Garlic
-
ఘాటెక్కిన వెల్లుల్లి
సాక్షి, భీమవరం: నిత్యావసరాల పెరుగుదలతో ఉక్కిరిబిక్కిరవుతున్న సామన్యుడిని వెల్లుల్లి ‘ఘాటు’ మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది. కిలో రూ.450 చేరి చుక్కలు చూపిస్తోంది. పదేళ్ల తర్వాత మళ్లీ ధర భారీగా పెరగడం చూస్తున్నామని వ్యాపారస్తులు చెబుతున్నారు. మధ్యప్రదేశ్లో సాగు విస్తీర్ణం తగ్గడమే కారణమని చెబుతున్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్, పిప్లే, ఉజ్జయిని, దలోదా తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు వెల్లుల్లిని తాడేపల్లిగూడెంలోని హోల్సేల్ మార్కెట్కు తీసుకువస్తుంటారు. ఇక్కడి నుంచే ఉమ్మడి ఉభయ గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, కృష్ణాజిల్లాల్లోని రిటైల్ మార్కెట్లకు తరలిస్తుంటారు. తాడేపల్లిగూడెం మార్కెట్కు గతంలో రోజుకు 125 టన్నుల నుంచి 150 టన్నుల వరకు దిగుమతులు జరిగేవి. వెల్లుల్లి పంట దేశంలో అత్యధికంగా మధ్యప్రదేశ్లో సాగవుతుండగా రాజస్థాన్, గుజరాత్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గతేడాది ధర ఆశాజనకంగా లేక రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపడంతో వెల్లుల్లి సాగు విస్తీర్ణం తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. ఉన్నకొద్ది నిల్వలను అక్కడి వ్యాపారులు భారీ ఎత్తున స్టాకులు పెట్టడంతో కృత్రిమ కొరత ఏర్పడి కొద్దినెలలుగా ధర పెరుగుతూ వచ్చింది. సాధారణంగా వెల్లుల్లి సైజు, పాత, కొత్త రకాన్ని బట్టి పది వరకు క్వాలిటీల్లో విక్రయిస్తుంటారు. వారం పదిరోజుల క్రితం వరకు వాటి క్వాలిటీ మేరకు హోల్సేల్ ధర కిలో రూ.180 నుంచి రూ.380 వరకు అమ్మకాలు జరిగాయి. రిటైల్ మార్కెట్లోకి వచ్చేసరికి మంచి క్వాలిటీ వెల్లుల్లి కిలో రూ.450 వరకు చేరింది. పదేళ్ల క్రితం అత్యధికంగా కిలో రూ.220 నుంచి రూ.350 వరకు చేరినట్టు హోల్సేల్ వ్యాపారులు చెబుతున్నారు. తర్వాత అంత ఎక్కువగా ధర పెరగడం మళ్లీ ఇప్పుడే చూస్తున్నామని చెబుతున్నారు. ధర పెరగడంతో ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్కు 25 నుంచి 50 టన్నుల లోపు సరుకు మాత్రమే వస్తున్నట్టు తెలిపారు. వారం రోజులుగా కొత్త పంట మార్కెట్లోకి వస్తుండటంతో నాణ్యతను బట్టి హోల్సేల్ ధర రూ.130 నుంచి రూ.280 వరకు ఉంది.అయితే కొత్త పంట పాయల్లో తేమశాతం ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా త్వరగా పాడైపోతుంటాయి. ప్రస్తుతం కొత్త పంట రాకతో ధర కొంత తగ్గడం మూన్నాళ్ల ముచ్చటేనని హోల్సేల్ వ్యాపారి ఒకరు తెలిపారు. రెండు మూడు నెలల తర్వాత మధ్యప్రదేశ్ నుంచి మళ్లీ ఆరబెట్టిన వెల్లుల్లి మార్కెట్లోకి వస్తే ధరలు తగ్గే అవకాశం ఉందన్నారు. వినియోగదారుల బెంబేలు మసాల కూరలు వండాలంటే వెల్లుల్లి తప్పనిసరి. నాన్వెజ్ వంటకాలకు ఎక్కువగా ప్రాధాన్యమిచ్చే కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వెల్లుల్లి వినియోగం ఎక్కువ. ఇప్పటికే పప్పుదినుసులు, నూనెలు, ఇతర నిత్యావసర సరుకుల ధరలకు రెక్కలొచ్చి సామాన్యుల జీవనం దుర్భరంగా మారింది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో క్వాలిటీ వెల్లుల్లి కిలో రూ.450 ఉండటంతో గతంలో అరకిలో, కిలో చొప్పున కొనుగోలు చేసే వినియోగదారులు మరింత తగ్గించి కొనుగోళ్లు చేస్తున్నారు. కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లిఇక, పూర్తిస్థాయిలో దిగుమతులు లేక ఉల్లి ధర దిగిరావడం లేదు. నాసిక్, షోలాపూర్ నుంచి తాడేపల్లిగూడెం హోల్సేల్ మార్కెట్కు రోజుకు 150 టన్నులు ఉల్లిపాయలు వస్తున్నాయి. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోని ఏలూరు, కాకినాడ, రాజమహేంద్రవరం, భీమవరం, మండపేట, నరసాపురం తదితర ప్రాంతాలకు ఇక్కడి నుంచే రిటైల్ వ్యాపారులు తీసుకువెళుతుంటారు. ప్రస్తుతం హోల్సేల్ ధర క్వాలిటీని బట్టి రూ.10 నుంచి రూ.35 వరకు ఉండగా రిటైల్ మార్కెట్లో రూ.20 నుంచి రూ.50 వరకు ఉంటోంది. గతంలో నాణ్యమైన ఉల్లి రూ.25లోపే ఉండగా ప్రస్తుతం రెట్టింపై వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతోంది. -
జ్వరంతో బాధపడుతున్నారా? వెల్లుల్లి రసంతో అద్భుతం!
ప్రస్తుతం ఎక్కడ చూసినా జలుబు, దగ్గు, వైరల్, డెంగీ జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడంతో పాటు, కొన్ని ఇంటి చిట్కాల ద్వారా ఇలాంటి సమస్యలకు వెల్లుల్లి రసం లేదా వెల్లుల్లి చారు అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే జ్వరం తగ్గిన తరువాత నోటికి ఏమీ రుచించని వారికి కూడా ఇది చక్కటి పరిష్కారం. ఈ చారుతో అనేక ఇతర లాభాలు కూడా ఉన్నాయి. మరి వెల్లుల్లి చారు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం రండి!కావాల్సిన పదార్థాలువెల్లుల్లి , కొద్దిగా చింతపండు, టమాటాలు, మిరియాలు, చారు పొడి, తాలింపు దినుసులు , పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు, కొత్తిమీర.వెల్లుల్లి చారు తయారీ విధానం:ముందుగా వెల్లుల్లిని అట్ల కాడ సన్నని మొనకు గుచ్చి నిప్పుల మీద కాల్చుకోవాలి. ఆ తరువాత వీటికి కాసిన్ని మిరియాలు జోడించి చెక్కముక్కగా (మరీ మెత్తగా కాకుండా) దంచుకోవాలి. బాగా పండిన టమాటాలతో మెత్తగా రసం తీసిపెట్టుకోవాలి. ఈ రెండూ కలిపిన నీటిలో ఉప్పు, పసుపు, చీలికలు చేసిన పచ్చిమిర్చి వేసి పొంగు వచ్చే వరకు బాగా మరిగించాలి. ఇలా మరుగుతున్నప్పుడు కొద్దిగా నానబెట్టిన చింతపండు, కరివేపాకు వేయాలి. తరువాత , ధనియాలు, కందిపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేయించుకొని తయారు చేసుకున్న రసం పొడి వేయాలి. చక్కగా మరిగి కమ్మటి వాసన వస్తున్నపుడు, పోపు గింజలు, ఇంగువతో తాలింపు వేసుకోవాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి చారు రెడీ. దీన్ని అన్నంలో గానీ, ఇష్టమున్న వారు ఇడ్లీలో కానీ వేసుకొని తినవచ్చు. -
వెల్లుల్లిని కొంటున్నారా.. ఇది తెలిస్తే
ఘాటైన వాసన దాని సహజ లక్షణం. అందుకే దాన్ని చూడగానే చాలామంది ముక్కు చిట్లాస్తారు. కానీ అదిలేని వంటిల్లు సాధారణంగా ఉండదు. ఎందుకంటే ఆ ఘాటే నోరూరించే రుచికి కారణం. ఆ ఘాటే ఆరోగ్యానికి అద్భుతమైన ఔషదం. అందుకే పప్పు నుంచి చికెన్ దాకా ఏది వండాలన్నా వెల్లుల్ని ఉండాల్సిందే. అలాంటి దివ్య ఔషదాలున్న వెల్లుల్ని ధరలు విపరీతంగా ఉన్నాయి. ఆ డిమాండ్ను క్యాష్ చేసుకునేందుకు కొందరు కాసుల కక్కుర్తికోసం అడ్డదార్లు తొక్కుతున్నారు.మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో సిమెంట్తో తయారు చేసిన నకిలీ వెల్లుల్లి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్గా మారింది.ఆ వీడియోలో వెల్లుల్ని పొట్టు ఒలిచిన తర్వాత రాయిలా గట్టిగా ఉండడం మనకు కనిపిస్తుంది. ఆ దృశ్యాలు ఇప్పుడు వినియోగదారుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి.దేశవ్యాప్తంగా వెల్లుల్లి ధరలు విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో కొన్ని కూరగాయల మార్కెట్లలో నకిలీ వెల్లుల్లిని విక్రయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో తాజా వెలుగులోకి వచ్చిన కొనుగోలు దారులలో భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్న వెల్లుల్ని స్వచ్ఛతపై అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు.देशभर में लहसुन के दाम फिलहाल आसमान छू रहे हैं। इस बीच एक हैरान करने वाला मामला सामने आया है, जहां महाराष्ट्र के अकोला में कुछ फेरीवाले नागरिकों को सीमेंट से बना नकली लहसुन बेचकर धोखा दे रहे हैं। #Garlic #Maharashtra #Akola इनपुट्स: धनंजय साबले pic.twitter.com/Q4v1hZBhR9— सत्य सनातन भारत (Modi ka parivar)🚩🙏🕉️🙏🕉 (@NirdoshSha33274) August 18, 2024 -
వెల్లుల్లి కూరగాయ లేదా సుగంధ ద్రవ్యమా? హైకోర్టు ఏం చెప్పిందంటే..
వెల్లుల్లి మసాలాకు చెందిందా, కూరగాయనా అనే సందేహం ఎప్పుడైనా వచ్చింది. కానీ అది పెద్ద చర్చనీయాంశంగా మారి సుదీర్ఘ న్యాయ పోరాటానికి దారితీసింది. చివరికి హైకోర్టు తీర్పుతో ఆ న్యాయ పోరాటానికి తెరపడింది. వంటగదికి మసాలాకు చెందిన ఈ వెల్లుల్లి విషయంలో హైకోర్టు ఏం పేర్కొంది?. అసలు ఏం జరిగింది అంటే..భారతీయ వంటకాలలో ప్రధానమైన వెల్లుల్లి మధ్యప్రదేశ్లో కూరగాయ? లేదా మసాలాకు చెందిందా? అనే వర్గీకరణపై సుదీర్ఘ న్యాయపోరాటానికి కారణమయ్యింది. ఈ వివాదాన్ని ఇటీవలే మధ్యప్రదేశ్ హైకోర్టు పరిష్కరించింది. ఇది రైతులు, వ్యాపారుల పై గణనీయమైన ప్రభావాన్ని చూపించింది. 1972 వ్యవసాయోత్పత్తి మార్కెట్ కమిటీ చట్టం కారణంగా ఈ వివాదం మొదలయ్యింది. ఇది వెల్లుల్లిని సుగంధ ద్రవ్యంగా వర్గీకరించింది. నిర్దిష్ట మార్కెట్లలో దాని అమ్మేలా పరిమితం చేసింది. ఇది రైతులను మరింత సమస్యల్లోకి నెట్టేసింది. వారు వ్యవసాయ మార్కెట్లలో అమ్ముకునే వీలులేక ఇబ్బందులు పడేవారు. దీంతో 2007లో మాంద్సౌర్కు చెందిన ఒక వెల్లుల్లి వ్యాపారి ఈ వర్గీకరణను సవాలు చేస్తూ, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్లో వెల్లుల్లిని విక్రయించడానికి అనుమతి కోరడం జరిగింది. పొటాటో ఆనియన్ కమీషన్ అసోసియేషన్ నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ, మండి బోర్డు మొదట్లో వెల్లుల్లి విక్రయానికి కొంత వెసులుబాటు కల్పించింది. ఐతే ఎప్పుడైతే వ్యవసాయ మార్కెట్లలో మాత్రమే వెల్లుల్లి విక్రయించాలని మధ్యప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఆదేశించారో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో అసంతృప్తి చెందిన వ్యాపారులు హైకోర్టుని ఆశ్రయించగా చివరికి రైతులకు అనుకూలంగా తీర్పునిస్తూ..వెల్లులిని ఏ మార్కెట్లో అయినా విక్రయించేందుకు అనుమతిచ్చింది. ఈ నిర్ణయాన్ని హైకోర్టు డబుల్ బెంచ్ సమర్థించింది, వెల్లుల్లి వ్యవసాయ ఉత్పత్తి హోదాను పునరుద్ఘాటించింది. అయితే, పొటాటో ఆనియన్ కమీషన్ అసోసియేషన్ రివ్యూ పిటిషన్ను దాఖలు చేసింది. ధర్మాసనం దీన్ని తోసిపుచ్చి మరీ వ్యవసాయ లేదా కూరగాయల మార్కెట్లలో వెల్లుల్లిని విక్రయించడానికి రైతులకు వెసులుబాటును మంజూరు చేసింది. అంతలా వివాదం రేకెత్తించిన ఈ వెల్లుల్లితో చేసే వంటకాలేంటో చూద్దామా..వెల్లుల్లి చట్నీఇది ప్రధానంగా వెల్లుల్లి, ఎర్ర మిరపకాయలు, మసాలా దినుసుల మిశ్రమంతో తయారుచేసే ఘాటైన చట్నీ. వెల్లుల్లిని చూర్ణం చేసి, ఆపై మిరపకాయలతో కలిపి పేస్ట్ తయారు చేస్తారు. ఇది తరచుగా చింతపండు, నిమ్మరసం లేదా వెనిగర్తో కలిపి పుల్లటి రుచితో ఉంటుంది. ఈ చట్నీని సాధారణంగా పకోరాలు లేదా సమోసాల వంటి స్నాక్స్తో పాటుగా వడ్డిస్తారు.వెల్లుల్లి సూప్వెల్లుల్లి సూప్ అనేది ఓదార్పునిచ్చే సువాసనగల వంటకం. దీనిని తరచుగా వెల్లుల్లి రెబ్బలను వివిధ రకాల కూరగాయలు లేదా చికెన్ ఉడకబెట్టిన పులుసుతో మరిగించి తయారు చేస్తారు. రెసిపీని సిద్ధం చేయడానికి, వెల్లుల్లిని ముందుగా వేయించి, ఆపై ఉల్లిపాయలు, బంగాళాదుంపలు వంటి పదార్థాలతో కలుపుతారు. ఈ వేడెక్కడం సుగంధ సూప్ చల్లని సీజన్లో రోజులో ఏ సమయంలోనైనా ఆస్వాదించడానికి అనువైనది.వెల్లుల్లి ఊరగాయవెల్లుల్లి ఊరగాయ అనేది ఆవాల నూనె, సుగంధ ద్రవ్యాల మిశ్రమంలో మొత్తం వెల్లుల్లి రెబ్బలను మెరినేట్ చేయడం ద్వారా తయారు చేయబడిన స్పైసీ ఊరగాయ. కొన్నిసార్లు వెనిగర్ లేదా నిమ్మరసం కూడా ఉపయోగిస్తారు. వెల్లుల్లి, లవంగాల చూర్ణం కూడా జోడిస్తారు. ఇది అన్నం, రోటీ లేదా పరాఠాల్లో బాగుటుంది. వెల్లుల్లి బ్రెడ్గార్లిక్ బ్రెడ్ అనేది రొట్టెతో కూడిన ఒక ప్రియమైన ఆకలి లేదా సైడ్ డిష్. వెన్న, మెత్తగా తరిగిన వెల్లుల్లి, పార్స్లీ వంటి మూలికల మిశ్రమంతో దీన్ని తయారు చేస్తారు. దీనిలో బయట మంచిగా కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండేలా బ్రెడ్ని కాల్చుతారు. గార్లిక్ బ్రెడ్ సాధారణంగా పాస్తా లేదా సూప్లతో వడ్డిస్తారు.(చదవండి: 'అరంగేట్రం' చేసిన తొలి నర్తకిగా 13 ఏళ్ల చైనా విద్యార్థిని రికార్డు..!) -
వెల్లుల్లిని కాల్చి తింటే ఎన్ని లాభాలో.. తెలిస్తే అస్సలు వదలరు!
వంటకాల్లో విరివిగా వాడే వెల్లుల్లితో అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయి. ఔషధ గుణాలు కూడా మెండుగా ఉన్నాయి. సుగంధ ద్రవ్యంగానూ, వెజ్, నాన్వెజ్ కూరల్లోనూ, పచ్చళ్లల్లోనూ వాడుకుంటాం. అలాగే పచ్చి వెల్లుల్లిని వేడి వేడి అన్నంలో ముందు ముద్దలో తీసుకోవడం కూడా పెద్దవాళ్లకి అలవాటు. అంతేకాదు కాల్చిన వెల్లుల్లిని తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం! వెల్లుల్లిని కాల్చినప్పుడు రుచి పెరగడంతోపాటు, దాంట్లోని ఆరోగ్య ప్రయోజనాలు మరింత పెరుగుతాయట. విటమిన్ B6, విటమిన్ సీ, సెలీనియం వంటి యాంటీఆక్సిడెంట్ మూలకాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇందులోని అధిక స్థాయి యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.ప్రతిరోజు ఆహారంలో వెల్లుల్లి చేర్చుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే పదార్థం గుండెకు బలాన్నిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.రక్త ప్రసరణను మెరుగుపర్చి, రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుంది. వెల్లుల్లిలోని క్వెర్సెటిన్ , కెంప్ఫెరోల్ వంటి సమ్మేళనాలే దీనికి కారణం.వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ కారకాలు బీపీని తగ్గించడంలో సాయపడతాయి.షుగర్ స్థాయిలను తగ్గించడంలో వెల్లుల్లి పనిచేస్తుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది సున్నాగా ఉంటుంది. శరీరంలో ఉన్న ఇన్సూలిన్స్ స్థాయిలను రెగ్యులేట్ చేయడంలో ఉపయోగపడుతుంది.కాల్చిన వెల్లుల్లి కొన్ని రకాల కేన్సర్ల బారినుంచి రక్షిస్తుంది. కడుపు కేన్సర్, పెద్దప్రేగు కేన్సర్ , పేగు కేన్సర్ , రొమ్ము కేన్సర్ , ప్రోస్టేట్ కేన్సర్ల నివారణలో సాయపడుతుంది. డయాలిల్ సల్ఫైడ్ , అల్లైల్ సిస్టీన్ సల్ఫాక్సైడ్ వంటి సమ్మేళనాలను కలిగి ఉండడమే దీనికి కారణం. పురుషుల్లో లైంగిక పటుత్వానికి కూడా వెల్లుల్లి చాలా బాగా ఉపయోగపడుతుంది.బాలింతల్లో పాలు సమృద్ధిగా రావడానికి కూడా వెల్లుల్లిని వాడతారు. -
వెల్లుల్లితో మొటిమలు మటుమాయం? నిపుణులు ఏమంటున్నారు?
వెల్లుల్లి గురించి దాదాపు తెలియని వారుండరు. మరో విధంగా చెప్పాలంటే వెల్లుల్లి లేని మసాలా వంట ఉండదు. కొంతమందికి వెల్లుల్లి వానస నచ్చనప్పటికీ, అల్లంవెల్లుల్లి మిశ్రమం వేసిన తరువాత ఏ రెసిపీ అయినా రుచి రెట్టింపు అవ్వడమేకాదు వాసన కూడా ఘుమ ఘమ లాడాల్సిందే. వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే సౌందర్య పోషణగా కూడా పనిచేస్తుందంటారు. మరి ఈ విషయంలో నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.ఆరోగ్యానికి వెల్లుల్లి సంజీవని: ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. దీనిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల, మధుమేహం, బీపీ నియంత్రణలో ఉంటాయి. శరీరంలోని ఎర్రరక్తకణాలు వెల్లుల్లిలో ఉండే సల్ఫైడ్స్ను హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్గా మారుస్తుంది. ఈ గ్యాస్ రక్తపోటును నియంత్రిస్తుంది.అందేకాదు ఇది చర్మాన్ని కాపాడుతుంది. మొటిమలు, యాక్నె, నల్లమచ్చలు వంటివి బాధిస్తున్నా, చర్మం మెరవాలన్నా పచ్చి వెల్లుల్లి మంచి ఉపశమనంగా పనిచేస్తుంది.వెల్లుల్లికి రక్తాన్ని శుద్ధిచేసే గుణం ఉంది.వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఖాళీ కడుపుతో నాలుగు వెల్లుల్లి రెబ్బలు తినటం వల్ల మధుమేహాన్ని నయం చేస్తుంది. అలాగే రోజుకు కొన్ని వెల్లుల్లి రెమ్మలు తింటే జిమ్కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే బరువు తగ్గవచ్చట. వెల్లుల్లి జీర్ణాశయంలోని ఎంజైములను ఉత్తేజపరచడం వల్ల బరువు తగ్గుతారు. కొవ్వును కరిగించడంలో వెల్లుల్లికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. మ్యాజిక్ క్యూర్పచ్చి వెల్లుల్లి మోటిమలకు మ్యాజిక్ క్యూర్గా పనిచేస్తుందని ఇటీవల ఒక .బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్స్టా వీడియో వైరల్ అయిందితన 'రాత్రిపూట చర్మ సంరక్షణ దినచర్య'లో భాగంగా పచ్చి వెల్లుల్లి రెబ్బను తీసుకొని నేరుగా తీసుకుంది. పచ్చి వెల్లుల్లిని తీసుకోవడం చాలా మొండి సిస్టిక్ మొటిమలకు కూడాపనిచేస్తుందని కొంతమంది పేర్కొన్నారు. కొంతమంది కూడా సానుకూలంగా స్పందించగా మరికొందరు మాత్రం తమ సమస్యమరింత ఎక్కువైందని కమెంట్ చేయడం గమనార్హం.నిపుణుల మాట► వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్ , క్రిమినాశక లక్షణాలు ఉన్నాయి.► వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ మొటిమలకుకారణమైన బ్యాక్టీరియాను (ప్రొపియోనిబాక్టీరియం) నిరోధిస్తుంది► రక్త ప్రసరణను మెరుగుపరిచే లక్షణంగా కారణంగా, సేబాషియస్ గ్రంధి, వెంట్రుకల కుదుళ్లలో అనేక అడ్డుపడే పదార్థాలు క్లియర్ అవుతాయి.►వెల్లుల్లిలో జింక్,ఇతర విటమిన్లు ,ఖనిజాలు కూడా ఉన్నాయి. జింక్ మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది.►వెల్లుల్లిలోని థియోసల్ఫేట్లు (సల్ఫర్ సమ్మేళనం) యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి.నోట్ : ఇది పలువురు నిపుణుల, రిపోర్టులు ఆధారిత కథనం మాత్రమే. ఈ చిట్కాలు కొందరిలో ప్రతికూల ప్రభావం ఉండవచ్చు. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య తలెత్తినా వైద్యులను సంప్రదించడం మేలు. -
వెల్లుల్లితో మొటిమలు మటుమాయం? నిపుణులు ఏమంటున్నారు?
వెల్లుల్లి గురించి దాదాపు తెలియని వారుండరు. మరో విధంగా చెప్పాలంటే వెల్లుల్లి లేని మసాలా వంట ఉండదు. కొంతమందికి వెల్లుల్లి వానస నచ్చనప్పటికీ, అల్లంవెల్లుల్లి మిశ్రమం వేసిన తరువాత ఏ రెసిపీ అయినా రుచి రెట్టింపు అవ్వడమేకాదు వాసన కూడా ఘుమ ఘమ లాడాల్సిందే. వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే సౌందర్య పోషణగా కూడా పనిచేస్తుందంటారు. మరి ఈ విషయంలో నిపుణులు ఏమంటున్నారో చూద్దాం. ఆరోగ్యానికి వెల్లుల్లి సంజీవని: ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. దీనిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల, మధుమేహం, బీపీ నియంత్రణలో ఉంటాయి. శరీరంలోని ఎర్రరక్తకణాలు వెల్లుల్లిలో ఉండే సల్ఫైడ్స్ను హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్గా మారుస్తుంది. ఈ గ్యాస్ రక్తపోటును నియంత్రిస్తుంది.అందేకాదు ఇది చర్మాన్ని కాపాడుతుంది. మొటిమలు, యాక్నె, నల్లమచ్చలు వంటివి బాధిస్తున్నా, చర్మం మెరవాలన్నా పచ్చి వెల్లుల్లి మంచి ఉపశమనంగా పనిచేస్తుంది.వెల్లుల్లికి రక్తాన్ని శుద్ధిచేసే గుణం ఉంది. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఖాళీ కడుపుతో నాలుగు వెల్లుల్లి రెబ్బలు తినటం వల్ల మధుమేహాన్ని నయం చేస్తుంది. అలాగే రోజుకు కొన్ని వెల్లుల్లి రెమ్మలు తింటే జిమ్కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే బరువు తగ్గవచ్చట. వెల్లుల్లి జీర్ణాశయంలోని ఎంజైములను ఉత్తేజపరచడం వల్ల బరువు తగ్గుతారు. కొవ్వును కరిగించడంలో వెల్లుల్లికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. మ్యాజిక్ క్యూర్ పచ్చి వెల్లుల్లి మోటిమలకు మ్యాజిక్ క్యూర్గా పనిచేస్తుందని ఇటీవల ఒక .బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్స్టా వీడియో వైరల్ అయిందితన 'రాత్రిపూట చర్మ సంరక్షణ దినచర్య'లో భాగంగా పచ్చి వెల్లుల్లి రెబ్బను తీసుకొని నేరుగా తీసుకుంది. పచ్చి వెల్లుల్లిని తీసుకోవడం చాలా మొండి సిస్టిక్ మొటిమలకు కూడాపనిచేస్తుందని కొంతమంది పేర్కొన్నారు. కొంతమంది కూడా సానుకూలంగా స్పందించగా మరికొందరు మాత్రం తమ సమస్యమరింత ఎక్కువైందని కమెంట్ చేయడం గమనార్హం. నిపుణుల మాట ► వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్ , క్రిమినాశక లక్షణాలు ఉన్నాయి. ► వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ మొటిమలకుకారణమైన బ్యాక్టీరియాను (ప్రొపియోనిబాక్టీరియం) నిరోధిస్తుంది ► రక్త ప్రసరణను మెరుగుపరిచే లక్షణంగా కారణంగా, సేబాషియస్ గ్రంధి, వెంట్రుకల కుదుళ్లలో అనేక అడ్డుపడే పదార్థాలు క్లియర్ అవుతాయి. ►వెల్లుల్లిలో జింక్,ఇతర విటమిన్లు ,ఖనిజాలు కూడా ఉన్నాయి. జింక్ మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. ►వెల్లుల్లిలోని థియోసల్ఫేట్లు (సల్ఫర్ సమ్మేళనం) యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. నోట్ : ఇది పలువురు నిపుణుల, రిపోర్టులు ఆధారిత కథనం మాత్రమే. ఈ చిట్కాలు కొందరిలో ప్రతికూల ప్రభావం ఉండవచ్చు. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య తలెత్తినా వైద్యులను సంప్రదించడం మేలు. -
వంట దినుసులే కదా అని తేలిగ్గా తీసుకోకండి!
మన వంట గదే ఔషధాల నిలయం. మనకు తెలియకుండానే మన పూర్వీకులు, పెద్ద వాళ్లు అలవాటు చేసిన, చెప్పిన పద్దతుల ద్వారా కొన్ని ఆరోగ్యకరమైన దినుసులు, మసాలాలను వాడుతుంటాం. ముఖ్యంగా పసుపు, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు ఇలా ప్రతిదీ మన ఆరోగ్యానికి మేలు చేసేవే! ఆయుర్వేద గుణాలు పుష్కలంగా ఉండటంతో పాటు, వాడాల్సిన పద్దతిలో వీటిని వాడితే అదనపు రుచిని అందిస్తాయి. అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయి. అలాంటి వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం. పసుపు: అనేక యాంటి బయోటిక్ గుణాలు, పోషకాలు ఇందులో ఉన్నాయి. అందుకే ప్రతీ కూరలోనూ చిటికెడు పసుపు వేయడం మన భారతీయులకు అలవాటు. పసుపులో ఉండే కర్కుమిన్ ఇతర యాంటీ ఆక్సిడెంట్లు శ్వాసకోశ మంటను తగ్గిస్తాయి. రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్లు మొదలైన వాటి నుంచి కాపాడుతుంది. జలుబు చేసినపుడు పసుపు ఆవిరిపట్టడం, పసుపు,పాలు తాగడం, గాయాలకు పూయడం లాంటివి కూడా మంచిదే. అల్లం: రోజువారీ వినియోగంలో అల్లం పాత్ర చాలా పెద్దదే. అల్లంలో ఉండే జింజెరాల్ అనే సమ్మేళనం శ్వాసకోశ మంటను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యవస్థకు మేలు జరుగుతుంది. శ్లేష్మం తగ్గించడంలో సాయపడుతుంది. శ్వాస ఒత్తిడిని తగ్గిస్తుంది. అల్లంతో శరీరంలో జీర్ణశక్తి పెరుగుతుంది. కండరాల నొప్పులు తగ్గుతాయి. ఉదయాన్ని టీలో అల్లం కలుపుకుని తింటే అనారోగ్యం దరిచేరదు. అల్లాన్ని పచ్చిగా నమిలినా సరే లేదా తేనెతో కలిపి తిన్నా, జ్యూస్లా చేసుకుని తాగినా మంచిదే. వెల్లుల్లి: వెల్లుల్లి వంటలకు రుచి, వాసనను అందిచడమే కాకుండా జీర్ణ ప్రక్రియను సులభ తరం చేస్తుంది. వెల్లుల్లి తినడం వల్ల అనేక వ్యాధులను నివారించవచ్చు. ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు నీటితోపాటు వెల్లుల్లి రెబ్బను తింటే,జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు జీర్ణ సమస్యలు దూరమవుతాయి. అంతేకాదు శరీర బరువు కూడా తగ్గించేందుకు దోహద పడుతుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, బీలు వ్యాధులకు నివారణలో పని చేస్తాయి. ఊపిరితిత్తులను క్లీన్ చేస్తుంది. అలోసిన్-సల్ఫర్ సమ్మేళనం వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. ఒరేగానో: వంటకాల్లో ఉపయోగించే ఒరేగానో హెర్బ్, యాంటీ-మైక్రోబయల్ లక్షణాలు కలిగి ఉంది. దగ్గు, ఆస్తమా, బ్రోన్కైటిస్, శ్వాసకోశ వాపు, క్షయవ్యాధి నివారణకు సహాయపడుతుంది. రుమాటిజం, తిమ్మిరి, మైగ్రేన్లు, ఉబ్బరం, ఆకలి లేకపోవడం, విరేచనాలు, కామెర్లు , వంటి ఇతర కాలేయ వ్యాధులకు ఒరేగానోను ఉపయోగిస్తారు. ఈ ఆకుల్లో పాలీ ఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉన్నాయి. జలుబు, దగ్గు మొదలైన బ్యాక్టీరియా, వైరస్ల వల్ల వచ్చే సమస్యల నుంచి రక్షించడంలో సాయపడుతుంది. -
ఆ వెల్లుల్లికి జీఐ ట్యాగ్!
మధ్యప్రదేశ్లోని రియావాన్ గ్రామానికి చెందిన వెల్లుల్లికి జియోగ్రాఫికల్ ఇండికేషన్(జీఐ) ట్యాగ్ లభించింది. రియాన్ వెల్లులి జీఐ నమోదు కోసం చెన్నైలోని రైతు ఉత్పత్తుల సంస్థ(ఎఫ్పీఓ) రియావాన్ ఫార్మ్ ఫ్రెష్ ప్రొడ్యూసర్ కంపెనీ జనవరి 2022 నుంచి ప్రారంభించింది. ఉద్యానవన శాఖ, మధ్యప్రదేశ్ ప్రభుత్వం జిల్లా పరిపాలన సహకారంతో మార్చి 2న రియాన్ వెల్లుల్లి ఈ జిఐ ట్యాగ్ని పొందింది. ఆ రాష్ట్ర ఎమ్మెల్యే పాండే, వ్యవసాయమంత్రి, ముఖ్యమంత్రి అభ్యర్థనలు అసెంబ్లీలో ఆమోదం పొందడంతో ఆ వెల్లుల్లి ఈ ప్రతిష్టాత్మక ట్యాగ్ని పొందగలిగింది. ఈ వెల్లుల్లి ప్రత్యేకత.. ఈ వెల్లుల్లి ప్రతి రెమ్మ లవంగంతో సరిపడ ఘాటు ఉంటుంది. దీనిలో అధిక నూనె ఉంటుంది. ఈ వెల్లుల్లిని రియావాన్ సిల్వర్ గార్లిక్ అని కూడా పిలుస్తారు. దేశంలోనే అత్యధిక డిమాండ్ కలిగిన వెల్లుల్లి ఇది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది ఇతర వెల్లుల్లిపాయల కంటే మంచి సువాసనతో కూడిన ఘాటు ఉంటుంది. చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇక్కడ గ్రామస్తులు దశాబ్దాలుగా ఈ వెల్లుల్లిని సంప్రదాయ పద్ధతిలో సాగు చేస్తుండటం విశేషం. పొరగు ప్రాంతా వారు ఇక్కడ రైతుల నుంచి రియావాన్ వెల్లుల్లి విత్తనాలను పట్టుకెళ్తుంటారు. నాణ్యతకు, అధిక దిగుబడికి పెట్టింది పేరు ఈ వెల్లుల్లి (చదవండి: మొక్కలతో భారత్ మాత అని రాసి గిన్నిస్ రికార్డు!) -
కోటీశ్వరుణ్ణి చేసిన వెల్లుల్లి సాగు.. రూ 25 లక్షలకు రూ. కోటి ఆదాయం!
దేశవ్యాప్తంగా వెల్లుల్లి ధరలు భారీగా పెరిగాయి. ఒకప్పుడు కిలో రూ.70-80 పలికిన వెల్లుల్లి ఇప్పుడు రూ.400-500కు చేరింది. దీనివల్ల సామాన్యులపై భారం పడినా, వెల్లుల్లి పండించిన రైతులు అత్యధిక లాభాలతో ఆనందంలో మునిగితేలుతున్నారు. మధ్యప్రదేశ్లోని చింద్వారాకు చెందిన రైతు రాహుల్ దేశ్ముఖ్ వెల్లుల్లిని విక్రయించడం ద్వారా కోటి రూపాయల లాభం పొందాడు. 25 లక్షల పెట్టుబడితో రాహుల్ ఇంతటి లాభం పొందాడు. కాగా రాహుల్ తన వెల్లుల్లి పంటను కాపాడుకునేందుకు పొలాల్లో సీసీ కెమెరాలను అమర్చుకోవాల్సి వచ్చింది. ఇందుకోసం రాహుల్ సౌరశక్తితో నడిచే సీసీ కెమెరాలను అమర్చాడు. రాహుల్ దేశ్ముఖ్ ఛింద్వారాకు 20 కిలోమీటర్ల దూరంలోని సవారి గ్రామంలో ఉంటున్నాడు. రాహుల్ దేశ్ముఖ్ దాదాపు 13 ఎకరాల్లో వెల్లుల్లిపాయలు సాగుచేశాడు. ఇంకా మిగిలిన తన పొలంలో టమాటా సాగు చేశాడు. అయితే కొద్దిరోజుల క్రితం అతని పొలంలో 25-30 కిలోల టమోటాలు అపహరణకు గురయ్యాయి. ఆ తర్వాత రాహుల్ దేశ్ముఖ్ రూ.10వేలు వెచ్చించి పొలాన్ని పర్యవేక్షించేందుకు మూడు సీసీ కెమెరాలు అమర్చాడు. రాహుల్ పొలంలో దాదాపు 150 మంది కూలీలు పనిచేస్తున్నారు. రాహుల్ దేశ్ముఖ్ మీడియాతో మాట్లాడుతూ ఇటీవలే పెద్దఎత్తున వెల్లుల్లి సాగు చేశానని తెలిపాడు. పెరుగుతున్న వెల్లుల్లి ధరలను దృష్టిలో ఉంచుకుని , వాటిని సాగుచేస్తున్నానని, అయితే భద్రతా కారణాల దృష్ట్యా పొలంలో సీసీ కెమెరాలు అమర్చానని అన్నాడు. రాహుల్ తాను పండించిన వెల్లుల్లిని హైదరాబాద్కు కూడా పంపే యోచనలో ఉన్నాడు. వెల్లుల్లి ధరల్లో ఇంత భారీ పెరుగుదల ఇటీవలి కాలంలో ఎన్నడూ లేదని నిపుణులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం వెల్లుల్లి ధర గరిష్టంగా రూ.80-90 వరకు మాత్రమే ఉంటుందని రైతులు చెబుతున్నారు. చింద్వారాలోని బద్నూర్లో నివసించే మరో రైతు పవన్ చౌదరి కూడా తన 4 ఎకరాల పొలంలో వెల్లుల్లిని నాటాడు. ఇందుకు రూ.4 లక్షలు ఖర్చు చేయగా, ఇప్పటి వరకు రూ.6 లక్షల లాభం వచ్చింది. తన పొలాన్ని పర్యవేక్షించేందుకు ఆయన కూడా మూడు సీసీ కెమెరాలను అమర్చాడు. -
కొండెక్కిన వెల్లుల్లి ..ఈ చిట్కాలు ఫాలోకండి!
దేశంలో ఇటీవల కురిసిన వర్షాలకు వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. దీంతో ఉల్లి ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరాయి. మొన్నమొన్నటి నుంచి తగ్గుతూ రాగా, ఇప్పుడు వెల్లుల్లి ధరలు అమాంతం కొండెక్కాయి. మార్కెట్లో ప్రస్తుతం కిలో వెల్లుల్లి ధర రూ.400 నుంచి రూ. 500 వరకు పలుకుతుంది. ఇలాంటప్పుడూ మహిళలు స్పైసీ కూరలు ఎలా వండి పెట్టగలం అన్న సందిగ్ధంలో పడిపోతారు. పైగా వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదని తాలింపుల దగ్గరి నుంచి ప్రతి దాంట్లోని తప్పనిసరిగా వాడేస్తుంటారు. అలాంటిది వెల్లుల్లి వాడకం లేకుండా గడపడం అంటే..కొందరికి చాల కష్టం. అలాంటివారు ప్రత్యామ్రాయంగా ఇలాంటి వాటితో వెల్లుల్లి ప్లేస్ని భర్తీ చేసుకోవచ్చు. వెల్లుల్లి బదులుగా ఏం ఉపయోగించొచ్చంటే.. సింపుల్ చిట్కాలు.. ముందుగా మీ కిచెన్ కప్బోర్డ్లో ఎన్ని వెల్లులిపాయలు ఉన్నాయో చూడండి. వాటిని పాయలుగా విడదీయండి. ఆ తర్వాత చక్కగా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఎండలో పెట్టి బాగా ఎండనివ్వండి. ఇక వాటిని చక్కగా పొడి చేసుకుని పాడవ్వకుండా చిన్న లవంగ మొగ్గ వేసి గాలి చొరబడి డబ్బాలో నిల్వ ఉంచండి. ఈ పొడి వెల్లులి మాదిరి రుచిని సువాసనను తెప్పిస్తుంది కూరకి. ఇది మంచి ప్రత్యామ్నాయం. అలాగే ఈ వెల్లుల్లి పొడికి కాస్త ఉప్పు చేరిస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అయితే కూరల్లో ఈ పొడిని ఉపయోగిస్తున్నట్లయితే కాస్త ఉప్పు తగ్గించండి. అప్పుడు కూర రుచికి వెల్లుల్లికి దగ్గదగ్గరగా మంచి రుచిని అందిస్తుంది. అస్సలు ఇంట్లో వెల్లుల్లి లేదంటే పచ్చి ఉల్లిపాయాలను ఎండలో ఎండబెట్టి చక్కగా పొడి చేసుకుంటే వెల్లులి మాదిరిగా టేస్ట్ వస్తుంది కూరకి. అయితే కూరలో తక్కువ ఉల్లిపాయలను ఉపయోగిస్తే సరిపోతుంది. ఆర్థిక పరంగా సమస్య రాకుండా కొద్దిపాటి చిట్కాలతో ఇంటిని చక్కగా చక్కబెట్టుకుంటే ఆరోగ్యానికా ఆరోగ్యమే గాక ధరల సమస్యకు చెక్ పెట్టొచ్చు. (చదవండి: కళ్లు కలువ పువ్వుల్లా పెద్దవిగా ఉండాలంటే.. ఈ ఐ బ్యాండ్ ఉంటే చాలు!) -
వెల్లుల్లి ధరలకు వామ్మో అంటున్న రవళి
-
జీడిపప్పుకు సవాల్ విసిరిన వెల్లుల్లి!
వెల్లుల్లి ధరలు విపరీతంగా పెరుగుతూ, జీడిపప్పుకు సవాల్ విసురుతున్నాయి. ఛత్తీస్గఢ్లోని వైకుంఠ్పూర్, మనేంద్రగఢ్, చిర్మిరి, ఖడ్గవాన్తో సహా పరిసర ప్రాంతాల్లో కిలో వెల్లుల్లిని రూ.400 నుండి రూ.600కు విక్రయిస్తున్నారు. నెల రోజుల క్రితం కిలో వెల్లుల్లి రూ.200కు విక్రయించగా, తరువాత అంతకంతకూ పెరుగుతూవస్తోంది. స్థానిక కూరగాయల వ్యాపారి రాజ్ కుష్వాహ తెలిపిన వివరాల ప్రకారం జనవరిలో కిలో వెల్లుల్లి ధర రూ.200 ఉండగా, ప్రస్తుతం రూ.600 దాటింది. కూరల రుచిని పెంచే వెల్లుల్లి ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. ప్రస్తుతం జీడిపప్పు ధరలతో వెల్లుల్లి ధర పోటీ పడుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మార్కెట్లో కిలో జీడి పప్పు ధర రూ. 800 నుంచి 1000 మధ్య ఉంటోంది. ప్రభుత్వం వెల్లుల్లి ధరలను నియంత్రించే ప్రయత్నం చేయడంలేదని పలువురు విమర్శిస్తున్నారు. ఈసారి హోల్సేల్లో కూడా వెల్లుల్లి కిలో రూ.421 చొప్పున విక్రయిస్తున్నారు. దీంతో రిటైల్ మార్కెట్లో వెల్లుల్లి ధర రూ.600 దాటింది. గత శనివారం నుంచి కొత్త వెల్లుల్లి మార్కెట్లోకి రావడంతోనే వీటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వెల్లుల్లి ధర ఒక్కసారిగా పెరగడంపై ఈ ప్రాంత రైతు అమిత్ కుమార్ గుప్తా మాట్లాడుతూ.. గత ఏడాది అధికశాతం రైతులు వెల్లుల్లి సాగు చేశారన్నారు. దీంతో మార్కెట్లో వెల్లుల్లి ధర బాగా తగ్గిందన్నారు. దీంతో ఈ ఏడాది రైతులు వెల్లుల్లి సాగును తగ్గించారు. దీంతో మార్కెట్లో వెల్లుల్లి కొరత ఏర్పడింది. ఫలితంగా వెల్లుల్లి ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. గత ఏడాది స్థానికంగా వెల్లుల్లి ఎక్కువగా పండడంతో గిట్టుబాటు ధర లభించక రైతులు తమ పంటలను నదులు, కాలువల్లో పడేశారు. గత సంవత్సరం, వెల్లుల్లి హోల్సేల్ ధర కిలో రూ. 40. మార్కెట్ ధర దీని కంటే తక్కువగా ఉంది. దీంతో రైతులు భారీగా నష్టపోయారు. ఫలితంగా రైతులు ఈసారి వెల్లుల్లి సాగును తగ్గించారు. -
National Deworming Day: చిన్ని బొజ్జలకు కావాలి ఈ రక్ష
నులిపురుగులు చిన్న సమస్య కాదు. అలాగని పెద్ద సమస్యా కాదు. చిన్న పిల్లలను బాధించే చికాకు సమస్య. ఆరోగ్యంగా పిల్లలు ఎదగాలంటే ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ ఉండాలి. మన దేశంలో 65 శాతం మంది చిన్నారులు నులిపురుగులతో బాధ పడుతున్నారు. పూర్వం అమ్మమ్మలు, నానమ్మలు పిల్లల ప్రవర్తనలో మార్పు గమనించి నులిపురుగుల మందు వేసే వారు. ఇప్పుడు తల్లులకు వ్యవధి ఉండటం లేదు. కాని తప్పదు జాగ్రత్త. నులిపురుగులు పిల్లలను బాగా ఇబ్బంది పెడతాయి. అవి కడుపులో ఉన్నాయంటే పిల్లలు మలద్వారం వద్ద దురద ఉందని చెబుతుంటారు. పదేపదే అక్కడ గీరుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే ముక్కు ఎక్కువగా దురద పెడుతున్నా ‘కడుపులో నులిపురుగులున్నాయేమో’ అని పెద్దలు అనేవారు. ఇంతకు మునుపు పిల్లలు ఆరుబయలులో విసర్జన చేసేవారు కాబట్టి పెద్దలు నులిపురుగులు గమనించేవారు. ఇప్పుడు ఇళ్లల్లో టాయిలెట్లు వాడి ఫ్లష్ చేయడం వల్ల నులి పురుగులను గమనించే అవకాశం లేదు. పెద్దల కంటే పిల్లలకు నులి పురుగుల బెడద ఎక్కువగా ఉంటుందని గ్రహించాలి. నులి పురుగులంటే? నులి పురుగులు పేగుల్లో చేరి మన ΄ోషకాలను దొంగిలించి తినే పరాన్న జీవులు. వీటివల్ల వచ్చే ఇన్ఫెక్షన్ని ‘అస్కారియాసిస్’ అంటారు, మన దేశంలోదాదాపు 85 శాతం మంది పిల్లల్లో ఈ సమస్య స్పష్టంగా కనిపిస్తోందని ఆరోగ్య సంస్థలు ప్రకటించాయి. నులిపురుగుల వల్ల పిల్లల్లో రక్తహీనత, నీరసం, కడుపులో నొప్పి వంటి అనారోగ్య సమస్యలు కనిపిస్తాయి. అకలి మందగిస్తుంది. ‘మా పిల్లవాడు ఇంతకుముందు బాగా తినేవాడు ఇప్పుడు తినడం లేదు’ అని తల్లులు కంప్లయింట్ చేస్తారు. పిల్లల ఎదుగుదల దెబ్బతింటుంది. కొందరు పిల్లలు నులిపురుగుల వల్ల సరిగా నిద్ర΄ోలేక ఇబ్బంది పడతారు. ఎలా ప్రవేశిస్తాయి? చిన్నపిల్లలు మట్టిలో ఆడుకోవడం సర్వసాధారణం. మట్టిలో ఆడుకొని చేతులు శుభ్రం చేసుకోకుండా తింటే నోటి ద్వారా ΄పొట్ట, పేగుల్లోకి నులి పురుగులు ప్రవేశిస్తాయి. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయడం, కాళ్లకు చెప్పులు వేసుకోకుండా తిరగడం, వ్యక్తిగత శుభ్రత ΄ాటించక΄ోవడం, దుమ్ము ధూళి చేరిన కలుషిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల నులిపురుగుల సమస్య తలెత్తవచ్చు. ఏం చేయాలి? ప్రధానంగా చిన్నపిల్లల చేతి గోళ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి. గోళ్లు కొరికే అలవాటును మాన్పించాలి. ప్రతిరోజూ వేడి చేసి చల్లార్చిన మంచినీటిని మాత్రమే తాగించాలి. వైద్యుల సలహాతో అల్బెండజోల్ మాత్రలు వాడాలి. ప్రకృతి వైద్యంలో ఎనిమా ద్వారా కూడా ఈ నులి పురుగుల బెడద తొలగిస్తారు. కొన్ని సులువైన చిట్కాల ద్వారా కూడా నులిపురుగుల సమస్యను అధిగమించవచ్చు. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉండటం వల్ల నులిపురుగులను నివారించడంలో కీలక ΄ాత్ర ΄ోషిస్తుంది. రెండు వెల్లుల్లి రెబ్బలను బాగా దంచి ఆ రసంలో గ్లాసు నీటిని కలిపి తాగించడం ద్వారా కడుపులో నులిపురుగులను నివారించవచ్చు. రెండు లవంగాలను ఒక గ్లాసు నీటిలో వేసి ఆ నీటిని తాగించడం వల్ల కడుపులో నులి పురుగులను నివారించవచ్చు. బొప్పాయి పండును తినిపించడం, సన్నగా ఉండే ఆవాలను వేయించి ΄పొడిచేసి మజ్జిగలో కలిపి తాగించడం వంటి వాటి ద్వారా నులిపురుగుల బెడదను అధిగమించేలా చేయవచ్చు. అన్నింటికీ మించి వ్యక్తిగత పరిశుభ్రతను అలవాటు చేయడం అవసరం. -
ఇలా చేయండి.. వెల్లుల్లి పెంచండి
-
రొయ్యలతో.. టేస్టీ టేస్టీగా బట్టర్ గార్లిక్ ఫ్రాన్స్ చేయండిలా..!
గ్లారిక్ బటర్ ప్రాన్స్కి కావలసినవి: పచ్చిరొయ్యలు – అరకేజీ వెల్లుల్లి రెబ్బలు – ఐదు వెన్న – రెండు టేబుల్ స్పూన్లు నూనె – టేబుల్ స్పూను కారం – టీస్పూను మిరియాల పొడి – అర టీస్పూను నిమ్మరసం – టేబుల్ స్పూను కొత్తిమీర తరుగు – పావు కప్పు ఉప్పు – రుచికి సరిపడా. తయారీ విధానం: రొయ్యలను శుభ్రం చేసి, నాలుగైదు సార్లు కడగాలి. మందపాటి బాణలిలో టేబుల్ స్పూను వెన్న, నూనె వేసి మంటమీద పెట్టాలి. వెన్న కరిగిన వెంటనే కడిగిన రొయ్యలు వేసి రెండు నిమిషాలు వేయించాలి. తరువాత రుచికి సరిపడా ఉప్పు, మిరియాలపొడి వేసి కలపాలి. ఐదు నిమిషాలు మగ్గిన తరువాత వెల్లుల్లి రెబ్బలను సన్నగా తరిగి వేయాలి. రెండు నిమిషాలు తరువాత మిగిలిన వెన్న, కారం నిమ్మరసం వేసి అన్ని కలిసేలా కలపాలి. వెన్న పైకి తేలేంత వరకు వేయించాలి. వెన్న పైకి తేలిన తరువాత సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి దించేయాలి. (చదవండి: ఈజీగా బరువు తగ్గేలా..ఈ ఓట్స్ లడ్డూ ట్రై చేయండిలా!) -
పూతరేకులు.. వెరీ స్పైసీ గురూ..
సాక్షి, విశాఖపట్నం: పూతరేకు ఏంటీ.. స్పైసీగా ఉండట మేంటి...? విడ్డూరం కాకపోతేనూ...! అని అనుకుంటు న్నారా... లేదండీ... నిజమే.. ఇక నుంచి స్పైసీ పూత రేకులు మార్కెట్లో హాట్ హాట్గా కనిపించనున్నాయి. ప్రత్యేకంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం కాకరకాయ, వెల్లుల్లి కారంతో పూతరేకులను రూపొందించారు ఆత్రేయ పురానికి చెందిన తయారీదారులు. పూతరేకుల తయారీ అనేది డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయ పురం ప్రజలకు తరతరాలుగా వారసత్వంగా వస్తోంది. తొలినాళ్లలో పంచదారతోనే పూతరేకులు తయారు చేసేవారు. కాలానుగుణంగా మారుతున్న అభిరుచుల మేరకు పూతరేకుల్లోనూ అనేక రకాలు వచ్చేశాయి. బెల్లం, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వంటి వాటితో రకరకాల పూతరేకులు తయారు చేస్తున్నారు. ఇప్పుడు పూతరేకుల తయారీదారులు ట్రెండ్ మార్చారు. స్పైసీ పూతరేకులు సిద్ధం చేశారు. కాకరకాయ, వెల్లుల్లి కారంపొడితో పూతరేకు చుడతారు. డయాబెటిక్తో ఉన్నవారికి ఇది ఒక ఔషధంలా పనిచేస్తుంది. ఈ పూతరేకులు తింటే రక్తశుద్ధి, ఇన్సులిన్ సామర్థ్యం పెరిగే అవకాశాలు ఉన్నాయని తయారీదారులు చెబుతున్నారు. మార్కెట్లోకి స్సైసీ బిట్టర్గార్డ్, గార్లిక్ పూతరేకులు ఇన్నాళ్లూ పూతరేకులు తీయని రుచితో నోరూరిస్తూ.. మధుమేహ బాధితులకు మాత్రం శత్రువుగా ఉండేవి. షుగర్ ఫ్రీ పూతరేకులు అందుబాటులోకి వచ్చినా వాటిపై డయాబెటిక్ రోగులు అంతగా ఆసక్తి చూపించలేదు. అందుకే ఇప్పుడు స్వీట్ని హాట్గా తింటూ... మధుమేహాన్ని కంట్రోల్ చేసుకునేందుకు ఆత్రేయపురం వాసులు తయారు చేసిన కొత్త తరహా పూతరేకులను శుక్ర వారం మార్కెట్లోకి విడుదల చేశారు. అత్రేయపురానికి చెందిన సర్ ఆర్థర్ కాటన్ పూతరేకుల సహకార సంఘం ప్రతినిధులు తీసుకువచ్చిన స్పైసీ బిట్టర్గార్డ్, గార్లిక్ పూతరేకులను దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ శ్రీసుధ మార్కెట్లోకి విడుదల చేశారు. ప్రతి ఒక్కరూ ఆస్వాదించేలా... ఆత్రేయపురం పూతరేకులు అంటే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. మా పూతరేకు ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తూ తినాలన్నదే తయారీదారులందరి కోరిక. పంచదారతో తయారు చేయడం వల్ల తినలేకపోతున్నామంటూ చాలామంది మధుమేహం ఉన్నవారు మా ఊరు వచ్చినప్పుడు చెప్పి బాధపడేవారు. అందుకే భౌగోళిక గుర్తింపు వచ్చిన తర్వాత మంచి రోజు చూసుకుని స్పైసీ పూతరేకులను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాం. – గాదిరాజు ప్రసాదరాజు, ఆత్రేయపురం -
అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా చేస్తే తాజాగా ఉంటుంది
రుచిగా, వేగంగా వంట చేయాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి... ♦కూర ఏదైనా రుచికోసం అల్లం వెల్లుల్లి పేస్టుని వాడుతుంటాం. ఈ పేస్టుని రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసినప్పటికీ కొన్నిసార్లు రంగు మారి, ఎండిపోయినట్లు అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్టుని నిల్వచేసేముందు కొద్దిగా నూనె కలిపి పెడితే మరిన్ని రోజులు తాజాగా ఉంటుంది. అల్లం, వెల్లుల్లి పేస్టులను విడివిడిగా నిల్వచేసినా నూనె కలుపుకోవడం మంచిది. ♦ మిగిలిపోయిన ఆహార పదార్థాలు, మసాలాలు, ఇడ్లీ దోశపిండిలతో రిఫ్రిజిరేటర్ నిండిపోతుంటుంది. దీంతో తలుపు తీసినప్పుడల్లా అదొక రకమైన వాసన వస్తుంటుంది. కాటన్ బాల్ను వెనీలా ఎసెన్స్లో ముంచి, రిఫ్రిజిరేటర్లో ఒక మూలన ఉంచితే దుర్వాసన పోతుంది. ♦ మిగిలిపోయిన దోశ, ఇడ్లీ్ల పిండి, గారెల పిండి వంటివాటిని రిఫ్రిజిరేటర్లో పెట్టినా, కొన్నిరోజులకే ఎండిపోవడమో, బాగా పులిసిపోవడమో జరుగుతుంది. అందువల్ల మిగిలిపోయిన పిండిలో రెండు మూడు ఎండు మిరపకాయలు వేసి రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. -
ప్రమాదకర రసాయనాలతో అల్లం, వెల్లుల్లి పేస్ట్ నుంచి కూల్ డ్రింక్స్ దాకా..
రాజేంద్రనగర్: ఎలాంటి అనుమతులు లేకుండా పరిశ్రమను నిర్వహించడమేగాక రసాయనాలతో అల్లం వెల్లుల్లి పేస్ట్, శీతల పానీయాలు(కూల్డ్రింక్స్) తయారు చేస్తున్న కర్మాగారంపై ఆదివారం రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా 500 కిలోల అల్లం వెల్లుల్లి పేస్ట్, మ్యాంగో డ్రింక్, 210 లీటర్ల అసిటిక్ యాసిడ్, 550 కిలోల మసాలా ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఇద్దరు నిర్వాహకులను అరెస్టు చేసి మైలార్దేవ్పల్లి పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కాటేదాన్ శాంతినగర్లో ఫిరోజ్, అజిత్ గత రెండేళ్లగా ఎలాంటి అనుమతులు లేకుండా ఉమ్మాని ఫుడ్ కంపెనీ పేరుతో పరిశ్రమను నిర్వహిస్తున్నారు. సదరు పరిశ్రమలో అల్లం, వెల్లుల్లి పేస్ట్తో పాటు మ్యాంగో, ఆరెంజ్ జ్యూస్తో పాటు పుడ్ మసాలాలను తయారు చేసి మార్కెట్కు తరలిస్తున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ ప్రమాదకరమైన రసాయనాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అల్లం, వెల్లుల్లి పేస్ట్లో కేవలం వెల్లుల్లి పొట్టును మాత్రమే వినియోగిస్తుండటం గమనార్హం. అల్లం వెల్లుల్లి పేస్ట్లో రెండు సంవత్సరాలుగా అల్లమే వాడకుండా తయారు చేస్తున్నారు. ఎస్ఓటీ పోలీసులు దాడి చేసిన సమయంలో పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న పదార్థాలే కనిపించాయి. శీతల పానీయాలను తయారు చేసేందుకు మురుగునీటిని వాడుతున్నారని, ప్లేవర్ల కోసం రసాయనాలను వినియోగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. రెండేళ్లుగా నిందితులు ఎలాంటి అనుమానం రాకుండా పరిశ్రమను నిర్వహించడం గమనార్హం. భారీ యంత్రాలతో పెద్ద ఎత్తున ఉత్పత్తులు చేస్తున్న వీరు రాష్ట్ర వ్యాప్తంగా వాటిని సరఫరా చేసినట్లు వెల్లడైంది. నిందితులను అదుపులోకి తీసుకుని మైలార్దేవ్పల్లి పోలీసులకు అప్పగించారు. అధునాతన యంత్రాల వినియోగం... అల్లం, వెల్లుల్లి పేస్ట్తో పాటు గరంమసాలాలు, శీతల పానీయాల మిక్సింగ్, ప్యాక్ చేసేందుకు నిందితులు అధునాతన యంత్రాలను ఏర్పాటు చేశారు. పదుల సంఖ్యలో ఉన్న ఈ యంత్రాల ద్వారా ప్రతి రోజు రూ. లక్షల విలువైన మసాలాలు, అల్లం పేస్ట్, శీతల పానీయాలను తయారు చేస్తున్నారు. ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశామని, స్వాధీనం చేసుకున్న పదార్థాలను ల్యాబ్కు పంపనున్నట్లు తెలిపారు. -
హెల్త్ టిప్స్
♦ రాత్రి పడుకోబోయేటప్పుడు ఒక గ్లాసు మంచి నీటిలో చిన్న పటిక బెల్లం ముక్కను వేసి ఉంచి ఆ నీటిని ఉదయం లేవగానే తాగాలి. పదిహేను రోజుల పాటు ఇలా చేస్తే పార్శ్వపు తలనొప్పి తగ్గుతుంది. ♦ చిటికెడు పసుపును గ్లాసు పాలలో కాచి, రోజూ ఉదయాన్నే తాగుతుంటే జలుబు, దగ్గు, ఆయాసం తగ్గుతాయి.. ♦ గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గాలంటే రోజుకు రెండుసార్లు కప్పు పాలల్లో ముక్కలుగా చేసిన ఒక వెల్లుల్లి రెబ్బను వేసి బాగా మరగనిచ్చి వెల్లుల్లి ముక్కలను తీసి, ఆ పాలు తాగితే మంచి గుణం కన్పిస్తుంది. ♦ దగ్గు, ఆయాసంతో బాధపడేవారు స్పూన్ అల్లం రసం, స్పూను దానిమ్మరసం, స్పూన్ తేనె కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటే సరి ∙చిన్నపిల్లలు మలబద్దకంతో బాధపడుతుంటే రోజూ రెండు స్పూన్లు ద్రాక్షరసం ఇస్తూ ఉంటే సమస్య తొలగుతుంది, ♦ అజీర్ణం, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు తోటకూర, క్యారెట్, నారింజలను సమంగా కలిపి ఆ మిశ్రమాన్ని రోజుకు మూడుసార్లు తీసుకోవాలి. -
Health Tips: ద్రాక్ష రసాన్ని కొంచెం తేనెలో కలిపి రోజుకు మూడు సార్లు తీసుకుంటే
♦ ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రెండు మూడు వెల్లుల్లి రేకులు తింటే రక్తపోటు, కడుపులో మంట, నులిపురుగుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ♦ కొన్ని స్పాంజి ముక్కలను నీళ్ళలో తడిపి ఫ్రీజర్లో ఉంచండి. చెయ్యి కాలినా లేదా ఏ తలుపు సందులోనో పడి నలిగినా ఒక స్పాంజి ముక్కను తీసి బాధ ఉన్న ప్రదేశంలో కొద్దిసేపు ఉంచితే నొప్పి, వాపు వెంటనే తగ్గుతాయి. ♦ పళ్ళు వచ్చే ముందు పిల్లలు ప్రతిదాన్నీ కొరుకుతూ చిగుళ్ళు నొప్పి పుట్టి ఏడుస్తూ ఉంటారు. అటువంటప్పుడు సారింజ తొనలలోని విత్తనాలు తీసేసి, ఆ తొనలను కాసేపు ఫ్రిజ్లో ఉంచి వాటిని పిల్లలకు ఇస్తే ఆ చల్లదనం వారి బాధను పోగొట్టి రిలీఫ్ ఇస్తుంది. వారికి అవసరమైన ‘సి’ విటమిన్ కూడా లభిస్తుంది. ♦ ద్రాక్ష రసాన్ని కొంచెం తేనెలో కలిపి రోజుకు మూడు సార్లు తీసుకుంటే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు. ♦ కొబ్బరినూనె, నిమ్మరసం సమపాళ్ళలో తీసుకుని బాగా కలిపి కొద్దిగా వేడిచేసి నొప్పిగా ఉన్న ప్రాంతం లో మర్దన చేస్తే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. ♦ కిడ్నీ వ్యాధుల నివారణకు రెండు వంతుల దోసకాయ రసానికి, ఒక వంతు ద్రాక్ష రసాన్ని కలిపి ఉదయం, సాయంత్రం ఒక కప్పు చొప్పున తాగి చూడండి ♦ బచ్చలి రసం, అనాసరసం సమపా ళ్లలో తీసుకుని దానిలో కొంచెం నిమ్మరసం కలుపుకుని తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది. -
Recipe: బ్రెడ్.. వెల్లుల్లి, గుడ్లు, కూరగాయలు... సూప్ చేసుకోండిలా!
Winter- Recipes In Telugu: చలికాలంలో బ్రెడ్ గార్లిక్ సూప్ తయారు చేసుకోండిలా! కావలసినవి: ►బ్రెడ్ ముక్కలు – అర కప్పు ►వెల్లుల్లిపాయ – సగం ( పలుచగా ముక్కలుగా కట్ చేసుకోవాలి) ►గుడ్లు – 2 (తినేవారి సంఖ్యని బట్టి పెంచుకోవచ్చు) ►కారం – 1 టేబుల్ స్పూన్ పైనే ►ఉప్పు – తగినంత ►బిర్యానీ ఆకు – 1 ►అన్నిరకాల కూరగాయ ముక్కలు – (చిన్నచిన్నగా తరిగి, 4 కప్పుల నీళ్లు పోసి.. కొద్దిగా ఉప్పు, కారం వేసుకుని.. సుమారు రెండున్నర కప్పులు అయ్యేలా.. బాగా మరిగించి, ముక్కల్ని వడకట్టి.. ఆ వెజిటబుల్ స్టాక్ని పక్కన పెట్టుకోవాలి) ►నూనె – సరిపడా ►కొత్తిమీర తురుము – గార్నిష్కి తయారీ: ►ముందుగా ఒక కళాయిలో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి.. అందులో వెల్లుల్లి ముక్కలు వేసుకుని దోరగా వేయించాలి. ►అవి వేగాక బ్రెడ్ ముక్కలు వేసి గరిటెతో తిప్పుతూ ఉండాలి. ►అనంతరం.. ఉడికించిన కూరగాయలను వడకట్టిన నీటిని 2 కప్పుల వరకు ఇందులో పోసుకోవాలి ► తర్వాత బిర్యానీ ఆకు వేసుకుని మూత పెట్టి చిన్న మంట మీద ఉడికిస్తూ ఉండాలి. ►మధ్యలో రెండు గుడ్లను పగలగొట్టి.. పసుపు సొన విడిపోకుండా కళాయిలో వేరువేరుగా వేసుకోవాలి. ►గరిటెతో జాగ్రత్తగా కలుపుతూ ఉడకనివ్వాలి. ►మొత్తం మిశ్రమం కాస్త దగ్గర పడిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. ►గుంట గరిటెతో గుడ్లను సర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ►తినే ముందు కొత్తిమీర తురుముతో గార్నిష్ చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Mushroom Omelette: మష్రూమ్స్ ఆమ్లెట్.. వేయడం చాలా ఈజీ! Recipe: రుచికరమైన మీల్ మేకర్ – చికెన్ బాల్స్ తయారీ ఇలా! -
Beauty: గోధుమ పిండితో ట్యాన్కు చెక్! వెల్లుల్లి పేస్టు మొటిమలపై రాస్తున్నారా?
ట్యాన్ తొలగి ముఖం మెరిసిపోవాలన్నా.. మొటిమలు తగ్గించుకోవాలన్నా ఈ చిట్కాలు ట్రై చేయొచ్చు. పార్లర్కు వెళ్లే అవసరం లేకుండా మెరిసే మోము సొంతం చేసుకోవచ్చు. ట్యాన్ పోగొట్టే ఆటా ప్యాక్ ►గోధుమపిండితో రుచికరమైన రోటీలేగాక ఎండవల్ల ముఖంపై ఏర్పడిన ట్యాన్ను కూడా తగ్గించవచ్చు. ►దీనికోసం రెండు స్పూన్ల గోధుమపిండి, స్పూను తేనె, స్పూను పెరుగు, స్పూను రోజ్ వాటర్, స్పూను ఓట్స్, అరస్పూను కొబ్బరి నూనె తీసుకోవాలి. ►వీటన్నింటిని ఒక గిన్నెలో వేసి పేస్టులా కలుపుకోవాలి. ►తరువాత ఈ పేస్టును ముఖానికి రాసి ఆరిన తరువాత ముఖాన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి. ►ఈ ‘ఆటా ఫేస్ప్యాక్’ను వారానికి ఒకసారి వేసుకోవడం వల్ల ముఖంపై ఉన్న మృతకణాలు తొలగడమేగాక, ట్యాన్ తగ్గుముఖం పట్టి ముఖచర్మం కాంతిమంతమవుతుంది. వెల్లుల్లితో.. ►ముఖం మీది మొటిమలను ఇంటి చిట్కాతో సులభంగా వదిలించుకోవచ్చు. ►నాలుగు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని పొట్టుతీసి మెత్తగా పేస్టులా నూరుకోవాలి. ►ఈ పేస్టును ముఖంపై ఉన్న మొటిమలపై రాయాలి. ►పేస్టు ఆరుతుంది అనుకున్నప్పుడు దానిపై బ్యాండేజ్ వేయాలి. ►ఈ బ్యాండేజ్ను రాత్రంతా ఉంచుకుని ఉదయం తీసేయాలి. ►ఇలా వారానికి రెండుసార్లు చేయడం ద్వారా మొటిమలు తగ్గుముఖం పడతాయి. నోట్: చర్మ తత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ట్రై చేస్తే బెటర్. చదవండి: Health Tips: నీరసం.. నిస్సత్తువా? వీటిని ఆహారంలో చేర్చుకున్నారంటే.. రాత్రిపూట పదే పదే మూత్ర విసర్జన: కెఫిన్, శీతల పానీయాలు.. ఇంకా వీటికి దూరంగా ఉండకపోతే Health Tips: రోజూ స్కిప్పింగ్ చేసే అలవాటుందా? ఎండార్ఫిన్ల ఉత్పత్తి పెరిగి.. -
Recipe: కాలా మటన్ ఇలా ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోండి!
ముస్లింలు జరుపుకునే ప్రధాన పండుగల్లో రెండోది బక్రీద్. ఇది త్యాగానికి ప్రతీక. దీనిని ‘ఈదుల్ అజ్ హా’ అని కూడా అంటారు. ఈ రోజూ ప్రతి ముస్లిం తమ తాహతుకు తగ్గట్టుగా ఇరుగు పొరుగు వారికి ఖుర్బానీ ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తోంది. ఏటా మంచి ఘుమ ఘుమలతో ఈ పండుగను జరుపు కుంటారు. ఈ సందర్భంగా కాలా మటన్ తయారీ విధానం మీకోసం.. కాలా మటన్ కావలసినవి: ►మటన్ – ముప్పావు కేజీ ►గ్రీన్ చట్నీ(పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా పేస్టు) – అరకప్పు ►పసుపు – అరటీస్పూను ►ఉప్పు – రుచికి సరిపడా ►పెరుగు – కప్పు ►ఉల్లిపాయ తరుగు – రెండు కప్పులు ►నూనె – ఐదు టేబుల్ స్పూన్లు ►ధనియాలు – టేబుల్ స్పూను ►గసగసాలు – టేబుల్ స్పూను ►యాలుక్కాయలు – నాలుగు ►దాల్చిన చెక్క – అంగుళం ముక్క ►లవంగాలు – ఐదు ►మిరియాలు – ఐదు ►సోంపు – టేబుల్ స్పూను ►ఎండు మిర్చి – నాలుగు ►ఎండుకొబ్బరి తురుము – అరకప్పు ►బిర్యానీ ఆకు – ఒకటి ►షాజీరా – టీస్పూను ►వెల్లుల్లి తరుగు – రెండు టేబుల్ స్పూన్లు ►అల్లం తరుగు – టేబుల్ స్పూను ►బంగాళ దుంపలు – రెండు ►చింతపండు గుజ్జు – రెండు టేబుల్ స్పూన్లు తయారీ: ►మటన్ ముక్కలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి. ►దీనిలో పసుపు, రుచికి సరిపడా ఉప్పు, గ్రీన్ చట్ని, పెరుగు వేసి కలిపి ఇరవైనిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ►ఇరవై నిమిషాల తరువాత మటన్ను కుకర్లో వేయాలి. ►దీనిలో కొద్దిగా ఉల్లిపాయ తరుగు, కప్పు నీళ్లు పోసి ఒక విజిల్ వచ్చేంతవరకు పెద్దమంట మీద ఉడికించాలి. ►తరువాత సన్నని మంట మీద పదినిమిషాలు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ►ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి టేబుల్ స్పూన్ నూనె వేయాలి. ►వేడెక్కిన నూనెలో ధనియాలు, గసగసాలు, యాలుక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, సోంపు, ఎండు మిర్చి వేసి మంచి వాసన వచ్చేంత వరకు వేయించాలి. ►దీనిలో కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి ముదురు బ్రౌన్ రంగు వచ్చేంతవరకు వేయించాలి. ►ఇప్పుడు ఎండుకొబ్బరి తురుము వేసి రంగు మారేంత వరకు వేయించి, చల్లారాక కొద్దిగా నీళ్లు పోసి పేస్టులా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి. ►ఇప్పుడు స్టవ్ మీద మరో బాణలి పెట్టి మిగిలిన నూనె వేయాలి. ►నూనె వేడెక్కిన తరువాత బిర్యానీ ఆకు, షాజీరా వేసి నిమిషంపాటు వేయించాలి. ►తరువాత అల్లం, వెల్లుల్లి తరుగు, మిగిలిన ఉల్లిపాయ తరుగు వేసి లేత బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేయించాలి. ►ఇప్పుడు బంగాళ దుంపల్ని తొక్కతీసి ముక్కలు తరిగి వేసి, కొద్దిగా నీళ్లుపోసి మగ్గనివ్వాలి. ►దుంప ముక్కలు సగం ఉడికిన తరువాత ఉడికిన మటన్ మిశ్రమం వేయాలి. ►ఐదు నిమిషాల తరువాత మసాలా పేస్టు, రుచికి సరిపడా ఉప్పు వేసి పదినిమిషాలపాటు మగ్గనిచ్చి దించేయాలి. ఇవి కూడా ట్రై చేయండి: Sugarcane Shrimp With Prawns: పచ్చి రొయ్యలు... చెరకు ముక్కలు! సుగర్ కేన్ ష్రింప్ తయారీ ఇలా! Senagapindi Masala Roti Recipe: హర్యానా స్టైల్.. శనగపిండి మసాలా రోటీ తయారీ ఇలా! -
Recipe: పచ్చి రొయ్యలు... చెరకు ముక్కలు! సుగర్ కేన్ ష్రింప్ తయారీ ఇలా!
పచ్చిరొయ్యలు, చెరకు ముక్కల కాంబినేషన్తో సుగర్ కేన్ ష్రింప్ ఎలా వండుకోవాలో తెలుసా? సుగర్ కేన్ ష్రింప్ తయారీకి కావలసినవి: ►పచ్చిరొయ్యలు – అరకేజీ ►వెల్లుల్లి రెబ్బలు – మూడు ►ఉప్పు – రుచికి సరిపడా ►పంచదార – అరటేబుల్ స్పూను ►గుడ్డు తెల్ల సొన – ఒకటి ►తెల్లమిరియాలపొడి – రెండు టేబుల్ స్పూన్లు ►ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు ►తొక్కతీసిన ఐదంగుళాల చెరుకు ముక్కలు – నాలుగు. తయారీ.. ►రొయ్యలను శుభ్రంగా కడిగి తడిలేకుండా తుడవాలి. ►రొయ్యలు, వెల్లుల్లి, మిరియాలపొడి, పంచదార ఆయిల్ను బ్లెండర్లో వేసి పేస్టుచేసి పక్కన పెట్టుకోవాలి. ►ఒక గిన్నెలో గుడ్డు తెల్ల సొన వేసి బాగా కలపాలి. ►ఈ సొనలో రొయ్యల పేస్టు వేసి చక్కగా కలిపి అరగంటపాటు రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. ►అరగంట తరువాత రెండు చేతులకు ఆయిల్ రాసుకుని రొయ్యల మిశ్రమాన్ని నాలుగు భాగాలుగా చేసి చెరుకు ముక్కలకు చుట్టూ పెట్టాలి. ►ఈ ముక్కలను గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు డీప్ఫ్రై చేసి సర్వ్ చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Egg Bhurji Balls Recipe: క్యారెట్, బీట్ రూట్ తురుము.. ఎగ్ బుర్జీ బాల్స్ తయారీ ఇలా! Panasa Ginjala Vadalu: పనస గింజలతో వడలు.. ఇలా తయారు చేసుకోండి! -
ఈ పదార్థాలు ఉంటే చాలు.. ఈజీ పొటాటో స్నాక్.. టేస్టు అదిరిపోద్ది!
ఆలు చిప్స్ తినీతిని బోర్ కొట్టిందా! అయితే, బంగాళా దుంపతో ఈ వైరైటీ వంటకాన్ని ట్రై చేయండి. రొటీన్కు భిన్నంగా పొటాటో టోర్నడో రుచిని ఆస్వాదించండి. పొటాటో టోర్నడో తయారీకి కావాల్సిన పదార్థాలు: ►బంగాళ దుంపలు – 4 లేదా 5 ►మైదాపిండి – అర కప్పు ►మొక్కజొన్నపిండి – 1 టేబుల్ స్పూన్ ►బేకింగ్ సోడా – అర టీ స్పూన్ ►ఉప్పు – కొద్దిగా, నీళ్లు – కావాల్సినన్ని ►నూనె – డీప్ ఫ్రైకి సరిపడా ►గార్లిక్ పౌడర్ – 1 టేబుల్ స్పూన్ ►చీజ్ తురుము – 3 టేబుల్ స్పూన్లు ►చీజ్ సాస్ – 4 టేబుల్ స్పూన్ల పైనే ►డ్రై పార్సీ – అర టేబుల్ స్పూన్ ►ఎండు మిర్చి పొడి – 1 టేబుల్ స్పూన్ తయారీ: ముందుగా ఒక బౌల్లో గార్లిక్ పౌడర్, చీజ్ తురుము, డ్రై పార్సీ.. వేసుకుని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక్కో బంగాళదుంపను ఒక్కో పొడవాటి పుల్లకు గుచ్చి.. చాకుతో స్ప్రిల్స్లా (వలయంలా, మొత్తం కట్ చెయ్యకుండా చిత్రంలో ఉన్న విధంగా) కట్ చేసుకుని పెట్టుకోవాలి. ►అనంతరం వెడల్పుగా ఉండే బౌల్లో మైదాపిండి, మొక్కజొన్నపిండి, బేకింగ్ సోడా, ఉప్పు వేసుకుని కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పలుచటి మిశ్రమంలా చేసుకోవాలి. ►ఆ మిశ్రమంలో ఒక్కో పొటాటో స్ప్రింగ్ని ముంచి.. నూనెలో దోరగా వేయించాలి. అనంతరం వాటిని వరుసగా పెట్టుకుని.. అటు ఇటు తిప్పుతూ గార్లిక్–చీజ్ మిశ్రమాన్ని చల్లుకోవాలి. ►ఆ పైన చీజ్ సాస్ స్ప్రిల్స్ పొడవునా స్ప్రెడ్ చేసుకుని.. చివరిగా ఎండుమిర్చి పొడిని చల్లి.. సర్వ్ చేసుకోవాలి. చదవండి: Summer Drink: సుగంధ షర్బత్ ఎలా తయారు చేస్తారో తెలుసా? -
వెల్లుల్లిని పరగడుపునే తింటున్నారా?
-
గిట్టుబాటు ధర లేక 160 కేజీల ఉల్లిపాయల్ని తగలబెట్టిన రైతు!!
మధ్యప్రదేశ్లోని ఒక యువ రైతు రాష్ట్ర రాజధాని భోపాల్కు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న మందసౌర్ బహిరంగ వేలంలో 160 కిలోల వెల్లుల్లిని తగలబెట్టి తన పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించలేదన్న విషయాన్ని బహిరంగంగా వ్యక్తం చేశాడు. డియోలీకి చెందిన శంకర్ సిర్ఫిరా తన ఉత్పత్తులను మందసౌర్ మండిలో హోల్సేల్ వ్యాపారులకు విక్రయించడానికి ప్రయత్నించినప్పుడు తీవ్ర నిరాశకు గురై ఈచర్యకు పాల్పడ్డాడు. ఆ తర్వాత రైతు 'జై జవాన్ జై కిసాన్' అంటూ నినాదం చేశాడు. అయితే మండిలోని సిబ్బంది ఇతర రైతులు వెంటనే స్పందించి మంటలను ఆర్పివేయడంతో హోల్సేల్ మార్కెట్లో ఎటువంటి నష్టం జరగకుండా నిరోధించారు. (చదవండి: బాప్రే! 14 అంతస్థుల భవనంలో అగ్ని ప్రమాదం... ఐతే ఆ ఇద్దరు...!! షాకింగ్ వీడియో) ఈ మేరకు రైతు మాట్లాడుతూ..."నేను ఇక్కడ వెల్లుల్లి పంటను రవాణా చేయడానికి రూ. ఐదు వేల రూపాయాలు ఖర్చు పెట్టాను. కానీ కొనుగోలుదారుల నుండి రూ. 1,100 మాత్రమే పొందుతున్నాను. అందువల్ల కాల్చడం మంచిది అనిపించి ఇలా చేశాను. అంతేకాదు నేను వెల్లుల్లిని పండించడానికి రూ. 2.5 లక్షలు ఖర్చు చేశాను. అయితే నాకు మార్కెట్ ధర ప్రకారం కేవలం రూ.1 లక్ష మాత్రమే వచ్చింది," అని ఆవేదనగా శంకర్ చెప్పారు. ఈ క్రమంలో రైతును విచారణ కోసం పోలీసు స్టేషన్కు తీసుకువచ్చారు. అయితే పోలీస్ స్టేషన్ ఇన్చార్జి జితేంద్ర పాఠక్ ఇతర రైతుల ఉత్పత్తులకు అగ్నిప్రమాదం వల్ల ఎటువంటి నష్టం జరగలేదు కాబట్టి ఆ రైతు పై ఎటువంటి కేసు నమోదు చేయలేదని అన్నారు. ఏదిఏమైన రైతులు సరైన గిట్టుబాటు ధర లభించక ఆగ్రహంతో పంటను దహనం చేయడం ఇది మొదటిసారి కాదు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఆన్లైన్లో వైరల్ అవుతోంది. (చదవండి: బంగారు గనుల తవ్వకాల్లో బయటపడ్డ వెయ్యికాళ్ల ప్రాణి!) A young #Farmers Shankar Sirfira set ablaze around 160 kg garlic produce on not getting adequate price from traders during open auction in the Mandsaur Mandi @ndtv @ndtvindia pic.twitter.com/90wdDA7OR8 — Anurag Dwary (@Anurag_Dwary) December 19, 2021 -
Garlic: శీతాకాలంలో ఉదయాన్నే వెల్లుల్లి తింటున్నారా? అయితే..
Health Benefits Of Garlic In Telugu: చలికాలం వచ్చేసింది! ఈ కాలంలో ఇమ్మునిటీ సిస్టం బలంగా లేకపోతే జలుబు, దగ్గు.. ఇతర సీజనల్ రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఐతే ఈ సీజన్లో ప్రత్యేక పోషణనిచ్చే ఆహారాలను తప్పక తీసుకోవాలి. ప్రాచీనకాలం నుంచి ప్రతి వంటగదిలో తప్పకుండా ఉండే మూలిక వెల్లుల్లి. దీని సువాసన, రుచి ఎన్నో రుగ్మతలకు విరుగుడుగా పనిచేస్తుంది. అంతేకాకుండా వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా మెండే. వెల్లుల్లిలో విటమిన్ ‘బి, సి’, ఫోలేట్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్ కూడా పుష్కలంగా ఉంటాయి. యూఎస్డీఏ ప్రకారం వంద గ్రాముల వెల్లుల్లిలో 150 కేలరీలు, 33 గ్రాముల పిండి పదార్థాలు, 6.36 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. శీతాకాలంలో వెల్లుల్లిని ఆహారాంలో భాగం చేస్తే చేకూరే ఆరోగ్య ప్రయోజనాలుమిటో తెలుసుకుందా... జలుబు, దగ్గు నివారిస్తుంది ఈ కాలంలో జలుబు, దగ్గు మామూలుగానే వస్తుంది. ఈవిధమైన సమస్యలకు వెల్లుల్లి చక్కని పరిష్కారాన్ని చూపుతుంది. ఇన్ఫెక్షన్లు, ఇతర వ్యాధుల నుంచి వెల్లుల్లి రక్షణ కల్పిస్తుందనే నానుడి ఎప్పటినుంచో ఉంది. సైనసైటిస్, జలుబు, ఫ్లూతో బాధపడేవారు వేడి వంటకాలు, పులుసులు, సూప్లలో వెల్లుల్లిని చేర్చి తినాలి. ఐతే ఉడికించిన వెల్లుల్లి కంటే.. పచ్చిగా ఉన్నప్పుడు తింటేనే ఉత్తమ ఫలితాలు వస్తాయని ఢిల్లీకి చెందిన ప్రముఖ హెల్త్ అండ్ వెల్నెస్ నిపుణులు డా. శిఖా శర్మా సూచిస్తున్నారు. చదవండి: గుడ్న్యూస్.. ఈ ప్రొటీన్తో బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారం..! బరువు తగ్గడానికి దివ్యౌషధం చలికాలంలో బరువుతగ్గడం ఓ పెద్ద టాస్క్ లాంటిదే! ఐతే వెల్లుల్లి రెబ్బలు సులువుగా బరువుతగ్గడానికి సహాయపడతాయి. సహజంగానే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే వెల్లుల్లి మన శరీరంలోని హానికారకాలను బయటికి పంపడానికి, ఆరోగ్యకరమైన జీవక్రియకు ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా దీనిలోని పోషకాలు బరువుతగ్గడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. ఉదయాన్నే పరగడుపున 5 పచ్చి వెల్లుల్లి రెబ్బలు, తేనెతో కలిపి తింటే బరువు తగ్గడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. శ్వాస సమస్యలు దూరం వెల్లుల్లిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ కారకాలు ఉపిరితిత్తుల ఆరోగ్యానికి జీవం పోస్తాయి. చలికాలంలో తరచూ వచ్చే జ్వరం, కఫం, గొంతు నొప్పి సమస్యలకు వెల్లుల్లి ఉపశమనం కలిగిస్తుంది. వెల్లుల్లి ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ►వెల్లుల్లి చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుపచడానికి సహాయపడుతుంది. ►వెల్లుల్లి రెబ్బలు తరచూ తినడం మూలంగా గుండె జబ్బులను నివారించవచ్చు. చదవండి: Supai Village Story: టెక్నాలజీ కన్నే ఎరుగని అమెరికా పల్లెటూరు.. నేటికీ గాడిదలపైనే ప్రయాణం..! -
పేల బాధ తగ్గాలంటే..
సాధారణంగా ప్రతి ఒక్కరిని వేధించే సమస్య పేల బాధ. ఇంట్లో అందుబాటులో ఉన్న పదార్ధాలతోనే వాటి నుంచి విముక్తి పొందే చిట్కాలు మీకోసం. పేల నివారణకు వెల్లుల్లి అద్భుతంగా పని చేస్తుంది. ముందుగా కొన్ని వెల్లుల్లి రెబ్బలను మెత్తగా నూరి, దానికి కాస్త నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి మునివేళ్లతో చిన్నగా మర్ధన చేయాలి. గంటసేపు అలాగే ఉంచాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయించి.. చిక్కుదువ్వెనతో దువ్వాలి. అప్పుడు పేలు మొత్తం రాలిపోతాయి. వేపాకు మెత్తగా నూరి.. అందులోకి రెండుచుక్కలు ఆలివ్ ఆయిల్ కలిపి.. జుట్టు కుదుళ్లకు పట్టించాలి. గంట తరువాత స్నానం చేయాలి. తెల్ల ఉల్లిగడ్డలు కూడా పేలను తగ్గించేవే. ఈ ఉల్లితో రసం తీసి తలకు పట్టించాలి. గంట తరవాత స్నానం చేయాలి. రోజు మార్చి రోజు పది రోజుల పాటు చేస్తే పేలు తగ్గుతాయి. బాదం పప్పులను ఒకరోజు మొత్తం నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే వాటిపైనున్న తొక్కను తీసేసి.. మెత్తటి పేస్టులా రుబ్బుకోవాలి. అందులోకి రెండుమూడు స్పూన్ల నిమ్మరసం కలిపి. జుట్టు కుదుళ్లకు పట్టించాలి. వేపగింజల నూనె మార్కెట్లో దొరుకుతుంది. దాన్ని తీసుకుని తలకు పట్టించవచ్చు. లేదంటే వేపనూనెకు షాంపూను కలిపి కూడా జుట్టుకు అప్లై చేయవచ్చు. ఆపిల్ సిడార్ వెనిగర్ను తలకు పూసుకుంటే పేలను తొలగించడమే కాకుండా.. జుట్టు కుదుళ్లకు అవసరమైన శక్తిని కూడా అందిస్తుంది. గోరువెచ్చని కొబ్బరినూనె, బాదం నూనెలను తలకు పట్టించి, పొద్దున్నే తలస్నానం చేసి, దువ్వెనతో దువ్వాలి. ఇలా రెగ్యులర్గా చేస్తుండడం వల్ల తలలో పేలు చేరకుండా ఉండడమే కాకుండా, జుట్టుకు మెరుపు వస్తుంది. జుట్టు కుదుళ్లు బలంగా ఉంటాయి. -
వెల్లుల్లి.. వింటర్లోనే ఎక్కువ ఎందుకు..
సీజన్ మారిన ప్రతిసారి ఏదో ఒక ఆరోగ్య సమస్య మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఇందుకు వింటర్ (చలికాలం) మినహాయింపు కాదు. వింటర్ చల్లదనాన్ని ఎటువంటి అనారోగ్యాలకు గురికాకుండా ఎంజాయ్ చేయాలంటే వెల్లుల్లి (గార్లిక్)ని డైలీ ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిదట. మన భారతీయ వంటకాలకు వెల్లుల్లితో విడదీయరాని బంధం ఉంది. దాదాపుగా వండే అన్ని కూరల్లో వెల్లుల్లి వాడుతుంటారు. అంతేగాక సంప్రదాయ సనాతన ఔషధాలలో కూడా యాక్టివ్ ఇంగ్రీడియంట్గా వెల్లుల్లి వినియోగిస్తున్నారు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం.. వెల్లుల్లి మన శరీరంలో ఉన్న ట్రై గ్లిసరైడ్స్ని నియంత్రణలో ఉంచి గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచడం, రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో వెల్లుల్లి పాత్ర అమోఘం. అయితే ఇన్ని సుగుణాలు ఉన్న వెల్లుల్లిని సరైన పద్ధతిలో తీసుకోకపోతే శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు. వింటర్లోనే ఎందుకు.. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఫ్రీ ర్యాడికల్స్ కారణంగా మన శరీరంలో పాడయ్యే కణాలను బాగుచేయడానికి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ను తగ్గించడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఫాస్పరస్, క్యాల్షియం, పొటాషియం, ఐరన్, కాపర్ వంటి ఖనిజాలు దీనిలో అధికంగా ఉంటాయి. వీటితో పాటు విటమిన్ సి, విటమిన్ బి6(పైరిడాక్సిన్) కూడా ఉంటాయి. సి విటమిన్ రోగనిరోధక శక్తిని పెంచి సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు తోడ్పడుతుంది. రోజువారి ఆహారంలో వెల్లుల్లిని తీసుకుంటే శరీర ఉష్ణోగ్రతలు పెరిగి చలి తీవ్రత అంతగా బాధించదు. ఉదయాన్నే పరగడుపున (ఖాళీకడుపు) పచ్చి వెల్లుల్లి రెబ్బలను తింటే కొలెస్ట్రాల్ స్థాయులు తగ్గుతాయి. అంతేగాకుండా ధమనుల లో ఎటువంటి బ్లాకేజ్ లేకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పచ్చి వెల్లుల్లిలో అల్లిసిన్ అనే మూలకం ఉంటుంది. ఇది రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ స్థాయులను నియంత్రణలో ఉంచుతుంది. వెల్లుల్లిని ఉడికించినప్పుడు ఈ అల్లిసిన్ స్థాయులు తగ్గిపోతాయి. అందువల్ల పచ్చిది తింటే ఎంతో మంచిది. అయితే పచ్చి వెల్లుల్లి తినేటప్పుడు దానిని కొంచెం చితక్కొట్టి కాసేపు గడిచాక తింటే మంచిది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే ఒక గ్లాసు నీటిలో వెల్లుల్లి రసాన్ని కలిపి నిత్యం తీసుకోవాలి. గార్లిక్ టీ.. అయితే పచ్చి వెల్లుల్లి తీసుకోవాలంటే కొంతమందికి ఇబ్బందిగానే ఉంటుంది. అటువంటి వారు వెల్లుల్లి టీ చేసుకుని తాగితే సరిపోతుంది. నాలుగు వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచి ఒక కప్పు మరిగే నీటిలో వేయాలి. నీరు బాగా మరిగాక అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడి వేయాలి. దీన్ని మరో రెండు నిమిషాలు మరిగించి స్టవ్ ఆపేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక కప్లో పోసుకుని దానిలో ఒక టీ స్పూన్ తేనె, అరటీస్పూన్ నిమ్మరసం వేయాలి. దీనిని బాగా కలుపుకుని తాగితే గార్లిక్ టీ ఫ్లేవర్స్ను ఎంజాయ్ చేయవచ్చు. గార్లిక్ స్టీవ్.. వెల్లుల్లి ఏ కూరలో వేసినా దాని రుచి మరింత పెరుగుతుంది. ఈ కోవకు చెందినదే గార్లిక్ స్టీవ్. ఇది రుచితోపాటు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చికెన్తో చేసే ఈ రెసిపీలో చాలా పోషకాలు ఉంటాయి. ఒక చికెన్ బ్రెస్ట్ పీస్ను తీసుకుని దానిని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలు ప్రెషర్ కుక్కర్లో వేసి దానిలో ఒక టీస్పూన్ బటర్, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, నాలుగు మిరియాలు, ఒక టేబుల్స్పూన్ పార్సెల్లీ, ఒక అంగుళం ముక్క అల్లం పేస్టు చేసి వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తరువాత మూడు కప్పుల నీళ్లు పోసి సన్నని మంట మీద 3–4విజిల్స్ వచ్చేంతవరకు ఉంచాలి. తరువాత కుకర్ మూత తీసి కాస్త కొత్తిమీర చల్లి వడ్డిస్తే హెల్తీ అండ్ టేస్టీ గార్లిక్ స్టీవ్ రెడీ అయినట్లే. ప్రోటీన్తో నిండిన చికెన్, వెల్లుల్లి సుగుణాలు కలగలిసి గార్లిక్ స్టీవ్ ఎంతో రుచిగా ఉంటుంది. ఇన్ని పోషకాలతో నిండి ఉన్న వెల్లుల్లిని రోజువారి ఆహారంలో తీసుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో కదా..! ఇంకెందుకాలస్యం? వీటిలో ఏదో ఒక దానిని మీ ఆహారంలో భాగం చేసుకోని ఆరోగ్యంగా జీవించండి. -
పచ్చి ఆహారాన్ని లాగించేసిన కరోనా పేషెంట్
కరోనా అంటే హడలెత్తే రోజులు పోయాయి. ముఖాన మాస్కు, చేతిలో శానిటైజర్ ఉందంటే కరోనా కాదు కదా దాని మమ్మీలాంటి వైరస్ వచ్చినా ఏం చేయలేదు అన్న ధైర్యానికి జనాలు వచ్చేశారు. ఇక వైరస్ సోకినవారిలో సగం మందికి లక్షణాలు బయటపడుతుంటే మిగతా సగం జనానికి వైరస్ సోకిందన్న సంగతి కూడా తెలియడం లేదు. కాగా కరోనా లక్షణాలలో మొట్టమొదటిది రుచీవాసన తెలీకపోవడం. అది ఏ రేంజ్లో ఉంటుందనేది రసెల్ డనేలీ అనే వ్యక్తి జనాలకు తెలియజేయాలనుకున్నాడు. దీంతో వంటింట్లో ఉండే సామానంతా తన ముందు పెట్టుకుని వీడియో ఆన్ చేశాడు. పచ్చి ఆహారాన్ని పుష్టిగా ఎలాంటి ఇబ్బంది లేకుండా తినడం మొదలుపెట్టాడు. ఉల్లిపాయలు, వెల్లుల్లి పేస్ట్, బేబీ ఫుడ్ ఇలా తింటూనే ఉన్నాడు. (ఫోటో షూట్.. మరోరకం ట్రెండింగా..?) వంటకాల్లో ఉపయోగించే నిమ్మరసం, ఆపిల్ సైడ్ వెనిగర్ను గుట గుటా తాగేశాడు. నిమ్మకాయను నమిలి నమిలి మింగేశాడు. టూత్పేస్టును కూడా తినేందుకు ప్రయత్నించాడు. చిత్రవిచిత్రమైనవన్నీ తింటున్నా ఎలాంటి రుచీపచీ తెలీకపోవడంతో ఇదో క్రేజీ వైరస్ అని చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియాలో వైరలవుతున్న ఈ వీడియోను ఇప్పటివరకు 17 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియో తీయడం గురించి రసెల్ మాట్లాడుతూ.. తాను ఏ వాసన పసిగట్టలేకపోతున్నాని, నాలుకకు రుచి తెలీట్లేదని చెప్తే తన స్నేహితులు నమ్మలేరని తెలిపాడు. ఈ వీడియోతో వారికి సమాధానం దొరుకుతుందని చెప్పుకొచ్చాడు. (భావోద్వేగ దృశ్యం: కన్నీళ్లు ఆగడం లేదు) -
ఎంచక్కా వెల్లుల్లిపాయలను పెంచుకోవచ్చు
ఒక ప్లాస్టిక్ బాటిల్కు నిలువెల్లా కంతలు పెట్టి ఎంచక్కా వెల్లుల్లిపాయలను పెంచుకోవచ్చు. పుణేకు చెందిన అభిజిత్ టికేకర్ అనే ఇంటిపంటల సాగుదారు ఈ వెల్లుల్లి టవర్ అనుభవం గురించి వివరిస్తున్నారు. కంపెనీ సెక్రటరీగా పనిచేస్తున్న అభిజిత్ లాక్డౌన్ కాలంలో ఎండు ఆకులతో తన ఇంటిపైన ఎండాకులతో లీఫ్ కంపోస్టు తయారు చేసుకొని, కిచెన్ గార్డెనింగ్ ప్రారంభించారు. ప్లాస్టిక్ సీసాలో లీఫ్ కంపోస్ట్ లేదా మట్టి, కొబ్బరిపొట్టు, కంపోస్టు కలిపిన మిశ్రమాన్ని నింపుకోవాలి. చూపుడు వేలు పట్టే అంత చుట్టుకొలత ఉన్న ఇనుప చువ్వను తీసుకొని స్టౌ మంటలో పెట్టి బాగా వేడెక్కిన తర్వాత.. ప్లాస్టిక్ సీసాపైన చుట్టూతా బెజ్జాలు పెట్టుకోవాలి. ఒక్కో వరుసలో అంగుళం దూరంలో బెజ్జాలు పెట్టుకోవాలి. ఆ బెజ్జాల్లో వెల్లుల్లి రెబ్బలను నాటాలి. ముక్కు బయటకు ఉండేలా నాటాలి. సీసాలోని మట్టి మిశ్రమంలో తేమ ఆరిపోకుండా చూసుకోవాలి. పై నుంచి తగుమాత్రంగా నీటిని అందిస్తూ ఉండాలి. కొన్ని రోజులకు వెల్లుల్లి రెబ్బలు వేరుపోసుకొని మొలకలు వస్తాయి. ఉల్లి పొరకల మాదిరిగా వెల్లుల్లి మొక్కలు వస్తాయి. వెల్లుల్లి పొరకలతో చట్నీ, గార్లిక్ బటర్ వంటి అనేక వంటకాలు చేసుకోవచ్చు. ఇలాంటి బాటిల్ టవర్కు తక్కువ బెజ్జాలు పెట్టుకుంటే.. వెల్లుల్లి పాయలను కూడా ఇలా పెంచుకోవచ్చు అంటున్నారు అభిజిత్. బ్రౌన్లీఫ్.ఆర్గ్ వెబ్సైట్ ద్వారా కంపోస్టింగ్తోపాటు ఇంటిపంటల సాగుపై మెలకువలు నేర్చుకున్నానన్నారు. తన 8 ఏళ్ల కుమార్తె కిచెన్ గార్డెనింగ్ ద్వారా ఎన్నెన్నో విషయాలు ఆసక్తికరంగా నేర్చుకుంటున్నదని ఆయన సంతోషపడుతున్నాడు. -
నేను ఉల్లిగడ్డలు పెద్దగా తినను!
న్యూఢిల్లీ: సాధారణంగా ఉల్లిగడ్డలు కొస్తే కన్నీళ్లు వస్తాయి. కానీ, ఇప్పుడు ఉల్లిని కొనాలంటే సామాన్య, మధ్యతరగతి ప్రజలకు కన్నీళ్లు తప్పడం లేదు. దేశవ్యాప్తంగా ఉల్లిపాయ ధర అమాంతం పెరిగిపోయింది. ఎక్కడ చూసినా ఉల్లి సామాన్యుడికి అందుబాటులోకి వచ్చే అవకాశమే కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఉల్లి సెగ తాజాగా పార్లమెంటును తాకింది. లోక్సభలో ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలె ఈ అంశాన్ని లేవనెత్తారు. ఉల్లిధరలపై ఆమె కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ.. ఉల్లి ధరలను తగ్గించడానికి కేంద్రం తీసుకున్న చర్యలను సభకు వివరించారు. అయితే, ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ.. తమది ఉల్లిపాయలు ఎక్కువగా తినే కుటుంబం కాదని చెప్పుకొచ్చారు. ‘నేను ఉల్లి, వెల్లుల్లి పెద్దగా తినను. ఉల్లిపాయలను పెద్దగా ఉపయోగించని కుటుంబం నుంచి నేను వచ్చాను’ అని ఆమె వివరించారు. ఉల్లి ధరలు అమాంతం ఎందుకు పెరిగిపోయాయని సూప్రియా సూలె కేంద్రాన్ని ప్రశ్నించారు. మరోవైపు చిన్న, సన్నకారు ఉల్లి రైతులను కూడా కేంద్రం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
చలికి మిరియాల సెగ పెడదాం
శ్రీ ముఖపుస్తకం గారి వంటలు రుచి చూద్దామా! కావలసినవి: నల్ల మిరియాలు – 2 టీ స్పూన్లు; జీలకర్ర – 1 టేబుల్ స్పూను; అల్లం – చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 6, పసుపు – పావు టీ స్పూను; చిక్కటి చింతపండు రసం – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత, బెల్లం తరుగు – 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి – 2 టీ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి); కరివేపాకు – రెండు రెమ్మలు; ఇంగువ – పావు టీస్పూను; కొత్తిమీర – కొద్దిగా. తయారీ: ►ముందుగా మిక్సీలో నల్ల మిరియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి ►స్టౌ మీద బాణలిలో ముప్పావు లీటరు నీళ్లుపోసి మరిగించాక, తయారు చేసి ఉంచుకున్న పొడిని మరుగుతున్న నీళ్లలో వేయాలి ►పసుపు జత చేయాలి ►చింతపండు రసం పోసి కలియబెట్టాలి ►తగినంత ఉప్పు, బెల్లం తరుగు జత చేసి మరోమారు కలిపి మూత పెట్టి మరిగించాలి ►స్టౌ మీద చిన్న బాణలిలో నెయ్యి వేసి కాగాక ఆవాలు, ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి బాగా కలిపి, మరుగుతున్న మిరియాల చారులో వేసి కలపాలి ►చివరగా కొత్తిమీరతో అలంకరించాలి ►వేడి వేడి అన్నంలో చాలా రుచిగా ఉంటుంది. shettyskitchen -
గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం కోసం...
ఇటీవల కాలంలో చాలా మందిని గ్యాస్ సమస్య వేధిస్తోంది. దీనికి రక రకాల మాత్రలు వాడేకంటే చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ►కడుపు ఖాళీగా ఉంటే గ్యాస్ సమస్య వస్తుంది. కాబట్టి రోజూ 6 నుంచీ 8 గ్లాసుల నీటిని తీసుకుంటే గ్యాస్ సమస్య తలెత్తదు. ►రోజూ భోజనానికి ముందు చిన్న అల్లం ముక్కను నమిలి మింగడం చాలా మంచిది. దానిని నేరుగా తినలేకపోతే కొద్దిగా బెల్లం లేదా పంచదార కలుపుకుని కూడా తినవచ్చు. ►నాలుగైదు వెల్లుల్లి రెబ్బలకు రెండేసి స్పూన్ల ధనియాలు, జీలకర్ర తీసుకుని 5 నిముషాలపాటు ఉడికించాలి. చల్లారాక వడపోసి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ►దాల్చిన చెక్క గ్యాస్ సమస్యకు మంచి మందు. కొద్దిగా దాల్చిన చెక్కను తీసుకుని నీటిలో వేసి మరిగించాలి. తర్వాత ఆ జ్యూస్ ను తాగాలి. ఇలా రోజూ భోజనానికి ముందు తాగితే గ్యాస్ సమస్య తొలగి పోతుంది. ►గ్యాస్ సమస్య ఉన్నవాళ్లు రోజూ కొబ్బరి నీళ్ళని తాగటం అలవాటు చేసుకుంటే మంచిది. ఇలా నెల రోజులు ఈ చిట్కాలను పాటిస్తే మంచి ఫలితాలుంటాయి. -
రొమ్ము కేన్సర్కు ఉల్లి, వెల్లుల్లి మంత్రం
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. మిగిలిన విషయాల మాటెలా ఉన్నా రొమ్ము కేన్సర్ విషయంలో మాత్రం ఇది అక్షరాల వాస్తవమని, ఈ ప్రాణాంతక వ్యాధి రాకుండా ఉండేందుకు ఉల్లితో పాటు వెల్లుల్లి కూడా ఎంతో మేలు చేస్తుందంటున్నారు బఫెలో, ప్యూర్టరికో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ప్యూర్టరికోలోని కొంతమందిని నిశితంగా పరిశీలించిన తర్వాత తాము ఈ అంచనాకొచ్చామని అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త గౌరీ దేశాయి తెలిపారు. ఉల్లి, వెల్లుల్లితో ప్యూర్టరీకన్లు చేసే సోఫ్రిటో అనే వంటకం అసలే తినని వారితో పోలిస్తే ఒకటి కంటే ఎక్కువ సార్లు తినే మహిళలకు రొమ్ము కేన్సర్ వచ్చే ప్రమాదం 67 శాతం వరకు తక్కువగా ఉన్నట్లు తెలిసిందని చెప్పారు. కేన్సర్ నుంచి రక్షణకు ఈ రెండు పదార్థాలు ఉపయోగపడతాయన్న గత అధ్యయనాల ఆధారంగా తాము ఈ పరిశోధన చేశామని చెప్పారు. యూరప్, అమెరికాల కంటే ప్యూర్టరికోలో ఉల్లి, వెల్లుల్లి వాడకం ఎక్కువని, ఈ కారణంగా ఇక్కడ రొమ్ము కేన్సర్ కేసులు కూడా తక్కువగా ఉన్నాయని వివరించారు. ఉల్లి, వెల్లుల్లిలో ఉండే ఫ్లేవనాల్స్, ఆర్గానోసల్ఫర్ పదార్థాలు కేన్సర్ నుంచి రక్షణ కల్పిస్తున్నట్లు భావిస్తున్నామని చెప్పారు. రోమ్ము కేన్సర్తో బాధపడుతున్న 314 మందితో పాటు లేని 346 మందిపై 2008– 2014 మధ్యకాలంలో ఈ అధ్యయనం జరిపినట్లు తెలిపారు. -
హెల్త్ టిప్స్
►ప్రతిరోజూ నాలుగైదు రెమ్మల పచ్చి కరివేపాకు తింటుంటే చిన్న వయసులో జుట్టు తెల్లబడడాన్ని నివారిస్తుంది. ►కరివేపాకు డయాబెటిస్ను అరికట్టడంలోసమర్థంగా పనిచేస్తుంది. ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటిస్ ఉన్నట్లయితే తప్పకుండా ప్రతిరోజూ ఉదయం పరగడుపున గుప్పెడు కరివేపాకు (పచ్చిది కాని మరే రూపంలోనైనా)తినాలి. ఇలా క్రమం తప్పకుండా వందరోజులు తింటే మంచి ఫలితం ఉంటుంది. ►హైబీపీ లేదా అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లయితేపరగడుపున ఒక పచ్చి వెల్లుల్లి రేకు తినాలి. ►వెల్లుల్లి బ్లడ్ప్రెషర్ను తగ్గించి కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుతుంది. ►ఓట్మీల్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. మూడు వారాలపాటు ప్రతిరోజూ బ్రేక్ఫాస్ట్లో ఓట్మీల్ను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. -
మైండ్ బ్లోయింగ్ వీడియో: అమేజింగ్ టెక్నిక్
వెల్లుల్లి ఒలవడం ఎంత కష్టమో.. అది అనుభవించిన వారికి మాత్రమే తెలుసు. ముఖ్యంగా ఆవకాయల పచ్చడి పట్టేకాలంలో తెలిగింట ప్రతి ఆడబడుచుకూ ఇది అనుభవమే. అయితే సోషల్ మీడియా పుణ్యమా అని వెల్లుల్లిని ఒడుపుగా ఒలిచే ప్రక్రియ ఒకటి వెలుగులోకి వచ్చింది. వెల్లుల్లిని ఒలిచేందుకు ఇదే ఉత్తమమైన పద్ధతి అంటూ ట్విటర్ యూజర్ ఒకరు వీడియోను షేర్ చేశారు. వెల్లుల్లిపై పొట్టును గోరుకి నొప్పి లేకుండా.. అతి సునాయాసంగా ఒలుస్తూ ఆమె ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఇపుడది ఇంటర్నెట్ సంచలనమైపోయింది. అమేజింగ్ టెక్నిక్.. మైండ్ బ్లోయింగ్ అంటూ నెటిజన్లు అభినందనల వెల్లువ కురిపిస్తున్నారు. కొందరైతే ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. వాలెంతినా లార్డ్ చెఫ్ పోస్టు చేసిన ఈ అమేజింగ్ వైరల్ వీడియో 21 మిలియన్లపైగా వ్యూస్తో దూసుకుపోతోంది. అయితే ఇది సాధ్యం కావడం లేదంటూ లేటెస్ట్గా స్పందిస్తున్నారు. మరి మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి. As someone who makes a lot of Korean food, this is the best method for getting garlic peeled! 👌 pic.twitter.com/14GGJDQhRj — 𝖛𝖆𝖑𝖊𝖓𝖙𝖎𝖓𝖆 ✣ 𝖑𝖔𝖗𝖉 🌑 (@VPestilenZ) June 17, 2019 -
‘అక్షయ పాత్ర’లో అల్లం వెల్లుల్లి గొడవ
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని పలు రాష్ట్రాల్లో పాఠశాల విద్యార్థులకు ఇస్కాన్ (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియస్నెస్) ఆధ్వర్యంలోని అనుబంధ సంస్థ ‘అక్షయ పాత్ర’ సరఫరా చేస్తున్న మధ్యాహ్న భోజనంపై మరోసారి వివాదం రాజుకుంది. గతంలో ఒడిశా రాష్ట్రంలో తలెత్తిన వివాదానికి ప్రధాన మీడియా ప్రాధాన్యత ఇవ్వగా, ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో రాజుకున్న వివాదానికి ట్విట్టర్ వేదికగా మారింది. మధ్యాహ్న భోజనంలో వడ్డిస్తోన్న కూరలు మసాలా దినుసుల వాసనలు లేకుండా చప్పగా ఉంటున్నాయని, విద్యార్థులు వాటిని తినలేక బోరుమంటున్నారంటూ ముందుగా స్థానిక మీడియాలో వార్తలు వెలువడ్డాయి. దానిపై ట్విటర్లో వాదోపవాదాలు రాజుకున్నాయి. అక్షయపాత్ర వంటకాలు అలా ఉండడానికి కారణం వారు వంటల్లో అల్లం–వెల్లుల్లి, ఉల్లిపాయలు ఉపయోగించకపోవడం. వాటిని ఉపయోగించడానికి వారు విరుద్ధం. ఎందుకంటే అది వారి తాత్విక చింతనకు వ్యతిరేకం. వాటిని తినడం వల్ల మనుషుల్లో కామ, క్రోదాలు ప్రకోపిస్తాయనడానికన్నా ఆధ్యాత్మిక చింతన తగ్గుతుందన్నది ఆ సంస్థ వాదన. మరి వారు పూజిస్తోన్న శ్రీకృష్ణుడు ఇవేమీ తినకుండానే వెయ్యి మంది గోపికలతో శృంగార లీలలు ఎలా నెరపారబ్బ!... ట్విటర్లో ఓ గడుగ్గాయి కొంటె ప్రశ్న. దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డును తప్పకుండా సరఫరా చేయాలంటూ భారత జాతీయ పోషకాల ప్రమాణాల సంస్థ ఆదేశాలను కూడా ఇస్కాన్ సంస్థ అమలు చేయడం లేదు. తాము శాకాహారానికి నిబద్ధులమని, కోడిగుడ్డు మాంసాహారం కనుక తాము సరఫరా చేయమన్నది వారి వాదన. అవసరమైతే తాము ఈ పథకం నుంచి తప్పుకుంటాంగానీ సరఫరా చేయమని వారు మొండికేశారు. ఒడిశాలో సామరస్య పరిష్కారం ఒడిశాలో కూడా అక్షయ పాత్ర ద్వారా విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ఇస్కాన్ సంస్థే అమలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని విధాలుగా చెప్పిన గుడ్డును సరఫరా చేయడానికి సంస్థ నిరాకరించింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం వారానికి మూడు సార్లు గుడ్లను ఉడకబెట్టి విద్యార్థులకు వడ్డించే బాధ్యతను పాఠశాలల హెడ్మాస్టర్లకు అప్పగించింది, ఆ మేరకయ్యే ఖర్చును ఇస్కాన్ సంస్థ నుంచే రాబట్టుకోవాలని సూచించింది. అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ విషయంలో మాత్రం ఆ ప్రభుత్వం కూడా ఏం చేయలేక వదిలేసింది. కర్ణాటకలోను ఉత్తర్వులు జాతీయ పోషక ప్రమాణాల సంస్థ సిఫార్సు మేరకు కూరల్లో అల్లం వెల్లులి, ఉల్లిపాయలను తప్పనిసరిగా వినియోగించాలంటూ 2018, నవంబర్ నెలలో కర్ణాటక రాష్ట్ర విద్యా శాఖ అధికారికంగా ఇస్కాన్ సంస్థకు ఉత్తర్వులు జారీ చేసింది. దానికి బదులు తాము ఈ పథకం నుంచి తప్పుకుంటామని బెదిరించడమే కాకుండా తమ వంటకాల్లో విద్యార్థులకు అవసరమైన పోషకాలు ఉంటున్నాయని వాదించింది. ఈ విషయంలో ‘ఆహారం ప్రాథమిక హక్కు’ కార్యకర్తలు జాతీయ పోషక ప్రమాణాల సంస్థకు కేసును నివేదించగా వారు కూడా పోషకాలు ఉన్నాయంటూ సమర్థించారు. విద్యార్థులకు సరఫరా చేస్తోన్న ఆహారం ఎంత?, అందులో వారు వృధా చేస్తున్నది ఎంత? ఎలా మీరు శాంపిల్ను తనిఖీ చేశారంటూ ఎన్జీవోలు సంధించిన ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం రాలేదు. అక్షయ పాత్ర భోజనం ఉచితం కాదు ఇస్కాన్ సంస్థ వెబ్సైట్లో ఉన్న వివరాలు ప్రకారం ఈ సంస్థ దేశంలోని 12 రాష్ట్రాల్లోని 15,024 ప్రభుత్వం, ప్రభుత్వ ఆర్థిక సహాయ పాఠశాలల్లో 17 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తోంది. ‘ఉచితంగా భోజనం సరఫరా చేస్తుంటే ఇది కావాలి, అది కావాలంటూ డిమాండ్ పెడతారా?’ అంటూ కొందరు అమాయకంగా ట్వీట్లు పెట్టారు. ఎంతమాత్రం ఈ సంస్థ ఉచితంగా ఈ పథకాన్ని అమలు చేయడం లేదు. ప్రభుత్వం ప్రతి విద్యార్థి భోజనానికి ఐదున్నర రూపాయల చొప్పున చెల్లించడంతోపాటు భారత ఆహార సంస్థ నుంచి ఆహార ధాన్యాలను ఉచితంగా సరఫరా చేస్తోంది. ఈ పథకం కింద ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుంటాయి. అన్ని రాష్ట్రాల్లో కలిపి దేశవ్యాప్తంగా 11.6 లక్షల ప్రభుత్వ పాఠశాలల్లోని 9.40 కోట్ల మంది విద్యార్థులకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ లెక్కలు తెలియజేస్తున్నాయి. అయినా చాలడం లేదంటున్న ఇస్కాన్ అక్షయ పాత్ర కింద తాము ఖర్చు పెడుతున్న మొత్తంలో 60 శాతం మాత్రమే ప్రభుత్వం నుంచి వస్తోందని, 12 రాష్ట్రాల్లో 43 వంటశాలలను సొంత ఖర్చుతో నిర్మించామని, 5,500 మంది ఉద్యోగులకు తామే జీతాలు చెల్లిస్తున్నామని అక్షయ పాత్ర పర్యవేక్షకుల్లో ఒకరైన మోహన్దాస్ పాయ్ వివరించారు. ఇతర ఎన్జీవో సంస్థలకన్నా ఉన్నంతలో శుభ్రంగా విద్యార్థులకు భోజనాన్ని అందిస్తోందన్న కారణంగా అక్షయ పాత్ర సేవలను వదులు కోవడానికి పలు రాష్ట్రాలు సిద్ధంగా లేవు. అసలు ఈ పథకం ఎలా పుట్టింది? 1920లో మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్నప్పుడే మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ నిమ్న వర్గాల విద్యార్థుల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. దేశ స్వాతంత్య్రానంతరం తమిళనాడు ముఖ్యమంత్రులుగా ఉన్న కే. కామరాజ్, ఎంజీ రామచంద్రన్ అన్ని వర్గాల విద్యార్థులకు దీన్ని విస్తరించి పథకాన్ని మెరగుపర్చారు. 1995లో ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్రం చొరవ తీసుకుంది. పిల్లలను బడికి ఆకర్షించడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని భావించింది. 2001లో సుప్రీం కోర్టు ‘ఆహారం ప్రాథమిక హక్కు’కు సంబంధించిన ఓ కేసులో అన్ని ప్రభుత్వం పాఠశాలల్లో ఈ పథకాన్ని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటిప్స్
►అరలీటరు నీటిని వేడి చేసి అందులో మూడు నుంచి ఐదు చుక్కల అరోమా ఆయిల్ వేసి గదిలో ఒక మూలగా ఉంచితే మెల్లగా గదంతా సువాసనభరితమవుతుంది. ఆ గాలినే పీల్చడం వల్ల శ్వాసకోశ రుగ్మతలు నివారణ అవుతాయి. రోజంతా మనసు ఆహ్లాదంగా ఉంటుంది. నీటిని పోసిన పాత్ర మీద సన్నని చిల్లులున్న మూత కాని, వదులుగా ఉన్నది కాని పెడితే నీటి ఆవిరితో ఎసెన్షియల్ ఆయిల్ సువాసన కొద్దికొద్దిగా రోజంతా విడుదలవుతుంది. ►పూరీల్లాంటివి వేయించినప్పుడు మూకుడు అడుగున నల్లగా పేరుకుంటుంది. అలాంటప్పుడు ఆ మూకుడులో ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసి, పొయ్యిమీద పెట్టాలి. కాసేపటికి పేరుకున్న నల్లని మిశ్రమం రెబ్బలకు అంటుకుంటుంది. వాటిని తీసేసి నూనెను వడకట్టాలి. -
వెల్లుల్లితో వెయిట్లాస్!
వెల్లుల్లి.. భోజన ప్రియులకు సుపరిచితమైన పేరు.. వంటింట్లో ముఖ్యమైన దినుసుల్లో ఒకటైన వెల్లుల్లి రుచికే కాక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని తాజా పరిశోధనల్లో తేలింది. శరీరంలో అనవసరమైన కొవ్వును కరిగిస్తుందని, అధిక బరువును కూడా తగ్గిస్తుందని వెల్లడైంది. లాసన్ అని పిలిచే ఈ వెల్లుల్లిలో బి6, సీ విటమిన్, పీచు, మాంగనీస్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయని, రోజూ క్రమం తప్పకుండా తగిన మోతాదులో తింటే శరీరంలో ఉండే కొవ్వు కరిగి నాజూకుగా తయారవుతారని పరిశోధకులు చెబుతున్నారు. ఈ అధ్యయన ఫలితాలు జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ పత్రికలో ప్రచురితమయ్యాయి. కొవ్వు కరుగుతుంది.. వెల్లుల్లిలో ఉండే అలిసిన్ అనే రసాయన సమ్మేళనాలు శరీరంలో ముఖ్యంగా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించే ప్రక్రియను వేగవంతం చేస్తాయి. ప్రతి రోజూ వెల్లుల్లిని తింటే బరువు కూడా తగ్గుతారని పరిశోధనలో తేలింది. వెల్లుల్లి శరీరంలో మూత్రం ఉత్పత్తిని పెం చుతుంది. తద్వారా అనవసరమైన కొవ్వు, విసర్జితాలు శరీరం నుంచి బయటకు పోతాయి. ఎలా వాడాలి.. ఉదయాన్నే నిద్ర లేవగానే కొన్ని పచ్చి వెల్లుల్లి పాయల్ని తిని నీళ్లు తాగాలి. లేదంటే వెల్లుల్లి రసాన్ని కూడా తాగవచ్చు. వెల్లుల్లి వాసన పడదనుకుంటే గోరు వెచ్చని నీటిలో కొంచెం నిమ్మరసాన్ని, వెల్లుల్లి రసాన్ని కలిపి తాగాలి. ఈ రసాన్ని తయారు చేసిన వెంటనే తాగేయాలి. నిల్వ ఉంచితే పనికిరాదు. వెల్లుల్లిని నిమ్మరసంతో కలిపి తీసుకుంటే తొందరగా బరువు తగ్గుతారని పరిశోధకులు చెబుతున్నారు. చాలామంది వెల్లుల్లి వాసన భరించలేక దానికి దూరంగా ఉంటారు. ఇలాంటి వారు వెల్లుల్లి పాయల్ని ఒకేసారి మాత్రల మాదిరిగా గబుక్కున మింగేయవచ్చు. ఎలా పని చేస్తుంది.. వెల్లుల్లిలో ఆకలిని చంపేసే గుణముంది. దానివల్ల మీరు చాలా సేపు ఏమీ తినకపోయినా ఇబ్బంది రాదు. అతిగా తినడం కూడా తగ్గుతుంది. శరీరంలో ఉండే అదనపు క్యాలరీలను కరిగించడం ద్వారా వెల్లుల్లి మీకు శక్తిని ఇస్తుంది. రోగ నిరోధక వ్యవస్థ బలోపేతమవుతుంది. వెల్లుల్లిని నేరుగా తినడం వల్ల రక్తకణాలు ప్రభావితమవుతాయని, కొలెస్ట్రాల్ స్థాయి అదుపులో ఉంటుందని పరిశోధనలో తేలింది. వెల్లుల్లి శరీరంలో తయారయ్యే అన్ని రకాల విషాలను హరిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. మితమే హితం.. ఆరోగ్యానికి మంచిది కదా అని అదే పనిగా వెల్లుల్లిని ఎక్కువగా తింటే ప్రమాదమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మీ ఆరోగ్యం, శారీరక స్థితిని బట్టి తగినంత మాత్రమే వెల్లుల్లిని తీసుకోవాలి. ఎంత, ఎలా తీసుకోవాలన్నది డైటీషియన్ లేదా పోషకాహార నిపుణుడి ద్వారా తెలుసుకుంటే మంచిది. -
వర భోజనం
టైమ్కి తినడం ఆరోగ్యం.టైమ్లీగా తినడం ఆహ్లాదం. ఆరోగ్యం, ఆహ్లాదం కలిసిందే ఆయుర్ భోజనం. ప్రకృతి ప్రసాదించిన రేకలు, శాకలతో తయారవుతుంది కనుక ఇది వర భోజనం కూడా! పూల రెక్కలు.. కొన్ని తేనె చుక్కలు కలిపి రంగరించి బొమ్మ చేస్తే అందమైన అమ్మాయి రూపం వస్తుందో రాదో కానీ, పూలరెక్కలను పోపులో వేసి మరిగించి తేనె చుక్కలు కలిపితే రుచికరమైన చారు తయారవుతుంది. ఆశ్చర్యంగా అనిపించినా, విచిత్రంగా ముఖం పెట్టినా సరే.. ఇది నిజం. వెల్లుల్లి కర్రీ కూడా దాదాపుగా అంతే. కూరల్లో వెల్లుల్లి రేకలు వేయడమే మనకు తెలిసిందే. వెల్లుల్లి పేస్ట్తో మాంసాహారం వండుకోవడమూ తెలుసు. అయితే వెల్లుల్లి రేకలతోనే కూర చేయడం ఓ ప్రయోగం. మాంసాహారాన్ని మరిపించిన ఆరోగ్యవర్ధిని వెల్లుల్లి కర్రీ. కోడిగుడ్డు సొన కనిపించని ఆమ్లెట్ కూడా అంతే విచిత్రం. శనగపిండి– పెసర పిండిని బజ్జీల పిండిలా కలిపి నెయ్యి రాసిన పెనం మీద పోసి పైన కూరగాయ ముక్కలు, జీలకర్ర పొడి, మిరియాల పొడి చల్లితే ఎగ్లెస్ వెజ్ ఆమ్లెట్ రెడీ. ఇవన్నీ జానపద చిత్రంలో... విచిత్రలోకంలో వడ్డించిన విస్తరిలో కనిపించిన ఆచరణ సాధ్యం కాని అద్భుతాలు కాదు. అడవుల్లో సంచరిస్తూన్నప్పుడు కడుపు నింపుకునే ఆపద్ధర్మ భోజనమూ కాదు. అచ్చమైన ఆయుర్వేద భోజనం. ఆరోగ్యకరమైన భోజనం. అభివృద్ధి పరుగులో ప్రకృతికి దూరంగా వచ్చేసిన మనిషిని తిరిగి ప్రకృతికి దగ్గర చేసే ప్రయత్నమే ఈ భోజనం. రేపటి నుంచి కార్తీకం కార్తీకం.. వనభోజనాల సందడి మొదలయ్యే మాసం. ఈ ఆయుర్ మెనూని పాటిస్తే ఆరోగ్యంతో పాటు, సందర్భోచితంగా కూడా ఉంటుంది. ఆయుర్ భోజనం అంటే కందమూలాలు తినాలా అని ముఖం చిట్లించాల్సిన కష్టమూ అక్కర్లేదు. వెల్కమ్ డ్రింక్స్గా ఆమ్పన్నా, కొబ్బరి పాలు; పండ్లు– కూరగాయల సలాడ్లు; మొక్కజొన్న– క్యారట్ సూప్లోకి మెంతి ఆకు–మునగాకు పకోడీ స్టార్టర్స్; అలసంద – సగ్గుబియ్యం గారె; మెయిన్ కోర్సులో పాలకూర రోటీలోకి జీడిపప్పు– అల్లం తరుగు కూర, వెల్లుల్లి ఇగురు, నేతితో వెజ్ ఆమ్లెట్, పెసర (ముద్ద) పప్పు–నెయ్యి, గుమ్మడికాయ పప్పు, మందార పూల చారు, అల్లం పచ్చడి, కొబ్బరి పచ్చడి.ఇక మజ్జిగలో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీన, కరివేపాకు కలుపుకోవాలి. చివరగా శనగపప్పు– బెల్లం పాయసం, ఉసిరి – పటిక బెల్లం హల్వా... వీటితో సంపూర్ణ భోజనం. దీపావళికి రెండు రోజుల ముందు ధన్వంతరి దినోత్సవం. ఆ సందర్భంగా ఆయుర్వేద వైద్యులు పరిచయం చేసిన సంప్రదాయ, ఆరోగ్య సంపన్న భోజనమిది. గుర్తుంచుకోండి ∙అల్లం దేహంలోని మలినాలను తొలగిస్తుంది, మిరియాలు రోగాలను నయం చేస్తాయి, పండ్లు, కూరగాయలు దేహాన్ని శుభ్రపరుస్తాయి. ∙దక్షిణాదిలో చింతపండు వాడకం ఎక్కువ, అది ఎముకల పటుత్వాన్ని దెబ్బతీస్తుంది. ఆర్థరైటిస్ సమస్యలకు కారణమవుతుంది. ∙కొబ్బరి దేహాన్ని చల్లబరిచి జీవక్రియను వేగవంతం చేస్తుంది. సమతుల ఆహారం ఒబేసిటీని దగ్గరకు రానివ్వదు, బరువు తగ్గడానికీ దోహదం చేస్తుంది. ∙మన దేహం ఆకలి అనే హెచ్చరికను మెదడుకు చేర్చేది కడుపు నింపమని చెప్పడానికి కాదు. పోషకాలతోకూడిన సమతుల ఆహారాన్ని ఇవ్వమని మాత్రమే. బిస్కట్, సమోసాలతో తాత్కాలికంగా ఆకలిని మరిపిస్తుంటాం. అందులో దేహానికి అవసరమైన పోషకాలు లేకపోవడంతో అరగంట లోపే మళ్లీ ఆకలి వేస్తుంటుంది. పప్పులో మునగ పువ్వు మునగలో వాపును నివారించే గుణం ఉంది. దేహానికి గాయమైతే మునగచెట్టు బెరడును ఒలిచి దంచి గాయం మీద పెట్టి కట్టుకడితే మూడో రోజుకి గాయం ఆనవాలు లేకుండా పోతుంది. మునగ కాయలనే కాదు, మునగ పువ్వును పప్పులో వేసుకోవచ్చు, ఆకుతో కూర, పకోడీలు చేసుకోవచ్చు. ఇప్పుడు వస్తున్న లైఫ్స్టయిల్ డిసీజ్లు తగ్గాలంటే, బ్రౌన్రైస్ అన్నం తినడంతోపాటు ఆహారంలో మునగ, వెల్లుల్లి వీలయింత తరచుగా వాడాలి. – డాక్టర్ యాన్సీ డి సౌజా పండ్లు.. భోజనానికి ముందే మన మనసుకి అసలైన భాగస్వామి మన శరీరమే. అందుకే దేహాన్ని కాపాడుకోవడం మీద మనసు పెట్టాలి. మంచి ఆహారంతో రోగాలను నివారించవచ్చు. అలాగే మనకు భోజనం తర్వాత పండ్లు తినాలనే పెద్ద అపోహ ఉంది. నిజానికి పండ్లను భోజనానికి ముందు తినాలి. ఆహారం– విహారం సక్రమంగా ఉంటే డాక్టర్ అవసరం లేని జీవితాన్ని గడపవచ్చు. – డాక్టర్ సాజీ డి సౌజా – వాకా మంజులారెడ్డి -
స్ప్రింగ్రోల్ నూడుల్స్
కావలసినవి:వెర్మిసెల్లి నూడుల్స్ – ఒక ప్యాకెట్ (సూపర్ మార్కెట్లో దొరుకుతాయి); నూనె – 2 టీ స్పూన్లు;వెల్లుల్లి తరుగు – అర టీ స్పూను; క్యారట్ తురుము – ఒక కప్పు (నూడుల్స్లాగే పొడవుగా తురమాలి); ఉల్లి కాడల తరుగు – 2 టేబుల్ స్పూన్లుక్యాబేజీ తరుగు – 2 కప్పులు; పంచదార – పావు టీ స్పూను; సోయా సాస్ – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత స్ప్రింగ్ రోల్ షీట్లు – 7; మిరియాల పొడి – అర టీ స్పూను; కార్న్ ఫ్లోర్ – ఒక టీ స్పూను; నీళ్లు – 2 టేబుల్ స్పూన్లు; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ :ఒక పెద్ద పాత్రలో వేడి వేడి నీళ్లు పోసి, అందులో వెర్మిసెల్లి నూడుల్స్ను మధ్యకు విరిచి వేసి అరగంట సేపు పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి అందులో 2 టీ స్పూన్ల నూనె వేసి కాగాక వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి. ఉల్లికాడల తరుగు జత చేసి మరోమారు వేయించాలి. క్యాబేజీ తరుగు, క్యారట్ తరుగు కూడా జత చేసి బాగా కలిపి కొద్దిసేపు ఉడికించాలి. (మరీ ఎక్కువ ఉడికించకూడదు) సోయా సాస్, పంచదార, ఉప్పు, మిరియాల పొడి జత చేసి మరోమారు బాగా కలపాలి. నీళ్లలో నుంచి వెర్మిసెల్లి బయటకు తీసి, ఉడుకుతున్న క్యాబేజీ మిశ్రమంలో వేసి బాగా కలపాలి. చిన్న పాత్రలో కొద్దిగా నీరు, కార్న్ఫ్లోర్ వేసి మెత్తగా కలిపి, నూడుల్స్లో వేసి బాగా కలిపితే స్టఫింగ్ సిద్ధమైనట్లే ∙కొద్దిగా స్టఫింగ్ మిశ్రమం తీసుకుని, స్ప్రింగ్ రోల్ షీట్ మీద ఉంచి, రోల్ చేసి పక్కన ఉంచుకోవాలి స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాగాక, తయారుచేసి ఉంచుకున్న రోల్స్ను వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. -
పూజలు, వ్రతాలలో ఉల్లి, వెల్లుల్లిని ఎందుకు వాడరు?
ఉల్లి చేసిన మేలు తల్లయినా చేయదని సామెత. అయితే, హిందూ సంప్రదాయం ప్రకారం ప్రత్యేకమైన పూజలు, వ్రతాలు చేసేటప్పుడు ఉల్లి, వెల్లుల్లి, మసాలాలు లేని సాత్వికమైన ఆహారాన్నే తీసుకోవాలన్న నిబంధన ఉంటుంది. పూజలు, వ్రతాలలోనే కాదు, ఆచారాలను నిష్టగా పాటించే వారు చాలామంది వెల్లుల్లి, ఉల్లి తదితర మసాలా పదార్థాలను తీసుకోరు. అసలు ఈ విధమైన సంప్రదాయం ఎందుకు వచ్చింది? పూర్వులు ప్రత్యేక సందర్భాలు, పర్వదినాలలో వీటిని తమ ఆహారంలో ఎందుకని నిషేధించారో తెలుసుకుందాం! ఆయుర్వేదం ప్రకారం మనం తీసుకునే ఆహారం మొత్తం మూడు భాగాలుగా విభజించారు. అవే సాత్వికం, రాజసికం, తామసికం. వీటిలో ఒక్కో పదార్థం మనిషిలోని ఒక్కో గుణాన్ని పెంచడమో, తగ్గించడమో చేస్తాయి. ఉల్లి, వెల్లుల్లి. మాంసాహారం, మసాలా దినుసులు ఇంకా కొన్ని మొక్కలు రాజసిక తత్వానికి చెందినవి. వీటిని తీసుకోవడం వలన కోపం, ఆలోచనలలో అస్థిరత, ఏకాగ్రతలోపం కలుగుతాయట. ఉల్లి, వెల్లుల్లి కామాన్ని ప్రేరేపిస్తాయట. నిష్టతో ఉండాలనుకునే వారి మనసును మళ్లిస్తాయట. అందుకే ప్రత్యేక సందర్భాలలో ముఖ్యంగా ఎక్కువసేపు ఏకాగ్రతగా కూర్చుని చేయవలసిన పూజలు, వ్రతాలలో ఆహారంలో వాటిని నిషేధించారట. మరో విషయం ఏమిటంటే, ఉల్లి, వెల్లుల్లి వేర్లుగా భూ అంతర్భాగం నుండి లభిస్తాయి. వాటిని శుభ్రం చేసే సమయంలో ఆ సూక్ష్మజీవులు హత్యకు గురవుతాయని వాటిని తినడానికే దూరంగా ఉంటారట. ఉల్లి, వెల్లుల్లి, పుట్టగొడుగులు అవి పెరిగే ప్రదేశం శుచీశుభ్రత లేకుండా ఉంటాయని వాటికి దూరంగా ఉంటారట, భగవంతుణ్ణి భక్తితో కొలిచేటప్పుడు ఇలాంటివి సేకరించడం, వాటిని ఆహారంలో తీసుకోవడం తప్పుగా భావిస్తారు. -
వెల్లుల్లితో సూపర్బగ్స్కు చెక్
దాదాపుగా అందరి వంటిళ్లలో విరివిగా వాడే వెల్లుల్లిలో యాంటీబాక్టీరియల్ లక్షణాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే, యాంటీ బయోటిక్స్కు లొంగని సూపర్బగ్స్ను కూడా వెల్లుల్లితో సమర్థంగా అరికట్టవచ్చని ఒక తాజా పరిశోధనలో తేలింది. వెల్లుల్లిలో ఉండే ‘అజోనే’ అనే రసాయనం ఎలాంటి మొండిరకం బ్యాక్టీరియాలనైనా ఇట్టే నాశనం చేయగలదని డానిష్ శాస్త్రవేత్తల ప్రయోగాల్లో తేలింది. యాంటీబయోటిక్స్ను తట్టుకుని మరీ మనుషుల శరీరంలోని కణజాలానికి అంటిపెట్టుకుని ఉండే బ్యాక్టీరియా డీఎన్ఏను వెల్లుల్లిలోని ‘అజోనే’ అనే రసాయనం నాశనం చేయగలుగుతోందని తమ ప్రయోగాల్లో తేలినట్లు కోపెన్హాగెన్ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ టిమ్ హామ్ జాకబ్సన్ వెల్లడించారు. మొండి బ్యాక్టీరియా కారణంగా ఇన్ఫెక్షన్లు సోకిన వారికి యాంటీ బయోటిక్స్తో పాటు వెల్లుల్లి నుంచి సేకరించిన ‘అజోనే’తో తయారు చేసిన ఔషధాలను వాడినట్లయితే ప్రాణాంతక పరిస్థితుల నుంచి బయటపడవచ్చని కోపెన్హాగెన్ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. -
క్యాన్సర్ల పాలిట సింహస్వప్నం... వెల్లుల్లి!
ఆవకాయలోని నూనెలో నానిన వెల్లుల్లి రుచిని ఇష్టపడని వారు చాలా తక్కువ. వెల్లుల్లి ఘాటు అనేక ఆరోగ్యప్రయోజనాలు ఇస్తుంది. ♦ వెల్లుల్లి జీర్ణక్రియ బాగా జరిగేలా తోడ్పడుతుంది. జీర్ణవ్యవస్థలో వాపు, మంటలను ఉపశమింపజేస్తుంది ♦ వెల్లుల్లిలోని ఘాటుదనం వల్ల అనేక క్యాన్సర్లను స్వాభావికంగా నివారించవచ్చు. పెద్దపేగు (కోలన్), పొట్ట, ఈసోఫేజియల్ క్యాన్సర్లతో పాటు రొమ్ము క్యాన్సర్ గడ్డలను వెల్లుల్లి తేలిగ్గా నివారిస్తుంది ♦ వెల్లుల్లిలోని అల్లిసిన్ అనే కాంపౌండ్ చెడు కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచడంతో పాటు దాని దుష్ప్రభావాలను నివారిస్తుంది ♦ వెల్లుల్లిలోని అల్లిసిన్లో రక్తనాళాలను విప్పార్చేలా చేసే గుణం ఉండటం వల్ల అధిక రక్తపోటు తగ్గుతుంది ∙వెల్లుల్లిలోని ఔషధగుణాలు డయాబెటిస్ను నియంత్రణలో ఉండేలా చేస్తాయి ∙వెల్లుల్లి జలుబు, దగ్గును దూరం చేస్తుంది. రెండు వెల్లుల్లి రెబ్బలను కాస్తంత నలిపి తింటే జలుబు తీవ్రత చాలావరకు తగ్గుతుంది ♦ వెల్లుల్లిలోని సెలినియమ్, క్వార్సెటిన్, విటమిన్–సి పుష్కలంగా ఉండటం వల్ల అది గాయాలను సమర్థంగా మాన్పగలదు. అంతేకాదు... కంటికి వచ్చే ఇన్ఫెక్షన్లు, కళ్లవాపును తగ్గిస్తుంది. -
హెల్త్టిప్స్
ఫంగల్ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో వెల్లుల్లి బాగా పని చేస్తుంది. వెల్లుల్లిని చిదిమి గాయాలు, వాపుల మీద పెట్టి కట్టు కడితే మరుసటి రోజు ఉదయానికి ఉపశమనం ఉంటుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో సైనికులు ఇదే చిట్కాను పాటించారు. గర్భిణిగా ఉన్నప్పుడు వెల్లుల్లి తిన్నా, రోజూ వెల్లుల్లిని వాసన చూసినా బిడ్డ చక్కగా బరువు పెరుగుతుంది. అయితే ఫ్యామిలీలో ఒబేసిటీ గుణం ఉన్న వారు మినహాయించాలి. -
వెల్లుల్లి... పొట్టను కడిగేస్తుంది!
తిన్న తర్వాత నోటి నుంచి ఘాటైన వాసన వస్తుంటుందని కొందరు వెల్లుల్లిని అంతగా ఇష్టపడరు. కానీ... ఆరోగ్య పరిరక్షణ కోసం వెల్లుల్లి చేసే మేలు అంతా ఇంతా కాదు. రక్తపోటు, గుండెపోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను దూరంగా ఉంచుతుంది. ► వెల్లుల్లిలోని అల్లిసిన్ అనే యాంటాక్సిడెంట్ రక్తనాళాల్లో కొవ్వులు పేరుకోనివ్వదు. గుండెజబ్బులను నివారిస్తుంది. ► వయసు పెరగడాన్ని, క్యాన్సర్ను ప్రేరేపించే ఫ్రీరాడికల్స్ను అల్లిసిన్ అదుపు చేస్తుంది. ► వెల్లుల్లి తినడం వల్ల మన రక్తనాళాల్లో సాగే గుణం పదిలంగా ఉంటుంది. వెల్లుల్లి తిననివారితో పోలిస్తే... క్రమం తప్పకుండా తినే వారిలో రక్తనాళాలు సాగే గుణం 72% అధికం. ► జలుబుతో బాధపడేవారు వెల్లుల్లిని ఏదో ఒక రూపంలో తీసుకుంటే తక్షణం ఉపశమనాన్ని కలగజేస్తుంది. ► క్రమం తప్పకుండా వెల్లుల్లి తినేవారిలో పొట్ట పరిశుభ్రంగా ఉంటుంది. వెల్లుల్లి వ్యాధినిరోధకశక్తిని పెంపొందిస్తుంది. నిత్యం వెల్లుల్లి తినేవారిలో స్టమక్ క్యాన్సర్, పెద్దపేగు, కోలోరెక్టల్ క్యాన్సర్లు వచ్చే అవకాశం తక్కువ. -
ఇంటింటా చిటపట
మండుతున్న నిత్యావసరాలు, కూరగాయల ధరలు మార్కెట్కు వెళ్లాలంటనే భయమేస్తోందంటున్న జనం 15% వరకూ పెరిగిన నూనెల ధరలు కుతకుతలాడుతున్న పప్పులు.. బియ్యం, చక్కెర, అల్లం, వెల్లుల్లి ధరలూ నింగికి.. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఇప్పటికే పెరిగిన స్కూల్ ఫీజులు, ఇతర ఖర్చులతో ప్రజల విలవిల ప్రభుత్వం వెంటనే కల్పించుకుని ధరలు తగ్గించే చర్యలు చేపట్టాలని డిమాండ్ పచ్చిమిర్చి రూ. 100 పైనే కిలో టమాటా రూ. 90 బీరకాయ, చిక్కుడు రూ. 80పైనే సాక్షి నెట్వర్క్: కూరగాయల ధరలు కొండెక్కాయి.. పప్పులు ఎంతకూ దిగిరానంటున్నాయి.. నూనెలు మంటెక్కుతున్నాయి.. బియ్యం ధరలు చుక్కలను తాకుతున్నాయి.. చక్కెర చేదెక్కిపోయింది.. సంచుల్లో డబ్బులు తీసుకెళ్లి జేబుల్లో సరుకులు తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తోంది.. సగటు మనిషి జీవితం ఆగమాగమవుతోంది.. పేదలు, మధ్యతరగతి జనాలు విలవిల్లాడిపోతున్నారు. వంద రూపాయలు పట్టుకుని బజారుకు వెళితే ఒక్కరోజుకు సరిపడా సరుకులు కూడా రాక లబోదిబోమంటున్నారు. ఇప్పటికే భారీగా పెరిగిన స్కూల్ ఫీజులు, ఇతర ఖర్చులతో సతమతమవుతున్నవారు ధరల పెంపుతో నిండా ఆవేదనలో కూరుకుపోతున్నారు. ధరల మంటతో ఇలా పేదలు, మధ్య తరగతి అల్లాడుతున్నా పట్టించుకునే నాథుడు లేడు. అటు కేంద్ర ప్రభుత్వం ‘అచ్ఛేదిన్ ఆగయే’ అంటూ డప్పు కొట్టుకుంటోంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం బంగారు తెలంగాణ వెలిగిపోతోందని ప్రకటనలు చేస్తోంది. నిత్యావసరాల ధరలు తగ్గించడంపై మాత్రం ఎవరికీ పట్టింపు లేదు. కొనాలంటే భయం.. రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు చుక్కలను తాకుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూరగాయల ధరలు 30 శాతానికిపైగా పెరగగా.. నిత్యావసరాల ధరలు 15 శాతం వరకు పెరిగాయి. టమాటా, పచ్చిమిర్చి వంటివి కిలో రూ.100కు చేరుకున్నాయి. బీరకాయ, బెండకాయ, చిక్కుడు, కాకర, క్యాబేజీ వంటివి వాటితో పోటీ పడుతున్నాయి. పాలకూర, మెంతికూర, కొత్తిమీర, తోటకూర వంటి ఆకుకూరలన్నీ పది రూపాయలకు నాలుగైదు కట్టలు చొప్పున విక్రయించేవారు. ప్రస్తుతం పది రూపాయలకు రెండు కట్టలు కూడా ఇవ్వడం లేదు. మార్కెట్లకు వెళుతున్నవారు ఒక్కో కూరగాయలను పావుకిలోకు మించి కొనేందుకు సాహసించడం లేదు. ఇక మార్కెట్లకు దూరంగా ఉన్న ప్రాంతాల్లోని దుకాణాలు, తోపుడు బండ్లు వంటి వాటిలో కిలోకు మరో పది ఇరవై రూపాయలు అదనంగా విక్రయిస్తున్నారు. హైదరాబాద్లోని గుడిమల్కాపూర్, బోయిన్పల్లి తదితర హోల్సేల్ మార్కెట్లతోపాటు మెహిదీపట్నం, ఎర్రగడ్డలోని రైతుబజార్లలోనూ కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. నెల క్రితం హోల్సేల్ మార్కెట్లో కిలో రూ.7కు లభించిన టమాటా ఇప్పుడు రూ.60 నుంచి రూ.70 మధ్య పలుకుతోంది. ఇది రిటైల్కు వచ్చే సరికి ప్రాంతాన్ని బట్టి రూ.90-100 వరకు విక్రయిస్తున్నారు. నలుగురు కుటుంబ సభ్యులున్న ఇంట్లో వారానికి సరిపడా కూరగాయల కోసం నెల రోజుల కింద రూ.300 వరకు ఖర్చు కాగా.. ఇప్పుడది రూ.550-600కు చేరుకోవడం గమనార్హం. ఇక అప్పుడప్పుడూ చుక్కలనంటే ధరలతో భయపెట్టే ఉల్లిగడ్డ మాత్రం ఇప్పుడు తక్కువ ధరకే (కిలో రూ.15కే) దొరుకుతుండడం గమనార్హం. ఈ జ్ఞాపకం మధురమే! కందిపప్పు కిలోకు ఒక రూపాయి డెబ్బై పైసలు, నూనె కిలోకు నాలుగున్నర రూపాయలు.. భలే తక్కువ ధరలు కదా! దాదాపు 45 ఏళ్ల కింద 1971లో రాసిన సరుకుల చిట్టా ఇది. మధుర జ్ఞాపకాలు అంటూ ఈ చిత్రం ఫేస్బుక్లో చెక్కర్లు కొడుతోంది. అప్పట్లో నాలుగు రకాల పప్పులు ఎనిమిది కిలోలు, మూడు కిలోల నూనె, పావుకిలో నెయ్యి, రెండు కేజీల చక్కెర, 2 సబ్బులు, పోపు సామగ్రి అంతా కలిపి కేవలం 40 రూపాయల 75 పైసలకే ఇచ్చేశారు. నిజంగా ఇది మధుర జ్ఞాపకమే! నిత్యావసరాలు భగ్గు కూరగాయలే కాదు బియ్యం, పప్పులు, నూనెలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు కూడా అనూహ్యంగా పెరిగాయి. గత ఏడాది హోల్సేల్ మార్కెట్లో రూ.110కు కిలోచొప్పున లభించిన కందిపప్పు ఇప్పుడు రూ.150 దాటింది. అది రిటైల్ దుకాణాలకు వచ్చే సరికి కిలో రూ.180 నుంచి రూ.200 వరకు విక్రయిస్తున్నారు. లీటర్ వేరుశనగ నూనె రూ.100 నుంచి రూ.125కు, సన్ఫ్లవర్ నూనె రూ.80 నుంచి రూ.95కు పెరిగాయి. పేదలు వినియోగించే పామాయిల్ ధర కూడా లీటర్ రూ.65 నుంచి రూ.75కు పెరిగింది. బియ్యం, గోధుమలు వంటి వాటి ధరలూ 15 శాతం వరకూ పెరిగాయి. ఇక చింతపండు, అల్లం, వెల్లుల్లి, చక్కెర వంటి వాటి ధరలు కూడా బాగా పెరిగాయి. ధరల పెంపుపై ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే కందిపప్పు కొనడం మానేశామని, ఇప్పుడు టమాటా వంటి కూరగాయలను కూడా కొనలేని పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కల్పించుకుని నిత్యావసరాల ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తగ్గిన సాగు కొన్నేళ్లుగా కొనసాగుతున్న తీవ్ర వర్షభావ పరిస్థితులుతో కూరగాయల సాగు తగ్గిపోయింది. భూగర్భజలాలూ అడుగంటడంతో నీళ్లు లేక చిన్న రైతులు కూడా కూరగాయలు పండించలేకపోతున్నారు. రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, మదనపల్లి, అనంతపురం ప్రాంతాల్లో కూరగాయలు సాగవుతుంటాయి. కానీ కరువు పరిస్థితుల కారణంగా పంటల సాగు తగ్గింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో రైతులు అత్యధికంగా కూరగాయల సాగు చేసి హైదరాబాద్ నగరంలో విక్రయిస్తుంటారు. వారిలో ఈసారి సగం మంది కూడా కూరగాయలు సాగు చేయకపోవడం గమనార్హం. ఖమ్మం జిల్లాలో ఏటా దాదాపు 10 వేల ఎకరాల్లో కూరగాయలు సాగు చేసేవారు. ఈసారి 6 వేల ఎకరాల్లోనే వేశారు. అందులోనూ నీళ్లు లేక దిగుబడి బాగా తగ్గిపోయింది. ఏపీలోని రాయలసీమ జిల్లాల్లో కూరగాయల పంటలకు భారీగా మచ్చల తెగులు సోకడంతో నష్టం కలిగింది. మార్కెట్కు వెళ్లాలంటే భయమే.. ‘‘పప్పులు, బియ్యం ధరలు బాగా పెరిగాయి. మార్కెట్కు వెళదామంటే భయమేస్తుంది. ధరలు ఇలా పెరిగితే పేదలు, సామాన్యుల పరిస్థితి ఏం కావాలి? ప్రభుత్వం వెంటనే ధరలు నియంత్రించాలి.’’ - బసయ్య, తాండూరు, రంగారెడ్డి జిల్లా ఏం తినేటట్లు లేదు ‘‘కనీసం కూ రగాయలు కూడా కొనలేకపోతున్నాం. రెండు నెలల్లో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎన్నడూ లేనట్లు పచ్చిమిర్చి, టమాటా ధరలు కిలో 100 రూపాయలు దాటిపోయాయి. ఇలాగే ఉంటే ఏమీ కొనలేం. ఏమీ తినలేం..’’ - చింతల ఏసమ్మ, హైదరాబాద్ -
ఇంటిప్స్
వంటింట్లో సింకుల వద్ద బొద్దింకలు ఎక్కువగా చేరుతుంటాయి. అలా చేరకుండా ఉండాలంటే వెల్లుల్లి ముక్కలను దంచి ఆ పేస్ట్ను అవి వచ్చే చోట ఉంచాలి. గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఆ నీళ్లలో కొద్దిగా ఉప్పు వేయాలి. అలా చేస్తే వాటి పెంకు సులువుగా వచ్చేస్తుంది. క్యాబేజీ ఉడికించేటప్పుడు బాగా వాసన వస్తుంది. అలా రాకుండా ఉండేందుకు అందులో చిన్న అల్లం ముక్క వేస్తేచాలు. వంటింటిని శుభ్రం చేసే నీళ్లలో కాసింత పసుపు కలపాలి. దాని వల్ల ఈగలు రాకుండా ఉంటాయి. -
ఇంటిప్స్
వెల్లుల్లి రెబ్బల పొట్టు తీయడం చాలా మందికి ఇబ్బందిగానే ఉంటుంది. వెడల్పాటి రెండు సెరామిక్ బౌల్స్ తీసుకొని, ఒకదాంట్లో వెల్లుల్లి రెబ్బలను వేసి, మరో బౌల్ను వాటి మీద గట్టిగా అటూ ఇటూ అదిమితే.. త్వరగా పొట్టు వచ్చేస్తుంది. బటర్ను తురుముతుంటే గుజ్జుగా అయిపోయి ప్లేట్కు అతుక్కుపోతుంటుంది. ఇలాంటప్పుడు కొద్దిగా మైదా పైన చల్లితే కొబ్బరి తురుములా వస్తుంది. కావల్సినంత ఐస్క్రీమ్ తీసుకున్నాక డబ్బాను డీప్ఫ్రిజ్లో పెట్టేస్తారు. దీంతో అది అడుగుభాగాన గడ్డకట్టిపోయి, తిరిగి తీయడానికి కష్టమవుతుంది. ప్లాస్టిక్ జిప్లాక్ కవర్లో ఐస్క్రీమ్ను డబ్బాను ఉంచి, ఫ్రిజ్లో పెట్టేస్తే తిరిగి తీసుకోవడం సులువు అవుతుంది.