fuel prices
-
ట్రంప్ హయాంలో భారత్కు ఇం‘ధనం’
ముంబై: భారత్కు సంబంధించి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధికి కీలకమైన ఇంధన ధరలు అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ పదవీకాలంలో తక్కువ స్థాయిలో ఉండే అవకాశం ఉందని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ (సీఈఏ) జీ అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. ఇది దేశ ఎకానమీకి సానుకూల అంశమని విశ్లేషించారు.అయితే ఆహార ద్రవ్యోల్బణంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అక్టోబర్లో 14 నెలల గరిష్ట స్థాయి 6.2 శాతానికి రిటైల్ ద్రవ్యోల్బణం పెరగడంపై ఆయన మాట్లాడుతూ టమోటా, ఉల్లి, ఆలూ ధరల పెరుగుదల దీనికి కారణమని పేర్కొన్నారు. బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వార్షిక బ్యాంకింగ్, ఆర్థిక సదస్సును ఉద్దేశించి సీఈఏ చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు... » రాబోయే 25 సంవత్సరాలలో భారతదేశం అధిక వేగంతో అభివృద్ధి చెందాలంటే ఇంధన ధరలు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. » పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన లక్ష్య సాధనలు ముఖ్యమైనవి అయినప్పటికీ, అంతకుముందు ఆర్థిక వృద్ధిని సృష్టించడం చాలా అవసరం. ఇంకా చెప్పాలంటే, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాల సాధనకు ముందు ఆర్థికవృద్ధి సాధన చాలా కీలకాంశం. » ట్రంప్ పరిపాలనలో అమెరికాకు భారత్ చేసే వస్తు, సేవల ఎగుమతులకు కొన్ని సవాళ్లు తప్పవు. అయితే అమెరికా ఎటువంటి విధానాలు అవలంభించినప్పటికీ పలు మార్కెట్లకు ఎగుమతులు విస్తరిస్తున్నందున భారత్ ఆర్థికాభివృద్ధిలో ఈ విభాగం కీలక పాత్రను పోషిస్తుంది. » అధిక వడ్డీరేట్లు ఎకానమీ వృద్ధికి అవరోధంగా మరతాయన్న ఆందోళన విషయానికి వస్తే, అటువంటి అధ్యయనం ఇంకా చేపట్టవలసి ఉంది. దాని గురించి నేను ఇప్పుడు వ్యాఖ్యానించలేను. (ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య మంత్రి పియూష్ గోయెల్లు ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను –ప్రస్తుతం 6.5 శాతం– తగ్గించాలని సూచిస్తున్న నేపథ్యంలో నాగేశ్వరన్ తాజా వ్యాఖ్యలు చేయడం గమనార్హం) » 1980 వరకూ ఆధిపత్యం చెలాయించిన ‘‘‘కొరత దశ‘ నుంచి భారత్ కార్పొరేట్ రంగం బయటపడి, ‘మైండ్సెట్ షిఫ్ట్‘ చేయడం ద్వారా తమ ఆశయాలను విస్తరించుకోవాల్సిన అవసరం ఉంది. బలహీన రూపాయితో ప్రయోజనం పొందాలని చూడద్దు: కార్పొరేట్లకు విజ్ఞప్తి కాగా, బలహీన రూపాయిలో ప్రయోజనం పొందాలని చూడవద్దని కార్పొరేట్లకు నాగేశ్వరన్ మరో కార్యక్రమంలో విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎగుమతుల విషయాన్ని ప్రస్తావిస్తూ, బలహీన రూపాయి ఎగుమతుల రంగానికి మంచిదే కావచ్చుకానీ, ఇదే కారణంగా ఈ విభాగం పురోగతిని ఆశించడం తగదని ఇన్స్టిట్యూట్ ఫర్ స్టడీస్ ఇన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ (ఐఎస్ఐడీ) నిర్వహించిన ఒక కార్యక్రమంలో అభిప్రాయపడ్డారు.అభివృద్ధి అనేది విధానపరమైన అంశంగా ఉండాలన్నారు. ఉత్పాదకత, పరిశోధన, అభివృద్ధి, నాణ్యత, పెట్టుబడి వంటి అంశాలు విధానపరమైన పురోగతిలో భాగంగా ఉండాలి తప్ప, ‘రూపాయి బలహీనత’ వంటి ప్రత్యామ్నాయ అంశాలపై ఆధారపడి ఉండరాదని స్పష్టం చేశారు. -
పెట్రోల్ అప్.. డీజిల్ డౌన్!
దేశంలో సెప్టెంబర్ నెలలో ఇంధనాల వాడకం మిశ్రమంగా ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గత నెలలో పెట్రోల్ అమ్మకాలు అంతకుముందు నెలతో పోలిస్తే 2.8% పెరిగాయి. డీజిల్ విక్రయాలు 2% తగ్గాయి. ఈమేరకు చమురు మంత్రిత్వ శాఖ నివేదిక విడుదల చేసింది.మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం..దేశీయంగా లిక్విడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ) అమ్మకాలు సెప్టెంబర్లో అంతకుముందు నెలతో పోలిస్తే 1% పెరిగాయి. పెట్రోల్ అమ్మకాలు 2.8% పెరిగాయి. డీజిల్ విక్రయాలు 2% తగ్గాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల సగటుతో పోలిస్తే సెప్టెంబర్లో ఇంధనాల వినిమయ వృద్ధి రేటు తక్కువగా ఉంది. అయితే విదేశాలకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతుండడంతో జెట్ ఇంధన విక్రయాలు మాత్రం గణనీయంగా 9.5% పెరిగాయి.ఇదీ చదవండి: రోజూ 50 కోట్ల లావాదేవీలు..!దేశీయంగా చమురు వినియోగం తగ్గేందుకు ప్రధాన కారణం..చమురుకు బదులుగా వినియోగదారులు పునరుత్పాదక ఇంధనాలు వంటి ఇతర ప్రత్యామ్నాయ మార్గాలవైపు దృష్టి సారించడమని నిపుణులు చెబుతున్నారు. 2019 నుంచి జెట్ ఇంధనం ధర సమ్మిళిక వార్షిక వృద్ధి రేటు(సీఏజీఆర్) 2% ఉంది. డీజిల్ 1.7%, ఎల్పీజీ 4.5%, పెట్రోల్ ధరలు 5.8% సీఏజీఆర్ చొప్పున వృద్ధి చెందాయి. ఇదిలాఉండగా, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుతున్నా దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు(ఓఎంసీ) మాత్రం అందుకు అనుగుణంగా ఇంధన ధరలు తగ్గించడంలేదనే వాదనలున్నాయి. ఓఎంసీలు ఫ్యుయెల్ ధరలు తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. -
ఐవోసీ లాభం సగానికి డౌన్
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) నికర లాభం సగానికి పైగా క్షీణించింది. రూ. 4,838 కోట్లకు పరిమితమైంది. సమీక్షాకాలంలో ఆదాయం రూ. 2.28 లక్షల కోట్ల నుంచి రూ. 2.21 లక్షల కోట్లకు తగ్గింది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ రూ. 7 తుది డివిడెండ్ ప్రకటించింది. రూ. 5 మధ్యంతర డివిడెండ్కు ఇది అదనం. పూర్తి సంవత్సరానికి రికార్డు లాభాలు.. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను సంస్థ చరిత్రలోనే అత్యధిక లాభాలను ఐవోసీ ప్రకటించింది. రూ. 39,619 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇక ఆదాయం రూ. 9.41 లక్షల కోట్ల నుంచి రూ. 8.71 లక్షల కోట్లకు తగ్గింది. ముడి చమురు శుద్ధికి సంబంధించి ప్రతి బ్యారెల్పై వచ్చే స్థూల రిఫైనింగ్ మార్జిన్ 19.52 డాలర్ల నుంచి 12.05 డాలర్లకు తగ్గింది. అంతర్జాతీయంగా ముడి చమురు రేట్లు తగ్గినా దేశీయంగా ఇంధనాల ధరలను తగ్గించకుండా దాదాపు రెండేళ్ల పాటు అదే స్థాయిలో కొనసాగించడమనేది ఐవోసీ వంటి కంపెనీలకు లాభించింది. -
తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు! హింట్ ఇచ్చిన కేంద్ర మంత్రి
Petrol and Diesel price : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు గురించి ఊహాగానాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. దేశంలో 2022 మే 22 నుంచి స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు రానున్న రోజుల్లో తగ్గే అవకాశం ఉంది. నాలుగో త్రైమాసికంలో చమురు మార్కెటింగ్ కంపెనీలు లాభాల్లోకి వస్తే దేశంలో ఇంధన ధరలు తగ్గే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సూచనప్రాయంగా తెలిపారు. యూఎన్ గ్లోబల్ కాంపాక్ట్ నెట్వర్క్ ఇండియా (యూఎన్జీసీఎన్ఐ) 18వ జాతీయ సమావేశాల సందర్భంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరిమాట్లాడుతూ.. చమురు మార్కెటింగ్ కంపెనీలు గత నష్టాల నుంచి కోలుకున్నాయని, రాబోయే త్రైమాసికంలో లాభాలను చూడవచ్చని పేర్కొన్నారు. "మీరు వారిని (చమురు కంపెనీలను) అడిగితే, వారు తమ లాభం తగ్గిందని చెబుతారు.. కానీ వారు కోలుకున్నారు. నాలుతో త్రైమాసికం బాగుంటే ధరలను తగ్గించవచ్చని ఆశిస్తున్నాను” అని పూరి అన్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) వంటి చమురు మార్కెటింగ్ కంపెనీలు గత మూడు త్రైమాసికాల్లో నిలకడగా లాభాలను నమోదు చేశాయి. 2024 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలోనే ఈ కంపెనీలు ఏకంగా రూ.11,773.83 కోట్ల లాభాన్ని నమోదు చేశాయి. గత మూడు త్రైమాసికాల్లో వారి ఉమ్మడి లాభాలు రూ.69,000 కోట్లను అధిగమించాయి. -
అక్కడ పెట్రోలు రేట్లు ఐదు రెట్లు పెరగనున్నాయి!
పెట్రోల్ ధరలు రెండు రూపాయలు పెరిగితేనే ఆందోళనలు జరిగిన సంఘటనలు గతంలో కోకొల్లలు, అలాంటిది 500 శాతం పెరిగితే?.. అది సామాన్య ప్రజల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకీ ఇంత శాతం ధరలు ఏ దేశంలో పెరుగుతాయి, ఎప్పటి నుంచి అమలులోకి రానున్నాయనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. భారత్లో పెట్రోల్ ధరలు ఇప్పుడు రూ.100 నుంచి రూ.120 మధ్యలో ఉండటంతోనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక పాకిస్తాన్, శ్రీలంక దేశాల్లో పెట్రోల్ ధరలు రూ.250 నుంచి రూ.350 వరకు ఉన్నాయి. ఇప్పుడు కరేబియన్ దేశం క్యూబా ఉన్న ధరలనే 500% పెంచుతూ ప్రకటించింది. ఒక వైపు కరోనా ప్రభావం, మరోవైపు అమెరికా తీవ్ర ఆంక్షల మధ్య ఆర్ధిక సంక్షోభంలో పడ్డ క్యూబా.. ద్రవ్యోల్బణ లోటును తగ్గించుకోవడానికి పెట్రోల్ ధరలను భారీగా పెంచాలని నిర్ణయించుకుంది. దీంతో 25 పెసోలుగా ఉన్న ఒక లీటరు పెట్రోల్ రేటు ఫిబ్రవరి 1 నుంచి 132 పెసోలకు పెరుగుతుంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ 450 రూపాయల కంటే ఎక్కువన్నమాట. ఇదీ చదవండి: వాచ్మెన్కు ఇప్పుడే సారీ చెప్పు.. ఆకాశ్ను ఆదేశించిన ముకేశ్ అంబానీ - ఎందుకంటే? కేవలం పెట్రోల్ ధరలు మాత్రమే కాకుండా.. రాబోయే రోజుల్లో డీజిల్, ఇతర రకాల ఇంధనాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని, విద్యుత్, సహజవాయువుల ధరల పెరుగుదల త్వరలోనే జరుగుతుందని ఆర్థిక మంత్రి 'వ్లాదిమిర్ రెగ్యురో' (Vladimir Regueiro) వెల్లడించారు. కొత్త ధరలు అమలులోకి వచ్చిన తరువాత కేవలం అమెరికన్ డాలర్లతో మాత్రమే కొనుగోలు చేయాలనీ క్యూబా ప్రభుత్వం నిర్ణయించింది. ధరలు అందుబాటులోకి వచ్చిన తరువాత క్యూబా ప్రజలు పెద్ద ఎత్తున ఆర్థిక కష్టాలను చవి చూడాల్సి వస్తుందని స్పష్టంగా అర్థమవుతోంది. -
టోకు ద్రవ్యోల్బణం @ 29 నెలల కనిష్టం
న్యూఢిల్లీ: టోకు ధరల ఆధారిత (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం మార్చిలో 29 నెలల కనిష్టానికి దిగి వచ్చింది. 1.34 శాతానికి పరిమితమైంది. ఇంధనాలు, తయారీ ఉత్పత్తుల ధరలు తగ్గగా, ఆహార ఉత్పత్తుల భారం మాత్రం పెరిగింది. డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 3.85 శాతంగాను, గతేడాది మార్చిలో 14.63 శాతంగాను నమోదైంది. ఇది తగ్గడం వరుసగా పదో నెల. చివరిసారిగా 2020 అక్టోబర్లో డబ్ల్యూపీఐ ఆధారిత ధరల పెరుగుదల 1.31 శాతంగా నమోదైంది. ‘2023 మార్చిలో ద్రవ్యోల్బణం రేటు తగ్గడానికి ప్రధానంగా ప్రాథమిక లోహాలు, టెక్స్టైల్స్, ఆహారయేతర ఆర్టికల్స్, ఖనిజాలు, రబ్బర్.. ప్లాస్టిక్ ఉత్పత్తులు, క్రూడ్ పెట్రోలియం .. సహజ వాయువు, పేపర్ .. పేపర్ ఉత్పత్తుల ధరలు తగ్గుముఖం పట్టడమే కారణం‘ అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సోమవారం తెలిపింది. తాజాగా ఫుడ్ బాస్కెట్లో గోధుమలు వంటి ధాన్యాల ధరలు నెమ్మదించగా.. కూరగాయలు, పండ్లు, పాలు, పప్పులు మొదలైన వాటి రేట్లు పెరిగాయని ఈక్విరస్ సెక్యూరిటీస్ ఒక నోట్లో పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఇప్పుడు కూడా వడ్డీ రేట్ల పెంపు విషయంలో నిర్ణయం తీసుకునే ముందు డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం స్థిరపడేలా చూడటంపైనా, వినియోగ ధరల ఆధారిత (సీపీఐ) ద్రవ్యోల్బణం మరింత తగ్గేలా చూడటంపైనా దృష్టి పెట్టాల్సి ఉంటుందని టీఐడబ్ల్యూ క్యాపిటల్ సీఈవో మోహిత్ రాల్హన్ అభిప్రాయపడ్డారు. ► ఆహార ఉత్పత్తుల రేట్ల పెరుగుదల ఫిబ్రవరిలో 3.81 శాతంగా ఉండగా, మార్చిలో 5.48 శాతంగా నమోదైంది. కూరగాయల ధరలు ఫిబ్రవరిలో 21.53 శాతం తగ్గగా (2022 ఫిబ్రవరి ధరతో పోల్చి), మార్చిలో ఈ తగ్గుదల రేటు 2.22 శాతంగానే ఉంది. ఉల్లి విషయంలో ఫిబ్రవరిలో 40.14 శాతం ధరలు తగ్గగా, మార్చిలో తగ్గుదల రేటు 36.83 శాతంగానే నమోదైంది. ► గోధుమల ధరలు 9.16 శాతం, పప్పుల రేట్లు 3.03 శాతం పెరిగాయి. -
ఎయిర్లైన్స్కు రూ. 17 వేల కోట్ల నష్టాలు
ముంబై: అధిక ఇంధన ధరలు, ఆర్థిక పరిస్థితిపై ఒత్తిళ్ల నేపథ్యంలో దేశీ విమానయాన రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 15,000–17,000 కోట్ల మేర నష్టాలు నమోదు చేసే అవకాశం ఉంది. సమీప భవిష్యత్తులోనూ వాటి ఆర్థిక పనితీరుపై ఒత్తిడి కొనసాగనుంది. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం .. దేశీయంగా ప్రయాణికుల ట్రాఫిక్ కోలుకుంటున్న తీరు మెరుగ్గానే ఉన్నప్పటికీ విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు భారీ స్థాయిలో ఉండటమనేది స్వల్పకాలికంగా, మధ్యకాలికంగా ఎయిర్లైన్స్ ఆదాయాలకు, లిక్విడిటీకి ప్రధాన ముప్పుగా కొనసాగనుంది. గతేడాది అక్టోబర్తో పోలిస్తే ఈ అక్టోబర్లో దేశీ ప్రయాణికుల సంఖ్య 26 శాతం పెరిగి 90 లక్షల నుంచి 1.14 కోట్లకు చేరింది. అయినప్పటికీ కరోనా పూర్వం అక్టోబర్తో పోలిస్తే ఇది 8 శాతం తక్కువే. ఈ నేపథ్యంలో దేశీ ఏవియేషన్ పరిశ్రమకు ఇక్రా నెగటివ్ అవుట్లుక్ ఇచ్చింది. నివేదికలోని మరిన్ని ముఖ్య అంశాలు.. ► డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణిస్తుండటమనేది ఎయిర్లైన్స్ వ్యయాల స్వరూపంపై గట్టి ప్రభావం చూపనుంది. రుణాల స్థాయిలు, లీజుల వ్యయాలు మొదలైన వాటి భారం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 1,00,000 కోట్ల మేర ఉండవచ్చని అంచనా. ► మార్కెట్ వాటాను నిలబెట్టుకునేందుకు/పెంచుకునేందుకు ఎయిర్లైన్స్ ప్రయత్నాలు కొనసాగినా .. విమానయాన సంస్థలకు మార్జిన్లు పెంచుకునే సామర్థ్యాలు పరిమితంగానే ఉండనున్నాయి. ఇంధన ధరలు అధిక స్థాయిలో కొనసాగుతుండటమే ఇందుకు కారణం. పరిశ్రమ ఆదాయాలు మెరుగుపడటానికి ఈ అంశాలు పెను సవాలుగా ఉండనున్నాయి. ‘ఈ ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ ట్రాఫిక్ మెరుగుపడటం అర్ధవంతమైన స్థాయిలోనే ఉంటుందనే అంచనాలున్నా, పరిశ్రమ ఆదాయాల రికవరీ నెమ్మదించవచ్చు. వ్యయాలు భారీ స్థాయిలో ఉంటున్నందున పరిశ్రమ నికరంగా రూ.15,000–17,000 కోట్ల మేర నష్టాలు నమోదు చేసే అవకాశం ఉంది‘ అని ఇక్రా పేర్కొంది. అయితే, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే నికర నష్టాలు తక్కువగానే ఉండవచ్చని తెలిపింది. ప్యాసింజర్ ట్రాఫిక్ మెరుగుపడటం, వడ్డీల భారం తగ్గడం (ఎయిరిండియా విక్రయానికి ముందు దాని రుణభారాన్ని ప్రభుత్వం గణనీయంగా తగ్గించడం) వంటి అంశాలు ఇందుకు దోహదపడగలవని పేర్కొంది. ► విమానాల విడిభాగాలు, ఇంజిన్ల సరఫరాలో జాప్యం జరుగుతుండటం పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనితో కొన్ని దేశీ ఎయిర్లైన్స్ పలు విమానాలను నిలిపివేయాల్సి వస్తోంది. సరఫరాపరమైన సమస్యల పరిష్కారం కోసం తయారీ కంపెనీలతో ఎయిర్లైన్స్ చర్చలు జరుపుతున్నాయి. డిమాండ్కి అనుగుణంగా ఫ్లయిట్ సర్వీసులను పెంచుకునేందుకు విమానాలను వెట్ లీజింగ్కు (విమానంతో పాటు సిబ్బందిని కూడా లీజుకు తీసుకోవడం) తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. -
పెట్రోడాలర్కు రష్యా చెక్..!
రష్యా–ఉక్రెయిన్ వార్... భూగోళంపై మరోసారి అణు యుద్ధ మేఘాలు కమ్ముకునేలా చేస్తోంది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నంతో ముగిసిన ప్రచ్ఛన్న యుద్ధానికి అమెరికా, యూరప్ దేశాలు మళ్లీ తెరతీయడం... తన పక్కలో బల్లెంలా విస్తరిస్తున్న నాటో కూటమి... రష్యాను ఉక్రెయిన్పై ఉసిగొల్పేలా చేశాయి. రేపన్నదే లేదన్నట్లు, రష్యాపై పశ్చిమ దేశాలు విధిస్తున్న ఆంక్షలు... మిగతా ప్రపంచ దేశాలను మేల్కొలుపుతున్నాయి. ఈ ఉక్రెయిన్ వార్... ప్రపంచ భౌగోళిక రాజకీయాలను కొత్త మలుపు తిప్పడం ఖాయమని విశ్లేషకులు కుండబద్దలు కొడుతున్నారు. ప్రపంచ పోలీసుగా, డాలర్ ఆధిపత్యంతో ఇన్నాళ్లూ శాసించిన అమెరికాకు రష్యా ఇచ్చిన కరెన్సీ షాక్ దిమ్మదిరిగిపోయేలా చేసింది. యుద్ధ భూమిలోనే కాదు ఆర్థిక చదరంగంలోనూ పావులు కదపడంలో తమ సత్తా ఏంటో రష్యా అధినేత పుతిన్ పశ్చిమ దేశాలకు రుచి చూపిస్తున్నారు. పెట్రోడాలర్ పెత్తనానికి గండి పడటంతో పాటు ఆంక్షలు తిరిగి అమెరికా కూటమి మెడకే చుట్టుకుంటున్నాయి. అయితే, ఈ పరిణామం ప్రపంచ దేశాలను మరోసారి మాంద్యం కోరల్లోకి నెట్టేస్తోంది. అసలు పెట్రోడాలర్ సంగతేంటి? దీనికి రష్యా ఎలా చెక్ చెబుతోంది? ఉక్రెయిన్ యుద్ధాన్ని రష్యా కరెన్సీ వార్గా ఎలా మారుస్తోంది? పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని అంతం చేయడానికి బ్రిక్స్ కూటమి వ్యూహాలు ఏంటి? ఇవన్నీ తెలుసుకోవడానికి అలా కదన రంగంలోకి వెళ్లొద్దాం రండి!! ఉక్రెయిన్పై రష్యా దండయాత్రకు దాదాపు దశాబ్దం క్రితమే బీజం పడింది. ఉక్రెయిన్లో గత ప్రభుత్వానికి అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు పొగపెట్టి, తమ కీలుబొమ్మ లాంటి జెలెన్స్కీకి పట్టం కట్టిబెట్టాయి. తద్వారా నాటో దళాలను రష్యా గుమ్మం ముందు నిలబెట్టాలనేది పశ్చిమ దేశాల వ్యూహం. అంతేకాదు, ఉక్రెయిన్లోని రష్యా జాతీయులపై జెలెన్స్కీ సర్కారు చేస్తున్న అకృత్యాలు కూడా పుతిన్ కన్నెర్రకు కారణమే. దీనికితోడు ఉక్రెయిన్తో రష్యా గతంలో కుదుర్చుకున్న మిన్స్క్ ఒప్పందాన్ని జెలెన్స్కీ సర్కారు తుంగలో తొక్కింది. ఏ కూటమిలోనూ చేరకుండా తటస్థంగా ఉంటామన్న హామీకి తూట్లు పొడుస్తూ... యూరోపియన్ యూనియన్, నాటో కూటమిలో చేరేందుకు తహతహలాడింది. ఉక్రెయిన్ నాటో చేరిక యత్నాలను విరమించుకోవాలన్న పుతిన్ సూచనలను పెడచెవిన పెట్టడంతో... ఫిబ్రవరి 24న రష్యా ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ పేరుతో ఉక్రెయిన్పై దండెత్తింది. మొదట్లో ఎడాపెడా దాడులతో విరుచుకుపడిన రష్యా... నెమ్మదిగా ఒక ప్రణాళిక ప్రకారం తూర్పు ఉక్రెయిన్లోని డోన్బాస్ను పూర్తిగా చేజిక్కించుకోవడంపై దృష్టిపెట్టింది. ఉక్రెయిన్కు నల్లసముద్రంతో పూర్తిగా తెగతెంపులు చేసి, భూ సరిహద్దులకే పరిమితం చేసేలా చకచకా ముందుకెళ్తోంది. ఇప్పటికే సుమారు 25% ఉక్రెయిన్ భూభాగం రష్యా అధీనంలోకి వచ్చినట్లు అంచనా. కాగా, పశ్చిమ దేశాల కూటమి బిలియన్ల డాలర్ల కొద్దీ ఆర్థిక సహాయాన్ని, అత్యాధునిక ఆయుధాలను ఉక్రెయిన్కు పంపిస్తూ... రష్యాపై పరోక్ష యుద్ధం చేస్తోంది. మరోపక్క, నాటో దేశాలు గనుక నేరుగా ఉక్రెయిన్ కదన రంగంలోకి అడుగుపెడితే, దాన్ని రష్యాతో యుద్ధంగా పరిగణిస్తామని, అణు యుద్ధం తప్పదంటూ పుతిన్ ఇప్పటికే తీవ్రంగా హెచ్చరించారు. ఏ క్షణంలోనైనా అణ్వాయుధాలను ప్రయోగించేందుకు సిద్ధంగా ఉండాలంటూ తమ దళాలను సమాయత్తం చేశారు కూడా. మొత్తంమీద ఈ పరిణామాలు... ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆంక్షల అస్త్రం... రష్యా దాడి నేపథ్యంలో అమెరికా మిత్ర దేశాలన్నీ రష్యాపై ఆంక్షలతో విరుచుకుపడ్డాయి. రష్యాపై నేరుగా యుద్ధం చేసే పరిస్థితి లేక ఆర్థిక యుద్ధానికి తెరతీశాయి. వందల బిలియన్ల కొద్దీ రష్యా ప్రభుత్వ ఆస్తులు, ఆ దేశానికి చెందిన కుబేరుల ఆస్తులను సీజ్ చేశాయి. రష్యా ఎకానమీకి కీలకంగా నిలిచే క్రూడ్, గ్యాస్ ఎగుమతులపై నిషేధం విధించాయి. రష్యాను ఆర్థికంగా, రాజకీయంగా, భౌగోళికంగా ఏకాకిని చేయడమే లక్ష్యంగా బెదిరింపులకు దిగాయి. రష్యా సెంట్రల్ బ్యాంకుకు చెందిన 600 బిలియన్ డాలర్ల మేర విదేశీ మారక నిల్వల్లో దాదాపు 300 బిలియన్ డాలర్లను అమెరికా, యూరప్ తదితర పశ్చిమ దేశాలు స్తంభింపజేశాయి. తద్వారా రష్యాను ఆర్థికంగా దివాలా తీయించాలనేది వారి వ్యూహం. రూబుల్ ‘రబుల్’ కాదు.. డబుల్! ఉక్రెయిన్పై రష్యా దాడులు మొదలుపెట్టడంతోనే.. రష్యా ఆర్థిక కుంభస్థలాన్ని ఆంక్షల పంజాతో చీల్చి చెండాడేస్తామంటూ అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, బ్రిటన్, జపాన్ ఇలా పెద్దన్న కూటమి మొత్తం గొంతుచించుకుంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్ అయితే, తమ ఆంక్షల దెబ్బకు రష్యా కరెన్సీ రూబుల్.. రబుల్ (పనికిరాని చెత్త)గా మారుతుందని డాలరు మారకంలో ఏకంగా 200కు పడిపోతుందంటూ సంచలన ప్రకటనలు కూడా చేశారు. వార్ మొదలయ్యేటప్పుడు దాదాపు 60 స్థాయిలో ఉన్న రూబుల్.. క్రూడ్, గ్యాస్ ఇతరత్రా ఎగుమతులపై నిషేధంతో ఒక్కసారిగా 140 స్థాయికి కుప్పకూలింది. దీంతో బైడెన్, పశ్చిమ దేశాలు ఇక రష్యా పనైపోయిందంటూ జబ్బలు చరుచుకున్నాయి. ఇక్కడే అసలు కథ మొదలైంది. అగ్రరాజ్యం ఆడుతున్న ఆర్థిక చదరంగంలో పుతిన్lఅదిరిపోయే పావును కదపడంతో పశ్చిమ దేశాల గొంతులో మిసైల్ పడింది. రష్యా క్రూడ్, గ్యాస్కు డాలర్లలో చెల్లింపులను అంగీకరించబోమని, తమకు రూబుల్లో మాత్రమే చెల్లించాలంటూ పుతిన్ ఆదేశించారు. ఎందుకంటే రష్యా బ్యాంకులను అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ (స్విఫ్ట్) నుంచి తొలగించడంతో రష్యాకు వచ్చే డాలర్లను ఉపయోగించుకోవడానికి వీల్లేకుండా పోయింది. రష్యా ఇచ్చిన షాక్తో యూరోపియన్ దేశాలకు దిమ్మదిరిగిపోయింది. పుతిన్ ‘నో రూబుల్.. నో క్రూడ్–గ్యాస్’ అని కరాఖండిగా చెప్పేయడంతో ఇక చేసేది లేక రూబుల్ పేమెంట్కు చచ్చీచెడీ అంగీకరించాయి. ఈ దెబ్బకు డాలరుతో రూబుల్ విలువ అమాంతం పుంజుకోవడం మొదలైంది. 140 స్థాయి నుంచి మూడున్నర నెలల్లోనే∙దాదాపు 51 స్థాయికి బలపడింది. అంటే యుద్ధం ప్రారంభానికి ఉన్న స్థాయిని మించి రూబుల్ బలోపేతం అయింది. రష్యా ఆర్థిక పైఎత్తుకు అగ్రరాజ్య కూటమి చిత్తయింది. పెట్రోడాలర్ వ్యవస్థను అంతం చేయడమే లక్ష్యంగా పుతిన్ విసిరిన ‘రూబుల్’ పాచిక బాగానే పారిందని ఆర్థిక విశ్లేషకులు సైతం అంగీకరిస్తున్నారు. అంతేకాదు, తమ విదేశీ రుణాల (డాలర్, యూరో)కు సంబంధించి చెల్లింపులను రూబుల్స్లో మాత్రమే చేస్తామని కూడా రష్యా ప్రకటించింది. ఇకపై గోధుమలు, ఎరువులు ఇతరత్రా ఉత్పత్తుల ఎగుమతులకు రూబుల్లో మాత్రమే పేమెంట్ చేయాల్సి ఉంటుందని కూడా తాజాగా పుతిన్ తేల్చిచెప్పడం గమనార్హం. తద్వారా అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీల్లో డాలర్ అధిపత్యానికి గండిగొట్టాలనేది రష్యా అధినేత వ్యూహం. పెట్రోడాలర్ సంగతేంటంటే! 1970వ దశకంలో ప్రపంచం క్రూడ్ సంక్షోభంలో కూరుకుపోయింది. ఇప్పట్లాగానే ధరలు ఆకాశాన్నంటడంతో అమెరికా నుంచి జపాన్ దాకా పెట్రో ఉత్పత్తుల రేట్లు ఆల్టైమ్ గరిష్ఠాలను (అమెరికాలో గ్యాలన్ పెట్రోలు ధర 4 డాలర్లు) తాకాయి. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద క్రూడ్ ఉత్పత్తిదారు అయిన సౌదీ అరేబియాతో అమెరికా కీలక ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంతో జరిపే చమురు క్రయవిక్రయాలకైనా అమెరికా డాలర్ల రూపంలోనే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేక పేమెంట్ వ్యవస్థనే ‘పెట్రోడాలర్’గా వ్యవహరిస్తారు. సింపుల్గా చెప్పాలంటే, క్రూడ్ను ఉత్పత్తి చేసే దేశాలేవైనా డాలర్లు ఇస్తేనే క్రూడ్ అమ్ముతాయి. గడిచిన 50 ఏళ్లుగా ఈ పెట్రోడాలర్ సిస్టమ్ ఎదురులేకుండా కొనసాగుతోంది. అంతర్జాతీయ వాణిజ్యం కోసం ఏ దేశమైనా సరే డాలర్లను కొనాల్సి రావడంతో రిజర్వ్ కరెన్సీగా ‘డాలర్’ ఆధిపత్యం చెలాయిస్తోంది. ప్రపంచంలో అత్యధికంగా వాణిజ్యం జరిగేది క్రూడాయిల్లోనే కాబట్టే అరేబియా గల్ఫ్లో అమెరికా అన్ని యుద్ధాలు చేసింది. లిబియా, ఇరాక్, సిరియా సైతం పెట్రోడాలర్ పెత్తనానికి వ్యతిరేకంగా గొంతెత్తడం వల్లే అమెరికా వాటిని నామరూపాల్లేకుండా బాంబులతో నేలమట్టం చేసింది. అయితే, ఇప్పటిదాకా పుతిన్లాంటోడు అమెరికాకు తగలకపోవడంతో దాని ఆటలు బాగానే సాగాయి. ఉక్రెయిన్ యుద్ధంతో ఇప్పుడు పుతిన్ పశ్చిమ దేశాలపై కరెన్సీ వార్కు సైతం తెరలేపారు. అంతర్జాతీయంగా బ్యాంకుల మధ్య లావాదేవీల కోసం ఉపయోగించే పేమెంట్ వ్యవస్థ ‘స్విఫ్ట్ (సొసైటీ ఫర్ వరల్డ్వైడ్ ఇంటర్బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్స్)’ నుంచి వెలేస్తారని పుతిన్కు ముందే తెలుసు. దీనివల్ల రష్యా బ్యాంకులు స్విఫ్ట్ ద్వారా లావాదేవీలు జరపలేవు. రష్యా కంపెనీలకు తమ ఎగుమతులకు రావాల్సిన డబ్బులు రావు. దీంతో రష్యా రూబుల్ అస్త్రాన్ని ప్రయోగించింది. తమ క్రూడ్ గ్యాస్ ఉత్పత్తులకు రూబుల్ లేదంటే డాలర్ యేతర అసెట్లలో చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పింది. దీంతో క్రూడ్ మార్కెట్లు షేక్ అయ్యాయి. రష్యా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు, గ్యాస్ ఉత్పత్తిదారు కావడమే దీనంతటికీ కారణం. ‘స్విఫ్ట్’కు షాక్... అమెరికా, యూరప్ ఆధిపత్యంలో ఉన్న స్విఫ్ట్ పేమెంట్ వ్యవస్థ నుంచి ప్రత్యామ్నాయం కోసం రష్యా, చైనా చాన్నాళ్ల క్రితమే ప్రయత్నాలు మొదలెట్టాయి. స్విఫ్ట్ వ్యవస్థ అనేది డాలర్ను, అంతిమంగా అమెరికాను మాత్రమే బలోపేతం చేయడానికి పనిచేస్తోందనేది రష్యా, చైనాల వాదన. ఇప్పుడు ఉక్రెయిన్ వార్తో రష్యా పూర్తిగా స్విఫ్ట్ నుంచి వైదొలగడంతో.. తన క్రూడ్, గ్యాస్, ఇతరత్రా ఎగుమతుల కోసం రూబుల్–చైనా యువాన్, రూబుల్–ఇండియన్ రూపీ తదితర కరెన్సీల్లో చెల్లింపులకు రష్యా తెరతీసింది. అంటే రష్యా నుంచి దిగుమతుల కోసం జరిపే చెల్లింపులకు ఏ దేశమైనా తమ కరెన్సీలను డాలర్లలోకి మార్చాల్సిన పని లేకుండా నేరుగా రూబుల్స్లోకి మార్చుకుంటే సరిపోతుందన్న మాట. ఇప్పటికే రష్యా, చైనా తమ వాణిజ్యాన్ని రూబుల్–యువాన్ కరెన్సీలో చేసుకుంటున్నాయి. భారత్ కూడా రూపాయి–రూబుల్ పేమెంట్కు సిద్ధమవుతోంది. ఇరాన్, యూఏఈ, సౌదీ వంటి పలు దేశాలు కూడా తమ సొంత కరెన్సీల్లో లావాదేవీలకు ఓకే అంటున్నాయి. రష్యా, చైనా ఇప్పుడు స్విఫ్ట్ స్థానంలో ఎస్పీఎఫ్ఎస్ (సిస్టమ్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫైనాన్షియల్ మెసేజెస్)ను అమల్లోకి తెచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. దీన్ని రష్యా సెంట్రల్ బ్యాంక్ రూపొందించింది. ఎస్పీఎఫ్ఎస్ను చైనాకు చెందిన క్రాస్–బోర్డర్ ఇంటర్బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ (సీఐపీఎస్)తో అనుసంధానించేందుకు రష్యా ప్రయత్నిస్తోంది. అంతేకాదు, ఎస్పీఐఎఫ్ను బ్రిక్స్ కూటమి (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) దేశాలన్నీ వాడుకునేలా కూడా తాజా బ్రిక్స్ సదస్సులో రష్యా ప్రతిపాదించింది. అలాగే, బ్రిక్స్ దేశాలకు కమోడిటీల ఆధారిత ప్రత్యేక రిజర్వ్ కరెన్సీని తీసుకురావడంపై తమ కూటమి కసరత్తు చేస్తోందని కూడా పుతిన్ ప్రకటించడం గమనార్హం. మరోపక్క, స్విప్ట్ నుంచి రష్యాను వెలేయడం అనేది యూరప్, అమెరికా ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీయనుంది. ఎందుకంటే స్విఫ్ట్ లావాదేవీల్లో అత్యధికంగా అమెరికా డాలర్లోనే సెటిల్ అవుతాయి. ఇప్పుడు రష్యా, చైనా గనుక స్విఫ్ట్ స్థానంలో ఎస్పీఎఫ్ఎస్ను తీసుకొస్తే, పెట్రోడాలర్కు.. అంతిమంగా డాలర్ పెత్తనానికి గండి పడినట్లే. ఎందుకంటే రష్యా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఇంధన ఎగుమతిదారు కాగా, చైనా ప్రపంచంలో నంబర్ వన్ తయారీ వస్తువుల ఎగుమతిదారు. బ్రిక్స్తో సహా తమ ఆఫ్రికా, లాటిన్ అమెరికా మిత్ర దేశాలను సైతం రష్యా ఈ కొత్త పేమెంట్ సిస్టమ్లోకి తీసుకొస్తే, పెట్రోడాలర్కు చెల్లుచీటీ తప్పదని పరిశీలకులు పేర్కొంటున్నారు. పశ్చిమ దేశాల పెత్తనానానికి చెల్లు! రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో భౌగోళిక రాజకీయాలు కూడా కొత్త మలుపు తిరుగుతున్నాయి. ప్రపంచంలో 195 దేశాల్లో రష్యాపై ఆంక్షలు విధించిన అంతర్జాతీయ కమ్యూనిటీలో పట్టుమని 40 దేశాలు కూడా లేవు. అమెరికా, యూరప్ తదితర పశ్చిమ దేశాలు, కొన్ని అమెరికా మిత్ర దేశాలు మాత్రమే వీటిలో ఉన్నాయి. మిగతా ప్రపంచమంతా ఆంక్షలకు నో చెప్పింది. జీ7 అగ్ర దేశాల మొత్తం జనాభా 77.7 కోట్లు కాగా, బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) జనాభా ఏకంగా 320 కోట్లు (ప్రపంచ జాభాలో 41%) కావడం విశేషం. 2030 నాటికి బ్రిక్స్ దేశాల జీడీపీ ప్రపంచ మొత్తం జీడీపీలో 50 శాతానికి చేరుతుందని అంచనా. బ్రిక్స్తో పాటు ఆఫ్రికా మొత్తం కనీసం ఉక్రెయిన్పై రష్యా దాడులను ఖండించలేదు కూడా. గల్ఫ్ దేశాల్లో ప్రధానంగా యూఏఈ రష్యాకు అండగా నిలుస్తోంది. మిత్రదేశం సౌదీ కూడా అమెరికాకు ముఖం చాటేసింది. అంతేకాదు, యూఏఈ, భారత్ సహా పలు దేశాలు ఉక్రెయిన్పై రష్యా దాడికి సంబంధించి ఐక్యారాజ్యసమితిలో ఓటింగ్కు దూరంగా ఉండటం మరో విశేషం. అంటే అమెరికా కూటమి చెబుతున్న అంతర్జాతీయ కమ్యూనిటీకి అర్థమేంటి? ‘‘కొంతమంది పశ్చిమ దేశాల రాజకీయ విశ్లేషకులు చేసే ఘోరమైన తప్పేంటంటే... వారి శత్రువులను మనందరికీ శత్రువులుగా ఉంచాలనుకోవడం’’ అని నెల్సన్ మండేలా చేసిన వ్యాఖ్యలు పశ్చిమ దేశాల కుటిల రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం. అమెరికా ఇప్పుడు ఆడిస్తున్న ఈ భయంకరమైన సామ్రాజ్యవాద యుద్ధ చదరంగంలో రష్యన్లు కొన్ని పావులను కోల్పోతుండవచ్చు, అది వారికీ తెలుసు... అయితే అంతిమంగా వాళ్లు కోరుకుంటున్న ‘క్వీన్’ను మాత్రం చేజిక్కించుకోవడం ఖాయం. శరవేగంగా మారిపోతున్న తాజా భౌగోళిక, రాజకీయ, ఆర్థిక సమీకరణాలే ఇందుకు బలమైన నిదర్శనం అనేది విశ్లేషకుల మాట!! ధరదడ.. మాంద్యం భయం! ఇప్పటికే ధరలు మండిపోతున్న నేపథ్యంలో, రష్యా ఎగుమతులపై ఆంక్షలతో ప్రపంచ దేశాల పరిస్థితి పెనం మీంచి పొయ్యిలో పడ్డట్లయింది. రష్యా క్రూడ్, గ్యాస్పై నిషేధంతో ఉక్రెయిన్ యుద్ధానికి ముందు దాదాపు 80 డాలర్ల స్థాయిలో ఉన్న ముడిచమురు ధర ఒక్కసారిగా 140 డాలర్ల స్థాయికి భగ్గుమంది. దీంతో అనేక దేశాల్లో పెట్రోలు బంకుల్లో హాహాకారాలు మొదలయ్యాయి. అమెరికా, యూరప్ ఇలా ఒకటేంటి.. ప్రపంచ వ్యాప్తంగా పెట్రో ధరలు ఆల్టైమ్ గరిష్ఠాలను తాకాయి. ఉక్రెయిన్, రష్యాల నుంచి గోధుమలు, ఎరువులు, నూనెగింజలు వంటి కీలక ఉత్పత్తుల ఎగుమతులు నిలిచిపోవడంతో వాటి ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. వెరసి, అగ్రరాజ్య కూటమి ఆడుతున్న ఆంక్షల గేమ్కు ప్రపంచ దేశాలు బలవుతున్నాయి. వీటన్నింటికీ తోడు దూసుకెళ్తున్న ద్రవ్యోల్బణానికి అడ్డుకట్టవేయడం కోసం అనేక దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లను భారీగా పెంచుతుందటంతో ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి జారిపోవడం ఖాయమని ఆర్థికవేత్తలు కుండబద్దలు కొడుతున్నారు. ఒకపక్క, ధరాఘాతం, మరోపక్క, మాంద్యం భయాలతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుదేలవుతూ.. ఇన్వెస్టర్లకు తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయి. యూరప్ గజగజ..! అమెరికా రెచ్చగొట్టడంతో రష్యా క్రూడ్, గ్యాస్పై ఆంక్షలు విధించిన యూరప్ దేశాలు.. తమ గొయ్యి తామే తవ్వుకున్నాయి. వాస్తవానికి యూరప్ మొత్తం క్రూడ్, గ్యాస్ దిగుమతుల్లో రష్యా వాటా 40 శాతం పైనే. జర్మనీ తదితర కొన్ని దేశాలైతే ఏకంగా 60–80 శాతం క్రూడ్–గ్యాస్ అవసరాలకు రష్యాపైనే ఆధారపడ్డాయి. అంతేకాదు రష్యా నుంచి నేరుగా పైపు లైన్ల (నార్డ్స్ట్రీమ్) ద్వారా యూరప్ మొత్తానికి సరఫరా వ్యవస్థ ఉండటంతో అత్యంత చౌకగా కూడా లభించేది. అయితే, రష్యాపై ఆంక్షలతో ఈ చౌక క్రూడ్, గ్యాస్కు చాలా దేశాలు నో చెప్పాయి. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ వంటి కొన్ని దేశాలు ప్రత్యామ్నాయం లేక రష్యా రూబుల్స్లోనే చెల్లించి దిగుమతులు చేసుకుంటున్నాయి. అయితే, నార్డ్స్ట్రీమ్ పైప్లైన్ నిర్వహణ, రిపేర్ల పేరుతో రష్యా గ్యాస్ ఎగుమతుల్లో దాదాపు సగానికిపైగా కోత పెట్టడంతో ఇప్పుడు యూరోపియన్ దేశాలు.. ముఖ్యంగా జర్మనీ గజగజలాడుతోంది. ఎందుకంటే యూరప్లో చలికాలం మొత్తం ఇళ్లలో వెచ్చదనం కోసం గ్యాస్ హీటర్లనే ఉపయోగిస్తారు. అంతేకాదు, యూరప్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీలో చాలా కంపెనీలు నడిచేది గ్యాస్తోనే. వీటికి గనుక గ్యాస్ సరఫరాలు తగ్గితే, మూతబడే పరిస్థితి నెలకొంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద కెమికల్ కంపెనీ అయిన బీఏఎస్ఎఫ్.. తమకు గ్యాస్ గనుక కోత పెడితే ప్లాంట్ను మూసేయాల్సి వస్తుందని ఇప్పటికే సంకేతాలిచ్చింది. రష్యా చౌక గ్యాస్ను కాదని, అమెరికా నుంచి భారీ ధరకు యూరప్ చేశాలు దిగుమతి చేసుకుంటుండటం మరో విచిత్రం. ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటున్న అమెరికా... యూరప్ దేశాలనూ ఆర్థికంగా కకావికలం చేస్తోందని అక్కడి ఆర్థికవేత్తలు మొత్తుకుంటున్నారు. ‘‘అమెరికాకు శత్రువుగా ఉండటం ప్రమాదకరం. కానీ మిత్రుడిగా ఉండటం ప్రాణాంతకం’’ అంటూ అమెరికా రాజనీతిజ్ఞుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత హెన్రీ ఎ. కిసింజర్ చేసిన వ్యాఖ్యలను వారు గుర్తు చేస్తున్నారు. మొత్తంమీద రష్యాపై ఎడాపెడా విధిస్తున్న ఆంక్షలు.. బ్యాక్ఫైర్ కావడంతో పశ్చిమ దేశాలు గిలగిలాకొట్టుకుంటున్నాయి. చైనా, భారత్కు ‘రష్యా క్రూడ్’ పంట! ఇదంతా ఒకెత్తయితే, ప్రపంచ క్రూడ్ వినియోగదారుల్లో రెండు, మూడు స్థానాల్లో ఉన్న చైనా, భారత్కు రష్యా–ఉక్రెయిన్ వార్ కాసులు కురిపిస్తోంది. అమెరికా, యూరప్ దేశాల ఆంక్షల కారణంగా నిలిచిపోయిన వాణిజ్యాన్ని రష్యా.. బ్రిక్స్ దేశాలు, ఇతరత్రా మిత్ర దేశాలకు మళ్లిస్తోంది. భారత్, చైనా వంటి దేశాలకు 30 శాతం మేర డిస్కౌంట్ రేటుకు క్రూడ్ ఇస్తుండటం విశేషం. ఉక్రెయిన్తో వార్ మొదలయ్యాక మూడు నెలల్లో రష్యా నుంచి చైనా రెట్టింపు స్థాయిలో 18.9 బిలియన్ డాలర్ల విలువైన ముడిచమురు, గ్యాస్, బొగ్గు కొనుగోలు చేసినట్లు అంచనా. ఇక భారత్ అయితే దాదాపు ఐదు రెట్లు అధికంగా 5.1 బిలియన్ డాలర్ల విలువైన క్రూడ్, బొగ్గు, ఇతర కమోడిటీలను రష్యా నుంచి దిగుమతి చేసుకుంది. వార్ మొదలయ్యాక తొలి 100 రోజుల్లో క్రూడ్, గ్యాస్ ఎగుమతుల ద్వారా రష్యా ఆర్జించిన మొత్తం 98 బిలియన్ డాలర్లు. ఇందులో 61 శాతం అంటే దాదాపు 58 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులను యూరప్ దేశాలే చేసుకోవడం విశేషం. ఆంక్షలు ఎంతలా విఫలమయ్యాయో చెప్పేందుకు ఈ లెక్కలు చాలు! - శివరామకృష్ణ మిర్తిపాటి -
‘తాజ్మహల్ కట్టకపోతే లీటర్ పెట్రోల్ రూ.40 కే వచ్చేది’.. మోదీపై ఒవైసీ సెటైర్లు
భోపాల్: ఒకవేళ షాజహాన్ తాజ్మహల్ను కట్టి ఉండకపోతే ఈ రోజు లీటర్ పెట్రోల్ ధర రూ.40 మాత్రమే ఉండేదని అన్నారు ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. బీజేపీ, ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ ఈ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అధికార కమలం పార్టీ దేశంలోని అన్ని సమస్యలకు మొగలులు, ముస్లింలనే నిందిస్తోందని ఆరోపించారు. 'దేశంలోని యువతకు ఉద్యోగాలు లేవు. ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరుగుతోంది. డీజిల్ లీటరు రూ.102కి చేరింది. వీటన్నింటికీ కారణం ఔరంగజేబు. ప్రధాని మోదీ కాదు. దేశంలోని నిరుద్యోగానికి అక్బర్ చక్రవర్తి బాధ్యత వహిస్తాడు. పెట్రోల్ ధర లీటర్ రూ.104-115కి చేరడానికి తాజ్మహల్ కట్టిన వ్యక్తే కారణం. ఒకవేళ షాజహాన్ తాజ్మహల్ కట్టి ఉండకపోతే లీటర్ పెట్రోల్ను ఇవాళ రూ.40కే అమ్మేవారు. ప్రధాని మోదీ. తాజ్మహల్, ఎర్రకోట కట్టి షాజహాన్ తప్పిదం చేశారని నేను అంగీకరిస్తాను. దానికి బదులు షాజహాన్ ఆ డబ్బునంతా ఆదా చేసి 2014 ఎన్నికల్లో మీకు ఇవ్వాల్సింది. దేశంలోని ప్రతి సమస్యకు ముస్లింలు, మొగలులే కారణమని ప్రచారం చేస్తున్నారు' అని ఒవైసీ బీజేపీపై విమర్శల దాడికి దిగారు. ఈమేరకు మధ్యప్రదేశ్లో ఓ బహిరంగ సభలో మాట్లాడిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. చదవండి👉🏻శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు.. మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు? देश में महंगाई, बेरोज़गारी, और बढ़ती पेट्रोल-डीज़ल की कीमतों का ज़िम्मेदार @narendramodi नहीं, मुग़ल हैं😜 - Barrister @asadowaisi https://t.co/KLDrUaOwMz — AIMIM (@aimim_national) July 4, 2022 భారత్ను కేవలం మొగలులే పాలించారా? అని ఒవైసీ.. మోదీని సూటిగా ప్రశ్నించారు? అశోకుడు, చంద్రగుప్త మౌర్యుడు పాలించలేదా? అని అడిగారు. బీజేపీకి మొగలులు మాత్రమే కన్పిస్తారని విమర్శించారు. ఆ పార్టీ ఒక కన్నుతో మొగలులను, మరో కన్నుతో పాకిస్థాన్ను చూస్తుందని ధ్వజమెత్తారు. మొగలులు, పాకిస్థాన్తో భారతీయ ముస్లింలకు ఎలాంటి సంబంధం లేదని ఒవైసీ అన్నారు. మహమ్మద్ అలీ జిన్నా ప్రతిపాదనను తిరస్కరించామని పేర్కొన్నారు. భారత్ తమ మాతృభూమి అని, చనిపోయే వరకు ఇక్కడే జీవిస్తామన్నారు. తమను వెళ్లగొట్టాలని ఎవరెన్ని నినాదాలు చేసినా పట్టించుకోమన్నారు. చదవండి👉🏻వ్యాక్సినేషన్ సక్సెస్ను వదిలేసి.. నా ఫొటోపై పడ్డారు -
మరాఠ ప్రజలకు కొత్త సీఎం షిండే బంపరాఫర్
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం కారణంగా కీలక పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. శివసేన రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటులో మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమిలో ఏక్నాథ్ షిండే ప్రభుత్వం ఏర్పడింది. నేడు(సోమవారం) సీఎం షిండే బల నిరూపణలో సైతం పూర్తి మెజార్టీతో విజయం సాధించింది. ఇదిలా ఉండగా.. సీఎం ఏక్నాథ్ షిండే సోమవారం మహారాష్ట్ర ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ప్రజా ఆకర్షణ చర్యల్లో భాగంగా.. ఇంధన ధరలను తగ్గించనున్నట్టు తెలిపారు. కొత్త కేబినెట్ సమావేశం తర్వాత పెట్రోల్, డీజిల్పై వ్యాట్ను తగ్గించనున్నట్టు స్పష్టం చేశారు. దీనిపై కేబినెట్ తర్వలోనే నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అయితే, గత ఏడాది నవంబర్లో, కేంద్రం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని రూ. 5, రూ. 10 తగ్గించింది. ఈ నేపథ్యంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఇంధన ధరలపై వ్యాట్ను తగ్గించాయి. ఇక, మేలో కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు వ్యాట్ను మరింత తగ్గించాయి. అయితే, ప్రజలకు ఉపశమన చర్యగా ఇంధనంపై వ్యాట్ను తగ్గించాలన్న ప్రధాని సూచనను ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తిరస్కరించాయి. కాగా, మహారాష్ట్రలో అప్పుడున్న ఉద్ధవ్ థాక్రే సర్కార్ వ్యాట్ను తగ్గించలేదు. తాజాగా ఏక్నాథ్ షిండే ప్రభుత్వం వ్యాట్ను తగ్గించనున్నట్టు తెలిపింది. ఇది కూడా చదవండి: ఉద్ధవ్ థాక్రేకే ఎందుకిలా.. ఎమ్మెల్యే ఇంత పనిచేస్తాడని ఊహించలేదు -
పెట్రో షాక్తో సీఎన్జీ వాహనాలకు గిరాకీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఒకవైపు ఇంధన ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలేమో ఖరీదు ఎక్కువ. ఈ నేపథ్యంలో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్తో (సీఎన్జీ) నడిచే వాహనాలు వినియోగదార్లకు ప్రత్యామ్నాయం అయ్యాయని ఎన్ఆర్ఐ (నోమురా రిసర్చ్ ఇన్స్టిట్యూట్) కన్సల్టింగ్, సొల్యూషన్స్ నివేదిక వెల్లడించింది. నివేదిక ప్రకారం.. 2021-22లో దేశంలో సీఎన్జీ వాహనాలు 2,65,383 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంత క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 55 శాతం ఎక్కువ. 2018 నాటికి దేశవ్యాప్తంగా 30.9 లక్షల యూనిట్ల సీఎన్జీ వెహికిల్స్ ఉంటే.. ఈ ఏడాది మార్చి నాటికి ఈ సంఖ్య 37.97 లక్షల యూనిట్లకు చేరుకుంది. బీఎస్-6 ఇంధన ప్రమాణాలు అమలయ్యాక యాజమాన్య ఖర్చులు తక్కువగా ఉండడంతో సీఎన్జీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అధిక ఇంధన సామర్థ్యంతో.. సాంకేతికత అందిపుచ్చుకున్న ఇక్కడి తయారీ కంపెనీలు తక్కువ ధరలో అధిక ఇంధన సామర్థ్యం ఉన్న సీఎన్జీ వేరియంట్లను ప్రవేశ పెడుతున్నాయి. సీఎన్జీ విక్రయ కేంద్రాలు విస్తరించడం, నియంత్రణ వ్యవస్థ మద్దతు ఈ విభాగం వృద్ధికి తోడ్పడుతోంది. మరోవైపు అధిక గ్యాస్ ధరలు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పరిశ్రమల నెట్వర్క్ విస్తరణను పరిమితం చేస్తాయి. వినియోగదారు అనుభవాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. బయో సీఎన్జీ పర్యావరణ సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారాన్ని అందిస్తుంది. భారత బయో సీఎన్జీ ఉత్పత్తి సామర్థ్యం పూర్తిగా చేరుకున్నట్లయితే.. దేశంలోని ప్రస్తుత సహజ వాయువు డిమాండ్ను తీర్చగలదు. 54 లక్షల అదనపు వాహనాలకు శక్తినివ్వగలదని అంచనా. -
శ్రీలంక సంక్షోభం, భగ్గుమన్న పెట్రోలు, లీటరు రూ.420
న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో మరోసారి ఇంధన ధరలు భగ్గుమన్నాయి. మంగళవారం పెట్రోల్ ధరను 24.3 శాతం, డీజిల్ ధరను 38.4 శాతం పెంచుతూ అక్కడి సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో ఆక్టేన్ 92 పెట్రోల్ ధర 420 రూపాయలు (1.17 డాలర్లు,) డీజిల్ రూ. 400 (1.11 డాలర్లు) కు చేరింది. ఏప్రిల్ 19 నుండి రెండోసారి ధరల పెంపుతో ఫ్యూయల్ ధరలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరాయి. తీవ్రమైన ఆర్థిక, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో విదేశీమారక నిల్వలు భారీగా క్షీణించాయి. దీంతో ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరాయి. సవరించిన ధరలు మంగళవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయని ప్రభుత్వరంగ సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రకటించింది. శ్రీలంకలో చమురు నిల్వలు అడుగంటిపోవడంతో అక్కడి వినియోగదారుల ఇక్కట్లు అన్నీఇన్నీ కావు. 1948లో స్వాతంత్య్రం పొందినప్పటి నుండి ఇంతటి సంక్షోభం ముందెన్నడూ లేదు. దాదాపు అన్ని నిత్యావసరాలకు తీవ్ర కొరత ఏర్పడింది. విదేశీ నిల్వల కొరత కారణంగా ఇంధనం, వంటగ్యాస్, ఇతర నిత్యావసరాలకోసం జనుల క్యూలైన్లలో బారులు తీరుతున్న పరిస్థితి. అయితే తీవ్ర ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం రేటు 40 శాతం దిశగా దూసుకుపోవడం, ఆహారం, ఇంధనం, ఔషధాల కొరతతో దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. శ్రీలంక తీవ్రమైన విదేశీ మారక ద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందున, ఇంధనం అడుగంటిపోకుండా నిరోధించే చర్యలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఖర్చులను తగ్గించే చర్యగా, ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని, ఆయా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను నిర్దేశించింది. రవాణా, ఇతర సేవా ఛార్జీల సవరణకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపిందనీ ఈ ఫార్ములా ప్రతి పదిహేను రోజులకోసారి లేదా నెలకోసారి వర్తింపజేస్తామని విద్యుత్,ఇంధన శాఖ మంత్రి కాంచన విజే శేఖర ట్విటర్లో తెలిపారు. (1) Fuel Price will be revised from 3am today. Fuel pricing formula that was approved by the cabinet was applied to revise the prices. Price revision includes all costs incurred in importing, unloading, distribution to the stations and taxes. Profits not calculated and included. — Kanchana Wijesekera (@kanchana_wij) May 23, 2022 (3) Public sector workforce will be called to work on the direction of the head of the institute from today. Work from home will be encouraged to minimize the use of fuel and to manage the energy crisis. pic.twitter.com/JVKrmSYnoc — Kanchana Wijesekera (@kanchana_wij) May 23, 2022 -
మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు
-
పెట్రో ధరల తగ్గింపుపై ప్రధాని మోదీ స్పందన
న్యూఢిల్లీ: దేశంలో చాలా కాలం తర్వాత తొలిసారి పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం సాయంత్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్పై రూ.8, డీజిల్పై రూ.6 మేర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరుస ట్వీట్లు చేశారు. దీంతో పెట్రోల్పై రూ.9.50, డీజిల్పై రూ.7 మేర తగ్గుతుందని ఆమె ప్రకటించారు. అయితే ఈ ప్రకటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాసేపటి క్రితం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రజల ప్రయోజనాలే తమకు తొలి ప్రాధాన్యమంటూ ఆయన సదరు ట్వీట్లో వ్యాఖ్యానించారు. శనివారం తీసుకున్న కీలక నిర్ణయాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గేలా తీసుకున్న నిర్ణయంతో పలు రంగాలకు సానుకూల ప్రభావం లభించనుందని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయంతో దేశ ప్రజలకు ఊరట లభించనుందని, వారి జీవితాలను మరింత సులభతరం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు తన ట్వీట్కు నిర్మలా సీతారామన్ పెట్రో ధరలను తగ్గిస్తూ చేసిన ట్వీట్ను ఆయన జత చేశారు. It is always people first for us! Today’s decisions, especially the one relating to a significant drop in petrol and diesel prices will positively impact various sectors, provide relief to our citizens and further ‘Ease of Living.’ https://t.co/n0y5kiiJOh — Narendra Modi (@narendramodi) May 21, 2022 Ujjwala Yojana has helped crores of Indians, especially women. Today’s decision on Ujjwala subsidy will greatly ease family budgets. https://t.co/tHNKmoinHH — Narendra Modi (@narendramodi) May 21, 2022 -
‘మోదీగారు.. వంటగ్యాస్ ధర తగ్గించండి’.. సబితా ఇంద్రారెడ్డి గట్టి కౌంటర్
మీర్పేట: ప్లీజ్ తెలంగాణలో ఒక్కసారి అధికారం ఇవ్వండని బీజేపీ నాయకుల అభ్యర్థనకు ‘ప్లీజ్ మోదీగారు వంటగ్యాస్, ఇంధన ధరలు తగ్గించండి’ అంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. దేశంలో నిత్యం పెరిగిపోతోన్న గ్యాస్ ధరలను నిరసిస్తూ ఆదివారం రంగారెడ్డి జిల్లా మీర్పేటలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చీపుళ్లు తిరగేస్తారనే భయంతోనే తుక్కుగూడలో జరిగిన బీజేపీ సభకు మహిళలను ఆహ్వానించలేదన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ ఒక్కో రంగాన్ని ఎంచుకుని అభివృద్ధి చేస్తున్నారని తెలిపా రు. కల్యాణలక్ష్మి, రైతుబంధు, వృద్ధులు, ఒంటరి మహిళలకు ప్రతి నెలా రూ.2వేల పింఛను ఇస్తుంటే..మరి కేంద్రం గ్యాస్ ధరలు ఎందుకు తగ్గించడం లేదని మహిళలు ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ సభలో అమిత్షా రాష్ట్రానికి, ప్రజలకు ఉపయోగపడేది ఏ ఒక్కటీ మాట్లాడలేదని.. అసలు సభ ఎందుకు పెట్టినట్లని ఆమె సూటిగా ప్రశ్నించారు. బాలాపూర్ చౌరస్తాలో టీఆర్ఎస్ శ్రేణుల మహాధర్నా. (ఇన్సెట్లో) కట్టెలపొయ్యిపై వంట చేస్తున్న మంత్రి సబిత రానున్న రోజుల్లో మహిళల ఆగ్రహానికి బీజేపీ గురికాకతప్పదని హెచ్చరించారు. హిందూ, ముస్లింల పేరిట విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. బీజేపీ నాయకులు ప్రజల్లోకి వస్తే గ్యాస్, ఇంధన ధరలు తగ్గించేంత వరకు తమ వద్దకు రావద్దని మహిళలే వారిని తరిమి కొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే జీవో నంబర్ 111ను ఎత్తివేస్తామని బండి సంజయ్ చెప్పారని, దానిపై ఆయనకు అవగాహన లేదని, ఓ వైపు 111 జీవోను ఎత్తివేస్తేనే ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రానికి అన్ని రూ.కోట్లు ఇచ్చామంటూ కిషన్రెడ్డి, అమిత్షా పచ్చి అబద్ధాలు మాట్లాడారని దుయ్యబట్టారు. సంక్షేమ పథకాలకు డబ్బులు ఇస్తున్నామని చెబుతున్న వారు ఇవే పథకాలను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రికార్డు స్థాయికి ఏటీఎఫ్ రేటు..
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఇంధన ధరలు ఎగిసిన నేపథ్యంలో దేశీయంగా విమాన ఇంధన (ఏటీఎఫ్) రేట్లు రికార్డు స్థాయికి పెరిగాయి. ప్రభుత్వ రంగ ఇంధనాల మార్కెటింగ్ సంస్థలు ఏటీఎఫ్ రేటును ఆదివారం 3.22 శాతం పెంచాయి. దీంతో ఢిల్లీలో కిలోలీటరు ధర రూ. 3,649.13 మేర పెరిగి రూ. 1,16,851.46 (లీటరు రేటు రూ. 116.8)కి చేరింది. ఏటీఎఫ్ రేట్లను పెంచడం ఈ ఏడాది వరుసగా ఇది తొమ్మిదోసారి. ముంబైలో కిలో లీటరు ధర రూ. 1,15,617.24కి, కోల్కతాలో రూ. 1,21,430.48కి, చెన్నైలో రూ. 1,20,728.03కి చేరింది. స్థానిక పన్నుల ఆధారంగా రాష్ట్రాన్ని బట్టి రేట్లు మారతాయి. మరోవైపు, పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 25వ రోజూ యధాతథంగానే కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో రేట్లను బట్టి విమాన ఇంధనం ధరలను ప్రతి నెలా పదిహేను రోజులకోసారి, పెట్రోల్..డీజిల్ రేట్లను రోజువారీ సవరిస్తారు. -
రిలయన్స్, ఓఎన్జీసీకి బొనాంజా
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసే సహజ వాయువుకు ప్రభుత్వం నిర్దేశించిన ధరలు ఏప్రిల్ 1 నుంచి మారనున్నాయి. గతేడాది కాలంగా ఇంధన ధరలు గణనీయంగా ఎగియడాన్ని పరిగణనలోకి తీసుకోనుండటంతో రేట్లు భారీగా పెరగనున్నాయి. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ తదితర గ్యాస్ ఉత్పత్తి సంస్థలకు ప్రయోజనం చేకూరనుంది. ఓఎన్జీసీకి నామినేషన్ ప్రాతిపదికన కేటాయించిన క్షేత్రాల నుంచి వెలికితీసే గ్యాస్ రేటు ప్రస్తుత 2.9 డాలర్ల నుంచి 5.93 డాలర్లకు (యూనిట్ – ఎంబీటీయూ) పెరగనుంది. అలాగే రిలయన్స్, దాని భాగస్వామ్య సంస్థ బీపీకి చెందిన కేజీ–డీ6 బ్లాక్లో సంక్లిష్టమైన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ ధర 6.13 డాలర్ల నుంచి 9.9–10.1 డాలర్లకు పెరగనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2019 ఏప్రిల్ తర్వాత ఈ గ్యాస్ రేట్లు పెరగడం ఇది రెండోసారి. అమెరికా, రష్యా తదితర గ్యాస్ మిగులు దేశాల్లో నిర్దిష్ట కాలంలో ధరలకు అనుగుణంగా దేశీయంగా సహజ వాయువు రేట్లను కేంద్రం ఆర్నెల్లకోసారి (ఏప్రిల్ 1, అక్టోబర్ 1) రేట్లను సవరిస్తుంది. ప్రస్తుతం 2021 జనవరి–డిసెంబర్ మధ్య కాలంలో అంతర్జాతీయంగా గ్యాస్ ధరలను బట్టి ఈ ఏడాది ఏప్రిల్ 1–సెప్టెంబర్ 30 మధ్య కాలానికి ప్రభుత్వం రేటు నిర్ణయించనుంది. గతేడాది రేటు భారీగా పెరిగిపోవడంతో ఆ ప్రభావం ఈ ఏడాది నిర్ణయించే గ్యాస్ ధరలపై పడనుంది. గ్యాస్ రేటు పెరగడం వల్ల ఎరువుల ఉత్పత్తి వ్యయం పెరగనుంది. అయితే, ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తున్నందున రేట్ల పెంపు పెద్దగా ఉండకపోవచ్చు. అలాగే, విద్యుదుత్పత్తి వ్యయాలూ పెరిగినా.. దేశీయంగా గ్యాస్ నుంచి విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా లేనందున.. వినియోగదారులపై అంతగా ప్రభావం ఉండదు. -
ఫ్లైట్ ఫ్యూయల్ ఆల్టైం హై! కిలో లీటరు ధర రూ. 1.10 లక్షలు
న్యూఢిల్లీ: దేశంలో విమాన ఇంధన ధరలు కనీనివినీ ఎరుగని స్థాయికి చేరాయి. అంతర్జాతీయంగా చమురు ధర బహుళ సంవత్సరాల గరిష్ట స్థాయికి పెరిగిన తర్వాత భారత్లో తొలిసారిగా కిలోలీటర్ (1,000 లీటర్లు) ధర రూ.1 లక్ష దాటి ఆల్టైమ్ హై రికార్డు నమోదు చేసింది. విమానాల్లో వాడే ఇంధనం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) కిలోలీటర్ ధర ఢిల్లీలో 18.3 శాతం ఎగసి రూ.1,10,666.29కు చేరింది. ఈ ఏడాది ధర పెరగడం ఇది ఆరవసారి. గడిచిన పక్షం రోజులలో సగటు అంతర్జాతీయ ధర ఆధారంగా జెట్ ఇంధన ధరలు ప్రతి నెల 1, 16వ తేదీల్లో సవరిస్తున్నారు. 2022 జనవరి 1 నుంచి చూస్తే కిలో లీటర్కు మొత్తం రూ.36,643.88 ఎగసింది. అంటే దాదాపు 50 శాతం అధికమైంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సరఫరా సమస్యలు తలెత్తుతాయన్న భయాల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఆయిల్ ధర బ్యారెల్కు గత వారం 14 ఏళ్ల గరిష్టం 140 డాలర్లకు చేరింది. ధర ప్రస్తుతం 100 డాలర్లకు వచ్చి చేరింది. విమానయాన సంస్థ నిర్వహణ వ్యయంలో జెట్ ఇంధనం వాటా దాదాపు 40 శాతం వరకు ఉంటుంది. 2008 ఆగస్ట్లో ఏటీఎఫ్ ధర రూ.71,028.26 నమోదైంది. ఆ సమయంలో అంతర్జాతీయంగా క్రూడ్ ధర బ్యారెల్కు 147 డాలర్లుంది. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు గతేడాది నవంబర్ 4 నుంచి భారత్లో అదే రీతిలో కొనసాగుతున్నాయి. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యమే ఇందుకు కారణం. ఎల్పీజీ ధరలో సైతం 2021 అక్టోబర్ నుంచి ఎటువంటి మార్పు లేదు. -
నష్టాల ఊబిలో ఏవియేషన్
ముంబై: విమానయాన పరిశ్రమకు ప్రస్తుత ఆర్థిక సంవత్సంలోనూ భారీ నష్టాలు తప్పవని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది. రూ.25,000–26,000 కోట్ల మేర నష్టాలను నమోదు చేయవచ్చంటూ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. జెట్ ఇంధన ధరలు (ఏటీఎఫ్) పెరిగిపోవడం, టికెట్ చార్జీలపై పరిమితులు కంపెనీలకు ప్రతికూల అంశాలుగా తెలిపింది. తదుపరి ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ నష్టాలు రూ.14,000–16,000 కోట్లకు తగ్గుతాయని అంచనా వేసింది. 2022 నుంచి 2024 ఆర్థిక సంవత్సరాల మధ్య పరిశ్రమకు అదనంగా రూ.20,000–22,000 కోట్ల వరకు నిధుల అవసరం ఉంటుందని తెలిపింది. పెరిగిన రద్దీ దేశీయ ప్రయాణికుల రద్దీ వార్షికంగా చూస్తే 2021–22లో 50–55 శాతం మేర వృద్ధి చెందుతుందని ఇక్రా పేర్కొంది. టీకాలు ఎక్కువ మందికి ఇవ్వడం, ఆంక్షలు సడలిపోవడం అనుకూలించే అంశాలని తెలిపింది. అయినప్పటికీ కరోనా ముందస్తు గణాంకాలతో పోలిస్తే తక్కువగానే ఉంటుందని అంచనా వేసింది. 2023–24 సంవత్సరంలోనే కరోనా ముందున్న స్థాయికి విమాన ప్రయాణికుల రద్దీ చేరుకుంటుందని పేర్కొంది. కరోనా రెండో విడత తీవ్రంగా ఉండడం, ఆ వెంటే ఒమిక్రాన్ వెలుగు చూడడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల రద్దీ పెరుగుదల నిదానంగా ఉన్నట్టు వివరించింది. వ్యయాల భారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 11 నెలల్లో ఏటీఎఫ్ సగటు ధరలను పరిశీలించినప్పుడు, గతేడాదితో పోలిస్తే 68 శాతం పెరిగాయని.. అదే సమయంలో టికెట్ చార్జీలపై పరిమితులు నష్టాలకు దారితీస్తున్నట్టు ఇక్రా వైస్ ప్రెసిడెంట్ సుప్రియో బెనర్జీ తెలిపారు. ఇక అంతర్జాతీయ విమాన సర్వీసులకు త్వరలో అనుమతిస్తుండడం, ఒమిక్రాన్ తగ్గిపోవడంతో రానున్న ఆర్థిక సంవత్సరంలో (2022–23)లో ప్రయాణికుల రద్దీ పుంజుకుంటుందని ఇక్రా తెలిపింది. ఎయిర్లైన్స్ రుణ భారం తక్కువగా ఉండడం వచ్చే ఆర్థిక సంవత్సరంలో నికర నష్టాలు తగ్గేందుకు సాయపడుతుందని పేర్కొంది. ఉక్రెయిన్–రష్యా సంక్షోభం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిపోవడంతో 2022–23 సంవత్సరంలో ఏటీఎఫ్ కోసం ఎయిర్లైన్స్ అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఎయిర్ ఇండియా విక్రయానికి ముందు రుణ భారం గణనీయంగా తగ్గించుకున్న విషయాన్ని ప్రస్తావించింది. ఇంధన ధరలు పెరగడంతోపాటు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని భారత ఏవియేషన్ పరిశ్రమపై నెగెటివ్ అవుట్లుక్ (ప్రతికూల దృక్పథం)ను కొనసాగిస్తున్నట్టు ఇక్రా ప్రకటించింది. పనితీరును మెరుగుపరుచుకోవడం, రుణభారాన్ని తగ్గించుకునే వరకు భారత ఎయిర్లైన్స్పై ఒత్తిళ్లు కొనసాగుతాయని తెలిపింది. -
ఎయిర్లైన్స్కు ఈ ఏడాదీ కష్టకాలమే
ముంబై: కరోనా వచ్చిన దగ్గర్నుంచి విమానయాన రంగం (ఎయిర్లైన్స్) కోలుకోకుండా ఉంది. కరోనా మూడో విడత రూపంలో విస్తరిస్తూ ఉండడం, పెరిగిన ఇంధన (ఏటీఎఫ్) ధరలు వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) మొత్తం మీద ఎయిర్లైన్స్కు రూ.20,000 కోట్ల నష్టాలు రావచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం (2021–21)లోనూ ఎయిర్లైన్స్ సంస్థలు రూ.13,853 కోట్ల నష్టాలను మూటగట్టుకున్నాయి. వీటితో పోలిస్తే నష్టాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 44 శాతం మేర పెరగనున్నాయని క్రిసిల్ నివేదిక పేర్కొంది. దీంతో ఈ రంగం కోలుకోవడానికి మరింత సమయం పట్టొచ్చని అంచనా వేసింది. 2022–23 ఆర్థిక సంత్సరం తర్వాతే రికవరీ ఉండొచ్చని పేర్కొంది. దేశీయంగా 75 శాతం మార్కెట్ వాటా కలిగిన ఇండిగో, స్పైస్జెట్, ఎయిర్ఇండియా గణాంకాల ఆధారంగా క్రిసిల్ ఈ నివేదికను రూపొందించింది. దేశీయ మార్కెట్ కోలుకుంది.. కరోనా మహమ్మారి దెబ్బకు 2020లో విమాన సర్వీసులు దేశీయంగా చాలా పరిమితంగా నడిచాయి. 2021 డిసెంబర్ నాటికి కానీ ప్రయాణికుల రద్దీ కోలుకోలేదు. కరోనా పూర్వపు నాటి గణాంకాలతో పోలిస్తే 86 శాతానికి పుంజుకుంది. కానీ మరో విడత కరోనా ఉధృతితో 2022 జనవరి మొదటి వారంలో 25 శాతం రద్దీ తగ్గిపోయినట్టు క్రిసిల్ తెలిపింది. కరోనా రెండో విడతలో 2021 ఏప్రిల్–మే నెలలోనూ ఇదే మాదిరి 25 శాతం మేర క్షీణత నమోదైనట్టు గుర్తు చేసింది. అంతర్జాతీయ రెగ్యులర్ విమాన సర్వీసులు ఈ ఏడాది జనవరి తర్వాతే ప్రారంభం కావచ్చని క్రిసిల్ పేర్కొంది. ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్ (విమానంలో ప్రయాణికుల భర్తీ) 2021 మే నెలలో 50 శాతంగా ఉండగా.. 2021 డిసెంబర్ నాటికి 80 శాతానికి పెరిగింది. ఆరు నెలల్లో రూ.11,323 కోట్ల నష్టం ‘మూడు ప్రధాన ఎయిర్లైన్స్ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే (2021 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు) రూ.11,323 కోట్ల నష్టాలను నమోదు చేశాయి. కాకపోతే దేశీయ విమాన సర్వీసులు బాగా పుంజుకోవడంతో మూడో త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) మెరుగైన ఆదాయం కొంత వరకు నష్టాలను సర్దుబాటు చేసుకునేందుకు మద్దతుగా నిలిచాయి. కానీ, కరోనా మూడో విడత కారణంగా వచ్చిన ఆంక్షల ప్రభావంతో నాలుగో త్రైమాసికంలో (2021 జనవరి–మార్చి) నష్టాలు గణనీయంగా పెరగనున్నాయి. దీంతో ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఎయిర్లైన్స్ భారీ నష్టాలు నమోదు చేస్తాయని అంచనా వేస్తున్నాం’ అని క్రిసిల్ డైరెక్టర్ నితేశ్ జైన్ తెలిపారు. ఏటీఎఫ్ ధర 2021 నవంబర్లో లీటర్కు గరిష్టంగా రూ.83కు చేరింది. 2020–21లో సగటు ఏటీఎఫ్ ధర లీటర్కు రూ.44గానే ఉంది. ఇంధన ధరలు రెట్టింపు కావడం, ట్రాఫిక్ తగ్గడం నష్టాలు పెరిగేందుకు కారణంగా క్రిసిల్ వివరించింది. దీంతో ఎయిర్లైన్స్ రుణ భారం కూడా పెరిగిపోతుందని అంచనా వేసింది. -
తాలిబన్ల వల్లే పెట్రోల్ ధర పెరిగింది: బీజేపీ ఎమ్మెల్యే
బెంగళూరు: అఫ్గనిస్తాన్లో తాలిబన్ల అరాచకం ప్రారంభం అయిన నాటి నుంచి మన దేశంలో వారి ప్రస్తావన బాగా పెరిగింది. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు కురిపించుకునే క్రమంలో నేతలను తాలిబన్లతో పోలుస్తూ.. తిడుతున్నారు. మరి కొందరు నాయకులు ఓ అడుగు ముందుకు వేసి.. దేశంలో ఇంధన ధరలు, వంట గ్యాస్ ధరలు పెరగడానికి కారణం తాలిబన్లే అని స్పష్టం చేశారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ఈ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఆ వివరాలు.. కర్ణాటక హుబ్లీ-ధార్వాడ్ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బల్లాడ్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో అరవింద్ మాట్లాడుతూ.. ‘‘అఫ్గనిస్తాన్లో తాలిబన్ల సంక్షోభం ముదురుతుంది. అందువల్ల ముడి చమురు సరఫరాలో తగ్గుదల ఉంది. ఫలితంగా ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ఓటర్లుకు ఈ అంతర్జాతీయ పరిణామాల గురించి అర్థం చేసుకునేంత జ్ఞానం లేదు. ఊరికే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. (చదవండి: చౌకగా పెట్రోల్ కావాలా?, అయితే, అఫ్గానిస్తాన్ వెళ్లండి: బీజేపీ నేత) అరవింద్ వ్యాఖ్యలపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అఫ్గన్లో తాలిబన్ల సంక్షోభం మొదలై నెల రోజులు అవుతుందేమో. కానీ దేశంలో గత కొద్ది నెలల నుంచి ఇంధన ధరలు వరుసగా పెరుగుతున్నాయి. దీనికి తాలిబన్లతో ముడిపెట్టడం ఏంటి.. పైగా జనాలకు జ్ఞానం లేదని బుద్ధిలేని వ్యాఖ్యలు చేసి.. నీ తెలివితేటలు ప్రదర్శించుకున్నావ్ అంటూ పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు జనాలు. (చదవండి: అఫ్గన్లో ప్రభుత్వ ఏర్పాటు: రంగంలోకి దిగిన పాక్) ఇక ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. ఇక రాయిటర్స్ ప్రకారం ఈ ఏడాది జూలై నాటికి ఇరాక్, సౌదీ అరేబియా, యూనైటెడ్ అరబ్ ఎమిరెట్స్, నైజిరియా, అమెరికా, కెనడా దేశాలు భారత్కు ముడి చమురు విక్రయిస్తున్న ప్రధాన దేశాల జాబితాలో ఉన్నాయి. ఈ లిస్ట్లో అఫ్గనిస్తాన్ లేదు. ఈ క్రమంలో దేశంలో ఇంధన ధరల పెరుగుదలకు.. అఫ్గనిస్తాన్లో తాలిబన్ల సంక్షోభానికి ముడి పెట్టడం పట్ల జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ ఇంధన ధరల పెంపు అంశంలో కేంద్రంపై భారీ ఎత్తున విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇంధన ధరలు పెంచుతూ ఇప్పటికే సుమారు 23 లక్షల కోట్ల రూపాయలు సంపాదించింది అని ఆరోపించారు. 2014 నుంచి ఇప్పటి వరకు పెట్రోల్ ధరలు 44 శాతం, డీజిల్ ధరలు 55 శాతం పెరిగినట్లు రాహుల్ గాంధీ విమర్శించారు. చదవండి: అది తాలిబన్ల అఘాయిత్యం కాదు.. సంబురం -
చౌకగా పెట్రోల్ కావాలా?, అయితే, అఫ్గానిస్తాన్ వెళ్లండి: బీజేపీ నేత
భోపాల్: కరోనా మహమ్మారి దేశాన్ని ఆరోగ్యపరంగా, ఆర్థికంగా కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటాయి. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటగా.. సామాన్యులు పెరిగిన ఇంధన ధరలతో బెంబేలెత్తుతున్నారు. తాజాగా ఇంధన ధరలపై ప్రశ్నించిన మీడియా మిత్రులతో మధ్యప్రదేశ్కు చెందిన బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘పెట్రోల్, డీజిల్ తక్కువ ధరకు కావాలంటే అఫ్గనిస్తాన్ కి వెళ్లండి.. అక్కడైతే చౌకగా పెట్రోల్ దొరుకుతుంది’ అంటూ మండిపడ్డారు. కట్నిలో ఓ కార్యక్రమానికి హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామ్రతన్ పాయల్ని ఇంధన ధరలపై ప్రశిస్తే.. ‘తాలిబన్ పాలిత ప్రాంతానికి వెళ్ళండి. అక్కడ పెట్రోల్ రూ.50కే దొరుకుతుందంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు వివరణగా.. కరోనా సెకండ్ వేవ్ వచ్చి దేశాన్ని అతలా కుతలం చేసిందని.. త్వరలో థర్డ్ వేవ్ రాబోతుందన్నారు. ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో ఇంధన ధరల బదులుగా కోవిడ్ మూడవ వేవ్ గురించి ఆలోచించాలని రిపోర్టర్కు సూచించారు. అయితే, ఈ కార్యక్రమంలో రామ్ రతన్ పాయల్, మరికొంతమంది బీజేపీ కార్యకర్తలు ఎవరూ మాస్క్లు ధరించలేదు. ఇక బీజేపీ నేత తీరుపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. తప్పులను కప్పి పుచ్చుకునేందుకే ఇలా చౌకబారు మాటలు మట్లాడుతున్నారని మండిపడింది. ఇదిలా ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.84 ఉండగా.. డీజిల్ ధర రూ.89.27 ఉంది. -
స్థిరంగా పెట్రో ధరలు, ఏ నెలలో ఎన్నిసార్లు పెరిగాయో తెలుసా?
దేశంలో డీజిల్,పెట్రోల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గురువారం రోజు చమురు ధరలు స్వల్పంగా పెరిగినా శుక్రవారం,శనివారం వాటి ధరలు అలాగే స్థిరంగా ఉన్నాయి. ముఖ్యంగా మే 4 నుంచి కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, తమిళనాడు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరువాత చమరు ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో 4నుంచి మే 27 మధ్యకాలంలో 14 సార్లు, జూన్ నెలలో 16సార్లు, జులై నెలలో(ఈరోజు వరకు) 8 సార్లు పెరిగాయి. కాగా,చమురు ఉత్పత్తి చేసే దేశాల కూటమి(ఒపెక్) లతో జరిగే చర్చల్లో ఎలాంటి మార్పు కనబడడం లేదు. ఇప్పుడు అదే అంశం పెట్రో ధరలపై పడినట్లు తెలుస్తోంది. ఇక శనివారం రోజు పెట్రోల్ డీజిల్ ధరలు వివరాలు హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.52గా ఉండగా డీజిల్ ధర రూ. 97.96గా ఉంది న్యూఢిల్లీలో పెట్రోల్ ధర రూ.101.54 గా ఉండగా డీజిల్ ధర రూ.89.87 గా ఉంది చెన్నైలో పెట్రోల్ ధర రూ. 102.23 గా ఉండగా డీజిల్ ధర రూ.94.39 గా ఉంది. ముంబైలో పెట్రోల్ ధర రూ. 107.54 గా ఉండగా డీజిల్ ధర రూ. 97.45గా ఉంది. బెంగళూరులో పెట్రోల్ ధర రూ.104.94 గా ఉండగా డీజిల్ ధర రూ. రూ.95.26 గా ఉంది. విశాఖ పట్నంలో పెట్రోల్ ధర రూ.106.5 గా ఉండగా డీజిల్ ధర రూ. రూ.98.43గా ఉంది. -
తెలుగుగడ్డపై సెంచరీ దాటిన డీజిల్
హైదరాబాద్ : పెట్రోలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయంటూ మరోసారి ధరలు పెంచాయి చమురు కంపెనీలు. ఈసారి లీటరు పెట్రోలుపై రూ. 43 పైసలు, లీటరు డీజిల్పై రూ. 34 పైసుల వంతున ఛార్జీలు పెంచాయి. ఇలా వరుసగా పెరుగుతున్న ధరలతో తెలుగు గడ్డపై లీటరు డీజిల్ ధర సెంచరీ దాటింది. ఏపిలో చిత్తూరు జిల్లాలో లీటరు డీజిల్ ధర రూ. 100.25కి చేరుకుంది. ఇక్కడ పెట్రోలు ధర 107.82గా ఉంది. మిగిలిన జిల్లాలలో సెంచరీకి చేరువగా వచ్చింది. హైదరాబాద్లో లీటరు పెట్రోలు రూ. 104.93, లీటరు డీజిల్ 98.02గా ఉంది. ఇదే అత్యధికం జులైలో నెలలో ఇప్పటి వరకు ఆరు సార్లు పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. గరిష్టంగా లీటరు పెట్రోలుపై 36 పైసలు అత్యధికంగా ధర పెరిగింది. కానీ శనివారం పెరిగిన ధరల్లో లీటరు పెట్రోలుపై 43 పైసల వంతున ధర పెంచారు. ఇంకా పెరగొచ్చు ఒపెక్ దేశాల వైఖరితో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. దీనికి తగ్గట్టే రాబోయే రోజుల్లో దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడం ఖాయంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏమైనా చర్యలు తీసుకుంటే తప్ప పెట్రోలు, డీజిల్ ధరలు ఇప్పట్లో తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. -
ఇండిగోకు ఇంధన సెగ..
-
ఇండిగోకు ఇంధన సెగ..
న్యూఢిల్లీ: ఇంధన ధరలు పెరిగిపోవడం, కరెన్సీ మారకం విలువ తగ్గడం విమానయాన సంస్థ ఇండిగో లాభాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ నికర లాభం ఏకంగా 75 శాతం క్షీణించి రూ.191 కోట్లకు పడిపోయింది. 2017–18 క్యూ3లో ఇండిగో రూ.762 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. సమీక్షా కాలంలో ఇండిగో మొత్తం ఆదాయం మాత్రం 28 శాతం పెరిగి రూ.6,409 కోట్ల నుంచి రూ.8,229 కోట్లకు చేరుకుంది. అధిక ఇంధన ధరలు, కరెన్సీ పతనం తదితర అంశాలు లాభదాయకతపై ప్రతికూల ప్రభావం చూపాయని కంపెనీ పేర్కొంది. బీఎస్ఈలో బుధవారం ఇండిగో షేరు 0.89 శాతం క్షీణించి రూ. 1,108 వద్ద క్లోజయ్యింది. -
అప్పుల కుప్ప.. ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ.. రూట్ తప్పింది. నష్టాలబాటలో సాగుతోంది. ఆర్థికభారంతో ఆగమాగమవుతోంది. టీఎస్ ఆర్టీసీకి ఇప్పటికే ఉన్న ఆర్థిక సమస్యలకుతోడు రోజురోజుకు పెరుగుతున్న ఇంధనధరలు మరింత కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. సంస్థకు రూ.3,000 కోట్ల వరకు అప్పులున్నాయి. ఏటా రూ.250 కోట్ల వరకు వడ్డీలు చెల్లిస్తోంది. దీనికితోడు నిర్వహణపరంగా ఏటా రూ.700 వరకు నష్టం వాటిల్లుతోంది. నెలనెలా నష్టాలు పెరుగుతుండటం ఆర్టీసీని కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ నాటికి రూ.273.15 కోట్ల నష్టాలు వాటిల్లడం ఆర్టీసీ యాజమాన్యానికి ఆందోళన కలిగిస్తోంది. కేవలం 6 నెలల్లో ఇంత భారీగా నష్టాలు రావడం గమనార్హం. గత ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ నాటికి రూ.241 కోట్ల నష్టాలు వచ్చాయి. గతేడాదితో పోలిస్తే రూ.32 కోట్లు అధికంగా నష్టాలు రావడం గమనార్హం. -
18 రోజులు.. రూ.4 తగ్గింపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా చమురు ధరలు దిగిరావడంతో దేశంలో 18 రోజుల వ్యవధిలో పెట్రోల్ ధర లీటరుకు రూ.4.05 తగ్గింది. అలాగే డీజిల్ ధర లీటరుకు రూ.2.33 తగ్గింది. ఆదివారం నాడు లీటరు పెట్రోల్ ధర 21 పైసలు, డీజిల్ ధర 17 పైసలు పతనమైంది. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 78.78, డీజిల్ ధర రూ.73.36 వద్ద కొనసాగుతోంది. ముంబైలో పెట్రోల్ రూ. 82.28, డీజిల్ రూ.76.88 వద్ద అమ్ముడవుతోంది. అక్టోబర్ 18 నుంచి ఇంధన ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతకుముందు, ఆగస్టు 16–అక్టోబర్ 4 మధ్య పెట్రోల్ ధర లీటరుకు రూ.6.86, డీజిల్ ధర లీటరుకు రూ.6.73 పెరిగింది. -
రూ. 2.94 పెరిగిన సబ్సిడీ ఎల్పీజీ ధర
న్యూఢిల్లీ: సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.2.94 పెరిగింది. దీంతో బుధవారం అర్ధరాత్రి నుంచి 14.2 కిలోల సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.505.34కు చేరుకుంది. సబ్సిడీయేతర ఎల్పీజీ ధర సిలిండర్కు రూ.60 పెరిగి రూ. 880కు చేరింది. జూన్ నుంచి సబ్సిడీ సిలిండర్ ధర పెరగడం ఇది వరుసగా ఆరో నెల కావడం గమనార్హం. మార్కెట్లో ఇంధన ధరల ఆధారంగా ఎల్పీజీపై జీఎస్టీని గణిస్తారు. ధరపై ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చినా పన్నును మాత్రం మార్కెట్ రేట్ ప్రకారం చెల్లించాలి. దీని వల్లే తాజాగా ఎల్పీజీ ధర పెరిగిందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. -
13వ రోజూ తగ్గిన పెట్రోలు ధర
సాక్షి, న్యూఢిల్లీ: దిగి వస్తున్న పెట్రో ధరలు వాహనదారులకు ఊరటనిస్తున్నాయి. వరుసగా 13వరోజు కూడా పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి. మంగళవారం, పెట్రోలు పై 20 పైసలు, డీజిల్పై 7 పైసలు ధరను దేశీయ కంపెనీలు తగ్గించాయి. దీంతో ఢిల్లీలో లీటరుకు పెట్రోలు ధర రూ. 79.55 గాను, డీజిల్ ధర లీటరుకు రూ. 73.78 గా ఉంది. ముంబైలో పెట్రోలు లీటరు ధర. 85.04, డీజిల్ ధర లీటరుకు రూ. 77.32 పలుకుతోంది.. కోలకతా : పెట్రోలు లీటరు ధర రూ. 81.63, డీజిల్ ధర లీటరుకు రూ .75.70 చెన్నై: పెట్రోలు లీటరు ధర రూ. 82.86 , డీజిల్ ధర లీటరుకు 78.08 రూపాయలు హైదరాబాద్ : పెట్రోలు లీటరు ధర రూ. 84.33, డీజిల్ ధర లీటరుకు రూ.80.25 విజయవాడ : పెట్రోలు లీటరు ధర రూ.83.47, డీజిల్ ధర లీటరుకు రూ. 79 లు అంతర్జాతీయ చమురు ధరలు తగ్గుముఖం పడుతున్న కారణంగా దేశీయంగా ఇంధన ధరలు ఆరు వారాల కనిష్ఠానికి చేరాయి. రానున్న రోజుల్లో ఇవి మరింత దిగి వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
గుడ్న్యూస్: దిగి వస్తున్న పెట్రో ధరలు
సాక్షి,న్యూఢిల్లీ: ఇటీవల చుక్కలు చూపించిన ఇంధన ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా 12వ రోజు కూడా పెట్రో ధరలు తగ్గాయి. ఇటీవల ఆల్ టైం గరిష్టాలను తాకిన ఇంధన ధరలు అంతర్జాతీయంగా ధరలు తగ్గడంతో తాజాగా ఆరువారాల కనిష్ఠానికి దిగి వచ్చాయి. ఈ నెల 18 నుంచి అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుతుండటంతో దేశంలో ఇంధన సంస్థలు కూడా ఆ మేరకు ధరలను తగ్గించాయి. సోమవారం ఢిల్లీలో లీటరుకు పెట్రోలు ధర 30 పైసలు తగ్గిన 79.75గా ఉంది. డీజిల్ ధర లీటరుకు 20 నుంచి తగ్గి రూ. 73.85గా ఉంది. ముంబైలో పెట్రోలు లీటరుకు 85.24 రూపాయలుగా ఉండగా, డీజిల్ ధర లీటర్కు 77.40 రూపాయలుగా ఉంది. పెట్రోల్పై 30పైసలు, డీజిల్పై 21 చొప్పున ధర తగ్గింది. హైదరాబాద్: పెట్రోల్ లీటరు ధర రూ.84.54, డీజిల్ లీటరు ధర రూ.80.33గా ఉంది. విజయవాడ: పెట్రోలు ధర రూ.83.65, డీజిల్ లీటరు ధర రూ. 79.08 పలుకుతోంది. కోలకతా: పెట్రోలు లీటరు ధర రూ.81.63, డీజిల్ లీటరు ధర రూ .75.70 చెన్నై: పెట్రోలు లీటరు ధర రూ. 82.86, డీజిల్ లీటరు ధర రూ. 78.08 అక్టోబర్ 4న రికార్డు స్థాయికి చేరినన పెట్రోల్, డీజిల్ ధరలు గత 12రోజుల్లో రెండు రూపాయలకు పైగా దిగి వచ్చాయి. -
నాల్గవరోజూ తగ్గిన ఇంధన ధరలు
న్యూఢిల్లీ: వాహనదారులకు శుభవార్త. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడంతో చమురు సంస్థలు కూడా స్వల్పంగా ఇంధన ధరలను తగ్గించాయి. ఇంధన ధరల తగ్గింపు వరుసగా నాల్గవరోజైన ఆదివారం కూడా కొనసాగింది. ఆదివారం లీటరు పెట్రోల్పై 25 పైసలు, డీజిల్పై 17పైసలను సంస్థలు తగ్గించాయి. దీంతో సవరించిన రేట్ల ప్రకారం ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 81.74 ఉండగా, డీజిల్ ధర రూ.75.19 గా ఉంది. వరుసగా నాలుగురోజులపాటు చమురు ధరలను తగ్గించడంతో మొత్తంగా ఈ నాలుగు రోజుల్లో లీటరు పెట్రోల్పై రూ.1.09, డీజిల్పై 50 పైసలు తగ్గింది. -
రూపాయిని శాసిస్తున్న ‘ట్రంప్’!
రెండు విధాలా మన ఆర్థిక వ్యవస్థకు ‘క్షవరం’ చేసే దుర్మార్గపు వ్యూహానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగారని మరచిపోరాదు. అమెరికా పాలకులతో సైనిక విన్యాసాలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నా భారత కరెన్సీ విలువను మాత్రం కోతపెట్టే చర్యలను ట్రంప్ మానుకోవడం లేదు. ఇండియాలో నోట్ల రద్దు ఫలితంగా ఆటోరిక్షా ప్రయాణ చార్జీల కన్నా విమాన ప్రయాణ చార్జీలు తక్కువ అని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా చమత్కరించారంటే–ఈ కుట్ర ఏ దశకు చేరిందో ఊహించవచ్చు. ఈ పరిస్థితుల మధ్యనే మన ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ ప్రారంభించిన దాడిని మోదీ ఎదుర్కొనలేకపోతున్నారు. నిరంతరం పెరుగుతున్న చమురు (పెట్రోల్, డీజిల్) ధరల మధ్య రూపాయి కోలు కునే పరిస్థితి లేదు. – డాక్టర్ సునీల్ కుమార్, ఆర్థికవేత్త, డైరెక్టర్ పబ్లిక్ ఫైనాన్స్ అవసరమైతే మరోసారి నోట్ల రద్దుకు (డీమానిటైజేషన్) సిద్ధపడతా మని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్కుమార్ గొప్పగా ప్రకటించుకు న్నారు. దేశ ఆర్థిక వినాశనం గురించి అంత అహంకారంతో మాట్లాడడం ఇంతకు ముందు ఎరగం. నీతి ఆయోగ్ అధ్యక్షునిగా ప్రధాని మోదీ ఈ అభిప్రాయాన్ని బలపరుస్తున్నట్టా, లేదా? ఆయనదీ అదే మాటా?– రమేష్కుమార్ హిందీ పాఠానికి చిత్రా పద్మనాభన్ అనువాదం,ద వైర్, వెబ్సైట్, 8–10–18 ఈ పరిస్థితుల్లో రూపాయి పతనాన్ని కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల నిలువరించలేకపోతున్నామని ప్రసిద్ధ ఆర్థికవేత్త అభిక్ బారువా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మొత్తం విష పరిణామానికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ఆసియా దేశాల ఆర్థిక వ్యవ స్థల ఉనికిని దెబ్బతీసేందుకు ప్రారంభించిన వాణిజ్య యుద్ధ బెదిరిం పులు. ప్రపంచదేశాలపైన అమెరికా పెత్తనం క్రమంగా తగ్గుతోంది. వలస పాలన నుంచి విముక్తి పొంది సొంత ఆర్థికవ్యవస్థలను ఏర్పాటు చేసుకుని నిలదొక్కుకుంటున్న వర్థమాన దేశాలను తుంచి వేయడానికి అమెరికా సిద్ధమైంది. ఈ కుట్రలో భాగంగా ఈ ఆర్థికవ్యవస్థలకు అవసర మైన చమురు వనరులు లభ్యంకాకుండా ఉండేందుకు ఇరాన్ తదితర అరబ్ దేశాలపైన, చైనా, ఇండియాపైన ఆంక్షలు విధిస్తోంది అమెరికా. చాలా కాలంగా ఇరాన్ నుంచి మనం తెచ్చుకుంటున్న ఆయిల్ దిగుమ తులపై ఆంక్షలు పెడుతోంది. మరోవైపు ఇండియా, చైనా తమ అభి వృద్ధిలో భాగంగా పొందుతున్న సబ్సిడీలను నిలిపివేయాలని నిర్ణయిం చిన అమెరికా తగు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటిదాకా ఇండియా గత పాతికేళ్లుగా అంతర్జాతీయ వాణిజ్యం ద్వారా సమకూర్చుకున్న విదేశీ మారకం నిల్వలతో తన కరెన్సీ విలువను కాపాడుకుంటూ వస్తోంది. కాని, బీజేపీ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే ఆ నిల్వలు కాస్తా కరిగిపోతున్నాయి. విదేశీ పెట్టుబడులపై ఆధారం అటు కాంగ్రెస్–యూపీఏ పాలనలో, ఇటు బీజేపీ–ఎన్డీఏ హయాం లోనూ ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) సలహాలు, అదుపాజ్ఞల్లో దేశ ఆర్థిక వ్యవస్థను నడపడానికి ప్రయత్నం జరిగింది. ఫలితంగా దేశప్రజల మౌలికప్రయోజనాలు దెబ్బతింటూ వచ్చాయి. మొత్తం ఆర్థిక వ్యవస్థ స్వతంత్ర పంథాలో కాకుండా అత్యధిక భాగం విదేశీ పెట్టుబడులపై ఆధారపడే పరిస్థితి వచ్చింది. దీంతో మన రాజ కీయ ఆర్థిక స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాల్సిన దుస్థితిలో చిక్కుకున్నాం. కాని, సోషలిస్టు ఆర్థిక వ్యవస్థ పరిధిల్లోనే అమెరికా పెత్తనానికి గండి కొడుతూ చైనా రిపబ్లిక్ ప్రపంచంలోనే నంబర్వన్ ఆర్థిక వ్యవస్థగా అవ తరించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రతిపత్తిని రెండో స్థానానికి నెట్టేయ బోతున్న సమయంలో వాణిజ్య యుద్ధంలో భాగంగా చైనాపై అమెరికా ఆయుధం ఎక్కుపెట్టింది. చైనా, దక్షిణ కొరియా వస్తు సముదాయంతో అమెరికా మార్కెట్లు దశాబ్దాలుగా నిండిపోతూనే ఉన్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ చిరకాలంగా ‘పరాన్నభుక్కు’గా, ‘సోమరిపోతు’గా పేరు పొందింది. వలస దేశాల సంపదను, ప్రజలను నిరంతరాయంగా దోచుకుని గడించిన సంపద వల్లే అమెరికా ఈ స్థితికి చేరింది. ఇందులో భాగంగానే ఇండియా వంటి దేశాల కరెన్సీలను అమెరికా డాలర్కు బందీలుగా చేశారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ‘బ్రెటన్వుడ్స్’ సమావేశంలో ఇది జరిగింది. ఈ దోపిడీ బంధం సరాసరి బ్రిటిష్ కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్తో ప్రారంభమైంది. మన రూపాయి ఇప్పటికీ ఈ చిక్కు ముడిని విదిలించుకుని, పుంజుకోలేకపోతోంది. కానీ, సోషలిస్ట్ రిప బ్లిక్గా ప్రయాణం ప్రారంభించిన చైనా కొన్ని దశాబ్దాల తర్వాత ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి బలోపేతమైంది. అమెరికా కరెన్సీకి పోటీగా తన కరెన్సీని నిలబెట్టి కాపాడుకుంటూ వస్తోంది. భారీ స్థాయిలో ప్రజావసర సరకులు తన ప్రజలకే గాక, ప్రపంచ దేశాల ప్రజా బాహు ళ్యానికి సైతం సరసమైన ధరలకు చైనా అందజేస్తోంది. రోదసీ పరిశోధన సహా సాంకేతిక రంగాల్లో గణనీయ స్థానానికి చేరుకుని, నేడు ప్రపం చంలోనే అమెరికాను తోసిరాజని అగ్రగామి స్థానాన్ని చైనా కైవసం చేసుకోబోతోంది. చైనాతో మొదలైన తొలి వాణిజ్యయుద్ధం! సరిగ్గా ఈ దశలోనే మొట్టమొదటి వాణిజ్య యుద్ధాన్ని చైనాతోనే ట్రంప్ ప్రకటించారు. ఆ వరుసలోనే మన మోదీ ప్రభుత్వం అమెరికాతో, ట్రంప్ విధానాలతో చేతులు కలిపింది. చేతులు కాల్చుకునే పరిస్థితి తెచ్చుకుంటోంది. అయితే, అమెరికా కక్ష కట్టి మరీ చైనాతోపాటు ఇండి యాకు కూడా సబ్సిడీల్లో కోతపెట్టడానికి నిర్ణయించింది. అమెరికా చేస్తున్న ఈ తాజా విన్యాసాలకు అర్థం ఏమిటో మనం గుర్తించలేక పోయాం. కాని, అమెరికాను ‘వర్థమానదేశం’గానే భావించాలని, ఎవరి కన్నా కూడా ‘వేగవంతంగా అభివృద్ధిచెందే దేశం’గా మార్చాలని డొనాల్డ్ ట్రంప్ సిగ్గువిడిచి మొదటిసారిగా (8–9–18) ప్రకటించుకోవాల్సి వచ్చింది. ఈ సత్యాన్ని, దాని పరాధార స్థితిని దాచడం కోసమే ఇప్పుడు వర్థమాన దేశాల ఆర్థికవ్యవస్థలను నులిమివేసే ప్రయత్నాలకు ట్రంప్ దిగారని గుర్తించాలి. అంతేకాదు, అమెరికా కనుసన్నల్లోనే మొదటి నుంచీ మెసలుతున్న ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) చైనాను ప్రపంచంలో ‘మహత్తర ఆర్థిక శకి’్తగా పరిగణిస్తున్నందుకు ట్రంప్ ఆ సంస్థపై ఇటీవల నార్త్ డకోటాలోని ఫార్గోసిటీ సభలో విరుచుకుపడ్డారు. అందుకే అమెరికాకు చైనా ఎగుమతులను అడ్డుకునేందుకు వాటిపై సుంకాలు పెంచేశారు. ఇంకా అమెరికా నుంచి ఇండియా దిగుమతులపై కూడా (19 సరకులు) సుంకాలు పెంచి, తగ్గిన రూపాయి విలువలో మన సరకులను అమెరికాకు అనుమతించాలని ట్రంప్ నిర్ణయించారు. అంటే, రెండు విధాలా మన ఆర్థిక వ్యవస్థకు ‘క్షవరం’ చేసే దుర్మార్గపు వ్యూహానికి ట్రంప్ దిగారని మరచిపోరాదు. అమెరికా పాలకులతో సైనిక విన్యాసాలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నా భారత కరెన్సీ విలువను మాత్రం కోతపెట్టే చర్యలను ట్రంప్ మానుకోవడం లేదు. ఇండియాలో నోట్ల రద్దు ఫలితంగా ఆటోరిక్షా ప్రయాణ చార్జీల కన్నా విమాన ప్రయాణ చార్జీలు తక్కువ అని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా చమత్కరించారంటే–ఈ కుట్ర ఏ దశకు చేరిందో ఊహించవచ్చు. ఈ పరిస్థితుల మధ్యనే మన ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ ప్రారంభించిన దాడిని మోదీ ఎదుర్కొనలేకపోతున్నారు. ‘‘భారత్ను నాలుగో ఆర్థిక పారిశ్రామిక విప్లవ కేంద్రానికి వేదికగా ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూ ఈఎఫ్) ఎంచుకుంది. ఈ విప్లవం ద్వారా ఉద్యోగాల స్వరూపమే మారి పోతుంది. మరిన్ని ఉపాధి అవకాశాలు అంది వస్తాయి. టెక్నాలజీ అభివృద్ధితో ఉద్యోగాలు పోవు’’ అని నరేంద్రమోదీ చిత్రమైన హామీ ఇచ్చారు. అంటే, ఒక వైపున ప్రసిద్ధ ఆర్థికవేత్తలే ట్రంప్ పోకడలను దుయ్యబడుతున్నారు. ‘‘అమెరికాలో ప్రజల ఆస్తులను ప్రయివేట్ రంగం దారుణాతిదారుణంగా దోచుకోవడానికి ట్రంప్ అనుమతిస్తు న్నారు. తిరిగి వాటిని దేశ రాజధాని వాషింగ్టన్లోని పాలక పక్ష పెద్దల స్నేహితులకు, వారి మద్దతుదారులకు కుదువ పెడుతున్నారని అమెరికా ప్రసిద్ధ ఆర్థికవేత్త, విశ్లేషకుడు, చరిత్రకారుడైన డాక్టర్ పాల్ క్రీగ్ రాబర్ట్స్ (11.5.2018) ప్రకటించారు. అంతేకాదు ట్రంప్ పాలన పర్యావరణ వినాశనానికి, మానవ జీవితాల ఉనికికే చేటని ఆయన విమర్శించాడు. ఇంతకీ వాషింగ్టన్ పాలకుల అధికారం అంతా దేని మీద ఆధా రపడింది? అమెరికన్ డాలర్ మారకం విలువ మీదనే. అమెరికాలో పౌర స్వేచ్ఛకు ఉద్దేశించిన అత్యంత రక్షణ క్లాజులైన హెబియస్ కార్పస్, చట్టబద్ధ రక్షణలను పాలకులు నాశనం చేశారని డాక్టర్ రాబర్ట్స్ వెల్లడించారు. ఇలాంటి పౌర హక్కుల అణచి వేతకు అనుకూలంగా, భారత రిపబ్లిక్ రాజ్యాంగ నిబంధనలకు కూడా పాలకుల నుంచి ప్రమాదం రాలేదనీ, రాదనీ భరోసా చెప్పుకోగల స్థితిలో ఉన్నామా? ప్రభుత్వరంగ బ్యాంకుల పరిస్థితిని ఎలా దిగజార్చారో మనం కళ్లారా చూస్తున్నాం. ట్రంప్ భారత్ను శాసిస్తున్నారా? బహుశా నరేంద్ర మోదీ విధానాల్ని కొన్ని లోపాయికారీ హెచ్చరికల ద్వారా ట్రంప్ ఏమైనా శాసిస్తున్నారా? అమెరికా రాజ్యాంగ నిర్మాతలలో ఒకరైన థామస్ జెఫర్సన్ అన్నట్టుగా ‘‘దేశంలోని స్టాండింగ్ ఆర్మీ కన్నా బ్యాంకింగ్ సంస్థలు మన స్వేచ్ఛ, స్వాతంత్య్రాలకు చాలా ప్రమాదకరం. అమెరికా ప్రజలు గనుక తమ కరెన్సీని ద్రవ్యోల్బణం పేరిటగానీ, దాని విలువను తగ్గించే పేరిటగానీ కంట్రోల్ చేయడానికి ప్రైవేట్ బ్యాంకుల్ని అనుమతిస్తే ఆ బ్యాంకులు ప్రజల మొత్తం ఆస్తిపాస్తుల్ని దోచేసుకుం టాయి. చివరికి, అమెరికా ఖండాన్ని బానిసత్వం నుంచి విమోచన కలి గించిన తమ తల్లిదండ్రుల బిడ్డలకు వారసత్వంగా ఆస్తిపాస్తులు దక్క కుండా బికారుల్ని చేసి వదులుతాయి’’. ఈ రోజున అమెరికాలో మధ్య తరగతి వర్గం సైతం కునారిల్లిపోతుండడం జఫర్సన్ జోస్యానికి ప్రబల నిదర్శనమని తాజాగా సంచలనం సృష్టిస్తున్న ‘కుమ్మక్కు’ (కొల్యూషన్) అనే పేరిట నోమ్ ప్రిన్స్ అనే ప్రసిద్ధ అమెరికన్ విశ్లేషకుడు తాజా డాక్యు మెంట్ల పేరిట వెల్లడించారు. ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
పెట్రో మంట నుంచి కాస్త ఊరట
న్యూఢిల్లీ: రోజుకో రికార్డు చెరిపేస్తూ దూసుకెళ్తున్న ఇంధన ధరల నుంచి సామాన్యునికి కొంత ఊరట లభించింది. పెట్రోల్, డీజిల్ లీటరు ధరను కేంద్రం రూ.2.50 తగ్గించింది. ఇందులో రూ. 1.50 మేర ఎక్సైజ్ సుంకం రూపంలో కోత విధించగా, మరో రూపాయి తగ్గింపును చమురు కంపెనీలు సర్దుబాటుచేసుకోనున్నాయి. కేంద్రం నిర్ణయం వెలువడిన వెంటనే బీజేపీ పాలిత రాష్ట్రాలు గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, అస్సాం, త్రిపురలు రూ.2.50 మేర వ్యాట్ తగ్గించుకోవడంతో ఆ రాష్ట్రాల్లో మొత్తం తగ్గింపు రూ.5కు చేరింది. సవరించిన ధరలు గురువారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. తాజా నిర్ణయంతో కేంద్రం మిగిలిన ఆర్థిక సంవత్సరంలో రూ.10,500 కోట్లు, పూర్తి సంవత్సరంలో రూ.21,000 కోట్ల ఆదాయం కోల్పోనుంది. చమురు కంపెనీలు లీటరుకు రూ.1 చొప్పున భారం భరిస్తే సుమారు రూ.10,700 కోట్ల ఆదాయాన్ని నష్టపోతాయి. ఇందులో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) సగం, హెచ్పీసీఎల్, బీపీసీఎల్లు మిగతా సగాన్ని సమానంగా భరించనున్నాయి. ప్రభుత్వ నిర్ణయం కంటితుడుపు చర్యేనని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ విమర్శించింది. డీరెగ్యులేషన్పై ప్రభావం లేదు: జైట్లీ రాష్ట్రాలు కూడా స్థానిక పన్నులు తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విజ్ఞప్తి చేశారు. ఇంధన భారాన్ని పంచుకోవాలని చమురు కంపెనీలను కోరడం మళ్లీ ప్రభుత్వ నియంత్రణకు దారితీస్తుందన్న ఆందోళనలను ఆయన కొట్టిపారేశారు. కంపెనీలకు ధరలు నిర్ణయించుకునే స్వేచ్ఛ కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
‘భారత్లో కన్నా పాక్, బంగ్లాలో తక్కువ’
చండీగఢ్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ మండిపడ్డారు. దేశంలో ఇంధన ధరల ఆకాశాన్ని అంటుతున్నా వాటిని అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్తో పోల్చితే సరిహద్దు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో ఇంధన ధరలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. గత కొన్ని వారాలుగా చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు జీవితకాల గరిష్టానికి చేరుకుని సరికొత్త రికార్డుని నెలకొల్పయాని ఎద్దేవా చేశారు. ప్రజలు ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్న కేంద్రం మాత్రం ధరలను తగ్గించే ఆలోచన చేపట్టకపోవడం బాధకరమని అన్నారు. పెట్రోలు, డీజిల్ ధరలపై అధిక పన్నులు విధించి ఇంధన కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. క్రూడాయిల్కు పన్ను మినహాయింపు అంశంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందిచడం లేదని ప్రశ్నించారు. -
రికార్డు స్థాయికి పెట్రోల్ ధరలు
న్యూఢిల్లీ: ముడిచమురు ధరలు పెరగడం, రూపాయి విలువ పతనమవడంతో ఇంధన ధరలు ఆల్టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. సోమవారం సవరించిన ధరల ప్రకారం.. పెట్రోల్పై 31 పైసలు, డీజిల్పై 39 పైసల ధర పెరిగింది. దీంతో ముంబైలో రికార్డు స్థాయిలో లీటరు పెట్రోల్ ధర రూ.86.56కు చేరుకుంది. డీజిల్ ధర రూ.75.54గా ఉంది. ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.79.15, లీటరు డీజిల్ రూ.71.15గా ఉంది. ఆగస్టు 16 నుంచి ఇప్పటివరకు లీటరు పెట్రోల్పై రూ.2, డీజిల్పై రూ.2.42 ధర పెరిగింది. ఇరాన్పై అమెరికా ఆంక్షల వల్ల సరఫరా తగ్గుతుందన్న భయంతో చమురు ధరలు 15 రోజుల్లో 7 డాలర్లు (బ్యారెల్కు) పెరిగాయి. రూపాయి పతనం వల్ల సీఎన్జీ, పీఎన్జీ ధరలూ పెరిగాయి. కేజీ సీఎన్జీ 63 పైసలు, పీఎన్జీ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ (ఎస్సీఎం)కు రూ.1.11 పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో కేజీ సీఎన్జీ రూ.42.60గా పీఎన్జీ ధర ఎస్సీఎంకు రూ.28.25కు చేరుకుంది. -
మళ్లీ పెట్రో ధరల షాక్
న్యూఢిల్లీ: రూపాయి మారకపు విలువ పడిపోవడంతో డీజిల్, పెట్రోల్ ధరలు మరోమారు పెరిగాయి. సోమవారం డీజిల్ ధర లీటరుకు 14 పైసలు, పెట్రోల్ లీటరుకు 13 పైసలు పెరిగినట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. దీంతో ఢిల్లీలో లీటరు డీజిల్ ధర రూ.69.46 రికార్డు స్థాయి గరిష్టానికి చేరుకుంది. ముంబైలో డీజిల్ ధర రూ.73.74కు చేరింది. ఆగస్టు 16న రూపాయి విలువ పడిపోయినప్పటి నుంచి ఇంధనం ధరలు పెరుగుతున్నాయి. గత నాలుగేళ్లలో పెట్రో ఉత్పత్తులపై పన్నుల ద్వారా కేంద్రానికి వస్తున్న సొమ్ము రూ.99,184 కోట్ల నుంచి రూ.2,29,019 కోట్లకు పెరిగింది. రాష్ట్రాల్లో వ్యాట్ రూ.1,37,157 కోట్ల నుంచి రూ.1,84,091 కోట్లకు పెరిగింది. -
అక్కడ డీజిల్ ధర రూ.119.31
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధానమంత్రి, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ నాసిరుల్ ముల్క్ నేతృత్వంలో సాగుతున్న తాత్కాలిక ప్రభుత్వం ఆ దేశంలో భారీగా ఇంధన ధరలు పెంచేసింది. ఈ నెలలో దేశమంతా ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో, ఇంధన ధరలు పెంచుతున్నట్టు శనివారం ప్రకటన విడుదల చేసింది. గత రెండు నెలల కాలంలోనే ఇలా ధరలు పెంచడం ఇది రెండోసారి. పెంచిన ధరలు జూలై 1 నుంచి అమల్లోకి తీసుకు వచ్చిన్నట్టు గియో టీవీ రిపోర్టు చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం పెట్రోల్పై రూ.7.54, డీజిల్పై రూ.14.00, కిరోసిన్ ఆయిల్పై రూ.3.36, లైట్ డీజిల్పై రూ.5.92, హై-స్పీడ్ డీజిల్పై రూ.6.55 ధరలు పెంచుతున్నట్టు తెలిపింది. దీంతో పెట్రోల్ ధర రూ.99.50కు, డీజిల్ ధర రూ.119.31కు, కిరోసిన్ ఆయిల్ ధర రూ.87.70కు, లైట్ డీజిల్ ధర రూ.80.91కు, హై-స్పీడ్ డీజిల్ ధర రూ.105.31కు ఎగిసింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇంధన ధరలు భారీగా పెంచడంపై ప్రజలు, విపక్షాలు మండిపడుతున్నాయి. ఇది దేశంలోని ప్రజలకు ఆర్థికపరమైన ఆందోళనలు కలిగించే అవకాశముందుని ఆర్థిక వేత్తలంటున్నారు. పాకిస్తాన్ ఆయిల్ అండ్ గ్యాస్ రెగ్యులేటరీ అథారిటీ(ఓజీఆర్ఏ) మాత్రం పెట్రోల్పై రూ.5.40, డీజిల్పై రూ.6.20, కిరోసిన్ ఆయిల్పై రూ.12 మాత్రమే పెంచాలని ప్రతిపాదించింది. కానీ ఓజీఆర్ఏ ప్రతిపాదించిన దాని కన్నా ఎక్కువగా ఇంధనాలపై ధరలను ముల్క్ ప్రభుత్వం పెంచింది. ఈ నెల మొదట్లో కూడా పెట్రోల్పై రూ.4.26, డీజిల్పై రూ.6.55, కిరోసిన్ ఆయిల్పై రూ.4.46 ధరలను పెంచింది. ఈ ధరలు జూన్ 12 నుంచి జూన్ 30 వరకు అమల్లో ఉన్నాయి. ధరలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ స్పందించారు. ప్రజలపై అనవసరమైన ఆర్థిక భారం మోపకుండా.. ఎన్నికలు వెళ్లేలా దృష్టిసారించాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. -
జియో ఆఫర్ వద్దు.. పెట్రోల్ ధర తగ్గిస్తే చాలు..!
సాక్షి, న్యూఢిల్లీ: పెరిగిన ఇంధన ధరలపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న తరుణంలో ఒడిశా బీజేపీ సీనియర్ నాయకుడు జయనారాయణ్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని నవ్వులపాలు చేశాయి. కాంగ్రెస్పై విమర్శలు చేసే క్రమంలో అనాలోచితంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మిశ్రా మంగళవారం ఒక న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ.. ఇంధన ధరల పెరుగుదలపై మాట్లాడే అర్హత కాంగ్రెస్కు లేదంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో మొబైల్ డాటాకు ఎంతో ఖర్చు చేయాల్సి వచ్చేదని, కానీ నేడు దాదాపు ఉచితంగా లభిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్డీయే ప్రభుత్వాన్ని విమర్శించడమే కాంగ్రెస్ లక్ష్యంగా మారిందంటూ.. యూపీఏ ప్రభుత్వ కాలంలో పెట్రోలు ఇతర వస్తువుల ధరలు ఏమేరకు పెరిగాయో వివరించారు. ‘2004లో లీటరు పెట్రోలు రూ.29కి లభించేది. పదేళ్ల యూపీఏ పాలన అనంతరం దాని ధర 74 రూపాయలకు చేరింది. కిలో నెయ్యి 2004లో రూ.130 ఉండగా.. 2014లో రూ.380 కి చేరింది. నాటి యూపీఏ హయాంలో 1 జీబీ డాటా కోసం రూ.300 చెల్లించాల్సి వచ్చేది.. కానీ, నేడు ఉచితంగా డాటా లభిస్తోంద’ని మిశ్రా వివరించారు. దీనిపై నెటిజన్లు స్పందించారు. ట్విటర్ వేదికగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. ‘డాటా ఉచితం అయితే కావచ్చు. కానీ, డాటాతో బండి నడవదు కదా..!’ అంటూ ఒకరు స్పందించగా.. ‘ఈయన లెక్కలు బాగా చెబుతున్నారు. కొంపదీసి వచ్చే ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా చేస్తారేమోన’ని ఇంకొకరు చమత్కరించారు. ‘జియో వచ్చాక దేశంలో ఇంటర్నెట్ సౌకర్యం సులభమయింది. కానీ, ఏం లాభం. జియో మాదిరే పెట్రోలుపై కేంద్రం దృష్టి సారిస్తే మంచిది. 399 రూపాయలకే 70 రోజుల పాటు.. రోజూ ఒక లీటర్ చొప్పున జియో మాదిరే పెట్రోలు పథకం ప్రవేశపెడితే బాగుంటుంద’ని మరొకరు ట్వీట్ చేశారు. ‘మాకు జియో మ్యాజిక్ ఏం వద్దు. నిత్యావసరమైన పెట్రోలు ధరలు తగ్గిస్తే చాల’ని ఇంకో నెటిజన్ అన్నారు. బీజేపీ ప్రభుత్వం గత ప్రభుత్వాలను విమర్శిస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తోందనీ.. వారేం చేశారు.. వీరేం చేశారు అని మునుపటి ప్రభుత్వాలను వేలెత్తి చూపడం మానుకొని.. తక్షణం చేపట్టాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని నెటిజన్లు కేంద్రానికి సూచించారు. Congress talks about fuel price to criticise govt. Don't they remember their past? Petrol was Rs29/l in '04&Rs74/l in '14, Ghee Rs130/kg in '04&Rs380/kg in '14, data charges Rs300 for 1 GB,100 GB at Rs300 now, call rates Rs 8/min & free with data pack today: J Mishra, BJP (23.05) pic.twitter.com/BqSSuvSoko — ANI (@ANI) May 24, 2018 Hope this guy doesn't become next finance minister of India. — Jerin saviour (@Jerinsaviour) May 24, 2018 Hey bhagwan Data se Gaadi chalegi — S a n j e e v 🇮🇳🇮🇳 (@sanjeevjena1) May 24, 2018 Whenever a question is directed towards them, they try to deflect it. What Cong did, what communist did. Why can't you answer why you did ,what you did ? And what are you going to do about it. BJP is so busy pinning the blame on other. A party with a difference has changed. — Arun (@DrArun_) May 24, 2018 -
మీరు తగ్గించాలి.. కాదు మీరే..!
సాక్షి, అమరావతి: పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ మండిపోతున్నా సామాన్యుడికి ఊరట కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపటం లేదు. గత ఎనిమిది రోజుల వ్యవధిలో లీటర్ పెట్రోలు రూ. 2.64, డీజిల్ రూ.2.25 చొప్పున పెరిగినా ఉపశమన చర్యలు చేపట్టకపోవటంతో వాహనదారులు అల్లాడుతున్నారు. 2016 జనవరి నుంచి చూస్తే పెట్రోలు లీటరుకు రూ.17.9, డీజిల్ రూ.25.17 చొప్పున పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రికార్డు స్థాయిలో లీటరు పెట్రోలు రూ. 83.37, డీజిల్ రూ. 75.61కు చేరుకున్నాయి. పెట్రోల్పై రూ.11.47, డీజిల్పై రూ.15.47 దాకా పెరిగిన పన్నుల భారమే ఉండటం గమనార్హం. ధరలు దించండి... వ్యాట్ తగ్గించుకోండి ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో గతేడాది జూన్ నుంచి రోజు వారీ ధరల విధానం అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి చూస్తే లీటరు పెట్రోలు రూ.12.45, డీజిల్ రూ.14.58 పెరిగాయి. ఇంత భారీగా ధరలు పెరిగితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించకుండా మీరు తగ్గించాలంటే మీరు తగ్గించాలంటూ తప్పించుకుని సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినప్పుడు కేంద్రం తగ్గించలేదు కాబట్టి ఇప్పుడు ధరలు పెరిగినప్పుడు ఆ భారం ప్రజలపై పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేస్తూ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఏకంగా పత్రికా ప్రకటనలు కూడా విడుదల చేశారు. అయితే ఒక లీటరు పెట్రోల్లో కేంద్రానికి పన్నుల రూపంలో రూ.12 వస్తే రాష్ట్రం ఏకంగా రూ. 26 తీసుకుంటూ కేంద్రంపై విమర్శలు చేయడాన్ని బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్థన్రెడ్డి తప్పుపట్టారు. ఇప్పటికే తాము కొంత ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాం కాబట్టి మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాలే వ్యాట్ను తగ్గించుకోవాలని కేంద్రం సూచిస్తోంది. ‘వ్యాట్’ వాత అధికం.. పొరుగు రాష్ట్రాల కంటే ఏపీలో ఇంధన ధరలు అధికంగా ఉన్నందున ఇన్నాళ్లూ అదనపు ఆదాయం ఆర్జించిన నేపథ్యంలో ఇకనైనా పన్నులు తగ్గించి ఉపశమన చర్యలు చేపట్టకపోవటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సరిహద్దు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో పెట్రోల్పై లీటరుకు రూ.1.58 నుంచి రూ.7.51 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. డీజిల్పై లీటరుకు రూ. 1.29 నుంచి రూ.6.06 వరకు ఎక్కువ భారం పడుతోంది. దీనికి కారణం మన రాష్ట్రంలో విధించిన అదనపు వ్యాటే. 2015లో రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆదాయం కోసం ప్రతి లీటరుపై రూ.4 అదనపు వ్యాట్ విధించింది. ప్రస్తుతం రాష్ట్ర ఖజానాకు ప్రతి లీటరు పెట్రోల్పై రూ.21.83, డీజిల్పై రూ.16.52 చొప్పున ఆదాయం నేరుగా వస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్, డీజిల్ విక్రయాలపై ఖజానాకు రూ.9,785 కోట్ల రికార్డు స్థాయి ఆదాయం సమకూరింది. మీరే తగ్గించొచ్చుగా... కేంద్రం సహకరించకపోయినా బాండ్లు సమీకరించి మరీ అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తానని, జాతీయ రహదారులను కేంద్రం అభివృద్ధి చేయకుంటే తామే బాగు చేసి టోల్ వసూలు చేసుకుంటామని చెబుతున్న సీఎం చంద్రబాబు సామాన్యుల గోడు పట్టించుకోవటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్పై మోపిన అధిక పన్నులను తగ్గించాలంటూ రెండేళ్లుగా గగ్గోలు పెడుతున్నా ఫలితం లేదు. సామాన్యుడికి ఉపశమనం కలిగించేలా ముందుగా తానే పన్నులు తగ్గించి కేంద్రానికి ఆదర్శంగా నిలవవచ్చు కదా? అని ప్రశ్నిస్తున్నారు. అమ్మకాలు డీలా... ఇంధన ధరలు భారీగా పెరుగుతుండటంతో అమ్మకాలు పడిపోతున్నాయని పెట్రోలియం డీలర్లు వాపోతుండగా, లారీలు నడపలేని పరిస్థితుల్లో ఉన్నామని లారీ యజమానులు చెబుతున్నారు. గతంలో తమ బంకులో ప్రతి రోజూ 4,500 లీటర్ల పెట్రోలు అమ్మకాలు జరుగుతుండగా గత వారం రోజులుగా ధరల పెరుగుదలతో విక్రయాలు 3,500 లీటర్లకు పడిపోయినట్లు గుంటూరుకు చెందిన ఒక డీలరు తెలిపారు. డీజిల్ విక్రయాలు 10 వేల లీటర్ల నుంచి 7 వేల లీటర్లకు తగ్గాయని చెప్పారు. పెరుగుతున్న డీజిల్ ధలరకు వ్యతిరేకంగా వచ్చే నెలలో దేశవ్యాప్తంగా బంద్ నిర్వహించే యోచనలో ఉన్నట్లు ఏపీ లారీ యజమానుల అసోసియేషన్ నాయకులు తెలిపారు. -
విమాన టికెట్ చార్జీలకు రెక్కలు..
ముంబై: గడిచిన ఏడాది కాలంగా విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరలు ఏకంగా 30 శాతం మేర పెరిగిన నేపథ్యంలో విమాన టికెట్ల చార్జీలు కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. పెరిగిపోతున్న నిర్వహణ వ్యయాలను తట్టుకునేందుకు దేశీ విమానయాన సంస్థలు సుమారు 15 శాతం దాకా చార్జీలను పెంచవచ్చని అంచనా వేస్తున్నారు. సాధారణంగా విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాల్లో దాదాపు 45 శాతం వాటా ఏటీఎఫ్దే ఉంటుంది. చార్జీలను పెంచక తప్పని పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. ప్రత్యామ్నాయ మార్గాలపై విమానయాన సంస్థలు కసరత్తు చేస్తున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘గతేడాది నవంబర్ నుంచి ఇప్పటిదాకా జెట్ ఇంధనం ధర 25 శాతం దాకా పెరిగింది. పెరుగుతున్న వ్యయాలను తట్టుకునేందుకు టికెట్ చార్జీలను తప్పనిసరిగా పెంచాల్సిన పరిస్థితే. కానీ, ఎవరు ముందుగా పెంచుతారన్నదే ప్రశ్న‘ అని ఒక ప్రైవేట్ ఎయిర్లైన్ అధికారి వ్యాఖ్యానించారు. బోలెడన్ని ఫ్లయిట్ సర్వీసులు అందుబాటులో ఉన్న నేపథ్యంలో రేట్లు పెంచితే ప్రయాణికులను కోల్పోవాల్సి వస్తుందని, పెంచకపోతే భారీ వ్యయాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఎక్సైజ్ సుంకం తగ్గించాలి..: విమాన టికెట్ల చార్జీలు కనీసం 10–15% పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నట్లు కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ పార్ట్నర్ అంబర్ దూబే తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటీఎఫ్పై ఎక్సైజ్ సుంకం, వ్యాట్ (విలువ ఆధారిత పన్ను)ను సత్వరం తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. ‘ముడిచమురు ధరలు తక్కువగా ఉన్నన్నాళ్లు.. ఏవియేషన్ రంగం నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గణనీయంగానే లబ్ధి పొందాయి. ఇప్పుడు ఎయిర్లైన్స్ విమానయాన సంస్థలకు తోడ్పాటునివ్వాల్సిన సమయం వచ్చింది‘ అని దూబే చెప్పారు. జూలై నుంచి సెప్టెంబర్ దాకా ఎయిర్లైన్స్కి కష్టకాలంగానే ఉండొచ్చన్నారు. గడిచిన ఏడాది కాలంగా చాలా మటుకు ఇంధన ధరల పెరుగుదల ప్రభావాలను విమానయాన సంస్థలే భరిస్తూ వస్తున్నాయని, ఇప్పుడు కొంతైనా ప్రయాణికులపై మోపక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయని కాక్స్ అండ్ కింగ్స్ హెడ్ (బిజినెస్ ట్రావెల్ విభాగం) జాన్ నాయర్ తెలిపారు. -
ప్రజలకు మంట.. ప్రభుత్వాలకు పంట
సాక్షి, అమరావతి: ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం కనికరించడం లేదు. పెట్రోలు, డీజిల్ రేట్లతో ఖజానా నింపుకొంటున్నాయి. దీని కోసం ఎడా పెడా పన్నులు పెంచేస్తున్నారు. గతంలో అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినప్పుడు ఆదాయం తగ్గుతోందని పన్నులు పెంచిన ప్రభుత్వాలు ఇప్పుడు దేశీయ మార్కెట్లో ధరలు రికార్డు స్థాయికి చేరినా ఆ పెంచిన భారాన్ని తగ్గించడం లేదు. ప్రస్తుతం మన రాష్ట్రంలో లీటరు పెట్రోల్ ధర రూ. 79.81, డీజిల్ రూ.72.38కు చేరుకున్నాయి. గడిచిన రెండేళ్లలో పెట్రోలు ధరలు 22 శాతం, డీజిల్ ధరలు 34 శాతం పెరిగాయి. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పన్నులే. ఈ రెండేళ్లలో రెండు ప్రభుత్వాలు కలసి పెట్రోల్పై రూ. 11.47, డీజిల్పై రూ. 15.47 అదనపు పన్నులు విధించాయి. మోదీ ప్రభుత్వం సుంకాలను తొమ్మిదిసార్లు పెంచి ఒకసారి తగ్గించింది. గత అక్టోబర్లో కేంద్రం సుంకం రూ. 2 తగ్గించింది. రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి, 2015లో లీటర్కు రూ. 4 అదనపు వ్యాట్ను విధించింది. ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాట్ను తగ్గించమని రాష్ట్రాలకు కేంద్రం చేసిన విజ్ఞప్తిని చంద్రబాబు ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. పొరుగు రాష్ట్రాల్లో ధరలు తక్కువగా ఉండటం వల్ల రాష్ట్ర సరిహద్దుల్లోని బంకులు మూతపడుతున్నాయని పెట్రోలియం డీలర్లు పలుమార్లు విజ్ఞప్తి చేసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఖజానా గలగలలు.. పెట్రోల్, డీజిల్ అమ్మకాల ద్వారా రాష్ట్ర ఖజానాకు సుమారు రూ. 15,000 కోట్ల ఆదాయం వస్తోంది. నేరుగా రాష్ట్రం విధించే వ్యాట్ ద్వారా గత ఏడాది రూ. 9,785.24 కోట్ల ఆదాయం వచ్చింది. అలాగే కేంద్రం వసూలు చేసిన పన్నుల్లో 42 శాతం రాష్ట్ర వాటాను పరిగణనలోకి తీసుకుంటే మరో రూ. 4,200 కోట్లు వస్తున్నాయి. 2015 ఫిబ్రవరిలో లీటర్ పెట్రోల్ ధరలో రాష్ట్ర పన్నుల వాటా రూ. 13.99గా ఉంటే ఇప్పుడది సుమారు రూ. 22కు చేరింది. అదే విధంగా లీటరు డీజిల్ ధరలో పన్నుల వాట రూ. 8.86 నుంచి సుమారు రూ.16కు చేరింది. రాష్ట్రంలో ఏడాదికి సగటున పెట్రోల్ 320 కోట్ల లీటర్లు, డీజిల్ 125 కోట్ల లీటర్లు వినియోగం జరుగుతోంది. కేవలం రూ. 4 అదనపు వ్యాట్ ద్వారా గడిచిన రెండేళ్లలో రూ. 5,000 కోట్లకు పైగా అదనపు ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్జించింది. సంక్షోభంలో రవాణా రంగం పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో రవాణా వ్యయం భారీగా పెరిగింది. దీంతో సరుకుల ధరలు కూడా పెరిగి సామాన్యుడు విలవిలలాడుతున్నాడు. ప్రస్తుతం ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి లీటరు డీజిల్ ధర రూ. 48 వద్ద ఉంటే ఇప్పుడు ఏకంగా రూ. 72 దాటేసిందని ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై.వి.ఈశ్వరరావు వాపోయారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వ్యాపారాలు లేక రవాణా చార్జీలు పెంచలేకపోతున్నామని, ఇదే పరిస్థితి కొనసాగితే రవాణా రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళుతుందన్నారు. ప్రతి కిలోమీటరు, టన్నుకు ఎంత ధర అన్నది నిర్ణయించమని ఎప్పటి నుంచో విజ్ఞప్తి చేస్తున్నా కేంద్రం పెడచెవినపెడుతోందన్నారు. పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై రాష్ట్ర వ్యాట్ ఆదాయం ఏడాది ఆదాయం (రూ. కోట్లలో) (జూన్–మార్చి) 2014-15 5,269.74 2015-16 8,074.71 2016-17 8,979.99 2017-18 9,785.24 నోట్: ఇది కాకుండా కేంద్రం వసూలు చేసే పన్నులో 42 శాతం రాష్ట్రానికి వస్తుంది. -
మరోసారి దిగొచ్చిన ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ : వరుసగా రెండో నెలలో కూడా దేశీయ వార్షిక టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం తగ్గింది. ఆహార, ఇంధన ధరలు తగ్గడంతో డబ్ల్యూపీఏ జనవరి నెలలో 2.84 శాతానికి పడిపోయింది. 2017 డిసెంబర్లో ఇది 3.58 శాతంగా ఉంది. నవంబర్ నెలలో ఈ ద్రవ్యోల్బణం ఎనిమిది నెలల గరిష్టానికి ఎగిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతి నెల నుంచి ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తోంది. రాయిటర్స్ పోల్ అంచనాల ప్రకారం ఈ ద్రవ్యోల్బణం 3.25 శాతంగా నమోదవుతుందని తెలిసింది. కానీ అంచనాల కంటే తక్కువగానే ద్రవ్యోల్బణం కిందకి దిగి వచ్చింది. ముందటి నెలతో పోలిస్తే హోల్సేల్ ఫుడ్ ధరలు జనవరిలో ఏడాది ఏడాదికి కేవలం 1.65 శాతం మాత్రమే పెరిగాయి. అటు రిటైల్ ద్రవ్యోల్బణం కూడా కొద్దిగా చల్లబడింది. డిసెంబరు నాటి 17 నెలల గరిష్టంతో పోలిస్తే జనవరి నెలలో స్వల్పంగా తగ్గి 5.07శాతంగా నమోదైంది. అయితే రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా మధ్యస్థ లక్ష్యం 4 శాతం కంటే ఎక్కువగానే ఉంది. -
మోదీ ప్రభుత్వానికి చమురు సెగ?
సాక్షి, న్యూఢిల్లీ: ఆకాశన్నంటుతున్న చమురు ధరలు కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ప్రతికూలంగా మారనున్నాయా? వివిధ సంస్కరణలతో ప్రజలకు ఆకట్టుకుంటూ.. 2019 ఎన్నికలకు సిద్ధమవుతున్న మోదీ సర్కార్కు చమురు ధరల సెగ తాకనుందా? అంటే అవుననే సంకేతాలనిస్తున్నారు మార్కెట్ విశ్లేషకులు. ముఖ్యంగా మరికొన్ని రోజుల్లో చివరి ఆర్థిక బడ్జెట్( ఫిబ్రవరి , 1) పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో పెరుగుతున్న ఇంధన ధరలు కేంద్రానికి పెద్ద తలనొప్పేనని భావిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలలో చమురు ధరల తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వానికి సాయపడినప్పటికీ..ఇపుడు అప్రతిహతంగా పెరుగుతున్న ధరలు మోదీ సర్కార్కు ప్రమాదమే అంటున్నారు. పన్ను సంస్కరణలను హేతుబద్ధం చేయడం, 2019 లో సాధారణ ఎన్నికల ముందు డ్యూటీ రేట్లను తగ్గించడం వంటి ప్రధాన సంస్కరణలతో ఆదరణ పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ముడి చమురు ధరలు బ్యారెల్కు 70 డాలర్లు దాటితే మరిన్ని కష్టాలు తప్పవని నిపుణుల విశ్లేషణ. అటు గత వారం చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తారా అని ప్రశ్నించినపుడు.. ఆ మాట ముందు రాష్ట్ర ప్రభుత్వాలను అడిగాలన్నారు. గత సంవత్సరం అక్టోబర్లో ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాం..రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ను తగ్గించాలని సమాధానమివ్వడం గమనార్హం. ఎక్సైజ్ సుంకం తగ్గింపు కారణంగా డీజిల్ ధరలు అక్టోబరు 4, 2017 నాటికి రూ.56.89 స్థాయికి చేరింది. అయితే ఆ తరువాత పుంజుకున్న చమురు ధర ఎక్కడా వెనక్కి తగ్గకుండా పైపైకి దూసుకపోతోంది. మరోవైపు అంతర్జాతీయ చమురు ధరలు ర్యాలీకి కొనసాగుతోంది. సోమవారం డీజిల్ ధర లీటరుకు రూ.61.88 గా రికార్డ్ స్థాయి నమోదు కాగా పెట్రోలు ధర రూ.71 దాటేసింది. ఢిల్లీలో లీటరుధ ర రూ. 72 గా ఉంది. డిసెంబరు 12, 2017 తరువాత ధరలు పెరుగుతుండగా, ఆ రోజునాటికి ఢిల్లీలో డీజిల్ ధర రూ. 58.34 గా ఉంది. గడచిన నెలలో రూ. 3.54 పెరిగింది. గత వారం బ్రెంట్ టర్నోవర్ 70.05 డాలర్లుగా నిలిచింది. డబ్ల్యుటిఐ 64.77 డాలర్లకు చేరుకుంది. -
దీపావళికి పెట్రోల్ ధరలు డౌన్
-
దీపావళికి పెట్రోల్ ధరలు డౌన్
అమృత్సర్: అమృత్సర్: ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ ధరల ప్రభావంతో పాటు దేశీయంగా పన్నుల బాదుడుతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పైకి ఎగుస్తున్నాయి. అయితే రాబోతున్న దీపావళి పండుగకు వాహనదారులకు ఈ ధరల నుంచి కొంత ఊరట లభించనుంది. పైపైకి ఎగుస్తున్న ఇంధన ధరలు, దీపావళి నాటికి కిందకి దిగొస్తాయని పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. వచ్చే నెలలో ఈ ధరలు తగ్గుతాయన్నారు. ఇంధన ధరలు భారీగా పెరగడంపై ప్రతిపక్షాలు, ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. రోజువారీ ఇంధన ధరల సమీక్ష చేపట్టినప్పటి నుంచే ఈ విధమైన పరిస్థితులు ఏర్పడ్డాయని మండిపడుతున్నాయి. అయితే రోజువారీ ఇంధన ధరల సమీక్ష చాలా పారదర్శకంగా ఉందని మంత్రి చెప్పారు. అమెరికాలో వచ్చిన ఇర్మా, హార్వే కారణంతో అంతర్జాతీయంగా రిఫైనరీ అవుట్పుట్ 13 శాతం పడిపోయిందని మంత్రి తెలిపారు. ఈ ప్రభావంతో రిఫైనరీ ఆయిల్ ధరలు పైకి ఎగుస్తున్నాయన్నారు. ఇంధన ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందా? అంశంపై ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో కస్టమర్లకు అపారమైన ప్రయోజనాలు చేకూరుతాయని ప్రధాన్ చెప్పారు. -
ఇక్కడే విమాన చార్జీలు చౌక
⇒ ఈ రంగంలో పోటీవల్లే: కేంద్ర మంత్రి జయంత్ సిన్హా ⇒ ఇంధన ధరలు, పన్నులు ఎక్కువే న్యూఢిల్లీ: విమాన చార్జీలు చౌకగా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా చెప్పారు. విమానాలతో పాటు ఇంధనం ధరలు, పన్నులు కూడా అధికంగా ఉన్నప్పటికీ, అత్యంత పోటీ ధరలున్న దేశాల్లో మన దేశం కూడా ఒకటని ఆయన తెలియజేశారు. విమానయానం మరింత చౌకగా ఉండేందుకు, సర్వీసులు లేని విమానాశ్రయాల అనుసంధానత కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రాంతీయ అనుసంధానత స్కీమ్ను అందుబాటులోకి తెచ్చిందని తెలియజేశారు. ఈ ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) స్కీమ్లో భాగంగా గంట విమాన ప్రయాణానికి రూ.2,500 పరిమితిని విధించామని చెప్పారాయన. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్(ఏఐఎంఏ) ఇక్కడ నిర్వహించిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడారు. -
తగ్గిన పెట్రో ధరలు
పెట్రోల్పై 32 పైసలు, డీజిల్పై 85 పైసలు న్యూఢిల్లీ: ఇంధన ధరలు స్వల్పంగా దిగాయి. పెట్రోల్పై లీటరుకు 32 పైసలు, డీజిల్పై 85 పైసలు తగ్గాయి. అలాగే నష్టాలు పూడ్చుకోడానికి రూ. 3,700 కోట్ల అదనపు ఆదాయం కోసం ప్రభుత్వం పెట్రోల్పై ఎక్సైజ్ సుంకాన్ని 75 పైసలు, డీజిల్పై రూ. 2 పెంచింది. అయితే ఈ సుంకాలు పెరిగినా వీటి ధరలు తగ్గడం గమనార్హం. నిజానికి అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు 12 ఏళ్లలో అత్యంత దిగివకు బ్యారెల్కు 30 డాలర్లకంటే తక్కువకు పడిపోవడంతో వీటి ధరలు ఇంకా తగ్గాల్సి ఉంది. అయితే తగ్గింపుతో వచ్చిన లాభాలను ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం పెంచి తన ఖాతాలో వేసుకుంది. పెట్రో ధరల తగ్గింపు శనివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. ఢిల్లీలో పెట్రో ధర రూ. 59.35 నుంచి రూ. 59.03కు, డీజిల్ ధర రూ. 45.03 నుంచి 44.18కి తగ్గాయి. సాధారణ పెట్రోల్పై సుంకాన్ని తాజాగా రూ. 7.73 నుంచి రూ. 8.48కి పెంచారు. అన్బ్రాండెడ్ డీజిల్పై సుంకం రూ. 7.83 నుంచి రూ. 9.83కు పెరిగింది. కాగా, ప్రస్తుతం సంవత్సరం(2016) పదివేల ఎల్పీజీ డీలర్షిప్లు మంజూరు చేస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. -
పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గడం లేదంటే?
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పడిపోయాయి. అయినా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు అధికంగానే ఉంటున్నాయి? అంతర్జాతీయ విపణిలో ముడిచమురు ధర బ్యారెల్కు 40 డాలర్ల కన్నా తక్కువే ఉంది. గత 11 ఏళ్లలో ఇదే అత్యల్ప ధర అయినా దేశీయంగా పెట్రోల్ వినియోగదారులకు ఆ మేరకు ఎందుకు ఊరట లభించడం లేదు? ఈ విషయంలోని లోగుట్టును కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ బుధవారం వివరించే ప్రయత్నం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతున్నా.. వాటిపై ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకం పెరుగుతుండటంతో ఆ లబ్ధి వినియోగదారులకు అందడం లేదు. చమురు అమ్మకం విషయమై విధిస్తున్న ఎక్సైజ్ సుంకంలో 42శాతం వరకు రాష్ట్రాలకే వెళుతున్నదని, మిగతాది అభివృద్ధి కార్యక్రమాల కోసం వెళుతున్నదని అరుణ్జైట్లీ వివరించారు. 'ఎక్సైజ్ సుంకంలోని కొంత భాగం జాతీయ రహదారులు, గ్రామీణ రహదారులు వంటి అభివృద్ధి కార్యక్రమాలకు వెళుతోంది. తమ కొనుగోలు చేసిన పెట్రోల్, డీజిల్ తో ఆ రోడ్లపైనే వాహనదారులు తమ వెహికిల్స్ నడుపుతున్నందున ఇందుకు వారు చెల్లించాల్సిందే' అని ఆయన చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరల్లో అధికపాత్ర పోషించే వ్యాట్ (విలువ ఆధారిత పన్ను) రాష్ట్రాలకే వెళుతున్నదని, దానిలో నాలుగోవంతు రుసుం మాత్రం చమురు కంపెనీలు తీసుకుంటున్నాయని, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు కొనుగోలు చేయడం ద్వారా అవి భారీ నష్టాలను చవిచూస్తున్నాయని జైట్లీ తెలిపారు. చమురు కంపెనీలు 80 డాలర్లకు కొనుగోలు చేస్తే.. అమ్మే సమయానికి 60 డాలర్లకు ధర పడిపోతున్నదని, ఈ పరిస్థితితో అవి ఒకానొక సమయంలో రూ. 40వేల కోట్ల వరకు నష్టాలను చవిచూశాయని ఆయన చెప్పారు. చాలా సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం బడ్జెటరీ కోతలు లేకుండానే ద్రవ్యలోటు (జీడీపీలో 3.9శాతం) ను ఈ సంవత్సరం పూడ్చుకునే అవకాశముందని ఆయన చెప్పారు. -
నష్టాల బాటలో ఎంఎస్ఆర్టీసీ
సాక్షి, ముంబై: గ్రామీణ ప్రాంతాల్లో లైఫ్లైన్గా పేరొందిన మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (ఎంఎస్ఆర్టీసీ) నష్టాల్లో కూరుకుపోతోంది. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎంఎస్ఆర్టీసీకి చెందిన 250 డిపోలున్నాయి. వీటిలో 52 మినహా మిగిలిన 198 బస్సు డిపోలు నష్టాల్లో నడుస్తున్నాయి. నష్టాలకు టోల్ పన్ను, ఇంధనం ధరలతోపాటు అనేక కారాణాలున్నాయి. ఈ నేపథ్యంలో ఎంఎస్ఆర్టీసీని ఆదుకోవాలని రవాణా శాఖ మంత్రి దివాకర్ రావుతేను కోరారు. దీనిపై స్పందించిన ఆయన ఎంఎస్ఆర్టీసీ బస్సులకు టోల్ మాఫి చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం మాత్రం ఎంఎస్ఆర్టీసీ బస్సులకు టోల్మాఫీ చేయలేదు. ప్రభుత్వ పన్నుల పరంగా ఎంఎస్ఆర్టీసీ ప్రతి సంవత్సరం సుమారు రూ. 850 కోట్లు చెల్లిస్తోంది. వీటిలో టోల్ మాఫీ అయితే కొంతమేర ఊరట లభించనుంది. 2014 ఏప్రిల్ నుంచి 2014 డిసెంబరు వరకు ముంబై, పుణేలో అత్యధిక లాభాలు ఎంఎస్ఆర్టీసీకి వచ్చాయి. అనంతరం ఔరంగాబాగ్ డివిజన్లో రూ. 19 కోట్ల ఆదాయం వచ్చింది. ఇవి మినహా మిగిలిన ప్రాంతాల్లో నష్టాన్ని చవిచూడాల్సివస్తోంది. డిపోల వారీగా పరిశీస్తే దేవరుఖ్, పాల్ఘర్, పన్వేల్, నాసాసపారా, విఠల్వాడీ తదితర డిపోల పరిస్థితి అత్యంత దయానీయంగా ఉంది. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఆర్టీసీని ఆదుకునేందుకు టోల్మాఫీ చేయడంతోపాటు వివిధ పన్నులను మాఫీ చేయాలని లేదా రాయితీలు ఇవ్వాలని ఎంఎస్ఆర్టీసీ పదాధికారులు కోరుతున్నారు. -
రోడ్ల నిర్వహణ రేట్లు పెంపు
రహదారులు, భవనాల శాఖ ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: వివిధ రకాల రహదారుల సాధారణ నిర్వహణ రేట్లను తెలంగాణ ప్రభుత్వం పెంచింది. ఇంధనం ధరలు, కూలీ రేట్లు పెరగడంవల్ల రహదారుల నిర్వహణ వ్యయం రేట్లను సవరించినట్లు రహదారులు, భవనాల శాఖ శనివారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. రహదారుల నిర్వహణ రేట్లు కిలోమీటరు కొలమానంగా ఉంటాయి. ఈ మేరకు సింగల్ లేన్ బీటీ రోడ్డు నిర్వహణ రేటు రూ. 12 వేల నుంచి రూ.24 వేలకు పెరిగింది. డబుల్ లేన్ బీటీ రోడ్డుకు రూ. 15 వేల నుంచి రూ. 30 వేలకు, మట్టిరోడ్లు, కంకర రోడ్లకు రూ. 6 వేల నుంచి రూ.12 వేలకు పెరిగింది. తెలంగాణలో ఇక నుంచి నిర్మించే కొత్తరోడ్లను అయిదేళ్లపాటు నిర్వహించే బాధ్యతను కాంట్రాక్టర్లకే అప్పగించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించిన విషయం తెలిసిందే. -
పాసింజర్ వాహన అమ్మకాల్లో స్వల్ప వృద్ధే
ముంబై: దేశీయంగా ప్రయాణికుల వాహనాల అమ్మకాలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో స్వల్పంగానే పెరుగుతాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. చిన్న కార్లు, యుటిలిటీ వాహనాల సెగ్మెంట్లో డిమాండ్ బలహీనంగా ఉంటుందని పేర్కొంది. ఫలితంగా దేశీయ ప్రయాణికుల వాహనాల అమ్మకాలు 2-3 శాతం వృద్ధినే సాధిస్తాయని వివరించింది. ఈ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం..., ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ అమ్మకాలు 6-7 శాతం వరకూ క్షీణించవచ్చని అంచనాలున్నాయి. మొత్తం వాహన అమ్మకాల్లో చిన్న కార్ల అమ్మకాల వాటా 55-60 శాతం వరకూ ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 11 నెలల్లో 23 లక్షల ప్రయాణికుల వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే కాలం అమ్మకాలతో పోల్చితే 6 శాతం క్షీణత నమోదైంది. అయితే ఈ కేటగిరీ వాహన అమ్మకాలు 2012-13 ఆర్థిక సంవత్సరంలో 5 శాతం, 2011-12 ఆర్థిక సంవత్సరంలో 2.2 శాతం చొప్పున వృద్ధి సాధించాయి. అధిక ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లు అధిక స్థాయిల్లో ఉండడం, ఇంధనం ధరలు పెరుగుతుండడం వంటి కారణాల వల్ల గత మూడేళ్లలో ప్రయాణికుల వాహనాలకు డిమాండ్ తగ్గుతూ వస్తోంది. వాహనాలపై ఎక్సైజ్ సుంకం తగ్గింపు కారణంగా రానున్న నెలల్లో డిమాండ్ స్వల్పంగా పుంజుకోవచ్చు. సుంకం తగ్గింపు జూన్ 30 వరకూ అమల్లో ఉంటుంది. కాబట్టి అమ్మకాలు కొంచెం పుంజుకోవచ్చు.