Gautham
-
అవకాశాలు లేక కాదు, రాక కాదు.. అందుకే సినిమాలు తగ్గించా!
తెలుగు దిగ్గజ కమెడియన్ బ్రహ్మానందం (Brahmanandam) కొన్నేళ్లుగా సినిమాలు తగ్గించేశాడు. ఒకప్పుడు జెట్ స్పీడ్లో చిత్రాలు చేసిన ఆయన ఈ మధ్య మాత్రం మూవీస్పై అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఏదో అడపాదడపా చిత్రాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తన కుమారుడు గౌతమ్తో కలిసి బ్రహ్మ ఆనందం అనే సినిమా చేశాడు.సినిమాలు ఎందుకు తగ్గించేశానంటే?గురువారం జరిగిన బ్రహ్మ ఆనందం టీజర్ లాంచ్ ఈవెంట్ (Brahma Anandam Teaser Launch Event)లో సినిమాలు తగ్గించడానికి గల కారణాన్ని హాస్య బ్రహ్మ బయటపెట్టాడు. బ్రహ్మానందం మాట్లాడుతూ.. నాకు మంచి ఇమేజ్ ఉంది. దాన్ని నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈయన కామెడీ అప్పట్లో బాగుండేది.. ఈ మధ్య కామెడీ చేస్తున్నాడు కానీ నవ్వు రావట్లేదు అన్న మాట కొందరు కమెడియన్ల దగ్గర విన్నాను. అది నాకొద్దు. ఎంత చేసినా ఇంకా ఏదో వెతుకుతూ ఉంటారు.నాకు తెలుసుఅలాగే నా వయసేంటో నాకు తెలుసు. వయసు పెరుగుతోందని అర్థం చేసుకోకుండా నేనింకా యంగ్ అంటే కుదరదు. ఇంతకుముందు చేసినంత యాక్టివ్గా నేను చేయలేకపోతున్నాను. నేను చేసిన పాత్రలే మళ్లీ ఆఫర్ చేస్తున్నారు, చేసిన కామెడీనే మళ్లీ చేయించాలని ప్రయత్నిస్తున్నారు.. నన్ను ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలంటే ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలి. అందుకే సినిమాలు తగ్గించేయాలని నాకు నేనుగా నిర్ణయం తీసుకున్నాను. సినిమాల్లో వేషాలు లేక కాదు, నాకు ఇవ్వక కాదు, నేను చేయలేకా కాదు! ఎంతజాగ్రత్తగా చేసినా దొరికిపోతాం. చేసిన కామెడీ చేస్తున్నాడన్న ఇమేజ్ వద్దనే సినిమాలు తగ్గించాను. ఇండస్ట్రీలో నా వారసత్వాన్ని వెన్నెల కిషోర్ కొనసాగిస్తాడు అని చెప్పాడు.ఆనందో బ్రహ్మ ఎలా ఒప్పుకున్నానంటే?డైరెక్టర్ నిఖిల్.. నా పేరుపైనే ఒక సినిమా రాసుకున్నానని, మీరు ఒప్పుకుంటే సినిమా చేస్తానన్నాడు. నాతో ఒక్క షాట్ అయినా డైరెక్ట్ చేయాలని తన కోరిక అని లేదంటే ఈ సినిమా పక్కనపెట్టేస్తానన్నాడు. అప్పటివరకు పోజు కొడదామనుకున్నాను కానీ నేను ఒప్పుకుంటేనే సినిమా అనేసరికి సరే అని అంగీకరించాను అని బ్రహ్మానందం చెప్పుకొచ్చాడు. హీరో ఎవరు? అని అడిగితే మా అబ్బాయి గౌతమ్ పేరు చెప్పారు. సినిమా కోసం వాడికి నేను తాతనయ్యాను అని చెప్పాడు. బ్రహ్మ ఆనందం సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. చదవండి: సంక్రాంతి రభస: మోహన్బాబు, విష్ణుపై మంచు మనోజ్ ఫిర్యాదు -
ఆనందమానందమాయే...
బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. ప్రియా వడ్లమాని, ఐశ్వర్యా హోలక్కల్ హీరోయిన్లుగా చేశారు. ఈ చిత్రం ద్వారా ఆర్వీఎస్ నిఖిల్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ‘మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద’ వంటి హిట్ చిత్రాలు తీసిన స్వధర్మ్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్పై రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.శాండిల్య పీసపాటి సంగీతం అందించిన ‘బ్రహ్మా ఆనందం’ నుంచి ‘ఆనందమానందమాయే...’ లిరికల్ సాంగ్ను విడుదల చేశారు మేకర్స్. సాయి కిరణ్ సాహిత్యం అందించిన ఈ పాటని మనీషా ఈరబత్తిని, యశ్వంత్ నాగ్ ఆలపించారు. ‘‘ఆనందమానందమాయే...’ క్యూట్ లవ్ సాంగ్. హీరోపై తన ప్రేమను హీరోయిన్ అందంగా వివరిస్తుంటే, హీరో మాత్రం తనకు డబ్బు మీదున్న ప్రేమ, అవసరాన్ని పాటగా పాడుకుంటున్నారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమేరా: మితేష్ పర్వతనేని. -
బిగ్బాస్ 8: టాప్ 5 ఫైనలిస్టుల బ్యాక్గ్రౌండ్ ఇదే! (ఫోటోలు)
-
సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి, ఎమ్మెల్యేపై ఫిర్యాదు
అవనిగడ్డ: తిరుపతి వెంకటేశ్వరస్వామి లడ్డూ వ్యవహారంలో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి, అవనిగడ్డ ఎమ్మెల్యే, తెలంగాణ బీజేపీ నేత మాధవీలతపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ కృష్ణాజిల్లా అవనిగడ్డలోని ఏడో వార్డుకు చెందిన న్యాయ విద్యార్థి బడే గౌతమ్ అవనిగడ్డ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమది హిందూ కుటుంబమని, తరచూ తిరుపతి వెళ్లి స్వామిని దర్శించుకుని లడ్డూ ప్రసాదాలు స్వీకరిస్తామని చెప్పారు. ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు లడ్డూలో పందికొవ్వు కలిసిందని ఆరోపించడం తగదన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందువులను రెచ్చగొట్టేలా ప్రసంగించారని, హోంమంత్రి వంగలపూడి అనిత, తెలంగాణ బీజేపీ నేత మాధవీలత లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని మీడియో ముందు మాట్లాడారని, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ లడ్డూలో కల్తీ జరిగిందని దేవాలయాల్లో పూజలు చేయించారని చెప్పారు. హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడంతో పాటు చట్టవ్యతిరేక విధానాలు అవలంబించిన వీరందరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నట్టు గౌతమ్ చెప్పారు. -
నవ్వులే నవ్వులు
‘పద్మశ్రీ’ బ్రహ్మానందం కీలక పాత్రలో ఆయన తనయుడు రాజా గౌతమ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మ ఆనందం’. ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్లుగా నటì స్తున్నారు. సావిత్రి, ఉమేష్ యాదవ్ సమర్పణలో స్వధర్మ్ ఎంటర్టైన్ మెంట్పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు.సోమవారం రక్షా బంధన్ సందర్భంగా ఈ సినిమాని డిసెంబర్ 6న విడుదల చేయనున్నట్లు ప్రకటించి, గ్లింప్స్ రిలీజ్ చే శారు మేకర్స్. ‘‘బ్రహ్మానందం, రాజా గౌతమ్ నటిస్తున్న ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ ‘బ్రహ్మ ఆనందం’. ఈ మూవీలో తాత, మనవడుగా వారు అలరించబోతున్నారు. రాజా గౌతమ్ స్నేహితుని పాత్రలో ‘వెన్నెల’ కిశోర్ ఫుల్ లెంగ్త్ రోల్లో కనిపిస్తారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
బ్రదర్ అంటే బెస్ట్ ఫ్రెండ్: సితార ఘట్టమనేని
బహుమతులు ఆనందాన్నిస్తాయి... అయితే వస్తువుల రూపంలో కన్నా మాటల రూపంలో ప్రేమను వ్యక్తపరిస్తే ఆ ఫీలింగ్ హృదయంలో నిలిచిపోతుంది. అన్నయ్య గౌతమ్ నుంచి అలాంటి ప్రేమనే ఎక్కువగా కోరుకుంటున్నానని చిన్నారి సితార అంటోంది. సూపర్ స్టార్ మహేశ్బాబు, నమ్రతల కుమార్తెగా పన్నెండేళ్ల సితార పాపులర్. ఓ జ్యువెలరీ బ్రాండ్ అంబాసిడర్గా తనకంటూ పాపులార్టీ తెచ్చుకుంది. సోమవారం రాఖీ పండగ సందర్భంగా ‘సాక్షి’కి సితార చెప్పిన ప్రత్యేకమైన ముచ్చట్లు...రాఖీ పండగను ఇంట్లో చిన్న పూజతో ప్రారంభిస్తాం. ఆ తర్వాత అన్నయ్యకు రాఖీ కట్టి, ఇద్దరం బహుమతులు ఇచ్చి, పుచ్చుకుంటాం. నాకు ఎనిమిది.. తొమ్మిదేళ్లప్పుడు అనుకుంటా... రాఖీకి అసలైన అర్థం తెలిసింది. చేతికి రాఖీ కట్టడం అనేది ఓ ఆచారం కాబట్టి పాటించాలి. అంతవరకే నాకు తెలుసు. అయితే సోదరుడి అనుబంధం, రక్షణ ఎంతో అవసరమని, అది సూచించే విధంగా కట్టే రాఖీకి చాలా ప్రాధాన్యం ఉందని ఈ పండగ అసలు విషయం అర్థమైంది. ఆచారం అర్థం అయ్యాక ఈ ఫెస్టివల్కి ప్రాధాన్యం ఇస్తున్నాను.రాఖీ కొనడానికి చాలా టైమ్ తీసుకుంటాఈ సంవత్సరం ఎప్పటికీ గుర్తుండిపోతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మా అన్నయ్య పై చదువుల కోసం విదేశాలు వెళుతున్నాడు. ఇప్పటిరకూ ఒక విధంగా ఉండేది.. ఇప్పుడు తనకు దూరంగా ఉండటం అనే మార్పు చాలా స్పష్టంగా కనబడుతుంది. రాఖీ కొనడం అనేది పెద్ద పనే. ఎందుకంటే ఒక పట్టాన సెలక్ట్ చేయలేను. చాలా టైమ్ పడుతుంది. మా అన్నయ్య మనస్తత్వానికి దగ్గరగా ఉన్న రాఖీ కొంటుంటాను.అమ్మ గైడెన్స్తో పండగ చేసుకుంటాంఈ పండగ అనే కాదు ప్రతి పండగకీ మా అమ్మ గైడెన్స్ ఉంటుంది. అయితే అన్నయ్యకి హారతి ఇవ్వడం, స్వీటు తినిపించడం... ఇలా నేను మాత్రమే చేయాల్సినవే ఉంటాయి కాబట్టి రాఖీ పండగ అప్పుడు ఎక్కువ గైడెన్స్ ఉంటుంది. అమ్మకు సంప్రదాయాలు పాటించడం చాలా ఇష్టం. మేం కూడా పాటించాలని కోరుకుంటారు. అలాఅని ఒత్తిడి చేయరు. మా స్వేచ్ఛ మాకు ఉంటుంది.నా ప్రేమను మెసేజ్ రూపంలో చెబుతాఒకవేళ వచ్చే ఏడాది మా అన్నయ్య రాఖీ పండగ సమయంలో విదేశాల్లో ఉంటే వీడియో కాల్ చేస్తాను. దాంతో పాటు తన మీద నాకు ఉన్న ప్రేమను ఒక మంచి మెసేజ్ రూపంలో చెబుతాను. ఆ మెసేజ్ హృదయపూర్వకంగా తను నాకెంత ముఖ్యమో చెప్పేలా ఉంటుంది. దూరం అనేది విషయం కాదు అని చెప్పేలా ఉంటుంది.నన్ను సర్ప్రైజ్ చేస్తే ఇష్టంఅన్నయ్య నాకు ఫలానా గిఫ్ట్ ఇవ్వాలని అనుకోను. కానీ నన్ను సర్ప్రైజ్ చేస్తే నాకు ఇష్టం. తను నా గురించి ఆలోచిస్తున్నాడని సూచించే ఏ గిఫ్ట్ అయినా నాకు ఓకే. పుస్తకం అయినా, ఏదైనా జ్యువెలరీ అయినా లేక తన చేతితో రాసిన లెటర్ అయినా సరే... తను నా గురించి ఆలోచిస్తున్నాడనే ఆ ఫీల్ నాకు ముఖ్యం.నా బ్రదర్ నా ఆత్మవిశ్వాసంబ్రదర్ ఒక బెస్ట్ ఫ్రెండ్లాంటి వాడు... రక్షణగా నిలబడేవాడు. ఏ విషయంలోనైనా నా బ్రదర్ మీద ఆధారపడిపోవచ్చు అనే భరోసా నాకు ఉంది. తను నా ఆత్మవిశ్వాసం... మా బాండింగ్ని నేను చాలా గాఢంగా ఇష్టపడతాను. ఒక బ్రదర్ ఉండటం అనేది ఎప్పుడూ అండగా నిలిచే వ్యక్తి పక్కనే ఉండటంలాంటిది. – డి.జి. భవాని -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహేశ్ బాబు ఫ్యామిలీ (ఫొటోలు)
-
స్పెషల్ ట్రైనింగ్?
మహేశ్బాబు హీరోగా నటించిన చిత్రం ‘వన్ : నేనొక్కడినే’ (2014). ఈ సినిమాలో మహేశ్బాబు చిన్న నాటి సన్నివేశాల్లో ఆయన తనయుడు గౌతమ్ ఘట్టమనేని నటించారు. చైల్డ్ ఆర్టిస్టుగా గౌతమ్కి ఇదే తొలి మూవీ. అయితే ‘వన్ : నేనొక్కడినే’ తర్వాత గౌతమ్ను స్క్రీన్ పై చూడాలని మహేశ్ అభిమానులు ఎంతగానో ఆశపడుతున్నారు. అయితే ఇందుకు తగ్గ పక్కా ప్రణాళికను మహేశ్ రెడీ చేస్తున్నారట. ఇటీవల ప్లస్ టూ గ్రాడ్యుయేషన్ ను విదేశాల్లో పూర్తి చేశాడు గౌతమ్. అయితే విదేశాల్లో కాలేజ్ స్టడీస్ చేసే సమయంలోనే యాక్టింగ్ కోర్సులో కూడా గౌతమ్ జాయిన్ అయ్యేలా మహేశ్ బాబు ఏర్పాట్లు చేస్తున్నారట.ఇందుకోసం ప్రముఖ యాక్టింగ్ ఇన్స్టిట్యూషన్స్ వివరాలను సేకరించే పనిలో ఉన్నారని ఫిల్మ్నగర్ భోగట్టా. గౌతమ్ను యాక్టింగ్ కోర్సులో జాయిన్ చేసే ఆలోచనలో మహేశ్బాబు ఉన్నారంటే భవిష్యత్తులో గౌతమ్ హీరోగా చేస్తారని ఆశిస్తున్నారు మహేశ్బాబు ఫ్యాన్స్. కాగా ఈ విషయాలపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబరులో ఈ సినిమా చిత్రీకరణ స్టార్ట్ కానున్నట్లు తెలిసింది. -
మహేశ్ కొడుకు మొదలుపెట్టేశాడు.. లండన్లో నాటకం
సూపర్ స్టార్ మహేశ్ బాబు కొడుకు మొదలుపెట్టేశాడు. తండ్రి అడుగు జాడల్లో నడించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే స్టేజీ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చేశాడు. ఈ క్రమంలోనే నమ్రత ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. గర్వపడుతున్నానని చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: చిక్కుల్లో హీరోయిన్ రకుల్ భర్త.. ఉద్యోగుల్ని మోసం చేస్తూ!)గౌతమ్ చిన్న వయసులో మహేశ్ 'వన్ నేనొక్కడినే' సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా చేశాడు. ఆ తర్వాత పూర్తిగా చదువుపై కాన్సట్రేట్ చేశాడు. రీసెంట్గా ప్లస్ టూ పూర్తి చేశాడు. అలానే ఈ మధ్యే వర్కౌట్స్ కూడా మొదలుపెట్టినట్లు నమ్రతనే ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇప్పుడు లండన్లో ఓ నాటకంలో స్టేజీ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చినట్లు నమ్రతనే చెప్పుకొచ్చింది. కొడుకు విషయంలో చాలా గర్వపడుతున్నానని ఇన్ స్టాలో రాసుకొచ్చింది.ఇదంతా చూస్తుంటే మహేశ్ వారసుడు ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పుడు 17 ఏళ్లే. కాబట్టి మరో మూడు నాలుగేళ్ల తర్వాత లాంచ్ చేస్తారేమో. ఇదిలా ఉండగా మహేశ్ ప్రస్తుతం రాజమౌళి మూవీ కోసం మేకోవర్ అయ్యే పనిలో ఉన్నాడు. ఇందులో భాగంగానే జుత్తు బాగా పెంచుతున్నాడు. నమ్రత పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫొటోస్లో మహేశ్ని మీరు చూడొచ్చు.(ఇదీ చదవండి: తెలంగాణలో 'కల్కి' టికెట్ ధరలు పెంపు.. ఒక్కొక్కటి ఏకంగా?) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
కొడుకు గౌతమ్ తొలి స్టేజీ ఫెర్ఫార్మెన్స్.. మహేశ్ బాబు భార్య ఎమోషనల్ (ఫొటోలు)
-
సూపర్స్టార్ ఫ్యామిలీ వారసుడు రెడీ.. వీడియో వైరల్
సూపర్ స్టార్ మహేశ్ బాబు తన వారసుడిని రెడీ చేస్తున్నాడా? అంటే అవుననే అనిపిస్తోంది. చిన్నప్పుడు తండ్రి కొడుకులిద్దరూ కలిసి 'వన్ నేనొక్కడినే' మూవీలో నటించారు. ఆ తర్వాత గౌతమ్ మరో మూవీ చేయలేదు. పూర్తిగా చదువుపై దృష్టి పెట్టాడు. కానీ ఇప్పుడు కొడుకు వీడియో షేర్ చేసిన నమ్రత.. అభిమానులకు హింట్ ఇస్తున్నట్లు కనిపిస్తుంది.కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన మహేశ్.. తక్కువ టైంలోనే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 'పోకిరి' సినిమాతో ఇండస్ట్రీలో రికార్డులు సెట్ చేశాడు. ఆ తర్వాత పలు మూవీస్తో ఆకట్టుకుంటూనే ఉన్నాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నాడు.(ఇదీ చదవండి: విజయ్ సేతుపతి 'మహారాజ' సినిమా రివ్యూ)ఇకపోతే మహేశ్ ఎంత ఫిట్గా ఉంటాడనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 50కి దగ్గర పడుతున్నా సరే కుర్రాడిలా మెరిసిపోతుంటాడు. ఇప్పుడు మహేశ్ కొడుకు గౌతమ్ కూడా వర్కౌట్స్ షురూ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోని నమ్రత ఇన్ స్టాలో షేర్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్.. వారసుడు వచ్చేస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం గౌతమ్ వయసు 17 ఏళ్లు. ఒకవేళ హీరోగా ఎంట్రీ ఇద్దామనుకున్నా సరే మరో నాలుగైదేళ్లు పట్టొచ్చు. అంతలో ఫిజిక్ అంతా సెట్ చేసుకోవచ్చు. అయితే ఒకవేళ ఇదే జరిగితే మహేశ్-రాజమౌళి మూవీ రిలీజయ్యేలోపు గౌతమ్ తెరంగేట్రం ఉండొచ్చేమో?(ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 'సన్నాఫ్ సత్యమూర్తి' చైల్డ్ ఆర్టిస్ట్) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
విజయ్కి జోడీగా 'యానిమల్' బ్యూటీ
రణ్బీర్ కపూర్ ‘యానిమల్’ చిత్రంలోని జోయా పాత్రతో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యారు హీరోయిన్ త్రిప్తి దిమ్రి. ఇప్పుడు ఈ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైందని ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ స్పై థ్రిల్లర్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించనున్నారు. కాగా ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు ముందు శ్రీలీలను తీసుకున్నారు. కొన్ని కారణాలతో శ్రీలీల ఈప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో, ఈ స్థానంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తారనే టాక్ వినిపించింది. తాజాగా త్రిప్తి దిమ్రి, రుక్మిణీ వసంత్ల పేర్లు తెరపైకి వచ్చాయి. మరి.. ఈ ఇద్దర్లో ఎవరు విజయ్ దేవరకొండతో జోడీ కడతారు? లేక మరో హీరోయిన్ ఎవరైనా ఈ అవకాశాన్ని దక్కించుకుంటారా? అనేది చూడాలి. ఈ సినిమా షూటింగ్ను మార్చిలోప్రారంభించాలనుకుంటున్నారు. సో.. రెండు నెలల్లో కథానాయిక విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది. -
ఐదు రోజుల్లో రూ.20 వేలకోట్ల సంపాదన..!
గడచిన వారంలో స్టాక్మార్కెట్ల ర్యాలీతో పాటు అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీలు భారీగా పెరిగాయి. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు లాభాలను ఆర్జించారు. హిండెన్బర్గ్ నివేదికతో కుప్పకూలిన స్టాక్లు తిరిగి మార్కెట్ జీవితకాల గరిష్ఠాలను తాకింది. దాంతో అదానీ స్టాక్ల్లో సైతం మంచి ర్యాలీ కనిపించింది. కేవలం ఐదు రోజుల్లోనే అదానీ స్టాక్స్ దాదాపు 65 శాతం పెరగడంతో అటు గ్రూప్ కంపెనీలకు, ఇటు మదుపరులకు కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. అదానీ గ్రూప్ కంపెనీల పెరుగుదల కారణంగా.. అందులో పెద్ద ఇన్వెస్టర్లుగా ఉన్న ఎల్ఐసీ, జీక్యూజీ పార్ట్నర్స్ రూ.19,500 కోట్లకు పైగా లాభాన్ని సంపాదించారు. సెప్టెంబర్ త్రైమాసికం డేటా ప్రకారం జీక్యూజీ పార్ట్నర్స్ అదానీ గ్రూప్లోని ఆరు కంపెనీల్లో వాటాలను కలిగి ఉన్నారు. జీక్యూజీ పెట్టుబడుల విలువ 28 శాతం అంటే రూ.7,287 కోట్లు పెరిగి రూ.32,887 కోట్లకు చేరింది. అదానీ గ్రూప్లోని ఏడు షేర్లలో ఎల్ఐసీ వాటాల విలువ రూ.12,234 పెరిగి రూ.58,017 కోట్లకు ఎగబాకింది. హిండెన్ బర్గ్ ఆరోపణల వల్ల ఏర్పడిన సంక్షోభం సమయంలో జీక్యూజీ అదానీకి చెందిన నాలుగు కంపెనీల్లో రూ.15,446 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. వీటిలో అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ ట్రాన్స్మిషన్ కంపెనీలు ఉన్నాయి. దీని తర్వాత అదానీ పవర్, అంబుజా సిమెంట్స్ కంపెనీల్లో కూడా వాటాల కొనుగోలు చేసింది. ఇదీ చదవండి: దిగ్గజ టెక్ కంపెనీ సీఎఫ్ఓ రాజీనామా.. ఎందుకంటే.. ఇక బీమా దిగ్గజం ఎల్ఐసీ ఏసీసీ మినహా అన్ని అదానీ కంపెనీల్లో వాటాలు కలిగి ఉంది. గతవారం అమెరికా హిండెన్ బర్గ్ ఆరోపణలను తోసిపుచ్చుతూ.. అదానీకి క్లీన్ చిట్ ఇవ్వటంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. అదానీకి చెందిన పది లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.3.14 లక్షల కోట్లు పెరిగి మెుత్తంగా రూ.14.36 లక్షల కోట్లకు చేరుకుంది. ఇందులో అదానీ టోటల్ గ్యాస్ షేర్లు అత్యధికంగా 65 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. -
కాశ్వీ బన్గయీ కరోడ్పతి
ముంబై: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్ కోసం జరిగిన మినీ వేలంలో ఇద్దరు భారత యువ క్రీడాకారిణుల పంట పండింది. చండీగఢ్కు చెందిన పేస్ బౌలర్ కాశ్వీ గౌతమ్, కర్నాటక బ్యాటర్ వృందా దినేశ్ల పంట పండింది. కాశ్వీని గుజరాత్ జెయింట్స్ రూ. 2 కోట్లకు ఎంచుకోగా...వృందాను రూ.1 కోటి 30 లక్షలకు యూపీ వారియర్స్ తీసుకుంది. ఆస్ట్రేలియా యువ క్రీడాకారిణి అనాబెల్ సదర్లాండ్ను కూడా ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 2 కోట్లకే తమ జట్టులోకి చేర్చుకుంది. గత ఏడాదిలాగే ఈ సారి కూడా అద్భుత ఫామ్లో ఉన్నా... శ్రీలంక కెపె్టన్ చమరి అటపట్టును వేలంలో ఏ జట్టూ తీసుకోలేదు. మొత్తం 165 మంది ప్లేయర్లు మహిళల లీగ్లో వేలం కోసం అందుబాటులోకి రాగా ఐదు జట్లూ కలిపి 30 మందిని ఎంచుకున్నాయి. వీరిలో 9 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. 2024 ఫిబ్రవరిలో డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ మ్యాచ్లు జరుగుతాయి. వారిద్దరికి ఎందుకంటే... గత సీజన్ వేలంలో భారత కెపె్టన్ హర్మన్ప్రీత్ కౌర్కు వేలంలో రూ.1.80 కోట్లు పలకగా, ఇప్పటి వరకు భారత్కు ఆడని (అన్క్యాప్డ్) కాశ్వీకి అంతకంటే ఎక్కువ మొత్తం లభించడం విశేషం. సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన కాశ్వీ కోసం అన్ని జట్లూ పోటీ పడ్డాయి. గత నెలలో జాతీయ టి20 టోర్నీ లో 12 వికెట్లు తీసిన కాశ్వీ ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన ‘ఎ’ సిరీస్లో ఆడింది. అంతకు ముందు ఆసియా కప్ అండర్–23లో విజేతగా నిలిచిన జట్టులోనూ సభ్యురాలు. కాశ్వీ కనీస ధర రూ. 10 లక్షలతో వేలం మొదలు కాగా, ప్రధానంగా పోటీ యూపీ, గుజరాత్ మధ్యే నడిచింది. చివరకు గుజరాత్ ఆమెను సొంతం చేసుకుంది. మూడేళ్ల క్రితం అండర్–19 వన్డేలో ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీసిన రికార్డు కాశ్వీకి ఉంది. 22 ఏళ్ల వృంద దూకుడైన బ్యాటింగ్కు మారపేరు. గత రెండు సీజన్లుగా నిలకడగా ఆడిన వృంద ఈ ఏడాది సీనియర్ వన్డే టోర్నీ లో 477 పరుగులతో కర్నాటక ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించింది. అనాబెల్ ఆసీస్ తరఫున 23 వన్డేలు, 22 టి20లు ఆడింది. మన ప్లేయర్లు ముగ్గురు... భారత్ తరఫున 17 టి20లు ఆడిన ఆంధ్ర ఓపెనర్ సబ్బినేని మేఘనను బెంగళూరు రూ. 30 లక్షలకు, ఇంకా సీనియర్ స్థాయిలో ఆడని హైదరాబాద్ బ్యాటర్ ఏడుకొండల త్రిష పూజితను గుజరాత్ జెయింట్స్ రూ. 10 లక్షలకు తీసుకున్నాయి. 2008నుంచి 2014 మధ్య భారత్ తరఫున 50 వన్డేలు, 37 టి20లు ఆడి ఆ తర్వాత జాతీయ జట్టుకు దూరమైన 35 ఏళ్ల హైదరాబాద్ లెఫ్టార్మ్ స్పిన్నర్ గౌహర్ సుల్తానాను రూ. 30 లక్షలకు యూపీ వారియర్స్ ఎంచుకోవడం విశేషం. మరో హైదరాబాద్ అమ్మాయి గొంగిడి త్రిష మాత్రం వేలంలో ఎంపిక కాలేదు. వేలంలో టాప్ అనాబెల్ (ఆ్రస్టేలియా) – రూ. 2 కోట్లు కాశ్వీ గౌతమ్ (భారత్) – రూ. 2 కోట్లు వృంద దినేశ్ (భారత్) – రూ.1.30 కోట్లు షబ్నమ్ (దక్షిణాఫ్రికా) – రూ. 1.20 కోట్లు ఫోబ్ లిచ్ఫీల్డ్ (ఆస్ట్రేలియా) – రూ. 1 కోటి ఏక్తా బిస్త్ (భారత్) – రూ. 60 లక్షలు వేర్హమ్ (ఆ్రస్టేలియా) – రూ. 40 లక్షలు -
హైదరాబాద్ స్విమ్మర్ గౌతమ్కు ఐదు స్వర్ణాలు
తెలంగాణ స్విమ్మింగ్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన అంతర్ జిల్లా జూనియర్, సబ్ జూనియర్ చాంపియన్షిప్లో హైదరాబాద్ స్విమ్మర్ గౌతమ్ శశివర్ధన్ ఐదు స్వర్ణ పతకాలతో అదరగొట్టాడు. విక్కీ స్విమ్మింగ్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న 14 ఏళ్ల గౌతమ్ బరిలోకి దిగిన ఐదు ఈవెంట్లలోనూ విజేతగా నిలిచాడు. గ్రూప్–2 వయో విభాగంలో గౌతమ్ 50, 100, 200 మీటర్ల బ్రెస్ట్స్ట్రోక్, 200, 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ ఈవెంట్లలో పసిడి పతకాలు గెలిచాడు. ఈ ప్రదర్శనతో గౌతమ్ ఈనెల 27 నుంచి 29 వరకు బెంగళూరులో జరిగే జాతీయ జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్íÙప్లో పాల్గొనే తెలంగాణ జట్టులోకి ఎంపికయ్యాడు. -
కొత్త పంథా.. అదే దందా!
హైదరాబాద్: కబ్జారాయుళ్లు కొత్త పంథా ఎంచుకున్నారు. ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్న గదుల వద్ద ట్రాన్స్జెండర్లను ముందు పెట్టి.. వెనక కబ్జాల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. గాజుల రామారం డివిజన్ కై సర్ నగర్లోని ప్రధాన రహదారిని ఆనుకొని హనుమాన్ దేవాలయానికి ఎదురుగా ఉన్న సర్వే నంబర్ 342/1 ప్రభుత్వ స్థలంలో ఓ కుల సంఘం పేరిట వారం రోజులుగా 200కు పైగా గదులు నిర్మించారు. ఈ నిర్మాణాల వెనక సదరు కుల సంఘం పెద్దగా చెప్పుకుంటున్న ఓ వ్యక్తి తన తతంగాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ విషయమై సోమవారం ‘ఇదే తరుణం.. కబ్జా చేద్దాం’ అని శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీంతో మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ స్పందించారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని. కబ్జాకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు రజనీకాంత్, రేణుకలు తమ సిబ్బందితో అక్కడికి చేరుకొని రెండు గదులను కూల్చివేశారు. దీంతో కబ్జా వెనకాల ఉన్న ఓ కుల పెద్ద ట్రాన్స్జెండర్లను రంగంలోకి దింపాడు. కూల్చివేతలను అడ్డుకొని నానా హంగామా చేసి రెవెన్యూ అధికారులను పరుగులెత్తించారు. చేసేదేమీ లేక వెనుదిరగాల్చి వచ్చింది. సదరు వ్యక్తిపై విచారణ.. సర్వే నంబర్ 342/1 ప్రభుత్వ స్థలంలో కుల సంఘం పేరుతో గదులను నిర్మిస్తూ రూ.కోట్లు ఆర్జిస్తున్న వ్యక్తిపై సంబంధిత అధికారులు రహస్యంగా విచారణ చేపట్టారు. సదరు వ్యక్తి గతంలో చాలాచోట్ల కుల సంఘం పేరిట ప్రభుత్వ స్థలాన్ని ప్లాట్లుగా చేసి, ఒక్కో ప్లాటును నలుగురికి అమ్మి ఎంతో మందిని మోసం చేసినట్లు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. -
రెండు భాగాలు?
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ యాక్షన్ ఫిల్మ్ రూపొందనున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్పై నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించనున్నారు. అయితే ఈ చిత్రం రెండు భాగాలుగా రానున్నదనే టాక్ తాజాగా ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఓ సాధారణ కానిస్టేబుల్ గ్యాంగ్స్టర్గా ఎందుకు మారాల్సి వచ్చిందనే కోణంలో ఈ సినిమా కథనం ఉంటుందని ఫిల్మ్నగర్ భోగట్టా. ఈ సినిమాలో తొలుత హీరోయిన్గా శ్రీలీలను అనుకున్నారు. కానీ కాల్షీట్స్ సర్దుబాటు విషయంలో ఇబ్బందులు రావడంతో శ్రీలీల ఈ సినిమా నుంచి తప్పుకున్నారని, ఆమె స్థానంలో రష్మికా మందన్నాను తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. గతంలో విజయ్–రష్మిక కాంబినేషన్లో ‘గీతగోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. -
వైరల్ అవుతున్న మహేష్ బాబు కొడుకు, కూతురు వినాయకుడి నిమజ్జనం
-
వినాయక నిమజ్జనంలో సితార, గౌతమ్.. వీడియో వైరల్!!
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంట్లో గణేశ్ నిమజ్జన వేడుకలు నిర్వహించారు. టాలీవుడ్ ప్రిన్స్ కూతురు సితార, కుమారుడు గౌతమ్ గణనాథునికి ఘనంగా వీడ్కోలు పలికారు. హైదరాబాద్లోని ఇంటిలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన వీడియోను నమ్రతా శిరోద్కర్ తన ఇన్స్టాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. (ఇది చదవండి: తొలిసారి హీరోయిన్గా ట్రాన్స్జెండర్.. హీరోగా ఎవరంటే?) తమ ఇంట్లో పూజలు చేసిన వినాయకుడిని ఆవరణలోని ఓ డ్రమ్ము నీటిలో నిమజ్జనం చేశారు. ఈ వీడియోలో నమ్రతా, మహేశ్ బాబు ఎక్కడా కూడా కనిపించలేదు. ఇంట్లోని పనివారితో కలిసి ఈ వేడుకల్లో సితార, గౌతమ్ పాల్గొన్నారు. నమ్రతా ఇన్స్టాలో రాస్తూ 'గణపతి బప్పా మోరియా.. వచ్చే ఏడాది మళ్లీ కలుద్దాం' అంటూ పోస్ట్ చేసింది. అయితే మహేశ్ బాబు కూతురు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గానే ఉంటూ అభిమానులతో టచ్లోనే ఉంటోంది. కాగా.. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న గుంటూరు కారం మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్.. రాజమౌళితో కలిసి ఓ భారీ బడ్జెట్ చిత్రం చేయనున్నారు. (ఇది చదవండి: అండమాన్ దీవుల నేపథ్యంలో సరికొత్త వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
మహేశ్ రూట్లోనే గౌతమ్.. అదీ చిన్న వయసులో
సూపర్స్టార్ మహేశ్బాబు అయితే సినిమాలు చేస్తాడు. లేదంటే కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రలకు వెళ్తుంటాడు. మహేశ్ పిల్లల్లో సితార సందడి చేస్తూనే ఉంటుంది. గౌతమ్ మాత్రం చాలా సైలెంట్. పెద్దగా బయట కనిపించడు. అలాంటిది ఇప్పుడు ఓ పనిచేసి తల్లిదండ్రులు పొంగిపోయేలా చేశాడు. ఈ విషయమై నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. తెగ ఆనందపడిపోతుంది. (ఇదీ చదవండి: బర్త్డే స్పెషల్.. టాలీవుడ్లో ఆ రికార్డులన్నీ నాగార్జునవే) హీరోగా మహేశ్బాబు హిట్, ఫ్లాఫ్స్ ఉండొచ్చు కానీ ఓ మనిషిగా మాత్రం ఇతడిని మెచ్చుకోకుండా ఉండలేం. ఎందుకంటే ఫౌండేషన్ తరఫున ఎంతోమంది చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేస్తూ అందరి మనసులు గెలుచుకుంటున్నాడు. ఇప్పుడు తండ్రి అడుగుజాడల్లోనే గౌతమ్ కూడా వెళ్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా మహేశ్ ఫౌండేషన్ తరఫున చికిత్స పొందుతున్న పేషెంట్స్ తో గౌతమ్ ముచ్చటించాడు. ఈ పిక్స్ని నమ్రత ఇన్ స్టాలో షేర్ చేశారు. 'చిల్డ్రన్ హాస్పిటల్ కు గౌతమ్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఇలా వచ్చి సందర్శించాడు. ఎంబీ ఫౌండేషన్, రెయిన్ బో చిల్డ్రన్ హాస్పిటల్స్ కలిసి ఇలా చిన్నారులకు ఫ్రీగా వైద్యం అందిస్తోంది. గౌతమ్ కూడా ఈ కార్యక్రమంలో ఓ భాగస్వామినే. ఇలా ఆంకాలజీ, కార్డియో వార్డుల్లో పిల్లలతో కలిసి ముచ్చటించాడు. వారి ముఖంలో నవ్వు తీసుకొచ్చాడు. వారికి నయమవుతుందని భరోసా ఇచ్చాడు' అని నమ్రత పోస్టులో పేర్కొంది. కొడుకుని చూసి తెగ గర్వపడుతోంది. (ఇదీ చదవండి: 'సలార్' కోసం ఆ సాహసం చేస్తున్న శ్రుతి హాసన్) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
వేకేషన్కు మహేశ్ బాబు ఫ్యామిలీ.. ఎయిర్పోర్ట్లో సందడి!
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్బాబు పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నారు. అయితే మొదట ఈ చిత్రంలో హీరోయిన్గా పూజా హేగ్డేను ఎంపిక చేయగా.. ఆ తర్వాత ఊహించని విధంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. పూజా స్థానంలో పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీలను హీరోయిన్గా ఎంపిక చేశారు. ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే హీరో.. కాస్త విరామం దొరికితే చాలు విదేశాల్లో వాలిపోతుంటారు. (ఇది చదవండి: జ్యువెల్లరీ యాడ్లో సితార.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) అయితే ప్రస్తుతం గుంటూరు కారం షూటింగ్కు కాస్త విరామం లభించడంతో వేకేషన్ ప్లాన్ చేశాడు ప్రిన్స్ మహేశ్ బాబు. తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు పయనమయ్యారు. మహేశ్ బాబు సతీమణి, పిల్లలు సితార, గౌతమ్ హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. ఎయిర్పోర్ట్లో మహేశ్ బాబు ఫ్యామిలీ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. జూలై 20న సితార బర్త్డేను జరుపుకున్న సంగతి తెలిసిందే. సితార పుట్టినరోజు వేడుకను మహేష్ బాబు ఫౌండేషన్లోని యువతులతో కలిసి ఇంట్లోనే చాలా సింపుల్గా జరుపుకున్నారు. కాగా.. ఇటీవలే సితార మొదటి జ్యూవెల్లరీ యాడ్ న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్లో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఈ యాడ్ కోసం భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. సితారకు యాడ్ కోసం ఏకంగా రూ.కోటి ఇచ్చినట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: బేబీ బంప్ వీడియో షేర్ చేసిన నటి..సోషల్ మీడియాలో వైరల్!) Superstar #MaheshBabu with family off to vacation #GunturKaaram @urstrulyMahesh pic.twitter.com/srs35m2Hoh — 𝙎𝙎𝙈𝘽 𝙁𝙍𝙀𝘼𝙆𝙎 𝙁𝘾 (@ssmb_freaks) July 22, 2023 -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అకిరా, గౌతమ్
-
ఫార్ములా రేస్ వద్ద సెలబ్రిటీల సందడి
-
త్వరగా వచ్చేయ్.. నిన్ను చాలా మిస్సవుతున్నా: సితార
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ మహేశ్బాబు-నమ్రత శిరోద్కర్ జంట ఒకటి. ఇక వీరి పిల్లలు గౌతమ్, సితార గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే మహేశ్ బాబు కుమార్తె సితార గురించి మనందరికీ తెలుసు. తన పోస్టులతో అభిమానులను ఎప్పుడు అలరిస్తూ ఉంటుంది. ఇటీవల అన్న గౌతమ్ కల్చరల్ ట్రిప్ కోసమని విదేశాలకు వెళ్లాడు. దీంతో అన్నయ్యను చాలా మిస్సవుతున్నానంటూ గౌతమ్తో సరదాగా ఆడుకుంటున్న ఫోటోలను పోస్ట్ చేసింది సితార. 'మిస్ యూ అన్నయ్య.. త్వరగా తిరిగిరా' అంటూ పోస్ట్ చేసింది. ఇది ఆమె అభిమానులు కొందరు కంగారు పడ్డారు. మీ అన్నయ్య ఎక్కడికెళ్లారంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరేమో అన్న- చెల్లి అనుబంధం చాలా గొప్పదని పోస్టులు పెడుతున్నారు. ఇటీవలే మహేశ్ బాబు సతీమణి నమ్రత కూడా ఎమోషనల్ పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) -
నన్ను విడిచి వెళ్తుంటే చాలా బాధగా ఉంది: నమ్రత ఎమోషనల్
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ మహేశ్బాబు-నమ్రత శిరోద్కర్ జంట ఒకటి. మిస్ ఇండియా కీరిటాన్ని గెలుచుకున్న నమత్ర ఆ తర్వాత సినిమాల్లోకి నటించింది. వంశీ మూవీ సమయంలో మహేశ్ బాబుతో ప్రేమ, ఆ తర్వాత పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇక వీరి పిల్లలు గౌతమ్, సితార గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే మహేశ్ బాబు కుమార్తె సితార గురించి మనందరికీ తెలుసు. నమ్రత శిరోద్కర్ అప్పుడప్పుడు పోస్టులు పెడుతూ అభిమానులకు టచ్లో ఉంటోంది. తాజాగా తన కుమారుడు గౌతమ్ గురించి ఆమె తన ఇన్స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. నమ్రత తన ఇన్స్టాలో రాస్తూ.. 'గౌతమ్ కల్చరల్ ట్రిప్లో భాగంగా మొదటిసారి విదేశీ పర్యటనకు వెళ్లాడు. అంతా తన సొంతంగానే చక్కబెట్టుకోవాలి. ఇది తలుచుకుంటే నాలో కొంత భాగం నన్ను విడిచిపెట్టినట్లు అనిపించింది. అతను వెళ్లిన రోజంతా శూన్యంగా ఉంది. గౌతమ్ తిరిగి వచ్చే వరకు ఇదో బాధకరమైన అనుభూతి. మా ఇంట్లో, మా కళ్ల ముందు తిరగాల్సిన చిన్న పిల్లవాడు సొంతంగా బయటికి వెళ్లే స్థాయికి చేరాడు. ఒక వారం వినోదం, ఆనందం, సాహసం అన్నింటికీ మించి నువ్వు ఇంకా తెలుసుకోవాలని కోరుకుంటున్నా. ఈ యాత్ర నీకు విలువైందని ఆశిస్తున్నా. బేబీ.. నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటా.' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన పోస్ట్లో గౌతమ్ సహ విద్యార్థులతో దిగిన ఫొటోలను నమ్రత పంచుకున్నారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
సితార అన్ప్లాన్డ్ బేబీ: నమ్రత షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్లో మహేశ్బాబు-నమ్రత జంట ఒకటి. మిస్ ఇండియా కీరిటాన్ని గెలుచుకున్న నమత్ర ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. వంశీ మూవీ సమయంలో ప్రేమలో పడ్డ మహేశ్-నమ్రత ఆ తర్వాత పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇక వివాహం అనంతరం సినిమాలకు గుడ్బై చెప్పిన నమ్రత తాజాగా ఓ చానల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో తొలిసారి తన వ్యక్తిగత విషయాలపై నోరు విప్పింది. ఈ ఇంటర్య్వూకి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది. ఈ సందర్భంగా పెళ్లి అనంతరం సినిమాలకు బ్రేక్ ఇవ్వడంపై ఆమెకు ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ తమ పెళ్లికి ముందే మహేశ్ ఓ కండిషన్ పెట్టాడంటూ ఆసక్తిర వ్యాఖ్యలు చేసింది. అనంతరం మహేశ్తో పెళ్లి జరగడమే తనకు హ్యాపీ మూమెంట్ అని చెప్పిన నమ్రత.. సితార అన్ప్లాన్డ్ బేబీ అని చెప్పి షాకిచ్చింది. ఒకవేళ సితార పుట్టి ఉండకపోతే తమ జీవితాలు అసంపూర్ణంగానే ఉండేవేమోనని నమ్రత పేర్కొంది. అలాగే గౌతమ్ పుట్టిన సమయంలో కఠిన పరిస్థితులు చూశామని, 8 నెలల్లోనే గౌతమ్ పుట్టడంతో బతుకుతాడో లేదో అని వైద్యులు చెప్పారంటూ నమ్రత ఎమోషనల్ అయ్యింది. చదవండి: సావిత్రి గురించి జెమిని గణేశన్ ఇచ్చిన ప్రకటన చూసి చాలా బాధపడ్డాను సీనియర్ నటి ఝాన్సీ అందుకే అప్పుడు సమంతను.. ఇప్పుడు దీపికాను ట్రోల్ చేస్తున్నారు: నటి రమ్య -
మహేష్ వారసుడు మేకోవర్ స్టార్ట్.. అచ్చం నాన్నలానే
-
స్టేజ్పై మహేశ్ బాబు కొడుకు గౌతమ్ యాక్టింగ్.. వీడియో వైరల్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రతల ముద్దుల కూతురు సితార సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో అందరికి తెలిసిందే. డ్యాన్స్ వీడియోలు, అన్నయ్య గౌతమ్తో చేసే అల్లరి వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్లను అలరిస్తుంది. కానీ గౌతమ్ మాత్రం అంత యాక్టివ్గా ఉండదు. చెల్లెలు మాదిరి అల్లరి వీడియోలను షేర్ చేయడు. సోషల్ మీడియాలోనే కాదు బయట కూడా సైలెంట్గానే ఉంటాడు గౌతమ్. అయితే స్కూల్లో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటాడట. చదువు మాత్రమే కాదు ఇతర ప్రొగ్రామ్స్లో కూడా చురుగ్గా పాల్గొంటాడట. తాజాగా గౌతమ్ తన స్కూల్లో స్నేహితులతో కలిసి నాటకం వేశాడు. స్టేజిపైన యాక్టివ్గా డ్యాన్స్ చేశాడు. హైస్కూల్లో గౌతమ్ వేసిన మొదటి నాటకం వీడియోను నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. గౌతమ్ ఇప్పటికే నాన్న మహేశ్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. మహేశ్-సుకుమార్ కాంబోలో వచ్చిన వన్ నేనొక్కడినే చిత్రంలో గౌతమ్ నటించాడు. ఆ తర్వాత మళ్లీ తెరపై కనిపించలేదు. కానీ ఈ వీడియో చూశాక.. గౌతమ్లో గొప్ప నటుడు ఉన్నాడని, తండ్రి మాదిరే ఆయన కూడా భవిష్యత్తులో స్టార్ హీరో అవుతాడని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
భయపడితే పనులు కావంటున్న గంభీర్
-
‘సర్కారు వారి పాట’ చూసిన సితార పాప రియాక్షన్ ఏంటంటే..
Mahesh Babu About Sitara Reaction After Watching SVP: సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 12న థియేటర్లోకి వచ్చింది. విడుదలైన తొలి రోజు నుంచే హిట్టాక్తో దూసుకుపోతూ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. విడుదలైన రెండు రోజుల్లోనే ఈ మూవీ రూ.103 కోట్ల గ్రాస్ని సాధించి బ్లాక్ బస్టర్ హిట్ను సొంతం చేసుకుంది. చదవండి: వేదికపై మహేష్బాబు డ్యాన్స్ ఈ నేపథ్యంలో కర్నూల్ ఎస్టీబీసీ కళాశాల మైదానంలో సోమవారం రాత్రి సర్కారు వారి పాట సక్సెస్ మీట్ను చాలా గ్రాండ్గా నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న మహేశ్ బాబు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. ‘సర్కారు వారి పాట సినిమా ఫస్ట్ మా ఫ్యామిలీతో కలిసి చూసినప్పుడు మా అబ్బాయి(గౌతమ్ ఘట్టమనేని) షేక్ హ్యాండ్ ఇచ్చి గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఇక సితార అయితే అన్ని సినిమాల్లో కన్నా ఈ సినిమాలో చాలా బాగా నటించావు నాన్న, ఇందులో చాలా అందంగా కూడా ఉన్నావు అని కితాబు ఇచ్చింది’ అంటూ మహేశ్ మురిసిపోయాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: మీడియా ముందుకు కరాటే కల్యాణి: నేను ఎక్కడికీ పారిపోలేదు అలాగే ఈ సినిమా చూసిన మహేశ్ తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ రియాక్షన్ ఏంటని యాంకర్ అడగ్గా.. ఆయన సినిమా చూడగానే ఈ సినిమా పోకిరి, దూకుడు కంటే సూపర్ హిట్ అవుతుందని చెప్పారన్నాడు. కాగా మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో సముంద్రఖని, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, అజయ్ తదితరులు నటించిన సంగతి తెలిసిందే. -
అమ్మ కోప్పడితే నాన్నకు కంప్లైంట్ చేస్తాను : సితార
నేను గర్వపడేలా చేశావు సితూ పాపా...నమ్రత ఎమోషన్ అయ్యారు...కూతుర్ని గట్టిగా హత్తుకున్నారు.అంతే.. సితూ పాప పిచ్చ హ్యాపీ.నువ్వు మా అమ్మలా ఉంటావు...అలా అంటూ కూతుర్ని ముద్దు చేస్తుంటారు మహేశ్బాబు. ఇంతకీ అమ్మ ఆనందపడేలా సితూ ఏం చేసింది?‘మదర్స్ డే’ సందర్భంగా తన తల్లి గురించి సితార చెప్పిన ముచ్చట్లు చదివితే తెలుస్తుంది. ►మదర్స్ డే ప్లాన్ గురించి? సితార: అమ్మ కోసం స్పెషల్ గిఫ్ట్ ఒకటి ప్లాన్ చేశాను. అది సర్ప్రైజ్. అలాగే ఆదివారం మొత్తం అమ్మతో స్పెండ్ చేయాలని డిసైడ్ అయ్యాను. ► ఇంట్లో నిన్ను ‘సితూ పాపా’ అని పిలుస్తారు. మీ అమ్మని ‘అమ్మా’ అనే పిలుస్తావా? మామ్ అని కాదా? అమ్మా అనే పిలుస్తాను. అలా పిలిపించుకోవడం అమ్మకు ఇష్టం. ► ఇంతకీ మీ అమ్మగారు ఎంత స్ట్రిక్ట్? అవసరమైనప్పుడు మాత్రమే స్ట్రిక్ట్. మిగతా సమయాల్లో మా అమ్మ చాలా స్వీట్. ► చదువు విషయంలో, స్పోర్ట్స్, డాన్స్ వంటివి నేర్చుకునే విషయంలో అమ్మ ప్రోత్సాహం ఎంతవరకూ ఉంటుంది? స్కూల్ నుంచి రాగానే హోమ్వర్క్కి స్పెషల్గా టైమ్ ప్లాన్ చేస్తుంది. ఆ టైమ్కి మేం హోమ్వర్క్ చేసేలా చూస్తుంది. ఇక పెయింటింగ్, డాన్సింగ్... ఇంకా స్కూల్ యాక్టివిటీస్ అన్నింటిలోనూ పార్టిసిపేట్ చేసేలా అమ్మ ప్రోత్సహిస్తుంది. ► ఎప్పుడైనా చదువుపట్ల నిర్లక్ష్యంగా ఉంటే మీ అమ్మగారి రియాక్షన్? నిర్లక్ష్యంగా ఉండే చాన్సే లేదు. రోజూ చదువుకోవడానికి ఒక టైమ్ కేటాయించిందని చెప్పాను కదా. ఆ టైమ్కి చదవుకోవాల్సిందే. తప్పించుకోవడానికి లేదు. ► అమ్మ కోప్పడినప్పుడు నాన్నకు కంప్లైంట్ చేయడం జరుగుతుందా? జరుగుతుంది. నాకేదైనా కావాలన్నప్పుడు అమ్మ ‘నో’ చెబితే అప్పుడు నాన్నకు కంప్లైంట్ చేస్తాను. ► మీ ఇద్దరి (సితార అన్నయ్య గౌతమ్)లో అమ్మ ఎవర్ని ఎక్కువగా గారాబం చేస్తారు? ఇద్దరంటే అమ్మకి చాలా ప్రేమ. కానీ నేను చిన్నదాన్ని కాబట్టి నన్ను ఎక్కువగా గారాబం చేస్తుంది... హహ్హహ్హా... ► మీ అమ్మగారి నుంచి తీసుకోవాల్సిన మంచి విషయాలు? పాజిటివ్గా ఉండాలని చెబుతుంది. అలాగే ఇతరుల పట్ల కైండ్గా ఉండాలని కూడా అంటుంది. మన దగ్గర ఉన్నవాటికి కృతజ్ఞతాభావంతో ఉండాలని అమ్మ ఎప్పుడూ చెబుతుంటుంది. ► పండగలప్పుడు ట్రెడిషనల్గా డ్రెస్ చేసుకుని, చక్కగా పూజలు చేస్తుంటావు.. అమ్మ నేర్పిస్తుంటారా? నా చిన్నప్పటి నుంచి అమ్మ మన కల్చర్ గురించి మంచి విషయాలు చెబుతూ ఉంది. కల్చర్ పరంగా మమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం అమ్మకి ఇష్టం. మా అమ్మ మహారాష్ట్రీయన్.. నాన్న తెలుగు అని మీ అందరికీ తెలిసిందే. అందుకే ఇంట్లో ఈ రెండు సంప్రదాయాలకు సంబంధించిన పండగలు చేసుకుంటాం. ఫెస్టివల్ సెలబ్రేషన్స్ని బాగా ఎంజాయ్ చేస్తాం. ► మరి... మీ అమ్మగారి మదర్ టంగ్ మరాఠీ వచ్చా? మాట్లాడతాను కానీ అంత ఫ్లూయంట్గా రాదు. ► ఫ్రెండ్స్తో ఫుడ్ షేర్ చేయడం, కేరింగ్గా ఉండటం వంటివి కూడా అమ్మ చెబుతుంటారా? స్కూల్ లేక వేరే చోట ఫ్రెండ్స్తో స్పెండ్ చేసినప్పుడు తినడానికి నా దగ్గర ఏం ఉంటే అది వాళ్లతో షేర్ చేసుకుంటాను. నా దగ్గర తక్కువ ఉన్నా సరే షేర్ చేస్తాను. ఎందుకంటే ‘షేరింగ్ ఈజ్ కేరింగ్’ అని అమ్మ చెప్పింది. నేను ఫాలో అయిపోతున్నాను (నవ్వులు). ► మీ నాన్నమ్మలా ఉంటావు కాబట్టి మీ నాన్నగారు ఆ విషయం చెప్పి, గారాబం చేస్తుంటారా? ‘నువ్వు మా అమ్మలా ఉన్నావు’ అని నాన్న ఎప్పుడూ నాతో అంటుంటారు. బాగా ముద్దు చేస్తారు కూడా. కానీ నేను మా అమ్మలా కూడా ఉన్నానని అనుకుంటున్నాను ► నీ యూ ట్యూబ్ చానల్ సక్సెస్ వెనకాల అమ్మ హెల్ప్ ఉందా? అమ్మ బోలెడన్ని ఐడియాలు ఇస్తుంది. అది మాత్రమే కాదు.. షూట్ విషయంలో కూడా హెల్ప్ చేస్తుంది. ► మరి.. ‘సర్కారువారి పాట కోసం’ నువ్వు చేసిన ‘పెన్నీ..’ సాంగ్కి ఆమె హెల్ప్ చేశారా? ఆ పాటలో నీ డాన్స్ బాగుంది... ఆ పాట షూట్ మొదలుపెట్టినప్పటి నుంచి పూర్తయ్యేవరకు నా డాన్స్ టీచర్ అనీ మాస్టర్తో పాటు అమ్మ నాతోనే ఉంది. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండాలి అనే విషయంలో గైడ్ చేసింది. అలాగే కెమెరా వెనకాల నన్ను చాలా ఎంకరేజ్ చేసింది. ► డాన్స్ మొత్తం పూర్తయ్యాక ఆమె ఏమన్నారు? నా ఫస్ట్ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగా రావడంతో అమ్మ చాలా హ్యాపీ ఫీలయింది. ‘నన్ను గర్వపడేలా చేశావు’ అని గట్టిగా హత్తుకుంది. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ► పిల్లలకు ఆరోగ్యం బాగా లేనప్పుడు మీ అమ్మగారు ఎలా చూసుకుంటారు? అలాంటి సమయాల్లో మా అమ్మ మా పక్కనే ఉంటుంది. ఒంట్లో బాగాలేనప్పుడు ప్రత్యేకంగా డైట్ ప్లాన్ చేసి, మేం తినేలా చేస్తుంది. టైమ్కి టాబ్లెట్లు ఇచ్చి, చాలా కేరింగ్గా ఉంటుంది. ► నువ్వు, గౌతమ్ ఏం అడిగినా మీ అమ్మ కొనిపెడతారా? ఐస్క్రీములు, చాక్లెట్లు ఎక్కువగా తింటే ఒప్పుకుంటారా? మేం ఏం అడిగినా దాదాపు కాదనదు. అయితే ప్రతిదానికీ ఒక లిమిట్ ఉండాలంటుంది. మితి మీరితే ఏదీ మంచిది కాదని అమ్మ అంటుంది. నేను అమ్మ మాటని ఒప్పుకుంటాను. ► ఈ మధ్య ఫ్యామిలీ టూర్ వెళ్లారు కదా. ఆ విశేషాలు? మేం ప్యారిస్, బోర్దూ, ఫ్రాన్స్లోని లూర్దు వెళ్లాం. ఈఫిల్ టవర్ చూశాను. ఫుల్గా ఎంజాయ్ చేశాం. – డి.జి. భవాని . -
దళిత కాలనీలోనే కలెక్టర్ భోజనం, నిద్ర
మధిర: ఎస్సీల సాధికారతకు ప్రవేశపెట్టిన దళితబంధు లబ్ధిదారుల ఎంపిక కోసం ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ మధిర నియోజకవర్గంలో రొంపిమళ్ల గ్రామంలో పర్యటిస్తున్నారు. దళితబంధు పథకానికి ఎంపిక చేసిన మాతంగి రమణ, రాజ్కిరణ్, గొల్ల మందల శ్రీనివాసరావుతోపాటు పలువురి ఇళ్లకు గురువారం రాత్రి అధికారులతో కలిసి వెళ్లిన కలెక్టర్.. వారి అర్హతలపై ఆరా తీశారు. స్వేచ్ఛగా యూనిట్లను ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు. నిర్దేశిత యూనిట్లపై కలెక్టర్ పలు సూచనలు చేశారు. అనంతరం లబ్ధిదారుడైన గొల్లమందల శ్రీనివాసరావు ఇంట్లోనే కలెక్టర్ సహా అధికారులందరూ రాత్రి 10గంటలకు భోజనం చేశారు. అంతకుముందు హోటల్ నుంచి తెప్పించిన చపాతీ, ఇడ్లీ తిన్నారు. అనంతరం లబ్ధిదారుడైన శ్రీనివాసరావు భార్య సునీతను ఇంట్లో ఏం చేశారని కలెక్టర్ అడిగారు. అన్నం, టమాటా – పచ్చిమిర్చి చట్నీ, పెరుగు అని చెప్పగా, అవే తనకు వడ్డించాలన్న కలెక్టర్... వారితోపాటు భోజనం చేశారు. శ్రీనివాసరావు ఇంట్లోనే కలెక్టర్ సహా అధికారులు నిద్రించారు. శుక్రవారం ఉదయం కూడా దళితబంధు లబ్ధిదారులతో సమావేశమై అవగాహన కల్పించనున్నారు. -
తొలిసారి బేబీ బంప్ ఫోటో షేర్ చేసిన కాజల్ అగర్వాల్
Kajal Aggarwal Shares First Photo With Baby Bump, Pic Goes Viral: అందాల చందమామ కాజల్ అగర్వాల్ త్వరలోనే తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. న్యూ ఇయర్ సందర్భంగా కౌజల్ భర్త గౌతమ్ కిచ్లు ఈ విషయాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేశాడు. ఈ కొత్త సంవత్సరంలో నీ రాక కోసం ఎదురు చూస్తున్నామంటూ గర్భవతి మహిళ ఎమోజీని క్యాప్షన్తో ఓ ఫొటోను షేర్ చేశాడు. దీంతో కాజల్ దంపతులకు అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక భర్త ప్రకటన అనంతరం కాజల్ తొలిసారిగా బేబీ బంప్తో ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఇది వరకే ప్రెగ్నీన్సీపై వార్తలు వచ్చినా కాజల్ మాత్రం తన బేబీ బంప్ను కవర్ చేస్తుండేది. కానీ తాజాగా భర్తతో దిగిన ఓ ఫోటోను షేర్చేస్తూ 2022 అంటూ లవ్ సింబల్ను యాడ్ చేసింది. ఈ ఫోటోలో కాజల్ బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమికుల రోజున ఐఏఎస్ ప్రేమ జంట పెళ్లి
యశవంతపుర (బెంగళూరు): ఇద్దరు ఐఏఎస్ అధికారులు ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన గౌతం 2008లో జాతీయ స్థాయిలో సివిల్స్లో 23వ ర్యాంక్ను సాధించి 2009లో కర్ణాటక బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా వచ్చారు. ప్రస్తుతం ఆయన కర్ణాటకలోని దావణగెరె జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. అదే జిల్లాకు పంచాయతీ సీఈవోగా పనిచేస్తోన్న కేరళకి చెందిన అశ్వథితో కలిసి వివిధ కార్యక్రమాల్లో పనిచేస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. మరో ఐఏఎస్ అధికారి మధ్యవర్తిత్వంతో ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలిపారు. ఈ నెల 14న కేరళలోని క్యాలికట్లో వీరి వివాహం జరగనుంది. 17న గౌతం స్వగ్రామంలో రిసెప్షన్ నిర్వహిస్తారు. -
నాన్నగారి ఆరోగ్యం మెరుగ్గా ఉంది : హీరో గౌతమ్
ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందంకు హార్ట్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ముంబైలో కోలుకుంటున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం తనయుడు, హీరో గౌతమ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. ‘కొన్ని నెలలుగా ఛాతిలో అసౌకర్యంగా అనిపించడంతో హైదరాబాద్లోని ప్రముఖ డాక్టర్ని సంప్రదించారు బ్రహ్మానందం. వారి సలహా మేరకు శస్త్ర చికిత్స చేయించు కోవాలని నిర్ణయించుకున్నారు. దేశంలోనే అత్యుత్తమమైన ముంబైలోని ‘ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్’లో సోమవారం (14.1.19) నాడు గుండె ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. ప్రముఖ వైద్య నిపుణులు శ్రీ రమాకాంత్ పాండా, బ్రహ్మానందం గారికి శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఐసీయు నుంచి సాధారణ గదికి మార్చటం జరిగింది’ అని తెలిపారు. ‘నాన్నగారికి శస్త్ర చికిత్స జరిగిందని తెలిసి అభిమానులు, శ్రేయోభిలాషులు, సినీ పరిశ్రమ లోని ప్రముఖులు అందరూ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేయటం మొదలు పెట్టారు. అందరి ప్రేమాభిమానాలు, ఆశీస్సులు వల్ల నాన్నగారి ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంది, వారందరికీ కృతజ్ఞతలు’ తెలిపారు. బ్రహ్మానందం కుమారులు రాజా గౌతమ్, సిద్దార్థ్లు తండ్రితో పాటు ముంబైలో ఉన్నారు. -
నాదీ టీనేజ్ లవ్ స్టోరినే : హీరోయిన్
మళ్ళీరావా సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన ముద్దగుమ్మ ఆకాంక్ష సింగ్. పలు హిందీ సీరియల్స్ లో నటించిన ఆకాంక్ష తెలుగు సినిమాతో వెండితెరకు పరిచయమైంది. హీరోయిన్ గా తొలి సినిమానే ఘనవిజయం సాధించటంతో ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం చిత్రం ప్రమోషన్ లో బిజీగా ఉన్న ఆకాంక్ష తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తాను పెళ్లయిన తరువాతే నటనను కెరీర్ గాఎంచుకున్నానని తెలిపింది ఆకాంక్ష. ఏడేళ్ల క్రితమే ఆకాంక్షకు పెళ్లైందట. 16 ఏళ్ల వయసులోనే ప్రేమలో పడిన ఈ భామ 20 ఏళ్లకు పెళ్లి చేసుకుంది. తరువాత భర్త సహకారంలో నటనలో శిక్షణ తీసుకొని యాక్టింగ్ ను కెరీర్ గా ఎంచుకుంది. మళ్ళీరావా సినిమాలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఆకాంక్ష తెలుగు లో బిజీ అవుతుందని భావిస్తున్నారు. -
టాలీవుడ్లో తొలి క్రౌడ్ ఫండింగ్ మూవీ ‘మను’
పల్లకిలో పెళ్లికూతురు సినిమాతో వెండితెరకు పరిచయం అయిన స్టార్ వారసుడు గౌతమ్. హాస్య నటుడు బ్రహ్మానందం వారసుడిగా తెరంగేట్రం చేసిన గౌతమ్ సక్సెస్ సాధించలేకపోయాడు. వారెవా, బసంతి సినిమాలు కూడా గౌతమ్కు నిరాశే మిగిల్చాయి. తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న గౌతమ్ త్వరలో ‘మను’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే ఈ సినిమా నిర్మాణం విషయంలో కొత్త ప్రయోగం చేశారు చిత్రయూనిట్. మధురం, బ్యాక్ స్పేస్ లాంటి షార్ట్ ఫిలింస్ తో మంచి గుర్తింపు తెచ్చేకున్న ఫణీంద్ర ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా నిర్మాణం కోసం కావాల్సిన మొత్తాన్ని క్రౌడ్ఫండింగ్ ద్వారా కలెక్ట్ చేశారు. తమ సినిమా నిర్మాణం కోసం ఫండ్ కావాలని చిత్రయూనిట్ సోషల్ మీడియాలో ఇచ్చిన ప్రకటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా కోటీ 20 లక్షలకు పైగా క్రౌడ్ఫండింగ్ ద్వారా కలెక్ట్ అయ్యింది. ఆ మొత్తం తోనే సినిమాను పూర్తి చేశారు. క్రౌడ్ ఫండింగ్ పద్దతిలో నిర్మాణం జరుపుకున్న తొలి తెలుగు సినిమా మనునే కావటం విశేషం. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
నా ఉనికికి కారణం తను : మహేష్
సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు ఘట్టమనేని వారసుడు గౌతమ్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు గౌతమ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మహేష్ కూడా తన వారసుడికి ఓ హార్ట్ టచింగ్ ట్వీట్ తో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. 'నా ఉనికికి కారణం అతనే, నన్ను నడిపించే శక్తి, నా కొడుకు, నా జీవితం, నా సంతోషం. హ్యాపి బర్త్ డే గౌతమ్' అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం స్పైడర్ సినిమా షూటింగ్ కోసం రొమానియాలో ఉన్న మహేష్, ఈ షెడ్యూల్ తో స్పైడర్ షూటింగ్ పూర్తి చేయనున్నారు. హైదరాబాద్ తిరిగొచ్చాక ఇప్పటికే ప్రారంభమైన కొరటాల శివ సినిమాతో బిజీ కానున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న స్పైడర్ సెప్టెంబర్ 27న భారీగా రిలీజ్ కానుంది. He is the reason for my existence.. my driving force.. my son.. my world.. my happiness.. Happy Birthday, Gautam Stay blessed! — Mahesh Babu (@urstrulyMahesh) 31 August 2017 -
నిమజ్జన వేడుకల్లో సూపర్ స్టార్ కొడుకు
ముంబై తరువాత అదే స్థాయిలో వినాయక చవితి ఉత్సవాలు హైదరబాద్ మహా నగరంలోనే జరుగుతాయి. అందుకే బాలీవుడ్ తారలలానే తెలుగు సినీ ప్రముఖులు కూడా ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొంటుంటారు. అయితే ఇంట్లో, మండపాల్లో పూజల వరకు ఓకె కానీ నిమజ్జన వేడుకల్లో ఇలాంటి స్టార్లు ఎప్పుడు కనిపించరు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ మాత్రం నిమజ్జనానికి కూడా స్వయంగా వెళ్లాడు. ఇటీవల ఫ్యామిలీతో కలిసి దుబాయ్ ట్రిప్ ముగించుకొని వచ్చిన మహేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి వినాయక చవితిని ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాడు. పూజా కార్యక్రమాలు పూర్తయిన తరువాత మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసం చెన్నై వెళ్లిపోయాడు మహేష్. దీంతో నిమజ్జనం బాధ్యతలు తీసుకున్న గౌతమ్, తానే స్వయంగా దుర్గమ్ చెరువుకు గణేష్ విగ్రహాన్ని తీసుకెళ్లి నిమజ్జనం చేశాడు. వినాయక ప్రతిమను గౌతమ్ నిమజ్జనం చేస్తుండగా తీసిన ఫోటో, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
అల్లూరి పాత్రలో గౌతమ్.?
సూపర్ స్టార్ కృష్ణ హీరోగా తెరకెక్కిన భారీ బ్లాక్ బస్టర్ సినిమా అల్లూరి సీతారామరాజు. స్వాతంత్య్ర సమర యోథుడు అల్లూరి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలోనే మైల్ స్టోన్గా నిలిచిపోయింది. కృష్ణ తరువాత మరే నటుడు అల్లూరి పాత్రలో నటించేందుకు సాహసించని స్థాయిలో సూపర్ స్టార్ అల్లూరి పాత్రకు జీవం పోశాడు. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన ఇన్నేళ్ల తరువాత అదే నేపథ్యంతో మరో చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు బాల్యం, అతడు మన్యం వీరుడిగా మారటానికి దారి తీసిన సంఘటనల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. గులాబి, అనగనగా ఒక రోజు లాంటి థ్రిల్లర్ సినిమాలకు కథ అందించిన నడిమింటి నరసింగరావు, అల్లూరి సీతారామరాజు ప్రీక్వల్కు కథ రెడీ చేశారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ మనవడు, మహేష్ బాబు కొడుకు గౌతమ్ను లీడ్ రోల్లో నటింప చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే వన్ నేనొక్కడినే సినిమాలోతండ్రితో కలిసి తెరను పంచుకున్న గౌతమ్, తాత చేసిన అల్లూరి పాత్రలో కనిపిస్తాడో లేదో చూడాలి. -
మహేష్ బాబు కూతురు తెరంగేట్రం
ఘట్టమనేని వంశం నుంచి మరో స్టార్ వెండితెర మీద దర్శనమివ్వనుంది. ఇప్పటికే మహేష్ బాబు సూపర్ స్టార్గా వెలుగొందుతుండగా, సుధీర్ బాబు హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల వన్ నేనొక్కడినే సినిమాతో మహేష్ తనయుడు గౌతమ్ కృష్ణ కూడా బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చేశాడు. ఈ సినిమా ఫలితం నిరాశపరిచినా, గౌతమ్కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు అదే బాటలో మహేష్ బాబు కూతురు సితార కూడా వెండితెర మీద తళుక్కుమననుందట. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా నటిస్తున్న బ్రహ్మోత్సవం సినిమాలో ఓ చిన్న పాత్రను సితారతో చేయించాలని భావిస్తున్నాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఇప్పటికే ఈ విషయం పై మహేష్ బాబుతో చర్చించిన శ్రీకాంత్, మహేష్ అంగీకారం కోసం ఎదురుచూస్తున్నాడు. సితార సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై మహేష్ ఫ్యామిలీ కూడా సుముఖంగానే ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న బ్రహ్మోత్సవం సినిమాను పీవీపీ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. మే చివరి వారంలో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
'శ్రీ శ్రీ' ఘట్టమనేని వారి 'మనం'
అక్కినేని ఫ్యామిలీలోని మూడు తరాల హీరోలు కలిసి నటించిన సూపర్ హిట్ సినిమా మనం. తెలుగు తెర మీద సరికొత్త ప్రయోగంగా తెరకెక్కిన ఈ సినిమా, నటవారసత్వం కొనసాగిస్తున్న చాలా మంది హీరోలకు ఇన్సిపిరేషన్గా నిలిచింది. ఈ సినిమా తరువాత ఇండస్ట్రీలో కొనసాగుతున్న చాలా కుంటుబాల నుంచి ఆ తరహా సినిమాలను ఆశిస్తున్నారు అభిమానులు. అలా ఫ్యామిలీ సినిమా కోసం ఎదురుచూస్తున్న ఘట్టమనేని అభిమానుల కోరిక తీరనుందన్న టాక్ వినిపిస్తోంది. లాంగ్ గ్యాప్ తరువాత సూపర్ స్టార్ కృష్ణ లీడ్రోల్లో నటిస్తున్న సినిమా శ్రీ శ్రీ. ముప్పలనేని శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ నటి, కృష్ణ సతీమణి విజయనిర్మల మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో ఈ తరం సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు, మహేష్ తనయుడు గౌతమ్ కూడా అతిథి పాత్రల్లో కనిపించనున్నారన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. చిత్రయూనిట్ కన్ఫామ్ చేయకపోయినా శ్రీ శ్రీ సినిమాలో ఘట్టమనేని ఫ్యామిలీ మూడు తరాల నటులు కనిపించనున్నారని పండుగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. -
ఘట్టమనేని వారి 'మనం'
అక్కినేని ఫ్యామిలీ సినిమాగా వచ్చిన 'మనం' చాలా మంది నటులను ఆలోచనలో పడేసింది. ఈ సినిమాతో తరతరాలుగా సినీరంగంలో ఉన్న చాలా కుటుంబాలు అలాంటి సినిమాలు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీతో పాటు సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కూడా ఈ ప్రయత్రాలు భారీగానే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే దర్శకులు కూడా ఆ తరహా కథలను రెడీ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మూడు తరాల నటులు కలిసి ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నారట. తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ డైరెక్టర్.. కృష్ణ, మహేష్, గౌతమ్లతో ఓ సినిమా తెరకెక్కించాడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే కథ కూడా వినిపించిన ఆ డైరెక్టర్ స్క్రిప్ట్ ను మరింత పకడ్బందీగా రెడీ చేసే పనిలో ఉన్నాడట. మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు ఆ తరువాత హీరో అయ్యాక కూడా పలు సినిమాల్లో కృష్ణ, మహేష్లు కలిసి నటించారు. అయితే ఘట్టమనేని మూడోతరం వారసుడిగా '1 నేనొక్కడినే' సినిమాతో గౌతమ్ పరిచయం కావడంతో.. ఈ మూడు తరాల నటులు కలిసి నటిస్తారా అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికి చర్చల దశలోనే ఉన్న ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు ఎప్పుడు వస్తుందో చూడాలి. -
మహేష్ను ఇమిటేట్ చేస్తున్న గౌతమ్!
-
నిర్మాతగా మారనున్న మహేష్ బాబు?
-
దుబాయ్ లో 'ప్రిన్స్' ఫ్యామిలీ!
టాలీవుడ్ రాజకుమారుడు మహేష్ బాబు ఈసారి నూతన సంవత్సర వేడుకలను దుబాయ్ లో జరుపుకున్నారు. షూటింగ్ కు కొద్దిరోజులు విరామం ఇచ్చి కుటుంబంతో సహా దుబాయ్ వెళ్లారు. సతీమణి నమ్రత, కుమారుడు గౌతమ్, కుమార్తె సితారతో కలిసి అక్కడ కొత్త సంవత్సర వేడుకలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోను నమ్రత తన ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేశారు. తన కుమారుడు గౌతమ్ తో కలిసి ఏడారిలో దిగిన ఫోటోను ఆమె పెట్టారు. ఈ వారంలోనే మహేష్ బాబు స్వదేశానికి తిరిగిరానున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ఆయన నటిస్తున్న సంగతి తెలిసిందే. -
‘ఆగడు’లో గౌతమ్
-
గౌతమ్ చాలా బాగున్నాడు - మహేష్
‘‘గౌతమ్ చాలా బాగున్నాడు’’ అంటున్నారు మహేష్బాబు. ఆయన చెబుతున్నది తన తనయుడు గౌతమ్ గురించి కాదు. డా. బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ గురించి. ప్రస్తుతం గౌతమ్ హీరోగా ‘బసంతి’ అనే చిత్రం నిర్మితమవుతోంది. రాజా గౌతమ్, అలీషా బేగ్ జంటగా స్టార్ట్ కెమెరా పిక్చర్స్ పతాకంపై స్వీయదర్శకత్వంలో చైతన్య దంతులూరి రూపొందిస్తున్నారు. ఈ ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించిన అనంతరం.. ‘‘ఈ ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని మహేష్బాబు అన్నారు. మహేష్తో ‘ఆగడు’ చిత్రంలో నటిస్తున్న తమన్నా, చిత్రదర్శకుడు శ్రీను వైట్ల ఈ ప్రచార చిత్రం వేడుకలో పాల్గొన్నారు. ట్రైలర్ చూస్తుంటే టెక్నికల్గా సినిమా బాగుంటుందనిపిస్తోందని, చాలా కొత్తగా ఉందని శ్రీను వైట్ల అన్నారు. ట్రైలర్ కాన్సెప్ట్ బాగుందని, సినిమా చూడాలని చాలా ఆసక్తిగా ఉందని తమన్నా చెప్పారు. ‘బసంతి’లో కీలక పాత్ర చేస్తున్నానని తనికెళ్ల అన్నారు. ఈ వేడుకలో రాజా గౌతమ్, సహనిర్మాత వివేక్ కూచిభొట్ల తదితరులు పాల్గొన్నారు. -
నేనొక్కడినే ఆడియో: ఫ్యామిలీతో మహేశ్