భారత ఏఐ మోడల్ ఎలా ఉండాలి?
కృత్రిమ మేధ విప్లవాన్ని అమెరికాలో పెద్ద టెక్నాలజీ కంపెనీలు ముందుకు తోస్తూంటే, చైనాలో అది ప్రభుత్వ మద్దతుతో సాగుతోంది. మరి ఈ విషయంలో భారత్ ఏం చేయాలి? భారతీయ కంపెనీలు, ప్రభుత్వం చేతులు కలిపితే స్థానికంగానే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం) ఒకదాన్ని తయారు చేయడం కష్టమేమీ కాదు. కాకపోతే వీటికి పాశ్చాత్య దేశాల మాదిరిగా పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరించాలా, చైనా తరహాలో ప్రభుత్వ నియంత్రణలో ఈ ఎల్ఎల్ఎంలను ఉంచాలా? అన్నది ముందు నిర్ణయించుకోవాలి. మనం మూడో మార్గం అనుసరించడం మేలు. ఇటీవలి కాలంలో భారతదేశం ప్రపంచానికి పరిచయం చేసిన మార్గమే ఇది. భారత్ తన జనరేటివ్ ఏఐని ప్రజల మంచి కోసం ఉపయోగించాలి. అందరి డిజిటల్ హితం కోసం దాన్ని ‘జన్ ఏఐ’ మోడల్గా తీర్చిదిద్దాలి. వీడియోలు సృష్టించడంలో ఛాట్జీపీటీకి ఉన్న సామర్థ్యం ప్రపంచాన్ని విపరీతంగా ఆకట్టుకోవడమే కాదు... పది కోట్ల మంది దాన్ని వినియోగించేలా చేసింది. ‘ద లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్’ (ఎల్ఎల్ఎం), అలాగే జనరేటివ్ ఏఐకి శక్తినిచ్చే విషయాలన్నీ... ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ వంటివాటిని సమూలంగా మార్చేసే అద్భుత టెక్నాల జీలనడంలో సందేహం లేదు. అందుకే గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కృత్రిమ మేధను ‘ఫైర్’(మంట) అని వర్ణిస్తే, మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల సమూల మార్పునకు నాందిగా అభివర్ణించారు. మరోవైపు గోల్డ్మాన్ శాక్స్ లాంటి సంస్థలు జనరేటివ్ ఏఐ కారణంగా రానున్న దశాబ్ద కాలంలో ప్రపంచ స్థూల జాతీయోత్పత్తికి కనీసం ఏడు లక్షల కోట్ల డాలర్ల మొత్తం చేరుతుందని అంచనా వేస్తోంది. అయితే ఈ సానుకూల అంశాలతోపాటు ఉద్యోగాలు కోల్పోవడం, మానవ ప్రమేయం తగ్గిపోవడం వంటి కొన్నింటిపై ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఏఐ సూపర్ ఇంటెలిజెన్ ్సతో మనిషికి ముప్పు అన్న భావన కూడా పెరుగుతోంది. అలాగే వివక్ష, పర్యావరణ నష్టం, ప్రజాస్వామ్యానికి ముప్పు వంటి అంశాలూ చాలామందికి ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతానికి జనరేటివ్ ఏఐ విషయంలో కార్యకలాపాలు ఎక్కు వగా అమెరికా, చైనాల్లోనే జరుగుతున్నాయి. రెండింటిలోనూ వ్యవస్థల నిర్మాణం, ప్రపంచాన్ని చూసే దృష్టి పూర్తిగా వేరు. అమె రికాలో పెద్ద టెక్ కంపెనీలు ఏఐ విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూండగా, చైనా భిన్నమైన మార్గంలో ప్రయాణిస్తోంది. చైనా కంపెనీలు ప్రభుత్వంతో కలిసి సొంత జనరేటివ్ ఏఐ మోడళ్లు తయారు చేస్తున్నాయి. సమాచారం, సందర్భాలు రెండింటినీ పరిగ ణనలోకి తీసుకునేలా చైనా తన జనరేటివ్ ఏఐ మోడళ్లను నిర్మిస్తోంది. ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలు ఎవరికివారు తమదైన రీతిలో వ్యవహరిస్తున్నారు. అది కూడా పరిమితమైన పరిధిలో. జనరేటివ్ ఏఐ నైతికంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించేలా దాన్ని నియంత్రించడంపై యూరోపియన్ యూనియన్ దృష్టి పెట్టింది. యునైటెడ్ కింగ్డమ్ కూడా ఏఐ ఆధారిత పరిపాలన విషయంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండాలని లక్ష్యిస్తోంది. భారత్ స్థానమెక్కడ? అంతా బాగానే ఉంది కానీ... ఏఐ ఆధారిత ప్రపంచంలో భారత్ స్థానమెక్కడ? మేమూ సొంతంగా ఎల్ఎల్ఎం ప్లాట్ఫామ్స్ సిద్ధం చేసుకుంటామని ఈ మధ్యకాలంలో కొన్ని ప్రకటనలు వచ్చాయి. హడావుడి కూడా కనిపించింది కానీ... ఛాట్జీపీటీ çసృష్టికర్త, ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మన్ వీటిపై తన అభ్యంతరాలను స్పష్టం చేశారు. అయితే, భారతీయ కంపెనీలు, ప్రభుత్వం చేతులు కలిపితే స్థానికంగానే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఒకదాన్ని తయారు చేయడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. భారతీయ భాషలు, కాంటెక్స్›్టతో కూడిన సమాచారాన్ని అందివ్వడం ద్వారా ఈ ఎల్ఎల్ఎంను వినూ త్నంగా తీర్చిదిద్దవచ్చు. కానీ ఇలాంటి ప్రయత్నం చేసేముందు మన లక్ష్యం, ఉద్దేశం ఏమిటన్నది స్పష్టం చేసుకోవడం చాలా ముఖ్యం. పాశ్చాత్య దేశాల మాదిరిగా పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరించాలా? లేక చైనా తరహాలో ప్రభుత్వ నియంత్రణలో ఈ ఎల్ఎల్ఎంలను ఉంచాలా? అన్నది తేల్చుకోవాలి. మాకైతే మూడో మార్గం మేలని అనిపిస్తోంది. ఇటీవలి కాలంలో భారతదేశం ప్రపంచానికి పరిచయం చేసిన మార్గమే ఇది. చాలా సాహసోపేతమైందే కావచ్చు. కానీ భారత్ తన జనరేటివ్ ఏఐని ప్రజల మంచి కోసం ఉపయోగించాలి. డిజిటల్ పబ్లిక్ గుడ్ కోస మన్నమాట. దీన్ని ప్రజల కోసం ‘జన్ ఏఐ’ లేదా ‘జెన్ ఏఐ’ అని పిలుచుకుందాం. సామాజిక వృద్ధి కోసం... భారత్ సృష్టించిన డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీ తెలుసు. ‘ఇండియా–స్టాక్’ ఆధారంగా మొత్తం జనాభా స్థాయిలో డిజిటైజేషన్ సాధ్యం చేయ గలిగాం. ఫలితంగా 140 కోట్ల మందికి డిజిటల్ బయోమెట్రిక్ గుర్తింపులు, యూపీఐతో సులభతర చెల్లింపులు, ఆధార్ గుర్తింపులు, ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమం వంటి ఘనతలు ఎన్నింటినో సాధించగలిగాం. ఈ డిజిటల్ టెక్నాలజీల ఆధారంగా నిర్మించిన సేవల పుణ్యమా అని ఆరోగ్య రంగం కూడా ప్రజలకు మరికొంచెం చేరువైంది. లాజిస్టిక్స్, ఈ–కామర్స్, ప్రభుత్వ సబ్సిడీల వంటివి సులువైపోయాయి. దేశాద్యంతం సర్వసామాజిక వృద్ధి కూడా సాధ్య మైంది. ఇండియా స్టాక్ ద్వారా అందరికీ అందుబాటులో ఉన్న ఏపీఐల ఆధారంగా అసంఖ్యాకమైన స్టార్టప్లు వినూత్నమైన సేవ లను భారతీయ పౌరులకు అందుబాటులోకి తేగలిగాయి. ఇండియా స్టాక్ ఇప్పటికే సింగపూర్, ఫ్రాన్ ్స, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలకు విస్తరించే ప్రయత్నాల్లో ఉంది. ఇతర దేశాలు కూడా ఈ వరుసలో ఉన్నాయి. నిజానికి భారత్ తన జీ–20 అధ్యక్ష స్థానాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా డిజిటల్ పబ్లిక్ గుడ్, ఇండియా స్టాక్లను ప్రపంచం మొత్తానికి వ్యాపించేలా చేస్తోంది. అంతరాలు తొలగేలా... ఇండియా స్టాక్ అసలైన సామర్థ్యం పౌరులందరికీ డిజిటల్ సేవలు అందించడం ద్వారా నిరూపితమైంది. పైగా ఇది అందరికీ అందుబాటులో ఉండటం వల్ల కంపెనీలు, స్టార్టప్లు దానికి ఎప్ప టికప్పుడు విలువను జోడించేందుకూ అవకాశం ఏర్పడింది. జనరేటివ్ ఏఐని కూడా ఇదే పద్ధతిలో అభివృద్ధి చేయాలని మేము భావిస్తున్నాం. ఇండియా ‘భారత్ఎల్ఎల్ఎం’ పేరుతో సొంత జనరేటివ్ ఏఐ మోడల్ను తయారు చేసుకోవచ్చు. ఇండియా స్టాక్ ద్వారా సమాచారాన్ని అందివ్వడం ద్వారా మనకు మాత్రమే ప్రత్యేకమైన సమస్యలకు పరిష్కారాలు వెతకవచ్చు. ఇండియా స్టాక్పై ఇంకో పొర మాదిరిగా కొన్ని ఎల్ఎల్ఎంల సమాహారంగా జన్ ఏఐని ఏర్పాటు చేయవచ్చు. దీన్ని ప్రజాసేవలో భాగంగా అందరికీ అందివ్వడం కీలకం. తద్వారా డిజిటల్ అంతరాన్ని తొలగించవచ్చు. జనాభా మొత్తానికి లాభాలు అందించవచ్చు. ఆధార్, యూపీఐ మాదిరిగా అన్నమాట. వ్యక్తిగత గోప్యత, వివక్ష వంటి ఏఐ సంబంధిత ఆందో ళనలకు సమాధానం వెతికేందుకు కూడా ఈ ప్రయత్నం ఉపకరిస్తుంది. వైయక్తిక గోప్యత విషయంలో పాశ్చాత్యుల ఆలోచన దీనికంటే భిన్నమైంది. సమష్టితనం, సామాజిక గోప్యత, నమ్మకం వంటి భారతీయ దృక్పథాలను వాడుకుంటూ ఈ పని చేయవచ్చు. సానుకూల ప్రభుత్వం, ప్రపంచానికి నేతృత్వం వహిస్తున్న మన ఐటీ కంపెనీలు, ఐఐటీల వంటి సంస్థలు కలిసికట్టుగా ఈ ‘జన్ ఏఐ’ని సుసాధ్యం చేయగలవని మేము విశ్వసిస్తున్నాం. ఆ తరువాత భారతీయ కంపెనీలు భారత్ఎల్ఎల్ఎం నుంచి నిర్దుష్ట, లోపాలు సరిదిద్దిన ఎల్ఎల్ఎంలను అభివృద్ధి చేయవచ్చు. అందరికీ అందు బాటులో ఉండే ఏపీఐల సాయంతో స్టార్టప్లు కూడా ఎల్ఎల్ఎంలను వాడుకోవచ్చు. డిజిటల్ టెక్నాలజీలో ఇప్పుడున్న రెండు విప్లవా త్మకమైన విషయాలను భారత్ ఇలా జోడించవచ్చు. అంటే జనరేటివ్ ఏఐ, డిజిటల్ పబ్లిక్ గుడ్లను మేళవించడం అన్నమాట. తద్వారా ప్రపంచంలోని అన్ని జన్ ఏఐ మోడళ్లకు నమూనాగా భారతీయ మోడల్ను నిలబెట్టవచ్చు. – జస్ప్రీత్ బింద్రా, టెక్ విస్పరర్ లిమిటెడ్ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్; సుధీర్ తివారీ, థాట్వర్క్స్ ఇండియా డిజిటల్ ఇంజినీరింగ్ సెంటర్ గ్లోబల్ హెడ్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ఆన్లైన్ + ఆఫ్లైన్ పండుగలకు ‘హైబ్రిడ్ షాపింగ్’
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుత పండుగల సీజన్లో... ‘హైబ్రిడ్ షాపింగ్’నకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. ‘రాఖీ బంధన్’తో మొదలై వచ్చే ఏడాది ప్రథమార్థం దాకా ఈ ఫెస్టివల్ సీజన్ సుదీర్ఘంగా సాగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదలైన ఈ సీజన్లో హైబ్రిడ్ షాపింగ్నకే అధికశాతం మొగ్గుచూపుతున్నట్టు వివిధ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత వినియోగదారులు మరీ ముఖ్యంగా నవ, యువతరం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంతో పాటు డిజిటల్ టెక్నాలజీని విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో...ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లోనూ షాపింగ్కు కస్టమర్లు సిద్ధమవుతున్నారు. కోవిడ్ తెచ్చి న మార్పుచేర్పులతో... షాపింగ్, ఇతర విషయాల్లో కొత్త కొత్త విధానాలు, పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. గతేడాదితో పోల్చితే ఈసారి 84 శాతం వినియోగదారులు తమ షాపింగ్ బడ్జెట్ను గణనీయంగా పెంచినట్టు అడ్వర్టయిజ్మెంట్ యూనికార్న్ సంస్థ ‘ఇన్మోబీ’తాజా నివేదికలో వెల్లడైంది. నివేదికలో ఏముందంటే... చేతిలో ఇమిడిపోయే మొబైల్ ఫోన్లతోనే షాపింగ్ చేయడం, సంస్థల సైట్లను ఆన్లైన్లోనే వీక్షించి, సమీక్షించుకునే సౌలభ్యం ఉన్నందున పలువురు ఆన్లైన్ కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. ఐతే...ఆన్లైన్తో పాటు స్వయంగా షాప్లకు వెళ్లి వివిధరకాల వస్తువులు, ఇతరత్రా సామగ్రి కొనేందుకు ఇష్టపడుతున్న వారి సంఖ్య గణనీయంగా ఉన్నట్టుగా... అ రెండింటిని సమ్మిళితం చేసి హైబ్రిడ్ షాపింగ్ చేసే వారు 54 శాతం ఉన్నట్టుగా ఈ నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొబైల్ఫోన్లను వినియోగించే వారి నుంచి వివిధ అంశాల వారీగా ఈ సంస్థ సమాచారాన్ని సేకరించింది. ఆఫర్ల సమాచారం ఎలా తెలుసుకుంటున్నారు? మొబైల్లో సెర్చింగ్, ప్రకటనల ద్వారా.. 46% బ్రాండ్ వెబ్సైట్లు/ వివిధ యాప్ల ద్వారా.. 15% ప్రత్యక్షంగా షాపులకు వెళ్లి తెలుసుకునేవారు.. 11% కుటుంబం, స్నేహితుల ద్వారా.. 7% టీవీ ప్రకటనలు, ఇతర రూపాల్లో.. 7% వార్తాపత్రికలు, మ్యాగజైన్ల ద్వారా.. 6% ఈమెయిళ్లు, బ్రాండ్ల నుంచి న్యూస్లెటర్లతో.. 4% వాట్సాప్లో బ్రాండ్ల ద్వారా వచ్చే సమాచారంతో.. 3% తదనుగుణంగా మార్కెటింగ్ వ్యూహాలు... ‘తమ స్మార్ట్ఫోన్ల ద్వారానే షాపింగ్ చేయాలని 78 శాతం మంది భావిస్తున్నారు. దీనికి తగ్గట్టుగా వివిధ కంపెనీలు, సంస్థలు కూడా తమ మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా ప్రస్తుత పండుగల సీజన్లో కస్టమర్లను ఆకర్షించేందుకు, వారు కోరుకున్న విధంగా ఆయా వస్తువులను అందించేందుకు, వారితో నేరుగా కనెక్ట్ అయ్యేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నాము’ - వసుత అగర్వాల్,చీఫ్ బిజినెస్ ఆఫీసర్, కన్జ్యూమర్ అడ్వర్టయిజింగ్ ప్లాట్ఫామ్, ఇన్మోబీ -
‘స్కూళ్లలో స్మార్ట్ఫోన్లు నిషేధించండి!’
ప్యారిస్: ప్రపంచవ్యాప్తంగా.. పాఠశాలల్లో, పాఠశాల దశలో విద్యార్థులు స్మార్ట్ఫోన్లు వినియోగించడంపై నిషేధించాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్య సమితి విభాగం యునెస్కో అభిప్రాయపడింది. ఈ మేరకు ఒక సమగ్ర నివేదికను రూపొందించింది. ఫోన్ ఎక్కువగా వాడడం వల్ల చదువుపై ప్రతికూల ప్రభావం పడుతుందని.. అధిక స్థాయి స్క్రీన్ సమయం పిల్లల భావోద్వేగాలపై ప్రభావం పడుతోందని.. వీటికి శాస్త్రీయంగానూ రుజువులు ఉన్నాయని విషయాన్ని సైతం తన నివేదికలో యునెస్కో పొందుపరిచింది. ‘‘డిజిటల్ విప్లవం శక్తివంతమైందే కావొచ్చు. కానీ, ముఖాముఖి బోధన అనేది పిల్లలకు చాలా అవసరం. ఆ అవసరాన్ని స్మార్ట్ఫోన్.. డిజిటల్ టెక్నాలజీ.. చివరకు ఏఐ సాంకేతికత ఎప్పటికీ భర్తీ చేయలేవని ప్రభుత్వాలు కూడా గుర్తించాలి అని యునెస్కో సూచించింది. కరోనా టైంలో కోట్ల మంది డిజిటల్ ఎడ్యుకేషన్కి పరిమితం అయ్యారని తెలిసిందే. కానీ, అదే సమయంలో ఇంటర్నెట్కు దూరంగా ఉన్న లక్షల మంది పేద పిల్లలు పూర్తిగా చదువుకు దూరమయ్యారని యునెస్కో గుర్తు చేస్తోంది. అలాగే.. ఇప్పటికీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కొనసాగించడాన్ని యునెస్కో తీవ్రంగా తప్పుబట్టింది. విద్యాసంస్థల్లో సాంకేతికత వినియోగంపై చైనాను చూసి నేర్చుకోవాలని ప్రపంచానికి యునెస్కో సూచించింది. డిజిటల్ పరికరాలను బోధనా సాధనాలుగా ఉపయోగించడానికి చైనా సరిహద్దులను నిర్దేశించింది. మొత్తం బోధనా సమయంలో 30%కి పరిమితం చేసిందిని తెలిపింది. కరోనా టైంలో మాత్రమే చైనా ఆన్లైన్ విద్యను ప్రొత్సహించిందని.. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాక తిరిగి విద్యాసంస్థలకే రప్పించుకుంటున్న విషయాన్ని ఈ సందర్భంగా యునెస్కో ప్రత్యేకంగా ప్రస్తావించింది. -
తయారీలో డిజిటల్ టెక్నాలజీ
న్యూఢిల్లీ: డిజిటల్ టెక్నాలజీలను అందిపుచ్చుకోవడం (డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్) తయారీ రంగ కంపెనీలకు ముఖ్యమైన అజెండాగా ఉన్నట్టు పీడబ్ల్యూసీ ఇండియా సర్వే వెల్లడించింది. 54 శాతం కంపెనీలు ఇప్పటికే ఈ దిశగా ముందడుగు వేసినట్టు తెలిసింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), అనలైటిక్స్ను తమ వ్యాపార కార్యకలాపాల్లో అమలు చేశాయి. తద్వారా అవి సమర్థతను పెంచుకోవడం, వ్యయాలు తగ్గించుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. భారత తయారీ రంగంలో ప్రస్తుతం ఉన్న డిజిటల్ తీరుతెన్నులను అర్థం చేసుకునేందుకు, భవిష్యత్తు కార్యాచరణను రూపొందించే అవకాశాలను పరిశీలించేందుకు ఈ సర్వే నిర్వహించినట్టు పీడబ్ల్యూసీ ఇండియా తెలిపింది. దేశీయ మార్కెట్లో పనిచేసే సంస్థలు, బహుళజాతి సంస్థల (ఎంఎన్సీలు) చీఫ్ ఎక్స్పీరియెన్స్ ఆఫీసర్ (సీఎక్స్వో)లను సర్వేలో భాగంగా ప్రశ్నించి తయారీ రంగంలో డిజిటల్ టెక్నాలజీ ముఖచిత్రాన్ని తెలుసుకునే ప్రయత్నం సర్వేలో భాగంగా జరిగింది. ‘‘భారత తయారీ కంపెనీలు అన్ని ప్లాంట్లకు ఒకే ప్రామాణిక డిజిటల్ పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. కానీ, అంతర్జాతీయ కంపెనీలు వివిధ తయారీ కేంద్రాలకు భిన్నమైన డిజిటల్ పరిష్కారాల వైపు మొగ్గు చూపిస్తున్నాయి. భారత్లో తయారీ కంపెనీలు అనలైటిక్స్, ఏఐను కంపెనీలు అమలు చేస్తున్నాయి. వీటి అమలు రేటు 54 శాతంగా ఉంది’’అని ఈ సర్వే నివేదిక తెలిపింది. తమ వ్యాపారాల్లో డిజిటల్ టెక్నాలజీలను అమలు చేసే ప్రణాళికేదీ లేదని సర్వేలో పాల్గొన్న 38 శాతం కంపెనీల ఎగ్జిక్యూటివ్లు వెల్లడించారు. ఆరు రంగాల్లోని డిజిటల్ ఛాంపియన్లు పారదర్శకత, సుస్థిరత భవిష్యత్తు వృద్ధికి తమను సన్నద్ధంగా ఉంచుతాయని భావిస్తున్నాయి. గొప్ప ఆవిష్కరణలు, వేగంగా మార్కెట్లోకి తీసుకురావడం పోటీలో తమను నిలిపి ఉంచుతాయని కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. సవాళ్లను అధిగమించేందుకు.. నిర్వహణ సవాళ్లను అధిగమించేందుకు భవిష్యత్ టెక్నాలజీలకు అనుగుణంగా కొంత వరకు సామర్థ్యాన్ని కంపెనీలు సిద్ధం చేసుకోగా, కొన్ని ఇంకా అమలు చేయాల్సి ఉందని పీడబ్ల్యూసీ ఇండియా డిజిటల్ ఆపరేషన్స్ లీడర్ అంకుర్ బసు తెలిపారు. ‘‘సంస్థలు తయారీ ప్రక్రియల్లో సమర్థతను పెంచడంపై దృష్టి పెడుతున్నాయి. ఖరీదైన యంత్రాల నిర్వహణను వ్యయాలను తగ్గించుకుంటున్నాయి. తయారీని ఆటోమేషన్ చేస్తున్నాయి. వర్క్స్టేషన్లను ఐవోటీతో అనుసంధానిస్తున్నాయి’’అని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్నర్ సుదీప్తఘోష్ తెలిపారు. -
7 శాతం కంపెనీల్లోనే ‘వృద్ధి’ సామర్థ్యాలు
న్యూఢిల్లీ: డిజిటల్ టెక్నాలజీ అండతో వృద్ధిని పెంచుకునే సరైన సంస్కృతి, సంస్థాగత నిర్మాణం కేవలం 7 శాతం కంపెనీల్లోనే ఉన్నట్టు ఇన్ఫోసిస్ నాలెడ్జ్ ఇనిస్టిట్యూట్ తెలిపింది. అంటే 93 శాతం కంపెనీల్లో ఈ సామర్థ్యాలు లేవని తేల్చింది. బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చైనా, భారత్లోని 2,700 కంపెనీల ప్రతినిధులను సర్వే చేసి ఓ నివేదికను విడుదల చేసింది. అధిక నాణ్యత, పారదర్శక డేటా, బాధ్యతాయుతంగా రిస్క్ తీసుకునే సంస్కృతి అన్నవి కష్టమైన స్థూల ఆర్థిక పరిస్థితుల్లోనూ కంపెనీలు లాభాల్లో వృద్ధిని నమోదు చేయడానికి తోడ్పడుతున్న అంశాలుగా ఈ నివేదిక పేర్కొంది. నూతన ఉత్పత్తులను వేగంగా మార్కెట్కు తీసుకురావడం అన్నది ముఖ్యమని, ఇది మొదటగా ప్రవేశించిన అనుకూలతలు తెస్తుందని తెలిపింది. ‘‘విజయానికి మూడు భిన్నమైన అంశాలు తోడ్పడతాయి. డేటాను అంతర్గతంగా వినియోగించడం, బాధ్యతాయుతంగా రిస్క్ తీసుకునే సంస్కృతిని ఏర్పాటు చేయడం, డిజిటల్ వృద్ధిని అందిపుచ్చుకునే సంస్థాగత నిర్మాణం అవసరం’’అని ఈ నివేదిక వివరించింది. -
జాతీయ స్థాయిలో ఏపీఎస్ఆర్టీసీకి మరో అవార్డు
సాక్షి, విజయవాడ: జాతీయ స్థాయిలో ఏపీఎస్ఆర్టీసీకి మరో అవార్డు దక్కింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ నిర్వహించిన డిజిటల్ టెక్నాలజీ పోటీల్లో ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ విభాగంలో డిజిటల్ టెక్నాలజీ సభ అవార్డు లభించింది. ఇటీవల ప్రవేశపెట్టిన (UTS) డిజిటల్ చెల్లింపులకు గానూ ఈ అవార్డు దక్కింది. కాగా ఏపీఎస్ఆర్టీసీకి ఈ అవార్డు దక్కడం వరుసగా అయిదోసారి. కొచ్చిలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోటేశ్వరరావు, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ (ఐటీ) శ్రీనివాసరావు ఈ అవార్డును అందుకున్నారు. ప్రయాణీకులకు ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు ఆర్టీసీకి ప్రశంసలు -
వారిని అస్సలు పట్టించుకోని అమెజాన్ ఫ్లెక్స్, ఓలా, ఊబర్, డంజో, ఫార్మ్ఈజీ
న్యూఢిల్లీ: కాంట్రాక్టు ఉద్యోగులకు (గిగ్ వర్కర్లు/తాత్కాలిక పనివారు) న్యాయమైన, పారదర్శక పని పరిస్థితులు కల్పించడంలో ఓలా, ఊబర్, డంజో, ఫార్మ్ఈజీ, అమెజాన్ ఫ్లెక్స్ సున్నా స్థానంలో నిలిచాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఫెయిర్వర్క్ ఇండియా ఈ రేటింగ్లు ఇచ్చింది. అంతర్జాతీయంగా డిజిటల్ టెక్నాలజీ కంపెనీల్లో పని పరిస్థితులపై ఫెయిర్వర్క్ రేటింగ్లు ఇస్తుంటుంది. ఈ సంస్థ ‘ఫెయిర్వర్క్ ఇండియా రేటింగ్స్ 2022’ పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది. న్యాయమైన వేతన చెల్లింపులు, పని పరిస్థితులు, న్యాయమైన ఒప్పందాలు, పారదర్శక నిర్వహణ, న్యాయమైన ప్రాతినిధ్యం అంశాల ఆధారంగా రేటింగ్లు కేటాయిస్తుంది. 10 పాయింట్లకు గాను అమెజాన్ ఫ్లెక్స్, డంజో, ఓలా, ఫార్మ్ఈజీ, ఊబర్ కు సున్నా పాయింట్లు వచ్చినట్టు ఈ నివేదిక వెల్లడించింది. నివేదికలో భాగంగా 12 ప్లాట్ఫామ్లకు ఫెయిర్వర్క్ రేటింగ్లు ఇవ్వగా, ఈ ఏడాది ఒక్క ప్లాట్ఫామ్ కూడా 10కి 10 పాయింట్లు సంపాదించలేకపోయింది. అర్బన్ కంపెనీ అత్యధికంగా 10 పాయింట్లకు గాను 7 పాయింట్లు సొంతం చేసుకుంది. బిగ్ బాస్కెట్ కు 6, ఫ్లిప్కార్ట్కు 5, స్విగ్గీకి 5, జొమాటోకు 4, జెప్టోకు 2, పోర్టర్కు ఒక పాయింట్ లభించింది. ‘‘చట్టం దృష్టిలో గిగ్ వర్కర్లు అంటే స్వతంత్ర కాంట్రాక్టర్లు. అంటే కార్మిక హక్కులను వారు పొందలేరు. అసంఘటిత రంగం ఉద్యోగులు, నిరుద్యోగుల మాదిరే వీరు కూడా. గంటల వారీ కనీస వేతనం అందించడం వారి పని పరిస్థితులు మెరుగుపడే విషయంలో మొదటి మెట్టు’’అని ఫెయిర్వర్క్ అని కంపెనీల పని పరిస్థితులను అధ్యయనం చేసిన ప్రొఫెసర్ బాలాజీ పార్థసారథి తెలిపారు. -
డిజిటల్ విప్లవానికి శ్రీకారం
-
డేటా అనలిటిక్స్ ప్రొఫెషనల్స్, జావా టెక్నాలజీల నిపుణులకు ఫుల్ డిమాండ్
ముంబై: డిజిటల్ టెక్నాలజీల వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో డేటా అనలిటిక్స్, జావా వంటి టెక్నాలజీల్లో ’అత్యంత ప్రత్యేక’ నైపుణ్యాలు ఉన్న ప్రొఫెషనల్స్కి భారీగా డిమాండ్ ఉంటోందని కన్సల్టెన్సీ సంస్థ క్వెస్ ఒక నివేదికలో వెల్లడించింది. ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో రిక్రూటర్లు ఎక్కువగా ఈ రెండింటితో పాటు క్లౌడ్ ఇన్ఫ్రా టెక్నాలజీలు, యూజర్ ఇంటర్ఫేస్ మొదలైన సాంకేతికతల్లో అత్యంత నైపుణ్యాలున్న వారిని తీసుకునేందుకు ఆసక్తి చూపినట్లు పేర్కొంది. నివేదిక ప్రకారం డేటా అనలిటిక్స్ ప్రొఫెషనల్స్కు అత్యధికంగా బెంగళూరులో (40 శాతం), హైదరాబాద్లో (30 శాతం) డిమాండ్ నెలకొనగా .. జావా టెక్నాలజీల నిపుణులకు పుణె (40 శాతం), బెంగళూరులో (25 శాతం) డిమాండ్ కనిపించింది. అలాగే క్లౌడ్ ఇన్ఫ్రా సాంకేతికత నిపుణులపై ఎక్కువగా బెంగళూరులో (60 శాతం), చెన్నైలో (15 శాతం) ఆసక్తి కనిపించింది. టెక్నాలజీ నియామకాల మార్కెట్లో కొంత ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ నిర్దిష్ట నైపుణ్యాలు ఉన్నవారికి డిమాండ్ బాగానే ఉందని క్వెస్ ఐటీ స్టాఫింగ్ సీఈవో విజయ్ శివరామ్ తెలిపారు. కంపెనీలు డిజిటల్, క్లౌడ్ సేవల వైపు మళ్లుతుండటంతో ఈ విభాగాల్లో హైరింగ్ పెరుగుతోందని పేర్కొన్నారు. ఐటీ మెట్రో హబ్లలోనే టాప్ డిజిటల్ నిపుణుల నియామకాలు జోరుగా సాగుతున్నాయని వివరించారు. సింహభాగం డిమాండ్ హైదరాబాద్లో (34 శాతం) నమోదైంది. బెంగళూరు (33 శాతం), ముంబై (12 శాతం), పుణె (9 శాతం), చెన్నై (5 శాతం) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఆయా హోదాలకు అర్హులైన ఉద్యోగార్థులను మదింపు చేసే అల్గోరిథమ్ ఆధారిత గణాంకాల ద్వారా క్వెస్ ఈ నివేదికను రూపొందించింది. -
ఉద్యోగులకు డిమాండ్..భారీగా పెరగనున్న నియామకాలు!
ముంబై: కాంట్రాక్టు కార్మికులు (ఫ్లెక్సీ స్టాఫ్) 2.27 లక్షల మందికి గత ఆర్థిక సంవత్సరంలో (2021–22) ఉపాధి కల్పించినట్టు ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ (ఐఎస్ఎఫ్) వార్షిక నివేదిక వెల్లడించింది. ఎఫ్ఎంసీజీ, ఈ కామర్స్, తయారీ, హెల్త్కేర్, రిటైల్, లాజిస్టిక్స్, బ్యాంకింగ్, ఎనర్జీ రంగాలు ఉపాధికి దన్నుగా నిలిచాయని పేర్కొంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఫ్లెక్సీ స్టాఫ్కు డిమాండ్ 3.6 శాతం పెరిగినట్టు తెలిపింది. అన్ని రంగాల్లోనూ డిజిటల్ దిశగా మార్పులను స్వీకరించడం ఉపాధికి అవకాశం కల్పించినట్టు పేర్కొంది. 2022– 23లో ఫిన్టెక్, ఐటీ–ఇన్ఫ్రా, ఐటీ/ఐటీఈఎస్ రంగాలు కాంట్రాక్టు కార్మికులకు ఎక్కువగా ఉపాధినిస్తాయని తెలిపింది. ఇండియన్ స్టాఫింగ్ సమాఖ్య పరిధిలోని కంపెనీలు 2021–22లో 2.27 లక్షల మంది కాంట్రాక్టు కార్మికులకు ఉపాధి కల్పించాయని.. దీంతో మొత్తం కాంట్రాక్టు కార్మికుల సంఖ్య 12.6 లక్షల మందికి చేరినట్టు నివేదికలో పేర్కొంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో మాదిరే 2021–22లోనూ ఉద్యోగుల్లో మహిళల వాటా 27 శాతంగా ఉందని తెలిపింది. తాత్కాలిక, పరిమిత సమయం పాటు పనిచేసే వారిని ఫ్లెక్సీ స్టాఫ్గా పరిగణిస్తారు. యువతే ఎక్కువ ఫ్లెక్సీస్టాఫ్కు అధిక శాతం అవకాశాలు బహిరంగ విక్రయాల నుంచి, తప్పనిసరి ఉత్పత్తుల డెలివరీకి మళ్లినట్టు ఈ నివేదిక వివరించింది. ఫ్లెక్సీ స్టాఫ్లో 25–30 ఏళ్ల వయసులోని వారు 40 శాతం మేర ఉన్నారు. ఫ్లెక్సీ స్టాఫ్లో 31–45 ఏళ్ల వయసులోని వారి ప్రాతినిధ్యం 10 శాతం మేర పెరిగింది. ‘‘2021–22 ఫ్లెక్సీ స్టాఫింగ్ పరిశ్రమకు అసాధారణం అని చెప్పుకోవాలి. ఉద్యోగులకు డిమాండ్ 21.9 శాతం (2.27 లక్షలు) పెరిగింది.. ఉద్యోగులు, ఉద్యోగ సంస్థలు కరోనా ప్రభావం నుంచి బయటకు వచ్చి, భవిష్యత్తును నిర్మించుకునేందుకు చూస్తున్నట్టు తెలుస్తోంది’’అన ఐఎస్ఎఫ్ ప్రెసిడెంట్ లోహిత్ భాటియా తెలిపారు. ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్న్పటికీ, 2022–23 ఆరంభం సంకేతాలను గమనిస్తే రానున్న మూడు త్రైమాసికాల్లోనూ ఉద్యోగుల నియామకాలకు డిమాండ్ కొనసాగుతుందన్న అంచనా వ్యక్తం చేశారు. ఇతర ఉపాధి విభాగాలతో పోలిస్తే ఫ్లెక్సీస్టాఫ్కు డిమాండ్ 10 శాతం పెరుగుతుందని ఐఎస్ఎఫ్ ఈడీ సుచిత దత్తా తెలిపారు. -
డిజిటల్ విద్యతో దీటుగా..
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు డిజిటల్ టెక్నాలజీ విద్యతో మరింత రాణించేలా కార్యాచరణతో ముందుకు వెళ్లాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్దేశించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆధునిక పద్ధతులను అనుసరించి బోధన చేపట్టడం ద్వారా మన విద్యార్థులు ఉన్నత ప్రమాణాలు సాధించేలా కృషి చేయాలన్నారు. పిల్లలకు పాఠశాల స్థాయి నుంచే డిజిటల్ విద్యా బోధన అందించాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లోని 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు అందించాలని ఇప్పటికే నిర్ణయించామని గుర్తుచేస్తూ వీటిని ఈ ఏడాది సెప్టెంబర్లో పంపిణీ చేయాలని ఆదేశించారు. విద్యాశాఖలో ’మనబడి నాడు – నేడు’ డిజిటల్ లెర్నింగ్పై సీఎం జగన్ మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. తరగతి గదుల్లో టీవీలు, డిజిటల్ బోర్డులు తరగతి గదుల్లో డిజిటల్ బోర్డులు, టీవీల ఏర్పాటుపై జూలై 15 కల్లా కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రతి తరగతి గదిలోనూ ఇవి ఉండేలా చూడాలన్నారు. వీటి వల్ల సైన్స్, మేథ్స్ లాంటి సబ్జెక్టులు పిల్లలకు సులభంగా, చక్కగా అర్థం అవుతాయన్నారు. వీటి వినియోగం ద్వారా టీచర్ల బోధనా సామర్ధ్యం కూడా పెరుగుతుందని తెలిపారు. డిజిటల్ స్క్రీన్పై కంటెంట్ను హైలెట్, ఎన్లార్జ్ చేస్తే బాగుంటుందని సూచించారు. డిజిటల్ స్క్రీన్లు, ప్యానెళ్ల సంరక్షణపై కూడా దృష్టి పెట్టాలన్నారు. బోధనకు అనువుగా డిజిటల్ స్క్రీన్లు తరగతి గదిలో బోధనా కార్యక్రమాలకు అనువుగా డిజిటల్ బోర్డులు, స్క్రీన్లను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఇప్పటికే వీటిని వినియోగిస్తున్న తీరును పరిశీలించి మెరుగైన పద్ధతిలో అమర్చాలన్నారు. నిపుణుల సలహా మేరకు కొన్ని తరగతుల్లో ఇంటరాక్టివ్, మరికొన్ని తరగతుల్లో టీవీ స్క్రీన్లు అమర్చేలా ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు అధికారులు వివరించారు. సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ, పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, సమగ్ర శిక్ష ఎస్పీడీ వెట్రిసెల్వి తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన ట్యాబ్లు.. ‘సెప్టెంబరులో 8వ తరగతి విద్యార్థులకు అందించే ట్యాబ్స్లో బైజూస్ కంటెంట్ను అప్లోడ్ చేయాలి. అందుకు అనుగుణంగా స్పెసిఫికేషన్స్, ఫీచర్లు ఉండాలి. అవి నిర్దారించాకే ట్యాబ్ల కొనుగోలు ప్రక్రియ మొదలుపెట్టాలి. టెండర్లు పిలిచేటప్పప్పుడు నాణ్యత, మన్నికను దృష్టిలో ఉంచుకోవాలి’ అని సీఎం జగన్ సూచించారు. 8వ తరగతిలో విద్యార్థికి ఇచ్చే ట్యాబ్లు తరువాత 9, 10వ తరగతుల్లో కూడా వినియోగించుకొనేలా ఉండాలని స్పష్టం చేశారు. మూడేళ్లపాటు ట్యాబ్లు నాణ్యతతో పని చేసేలా ఉండాలన్నారు. వాటి నిర్వహణ కూడా అత్యంత ప్రధానమన్నారు. ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే మరమ్మతులు చేపట్టటాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. ట్యాబ్ల కొనుగోలులో మంచి కంపెనీలను పరిగణలోకి తీసుకుని నిర్దేశిత సమయంలోగా అందించాలని పేర్కొన్నారు. -
పాలనలో టెక్నాలజీ కొత్తేమీ కాదు!
దేశంలో 2014కు ముందు ఇ–పరిపాలన ప్రాజెక్టులన్నీ కులీన వర్గాల కోసమే చేపట్టేవారనీ, తాము అధికారంలోకి వచ్చాకే పేదల సంక్షేమం కోసం టెక్నాలజీని ఉపయోగిస్తున్నామనీ కేంద్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది. జాతీయ అభివృద్ధికి శాస్త్ర, సాంకేతిక జ్ఞానాలను ఉపయోగించడం స్వాతంత్య్రానంతరమే మొదలైంది. ఈ దార్శనికతే... టెక్నాలజీ ఆధారిత ప్రభుత్వ రంగ పరిశ్రమల అభివృద్ధి రూపంలో పరిణమించింది. తర్వాతి ప్రభుత్వాలు ఈ పరంపరను కొనసాగిస్తూ తెచ్చిన... ప్యాసింజర్ రిజర్వేషన్, టెలిఫోన్, బ్యాంకింగ్ సేవల్లో కంప్యూటరీకరణ సామాన్యులకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. కేవలం డిజిటల్ టెక్నాలజీ ముందంజ ప్రాతిపదికగా, గత ప్రభుత్వాల హయాంలోని టెక్నాలజీలను చిన్నచూపు చూడటం తగదు. అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంబరాలు చేసుకుంటోంది. తాను సాధించిన అనేక విజయాలకు తోడుగా పేదలకు ప్రయోజనం కలిగించడానికి టెక్నాలజీని విస్తా రంగా ఉపయోగించడాన్ని అది ఎత్తిచూపుతోంది. గత వారం ఢిల్లీలో డ్రోన్ ఫెస్టివల్ ప్రారంభ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ... గతంలో, వర్తమానంలో టెక్నాలజీ ఉపయోగంలో ఉన్న వ్యత్యాసాలను పోల్చి చెప్పారు. 2014కు ముందు టెక్నాలజీని పేదల వ్యతిరేకిగా చిత్రించేవారనీ, దీన్ని ప్రజల సమస్యలలో ఒక భాగంగా పరిగణించేవారనీ మోదీ అభిప్రాయపడ్డారు. తాము అధికారంలోకి రాకముందు పాలనలో టెక్నాలజీని ఉపయోగించడం పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించే వాతావరణం ఉండేదనీ, దీని ఫలితంగా పేదలూ, మధ్య తరగతి ప్రజలూ అధికంగా బాధలకు గురయ్యేవారనీ మోదీ పేర్కొ న్నారు. గత పాలనా కాలాల్లో టెక్నాలజీని కులీనుల ప్రయోజనాల కోసం ఉద్దేశించినది మాత్రమే అని భావించేవారనీ, కానీ తమ ప్రభుత్వం టెక్నాలజీని ముందుగా ప్రజారాశులకు అందుబాటులోకి తెచ్చిందనీ చెప్పారు. అయితే ప్రధాని ప్రకటనలో రెండు అశాలు న్నాయి. ఒకటి: తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే భారత్ పరి పాలనలో టెక్నాలజీని వాడటం మొదలెట్టింది. రెండు: 2014కు ముందు ప్రభుత్వాలు వాడిన టెక్నాలజీ ఫలితాలు పేదలకు అందు బాటులో ఉండేవి కావు. టెక్నాలజీ గురించి ఇలా సాధారణీకరించడం లేదా డిజిటల్ టెక్నాలజీ కోణం నుంచి మాత్రమే టెక్నాలజీని అంచనా వేయడం లేదా 2014కు ముందూ, 2014 తర్వాతా అనే చట్రంలో మాత్రమే టెక్నాలజీని అంచనావేయడం అనేది సమస్యాత్మకమే అని చెప్పాలి. స్వాతంత్య్రం వచ్చిన కాలం నుంచి లేదా అంతకుముందు కూడా టెక్నాలజీతో భారతదేశం సంక్లిష్టమైన సంబంధాన్ని కలిగి ఉండేది. మహాత్మాగాంధీ కాలం నుంచే సై¯Œ ్స, టెక్నాలజీ ఉపయోగం అనేది ప్రజల సంభాషణల్లో భాగమై ఉండేది. అయితే గాంధీ టెక్నాలజీ వ్యతిరేకి అని తప్పు ఆరోపణలకు గురవడం మరో విషయం. శ్రామిక ప్రజలను పక్కకు నెట్టి యంత్రాలను వాడటాన్ని మాత్రమే ఆయన వ్యతిరేకించారు తప్ప టెక్నాలజీని కాదు. ఇక జవహర్లాల్ నెహ్రూ విషయానికి వస్తే... ప్రజల సంక్షేమానికీ, జాతీయ అభివృద్ధికీ, శాస్త్ర, సాంకేతిక జ్ఞానాలను ఉపయోగించడం గురించీ నెహ్రూ గొప్పగా ప్రబోధించారు. ఈ దార్శనికతే... పరిశోధనా శాలలు, టెక్నాలజీ ఆధారిత ప్రభుత్వ రంగ పరిశ్రమల అభివృద్ధి రూపంలో పరిణమిం చింది. అణు ఇంధనం, అంతరిక్ష పరిశోధన, ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ వంటి పలు అంశాల్లో సాంకేతిక జ్ఞానం ఆనాడే పురుడు పోసుకుంది. గత 75 సంవత్సరాల సాంకేతిక అభివృద్ధిలో భారత్ను సమున్నతంగా నిలపడంలో ఈ సంస్థలు ఎంతగానో దోహదపడ్డాయని ఎవరూ మర్చిపోకూడదు. దీనికి ఇటీవలి తిరుగులేని ఉదాహరణ కోవిడ్ టీకాలు! రాజీవ్ గాంధీ హయాంలో 1980లలో టెక్నాలజీ వినియోగం చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. రాజీవ్ ప్రారంభించిన టెక్నాలజీ మిషన్లు నూనె గింజల నుంచి రోగనిరోధకత వరకు పలు రంగాల్లో టెక్నాలజీ వినియోగంపై దృష్టి సారించాయి. ఆ సమయంలోనే యావత్ ప్రపంచం పర్సనల్ కంప్యూటర్ విప్లవానికీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సాక్షీభూతమై నిలిచింది. టెలిఫోన్ సర్వీసులు, బ్యాంకింగ్, వాతావరణ అంచనా వంటి ఎన్నో ప్రజోపయోగ రంగాల మెరుగు దలకు ఈ పరిణామాలను సృజనాత్మకంగా ఉపయోగించు కోవడానికి అనేక ప్రాజెక్టులను దేశంలో మొదలెట్టారు. ప్యాసింజర్ రైల్వే రిజర్వే షన్, డిజిటల్ టెలికామ్ స్విచ్, బ్యాకింగ్ రంగంలో కంప్యూటరీకరణ, సూపర్ కంప్యూటర్ ‘పరమ్’ అభివృద్ది వంటి పలు అంశాలు ఇందులో ఉన్నాయి. అయితే వీటిలో ఏ ఒక్కటీ ప్రజలకు పర్సనల్ కంప్యూటర్ వంటి ఉపకరణం కావాలనీ, కమ్యూనికేషన్ నెట్వర్క్ను వీరికి అందుబాటులోకి తేవలసిన అవసరం ఉందనీ సూచించేవి కావు. ఎందుకంటే ఆనాటికి భారత్లో ఇంటర్నెట్ ఉనికిలోనే ఉండేది కాదు. అయినప్పటికీ సగటు మనిషికి మాత్రం ఈ ప్రాజెక్టులన్నీ ఎంతగానో మేలు చేశాయి. ఎయిర్లై¯Œ ్స రిజర్వేష¯Œ లో కంప్యూటరీకరణకు ఎంతో ముందుగా ఈ ప్రాజెక్టులు ఉనికిలోకి వచ్చాయి. కాబట్టి ఆనాటి టెక్నా లజీ ప్రయోజనాలు మొదటగా కులీన వర్గాలను లక్ష్యంగా చేసుకో లేదన్నది నిజం. కాబట్టి 2014కు ముందు ఇ–పరిపాలన ప్రాజెక్టులు, భావనలు అనేవి కులీన వర్గాలకు సంబంధించినవే తప్ప అవి పేదలకు ప్రయోజనం కలిగించలేదనడం చాలా తప్పు. అయితే ఆనాటి కొత్త ప్రాజెక్టుల్లో సమస్యలు ఉండవచ్చు. అంత కచ్చితంగా అవి పని చేయకపోయి ఉండవచ్చు. కానీ భారతీయ సాంకేతిక జ్ఞాన ప్రయా ణంలో ఇవి కీలకమైన మూలమలుపులుగా నిలిచాయి. మొబైల్ ఫోన్ల ధరలు తగ్గడం, తక్కువ డేటా ప్రైజ్లతో ఇంటర్నెట్ ప్రాప్యత తక్కువ ధరకే అందుబాటులోకి రావడం, ఛోటా రీజార్జ్ వంటి మార్కెటింగ్ ఆవిష్కరణలు గత రెండు దశాబ్దాల కాలంలో డిజిటల్ టెక్నాల జీలనూ, వాటి అప్లికేషన్లనూ బాగా ముందుకు తీసుకుపోయాయి. లక్ష్యంగా పెట్టుకున్న సబ్సిడీల పంపిణీకి ప్రభుత్వాల చేతికి ఆధార్ ఆవిష్కరణ గొప్ప ఉపకరణాన్ని అందించింది. అయితే బయోమె ట్రిక్స్ ఆధారిత ఐడెంటిఫికేషన్ సిస్టమ్, మొబైల్ ఫోన్ కనెక్టివిటీతో సమ్మేళనం వంటివి ఒక్క సబ్సిడీల పంపిణీకి మాత్రమే కాకుండా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో అనేక అప్లికేషన్ల కల్పనకు దారితీశాయి. తాము సాధించిన గొప్ప విజయాల్లో జామ్ (జన్ధన్, ఆధార్, మొబైల్) ఒకటని నరేంద్రమోదీ ప్రభుత్వం ఘనంగా చెప్పు కుంటోంది. యూపీఐ వంటి నూతన ఆవిష్కరణల ద్వారా డిజిటల్ పేమెంట్ ఎకో సిస్టమ్ వ్యాప్తిని కూడా కేంద్ర ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. కానీ దీన్ని సాధించడం కోసమే పెద్ద నోట్ల రద్దు వంటి చేదుమాత్రను దేశమంతటికీ తినిపించాల్సి వచ్చిందని ప్రభుత్వం నేటికీ ఒప్పుకోవడం లేదు. పైగా డిమాండ్ ఆధారిత వృద్ధి ఫలితంగా ఈ కొత్త ఆవిష్కరణలు ముందుకు రాలేదని గ్రహించాలి. మరోవైపున ఆధార్ ఉపయోగం ఎంత సర్వవ్యాప్తిగా మారిపోయిం దంటే... కంపెనీలు, బ్యాంకులు వంటి వాటితో యునీక్ ఐడెంటిఫి కేషన్ నంబర్ను షేర్ చేయాల్సి రావడం గురించి విద్యావంతులే ఆశ్చర్యపోతున్నారు. ఇటీవలే వినియోగదారులు తమ ఐడీ నంబర్లను ఎవరికీ షేర్ చేయవద్దని ‘ఉడాయ్’ ప్రజలకు బోధిస్తూ మెసేజ్ పంపింది కానీ ఆ మరుక్షణమే ప్రభుత్వం దాన్ని తొలగించడం గమ నార్హం. ఏదేమైనా ఇది మరింతగా గందరగోళాన్ని ఏర్పర్చింది. బయో మెట్రిక్స్, క్లోనింగ్, ఫిషింగ్ వంటి వాటి కారణంగా ప్రత్యక్ష నగదు బదలాయింపు వ్యవస్థలో తప్పుడు కేసులు బయటపడుతున్నాయి. పెద్దనోట్ల రద్దు అనేది డిజిటల్ పేమెంట్ల వైపుగా ప్రజలను బలవంతంగా మళ్లించినట్లే, ఆన్లైన్ క్లాసులు, ఇ–హెల్త్ వంటి అప్లికేషన్ల కోసం డిజిటల్ ఉపకరణాలను మరింతగా ఉపయోగించేలా కరోనా మహమ్మారి యావన్మంది ప్రజలను ఒత్తిడికి గురిచేసింది. ఈ రెండు కేసుల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లో నాసిరకం కనెక్టివిటీ, డివైజ్ల ప్రాప్యత తీవ్ర అవరోధాలను కలిగిస్తున్నాయి. ఆన్లైన్ క్లాసులకు గానూ తమ ఫోన్లకు ఇంటర్నెట్ కనెక్షన్ల కోసం విద్యార్థులు ఊళ్లలో చెట్లమీదికి ఎక్కుతున్న ఫొటోలు, బయోమెట్రిక్ ఆథరైజేషన్ కోసం పెద్దలు పడుతున్న పాట్లు వైరల్ అయి డిజిటలైజేషన్ వ్యవస్థనే ప్రశ్నార్థకం చేసిపడేశాయి. ప్రతి గ్రామాన్నీ ఫైబర్ ఆప్టిక్స్తో కనెక్ట్ చేసే ప్లాన్ ఇప్పటికీ నత్తనడకన సాగుతోంది. ఇకపోతే ప్రభుత్వ సర్వీస్ ప్రొవైడర్ అయిన బీఎస్ఎన్ఎల్ నిదానంగా అంతరించే వైపు సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆధార్తో, ఇంటర్నెట్ కనెక్టివిటీతో ఏర్పడుతున్న సమస్యలు ఒకవైపూ... ప్రతిచేతిలో స్మార్ట్ ఫోన్, ప్రతి క్షేత్రంలో డ్రోన్, ప్రతి ఇంట్లో సౌభాగ్యం అనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నినాద రూపంలోని ప్రచారార్భాటం మరోవైపూ దేశంలో సమాంతరంగా కొనసాగుతూనే ఉన్నాయి. వ్యాసకర్త: దినేష్ సి. శర్మ, సైన్స్ విషయాల వ్యాఖ్యాత -
డిజిటల్ ఫ్యూచర్ కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి: శివశంకర్
కోవిడ్-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వేగంగా వృద్ధి చెందుతుండటం వల్ల డిజిటల్ వినియోగం మరింత పెరిగింది. వీడియో కాన్ఫరెన్సింగ్ & వర్చువల్ మీటింగ్ల నుండి ఆన్లైన్ విద్య వరకు ఇప్పుడు 'కొత్త టెక్నాలజీ మన జీవితంలోని అన్ని అంశాలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు & వ్యాపార సంస్థలు ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, బ్లాక్చెయిన్, ఆగ్మెంటెడ్, వర్చువల్ రియాలిటీ & ఆటోమేషన్తో సహా వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై శ్రద్ధ చూపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు Metaverse. మెటవర్స్ అంటే మనం నివసించే ప్రపంచానికి మించిన ఒక సింక్రోనస్ డిజిటల్ ప్రపంచం. Web 3.0 ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు, బ్రాండ్లతో పరిశ్రమ అంతటా అలలను సృష్టించాయి, వినియోగదారులకు ఇంతకు ముందెన్నడూ చూడని ఇంటరాక్టివిటీని అందించే అవకాశాలను అన్వేషించాయి. క్రిష్టోకరెన్సీ & NFTల విస్తరణ అలాగే ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ టెక్నాలజీ, ఈస్పోర్ట్ల పెరుగుదల డిజిటల్ భవిష్యత్తును మనకు అందిస్తుంది. ప్రస్తుతం సాంకేతికత మనం జీవించే, పనిచేసే విధానాన్ని మరింత వేగంగా మారుస్తుంది. అయితే, ఈ సాంకేతికతలను నావిగేట్ చేయడానికి అవసరమైన నైపుణ్యాలు ఉన్నవారికి ఇది నిస్సందేహంగా కెరీర్ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. డిజిటల్ ఇండియా: ఒక కొత్త భవిష్యత్తుకు మార్గం సుగమం భారతదేశంలో మరింత సౌకర్యవంతంగా, మా ప్రభుత్వం దాని ఫ్లాగ్షిప్ 'డిజిటల్ ఇండియా" చొరవ ద్వారా భారతదేశాన్ని డిజిటల్గా సాధికారత కలిగిన సమాజంగా & నాలెడ్జ్ ఎకానమీగా మార్చడానికి పెట్టుబడి పెడుతుంది. డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఆన్-డిమాండ్ గవర్నెన్స్ & సేవలు అలాగే పౌరుల డిజిటల్ సాధికారత వంటి ప్రోగ్రామ్ల ముఖ్య ఫోకస్ ఏరియాలు ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రభావం, పరిణామం & మనం నివసించే ప్రపంచాన్ని మర్చివేయడంతో యువత ముఖ్యంగా పెరుగుతున్న ఈ డిమాండ్లకు, సరిపోయేలా ఆచరణాత్మక మార్గాల్లో వారి శిక్షణను ప్లాన్ చేయడం ద్వారా ఫలితం పొందుతారు. స్కీల్లింగ్ ప్రోగ్రామ్లు: ముఖ్యమైన నైపుణ్యాలతో విద్యార్థులను శక్తివంతం చేయడం బహుళ తరాల శ్రామికశక్తితో, ప్రపంచంలోని ఎక్కువ మొత్తంలో యువ జనాభా కలిగిన భారతదేశం, ప్రతి సంవత్సరం దాదాపు రెండు కోట్ల మంది యువత వర్క్ఫోర్స్లో చేరడాన్ని మనం గమనిస్తున్నాం. యువత విభిన్న నేపథ్యాల నుంచి వచ్చినప్పటికీ వారందరికీ ఉమ్మడిగా ఒక విషయం ఉంది. అది వారంతా ఉపాధి పొంది మంచి నాణ్యమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. మహమ్మారి సమయంలో మంచి నైపుణ్యం గల వనరుల అవసరం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇది IT పరిశ్రమ, ప్రభుత్వానికి బాగా తెలుసు. యజమానులు తమ ఉద్యోగులకు ఉన్న నైపుణ్యాలు, ఉద్యోగార్టులకు ఉన్న నైపుణ్యాల మధ్య అంతరం ఎలా ఉందో పరిశ్రమలు మాట్లాడుతున్నాయి. 12వ తరగతి గ్రాడ్యుయేట్లకు అవకాశాలు: డ్యూయల్, డిపెండబుల్ & వైవిధ్యం 12వ తరగతి నుంచి గ్రాడ్యుయేట్కి సిద్దం అవుతున్న విద్యార్థులు పూర్తిగా రూపాంతరం చెందిన డిజిటల్ సొసైటీకి శిఖరాగ్రంగా నిలుస్తున్నారు. IT పరిశ్రమ 2022లో వృద్ధి చెందుతుందని, ముఖ్యంగా టైర్-2 నగరాల్లో పటిష్టమైన ఉపాధి. అవకాశాలను అందిస్తుందని ఇటీవలి పరిశ్రమ నివేదికలు తెలుపుతున్నందున, 12 తరగతి నుంచి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఐటీ సంబందిత శిక్షణా కార్యక్రమాలలో పేరు నమోదు చేసుకోవడం ద్వారా ప్రయోజనం పొందుతారు. 'డ్యుయల్-ఫోకస్': విద్యపై డ్యుయల్ -ఫోకస్ ఏకీకృతం చేయడం + ఆచరణాత్మక శిక్షణ, ఇందులో ఈ రోజు IT పరిశ్రమలో అత్యవసరంగా అవసరమైన నైపుణ్యాలను అందించడం. వాస్తవాప్రపంచ ఐటీ ప్రాజెక్ట్లను బహిర్గతం చేయడం వంటివి ఉంటాయి. 'డిపెండబుల్': శిక్షణా కార్యక్రమం వ్యవధిలో వారికి స్టెపండ్ ద్వారా ఆర్థిక స్వాతంత్ర్యం ఇస్తూ, శిక్షణానంతరం హామీ ఇవ్వబడిన ఉద్యోగంలో ఉంచే భద్రతను విద్యార్థులకు అందిస్తుంది. వైవిధ్యం: విద్యార్థి వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు & మార్గదర్శకత్వానికి అవసరమైన నాయకత్వ నైపుణ్యాలపై దృష్టి సారించే సంపూర్ణ బోధనను కలిగి ఉంటుంది. మీరు భారతదేశంలో విద్య & ట్రైనింగ్ చరిత్రను పరిశీలించినప్పుడు, వృత్తిపరమైన ట్రైనింగ్ & నైపుణ్యం మన సంస్కృతిలో లోతుగా పాతుకుపోయినట్లు మీరు చూడవచ్చు. గురుకులం, పాఠశాల అభ్యాస రీతులు, హైబ్రిడ్ మోడల్ లెర్నింగ్పై దృష్టి సారించాయి, ఇది రోజు మొత్తంలో నైపుణ్యాలను ఆచరణాత్మకంగా ఉపయోగించడం చేర్చబడ్డాయి. ఇంటిగ్రేటెడ్ ప్రారంభ-కెరీర్ ప్రోగ్రామ్లు: విస్తరిస్తున్న హారిజోన్లు HCL టెక్నాలజీస్లో, హైస్కూల్ గ్రాడ్యుయేట్లకు అత్యుత్తమ ఇన్-క్లాస్ ఇంటిగ్రేటెడ్ ప్రారంభ-కెరీర్ ప్రోగ్రామ్లను అందించడంపై మేము దృష్టి పెడుతున్నాము, ఇది విద్యార్థులు లైవ్ ప్రాజెక్ట్లో క్లాస్రూమ్లో నేర్చుకున్న వాటిని ఆచరణాత్మకంగా వర్తింపజేసే అవకాశాలను అందిస్తుంది. 'వారు నేర్చుకునేటప్పుడు' సంపాదించే అవకాశం విద్యార్థులకు చిన్న వయస్సు నుండే ఆర్థిక బాధ్యతను నేర్పుతుంది. వారు పొందే ఆచరణాత్మక ఎక్స్పోజర్ & మార్గదర్శకత్వం వారి తోటివారిపై వారికి ఆధిక్యతను అందిస్తుంది. మన చుట్టూ ఎన్ని మార్పులు జరుగుతున్నప్పటికీ, స్మార్ట్ మార్గాన్ని ఎంచుకునే వారికి ITలో అవకాశాల కొరత లేదు. IT పరిశ్రమకు అవసరమైన సంబంధిత నైపుణ్యాలు ఉన్నవారు, ఒక మంచి ఎడ్యుకేషనల్ ఫౌండేషన్, వాస్తవ-ప్రపంచ ప్రాజెక్ట్లకు ఆచరణాత్మకంగా బహిర్గతం చేయడం చాలా అనిశ్చిత సమయాల్లో కూడా ఖచ్చితంగా విజయం సాధించగలదు. నా కెరీర్ ప్రారంభ దశలో, డాక్టర్ A.P.J. అబ్దుల్ కలాం మార్గదర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్లో పని చేయడానికి, నేర్చుకోవడానికి నాకు అవకాశం లభించింది, భారతదేశం గొప్ప నాయకులు మరియు దూరదృష్టి గలవారిలో ఒకరిగా వారిని మనమందరం ప్రేమగా గుర్తుంచుకుంటాము. ఆయన అనేక వివేకవంతమైన మాటలు మనందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. అతని ఒక అందమైన కోట్ గుర్తుకు వస్తుంది. "ఆకాశంవైపు చూడు. మనం ఒంటరిగా లేము. మొత్తం విశ్వం మనతో స్నేహపూర్వకంగా" ఉంటుంది అలాగే కలలు కనేవారికి, పని చేసేవారికి ఉత్తమమైన వాటిని అందించడానికి మాత్రమే సహకరిస్తుంది. శ్రీమతి శివశంకర్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ హెచ్సీఎల్ టెక్నాలజీస్ -
ఏపీ పోలీస్కు 15 డిజిటల్ సభ అవార్డులు.. సీఎం జగన్ ప్రశంసలు
సాక్షి, అమరావతి: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నూతన ఆవిష్కరణలలో ముందుకు సాగుతున్న ఏపీ పోలీస్.. ‘డిజిటల్ టెక్నాలజీ సభ–2022’ అవార్డులను గెలుచుకుంది. వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 15 డిజిటల్ టెక్నాలజీ అవార్డులు దక్కించుకుని దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం 8 అవార్డులు, తిరుపతి అర్బన్ పోలీస్ యూనిట్ రెండు, అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లా పోలీస్ యూనిట్లు ఒక్కోటి చొప్పున గెలుచుకున్నాయి. బాడీవోర్న్ కెమెరాల లైవ్ స్ట్రీమింగ్, ఏపీ పోలీస్, జీఐఎస్ ఆధారిత జీపీఎస్ విధానం, దిశ కమాండ్ కంట్రోల్ రూమ్, రేడియో ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్, హాక్ వాహనాలు, వీడియోకాన్ఫరెన్స్ విధానం, డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ విధానాలకు డిజిటల్ టెక్నాలజీ అవార్డులు దక్కాయి. చదవండి: (ఆకలితో బంకర్లలోనే బిక్కుబిక్కుమంటూ.. కనీసం తాగునీరు లేక..) సాంకేతిక పరిజ్ఞానాన్ని అద్భుతంగా వినియోగించుకుంటూ ప్రజలకు మెరుగైన రీతిలో సేవలు అందిస్తున్న పోలీసు శాఖను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశంసించారు. మహిళలు, చిన్నారులు, బలహీన వర్గాల భద్రతకు రాష్ట్ర పోలీసులు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. మెరుగైన పోలీస్ వ్యవస్థ కోసం రాష్ట్ర పోలీసులు చేస్తున్న కృషిని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్రెడ్డి కొనియాడారు. -
డిజిటల్ స్కిల్ పై వాట్సాప్ ఇండియా శిక్షణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని యువతకు డిజిటల్ టెక్నాలజీ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడానికి సామాజిక మాధ్యమ సంస్థ వాట్సాప్ ఇండియా ముందుకువచ్చింది. జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా డిజిటల్ స్కిల్ అకాడమీ శిక్షణ కార్యక్రమాన్ని వాట్సాప్ ఇండియా చేపట్టింది. కొత్తగా అందుబాటులోకి వస్తోన్న డేటా గోప్యత, సైబర్ భద్రత, ఆర్థిక అక్షరాస్యత వంటి వివిధ విభాగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చే బాధ్యతను ఇన్ఫీ పార్క్కు వాట్సాప్ ఇండియా అప్పగించింది. బుధవారం వర్చువల్గా ఈ డిజిటల్ అకాడమీ ట్రైనింగ్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నైపుణ్యాభివృద్ధి శిక్షణ) చల్లా మధుసూదన్ రెడ్డి, ఏపీఎస్ఎస్డీసీ చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి ప్రారంభించారు. చల్లా మధుసూధన రెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు ఈ కోర్సులో చేరడానికి 15,000 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని, వీరికి 10వ తేదీ నుంచి పది రోజులు పాటు శిక్షణ ఇచ్చి ఆన్లైన్ పరీక్ష ద్వారా వాట్సాప్ స్కిల్స్ స్టార్ కార్యక్రమానికి విద్యార్థులను ఎంపిక చేస్తారని చెప్పారు. ఇలా ఎంపికైన విద్యార్థులకు ఏడాది పాటు వివిధ డిజిటల్ టెక్నాలజీ అంశాలపై శిక్షణ ఇచ్చి ఉత్తీర్ణత సాధించిన వారికి సర్టిఫికెట్ ఇస్తారన్నారు. వీరు శిక్షణ తీసుకున్న రంగాల్లో ఉద్యోగం పొందడానికి వాట్సాప్ ఇండియా సహకారం అందిస్తుందని వెల్లడించారు. సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా అనేక వినూత్నమైన శిక్షణ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంచేందుకు నైపుణ్య పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు. వాట్సాప్ ఇండియా, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో రాష్ట్రంలోని యువతకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించామని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కొండూరు అజయ్ రెడ్డి కోరారు. మైక్రోసాఫ్ట్తో ఒప్పందం... విద్యార్థులకు ఆధునిక టెక్నాలజీ కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చి వారికి నైపుణ్యం కలిగించే విధంగా పలు అంతర్జాతీయ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే అంతర్జాతీయ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం కింద 40 సాఫ్ట్ సర్టిఫికేషన్ కోర్సులలో 1.62 లక్షల మంది విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇవ్వనుంది. ఇందుకోసం రూ.30.79 కోట్లు వ్యయం చేస్తోంది. -
సింగపూర్ తెలుగు ప్రజలకు కొత్త టెక్నాలజీపై అవగాహన కల్పించిన పీయూష్ గుప్త
సింగపూర్లో నివసించే తెలుగు సమాజం శ్రేయస్సు దృష్ట్యా అందరిలో వివిధ టెక్నాలజీ నైపుణ్యతలపై అవగాహన కల్పించడంతో పాటు ఈ కార్యక్రమాల ద్వారా జాతీయ సమగ్రత పెంపొందిచే విధంగా నవంబర్ 6న STS కనెక్ట్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా ప్రముఖ సింగపూర్ బ్యాంక్ డెవలప్వెంట్ ఆఫ్ సింగపూర్ గ్రూప్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి పీయూష్ గుప్త హాజరయ్యారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వివిధ టెక్నాలజీ అంశాలతో పాటు, భవిష్యత్తులో రానున్న సాంకేతిక పరిణామాలు, దానికి మనందరం ఎలా సిద్ధంగా ఉండాలి వాటి పరిణామాలు, క్రిప్టో & డిజిటల్ కరెన్సీ, ముఖ్యంగా యువతకు మార్గనిర్ధేశం, స్ధిరత్వం, సమతూల్యత, జాతీయ సమగ్రత, గ్లోబర్ వార్మింగ్, సామన్యుల తలసరి ఆదాయం పెంచుకోవడానికి సూచనలు వంటి వివిధ విభిన్న అంశాలతో కూడిన “ఫైర్ సైడ్ చాట్ విత్ పీయూష్ గుప్తా” శీర్షికతో మిస్ యూనివర్స్ సింగపూర్ నందిత బన్నా ముఖాముఖి చక్కగా నిర్వహించారు. తదనంతరం వివిధ అంశాలపై వీక్షకులు అడిగిన అనేక ప్రశ్నలకు అంతర్దృష్టితో అత్యంత ఆలోచనా భరితంగా పీయూష్ గుప్తా చర్చించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కోటిరెడ్డి ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని భవిష్య ప్రణాళికను, అవసరాన్ని ప్రారంభోపస్యాసంలో వివరించారు. STS కనెక్ట్స్ అనే కార్యక్రమాన్ని పీయూష్ గుప్త సమక్షంలో అందరి వీక్షకుల నడుమ లాంచనంగా ఆవిష్కరించారు. సుమారు 20 సంస్ధల సహకారంతో నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొని సాంకేతిక అంశాల అవగాహనతో పాటు, జాతీయ సమగ్రతను పెంపొందిచుకొని అంతిమ ప్రయోజనాన్ని పొందాలని కోరారు. ఈ కార్యక్రమానికి వాఖ్యతగా కార్యదర్శి సత్య చిర్ల వ్యవహరించారు. ప్రతి నెల ఒక్కొక్క సాంకేతిక అంశం యొక్క అవగాహనా కార్యక్రమం నిర్వహించబడుతుందని, ఒకరికొకరు సహాయం చేసుకొంటూ సమిష్టిగా అందరూ అభివృద్ధి చెందాలని, సింగపూర్ తెలుగు సమాజం సహకారం అందించడంలో ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. వివిధ మాధ్యమాల ద్వారా సుమారు 1000 మందికిపైగా పాల్గొన్నారని తెలిపారు. తమ విలువైన సమయాన్ని వెచ్చించిన పీయూష్ గుప్తాతో పాటు మిగతా అతిధులకు, నందితా బన్నాకు, వివిధ సంస్ధల కార్యవర్గసభ్యులకు, సింగపూర్ తెలుగుసమాజం కార్యవర్గానికి, వివిధ మాద్యమాల ద్వారా హాజరైన వారందరికీ కార్యక్రమ నిర్వాహకులు, ఉపాధ్యక్షులు అనిల్ పోలిశెట్టి కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ శీర్షికలో డిసెంబర్ 4న సైబర్ సెక్యూరిటీపై పేపాల్ ఆసియా పసిఫిక్ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ ఫోరమ్ మెహతా, జనవరిలో డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై లజాడా డేటా అండ్ ఎంటర్పైజ్ ఇంటలిజెన్స్ హెడ్ ముని వినయ్ లతో అవగాహనా కార్యక్రమం ఉంటుందని, వాటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంపై వీక్షకులు,నిపుణుల నుండి విశేష స్పందన లభించిందని, ఈ కార్యక్రమం తమ నైపుణ్యాలని పెంచుకోవటానికి, తద్వారా కెరీర్ పరంగా ముందుకెళ్లటానికి ఉపయోగపడుతుందని,తదుపరి ప్రోగ్రాం కోసం అందరూ ఆసక్తి గా ఎదురుచూస్తున్నట్లు సింగపూర్ తెలుగు సమాజం ప్రతినిధులు తెలిపారు. -
పెళ్లికొడుకు కదా అని ‘చెప్పినట్టు’ చేస్తే... అశ్లీల వీడియోలతో..
సౌజన్య (పేరు మార్చడమైనది)కు మాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా పెళ్లి సంబంధం వచ్చింది. విదేశాలలో ఉన్న పెళ్లికొడుకు స్వదేశానికి త్వరలో వస్తున్నానని చెప్పాడు. సౌజన్య చాలా సంతోషించింది. నెల రోజులుగా వాట్సప్ చాట్ల ద్వారా ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఆధునిక దుస్తుల్లో కనిపించాలని కోరాడు పెళ్లికొడుకు. నమ్మిన సౌజన్య అతను ‘చెప్పినట్టు’ చేసింది. దానిని రికార్డ్ చేసిన పెళ్లికొడుకు ఆ వీడియోను అశ్లీల వెబ్సైట్లో పెట్టాడు. ఆ తర్వాత అతను తన ఆన్లైన్ అకౌంట్స్ అన్నీ బ్లాక్ చేశాడు. మోసపోయిన విషయం అర్ధమైన సౌజన్య ఆత్మహత్యే శరణ్యం అనుకుంది. ∙∙ కీర్తన (పేరు మార్చడమైనది) పేరుతో ఫేస్బుక్లో ఫేక్ ఐడీ సృష్టించబడినట్టు తెలిసింది. దాని ద్వారా తనను వేధిస్తున్నవారి ఆటకట్టించాలనుకుంది. కానీ, ఎలాగో తెలియలేదు. ∙∙ సుందర్ (పేరు మార్చడమైనది) ఏడాది క్రితం సేంద్రీయ ఆహార ఉత్పత్తుల సంస్థకు యజమాని అయ్యాడు. చిన్న సంస్థే అయినా ఇప్పుడిప్పుడే లాభాలు అందుతున్నాయి. తన సంస్థ ఉత్పత్తులు మంచివి కావని, తనకు నష్టం కలిగించే ప్రకటనలు ఆన్లైన్లో చూసి షాకయ్యాడు. ∙∙ ఈ డిజిటల్ కాలంలో అపరిచత వ్యక్తుల నుంచి రకరకాల మోసాలకు లోనయ్యేవారి శాతం రోజు రోజుకూ పెరుగుతోంది. కరోనా కాలాన్ని ఉపయోగించుకొని మరింతగా సైబర్ నేరాలు పెరిగాయి. ఈ నేరాలలో పిల్లలు, మహిళలు ఎక్కువశాతం మోసానికి గురవుతున్నారు. అదేవిధంగా రకరకాల యాప్లు వచ్చి, డబ్బు దోపిడీ కూడా జరుగుతోంది. మోసం జరగకుండానే ముందస్తు జాగ్రత్తపడటం ఒక ఎత్తయితే, మోసపోయామని తెలిసినా తమని తాము రక్షించుకోవడం ఎలాగో ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం అవసరం. ఫిర్యాదు చేయడం ఎలా? మొబైల్ లేదా కెమెరా వాడకంతో పిల్లలను, స్త్రీలను వారి వ్యక్తిగత, అశ్లీల చిత్రాలు, వీడియోలను తీసి, ఆన్ లైన్ ప్లాట్ఫారమ్ల ద్వారా చూపినా, డిజిటల్ టెక్నాలజీ ద్వారా బాధితులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నా, ఒక వ్యక్తి లేదా సంస్థ యొక్క డేటా, ఆర్థిక సమాచారాన్ని డిజిటల్ మాధ్యమం ద్వారా దొంగిలించినా, వ్యక్తిగత సమాచారం లేదా డేటాను పొందడానికి, డబ్బు లేదా పరువును కోల్పోయేవిధంగా మోసపూరిత ప్రయత్నం చేసినా, నెట్వర్క్ను దోపిడీ చేసే హ్యాకింగ్ ప్రక్రియకు పూనుకున్నా.. ఇలా ఏ డిజిటల్ మోసానికైనా సరైన ముందు https://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయడం. ఆన్లైన్ మార్గాలలో ఆర్థిక నష్టం జరిగితే https://cyberpolice.nic.in లో ఫిర్యాదు చేయాలి. దీనినే సిటిజన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. పై రెండు పోర్టల్స్కి 15526 హెల్ప్లైన్ నెంబర్ అనుసంధానమై ఉంటుంది. దీనికి ఆర్బిఐ ఆమోదించిన అన్ని బ్యాంకులు అనుసంధానమై ఉంటాయి కాబట్టి ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత అకౌంట్ల తక్షణ నగదు లావాదేవీలను నిలిపి వేసి, మీ డబ్బును సురక్షితం చేస్తాయి. ఈ హెల్ప్లైన్ నెంబర్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. మీ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫోన్ నెంబర్ను నమోదు చేసి, వచ్చిన ఓటీపీ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. అందులో.. (1) చైల్డ్ పోర్నోగ్రఫీ (2) పిల్లల లైంగిక వేధింపులు (3) అసభ్యకరమైనవి, లైంగికపరమైనవి (జీజీ) ఇతర సైబర్ నేరాలు (1) మొబైల్ నేరాలు (2) సోషల్ మీడియా నేరాలు (3) ఆన్ లైన్ ఆర్థిక మోసాలు (4) సైబర్ ట్రాఫికింగ్ (5) హ్యాకింగ్... కి సంబంధించిన అంశాలు ఉంటాయి. ఫిర్యాదు చేసే ప్రక్రియ ఆఫ్లైన్ – ఆన్ లైన్ రెండు విధానాల్లో ఉంటుంది. సంఘటన ఏవిధంగా జరిగిందో తెలియజేయడానికి: (ఎ) కమ్యూనికేషన్ మోడ్ అంటే ఇంటర్నెట్, వాట్సాప్ .. ఏ విధానంలో అనేది తెలియజేయాలి. (బి) తేదీ – సమయం (సి) ప్లాట్ఫారమ్ (ఇంటర్నెట్, వాట్సాప్ మొదలైనవి) . (డి) ఆర్థిక మోసాలకు సంబంధించిన ఆధారాలు అప్లోడ్, పేమెంట్లు / బ్యాంక్ స్టేట్మెంట్ల స్క్రీన్షాట్లు. వేధింపులకు గురిచేసేవారి సంబంధిత స్క్రీన్ షాట్లు, ఫొటో, ఆడియో, వీడియో మొదలైనవి జత చేయాలి. అనుమానితుల వివరాలు (అందుబాటులో ఉంటే): (ఎ) అనుమానితుని పేరు (బి) గుర్తింపు (మొబైల్, ఇమెయిల్) (సి) ప్రదేశం.. మొదలైనవి) ఫిర్యాదుదారుల వివరాలు: (ఎ) పూర్తి పేరు – సహాయక వివరాలు (తండ్రి, జీవిత భాగస్వామి, గార్డియన్ మొదలైనవి) (బి) ఇమెయిల్ / ఫోన్ నంబర్ (సి) చిరునామా – ఐడీ ప్రూఫ్ (ఆధార్ మొదలైనవి) ఫిర్యాదును దాఖలు చేయడానికి దశల వారీ ప్రక్రియ ద్వారా వివరంగా తెలియజేయాలి. సత్వర స్పందన కోసం సమీప సైబర్క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. డిజిటల్గా మోసం ఎలా జరిగినా పోలీసులు, పోర్టల్, హెల్స్లైన్.. ఆపద్భాంధువుల్లా ఉన్నారనే విషయాన్ని విస్మరించరాదు. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
ఈ–కామర్స్పై మరింతగా ఐటీసీ దృష్టి
న్యూఢిల్లీ: ఈ–కామర్స్పై, ఆధునిక వ్యాపార విధానాలపై పారిశ్రామిక దిగ్గజం ఐటీసీ మరింతగా దృష్టి పెడుతోంది. ఉత్పాదకతను పెంచుకోవడానికి, వ్యయాలను తగ్గించుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ మొదలైన ఆధునిక డిజిటల్ టెక్నాలజీలను వినియోగించుకుంటోంది. 2020–21 వార్షిక నివేదికలో కంపెనీ ఈ విషయాలు వెల్లడించింది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో వినియోగదారులు ఇళ్ల నుంచే కొనుగోళ్లు జరిపేందుకు ప్రాధాన్యమిస్తుండటంతో ఈ–కామర్స్కు ఊతం లభించిందని పేర్కొంది. ఇంటర్నెట్ వినియోగం .. డిజిటల్ చెల్లింపుల లావాదేవీలు పెరగడం, ఆకర్షణీయమైన పథకాలు, ఉత్పత్తుల విస్తృత శ్రేణి, వేగవంతమైన డెలివరీలు మొదలైనవి ఈ విభాగం మరింతగా ప్రాచుర్యంలోకి వచ్చేందుకు దోహదపడుతున్నాయని ఐటీసీ అభిప్రాయపడింది. ఇలాంటి అంశాలన్నింటి తోడ్పాడుతో గత నాలుగేళ్లుగా తమ మార్జిన్లు గణనీయంగా మెరుగుపడ్డాయని పేర్కొంది. డోమినోస్, స్విగ్గీ, జొమాటో, డుంజో వంటి సంస్థలతో చేతులు కలపడం ద్వారా వినియోగదారులకు ఉత్పత్తుల లభ్యత పెరిగిందని ఐటీసీ తెలిపింది. ’ఐటీసీ స్టోర్ ఆన్ వీల్స్’ మోడల్తో 13 నగరాల్లో 900 పైగా రెసిడెన్షియల్ కాంప్లెక్సులకు ఉత్పత్తులను అందిస్తున్నట్లు పేర్కొంది. గతేడాది సరిగ్గా లాక్డౌన్కు ముందు ప్రారంభించిన ఐటీసీ ఈ–స్టోర్కు మంచి స్పందన లభిస్తోందని, రాబోయే నెలల్లో దీన్ని మరింత వేగవంతంగా విస్తరించనున్నట్లు కంపెనీ తెలిపింది. -
ఆరెస్సెస్ నేతల ఖాతాలకే ఇలా.. ఇదే ఆఖరి హెచ్చరిక
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, సామాజిక మాధ్యమం ట్విట్టర్ మధ్య పోరు మరింత తీవ్రమైంది. కొత్త డిజిటల్ (ఐటీ) నిబంధనల ప్రకారం దేశంలో భారత్కు చెందిన అధికారుల్ని నియమించకపోవడంతో ట్విట్టర్పై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్త నిబంధనల్లో అమల్లోకి వచ్చి వారం రోజులు గడిచిపోయినా ట్విట్టర్ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో కేంద్ర ఐటీ శాఖ ఆ సంస్థకు చివరి హెచ్చరికగా శనివారం నోటీసులు జారీ చేసింది. ట్విటర్లో నెటిజన్లు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి భారత్కు చెందిన అధికారుల్ని నియమించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యక్తిగత ఖాతాకి సంబంధించి బ్లూ టిక్స్ బ్యాడ్జ్ని ట్విట్టర్ కొద్దిసేపు తొలగించి మళ్లీ పునరుద్ధించింది. ఇది జరిగిన కొద్ది గంట్లోలనే కేంద్రం ట్విటర్కి నోటీసులు పంపింది. కొత్త నిబంధనలు పాటించడానికి ట్విట్టర్ విముఖత చూపించడం భారతదేశ ప్రజల పట్ల ఆ సంస్థకు చిత్తశుద్ధి లేకపోవడాన్ని తేటతెల్లం చేస్తోందని పేర్కొంది. ట్విట్టర్ వేదికగా భారత్ ప్రజలు ఎదుర్కొనే సమస్యలు సరైన సమయంలో పారదర్శకంగా పరిష్కారమవ్వాలంటే దేశ పౌరులే అధికారులుగా ఉండాలని స్పష్టం చేసింది. ఇదే తాము ఇచ్చే చివరి నోటీసు అని తక్షణమే చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్, రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీస్, నోడల్ కాంటాక్ట్ ఆఫీసర్లుగా భారతీయుల్ని నియమించకపోతే చట్టపరమైన చర్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ నోటీసుల్లో హెచ్చరించింది. బ్లూ బ్యాడ్జ్ వివాదం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ట్విట్టర్ అకౌంట్లలో బ్ల్యూ బ్యాడ్జ్ను తొలగించడం చర్చనీయాంశంగా మారింది. వెరిఫై చేసిన అకౌంట్లకు ట్విట్టర్ బ్లూ బ్యాడ్జ్ ఇస్తుంది. అంటే సదరు వినియోగదారుడే ఈ ఖాతాను వాడుతున్నట్లు అధికారికంగా ధృవీకరించడమన్న మాట. శనివారం ఉదయం తొలుత వెంకయ్య వ్యక్తిగత ఖాతాకు బ్లూ బ్యాడ్జ్ను తొలగించిన ట్విట్టర్ తర్వాత పునరుద్ధరించింది. ఆరెస్సెస్ చీఫ్ భగవత్ వ్యక్తిగత ఖాతాతో పాటుగా ఇతర ఆరెస్సెస్ నేతలు సురేష్ సోని, అరుణ్కుమార్, సురేష్ జోషి, కృష్ణ గోపాల్ ఖాతాల్లో వెరిఫైడ్ బ్లూ టిక్స్ను తొలగించింది. ఆరెస్సెస్ నేతల ఖాతాలకే ఇలా జరగడం వివక్షాపూరిత చర్యని ఆరెస్సెస్ ఢిల్లీ యూనిట్ నాయకుడు రాజీవ్ మండిపడ్డారు. టెక్ ఫ్యూడలిజానికి ట్విట్టర్ నిదర్శనంగా మారుతోందని విమర్శించారు. ట్విట్టర్ చర్యలపై సర్వత్రా విమర్శలు రావడంతో ఆ సంస్థ వివరణ ఇచ్చింది. ఆరు నెలల పాటు ఖాతాను వినియోగించకపోతే, ఎలాంటి ట్వీట్లు చేయకపోతే బ్లూ బ్యాడ్జ్ ఆటోమేటిక్గా తొలగిపోతుందని ట్విట్టర్ తెలిపింది. గత కొద్దికాలంగా వారెవరూ ట్వీట్లు చేయకపోవడంతో బ్ల్యూ టిక్స్ పోయాయని, ఇప్పుడు వాటిని పునరుద్ధరించామని వివరించింది. -
రూ. 8 లక్షల కోట్లకు ఈ–కామర్స్!
న్యూఢిల్లీ: కరోనా వైరస్పరమైన పరిణామాలతో డిజిటల్ టెక్నాలజీల వాడకం విస్తృతంగా పెరిగిన నేపథ్యంలో దేశీయంగా ఈ–కామర్స్ విభాగం గణనీయంగా వృద్ధి చెందనుంది. గతేడాది (2020లో) 60 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ–కామర్స్ 2024 నాటికి దాదాపు 111 బిలియన్ డాలర్ల్ల (సుమారు 8 లక్షల కోట్లు) స్థాయికి చేరనుంది. దాదాపు 84 శాతం వృద్ధి సాధించనుంది. ఫైనాన్షియల్ టెక్నాలజీ సంస్థ ఎఫ్ఐఎస్ విడుదల చేసిన 2021 గ్లోబల్ పేమెంట్స్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దాదాపు 41 దేశాల్లో ప్రస్తుత, భవిష్యత్ చెల్లింపుల ధోరణులను ఈ నివేదికలో విశ్లేషించారు. దీని ప్రకారం కోవిడ్–19 పరిణామాలతో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా కొనుగోలుదారుల ధోరణుల్లో గణనీయంగా మార్పులు వచ్చాయి. చెల్లింపుల కోసం కొత్త విధానాలను ఉపయోగించడం పెరిగింది. ‘కోవిడ్–19 నేపథ్యంలో భారత్లో ఈ–కామర్స్ విభాగం భారీగా పెరిగింది. భవిష్యత్లో మరింతగా వృద్ధి చెందే అవకాశం ఉంది‘ అని ఎఫ్ఐఎస్ వరల్డ్పే ఎండీ (ఆసియా పసిఫిక్) ఫిల్ పామ్ఫోర్డ్ తెలిపారు. పెరగనున్న మొబైల్ షాపింగ్..: నివేదిక ప్రకారం ఈ–కామర్స్ వృద్ధికి మొబైల్ ద్వారా కొనుగోళ్లు జరపడం ప్రధానంగా దోహదపడనుంది. వచ్చే నాలుగేళ్లలో మొబైల్ షాపింగ్ వార్షికంగా 21 శాతం మేర వృద్ధి చెందనుంది. 2020లో అత్యధికంగా ఉపయోగించిన చెల్లింపు విధానాల్లో డిజిటల్ వ్యాలెట్లు (40%), క్రెడిట్ కార్డు.. డెబిట్ కార్డులు (చెరి 15%) ఉన్నాయి. ఆన్లైన్ చెల్లింపుల మార్కెట్లో డిజిటల్ వ్యాలెట్ల వాటా 2024 నాటికి 47 శాతానికి పెరిగే అవకాశం ఉంది. ఇవి కాకుండా దేశీయంగా ఆన్లైన్ పేమెంట్లకు సంబంధించి ’బై నౌ పే లేటర్’ (ముందుగా కొనుక్కోవడం, తర్వాత చెల్లించడం) విధానం కూడా గణనీయంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రస్తుతానికి దీని మార్కెట్ వాటా 3%గానే ఉన్నప్పటికీ ... 2024 నాటికి ఇది 9%కి పెరిగే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. పీవోఎస్ మార్కెట్ 41 శాతం వృద్ధి.. డిజిటల్ మాధ్యమం ద్వారా చెల్లింపులు జరిపేలా కస్టమర్లకు వెసులుబాటు కల్పించే సంస్థలే రాబోయే రోజుల్లో రిటైల్, ఈ–కామర్స్ మార్కెట్లో వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోగలవని పామ్ఫోర్డ్ తెలిపారు. నివేదిక ప్రకారం దేశీయంగా పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మార్కెట్ 2024 నాటికి 41 శాతం వృద్ధి చెంది 1,035 బిలియన్ డాలర్లకు చేరనుంది. స్టోర్స్లో చెల్లింపులకు అత్యధికంగా నగదు (34 శాతం), డిజిటల్ వ్యాలెట్లు (22 శాతం), డెబిట్ కార్డ్ (20 శాతం) విధానాలను ఉపయోగిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. ఆసియా పసిఫిక్ 13 శాతం అప్.. వర్ధమాన దేశాల్లో అధిక వృద్ధి ఊతంతో.. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఈ–కామర్స్ మార్కెట్ 2024 నాటికి 13 శాతం వార్షిక వృద్ధి నమోదు సాధించే అవకాశం ఉంది. చైనాలో అత్యధికంగా ఈ–కామర్స్ వినియోగం అత్యధిక స్థాయిలో కొనసాగనుంది. -
పీఎస్యూల ఆస్తుల విక్రయానికి ఈ–ప్లాట్ఫార్మ్..!
ప్రభుత్వ రంగ సంస్థల(పీఎస్యూల)లకు కీలకం కాని, నిరుపయోగంగా ఉన్న భూములు, ఆస్తుల విక్రయానికి ఆన్లైన్ ప్లాట్ఫార్మ్ను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆస్తుల నగదీకరణలో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థల వద్ద మిగులుగా ఉన్న భూములు, ఆస్తులను కేంద్రం విక్రయిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఆస్తులకు సంబంధించి కొన్నింటికి న్యాయ వివాదాలు ఉండటం, ఇతరత్రా కారణాల వల్ల ఈ ఆస్తుల విక్రయం ఆశించినంతగా ఉండటం లేదు. ఈ సమస్యలను అధిగమించడానికి, సత్వరంగా ఆస్తులను విక్రయించడానికి ఆన్లైన్–ప్లాట్ఫార్మ్ను ఏర్పాటు చేయడమే సరైన మార్గమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్లాట్ఫార్మ్ ద్వారా రూ.10,000 కోట్లు సమీకరించాలనేది కేంద్రం ఆలోచన. ఈ–ప్లాట్ఫార్మ్పై బడ్జెట్లో ప్రకటన! పీఎస్యూలకు సంబంధించి కీలకం కాని ఆస్తులను విక్రయించడానికి ఈ–బిడ్డింగ్ ప్లాట్ఫార్మ్ను రూపొందించాలని కేంద్రం ఇటీవలనే ప్రభుత్వ రంగ సంస్థ, ఎమ్ఎస్టీసీని ఆదేశించిందని సమాచారం. పీఎస్యూల భూములు, ఆస్తులకు సంబంధించి ఈ ప్లాట్ఫార్మ్.. వన్–స్టాప్ షాప్గా పనిచేస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్లాట్ఫార్మ్ ఏర్పాటుకు కనీసం నెల రోజులు పడుతుందని, దీనికి సంబంధించిన ప్రకటన ఈ ఏడాది బడ్జెట్ ప్రతిపాదనల్లో ఉండే అవకాశాలున్నాయని ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్లాట్ఫార్మ్కు దీపమ్(డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్) సమన్వయ సహకారాలనందిస్తుంది. వ్యూహాత్మక వాటా విక్రయానికి ఉద్దేశించిన పీఎస్యూల ఆస్తులను తొలుతగా ఈ ప్లాట్ఫార్మ్ ద్వారా విక్రయించే ప్రయత్నాలు చేస్తారు. ఇప్పటికే కొన్ని ఆస్తులను గుర్తించారు. బీఎస్ఎన్ఎల్, ఎమ్టీఎన్ఎల్, బీఈఎమ్ఎల్ తదితర సంస్థల ఆస్తులు దీంట్లో ఉన్నాయి. డిజిటల్ టెక్నాలజీ ఉత్తమం.... కీలకం కాని, వృ«థాగా ఉన్న పీఎస్యూల భూములను, ఆస్తులను విక్రయించాలని గత కొన్నేళ్లుగా పీఎస్యూలపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. న్యాయ సంబంధిత వివాదాలు, ఇతరత్రా కారణాల వల్ల పీఎస్యూలు ఈ ఆస్తుల విక్రయంలో విఫలమవుతున్నాయి. ఈ వ్యవహారం ఒకడుగు ముందుకు, మూడు అడుగులు వెనక్కు.. అన్న చందంగా తయారైంది. ఇలాంటి ఆస్తుల విక్రయానికి డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకోవడం ఉత్తమమని నిపుణులు అంటున్నారు. ఈ ప్లాట్ఫార్మ్ ఎలా పనిచేస్తుందంటే.. ► ఈ–బిడ్డింగ్ ప్లాట్ఫార్మ్ ఏర్పాటు చేస్తారు ► విక్రయించే పీఎస్యూల భూములు, ఆస్తులను ఈ ప్లాట్ఫార్మ్పై నమోదు చేస్తారు ► ఎమ్ఎస్టీసీ, దీపమ్ల పర్యవేక్షణ ఉంటుంది ► రూ.100 కోట్లకు మించిన ఆస్తులనే అమ్మకానికి పెడతారు. ► వేలంలో పాల్గొనే సంస్థలు ఎమ్ఎస్టీసీ వద్ద నమోదు చేసుకోవాలి ► అసెట్ వేల్యూయార్చే ఆస్తుల విలువ నిర్ధారిస్తారు ► ఆస్తుల కొనుగోళ్లకు ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్లు ఆహ్వానిస్తారు ► ఈ–వేలం నిర్వహిస్తారు ► వేలం అనంతర ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేస్తారు -
ఐటీ కంపెనీల ఆదాయాలు అంతంతే !
న్యూఢిల్లీ: భారత ఐటీ కంపెనీల ఆదాయాలు(డాలర్ల పరంగా) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంతంతమాత్రంగానే ఉంటాయని ప్రముఖ రేటింగ్ సంస్థ ఇక్రా అంచనా వేస్తోంది. గతంలో తాము ఇచ్చిన నెగిటివ్ (మైనస్ మూడు శాతం) వృద్ధి అంచనాలను సవరిస్తున్నట్లు పేర్కొంది. డిజిటల్ సర్వీసులకు డిమాండ్ వేగంగా పెరుగుతోందని వివరించింది. వర్క్ఫ్రమ్ హోమ్ ఆప్షన్తో ఐటీ కంపెనీలు తమ సర్వీసుల్లో అంతరాయాల సమస్యను అధిగమిస్తున్నాయని పేర్కొంది. అందుకనే ఐటీ కంపెనీల ఆదాయ వృద్ధి అంచనాలను నెగిటివ్ నుంచి ఫ్లాట్ గా సవరించామ ని వివరించింది. ఇక్రా ఇంకా ఏం చెప్పిందంటే... కరోనా సంబంధిత ఆందోళనలు కొనసాగు తుండటంతో వ్యాపార సంస్థలు వర్చువల్ మోడల్స్కు మారుతున్నాయి. దీంతో ఐటీ కం పెనీల సేవలకు డిమాండ్ పుంజుకుంటోంది. డిజిటల్ టెక్నాలజీలకు డిమాండ్ అధికంగా ఉండటం ఐటీ కంపెనీలకు కలసి వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృభించడంతో సరఫరా, డిమాండ్ సంబంధిత సమస్యలు తలెత్తాయి. ఐటీ కంపెనీలపై కూడా ఐటీ సర్వీసులందించడంపై కరోనా కల్లోలం ప్రభావం చూపించింది. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ద్వారా తన సేవల్లో అంతరాయాల సమస్యను ఐటీ కంపెనీలు అధిగమించగలిగాయి. అయితే డిమాండ్ సంబంధిత సమస్యలు ఒకింత కొనసాగుతున్నాయి. భారత ఐటీ కంపెనీల ఆదాయాల్లో దాదాపు 80 శాతం మేర యూరప్, అమెరికా దేశాల నుంచే వస్తోంది. ఈ ఏడాది కరోనా కల్లోలం తీవ్రంగా ఉండటంతో ఆయా దేశాల్లో జీడీపీ బాగా తగ్గింది. దీంతో ఆయా దేశాల్లోని కంపెనీలు తమ వ్యయాలపై నియంత్రణ విధిస్తున్నాయి. దీంట్లో భాగంగా మన ఐటీ కంపెనీలను డిస్కౌంట్లు అడుగుతున్నాయి. -
ఐటీ చరిత్రలో సంచలన కలయిక
ముంబై: ఐటీ చరిత్రలో సంచలన కలయికకు దిగ్గజ కంపెనీలు వేదికయ్యాయి. తొలిసారిగా ఐటీ కంపెనీలు టీసీఎస్, ఐబీఎం కలిసి పనిచేయనున్నాయి. తమ క్లయింట్లకు మెరుగైన సేవలందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ క్లయింట్లకు అత్యాధునిక టెక్నాలజీని అందించేందుకు ఐబీఎమ్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు టీసీఎస్ తెలిపింది. అత్యుత్తమ సాంకేతికతతో ఐబీఎమ్ క్లౌడ్ యూనిట్ను టీసీఎస్ ప్రారంభించనుంది. ఇందులో రెండు కంపెనీలు(టీసీఎస్, ఐబీఎమ్)లకు చెందిన అత్యుత్త సాంకేతిక నిపుణులు సేవలందిస్తారు. అయితే డేటా ఎస్టేట్ , వివిధ రకాల అప్లికేషన్స్ తదితర అంశాలను బదిలీ చేయనున్నట్లు ఇరు కంపెనీలు తెలిపాయి. ఇరు కంపెనీలు వృద్ధి చెందేందుకు మెరుగైన అంశాలు బదిలీ చేయనున్నట్లు కంపెనీ వర్గాలు విశ్లేషిస్తున్నారు. ఇదివరకు డిజిటల్ టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు ఇన్ఫోసిస్, విప్రో సంస్థలు గూగుల్, మైక్రోసాఫ్ట్లతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. కాగా భవిష్యత్తులో డిజిటల్ రంగం సృష్టించబోయే నూతన అప్లికేషన్స్ ఆధునీకరణ, క్లౌడ్ కంప్యూటింగ్ తదితర అంశాలలో ముందుంటామని టీసీఎస్ ఉన్నతాధికారి వెంకట్రామన్ తెలిపారు. వెంకట్రామన్ స్పందస్తూ.. భవిష్యత్తులో క్లయింట్లు, వినియోగదారులకు వేగంగా సేవలందించేందుకు టీసీఎస్, ఐబీఎం ఒప్పందం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. కాగా క్లౌడ్ టెక్నాలజీ బదిలీ వల్ల క్లయింట్లకు వేగంగా ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అవకాశముంటుందని ఐబీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బోబ్ లార్డ్ పేర్కొన్నారు. టీసీఎస్, ఐబీఎమ్ ఒప్పందంతో ఐటీ వేగంగా వృద్ధి చెందుతుందని లార్డ్ అభిప్రాయపడ్డారు. క్లయింట్లకు, వినియోగదారులకు అత్యుత్తమ సేవలందించేందుకు టీసీఎస్, ఐబీఎమ్ కలయిక ఉపయోగపడుతుందని సాంకేతిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. (చదవండి: నిరుద్యోగుల కోసం టీసీఎస్ శిక్షణ) -
భాగ్యనగరంలో 45 దవాఖానాలు ప్రారంభం
-
త్రీడీతో డిజిటల్ విప్లవం
సాక్షి, హైదరాబాద్ : కోవిడ్ తదనంతర పరిస్థితుల్లో డిజిటల్ అక్షరాస్యత, మౌలిక వసతులు, ఆవిష్కరణల (త్రీడీ) ద్వారానే భారత్లో డిజిటల్ విప్లవం సాధ్యమవుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. సామాన్యులకు కూడా డిజిటల్ పరిజ్ఞానం అందినప్పుడే డిజిటల్ విప్లవం సాధ్యమవుతుందని అప్పుడే సమాజంపై సానుకూల ప్రభావం ఉంటుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ‘కోవిడ్ తదనంతర కాలంలో డిజిటల్ విప్లవం’అనే అంశంపై భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) శుక్రవారం నిర్వహించిన డిజిటల్ సదస్సుకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆన్లైన్ వేదికగా ‘వర్చువల్ కాన్ఫరెన్స్’విధానంలో జరిగిన ఈ సదస్సులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, వివిధ సంస్థల ప్రముఖులు పాల్గొన్నారు. ప్రజల్లో డిజిటల్ అక్షరాస్యత పెంచేందుకు భారత్లో ఎంతో కృషి జరగాల్సి ఉందని, అందుకు అవసరమైన బ్రాడ్బ్యాండ్తో పాటు ఇతర మౌలిక వసతుల కల్పన, ఆవిష్కరణలు జరగాల్సి ఉందన్నారు. భారతీయ డిజిటల్ వ్యూహంలో భాగంగా ప్రపంచ స్థాయిలో పోటీ పడేందుకు రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో తెలంగాణ ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ 18% వృద్ధి రేటును సాధించడాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ ప్రకాశ్ సాహ్నీ అభినందించారు. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో అవకాశాలను తెలంగాణ అందిపుచ్చుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కోవిడ్ సమయంలో రాష్ట్రంలోని వేయికి పైగా కిరాణా దుకాణాలను డిజిటల్ వేదికపైకి తీసుకువచ్చిన తీరును రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ వివరించారు. భారతదేశం డిజిటల్ పరివర్తన చెందేందుకు కోవిడ్ మహమ్మారి ఊతమిచ్చిందన్నారు. ఐటీ రంగంలో నాణ్యతను పెంచేందుకు ఇప్పటికే 21 చోట్ల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు (సీఓఈ) ఏర్పాటు చేయగా, మరో 12 సీఓఈల ఏర్పాటుకు ద్వితీయ శ్రేణి నగరాలను గుర్తించినట్లు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఓంకార్రాయ్ వెల్లడించారు. సదస్సులో సీఐఐ తెలంగాణ మాజీ చైర్మన్ వి.రాజన్న, ఎంపీఎల్ సీఈఓ సాయి శ్రీనివాస్ కిరణ్, సీఐఐ తెలంగాణ చైర్మన్ క్రిష్ణ బోదనపు పాల్గొన్నారు. -
ఇక సినిమాలు, పబ్ పార్టీలు నామమాత్రమే!
కరోనా వైరస్ పుణ్యమా అని ఐటీ కంపెనీలకు మాత్రమే పరిమితం అనుకున్న వర్క్ ఫ్రం హోం ఇప్పుడు అన్ని కార్యాలయాలకూ విస్తరించింది. దీనికి ఇంటర్నెట్ అన్నది ఆధార భూతమన్నది కాసేపు మరిచిపోయినా.. ఇకపై మన ప్రపంచం భౌతికంగా కాకుండా.. డిజిటల్ రూపంలోనే ఎక్కువగా దర్శనమివ్వనుందనడంలో సందేహం లేదు. రూఫ్టాప్ గార్డెన్పై మూన్లైట్ డిన్నర్లు.. హనీమూన్ కోసమో.. విహార యాత్రకో స్విట్జర్లాండ్కు వెళ్లే అవకాశాలు తగ్గుతాయి. లాక్డౌన్ కాలంలో ఓటీటీ ప్లాట్ఫామ్స్కు పెరుగుతున్న ఆదరణను గమనిస్తే.. భవిష్యత్తులో సినిమాలు, పబ్లు, క్లబ్ పార్టీల ఉనికి కూడా నామమాత్రం కానుందన్న సందేహాలు తప్పవు. బాస్ను చూడాలంటే మాత్రం ఆఫీసుకెళ్లే పరిస్థితులు.. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా బడి పాఠాలు నిత్యకృత్యం కావడం అనివార్యం కానుంది. మార్పు విద్య, వినోద రంగాలకు మాత్రమే పరిమితం కాదు. పరిశ్రమల్లోనూ ఆటోమేషన్, ఏఐ వంటి టెక్నాలజీలు అందుబాటులోకి వస్తాయి. పూర్తిస్థాయి డిజిటల్ ప్రపంచం అందుబాటులోకి వచ్చిన తర్వాత సమాజంతో, రాజ్యంతో మనిషి సంబంధాలు చాలా మారిపోతాయని లండన్లోని కింగ్స్ కాలేజీ స్కూల్ ఆఫ్ సెక్యూరిటీ స్టడీస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆండ్రియాస్ క్రెయిగ్ పేర్కొంటున్నారు. విప్లవాత్మక మార్పులు.. 1918–20ల మధ్య వచ్చిన స్పానిష్ ఫ్లూ తర్వాత ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆరోగ్య సమస్య కరోనానే. ఇప్పటికే సుమారు 35 లక్షల మంది వైరస్ బారిన పడగా.. రెండున్నర లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు కూడా. దీని ప్రభావం మానసికంగా ఇతరులపై కూడా ఎంతో ఉంది. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి విపత్తు ఎదురైతే ఎదుర్కొనేందుకు ప్రపంచదేశాలు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆరోగ్య సేవల్లో విప్లవాత్మకమైన మార్పులు రానున్నాయి. డిజిటల్ టెక్నాలజీలు, టెలి మెడిసిన్లు సాధారణమైపోవడం మాత్రమే కాదు.. అత్యవసర పరస్థితుల్లో అవసరాలకు తగ్గట్టుగా ఐసీయూ వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వాలు ప్రయత్నాలు ప్రారంభిస్తాయి. ఇళ్లలోనే చేసుకోదగ్గ పరీక్షలను అభివృద్ధి చేయడం ద్వారా దగ్గు, జ్వరం వంటి సాధారణ సమస్యలకూ వైద్యుల వద్దకు వెళ్లే పరిస్థితి పోయి.. అప్లికేషన్ల రూపంలో వైద్యుడిని సంప్రదించడం, మందులు తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న ప్రజారోగ్య వ్యవస్థలోని లోటుపాట్లను తీరుస్తూ డిజిటల్ ఆరోగ్య సేవలు అందుబాటులోకి వస్తాయి. భవిష్యత్తులో చిన్నదైనా సరే.. ఓ సొంత ఇల్లు ఉండాలనుకునే వారి సంఖ్య పెరుగుతుందని అంతర్జాతీయ నిపుణుల అంచనా. ఫలితంగా అపార్ట్మెంట్ల స్థానంలో నగరాలకు దూరంగా చిన్న చిన్న పల్లెల్లాంటి వ్యవస్థలు ఏర్పడతాయని, తద్వారా కరోనా వంటి వైరస్ల నుంచి రక్షణ పొందొచ్చన్న భావన బలపడుతుందని అంటున్నారు. -
ప్రీమియర్ డిజిటల్ సొసైటీగా భారత్: అంబానీ
సాక్షి, ముంబై: భారతదేశం ప్రీమియర్ డిజిటల్ సొసైటీగా అవతరించే అవకాశం ఎంతో దూరంలో లేదని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ స్పష్టం చేశారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్కు వచ్చిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో ముచ్చటించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సోమవారం ముంబైలో జరిగిన ఫ్యూచర్ డీకోడ్ సీఈఓ 2020 సమ్మిట్లో సత్య నాదెళ్లతో సంభాషించిన అంబానీ డిజిటల్ సేవల్లో భారత్ అగ్రగామిగా నిలవనుందని చెప్పారు. 2014 లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా పిలుపుతో దేశంలో డిజిటల్ విప్లవానికి పునాది పడిందని తెలిపారు. ముఖ్యంగా జియో ఆవిష్కారం అనంతరం భారత్లో డిజిటల్ విప్లవాన్ని తీసుకొచ్చామన్నారు. రిలయన్స్ జియో ద్వారా దేశంలోని మారుమూల గ్రామాలకు కూడా డేటా సౌకర్యాన్ని అందించగలగడం చాలా గర్వంగా ఉందని వెల్లడించారు. జియోకు ముందు దేశంలో డేటా వేగం 256 కేబీపీఎస్ అయితే, జియో తరువాత ఇది 21 ఎంబీపీస్గా ఉండడం విశేషమన్నారు. 380 మిలియన్ల మంది జియో 4జీ టెక్నాలజీకి వలస వచ్చారని ఆయన చెప్పారు. ఈ క్రమంలో భారతదేశం "ప్రీమియర్ డిజిటల్ సొసైటీ" గా అవతరించే దశలో ఉందన్నారు. అలాగే ప్రపంచంలో మూడు ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారత్ నిలవనుందని అంబానీ పేర్కొన్నారు. ఇందులో తనకెలాంటి సందేహం లేదనీ, అయితే ఇది రానున్న ఐదేళ్లలోనా, పదేళ్లలో జరుగుతుందా అనేదే చర్చ అన్నారు. రిలయన్స్, మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యం ఈ దశాబ్దాన్ని నిర్వచించనుందన్నారు. ఇది చాలా కీలమని ఆయన పేర్కొన్నారు. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత దేశ పర్యటన గురించి ప్రస్తావించిన అంబానీ, అమెరికా మాజీ అధ్యక్షులు జిమ్మీ కార్టర్, బిల్ క్లింటన్, బరాక్ ఒబామా సందర్శనల కంటే భారతదేశం చాలా భిన్నంగా ఉందని, మొబైల్ కనెక్టివిటీ ఒక కీలకమైన మార్పు అని తెలిపారు. తరువాత తరం మీరు(సత్య నాదెళ్ల) నేను( ముకేశ్ అంబానీ) చూసిన భారత్ కంటే విభిన్నమైన దేశాన్ని చూడబోతోందన్నారు.(చదవండి: భారత సీఈవోలకు సత్య నాదెళ్ల సలహా) మైక్రోసాప్ట్, భాగస్వామ్యాన్ని ప్రకటించిన ముకేశ్ అంబానీ రానున్న దశాబ్దాన్ని ఈ డీల్ నిర్వచించనుందని అభిప్రాయపడ్డారు. భారతదేశంలోని ప్రతి వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ లేదా బిల్ గేట్స్ అయ్యే అవకాశం ఉందని అంబానీ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సత్య నాదెళ్ల నేతృత్వంలో మైక్రోసాఫ్ట్ అందిస్తున్న సేవలను అంబానీ ప్రశంసించారు. -
ఫండ్స్ వయా వ్యాలెట్స్!
మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ఒకప్పుడు కొన్ని రోజులు పట్టే కార్యక్రమం. కానీ, ఇప్పుడు క్షణాల్లోనే ఇన్వెస్ట్ చేసుకునేందుకు డిజిటల్ సాధనాలు ఉన్నాయి. అందులోనూ అరచేతిలోని స్మార్ట్ఫోన్ నుంచి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టుకునేందుకు వీలు కల్పించే సంస్థలు ఎన్నో పుట్టుకొచ్చాయి. పేటీఎం, మొబిక్విక్, ఈటీమనీతోపాటు ప్రముఖ బ్రోకరేజీ సంస్థలు సైతం ఫండ్స్లో డైరెక్ట్ ప్లాన్లను ప్రత్యేక యాప్ ద్వారా ఆఫర్ చేస్తున్నాయి. ఇన్వెస్టర్లు తమ స్మార్ట్ఫోన్లో సంబంధిత యాప్ను ఇన్స్టాల్ చేసుకుని, కేవైసీ, బ్యాంకు ఖాతా వివరాలు ఇస్తే చాలు... ఎప్పుడంటే అప్పుడు ఇన్వెస్ట్మెంట్, ఉపసంహరణలను ఎంతో సులభం. ఫండ్స్లో పెట్టుబడులకు ఈ సాధనాలు దోహదపడతాయని పలువురు భావిస్తున్నారు. అలాగే, కొత్తగా ఫండ్స్ వైపు అడుగులు వేసే వారు అవగాహన లేకుండా వ్యవహరిస్తే వీటితో నష్టాలూ ఉన్నాయంటున్నారు. మొబైల్ నుంచే చిటికెలో పెట్టుబడికి వీలు కల్పిస్తున్న ఈ యాప్స్ వల్ల లాభ, నష్టాలపై నిపుణుల అభిప్రాయాలను అందించే కథనమే ఇది. పేటీఎం, మొబిక్విక్, ఈటీమనీ వంటివి ఎటువంటి చార్జీల్లేకుండానే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనుమతిస్తున్నాయి. పేటీఎంను 30 కోట్లకు పైగా కస్టమర్లు ఉపయోగిస్తుంటే, మొబిక్విక్ను 10.7 కోట్ల మంది వినియోగిస్తున్నారు. అంటే ఈ రెండు మొబైల్ వ్యాలెట్ల యూజర్లు కలిపితే 40 కోట్లకు పైనే ఉన్నారు. వీరందరికీ తమ వ్యాలెట్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం అందుబాటులో ఉన్నట్టే. మన దేశంలో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టుకునే అవగాహన ఈ మధ్య కాలంలోనే విస్తృతమైంది. ఇప్పుడు మొబైల్ యాప్స్ రాకతో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు మరింత పెరిగేందుకు దోహద పడనుంది. దీంతో ఇప్పటి వరకు నిదానంగా ఉన్న మ్యూచువల్ ఫండ్స్ విస్తరణ వేగాన్ని పుంజుకోనుంది. తమ మొబైల్ వ్యాలెట్ల నుంచే నచ్చిన మ్యూచువల్ ఫండ్ పథకం డైరెక్ట్ ప్లాన్లో రూ.100 నుంచీ పెట్టుబడి పెట్టుకునేందుకు అవకాశం ఉంది. పేటీఎం సంస్థ 2018 సెప్టెంబర్లో పేటీఎం మనీ యాప్ను తీసుకొచ్చింది. ఆరు నెలలు నిండకుండానే పేటీఎం మనీ యాప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య కోటి దాటినట్టు పేటీఎం ప్రకటించింది. పేటీఎం తొలుత వ్యాలెట్ల నుంచి కొనుగోళ్లకు అవకాశం కల్పించింది. విక్రయించినప్పుడు ఆ మొత్తాన్ని యూజర్ బ్యాంకు ఖాతాకు జమ చేసేది. అయితే, పేటీఎం పేమెంట్స్ బ్యాంకు ఖాతాను ప్రైమరీ బ్యాంకు ఖాతాగా పేటీఎం మనీలో ఇచ్చుకునే అవకాశం కల్పించింది. దీంతో పేటీఎం పేమెంట్స్ బ్యాంకు ఖాతా ద్వారా పెట్టుబడులు, విక్రయించినప్పుడు అదే ఖాతాకు జమ చేసేందుకు అవకాశం వచ్చింది. అలాగే ఇతర బ్యాంకు ఖాతాలను సైతం ప్రైమరీ ఖాతాగా సెట్ చేసుకోవచ్చు. అలాగే, యూజర్లు నమోదు చేసిన బ్యాంకు ఖాతాకు సంబంధించి యూపీఏ, నెట్ బ్యాంకింగ్, డెబిట్కార్డుల ద్వారానూ చెల్లింపులు చేయవచ్చు. ఇక మొబిక్విక్ 2018 అక్టోబర్లో క్లియర్ఫండ్స్ను కొనుగోలు చేయడం ద్వారా వెల్త్ మేనేజ్మెంట్ (సంపద నిర్వహణ) వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఈ కొనుగోలు తర్వాత తన యూజర్లకు నేరుగా మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లలో ఇన్వెస్ట్ చేసుకునే సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈటీమనీ, కార్వీకి చెందిన కేఫిన్కార్ట్, జీరోదా కాయిన్ ఇలా ఎన్నో సంస్థలు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. పదుల సంఖ్యలో సంస్థలు రావడంతో కొత్త ఇన్వెస్టర్లను సొంతం చేసుకుని, వారితో తమ ప్లాట్ఫామ్ల ద్వారా ఇన్వెస్ట్ చేయించేందుకు ఇవి ఉచిత సేవలతోపాటు ప్రచారం కోసం నిధులను ఖర్చు చేస్తున్నాయి. సులభంగా ఇన్వెస్ట్ చేసుకునే సదుపాయాలు బాగానే ఉన్నాయి... కానీ, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు అంటే రిస్క్తో కూడుకున్నవే. ముఖ్యంగా ఈక్విటీ పథకాల్లో రిస్క్ అధికంగా ఉంటుంది. డెట్ పథకాల్లో రిస్క్ తక్కువ. మరి ఎంచుకునే పథకాలు తమ రిస్క్ ప్రొఫైల్కు సరిపోయేవేనా?, తాము ఆశించిన మేర పెట్టుబడులను ఇచ్చేవేనా? అన్న అంశాలపై ఇన్వెస్టర్లు దృష్టి పెడుతున్నారా? అన్న సందేహం నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది. వరమే... సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లేదా పెట్టుబడికి వీలు కల్పించే నూతన విధానాలు ఏవైనా సరే... ఇన్వెస్టర్లకు మరింత సులభతరం లేదా లాభదాయకం ఉంటే అది నిజంగానే మంచి ఆలోచనే అవుతుంది. దేశంలో మిలీనియల్స్కు వ్యాలెట్లు ఎంతో అనకూలమైనవిగా రుజువైంది. చిన్న వయసులోనే పెట్టుబడుల అలవాటును నేర్పించి, మిలీనియల్స్ మార్కెట్ను చేరుకునే మార్గం కోసం మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ ఇంత కాలం ఎదురు చూస్తోంది. వ్యాలెట్ల ద్వారా పెట్టుబడులకు వీలు కల్పించడం తదుపరి తరం ఇన్వెస్టర్లకు చేరువగా మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ వెళ్లడమే. యువ ఇన్వెస్టర్లకు ఇది చిన్న వయసులోనే పెట్టుబడులు ఆరంభించేందుకు సౌకర్యంగా ఉంటుంది. అయితే, ఇన్వెస్టర్లు ముందుగా పెట్టుబడుల ప్రక్రియ, సంబంధిత సాధనాల గురించి పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఇన్వెస్టర్లకు అసలైన ప్రయోజనాలు లభిస్తాయి. – శ్రీకాంత్ మీనాక్షి, ఫండ్స్ ఇండియా సహ వ్యవస్థాపకులు నిపుణుల సలహాలతో చేస్తే లాభమే.. మొబైల్ ఫోన్లకు అతుక్కునిపోయే మిలీనియల్స్, ఓలా, స్విగ్గీ, బుక్మైషో తదితర వాటిని వినియోగించే వారు... మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేందుకు మొబైల్ వ్యాలెట్లను వినియోగిస్తున్నారు. అధిక రాబడులు లేదా పెట్టుబడులకు సౌకర్యంగా ఉందని వ్యాలెట్ల ద్వారా చేస్తున్నారు. తప్పుడు సలహాలు, బ్యాంకులు, ఏజెంట్లు, డిస్ట్రిబ్యూటర్ల సరిపడని సూచనలతో గతంలో చేతులు కాల్చుకున్న రిటైల్ ఇన్వెస్టర్లు కూడా... పారదర్శకత ఉందని, స్వీయ నియంత్రణ ఉంటుందని చెప్పి కొనుగోలు చేస్తుండొచ్చు. మొబైల్ వ్యాలెట్ల ద్వారా అయితే ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వేగంగా రిడీమ్ చేసుకోవచ్చు. లేదా అస్థిర మార్కెట్లలో అవగాహన లేమితో సిప్లను ఆపివేయవచ్చు. కేవలం వ్యయాలు, సౌకర్యం అని కాకుండా, మొబైల్ వ్యాలెట్ల పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్ల అనుభవమే ఈ విధానం విజయవంతం అవుతుందా, లేదా అన్నది నిర్ణయిస్తుంది. అయితే, ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్థిక సలహాదారు సూచనలు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆఫ్లైన్లో సలహాలు తీసుకుని ఆ తర్వాతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. – సాధిక్ నీల్గుండ్, నెట్వర్క్ ఎఫ్పీ వ్యవస్థాపకులు అనుకూలమే... 130 కోట్ల దేశ జనాభాకు సుమారు నాలుగు కోట్ల మ్యూచువల్ ఫండ్ ఫోలియోలు మాత్రమే ఉన్నాయి. వీటిల్లో ఒక ఇన్వెస్టర్కు ఉన్న ఒకటికి మించిన ఫోలియోలను తీసివేసి చూస్తే ఇందులో సగం తగ్గిపోతాయి. సంప్రదాయకంగా మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు బ్యాంకు ఖాతాల నుంచే ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. వ్యాలెట్ల కారణంగా చెల్లింపుల పరిశ్రమలో చోటు చేసుకున్న విస్తరణను గమనించే సెబీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులను వ్యాలెట్ల ద్వారా అనుమతించింది. అయితే, వీటి వల్ల ఏ మేరకు ప్రయోజనాలు కలుగుతాయన్నది చూడాల్సి ఉంది. 2017 మే 8 నాటి సెబీ ఉత్తర్వుల ప్రకారం... యూజర్లు మొబైల్ వ్యాలెట్లలో లోడ్ చేసుకున్న డబ్బులను మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులకు వినియోగించుకోవచ్చు. దీంతో ఈ వ్యాలెట్లు వినియోగానికి సౌకర్యంగా ఉండడమే కాదు, మార్కెట్ విస్తరణకు ఎంతో దోహదం చేస్తాయి. నూతన తరం డిజిటల్ సాధనాల యూజర్లు పొదుపు చేసుకునేందుకు, నిపుణుల ఆధ్వర్యంలో నడిచే మెరుగైన మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు వీలు కలుగుతుంది. అయితే, నియంత్రణలు సరళీకరించినప్పుడే అది సాధ్యపడుతుంది. వ్యాలెట్లకు లోడ్ చేసుకున్న డబ్బులకు మూలం ఏంటన్నది గుర్తించే యంత్రాంగాన్ని ఏర్పాటు రూపంలో సవాలు ఒకటి ఉంది. ఏ వ్యాలెట్ కంపెనీ కూడా యూజర్ల డబ్బుల సోర్స్ను (అది సంబంధిత యూజర్ బ్యాంకు ఖాతా నుంచే జమ అవుతుందా? లేదా? అన్నది) గుర్తించే వ్యవస్థను కలిగి లేదు. – సమీత్ సిక్కా, ఎస్క్యూఆర్ఆర్ఎల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ సేవింగ్స్ యాప్ అనుకూలం కాదు... మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు మొబైల్ వ్యాలెట్లను సూచించడం తగదు. మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఎన్నో మార్పులు, పునర్వ్యవస్థీకరణకు లోనయ్యాయి. అవగాహన ఉన్న ఇన్వెస్టర్లకు సైతం అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (ఏఎంసీలు) చేసిన మార్పులను అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. కనుక కొత్త ఇన్వెస్టర్లు తమ రిస్క్ సామర్థ్యం, లక్ష్యాలకు సరిపోయే సరైన పథకాన్ని మొబైల్ వ్యాలెట్ల ద్వారా ఎంచుకోవడం ఓ సవాలే అవుతుంది. సినిమా టికెట్లు లేదా ప్రయాణ టికెట్లు బుక్ చేసుకునేందుకు, యుటిలిటీ బిల్లుల చెల్లింపునకు మొబైల్ వ్యాలెట్ల వినియోగం వేగవంతం అయింది. కానీ, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులకు మొబైల్ వ్యాలెట్ల వినియోగం సున్నితమైన విషయం. మొబైల్ వ్యాలెట్ల ద్వారా పెట్టుబడులు పెట్టే ప్రక్రియ, పోర్ట్ఫోలియో పర్యవేక్షణ విషయమై స్పష్టత లేదు. మరింత సులభతర, నిర్మాణాత్మక ప్రక్రియలతో ఉండే పెట్టుబడి ప్లాట్ఫామ్లు ఎంచుకోవడం నయం. పోర్ట్ఫోలియోను పర్యవేక్షిస్తూ లాభ, నష్టాల గురించి తెలియజేసే ఆర్థిక నిపుణుల సాయం, మార్గదర్శకంతోనే ఇన్వెస్ట్ చేయాలన్నది మా సూచన. వ్యాలెట్లకు బదులు... నేరుగా మ్యూచువల్ ఫండ్స్ సంస్థల ద్వారా లేదా ఆర్థిక సలహాదారులు సూచించిన పథకాల్లో నేరుగా ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. – కల్పేష్ ఆషర్, ఫుల్ సర్కిల్ ఫైనాన్షియల్ ప్లానర్స్ వ్యవస్థాపకుడు -
ఇన్ఫోసిస్లో అమెరికన్లకు పెద్దపీట
న్యూఢిల్లీ: దేశీయ రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ భారీస్థాయిలో అమెరికా పౌరులకు ఉద్యోగాలను కల్పించింది. 2017 మార్చి నుంచి ఇప్పటి వరకు తమ సంస్థలో 4,700 మంది యూఎస్ పౌరులను నియమించుకున్నట్లు ప్రకటించింది. వీరిలో 500 మంది ఉత్తర కరొలినా రాజధాని రాలీగ్లో ఉన్నటువంటి ప్రాంతీయ సాంకేతిక కేంద్రంలో నియమితులైనట్లు తెలిపింది. కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), క్లౌడ్, బిగ్ డేటా, డిజిటల్ టెక్నాలజీస్, యూజర్ అనుభవం, అభివృద్ధి చెందుతున్న డిజిటల్ టెక్నాలజీలపై మరింత దృష్టిసారించడంలో భాగంగా బహుళ సాంకేతికత, ఆవిష్కరణ కేంద్రాలను అమెరికాలో ఏర్పాటు చేస్తున్న ఇన్ఫోసిస్.. ప్రత్యేకించి ఈ కార్యాచరణ కోసమే అక్కడి ఉద్యోగుల సంఖ్యను పెంచుతోంది. ఇందుకోసం 10,000 మంది అమెరికన్లను నియమించుకుంటున్నట్లు కిందటి ఏడాదిలోనే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. -
స్మార్ట్ సిటీస్ ప్రాజెక్టుల్లో క్వాంటెలా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ టెక్నాలజీ సొల్యూషన్స్ కంపెనీ క్వాంటెలా... దేశంలోని 9 నగరాలతో పాటు వివిధ దేశాల్లో 30 నగరాల్లో స్మార్ట్ సిటీస్ ప్రాజెక్టులో భాగమయింది. స్మార్ట్ ఇన్ఫ్రా ఏర్పాటు చేసే కంపెనీలకు తాము సాంకేతిక సేవలు అందిస్తున్నట్టు కంపెనీ ఫౌండర్ శ్రీధర్ గాధి శుక్రవారమిక్కడ మీడియాకు చెప్పారు. ఏడాదిలో భారత్లో మరో 15 నగరాలకు సేవలను విస్తరించే అవకాశం ఉందన్నారు. కంపెనీలో ఇప్పటి వరకు రూ.32 కోట్లు పెట్టుబడి పెట్టామని, యూఎస్, యూరప్లోనూ కార్యకలాపాలు సాగిస్తున్న క్వాంటెలాకు 150 మంది ఉద్యోగులు ఉన్నారని తెలియజేశారు. -
అతి ‘స్మార్ట్’ అనర్ధమే..!
డిజిటల్ అడిక్షన్ అదేనండీ.. స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర డిజిటల్ రూపాల్లోని పరికరాలు, వస్తువుల వినియోగం ఓ వ్యసనంగా మారుతోందా..? మనమంతా వాటికి బానిసలుగా మారే ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నామా? దీనికి అవుననే సమాధానమే వస్తోంది. స్మార్ట్ఫోన్ల అతి వినియోగం నాడీ మండలంలో మార్పులకు కారణమవుతోందని ఓ తాజా అధ్యయనంలో బయటపడింది. అదేవిధంగా సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా తలమునకలైతే ఎదుటివారిని నిందించే స్వభావం, ప్రవర్తన పెరగడంతోపాటు సామాజికంగా ఇతరులకు దూరమై, ఒంటరితనానికి గురైనట్టుగా భావిస్తారని ఇటీవలే ‘న్యూరో రెగ్యులేషన్’ జర్నల్లో ప్రచురితమైన ఈ స్టడీ వెల్లడించింది. ప్రతీక్షణం.. పక్కనే ఉండాలి ప్రస్తుతం ప్రతీ ఒక్కరూ తమ స్మార్ట్ఫోన్ను ఒక్కక్షణం కూడా వదిలి ఉండలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఫోన్లలో వచ్చే మెసేజ్ అలర్ట్ల పట్ల స్పందిస్తున్న తీరు పురాతన కాలంలో ఏదైనా అనుకోని ముప్పు లేదా కీడు సంభవిస్తుందా అని నాటి మానవుడు పడిన ఆందోళనతో పోల్చదగినదిగా ఉంటోందని ఈ పరిశీలన పేర్కొంది. సిగరెట్ల మాదిరిగానే డిజిటల్ టెక్నాలజీ కూడా ఓ వ్యసనంగా మారేలా రూపొందించారని నిఫుణులు భావిస్తున్నారు. వివిధ రూపాల్లో వచ్చే నోటిఫికేషన్లు, పింగ్లు, వైబ్రేషన్లు, అలర్ట్ల పట్ల ఏదో ప్రమాదం సంభవిస్తుందేమో అన్నట్టుగా చాలామంది స్పందిస్తున్నారు. ఒకవైపు తమ మనసులోని భావాలను ఫోన్ ద్వారా కమ్యూనికేట్ చేస్తూ అదే సమయంలో ఇతర పనులు(మల్టీటాస్కింగ్) చేస్తున్నందు వల్ల మెదడు, శరీరం రిలాక్స్ కావడంలేదు. దాంతో చురుకుదనం మందగిస్తోంది. ఒకేసారి రెండు, మూడు పనులు చేస్తున్నవారు వాటిపై పూర్తిగా దృష్టి పెట్టకపోవడం వల్ల ఆ పనులను సగం మాత్రమే సక్రమంగా నిర్వహిస్తున్నారని శాన్ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రతీ చిన్న విషయానికి స్మార్ట్ఫోన్లపైనే ఆధారపడటం ఎక్కువైపోయింది. మనలో 40 శాతానికిపైగా ఉదయం నిద్రలేచిన 5 నిముషాల్లోనే ఫోన్లు చెక్ చేసుకుంటున్నట్టు, యాభై శాతానికిపైగా రోజుకు 25 సార్లు అంతకంటే ఎక్కువగానే ఫోన్లు పరీక్షించుకుంటున్నట్టు డెలాయిట్ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. గేమింగ్ డిజార్డరే అంటున్న డబ్ల్యూహెచ్ఓ పరిసరాలను పట్టించుకోకుండా నిరంతరం వీడియోగేమ్ల్లో మునిగిపోయే‘గేమింగ్ డిజార్డర్’ను కూడా ‘రివిజన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్’(ఐసీడీ–11)లో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) చేర్చనుంది. దీనిలోభాగంగా ఈ డిజార్డర్ను అంతర్జాతీయ రోగాల వర్గీకరణ(ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్) జాబితాలో ప్రచురించనుంది. ప్రపంచంలోని ఆరోగ్య పోకడలు, సమస్యల తీరును గుర్తించి, వాటి నిర్థారణతోపాటు వర్గీకరణకు ఉద్ధేశించి ఐసీడీ–11ను ఓ ప్రామాణిక సాధనంగా డాక్టర్లు, పరిశోధకులు, ఎపిడమియోలాజిస్ట్లు ఉపయోగిస్తున్నారు. భారత్లో పరిస్థితి ఇదీ.. మనదేశంలో తొలిసారిగా 2016లో ఢిల్లీలోని రాంమనోహర్ లోహియా ఆస్పత్రి వైద్యులు ఈ గేమింగ్ డిజార్డర్ను గుర్తించారు. సైకియాట్రీ వార్డులో 22, 19 ఏళ్ల వయసున్న అన్నదమ్ములు నెలపాటు చికిత్స తీసుకున్నారు. వారి తల్లిదండ్రులు వైద్యుల సహాయం కోరే నాటికే కొన్నిరోజులపాటు తిండి, నిద్ర అనే ఆలోచన లేకుండా ఎడతెగని గేమింగ్ కారణంగా ఈ యువకులు సామాజికంగా ఇతరులతో కలవకుండా, శారీరకంగానూ పూర్తి నిస్సత్తువలో మునిగిపోయారు. అధిగమించేందుకు ఏం చేయాలి? - స్మార్ట్ఫోన్లలోని అలర్ట్లు, నోటిఫికేషన్లను ఆపేయాలి. - ఆన్లైన్ కంటే ఆఫ్లైన్లో ఇతర కార్యక్రమాలు చేపట్టాలి. కుటుంబ సభ్యులు, మిత్రులతో సంభాషించాలి. - నిద్రపోవడానికి గంట ముందు అన్ని పరికరాలు ఆఫ్ చేసేయాలి లేదా మరో గదిలో ఫోన్ను ఉంచాలి. ఎందుకంటే ఫోన్లలోని‘బ్లూ వేవ్ లెంథ్ లైట్’ మెదడులో నిద్రకు సమయం ఆసన్నమైనదని సూచించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి కాకుండా అడ్డుకుంటుంది. - రాత్రి భోజనమప్పుడు ఫోన్ ఆఫ్ చేయాలి. ఆ తర్వాత ఫోన్ ఇంటి వద్దే వదిలేసి కొంతదూరం నడవాలి. - ప్రతీ చిన్న విషయానికి వెబ్లో సెర్చ్ మానుకోవాలి - ఫేస్బుక్, ట్వీటర్, ఇన్స్ట్రాగామ్, స్నాప్చాట్ వంటి వాటిలో మునిగిపోకుండా సామాజిక మాధ్యమాల వినియోగంపై నియంత్రణ పాటించాలి. - కంప్యూటర్ లేదా మొబైల్ చూడాలనే కోరిక కలిగినపుడు నచ్చిన పుస్తకంలో కనీసం 30 పేజీలు చదివాకే వాటిని ముట్టుకోవాలని మనం సవాల్ చేసుకోవాలి. -
ఇప్పుడు మేం ఫిల్మ్ స్టార్స్ కాదు!
అసలు అసలే.. నకిలీ నకిలీయే. అసలు చూసినప్పుడు కలిగిన తృప్తి నకిలీ చూసినప్పుడు ఉంటుందా? అంటున్నారు అమితాబ్ బచ్చన్. ఆయన ‘అసలు’ అని రిఫర్ చేసినది ‘ఫిల్మ్’ గురించి, ‘నకిలీ’ అన్నది ‘డిజిటల్’ గురించి. డిజిటల్ టెక్నాలజీని ఆయన జిరాక్స్తో పోల్చుతున్నారు. ‘ఫిల్మ్’తో తీసిన సినిమా ఇచ్చే తృప్తే వేరని, డిజిటల్ ఫార్మాట్లో కొంచెం అసంతృప్తి ఉంటుందని ఆయన అన్నారు. ఇంతకీ ‘ఫిల్మ్’ గొప్పదనం గురించి అమితాబ్ ఎందుకు చెప్పారంటే.. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు ‘క్రిస్టోఫర్ నోలన్’ ఫిల్మ్ గురించి, పాత సినిమాలను ఎలా భద్రపరచాలి? తదితర విషయాలపై ఇండియాలో జరుగుతున్న సమావేశాల్లో పాల్గొనడానికి విచ్చేశారు. ముంబైలో జరిగిన ఈ సమావేశాల్లో పలువురు భారతీయ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. వాళ్లల్లో అమితాబ్ ఒకరు. మొదట్లో సినిమాలు తీయడానికి ఫిల్మ్ వాడేవారనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ తర్వాత ఫిల్మ్ స్థానంలో డిజిటల్ టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు 25 టేక్స్ అయినా ఓకే ఈ మార్పు గురించి అమితాబ్ మాట్లాడుతూ ‘‘ఫిల్మ్ ఇండస్ట్రీ, ఫిల్మ్ స్టార్స్’ అని అంటుంటాం. అయితే ఇప్పుడే ఫిల్మ్ మాయమైపోయింది. అందుకని ‘ డిజీ యాక్ట్, డిజీ డిజీ’ అని పిలవాలేమో. డిజిటల్ హవా నడుస్తున్నప్పుడు పాత పద్ధతిని వదలకుండా ఫిల్మ్ మీద సినిమా తీస్తున్న క్రిస్టోఫర్ నోలన్ని అభినందించాలి. ఫిల్మ్ అనేది ఒరిజినల్. డిజిటల్ దానికి జిరాక్స్ లాంటిది. పికాసో గీసిన బొమ్మలను జిరాక్స్ తీసి, మ్యూజియమ్లో పెడితే ఒరిజినల్ చూసిన తృప్తి కలుగుతుందా? ‘కదిలే బొమ్మల’కు దృశ్యరూపం ఇచ్చిన ఫిల్మ్ మరుగునపడిపోయాక థియేటర్లో ప్రొజెక్షన్ రూమ్స్ని మార్చారు, డిజిటల్ సినిమాని ప్రదర్శించడానికి వీలుగా థియేటర్లను మార్చారు, కెమెరాలు మారిపోయాయి. చివరికి ‘కదిలే బొమ్మ’లకు దృశ్యరూపం ఇవ్వడానికి చేసిన కృషి, ఆ పరికరాలన్నింటినీ వదిలేశారు. మా అప్పుడు ఫిల్మ్ కెమేరాలు చాలా పెద్దగా ఉండేవి. వాటి ముందు నిలబడగానే మాకు తెలియని భయం, భారం అనిపించేవి. మా వృత్తి మీద మాకు భయభక్తులు కలిగించేది. మేం క్రమశిక్షణగా ఉండేవాళ్లం. ఫిల్మ్ ఎక్కువ స్టాక్ ఉండేది కాదు. అందుకని పొదుపుగా వాడాల్సి వచ్చేది. ఇప్పుడైతే ఒక్క టేక్లో సీన్ ఓకే కాకపోతే 25 టేక్స్ తీసుకోవచ్చు. అప్పుడూ తృప్తిగా అనిపించకపోతే అనిపించేంతవరకూ తీసుకుంటూ ఉండొచ్చు. డైరెక్టర్కీ, ఆర్టిస్ట్లకూ అంత వెసులుబాటు ఉంటుంది. మా అప్పుడు ‘ఒక్క టేక్’లో చేయాల్సిందే. నా మొదటి సినిమా ‘సాత్ హిందూస్తాన్’ని తక్కువ బడ్జెట్తో తీశారు. ముడి సరుకు తక్కువ ఉండేది. ఒక కొత్త ఆర్టిస్ట్గా ఒక్క టేక్లో సీన్ చేయడం అనేది నాకు పెద్ద సవాల్గా అనిపించింది. నేనెప్పటికీ మరచిపోలేని విషయం ఏంటంటే.. ఆ సినిమా చివరి రోజున నేనొక పెద్ద సీన్ చేయాల్సి వచ్చింది. అప్పుడు అబ్బాస్ (డైరెక్టర్) ‘మన దగ్గర 60 అడుగుల ఫిల్మ్ మాత్రమే మిగిలి ఉంది. ఒకే టేక్లో నువ్వు చేసేయాలి. ఎందుకంటే నా దగ్గర ఫిల్మ్ లేదు’ అన్నారు. భయపడుతూ ఆ సవాల్ని స్వీకరించాను. ఇప్పుడు అంత ఒత్తిడి లేదు కదా. ఏదైనా అప్పటి రోజులే మంచివి. ఇంకో చాన్స్ లేకపోవడం వల్ల మా దృష్టంతా చేసే సీన్ మీదే ఉండేది. ఎంతో శ్రద్ధగా పని చేసేవాళ్లం. ఇప్పుడు పని చేయడంలేదని కాదు. మా అప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్త తీసుకునేవాళ్లం. అప్పట్లో కెమెరాలో 1000 అడుగుల ఫిల్మ్ ఉండేది. అది అయిపోయాక మళ్లీ లోడ్ చేసేవాళ్లు. ఒక సెకనుకి 24 ఫ్రేములు తిరిగేవి. ఫ్రేమ్స్ అంత ఫాస్ట్గా కదులుతుంటే.. ఆ స్పీడ్ మా నటనకు ఓ హద్దు విధించినట్లుగా అనిపించేది. త్వరగా చేసేయాలనే నిర్భంద పరిస్థితి ఆ ఆర్టిస్ట్కి ఓ హద్దులానే ఉంటుంది కదా. అదే మాకు నటన, క్రమశిక్షణ, పట్టుదల అన్నీ నేర్పించింది. -
అంగన్వాడీలకు డిజిటల్ టెక్నాలజీ
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ భారతానికి కీలకమైన అంగన్వాడీల కోసం ప్రత్యేకంగా డిజిటల్ అప్లికేషన్లు అభివృద్ధి చేసి అందిస్తున్నామని సెంటర్ ఫర్ డిజిటల్ ఫైనాన్షియల్ ఇన్క్లూషన్ (సీడీఎఫ్ఐ) సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణన్ ధర్మరాజన్ అంటున్నారు. కొన్నేళ్ల క్రితం స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన మాజీ ఐఆర్ఎస్ అధికారి కృష్ణన్ ధర్మరాజన్ సేవలు సమాజంలోని అన్ని వర్గాల వారికి అందాలన్న లక్ష్యంతో సీడీఎఫ్ఐని స్థాపించారు. మహబూబ్నగర్ జిల్లాలో చేపట్టిన కార్యక్రమాల అమలు తీరును పరిశీలించేందుకు ఇటీవల హైదరాబాద్ వచ్చిన ఆయనతో ‘సాక్షి’ముచ్చటించింది. బెట్స్ పేరుతో అభివృద్ధి చేసిన డిజిటల్ అప్లికేషన్తో అంగన్వాడీలకు జరిగే ప్రయోజనం, దేశంలోని ఇతర ప్రాంతాల్లో సీడీఎఫ్ఐ చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు. బెనిఫిట్ ఎన్టైటిల్మెంట్ ట్రాకింగ్ సిస్టమ్ (బెట్స్) గురించి వివరిస్తారా? గ్రామాల్లో అంగన్వాడీలు ఇప్పటికీ ప్రతిరోజూ కనీసం 12 రిజిస్టర్లు నిర్వహించాల్సి ఉంటుంది. రాతకోతల పనులన్నింటినీ డిజిటల్ రూపంలోకి మార్చేయడానికి బెట్స్ను సీడీఎఫ్ఐ రూపొందించింది. ఆగాఖాన్ ట్రస్ట్ సహకారంతో మహబూబ్నగర్ జిల్లాలోని 45 అంగన్వాడీ కేంద్రాల్లో బెట్స్ను అమలు చేస్తున్నాం. వేలిముద్రతోపాటు ఆధార్ సంఖ్యతో పనిచేసే ఈ అప్లికేషన్తో వారికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఆధార్ లేదన్న కారణంతో ఏ గర్భిణి, బాలింత, పిల్లలకు పౌష్టికాహారాన్ని నిరాకరించలేదు. అంగన్వాడీల వద్ద ఉండే పౌష్టికాహారంపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం అందుతూ ఉంటుంది. అంగన్వాడీల్లో బాలల హాజరును కేవలం ఒక్క ఫొటో తీసుకోవడం ద్వారా నమోదు చేయవచ్చు. అంగన్వాడీలు ఎంతమంది విధులకు హాజరవుతున్నారు? ఎలాంటి పను లు చేస్తున్నారన్న అంశాలపై అధికారులు పర్యవేక్షించేందుకూ వీలు కల్పిస్తుందీ అప్లికేషన్. పైలట్ ప్రాజెక్టు ఎంత కాలం కొనసాగుతుంది? వచ్చే నెల 30 వరకు కొనసాగుతుంది. బెట్స్ పనితీరుపై ఇప్పటివరకూ మంచి ఫీడ్బ్యాకే వచ్చింది. డిసెంబర్ నుంచి తెలంగాణలోని 1,800 అంగన్వాడీల్లో బెట్స్ ద్వారా సేవలందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. తమిళనాడులో బెట్స్ తరహాలోనే ఇంకో పైలట్ ప్రాజెక్టు మీరు అమలు చేస్తున్నారు. దాని గురించి చెబుతారా? దాని పేరు ‘కంచి’. ఇది ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (ఎఫ్పీవో)తో కలసి పనిచేస్తోంది. పాల ఉత్పత్తిదారులు, కంపెనీలను అనుసంధానించడం ద్వారా వారికి ఏరోజుకారోజు చెల్లింపులు జరిగేలా చూడటం ఈ అప్లికేషన్ తాలూకూ ప్రయోజనం. ఈ లావాదేవీల ఆధారంగా రైతులకు పరపతి కల్పించి, బ్యాంకుల ద్వారా రుణాలు అందేలా చూసేందుకూ ఇందులో ఏర్పాట్లు ఉన్నాయి. ఎఫ్పీవోల లావాదేవీలన్నింటినీ డిజిటల్ రూపంలోకి తీసుకొచ్చేందుకు ఇది ఉపయోగపడుతుంది. ప్రభుత్వ పథకాలను వివరించేందుకు సంకల్ప్ అనే డిజిటల్ సొల్యూషన్ ఉపకరిస్తుంది. గ్రామీణ ప్రాంత ప్రజల్లో డిజిటల్ ఆర్థిక లావాదేవీలపై అవగాహన పెంచేందుకు ‘సంవాద్’అప్లికేషన్ను అభివృద్ధి చేశాం. -
ఇంటర్ విద్యార్థులకు వరం ‘డిస్క్’
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ టెక్నాలజీలను అందిపుచ్చుకోవడంలో తెలంగాణ దేశంలో మొదటి స్థానంలో ఉందని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివే ఇంటర్ విద్యార్థుల కోసం దేశంలోనే తొలిసారిగా డిజిటల్ అప్లికేషన్ను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. పాఠ్యపుస్తకాలతో పాటు వీడియో క్లాసులు, మోడల్ ప్రశ్నపత్రాలు, పోటీ పరీక్షలకు అవసరమైన సమాచారం మొత్తం పొందుపరిచిన ఈ–డిజిటల్ స్టడీ కిట్ (డిస్క్)ను ఉచితంగా అందజేస్తున్నామని చెప్పారు. ఐటీ కంపెనీ క్లౌడ్జ్, ఇంటర్ బోర్డు సంయుక్తంగా సిద్ధం చేసిన డిస్క్ను శుక్రవారం హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించారు. డెస్క్టాప్, ట్యాబ్లెట్, స్మార్ట్ఫోన్లలో అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రైవేట్ కాలేజీల విద్యార్థులు రూ.325 చెల్లించి దీన్ని వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. సబ్జెక్ట్ నిపుణులు కలసి రూపొందించడం వల్ల సిలబస్ ప్రామాణికంగా ఉంటుందని చెప్పారు. డిస్క్లోని పాఠాలు, సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, పాఠాలు వీలైనంత సరళమైన భాషలో ఉండేలా చూడాలని సూచించారు. క్లౌడ్జ్ ప్రతినిధి సుమంత్ మాట్లాడుతూ ఇంటర్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా డిస్క్ను రూపొందించామని, సైన్స్, ఆర్ట్స్, కామర్స్ సబ్జెక్టులన్నింటి సమాచారం ఉంటుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉన్నా ఈ యాప్ను సులువుగా డౌన్లోడ్ చేసుకోవచ్చని, డౌన్లోడ్ చేసుకున్నాక నెట్ లేకపోయినా పనిచేస్తుందని వివరించారు. డిజిటల్ తెలంగాణ ఆవిష్కరణలో భాగంగా ఏడాది కింద డిస్క్ తయారీ కోసం క్లౌడ్జ్తో ఒప్పందం కుదుర్చుకున్నామని ఇంటర్ బోర్డు కమిషనర్ అశోక్ పేర్కొన్నారు. కార్యక్రమంలో క్లౌడ్జ్ ప్రతినిధి శ్యామల వెంకటరెడ్డి పాల్గొన్నారు. డిస్క్లో ఏముంటాయి? - ఇంటర్లోని దాదాపు అన్ని సబ్జెక్టుల పాఠ్యపుస్తకాలు - బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు, సమాధానాలు - ఒక్కో అంశానికి సంబంధించిన సినాప్సిస్, కాన్సెప్ట్ల వివరణ - ముఖ్యమైన 5,000 వీడియో పాఠాలు - ఇంటర్ బోర్డు పాత ప్రశ్న పత్రాలు.. - ఎంసెట్, జేఈఈ, నీట్, సీఏ–సీపీటీలకు అవసరమైన సమాచారం - సందేహాల నివృత్తికి అందుబాటులో నిపుణుల బృందం - విద్యార్థి సన్నద్ధతను ఎప్పటికప్పుడు తెలుసుకునే ఏర్పాట్లు డిస్క్ ప్రత్యేకతలు.. - ఇంటర్నెట్ లేకపోయినా సమాచారం అందుబాటులో ఉంటుంది. - డెస్క్టాప్తో పాటు స్మార్ట్ఫోన్, ట్యాబ్లెట్లలోనూ లభిస్తుంది. - ‘డెస్క్ తెలంగాణ’అని టైప్ చేసి ఆండ్రాయిడ్ ఫోన్ అయితే గూగుల్ ప్లేస్టోర్ నుంచి యాపిల్ ఐఫోన్ అయితే యాపిల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
ఐటీ ఉద్యోగుల్లో 65 శాతం పనికిరారు!
► వాళ్లకు శిక్షణ ఇవ్వడం అతిపెద్ద సవాల్... ► కొత్త టెక్నాలజీలతో భారీగా ఉద్యోగాల కోత! ► క్యాప్జెమిని ఇండియా చీఫ్ శ్రీనివాస్ ముంబై: డిజిటల్ యుగంవైపు వేగంగా అడుగులేస్తున్న సమాచార సాంకేతిక(ఐటీ) రంగం.. ఉద్యోగాలకు మాత్రం ఎసరుపెడుతోంది. డిజిటల్ టెక్నాలజీల వినియోగం పెరుగుతుండటంతో ఐటీ పరిశ్రమలో పని ధోరణి కూడా మారుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న ఉద్యోగుల్లో చాలా మంది కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవడం కష్టమేనని దిగ్గజ ఐటీ సంస్థ క్యాప్ జెమిని అంటోంది. ప్రధానంగా మధ్య, సీనియర్ స్థాయిలో భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు దారితీయొచ్చని కంపెనీ ఇండియా సీఈఓ శ్రీనివాస్ కందుల హెచ్చరించారు. ‘నేను మరీ అంత నిరాశావాదిని కాను. అయితే, ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల్లో 60–65 శాతం మందికి కొత్త తరం టెక్నాలజీలకు అనుగుణంగా శిక్షణ కూడా ఇచ్చే పరిస్థితి కనబడటం లేదు. పరిశ్రమకు ఇది చాలా పెద్ద సవాలే’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్కు చెందిన క్యాప్జెమినీలో ప్రస్తుతం దేశీయంగా సుమారు లక్ష మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. భారత్లో పెద్ద సంఖ్యలోనే ఐటీ ఉద్యోగాల కోత ఉండొచ్చని.. మధ్య, సీనియర్ స్థాయిలో తొలగింపులు అత్యధికంగా చోటుచేసుకోవచ్చని శ్రీనివాస్ పేర్కొన్నారు. డిజిటల్ టెక్నాలజీలకు అనుగుణంగా ఇప్పుడున్న ఐటీ ఉద్యోగుల్లో 15 లక్షల మందికి మళ్లీ శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని తాజాగా పరిశ్రమ చాంబర్ నాస్కామ్ చెప్పడం తెలిసిందే. నాసిరకం ఇంజనీరింగ్ కాలేజీల వల్లే... ‘ఇప్పుడు పరిశ్రమలో ఉన్న 39 లక్షల మంది ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువగా సరైన విద్యా ప్రమాణాల్లేని (తక్కువ గ్రేడ్ ఉన్నవి) ఇంజనీరింగ్ కాలేజీల్లో చదివినవారే. దీంతో వాళ్ల నైపుణ్యాలు పెద్దగా పనికిరావడం లేదు. ఐటీలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు్ల మార్జిన్లపైనే ఎక్కువగా దృష్టిపెడుతుండటంతో ఐటీ కంపెనీలు ఉద్యోగుల నైపుణ్యాలను సానపట్టడంపై తగినంత పెట్టుబడి పెట్టడం లేదు’ అని ఆయన వివరించారు. ఇలాంటి నాసిరకం కాలేజీల నుంచి ఇప్పు డు ఎక్కువ మంది విద్యార్ధులు ఐటీ రంగంలోకి అడుగుపెడుతున్నారని.. ఈ నేపథ్యంలో వాళ్లకు జీతాలు పెంచడంవల్ల పరిశ్రమపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పారు. ‘దశాబ్ద కాలం క్రితం ఐటీ కంపెనీల్లో కొత్తగా చేరేవారికి(ఫ్రెషర్లు) రూ.2.25 లక్షల వార్షిక వేతనం ఆఫర్ చేసేవాళ్లు. ఇప్పుడు ఇది కేవలం రూ.3.5 లక్షలకు మాత్రమే పెరిగింది. అంటే ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే వాస్తవ వేతనాలు భారీగా తగ్గిపోయినట్లు లెక్క. మేధస్సు ఆధారిత పరిశ్రమగా చెప్పుకున్న ఐటీ రంగంలో ఉద్యోగులకు ఇప్పుడున్న టెక్నాలజీకి అనుగుణంగా నైపుణ్యాలను కల్పించడం అతిపెద్ద సవాల్’ అని పేర్కొన్నారు. 80 శాతం మంది ఇంజనీరింగ్ పట్టభద్రులు ఉద్యోగాలకు పనికిరారంటూ ‘ఆస్పైరింగ్ మైండ్స్’ అనే సంస్థ అధ్యయన నివేదిక కొద్ది నెలల క్రితం వెల్లడించిన నేపథ్యంలో శ్రీనివాస్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా, తాము ఫ్రెషర్ల నియామకానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామంటూ తాజాగా ఆయన పేర్కొనడం గమనార్హం. -
ఇక డిజిటల్ మాయా బజార్!
రెండో మాట ‘ఈరోజున రాజకీయ పార్టీలనేవి ఆచరణలో అసంబద్ధ సంస్థలుగా తయా రైనాయి. ఎందుకని? ఎలా? పార్టీ నాయకుడనేవాడి బొమ్మే, అతడి విగ్రహమే పార్టీల ప్రతిష్టను కమ్మేస్తోంది. జనసమ్మతమైన వ్యక్తిగా పైకి కనిపించే నాయ కులకు రాజకీయ పార్టీలు జీహుకుం అంటున్నాయి. దీనితో ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కనుకనే కేవలం వ్యక్తినిష్టమైన అధికార వ్యవస్థల కన్నా ప్రజల ప్రాతినిధ్యం కలిగిన, గౌరవనీయమైన పార్టీ, వ్యవస్థ మాత్రమే అభిలషణీయం.’ - ప్రొ. నీరా ఛాందోక్ (ప్రముఖ రాజనీతి శాస్త్ర ఆచార్యులు, ఢిల్లీ విశ్వవిద్యాలయం) ‘పెట్టుబడుల వ్యాప్తి, టెక్నాలజీ పరివ్యాప్తే పన్నులు ఎగవేతకీ, లాభాలను పంచుకోవడానికీ సరికొత్త అవకాశం కల్పించింది.’ - ఎం. వెంకయ్యనాయుడు (కేంద్రమంత్రి) మధ్యంతర/అర్ధంతర ఎన్నికలలో ఎవరికి ఓటు వేస్తారన్న అభ్యర్థుల ప్రశ్నలకు ఓటర్లు పరీక్షాపత్రాలలో మాదిరిగా ‘అవును/కాదు’ అని మాత్రమే సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఆచరణలో దీని అర్థం-పౌరులకు ఉన్న ప్రశ్నించే స్వేచ్ఛను లేదా సమస్యలను చర్చించుకునే శక్తియుక్తులను రాజకీయ పరిధి నుంచి తప్పించడమే అవుతుందని ప్రొఫెసర్ నీరా ఛాందోక్ అభిప్రా యపడుతున్నారు. ఈ దృష్ట్యా చూస్తే కేంద్ర మంత్రిమండలిలోని చాలామంది సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీని పొగడ్తలలో ముంచెత్తడం తప్ప మరో వాక్యమేదీ పలకడం లేదని కూడా ప్రొఫెసర్ నీరా అన్నారు. అందుకని రాజ కీయ పార్టీలు తమ అస్తిత్వాన్నీ నాయకులనూ నియంత్రించుకుంటూ ఉండా లని ఆమె చెప్పవలసివచ్చింది. లేకుంటే చరిత్ర ఒక ప్రహసనంగానో, లేదా విషాదాంత నాటకం వలెనో మిగులుతుందని కూడా ఆచార్య నీరా అంటారు. బడుగు దేశాల ఆర్థిక వ్యవస్థలపై గురి ఇదే తీరులో ఇవాళ పాలకవర్గం దేశ ఆర్థిక వ్యవస్థను పునర్ వ్యవ స్థీకరించే పేరుతో వికారపు సంస్కరణలు ప్రవేశపెట్టి ప్రజాబాహుళ్యం మధ్య అప హాస్యం పాలవుతున్నది. నిజానికి దేశంలో అవినీతి, అక్రమార్జనలు, లంచ గొండితనం, నల్లధనం పెరిగిపోవడానికి కాంగ్రెస్, బీజేపీ-పరివార్ పాలక వర్గ విధానాలే కారణం. ప్రపంచ బ్యాంక్, దాని అనుబంధ సంస్థలు ఐఎం ఎఫ్, ప్రపంచ వాణిజ్య సంస్థలు సంస్కరణల పేరిట అనుసరిస్తున్న ప్రమా దకర ధోరణులే ఆ ప్రజా వ్యతిరేక సంస్కరణలకు పునాది. భారత్ వంటి వర్ధమాన దేశాల, బడుగు దేశాల కరెన్సీ విలువల మీద దెబ్బ కొట్టడం అలాంటి ప్రజా వ్యతిరేక సంస్కరణలలో భాగమే. ఆ విధంగా తమ దేశ కరెన్సీ విలువను పెంచుకుంటూ ఈ దేశాల ప్రజలను అప్పుల ఊబిలో దింప డమూ అందులో భాగమే. దీనితో ఒక స్వతంత్ర దేశంగా వ్యవహరించగల శక్తిని ఇండియానుంచి హరించివేయడం, ఆర్థిక పరంగానే కాక, సైనికపరం గాను మనలని ఎదగనివ్వకుండా ఆంగ్లో-అమెరికన్లు గీసిన గీతను దాట కుండా చేయడం ఈ వ్యూహంలో కనిపించేదే. స్వయంకృతాపరాధంగా తెచ్చు కున్న ఆర్థిక సంక్షోభాలలోకి బడుగు, వర్ధమాన దేశాలను కూడా గుంజడం ద్వారా తన ఉనికిని కాపాడుకోవాలని అమెరికా యత్నిస్తున్నది. ఇటీవల మన పాలకులు తలపెట్టిన పెద్ద నోట్ల ‘రద్దు పద్దు’ కూడా అలాంటి కుట్రలో భాగం. రద్దయిన వాటి స్థానంలో ఆంగ్లో అమెరికన్ పెట్టు బడుల ఉనికికీ, వాటి వ్యాప్తికీ అనుకూలమైన డిజిటల్ (ఎలక్ట్రానిక్) కరెన్సీని ప్రవేశపెట్టడం ద్వారా ధనలావాదేవీలు సాగించాలన్నది అమెరికా, వరల్డ్ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థల వాంఛ. కానీ అవినీతి పునాదిగా ఎదుగుతూ భారత పాలకుల వారసులుగా 70 ఏళ్లలో దూసుకువచ్చిన మహా కోటీశ్వరులకు మాత్రం రద్దు సంగతి ఆరునెలల ముందే తెలుసునని పత్రి కలూ, లోకమూ కోడై కూశాయి. కానీ ఇదేమీ తెలియనట్టు పాలకులు నటిం చారు. అమెరికా పరిశోధక సంస్థలే ఆమోదించి నట్టు భారత ఆర్థిక వ్యవస్థకు అనాదిగా పునాదిగా, ఊపిరిగా ఉన్న నగదు లావాదేవీల వ్యవస్థ ప్రపంచం లోనే పెద్దది. దానిపై ఆధారపడి ఉన్న వివిధ వృత్తుల వారిని వ్యవసాయ, పారిశ్రామిక కార్మికుల్ని, రెక్కాడితే గానీ డొక్కాడని పేదలు, అరకొర సంపా దనతో బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రధానంగా ఆధారపడిన మధ్యతరగతి వృత్తుల వారినీ, రైతాంగాన్నీ పెద్ద నోట్ల రద్దుతో పాలకులు కకావికలు చేశారు. డిజిటల్ లావాదేవీలే లక్ష్యం పెద్ద నోట్ల రద్దులో కొంత న్యాయం లేకపోలేదుగానీ, ఇదంతా భారత ఆర్థిక వ్యవస్థను డిజిటల్ కరెన్సీ లావాదేవీల వైపు మరల్చడం ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ల వ్యూహమే. 1997-98 నాటి ఆసియా ఆర్థిక సంక్షోభానికి పునాదులు ఎక్కడున్నాయి? అమెరికా ప్రయోజనాల కోసం పునాదులెత్తిన ఆ దేశ మహా కోటీశ్వరుడు జార్జి సోరజ్ సహితం అమెరికా తన ఉనికి కోసం ప్రారంభించిన ‘ప్రపంచీకరణ’ మంత్ర తంత్ర ప్రయోగానికి ఉన్న ప్రమాదకర ప్రజా వ్యతిరేక కోణాన్ని నిర్మొహమాటంగా ఇలా ప్రకటించాడు. ‘వర్ధమాన దేశాల ప్రజలకు ఎలాంటి సామాజికపరమైన జీవనభద్రతను కల్పించక పోవ డంతో అంతంత మాత్రపు అభివృద్ధిలో ఉన్న దేశాలు గ్లోబలైజేషన్ వల్ల దెబ్బ తిన్నాయి. అనేకమంది గ్లోబల్ మార్కెట్ల వల్ల దెబ్బతిన్నారు’ అన్నారాయన. ప్రైవేట్ రంగ వస్తూత్పత్తులకు, ప్రభుత్వరంగ వస్తూత్పత్తులకు మధ్య ఆర్థిక వివక్ష, అసమ పంపిణీ వల్లా ప్రజలు దెబ్బతిన్నారు. గ్లోబలైజేషన్ వల్ల, మార్కెట్ ఆర్థిక వ్యవస్థ వల్ల సంపద వృద్ధి కావచ్చుగానీ ప్రజాబాహుళ్యం ఇతర కీలకమైన సామాజిక అవసరాలు తీరవు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ద్రవ్య పెట్టుబడి మార్కెట్లు ఎప్పుడూ సంక్షోభాలకు కేంద్ర స్థానాలుగా ఉంటాయి. ‘ఈ ద్రవ్య సంక్షోభాలు సృష్టించే వినాశనం గురించి అభివృద్ధి చెందిన దేశాల ప్రజలకు పూర్తిగా తెలియక పోవచ్చుగానీ ఈ సంక్షోభాలు వర్ధమాన దేశాలను ఘోరంగా దెబ్బతీస్తారుు. ఈ కారణాలన్నీ కలసి సంపన్న వర్ధమాన దేశాల మధ్య దారుణమైన అసమ పరిస్థితికి దారితీస్తాయి. మార్కెట్ ఆర్థిక వ్యవస్థ సమ ఉజ్జీల మధ్య సరుకులు, సేవల ఆదానప్రదా నాలకు అవకాశం కల్పించవచ్చుగానీ ప్రజా బాహుళ్యపు సమష్టి అవసరాల పట్ల శ్రద్ధ వహించదుగాక వహించదు. శాంతిభద్రతలూ సంత దోపిడీకే కొమ్ము కాస్తాయి. అలాగే సామాజిక న్యాయాన్నీ మార్కెట్ ఆర్థిక వ్యవస్థ కాపా డలేదు’ అని కూడా సోరెజ్ స్పష్టం చేశాడు. డిజిటల్ వ్యవస్థ ఎంత భద్రం? ఈ అస్తవ్యస్థ పరిస్థితుల మధ్యనే దూసుకువచ్చిన సమాచార సాంకేతిక వ్యవస్థ, టెక్నాలజీ వల్ల ఎంత ప్రయోజనం ఉందో అంతకన్నా ఎక్కువ అనర్థం నేడు ముమ్మరించింది. ఈ అనర్థాలలో ప్రధానమైంది ధన లావా దేవీలను ఎలక్ట్రానిక్ (డిజిటల్) మాధ్యమం ద్వారా జరపడం. దీనివల్ల అవినీతిని, నల్లధనం బదలాయిపులని, ఎటీఎంలను బద్దలు కొట్టకుండా నిలువరించడంగాని సాధ్యం కాదనీ, ఎవరి డబ్బు ఎప్పుడు, ఎక్కడికి ట్రాన్స్ ఫర్ అవుతుందో, మధ్యలో ఎవరి తస్కరణకు గురవుతుందో తెలియని ఒక మాయాలోకమే డిజిటల్ కరెన్సీ లావాదేవీలని నిపుణులే చెబుతున్నారు. ‘ఎ’ నుంచి ‘బి’కి , ‘బి’ నుంచి ‘సి’కి అలా చేంతా డులా సాగే ట్రాన్ ్సఫర్లో చివరి వాడికి దొరికే బదలాయింపు వివరం మొదటి వాడి (‘ఎ’)కు బొత్తిగా తెలియ దని నిపుణులు భావిస్తున్నారు. సంఘటిత (ఫార్మల్), అసంఘటిత (ఇన్ ఫార్మల్) రంగాల మధ్య లావాదేవీలకు డిజిటల్ కరెన్సీ బదలాయింపులు కుదరవని నిపుణుల అంచనా. నగదు రహిత లావాదేవీలవల్ల లాభాలు ఎన్ని ఉన్నా నిరక్షరాస్యత భారీగా ఉన్న ఇండియా లాంటి దేశంలో క్రెడిట్, డెబిట్ కార్టులంటే తెలియని నిరుపేదలు, మధ్య తరగతిలో కింది స్థాయి వారు ఆ కార్డుల పిన్ (వ్యక్తిగత గుర్తింపు నంబర్) గుర్తు పెట్టుకోలేరు. నేడు ఇంటర్నెట్ వ్యవస్థ మన స్వాధీనంలో లేదు. దాని పీక నొక్కినా, వదిలినా దాని నియం త్రణ (సర్వర్లు) ‘మీట’ అమెరికాలోనే ఉంది. ఇంటర్నెట్ ఆధారంగా నేరాలు (సైబర్ క్రైమ్స్) రోజురోజుకీ పెరిగి పోతున్నాయని, నెట్ వాడకందార్ల వ్యక్తి గత వివరాలను పాస్వర్డ్స్ను (రహస్య కోడ్స్ను) దొంగిలించడం పెరిగిం దని, వీటి అదుపు అసాధ్యంగా ఉందనీ నెట్ నిపుణులతో పాటు, జాతీయ స్థాయి నేరాల నమోదు సంస్థ ఎన్సీఆర్బీ తాజా నివేదిక వెల్లడిస్తోంది. సైబర్ నేరగాళ్ల ఆచూకీ తెలుసుకోవడానికి ఇప్పుడున్న నెట్ సెక్యూరిటీ వ్యవస్థ చాలదనీ వారు వెల్లడిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్లో భారతదేశ పౌరులైన వినియోగదారులను (కస్టమర్లను) ఈ నెట్ వ్యవస్థకు ఆద్యురాలైన అమెరి కాయే ఎలా దోచుకున్నదో, మోసానికి గురిచేసిందో వార్తలు చూశాం. సైబర్ మోసగాళ్ల ఆచూకీ తెలుసుకోడానికీ రూపే/ వీసా/మాస్టర్ కార్డులను విని యోగించి చూసినా లాభం లేకపోయింది. ఆన్లైన్ (డిజిటల్) కుంభకోణాలు సోషల్ ఇంజనీరింగ్ ద్వారా, సోషల్ మీడియాగా (సామాజిక మాధ్యమాలు) ఉన్న ‘ఫేస్బుక్’ ‘వాట్సప్’ ఈ-మెయిల్, మెసేజ్ బోర్డులు, వెబ్సైట్స్ ద్వారా యథేచ్ఛగా సాగుతున్నాయని నిపుణులు నిర్ధారించారు. అటూ ఇటూ చేసి రానున్న ఎన్నికలలో లబ్ధి కోసం బీజేపీ ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోకుండా, ఆకస్మికంగా తలపెట్టిన పెద్ద నోట్ల ప్రయోగం బెడిసి కొడుతున్న తరుణంలో రెండు ఘటనలు జరిగాయి. గుజ రాతీ రియల్ ఎస్టేట్ వ్యాపారి మహేష్ షా వద్ద రూ. 13,860 కోట్లు దొరి కాయి. ఆ కోట్లు తనవి కావనీ, నల్లధనం మార్చుకునేందుకు కొందరు వ్యాపార వేత్తలు, రాజకీయులు తనను వాడుకున్నారనీ, వాళ్ల పేర్లు తగిన సమయంలో వెల్లడిస్తాననీ షా చెప్పాడు. అలా చెప్పిన 24 గంటల్లోనే మరో ముంబై వ్యాపారి కుటుంబం తమవద్ద నల్లధనం రూ. 2 లక్షల కోట్లు ఉన్నా యని (4.12.16) ప్రకటించింది. అయినా ఆర్థికమంత్రి జైట్లీ ఆదాయపన్ను శాఖ అధికారులూ ఈ రెండు ఖాతాలను ‘కట్టుకథలు’గా, ‘అబద్ధాలు’గా ఎందుకు, ఎలా ప్రకటించారన్నది ఆసక్తికర విషయం. - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
‘సైబర్ సెక్యూరిటీ’లో యువతకు అవకాశాలు
• సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తాం: కేటీఆర్ • హైదరాబాద్లో సైబర్ సెక్యూరిటీ కాన్క్లేవ్ ప్రారంభం సాక్షి, హైదరాబాద్: డిజిటల్ టెక్నాలజీలతో ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినా.. సైబర్ నేరాల రూపంలో ఎన్నో ఇబ్బందులూ తలెత్తుతున్నాయని మంత్రి కె.తారకరామా రావు అన్నారు. కంప్యూటర్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా ఇంటర్నెట్కు అనుసంధా నమవుతున్న నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీకి ప్రాధాన్యం పెరుగుతోందని.. దీనిని యువతకు ఉద్యోగాలు కల్పించగల అవకా శంగానూ పరిగణించవచ్చని చెప్పారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) ఆధ్వర్యంలో మంగళవారం ఇక్కడ సైబర్ సెక్యూరిటీ కాన్క్లేవ్ 2.0 సదస్సు ప్రారంభమైంది. రెండు రోజుల ఈ సదస్సులో కేటీఆర్ ప్రసంగించారు. సైబర్ సెక్యూరిటీ మనకు ఎన్నో సవాళ్లు విసురుతోందన్నారు. అరుుతే దీన్ని యువతకు మరిన్ని ఉద్యోగాలు కల్పించగల అవకాశంగానూ పరిగణించవచ్చు నన్నారు.ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా సైబర్ సెక్యూరిటీకి ప్రత్యేక విధానాన్ని రూపొందిం చిందన్నారు. అంతేగా కుండా సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు విసృ్తత స్థారుులో చర్యలు చేపడతామన్నారు. సైబర్ సెక్యూరిటీ నిపుణులను అభివృద్ధి చేయడం కోసం కార్నెగీ మెలన్ విశ్వవిద్యాలయంతో పాటు పలు ఇతర అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. రాష్ట్రం లోని కీలక మౌలిక వసతులను సురక్షితంగా ఉంచేందుకు సుశిక్షుతులైన వారిని సిద్ధం చేస్తామన్నారు. ‘టీ-హబ్’ సైబర్ సెక్యూరిటీ విషయంలోనూ విప్లవాత్మకమైన టెక్నాల జీ లు, అప్లికేషన్లను అభివృద్ధి చేయడంపై దృష్టి పెడుతుందన్నారు. ఐటీ కంపెనీలు, ప్రభుత్వ విభాగాల మధ్య అనుసంధానానికి ప్రయత్నా లు ముమ్మరం చేస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ వెల్లడించారు. నిపుణుల అవసరమెంతో ఉంది... రానున్న నాలుగేళ్లలో దేశంలో దాదాపు పది లక్షల మంది సైబర్ సెక్యూరిటీ నిపుణుల అవసరం ఉంటుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్కుమార్ తెలిపారు. మన దేశం ప్రభుత్వ రంగంలో వెరుు్య మంది నిపుణులను నియమిస్తుంటే.. చైనా 1.25 లక్షల మందిని నియమిం చుకుంటోందని చెప్పారు. హ్యాకింగ్తో పాటు అనేక ఇతర సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో జాతీయ సైబర్ కో-ఆర్డినేషన్ సెంటర్ను ఏర్పాటు చేయను న్నామని, వచ్చే ఏడాది మార్చి నాటికి అది అందుబాటులోకి వస్తుందని తెలిపారు. సైబర్ సెక్యూరిటీని మరింత పటిష్టం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఇజ్రాయెల్తో కలిసి ఒక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పా రు. కార్యక్రమంలో ఇజ్రాయెల్ సెక్యూరిటీ సంస్థ కాన్ఫిడాస్ సీఈవో రామ్ లెవీ, టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ, ఎస్సీఎస్సీ చైర్మన్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య, కార్యదర్శి భరణీ అరోల్ తదితరులు పాల్గొన్నారు. -
మాతృ భాషల్లో డిజిటల్ టెక్నాలజీ
సాంకేతిక పరిజ్ఞానం దినదినాభివృద్ధి చెందుతున్నా..రైతులు, నిరక్షరాస్యులు మాత్రం ఆ ఫలాలు అందుకోలేకపోతున్నారని గుర్తించాడో 30 ఏళ్లయువకుడు. దీనికి కారణమైన అంతరాలను తొలగించి సాంకేతికతను సామాన్యులకు చేరువ చేయాలని కలలుకన్నాడు. అందరికీ అర్థమయ్యేలా మాతృభాషల్లో సాఫ్ట్వేర్ను రూపొందించాడు.ఆయనే యునిఫోర్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ సీఈవో.. ఉమేశ్ సచ్దేవ్. ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్.. ప్రపంచాన్ని మారుస్తున్న (10 మిలినియల్స్) వ్యక్తుల జాబితా-2016లోఉమేశ్కు చోటు కల్పించింది.ఈ నేపథ్యంలో ఆయనతో ఇంటర్వ్యూ.. ఇప్పుడిప్పుడే స్టార్టప్ రంగంవైపు అడుగులేస్తున్న రేపటి కార్పొరేట్స్కు నేనిచ్చే సలహా.. నేటి ఆధునిక ప్రపంచంలో అవకాశాలకు కొదవలేదు. కానీ వాటిని అందిపుచ్చుకుని, భావి వ్యాపారవేత్తలుగా ఖ్యాతి గడించాలంటే మీకొచ్చిన ఆలోచన దేశ తలరాతను మార్చేదిగా, నేటి యువతరాన్ని ఆకట్టుకునేదిగా ఉండాలి. అంతేకాకుండాప్రయాణంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా పట్టుదల, ఆత్మవిశ్వాసం, ఆశావహ దృక్పథంతో ముందుకు సాగాలి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని, విజయానికి చేరువ కావాలంటే అనేక మార్గాలుంటాయని విశ్వసించాలి. అప్పుడే నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంతోపాటు మన దేశ కీర్తిప్రతిష్టలను ముందుకు తీసుకె ళ్లగలరు. మాది కార్పొరేట్ లీడర్స్ కుటుంబం. నాన్న టాటా గ్రూప్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసేవారు. ఇంట్లో ఎప్పుడూ కార్పొరేట్ వాతావరణం ఉండటంతో నాక్కూడా సొంతంగా వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచన వచ్చింది. సరిగ్గా అప్పుడే (2005-07) మన దేశంలో స్టార్టప్లపై ఆసక్తి మొదలైంది. ఆ సమయంలో నేను జేపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నోయిడా)లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదువుతున్నాను. నా స్నేహితుడు రవితో కలిసి 2006లో ‘సింగులారిస్’ అనే సంస్థను ప్రారంభించా. పొగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానంతో ట్రాక్ చేసి పట్టుకోవడమే మా పని. ఆ సమయంలో కుటుంబ సభ్యులందించిన ప్రోత్సాహం మరువలేనిది. అయితే మార్కెట్ పరిస్థితులు, సంస్థ పనితీరు మేమనుకున్నంత ఆశాజనకంగా లేకపోవడంతో రెండేళ్లకే మా ప్రయత్నాన్ని విరమించుకోవాల్సి వచ్చింది. దారి చూపిన ఆశాదీపం.. ఎలాగైనా మానవ జీవన గమనాన్ని మార్చే వినూత్న టెక్నాలజీని తయారు చేయాలన్న లక్ష్యంతో సలహాలు, సూచనలు అందించాల్సిందిగా చాలా మంది పెద్దలను కలిసినా సరైన ప్రోత్సాహం లభించలేదు. ఆ సమయంలో ఐఐటీ-మద్రాస్లో అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్న ప్రొఫెసర్ ఝన్ఝన్వాలా ఎంతో సహకరించారు. ఆయన ప్రోత్సాహంతోనే ఐఐటీ-మద్రాస్ స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్లో ‘యునిఫోర్’ సంస్థను ఏర్పాటుచేశాం. తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్యకు సాంకేతికతతో పరిష్కారం చూపాలనుకున్నాం. రైతులు, నిరక్షరాస్యులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి రెండు నెలలపాటు తమిళనాడులోని అనేక మారుమూల గ్రామాల్లో తిరిగి ఒక ప్రధానమైన సమస్యను గుర్తించాం. అదే భాషావరోధం.! నేటి డిజిటల్ యుగంలో కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్ల వినియోగం సర్వసాధారణమై పోయింది. ముఖ్యంగా మొబైల్ ఫోన్లు వినియోగిస్తున్న వారిలో ఎక్కువ మంది నిరక్షరాస్యులే ఉంటున్నారు. వీరికి ఇంగ్లిష్ పరిజ్ఞానం లేకపోవడంతో అనేక రకాల ఆన్లైన్ సేవలను వినియోగించుకోలేని పరిస్థితి. దీనికి కారణం భాషా అవరోధమని గుర్తించాం. ఎలాగైనా ఈ భాషాంతరాలను తొలగించి, సాంకేతిక పరిజ్ఞానం ప్రతి ఒక్కరికీ ఉపయోగపడేలా చేయాలనుకున్నాం. రైతులు వాతావరణ సమాచారం, మార్కెట్ పరిస్థితులను తెలుసుకొని ఆర్థిక సాధికారతను పెంపొందించుకునేందుకు ఫోన్లు ఉపయోగపడాలి. దీని కోసం మాతృభాషల్లో ఆన్లైన్ వ్యవహారాలను చేసుకునేలా టెక్నాలజీని అభివృద్ధి చేశాం. ఈ మూడింటిపైనే దృష్టి.. యునిఫోర్ ప్రధానంగా వాయిస్ టెక్నాలజీస్ అయిన స్పీచ్ రికగ్నేషన్, వాయిస్ బయోమెట్రిక్స్, వాయిస్ అసిస్టెంట్పైనే దృష్టిపెడుతోంది. మొదట్లో ఈ టెక్నాలజీని మన దేశంలోని గ్రామీణ ప్రజలు, నిరక్షరాస్యులు ఉపయోగించుకుంటే చాలనుకున్నాం. కానీ నేడు మన దేశంతోపాటు ఫిలిప్పీన్స్, సింగపూర్, మలేషియాతోపాటు పశ్చిమాసియా దేశాలు సైతం ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. త్వరలో చైనీస్ మార్కెట్పై కూడా దృష్టిపెట్టబోతున్నాం. ప్రస్తుతం ఈ టెక్నాలజీ 16 భారతీయ భాషలు, 150 ప్రాంతీయ మాండలికాలతోపాటు 70 అంతర్జాతీయ భాషల్లో సేవలందిస్తోంది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, టెలికాం, ఏవియేషన్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, హెల్త్కేర్, రిటైల్ సెక్టార్లలో ఈ టెక్నాలజీ సేవలు బాగా ఉపయోగపడుతున్నాయి. ఆర్థికంగానూ దినదినాభివృద్ధి చెందుతున్న యునిఫోర్ సంస్థ.. మానవ వనరుల ఎంపికలోనూ వినూత్నంగా వ్యవహరిస్తోంది. స్పష్టమైన లక్ష్యం, సృజనాత్మకత ఉండి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసంతో పనిచేయగలిగిన వారినే ఉద్యోగులుగా ఎంపిక చేసుకుంటున్నాం. 2019 నాటికి 1.33 బిలియన్ డాలర్లు ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు ఇప్పుడిప్పుడే స్పీచ్ అనలిటిక్స్, వాయిస్ బయోమెట్రిక్స్పై దృష్టిసారిస్తున్నాయి. 2019 నాటికి ఈ మార్కెట్ 1.33 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ఇటీవల ఓ సర్వే సంస్థ స్పీచ్ అనలిటిక్స్పై ప్రపంచవ్యాప్తంగా 500 మంది పేరొందిన కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ల అభిప్రాయాలను కోరగా దీనివల్ల ప్రజలకు నాణ్యమైన సేవలందుతాయని 72 శాతం మంది.. డబ్బు ఆదా అవుతుందని 68 శాతం మంది.. ప్రజల ఆర్థిక, సాంకేతిక పురోభివృద్ధికి తోడ్పడుతుందని 52 శాతం మంది తెలిపారు. రాబోయే రెండేళ్లలో ఈ విభాగంలో అధిక సంఖ్యలో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. -
350 బిలియన్ డాలర్లకు దేశీ టెక్, సర్వీసెస్ మార్కెట్!
న్యూఢిల్లీ: భారత టెక్నాలజీ, సర్వీసెస్ మార్కెట్ పరిమాణం వచ్చే దశాబ్ద కాలంలో మరింత విస్తరించనుంది. ఈ పెరుగుదలకు కొత్త ఆవిష్కరణలు, వాణిజ్య నిర్వహణ వంటి అంశాలు దోహదపడనున్నాయి. ఈ విషయం నాస్కామ్-మెకిన్సె నివేదికలో వెల్లడైంది. నివేదిక ప్రకారం.. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 132 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ టెక్నాలజీ, సర్వీసెస్ మార్కెట్ దాదాపు 10-11% వృద్ధితో 2020 నాటికి 225 బిలియన్ డాలర్లకు, 2025 నాటికి 350 బిలియన్ డాలర్లకు పెరుగుతుం దని అంచనా. డిజిటల్ టెక్నాలజీ వినియోగం పెరుగుతుండటంతో గ్లోబల్ టెక్నాలజీ, బిజినెస్ సర్వీసులు 2025 నాటికి 3.6% సగటు వార్షిక వృద్ధి రేటుతో 4 ట్రిలియన్ డాలర్లకు చేరవచ్చు. దేశీ టెక్ పరిశ్రమ రెండంకెల వృద్ధిని సాధించడానికి అపార అవకాశాలు ఉన్నాయని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్ పేర్కొన్నారు. టెక్ కంపెనీలు డిజిటల్ సర్వీసులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందని మెకిన్సె ఇండియా మేనే జింగ్ డెరైక్టర్ నొషిర్ తెలిపారు. వ్యాపార అనుకూల పరిస్థితుల కల్పనకు పన్ను విధానం తదితర అంశాల్లో మార్పు రావాల్సి ఉందని నాస్కామ్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. నాస్కామ్-మెకిన్సె నివేదిక -
ఈ-అభివృద్ధికి డిజిటల్ ఇండియా...
డిజిటల్ ఇండియా... భారత్ను డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఒక గొప్ప ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే కార్యక్రమం! దేశవ్యాప్తంగా డిజిటల్ టెక్నాలజీని విస్తరించి, సామాజిక, ఆర్థిక ప్రగతిని సాధించడంతోపాటు పౌరులు సంపూర్ణ సాధికారతను సాధించాలన్నది ఈ కార్యక్రమం లక్ష్యం. సమాచార సాంకేతిక రంగాన్ని ఉపయోగించి, దేశంలోని డిజిటల్ అంతరాన్ని తొలగించి భవిష్యత్తు భారత్ను నిర్మించాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ జూలై 1న ‘డిజిటల్ ఇండియా వీక్’ను న్యూఢిల్లీలో ప్రారంభించారు. కేంద్ర కేబినెట్ 2014 ఆగస్టులో డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ఆమోదించింది. ‘ఇండియా టుడే + ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ = ఇండియా టుమారో’ అనే నినాదంతో డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న అన్ని రకాల ఈ-గవర్నెన్స్ విధానాలను ఏకీకృతం చేస్తూ ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. కేంద్ర రాష్ట్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, అనేక ఇతర సంస్థలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (డీఈఐటీవై) ఈ కార్యక్రమాన్ని సమన్వయపరుస్తుంది. కీలకమైన మూడు అంశాలతో డిజిటల్ ఇండియా కార్యక్రమం అభివృద్ధిని విస్తరించనుంది. ప్రతి పౌరుడికి డిజిటల్ మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడం:ఇందులో భాగంగా హై స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పిస్తారు. ప్రతి వ్యక్తికి ప్రత్యేక డిజిటల్ గుర్తింపు లభిస్తుంది. మొబైల్ ఫోన్ను బ్యాంకు అకౌంట్కు అనుసంధానించి పౌరులకు ఆర్థిక సేవలను సత్వరం అందిస్తారు. ఈ మౌలిక సదుపాయాల్లో భాగంగా ప్రతి పౌరుడి నివాస ప్రాంతానికి దగ్గరలో అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు సేవలను అందించే ఉమ్మడి సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. అన్ని రకాల లావాదేవీల భద్రత కోసం సైబర్ భద్రతను మెరుగుపరుస్తారు.డిమాండ్కు తగ్గట్టుగా ఎలక్ట్రానిక్స్ మాధ్యమంలో ప్రభుత్వ పాలన, సేవలను అందించడం:దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని విభాగాలన్నిటినీ ఇంటర్నెట్ ద్వారా అనుసంధానించి అన్ని రకాల సేవలను ఆన్లైన్, మొబైల్ విధానంలో అందిస్తారు. అన్ని రకాల లావాదేవీలను ఎలక్ట్రానిక్ మాధ్యమంలోనే నిర్వహించే విధంగా ప్రభుత్వ విభాగాలను, బ్యాంకులను ప్రోత్సహిస్తారు. దేశవ్యాప్తంగా పౌరులందరికీ డిజిటల్ సాధికారతను కల్పించడం: దేశవ్యాప్తంగా అందరికీ డిజిటల్ వనరులను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా డిజిటల్ అక్షరాస్యతను సాధించాలి. ప్రజలు వీటివైపు ఆకర్షితులవడానికి అన్ని భారతీయ భాషల్లో డిజిటల్, మౌలిక సదుపాయాలను రూపొందిస్తారు. క్లౌడ్ కంప్యూటింగ్ విధానంలో ప్రజలకు సేవలను అందించేందుకు కృషి చేస్తుంది.డిజిటల్ కార్యక్రమంలోని పై మూడు కీలక లక్ష్యాలను సాధించడానికి తొమ్మిది మూల అంశాలను అభివృద్ధి చేయగలిగారు. ఇవి డిజిటల్ ఇండియా కార్యక్రమానికి మూల స్తంభాలుగా అభివర్ణించారు. బ్రాడ్ బ్యాండ్ హైవేస్: దేశవ్యాప్తంగా 2.5 లక్షల గ్రామ పంచాయతీలను బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ ద్వారా అనుసంధానించాలన్నది లక్ష్యం. 2016 నాటికల్లా దీన్ని పూర్తిచేస్తారు. టెలీకమ్యూనికేషన్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమ వ్యయం అంచనా రూ.32 వేల కోట్లు. పట్టణ ప్రాంతాల్లో బ్రాడ్బ్యాండ్ను విస్తరించడానికి ప్రస్తుతం ఉన్న నెట్వర్క్ ఆపరేటర్లను ప్రోత్సహించడంతోపాటు కొత్త భవనాలు, నివాస సముదాయాల్లో కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాల వినియోగాన్ని తప్పనిసరి చేస్తారు. ఫలితంగా 2017 మార్చి నాటికి దేశవ్యాప్తంగా ఉన్న స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్(ఎస్డబ్ల్యూఏఎన్)లను, నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్లను,నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్లను అనుసంధానించి నేషనల్ ఇన్ఫర్మేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను రూపొందిస్తారు.అందరికీ మొబైల్ కనెక్టివిటీ: 2014-18 మధ్యకాలంలో రూ.16 వేల కోట్ల ఖర్చుతో టెలీకమ్యూనికేషన్స్ విభాగం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఏమాత్రం మొబైల్ సదుపాయం లేని 42,300 గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. ాతీయ రూరల్ ఇంటర్నెట్ మిషన్: ఇది దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ను విస్తరించేందుకు ఉద్దేశించిన సమయ నిర్ధారిత కార్యక్రమం. మూడేళ్లలో (2017 మార్చి నాటికి) అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ ఈ-గవర్నెన్స్: టెక్నాలజీ ద్వారా ప్రభుత్వ సేవలను పూర్తిగా ప్రక్షాళించే ఈ-గవర్నెన్స్ విధానాన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలి. ఇందుకోసం అనేక రకాల ఆన్లైన్ అప్లికేషన్లను రూపొందించడంతోపాటు పౌరులకు సంబంధించిన సమాచారాన్ని ఆన్లైన్ డేటాబేస్లలో పొందుపరుస్తారు. ప్రజల నుంచి అన్ని రకాల సిఫార్సులను కూడా ఆన్లైన్ విధానంలోనే స్వీకరిస్తారు. ఇందుకోసం వివిధ విభాగాల మధ్య సమన్వయానికి ఇది కృషి చేస్తుంది. ఈ-క్రాంతి: ఎలక్ట్రానిక్ విధానంలో సేవలను అందించే కార్యక్రమం. ఇందులో విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, భద్రత, ప్రభుత్వ ప్రణాళిక, న్యాయసేవలన్నింటినీ ఎలక్ట్రానిక్ విధానంలో అందిస్తారు. ఈ-ఎడ్యుకేషన్లో భాగంగా దేశంలోని అన్ని పాఠశాలలకు బ్రాడ్ బ్యాండ్ సదుపాయాలు కల్పిస్తారు. 2.5 లక్షల పాఠశాలల్లో ఉచిత వైఫై సౌకర్యాన్ని కల్పించడం ద్వారా డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమాన్ని విస్తరిస్తారు.అంతేకాకుండా ఆన్లైన్ విధానంలోనే విద్యను అభ్యసించి సర్టిఫికెట్ పొందే మ్యాసివ్ ఆన్లైన్ ఓపెన్ కోర్సులను రూపొందిస్తారు. ఈ-ఆరోగ్యంలో భాగంగా ఆన్లైన్ టెలీకన్సల్టేషన్ వైద్య రికార్డుల బదిలీ, ఇతర దేశాల్లోని వైద్యుల ద్వారా సూచనలు మొదలైన సేవలను అందుబాటులోకి తీసుకొస్తారు. ఈ-వ్యవసాయంతో ప్రత్యక్ష వ్యవసాయ మార్కెట్ సమాచారాన్ని అందించడంతోపాటు ఎరువులు, క్రిమిసంహారకాలను, విత్తనాలను ఆన్లైన్లో ఆర్డర్ చేసే విధానాన్ని ఈ కార్యక్రమంలో కల్పిస్తారు. మొబైల్ బ్యాంకింగ్ ద్వారా నగదు బదిలీ, రుణాలు, కరువు భత్యం బదిలీ వంటి సేవలు అందుబాటులోకి వస్తాయి. న్యాయ సేవలను ప్రజలకు అందించే లక్ష్యంతో ఈ-కోర్టు, ఈ-పోలీస్, ఈ-జైల్స్ మొదలైన సేవలను అందుబాటులోకి తీసుకొస్తారు.అందరికీ సమాచారం: పౌరులందరికీ ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో ప్రభుత్వ, ఇతర సేవల సమాచారాన్ని అందించే కార్యక్రమం- ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్. సామాజిక నెట్వర్క్ల ద్వారా మొబైల్ సంక్షిప్త సమాచారం ద్వారా ప్రజలకు సమాచారాన్ని అందించే ప్రత్యేక మౌలిక సదుపాయాలను ఇందులో భాగంగా అందజేస్తారు. ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పాదన: ఏటా భారత్ 100 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలను వినియోగిస్తోంది. వీటిలో ముఖ్యంగా మొబైల్ ఫోన్స్, కంప్యూటర్స్, సిమ్కార్డ్, సెట్ అప్ బాక్స్లు, వైద్య రక్షణ సంబంధిత పరికరాలు మొదలైనవి. వీటికోసం దిగుమతులపై ఆధారపడకుండా దేశంలోనే పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేయాలన్నది ఈ వ్యూహం ప్రధాన లక్ష్యం. 2020 నాటికి దిగుమతులను పూర్తిగా తగ్గించి దేశంలో ఈ రంగాన్ని అభివృద్ధి చేసి ఎగుమతులను ప్రోత్సహించాలి. ఇందుకోసం ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు వివిధ రకాల రాయితీలు కల్పించి ప్రోత్సహించాలి. ఉద్యోగ కల్పనకు ఐటీ: 2019 నాటికి గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో కోటి మంది విద్యార్థులకు ఐటీ రంగంలో శిక్షణ ఇవ్వాలి. ముఖ్యంగా బలహీనవర్గాలకు చెందిన విద్యార్థులకు ఈ శిక్షణ అందిస్తారు. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేకంగా యువతను ఐటీ వైపు ఆకర్షితులను చేసేందుకు బీపీవో రంగాన్ని అభివృద్ధి చేస్తారు. టెలికాం సర్వీసు ప్రొవైడర్స్ తమకు అవసరమయ్యే సిబ్బంది కోసం గ్రామీణ ప్రాంత యువతకు శిక్షణ అందిస్తారు. ప్రారంభ కార్యక్రమాలు: ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగుల మధ్య సమాచార మార్పిడికి ఉద్దేశించి ప్రత్యేక మ్యాన్ మేనేజింగ్ అప్లికేషన్లను అభివృద్ధి చేశారు. ఫలితంగా 1.36 కోట్ల మొబైల్ ఫోన్లు, 22 లక్షల ఈ-మెమరీలను అనుసంధానించారు. న్యూఢిల్లీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ అటండెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2019 నాటికి డిజిటల్ ఇండియా ద్వారా అందుబాటులోకి వచ్చే సేవలు: దేశ వ్యాప్తంగా 2.5 లక్షల గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్ బ్యాండ్ సేవలు. దేశ వ్యాప్తంగా మొబైల్ కనెక్టివిటీ, మొబైల్ గవర్నెన్స్. 2020 నాటికి ఎలక్ట్రానిక్ దిగుమతులు పూర్తిగా నిలుపుదల. నాలుగు లక్షల పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సిస్ పాయింట్లు. 2.5 లక్షల పాఠశాలలు, అన్ని విశ్వవిద్యాలయాల్లో వైఫై సేవలు, ప్రజలకు పబ్లిక్ వైఫై కేంద్రాలు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలీ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ రంగాల్లో 1.7 కోట్ల ప్రత్యక్ష ఉద్యోగాలు, కనీసం 8.5 లక్షల పరోక్ష ఉద్యోగాలు. అన్ని ప్రభుత్వ సేవలు ఎలక్ట్రానిక్ విధానంలో అందించటం, విద్య, ఆరోగ్యం, బ్యాంకింగ్ రంగాల్లో ఐటీ సేవలను వినియోగించే దేశాల జాబితాలో భారత్ మొదటి స్థానం.పూర్తిస్థాయిలో ప్రజలకు డిజిటల్ సాధికారత. -
సినిమా విడుదలకు అన్నీ సమస్యలే
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి , డిజిటల్ టెక్నాలజీ విధానం కారణంగా ఇప్పుడు చిత్ర నిర్మాణం సులువైనమాట వాస్తవమే. అయితే, దానిని విడుదల చేయడానికి నిర్మాత చాలా తంటాలుపడుతున్నారు. ముఖ్యంగా చిన్న చిత్రాలకు అడుగడుగున సమస్యలే. 30 లక్షలతో నిర్మాణంలో చిత్రం పూర్తి చేసి ఇస్తే, దాని ప్రచారానికి దాదాపు కోటిన్నర ఖర్చు చేయాల్సి వస్తున్న పరిస్థితి నెలకొంది. పెద్ద హీరోల చిత్రాలకు నిర్మాతలు పోటీపడి మరీ ప్రచారం చేస్తున్నారు. ప్రకటనల విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవు. ఆంధ్రాలో అయితే, సినిమా ప్రదర్శనలకు నిబంధనలు పాటిస్తున్నారు. అలాంటి నిబంధనలు ఇక్కడ లేవు. ఇక పోతే, పైరసీ అంటూ గగ్గోలుపెడుతున్న సినీ సంఘాలు, వాటిని అరికట్టడంలోనూ వాగ్దానలకే పరిమితం అవుతున్నారు. నిజంగా అలాంటి చిత్తశుద్ధి ఉంటే, ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేయవచ్చు. అదే విధంగా పెద్ద నటుల చిత్రాలను ఒకే సారి వందల థియేటర్లలో విడుదల చేయడానికి పోటీ పడుతున్నారు. దీంతో చిన్న చిత్రాలకు థియేటర్ల కొరత ఏర్పడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న నిర్మాతల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందనడానికి ఇలాంటి ఎన్నో కారణాలు ఎదురు అవుతున్నాయి అని సీనియర్ నిర్మాత కళైపులి జీశేఖరన్, జెనిఫర్ కరుప్పయ్య చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ఆవేదన వ్యక్తం చేశారు. సెలబ్రిటీ సినిమా పతాకంపై నవ నిర్మాత టీఎస్ వాసన్ నిర్మిస్తు, హీరోగా నటిస్తున్న చిత్రం జెన్నిఫర్ కరుప్పయ్య. మృదుల విజయ్ హీరోయిన్గా -నటిస్తున్న ఈ చిత్రంలో దర్శకుడు రాజ్కపూర్, రోహిణి, ఫాతిమా బాబు, సౌందర పాండి, మాస్టర్ భరణి ముఖ్య పాత్ర పోషించారు. జీఎం శరవణ పాండి కథాకథనం , మాటలు దర్శకత్వం బాధ్యతలు నిర్వహించిన ఈ చిత్రానికి జీ కిషోర్ కుమార్ సంగీతాన్ని అందించారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం స్థానిక వడపళనిలోని ఏవీఎం స్టూడియోలో జరిగింది. దర్శకుడు పేరరసు, ఫైట్ మాస్టర్ జాగువర్ తగం, విజయ్ మురళి పాల్గొన్నారు. -
ఔత్సాహికుల కోసం సినిమా వర్క్షాప్
సాక్షి,సిటీబ్యూరో: తెలుగు సినీ రంగంలోని వివిధ సాంకేతిక శాఖల్లో ప్రవేశించాలని కోరుకునే ఔత్సాహికుల కోసం ‘ఏ 2 జెడ్ సినిమా వర్క్షాప్’ పేరిట రెండు రోజుల వర్క్షాప్ శనివారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. దర్శకుడు వీరశంకర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వర్క్షాప్లో ‘సినిమా కథలు ఎలా దొరుకుతాయి’ (విశ్లేషణ: రచయిత కె.ఎల్.ప్రసాద్), ‘కథనం- విజయవంతమైన చిత్రాల్లో రస పోషణ‘ (పరిశోధకులు డాక్టర్ గౌతమ్ కాశ్యప్), ‘ప్రపంచ సినిమా’ (విమర్శకుడు మామిడి హరికృష్ణ), ‘దర్శకత్వం’ (ఇంద్రగంటి మోహనకృష్ణ), ‘కళా దర్శకత్వం’ (ఆర్ట్ డెరైక్టర్ అశోక్) తదితర అంశాలపై సోదాహరణంగా ప్రసంగించారు. చెన్నై, బెంగుళూరు, నెల్లూరుతో పాటు వివిధ ప్రాంతాల నుంచి 113 మంది ఔత్సాహికులు ఇందులో పాల్గొన్నారు. ప్రముఖ సినీ దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్, త్రిపురనేని ప్రసాద్, శివనాగేశ్వరరావు, విజయభాస్కర్, రామ్ప్రసాద్, దేవీ ప్రసాద్, ‘హృదయ కాలేయం’ ఫేమ్ స్టీవెన్ శంకర్, ఫైట్ మాస్టర్ సతీష్ తదితరులు ఈ ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు దాదాపు గంట పైగా కూర్చొని, హిట్ చిత్రాల రూపకల్పనకు సంబంధించి నిపుణుల విశ్లేషణ వినడం విశేషం. ఆదివారం ‘డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం, పబ్లిసిటీ, సినిమా కలెక్షన్లు’ అంశాలపై సదస్సు జరగనుందని నిర్వాహకులు తెలిపారు. -
డిజిటల్ జాబ్స్.. ఫ్యూచర్ ట్రెండ్స్
రాబోయే రోజుల్లో పంచభూతాల మాదిరి ఐదు డిజిటల్ టెక్నాలజీ విభాగాలైన మొబిలిటీ, సోషల్ మీడియా, అనలిటిక్స్, క్లౌడ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్... కొలువులకు పట్టం కడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఐటీ, ఐటీ ఆధారిత రంగాలతోపాటు ఇతర రంగాల్లో పుష్కలమైన అవకాశాలున్నప్పటికీ... ఏటా లక్షల మంది విద్యార్థులు కోర్సులు పూర్తి చేస్తుండడంతో నైపుణ్యాలున్న అభ్యర్థుల ఎంపిక కంపెనీలకు సవాలుగా మారుతోంది. దాంతో సరిపడ నైపుణ్యాలు, సృజనాత్మకత కలిగిన వారిని నియమించుకోవడానికి నూతన విధానాలకు శ్రీకారం చుడుతున్నాయి. కొత్తగా ఆలోచించే నైపుణ్యం, సంస్థకు అవసరమైన ప్రతిభ ఉన్నవారికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. వందల సంఖ్యలో ఇంజనీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల కాలేజీలు కలిగిన హైదరాబాద్లో మరికొద్ది రోజుల్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. భవిష్యత్ రిక్రూట్మెంట్ ట్రెండ్స్పై విశ్లేషణ.. అభివృద్ధి పథంలో ఐటీ మ్యానుఫాక్చరింగ్, హెల్త్కేర్, బ్యాంకింగ్, ఎడ్యుకేషన్, టెలికాం తదితర రంగాలన్నింటిలో ఐటీ పరిజ్ఞానం అవసరం. రిమోట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్(రిమ్), ఎంటర్ప్రైజ్ సొల్యూషన్(ఈఆర్పీ, ఎస్ఏపీ, ఒరాకిల్), బీపీఓ, కేపీఓ, ఇంజనీరింగ్ సొల్యూషన్స్, టెస్టింగ్ తదితర రంగాల్లో గత మూడు నాలుగేళ్లలో చెప్పుకోదగ్గ అభివృద్ధి నెలకొంది అంటున్నారు టీసీఎస్ వైస్ ప్రెసిడెంట్ అండ్ రీజినల్ హెడ్, టెలికామ్ టెక్నాలజీ బిజినెస్ యూనిట్ గ్లోబల్ హెడ్ వి.రాజన్న. అందుక నుగుణంగా ఆయా విభాగాల్లో యువతకు అవకాశాలు లభించనున్నాయని పేర్కొంటున్నారు. పంచ డిజిటల్ శక్తులు ఐబీఎం మెయిన్ ఫ్రేమ్స్తో మొదలైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిణామ క్రమం.. ప్రస్తుతం కొత్త పుంతలు తొక్కుతోంది. విభిన్న రంగాల్లో అభివృద్ధితో డిజిటల్ విప్లవానికి తెరలేచింది. పంచభూతాల మాదిరి ఐదు డిజిటల్ శక్తులు అందుబాటులోకొచ్చాయి. మొబిలిటీ, సోషల్ మీడియా, అనలిటిక్స్, క్లౌడ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ అనే ఈ పంచ శక్తులు రానున్న రోజుల్లో ఊహించని రీతిలో విస్తరించనున్నాయని విశ్లేషించారు రాజన్న. ఆయా టెక్నాలజీల్లో నైపుణ్యాలు సొంతం చేసుకున్నవారికి అవకాశాలకు కొదవ ఉండదని ఆయన చెప్పారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి పెంచడంతో ఇన్సూరెన్స్, డిఫెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కన్స్ట్రక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రికల్చర్ తదితర రంగాల్లో భారీ సంఖ్యలో ఉద్యోగాల కల్పన జరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. యువతలో ఉద్యోగ నైపుణ్యాలు, ఎంటర్ప్రెన్యూరియల్ స్కిల్స్ మెరుగుపరచేందుకు ఉద్దేశించిన నేషనల్ మల్టి స్కిల్ ప్లాన్; రూ.500కోట్లతో ఐఐటీలు, ఐఐఎంల ఏర్పాటు; చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రూ.10,000 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్.. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో కొత్త కొలువులకు మార్గం వేస్తాయని హెచ్ఆర్ నిపుణులు పేర్కొంటున్నారు. ఆశాజనకంగా జాబ్ మార్కెట్ గతేడాది దేశవ్యాప్తంగా 1.6 లక్షల మందికి ఐటీ ఉద్యోగాలు లభించాయి. ఈ ఏడాది ఈ సంఖ్య మరింత పెరగనుంది. అయితే కంపెనీల నియామక విధానాల్లో కొన్ని సహజమైన మార్పులు నెలకొంటున్నాయి. గతేడాదితో పోల్చితే ఐటీ పరిశ్రమ అభివృద్ధి పథంలో పయనించనుంది. 13 నుంచి 15 శాతం వృద్ధిని నమోదు చేయనుందని తాజా సర్వేలు చెబుతున్నాయి. ఐటీతోపాటు అన్ని రంగాల జాబ్ మార్కెట్ కూడా 10-11 శాతం వృద్ధిని నమోదు చేసే అవకాశముంది. దేశీయ సేవల ద్వారా లభించే 30శాతం ఆదాయంలో ఇటీవలి కొన్ని త్రైమాసికాల్లో తగ్గుదల కనిపించినా మళ్లీ పుంజుకుంటోంది. రైల్వేలు, హెల్త్కేర్ రంగాల్లో అభివృద్ధి చోటుచేసుకునే అవకాశం ఉంది. తదనుగుణంగా ఉద్యోగావకాశాలూ పెరగనున్నాయి. ఆన్డిమాండ్ హైరింగ్ నియామక విధానాల మార్పుల్లో భాగంగా కంపెనీలు ఆన్డిమాండ్ హైరింగ్కు ప్రాధాన్యతనిస్తున్నాయి. ఇప్పటివరకు 60 శాతం క్యాంపస్ నియామకాలుంటే.. 40 శాతం ఆన్డిమాండ్ హైరింగ్ లేదా ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ (ఈపీ) హైరింగ్ ఉండేది. కానీ ఇప్పుడు కంపెనీలు క్యాంపస్ నియామకాల కంటే ఆన్డిమాండ్ హైరింగ్కే మొగ్గుచూపుతున్నాయి. ఎందుకంటే.. క్యాంపస్ నియామకాలు ఏడాదిలో ఏదో ఒక సీజన్లో మాత్రమే జరుగుతుంటాయి. అంటే 2015-16కి గాను త్వరలో క్యాంపస్ సెలక్షన్స్ జరుగనున్నాయి. ఇంజనీరింగ్ నాలుగో ఏడాది చదువుతున్న విద్యార్థులను భారీ సంఖ్యలోనే కంపెనీలు ఎంపిక చేసుకునే అవకాశముంది. అయితే, వారికి ఆఫర్ లెటర్ ఇచ్చి, కోర్సు పూర్తి పూర్తయ్యేవరకు కంపెనీలు వేచిఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో కంపెనీలు ఆన్డిమాండ్ హైరింగ్ బాటపడుతున్నాయి. తమ అవసరానికి అనుగుణంగా ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. అంతేగానీ నియామకాలను తగ్గించడం లేదు. ఈ విధమైన నియామకాల్లోనూ కళాశాలతో సంబంధం లేకుండా ఏ విద్యార్థైనా పాల్గొనవచ్చు. కరిక్యులం ప్రధానం కంపెనీలు ప్రధానంగా కరిక్యులం, సిలబస్ పరిధిలోనే విద్యార్థి ప్రతిభను పరీక్షిస్తాయి. అంతకుమించి ఎక్కువగా ఆశించేదీ ఉండదు. పరిశ్రమ అవసరాలకు సరితూగే రీతిలో ఎప్పటికప్పుడు మనవిశ్వవిద్యాలయాలు కరిక్యులంలో మార్పులు చేస్తూనే ఉన్నాయి. కాబట్టి విద్యార్థి కరిక్యులంను పూర్తి స్థాయిలో ఆకళింపు చేసుకోవాలి. కరిక్యులంలో పరిపూర్ణత సాధిస్తే సులభంగా జాబ్ను సొంతం చేసుకోవచ్చు అంటున్నారు ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉమామహేశ్వరరావు. నియామక ప్రక్రియ ఇలా ‘నియామకాల్లో కంపెనీల వారీగా స్పల్ప తేడాలున్నప్పటికీ.. దాదాపు అన్ని కంపెనీలు అభ్యర్థులకు రాతపరీక్ష, గ్రూప్డిస్కషన్, ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. ఇంటర్వ్యూలో టెక్నికల్, హెచ్ఆర్ అనే రెండు రకాలుంటాయి. టెక్నికల్ ఇంటర్వ్యూలో అభ్యర్థి కరిక్యులం, అకడమిక్ పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. హెచ్ఆర్ ఇంటర్వ్యూలో అభ్యర్థి పర్సనాలిటీని అంచనా వేస్తారు. బృందంతో కలిసి పనిచేసే సామర్థ్యం, అభ్యర్థి దృక్పథం, అణకువ, కమ్యూనికేషన్ స్కిల్స్ తదితర అంశాలను పరీక్షిస్తారు. ప్రస్తుతం కొన్ని కంపెనీలు రాత పరీక్షకు బదులు ఆన్లైన్ టెస్ట్లను కూడా నిర్వహిస్తున్నాయని సైయింట్ కంపెనీ కార్పొరేట్ అఫైర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రెసిడెంట్ బి.అశోక్రెడ్డి తెలిపారు. నైపుణ్యాలే గీటురాయి ఐటీ కంపెనీల నియామకాల్లో సంప్రదాయ కోర్సునభ్యసించిన విద్యార్థులకూ అవకాశాలు లభిస్తున్నాయి. ఐటీ సంబంధిత సర్వీసులైన రిమోట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్(రిమ్), బీపీఓ, కేపీఓ తదితర రంగాల్లో సంప్రదాయ డిగ్రీ విద్యార్థులకు సంస్థలు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. సంప్రదాయ కోర్సులు నిర్వహిస్తున్న కళాశాలల్లోనూ క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహిస్తున్నాయి. కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు కనీసం ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో పూర్తిస్థాయి నైపుణ్యం సొంతం చేసుకోవాలి. ఏదైనా డేటాబేస్లోనూ ప్రావీణ్యం పొందాలి. ఒక శాప్ లేదా ఒరాకిల్ తదితర ఈఆర్పీ పరిజ్ఞానం పెంచుకోవాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, బృందనైపుణ్యాలను పెంచుకోవాలి. ఏదైనా టెక్నాలజీ విభాగంలో పనిచేయడానికి సిద్ధమవ్వాలి. అంతేకాకుండా ఐటీ కంపెనీలు ఐటీ సంబంధిత గ్రూప్లతోపాటు కోర్ బ్రాంచ్ల విద్యార్థులకూ సమప్రాధాన్యం ఇస్తున్నాయి. ఎందుకంటే.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఒక హారిజాంటల్ ప్రక్రియ. అంటే.. ప్రతి రంగంలోనూ ఈ రంగం వినియోగం ఉంటుంది. కాబట్టి ఐటీ సంస్థలకు ఐటీ నిపుణులతోపాటు సంబంధిత రంగ నిపుణుల అవసరం ఉంటుంది. అందుకే కోర్ బ్రాంచ్ ఉత్తీర్ణులను కూడా ఐటీ సంస్థలు ప్రాధాన్యమిస్తున్నాయి. అలాగే బీఎస్సీ తదితర కోర్సులు చదివిన విద్యార్థులకు సైతం కొన్ని కంపెనీలు సంబంధిత శిక్షణనిచ్చి ఐటీ ఉద్యోగులుగా తీర్చిదిద్దుతున్నాయి. సైన్స్ టు సాఫ్ట్వేర్ ‘భారత ఐటీ రంగంలో మంచి అవకాశాలున్నాయి. విద్యార్థులు జాబ్ మార్కెట్ ట్రెండ్కు అనుగుణంగా తమను తీర్చిదిద్దుకోవా లి. బీఎస్సీ కోర్సులనభ్యసించిన వారూ సాఫ్ట్వేర్ నిపుణులు గా కెరీర్ను తీర్చిదిద్దుకునేందుకు టీసీఎస్ అవకాశం కల్పిస్తోంది. ఇగ్నైట్ అనే ప్రోగ్రామ్ ఇక్కడ అందుబాటులో ఉంది. ఇది సైన్స్ టు సాఫ్ట్వేర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్. బీఎస్సీ విద్యార్థులకు మూడు, నాలుగు నెలలపాటు శిక్షణ ఇచ్చి ఐటీ నిపుణులుగా తీర్చిదిద్దుతారు. ఐటీకి దీటుగా ఎనర్జీ, పవర్, హెల్త్కేర్, ఇన్ఫ్రాస్ట్ర క్చర్ డెవలప్ మెంట్ రంగాల్లోనూ ఉద్యోగాలున్నాయి. పవర్ అండ్ ఎనర్జీ రంగం ఈ ఏడాది గణనీయమైన వృద్ధి సాధించింది. అభ్యర్థులు నైపుణ్యాలు పెంచుకుంటూ అవకాశాలను అంది పుచ్చుకోవాలి’ - వి. రాజన్న, వైస్ ప్రెసిడెంట్ అండ్ రీజినల్ హెడ్, టీసీఎస్ -
80 ఏళ్ల వయసులో కంప్యూటర్ తో కుస్తీ
సిమ్లా: హిమచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ కంప్యూటర్ తో కుస్తీ పడుతున్నారు. 80 ఏళ్ల ఈ రాజకీయ కురువృద్ధుడు కంప్యూటర్ పాఠాలు వల్లె వేస్తున్నారు. ఆయనేదో డిగ్రీ సాధించేందుకు ఇలా చేయడం లేదు. తమ శాసనసభను దేశంలోనే ప్రప్రథమ ఇ-అసెంబ్లీ మార్చాలని ఆయన సంకల్పించారు. ఇందులో భాగంగా తాను కూడా కంప్యూటర్ నేర్చుకోవాలని భావించారు. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగారు. కంప్యూటర్ పాఠాలు వల్లెవేస్తున్నారు. అంతేకాదు కంప్యూటర్ తెరపై డిజిటల్ పేజీలను పైకి, కిందకు కదిలిస్తూ ప్రశ్నలకు అసెంబ్లీలో ఎలా సమాధానమివ్వాలనే దాని గురించి కూడా ఆయన నేర్చుకుంటున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తాము డిజిటల్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని వీరభద్రసింగ్ అన్నారు. అసెంబ్లీ డిజిటలైజేషన్ కోసం హిమచల్ప్రదేశ్ ప్రభుత్వం రూ. రూ.8.12 కోట్లు వెచ్చించనుంది. -
ఈ ఏడాది మరింత ప్రగతి
టీసీఎస్ వృద్ధి అవకాశాలపై చైర్మన్ సైరస్ మిస్త్రీ న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కి క్రితం ఆర్థిక సంవత్సరం కన్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరింత మెరుగ్గా ఉండగలదని సంస్థ చైర్మన్ సైరస్ మిస్త్రీ చెప్పారు. ప్రపంచ ఎకానమీ మెరుగుపడుతున్న నేపథ్యంలో వృద్ధి అవకాశాలు భారీగా ఉండగలవని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన కంపెనీ సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మిస్త్రీ ఈ విషయాలు తెలిపారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ సగటు 8.8 శాతం కన్నా అధికంగా టీసీఎస్ 16 శాతం వృద్ధి సాధించిందని ఆయన వివరించారు. గతంలో ఎదురైన గడ్డు పరిస్థితులను పక్కన పెట్టి ఇటు కంపెనీ, అటు పరిశ్రమ ముందుకు సాగడానికి అవకాశం లభించినట్లేనని మిస్త్రీ తెలిపారు. ఇలాంటి సమస్యలను టీసీఎస్ ఇకపై మరింత సమర్ధంగా ఎదుర్కొనగలదన్నారు. పోటీ కంపెనీలు, పరిశ్రమ సగటు కన్నా అధిక వృద్ధిని సాధించే సంప్రదాయాన్ని కొనసాగించగలమని మిస్త్రీ చెప్పారు. కొత్త టెక్నాలజీపై పెట్టుబడులు.. కొత్త టెక్నాలజీలు సహా పలు విభాగాల్లో టీసీఎస్ పెట్టుబడులు పెట్టనున్నట్లు మిస్త్రీ తెలిపారు. ప్రస్తుతం అంతటా చర్చనీయాంశంగా మారిన మొబిలిటీ, బిగ్ డేటా, క్లౌడ్ ఆధారిత కంప్యూటింగ్, రోబోటిక్స్ వంటి విభాగాలు ఐటీ ముఖచిత్రాన్ని మార్చివేయగలవని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే అమెరికా, యూరప్, ఆసియా-పసిఫిక్ దేశాల్లో కొంగొత్త డిజిటల్ టెక్నాలజీలపై కంపెనీ ఇన్వెస్ట్ చేస్తోందని మిస్త్రీ పేర్కొన్నారు. ఇక, మౌలికరంగ సర్వీసులు, ఇంజనీరింగ్ సేవలు, కన్సల్టింగ్ వి భాగాలు అత్యంత వేగంగా ఎదుగుతున్నాయన్నారు. ఇన్వెస్టర్లకు పదేళ్లలో పది రెట్లు రాబడి.. కంపెనీ లిస్టయి పదేళ్లు గడిచాయని, ఈ వ్యవధిలో మదుపుదారులు చేసిన ఇన్వెస్ట్మెంట్లపై రాబడులు పది రెట్లు పెరిగాయని మిస్త్రీ చెప్పారు. అలాగే, ప్రతి షేరుపై ఆదాయం 8 రెట్లు పెరిగిందన్నారు.