Goodbye
-
యూఎన్హెచ్ఆర్సీకి ట్రంప్ గుడ్బై
న్యూయార్క్: ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలుగుతున్నట్టు ఇప్పటికే ప్రకటించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘానికి (యూఎన్హెచ్ఆర్సీ) కూడా గుడ్బై చెప్పారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుపై మంగళవారం ఆయన సంతకం చేశారు. ‘‘రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధాలను నిలువరించి అంతర్జాతీయంగా శాంతిభద్రతల స్థాపనకు కృషి చేసే లక్ష్యంతో ఐరాస స్థాపనకు అమెరికా సాయపడింది. కానీ ఐరాసకు చెందిన పలు ఏజెన్సీలు కొంతకాలంగా సంస్థ లక్ష్యానికి భిన్నంగా పని చేస్తున్నాయి. పైగా అమెరికా ప్రయోజనాలనే దెబ్బ తీస్తున్నాయి’’ అంటూ ఉత్తర్వుల్లో తూర్పారబట్టారు. పాలస్తీనా శరణార్థులకు ఆ సంస్థ అందిస్తున్న సాయానికి అమెరికా నిధుల సాయాన్ని తక్షణం నిలిపేయాల్సిందిగా కూడా ట్రంప్ ఆదేశించారు. అంతేకాదు, ఐరాస విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ (యునెస్కో), పాలస్తీనా శరణార్థుల సహాయ, పనుల సంస్థ (యూఎన్ఆర్డబ్ల్యూఏ)ల్లో కొనసాగడం అవసరమా పరిశీలించాల్సిందిగా కూడా అధికారులకు సూచించారు. ‘‘మానవ హక్కుల ఉల్లంఘనదారులను యూఎన్హెచ్ఆర్సీ కాపాడుతోంది. విదేశీ ఉగ్ర సంస్థలుగా అమెరికా విదేశాంగ శాఖ చాన్నాళ్ల క్రితమే ప్రకటించిన పలు మూకలు నానా ముసుగుల్లో యూఎన్ఆర్ డబ్ల్యూఏలో చొరబడ్డారు. ఇక యునెస్కో తనను తాను సంస్కరించుకోవడంలో నిత్యం విఫల మవుతూనే ఉంది’’ అని ఉత్తర్వుల్లో ట్రంప్ ఆక్షేపించారు. గాజా యుద్ధం విషంలో యూఎన్హెచ్ఆర్సీ తమపై ఉద్దేశపూర్వకంగా బురదజల్లుతోందని ఇజ్రాయెల్, అమెరికా కొంతకాలంగా ఆరోపిస్తుండటం తెలిసిందే. ట్రంప్ తన తొలి హయాంలో కూడా యూఎన్హెచ్ఆర్సీ నుంచి వైదొలగుతూ నిర్ణయం తీసుకున్నారు. యూఎన్ఆర్డబ్ల్యూఏకు నిధులను నిలిపేశారు. -
డేవిడ్ వార్నర్ గుడ్ బై.. అందమైన కుటుంబాన్ని చూశారా?(ఫొటోలు)
-
Britain: క్రియాశీల రాజకీయాలకు థెరెసా మే గుడ్బై
లండన్: బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి థెరెసా మే(67) క్రియాశీల రాజకీయాలకు గుడ్బై చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని శుక్రవారం ప్రకటించారు. అయితే, ప్రస్తుత ప్రధాని రిషి సునాక్కు తన మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. 2016–2019 కాలంలో బ్రిటన్ ప్రధానిగా ఉన్న థెరెసా మే హౌస్ ఆఫ్ కామన్స్లో 27 ఏళ్లపాటు ఎంపీగా కొనసాగారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎంపీగా 1997 నుంచి ఏడు పర్యాయాలు ఆమె ఎన్నికయ్యారు. మార్గరెట్ థాచర్ తర్వాత బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రెండో మహిళ థెరెసా మే ‘న్యూ ఐరన్ లేడీ’గా పేరు తెచ్చుకున్నారు. 2016 జూన్లో రెఫరెండం నేపథ్యంలో కుదిరిన బ్రెగ్జిట్ ఒప్పందం పార్లమెంట్ తిరస్కరించడంతో ఆమె ప్రధాని పదవి నుంచి వైదొలిగారు. -
‘కమలం’ చెంతకు కమల్నాథ్?
న్యూఢిల్లీ/భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ హస్తం పార్టీకి గుడ్బై చెప్పబోతున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే అలాంటిదేమీ లేదని కమల్నాథ్ ఆ వార్తలను కొట్టిపారేశారు. అయితే శనివారం జరిగిన పరిణామాలు చూస్తుంటే ఆయన బీజేపీ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోందని విశ్లేషణలు వినవచ్చాయి. అసలేం జరిగింది? కమల్నాథ్కు మాజీ మీడియా సలహాదారు, ప్రస్తుత బీజేపీ అధికార ప్రతినిధి అయిన నరేంద్ర సలూజా.. కమల్నాథ్, ఆయన కుమారుడు, ఛింద్వారా కాంగ్రెస్ ఎంపీ నకుల్నాథ్లతో దిగిన భోపాల్లో దిగిన ఒక ఫొటోను ‘ఎక్స్’లో పోస్ట్చేసి దానికి ‘జై శ్రీరామ్’ అని ట్వీట్చేశారు. దీంతో తండ్రీకొడుకులు కమలం గూటికి చేరుకుంటున్నారని వార్తలు మొదలయ్యాయి. వీటికి బలం చేకూరుస్తూ నకుల్నాథ్ తన ‘ఎక్స్(పాత ట్విట్టర్)’ ఖాతా వివరాల్లో కాంగ్రెస్ పదాన్ని తొలగించారు. ముందస్తు షెడ్యూల్ లేకుండా హడావుడిగా ఇద్దరూ ఢిల్లీకి వచ్చారు. రాగానే మీడియా కమల్ను ప్రశ్నించింది. మీరు పార్టీ మారుతున్నారా? అన్న ప్రశ్నకు ‘‘ అలాంటిదేమైనా ఉంటే ముందు మీకే చెబుతా’ అని అన్నారుగానీ పార్టీని వీడట్లేదనే సమాధానం చెప్పలేదు. దీంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. రాజ్యసభ సీటు ఆశించి భంగపడినందుకే కమల్నాథ్ పార్టీని వీడుతున్నారని మరో విశ్లేషణ వినిపించింది. బీజేపీలోకి వస్తామంటే ఇప్పుడే మీకు స్వాగతం పలుకుతామని మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్ వీడీ శర్మ శుక్రవారం వ్యాఖ్యానించడం తెల్సిందే. గత ఏడాది మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పేలవ ప్రదర్శనకు కమల్నాథ్ బాధ్యుడని రాహుల్ భావిస్తున్నారని, అందుకే కమల్ను తప్పించి జీతూ పట్వారీకి కాంగ్రెస్ మధ్యప్రదేశ్ చీఫ్ పదవి కట్టబెట్టారని వార్తలొచ్చాయి. అన్నీ అసత్యాలు : జీతూ పట్వారీ ఇలాంటి వార్తలను కాంగ్రెస్ మధ్యప్రదేశ్ అధ్యక్షుడు జీతూ పటా్వరీ తోసిపుచ్చారు. ‘‘ కాంగ్రెస్తో కమల్నాథ్ బంధం ఈనాటిది కాదు. ఇందిరాగాంధీ తనయుడు సంజయ్ గాంధీతో కలిసి డెహ్రాడూన్ డూన్ స్కూల్లో చదివారు. ఒకానొక సమయంలో కమల్ నా మూడో కుమారుడు అంటూ స్వయంగా ఇందిరగాం«దీనే వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తి కాంగ్రెస్ను వీడుతారా?’’ అని మీడియానే పట్వారీ నిలదీశారు. ‘‘రాజ్యసభ సీటు ఇవ్వలేదన్నది అవాస్తం. నిజానికి ఆ స్థానం కోసం నామినేషన్ వేసిన పార్టీ కోశాధికారి అశోక్సింగ్ పేరును బలపరిచింది కమల్నాథే’’ అని పటా్వరీ వివరణ ఇచ్చారు. దశాబ్దాలుగా కాంగ్రెస్తో అనుబంధమున్న కమల్ ఛింద్వారా నుంచి తొమ్మిదిసార్లు ఎంపీగా గెలిచారు. 2019లో ఆ స్థానం నుంచి కమల్ కుమారుడు నకుల్ గెలిచారు. ఈ ఒక్కస్థానం తప్ప రాష్ట్రంలోని మిగతా 28 ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. -
ఇలా రాజీనామా, అలా ప్రమాణం!
పట్నా/న్యూఢిల్లీ: బిహార్లో రాజకీయ సంక్షోభం క్లైమాక్స్కు చేరుతోంది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాఘట్బంధన్ సంకీర్ణ సర్కారుకు జేడీ(యూ) సారథి, సీఎం నితీశ్కుమార్ గుడ్బై చెప్పడం, మళ్లీ బీజేపీతో దోస్తీ కట్టి ఎన్డీఏ కూటమిలో చేరడం ఖాయమైనట్టు కని్పస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, ఆదివారం ఉదయం నితీశ్ సారథ్యంలో పటా్నలో ఎన్డీఏ శాసనసభా పక్ష భేటీ జరగనుంది. బీజేపీ, జేడీ(యూ), జితిన్రాం మాంఝీ సారథ్యంలోని హిందూస్తాన్ అవామీ లీగ్ అందులో పాల్గొంటాయి. ఎమ్మెల్యేలంతా కలిసి శాసనసభాపక్ష నేతగా నితీశ్ను ఎన్నుకుంటారు. వెంటనే ఆయన గవర్నర్ను కలిసి సీఎం పదవికి రాజీనామా చేస్తారు. ఎన్డీఏ పక్షాల మద్దతు లేఖలు సమరి్పంచి మళ్లీ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరతారు. సాయంత్రం సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు. బీజేపీ నేత సుశీల్కుమార్ మోదీ ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని సమాచారం. మాంఝీ కూడా రెండు మంత్రి పదవులు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆదివారం విధులకు రావాల్సిందిగా సచివాలయ సిబ్బందికి ఆదేశాలు వెళ్లడం వంటివన్నీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సూచికలేనని చెబుతున్నారు. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా నితీశ్ను బలపరిచే అవకాశముందని వార్తలొస్తున్నాయి. కనీసం ఏడెనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సెల్ ఫోన్లు శనివారమంతా స్విచాఫ్ కావడం వాటిని బలపరుస్తోంది! దాంతో పరిస్థితిని సమీక్షించేందుకు కాంగ్రెస్ అధిష్టానం తరఫున ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘెల్ హుటాహుటిన పట్నా చేరుకున్నారు. ఇండియా కూటమిలోకి రావాల్సిందిగా మాంఝీతో మంతనాలు జరిపారు. మరోవైపు నితీశ్తో చేదు అనుభవాల నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై బీజేపీ వ్యూహాత్మకమౌనం పాటిస్తోంది. శనివారం పటా్నలో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో దీనిపై లోతుగా చర్చ జరిగినా జేడీ(యూ)ను తిరిగి ఎన్డీఏలోకి ఆహా్వనించడంపై ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. ఇక ఘట్బంధన్ సంకీర్ణంలో ప్రధాన భాగస్వామ్య పక్షమైన ఆర్జేడీ ఎలాగైనా సర్కారును కాపాడుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఆర్జేడీ నేతలతో పార్టీ చీఫ్ లాలు మంతనాల్లో మునిగి తేలుతున్నారు. జేడీ(యూ) లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వాలని నేతలు ప్రతిపాదించారు. అయితే బీజేపీ, జేడీ(యూ) కలిస్తే 123 ఎమ్మెల్యేలతో మెజారిటీ మార్కు (122)ను సులువుగా దాటేస్తారంటూ లాలు కుమారుడు, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ వాటిని తిరస్కరించినట్టు చెబుతున్నారు. ఇలా శనివారమంతా పట్నాలో హై వోల్టేజ్ పొలిటికల్ డ్రామా నడిచింది. ఇండియా కూటమి ఖతమే: జేడీ(యూ) బిహార్లో ఘట్బంధన్ సంకీర్ణం కుప్పకూలనుందని జేడీ(యూ) రాజకీయ సలహాదారు, అధికార ప్రతినిధి కేసీ త్యాగి స్పష్టం చేశారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు నితీశ్ను పదేపదే అవమానించడమే ఇందుకు కారణమని చెప్పారు. కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమి కూడా కుప్పకూలే దశలో ఉందని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మాత్రం కూటమికి వచి్చన ముప్పేమీ లేదని ఆశాభావం వెలిబుచ్చారు. అయితే, నితీశ్తో మాట్లాడేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పదేపదే ప్రయత్నించినా ఆయన ‘బిజీ’గా ఉండటంతో వీలు కాలేదని వెల్లడించారు! ఇండియా కూటమి నుంచి జేడీ(యూ) వైదొలగుతున్నట్టు ఎలాంటి సమాచారమూ లేదని ఖర్గే చెప్పుకొచ్చారు. -
Bihar Politics: రేపే ఎన్డీఏలోకి నితీశ్?
పట్నా/న్యూఢిల్లీ: బిహార్ రాజకీయం రసకందాయంలో పడింది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన అధికార మహాఘట్బంధన్ సంకీర్ణానికి జేడీ(యూ) సారథి, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గుడ్బై చెప్పి ఎన్డీఏ కూటమిలో చేరడం దాదాపుగా ఖాయమైందని తెలుస్తోంది. పాత నేస్తం బీజేపీతో మళ్లీ జట్టు కట్టి ఆయన కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఆదివారమే నితీశ్ మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయవచ్చని జేడీ(యూ) వర్గాలంటున్నాయి. రాష్ట్ర బీజేపీ అగ్ర నేత సుశీల్కుమార్ మోదీకి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కనుందని సమాచారం. ‘‘(నితీశ్కు ఇంతకాలంగా బీజేపీలోకి) మూసుకుపోయిన తలుపులు తెరుచుకోవచ్చు. రాజకీయాంటేనే అవకాశాల ఆటస్థలి. కనుక ఏదైనా సాధ్యమే’’ అంటూ శుక్రవారం సుశీల్ చేసిన నర్మగర్భ వ్యాఖ్యలు కూడా ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. బిహార్ తాజా పరిణామాలపై రాష్ట్ర బీజేపీ చీఫ్ సమర్థ్ చౌదరి, సుశీల్కుమార్ ఇప్పటికే ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితర బీజేపీ అగ్ర నేతలతో చర్చలు జరిపి వచ్చారు. ఈ నేపథ్యంలో జేడీ(యూ)ను ఎన్డీఏలోకి తీసుకోవడంపై శని, ఆదివారాల్లో బిహార్ బీజేపీ రెండు రోజుల రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో చర్చించనున్నారు. ఆదివారమే పొత్తు నిర్ణయం వెలువడవచ్చని తెలుస్తోంది. ఆ రోజు ఉదయమే జేడీ(యూ) ఎమ్మెల్యేలతో నితీశ్ సమావేశం కానుండటం విశేషం! మరోవైపు 10 మంది దాకా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీతో టచ్లో ఉన్నట్టు వస్తున్న వార్తలు అధికార సంకీర్ణంలో కలకలం రేపుతున్నాయి. నితీశ్ స్పష్టత ఇవ్వాలి: ఆర్జేడీ సంకీర్ణంలో ప్రధాన భాగస్వామి అయిన ఆర్జేడీతో నితీశ్కు విభేదాల నేపథ్యంలో బిహార్లో రెండు రోజులుగా రాజకీయ రగడ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆయన ఎన్డీఏలో చేరతారన్న వార్తలు గురువారం కలకలం రేపాయి. జేడీ(యూ) ని్రష్కమిస్తే సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీలో పడుతుంది. దాన్ని కాపాడుకునేందుకు అవసరమైన 8 మంది ఎమ్మెల్యేల కోసం ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నలుగురు ఎమ్మెల్యేలున్న ఎన్డీఏ భాగస్వామి హిందూస్తానీ అవామ్ మోర్చా చీఫ్ జితిన్రామ్ మాంఝీతో శుక్రవారం మంతనాలు జరిపారు. మాంఝీ మాత్రం నితీశ్ కూడా త్వరలో ఎన్డీఏలోకి వస్తారని మీడియాతో చెప్పుకొచ్చారు! ఘట్బంధన్ సర్కారు ఒకట్రెండు రోజుల్లోనే కుప్పకూలడం ఖాయమని ఆయన కుమారుడు సంతోష్ జోస్యం చెప్పారు. మొత్తం ఉదంతంపై నితీశ్ తక్షణం స్పష్టమైన ప్రకటన చేసి ఊహాగానాలకు తెర దించాలని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా కోరడం విశేషం. -
ఈ సంవత్సరం ఏం చేశారు?
2023కు వీడ్కోలు ఇవన్నీ ప్రశ్నలే.పునరావలోకనం చేసుకోవాలి.కొత్త సంవత్సరం కొత్త ఉత్సాహంతో మొదలెట్టాలి.జీవితం ఒక్కటే. సాధించాల్సినవి లక్ష.స్త్రీగా జన్మించినందుకు రోజులు ఎలా గడిచిపోయాయో అనుకోకూడదు.ఎంత బాగా గడిచాయో అనుకోవాలి.అందుకు తరచి చూసుకుని స్వీయ అంచనా వేసుకోవడమే మార్గం.‘ఏం చేస్తున్నావమ్మా?’ అని పిల్లలు అడిగి ‘అన్నం పెట్టు’ అంటారు. ‘ఏం చేస్తున్నావోయ్’ అని భర్త అడిగి, ‘నా వైట్షర్ట్ ఎక్కడా?’ అని ప్రశ్నిస్తాడు. అత్తగారు, మామగారు ‘ఏం చేస్తున్నావమ్మా’ అని కేకేసి ఇంకేదో చెప్తారు. వీళ్లంతా ఏ పనీ చెప్పకపోయినా ఇంట్లో గృహిణిగా ఉన్నందుకు తప్పక చేయాల్సిన పనులు ఉంటాయి.ఈ పనుల్లోనే జీవితం గడిచిపోవాలా? ఈ పనుల మధ్యలో స్త్రీలు తమకంటూ ఒక జీవితాన్ని నిర్మించుకోలేరా? 2023 మరో రెండు మూడు రోజుల్లో వీడ్కోలు తీసుకుంటుంది. కొత్త సంవత్సరం వస్తుంది. గృహిణిగా/ ఉద్యోగం చేస్తూ ఇల్లు చూసుకునే గృహిణిగా ఈ సంవత్సరమంతా ఎలా గడిచిందో బేరీజు వేసుకున్నారా? ఎన్ని పుస్తకాలు చదివారు? స్త్రీకి మెదడు ఉంటుంది... దానికి వ్యాయామం ముఖ్యం అన్నాడు రచయిత చలం. ఆ వ్యాయామం పుస్తకాలు చదివితే వస్తుంది. సాహిత్యానుభవం వల్ల మస్తిష్కం విశాలం అవుతుంది. జీవన అవగాహన పెరుగుతుంది. జీవితాన్ని ఆస్వాదించడమూ తెలుస్తుంది. స్త్రీలు పుస్తకం చదివితే ఇంటికి వెలుగు. ప్రతిఏటా ఎన్నో మంచి పుస్తకాలు వస్తాయి. పుస్తక ప్రదర్శనలు జరుగుతాయి. అమేజాన్ నుంచి తెప్పించుకోవచ్చు. ఆడియో యాప్స్ కూడా ఉన్నాయి. పుస్తకాలు చదవకుండానే 2023ను మీరు వృథా చేసి ఉంటే మీరు మీ బౌద్ధిక వ్యాయామాన్ని వృథా చేసినట్టు. లేదా కొన్ని పుస్తకాలైనా చదివి ఉంటే వాటిని లిస్ట్ చేసి మీ స్నేహితులకు పంపి ఇన్స్పయిర్ చేయండి. ఈ సంవత్సరం మరిన్ని చదవాలని లక్ష్యం పెట్టుకోండి. మంచి సినిమాలు చూశారా? సినిమాలంటే కాలక్షేపపు సినిమాలు కాదు. హాలీవుడ్లో, హిందీలో, భారతీయ భాషల్లో అర్థవంతమైన సినిమాలు వస్తున్నాయి. స్త్రీ దృష్టికోణం నుంచి ఎన్నో కథలు చెప్తున్నారు. ఓటిటిలలో కూడా చాలా సినిమాలు వస్తున్నాయి. వీటిలో కొన్నయినా మీరు ఎంచుకుని చూశారా? పోనీ... పాత క్లాసిక్స్... మీరు ఎప్పటినుంచో చూడాలనుకున్నవి... ఎవరూ మధ్యలో డిస్ట్రబ్ చేయని విధంగా చూశారా? సంతోషించారా? ఎంతమంది మిత్రులను పొందారు? ఇవాళ మనిషికి పెద్ద ఓదార్పు స్నేహమే. వైవాహిక జీవితంలో పడ్డాక పాత స్నేహాలు కొనసాగితే అదృష్టమే. స్కూల్, కాలేజీ నాటి స్నేహితులు మాట్లాడుతూ ఉంటే ఆ స్నేహాన్ని ఈ సంవత్సరం ఎంతమేరకు నిలబెట్టుకున్నారు. లేదా ఇంటి ఇరుగు పోరుగున, పని చేసే చోట ఎన్ని మంచి స్నేహాలు చేయగలిగారు. ఇవాళ రేపు మనుషుల పట్ల నెగెటివిటి పెరిగింది. కాని లోపాలు ఎంచటం తక్కువ... స్నేహాన్ని కొనసాగించడం తక్కువ కొనసాగించారా? బాగా చికాకుగా, డల్గా ఉన్నప్పుడు మీరు కాల్ చేసి మాట్లాడే స్నేహితుల సంఖ్య ఈ సంవత్సరం పెరిగిందా? తగ్గిందా? ఎన్ని అనుబంధాలను కాపాడుకోగలిగారు? బంధువులను దూరం చేసుకోవడం, బంధువులకు దూరం కావడం ఈ కాలపు గడుసుదనంగా మారింది. బంధువులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనే పోకడ ఇప్పుడు సర్వసామాన్యం అయ్యింది. కాని బంధుత్వాలు లేకనే జీవనం సాగగలదా? ఎన్ని లోపాలు ఉన్నా మంచికీ చెడ్డకీ ఆధారపడాల్సింది బంధువులే కదా? ఈ బాంధవ్యాలను, అనుబంధాలను డ్యామేజీ చేశారా? లేదా బలపరుచుకున్నారా? ఏదైనా నష్టం జరిగి ఉంటే 2024లో ఆ నష్టాన్ని నివారించే ప్రయత్నం ఎందుకు జరగకూడదు? ఎన్ని కొత్తప్రాంతాలు తిరిగారు? సంవత్సరమంతా ఇంటి నాలుగ్గోడలు, ఆఫీసుప్రాంగణంలోనే గడిచిపోయిందా? ఏ కొత్తప్రాంతాన్ని చూడలేదా? కొత్తనేలను తాకి కొత్తగాలిని పీలిస్తేనే సంతోషం. సంవత్సరంలో కనీసం 2 కొత్తప్రాంతాలు చూడగలగాలి. 2023లో చూడకపోతే 2024లో కదలండి కుటుంబ సభ్యుల మధ్య సాన్నిహిత్యం: కుటుంబం జీవన సర్వస్వం. ఒకే కుటుంబమే అయినా కుటుంబ సభ్యుల మధ్య స్పర్థలు, అభ్యంతరాలు, నిర్లక్ష్యం, నిర్బాధ్యత వస్తాయి ఒక్కోసారి. కడుపున పుట్టిన వాళ్ల మధ్య ప్రేమను కల్పించారా? తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల మధ్య అడ్డుగోడలు లేకుండా ఉన్నారా? మీ మనసులో ఉన్నదంతా వారికి చెప్పగలరా? వారి మనసులో ఉన్నది చెప్పే వీలు ఇచ్చారా? 2024లో ఈ ప్రశ్నలకు జవాబు వెతకండి. ఎంత పోదుపు చేశారు? పిల్లల కోసమే ప్రతి పైసా ఖర్చు పెట్టడం ఇన్నాళ్లు చేశారా? 2023లో కూడా అదే చేశారా? తల్లిగా మీ ఆర్థిక భద్రత ఎంత? మీ పేరున స్థిరచరాస్తులు, రొక్కం ఏ మేరకు ఉంది. మీ కోసం మీరుఎంత పోదుపు చేసుకున్నారు? ఒకరిపై ఆధారపడలేని స్థితిలో ఉండాలనుకోవడం లేదా? కొత్త సంవత్సరం వస్తున్నది మీ స్వయంసమృద్ధికే. ఆరోగ్యం పై ఎంత శ్రద్ధ పెట్టారు? ఆరోగ్యం సంగతి తర్వాత చూసుకుందాం అని ఇంకా ఎన్నేళ్లు అనుకుంటారు. ఈ సంవత్సరం హెల్త్ ఇన్సూరెన్స్లు చేయించుకోండి. మంచి ఆహారానికి బడ్జెట్ కేటాయించుకోండి. జిమ్లో చేరండి. వాకింగ్ చేయండి. యోగా క్లాసులకెళ్లండి. మీ ఆరోగ్యం కోసం మీరు కొంత ఖర్చు పెట్టుకోవడాన్ని హక్కుగా పొందండి. 2024లో కచ్చితంగా మీరు సంపూర్ణ ఆరోగ్యం కోసం నడుం బిగించండి.కాలం వచ్చేది మన కోసం. మనం ఇతరుల కోసం ఎంత జీవించినా మన కోసం కూడా జీవించాలి. కొత్త సంవత్సరంలో మీ కోసం కూడా మీరు జీవించండి. -
కుస్తీకి సాక్షి స్వస్తి
న్యూఢిల్లీ: సాక్షి మలిక్... మహిళల కుస్తీలో పతకం పట్టుబట్టే స్టార్ రెజ్లర్. కామన్వెల్త్ క్రీడల్లో మూడు పతకాలు... ఆసియా చాంపియన్íÙప్లో నాలుగు పతకాలు... రియో ఒలింపిక్స్లో కాంస్య పతకం... ఇవిచాలు సాక్షి ఏస్థాయి రెజ్లరో చెప్పడానికి! దేశానికి పతకాలెన్నో తెచ్చిపెట్టిన ఆమె... గురువారం జరిగిన డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ విధేయుడే అధ్యక్షుడిగా ఎన్నికవడంతో ఇక చేసేదేమీ లేక బయట పోరాటానికి, బౌట్లో పతకం ఆరాటానికి సెలవిచ్చింది. కన్నీటి చెమ్మతో బరువెక్కిన హృదయంతో రిటైర్మెంట్ ప్రకటించింది. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన కేసులో నిందితుడైన బ్రిజ్భూషణ్ ప్రధాన అనుచరుడు సంజయ్ సింగ్ భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. బ్రిజ్భూషణ్ పై ఢిల్లీ రోడ్లెక్కి సాక్షి సహా స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్, సంగీత ఫొగాట్ తదితరులు నిరసన తెలిపారు. పగలనక... రాత్రనక... తిండి నిద్రలేని రాత్రులెన్నో గడిపి బ్రిజ్భూషణ్ను గద్దె దింపాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన గద్దె దిగినప్పటికీ ఆయన నీడ సంజయ్ సింగ్ అధ్యక్షుడు కావడంతో జీర్ణించుకోలేకపోయిన సాక్షి తన ఆటకు టాటా చెప్పేసింది. స్టార్ రెజ్లర్లు బజరంగ్, వినేశ్ కూడా సంజయ్ ఎన్నికపై తప్పుబట్టారు. అవును... అందుకే గుడ్బై ‘బ్రిజ్భూషణ్ మహిళా రెజ్లర్ల పట్ల ప్రవర్తించిన తీరుపై గళమెత్తాం. కదంతొక్కాం. కేసు నమోదు చేయించాం. కానీ డబ్ల్యూఎఫ్ఐ తాజా ఎన్నికల్లో చివరకు ఆయన వర్గమే గెలిచింది. పదవులన్నీ చేజిక్కించుకుంది. అందుకే కెరీర్కు గుడ్బై చెప్పా. మేం మహిళా అధ్యక్షురాలైతే బాగుంటుందని అనుకున్నాం. కానీ అలా జరగలేదు’ అని మీడియా సమావేశంలో సాక్షి వాపోయింది. 15లో 13 పదవులు బ్రిజ్భూషణ్ వర్గానివే మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ డబ్ల్యూఎఫ్ఐలో తన పట్టు నిరూపించుకున్నాడు. ఆయన బరిలో లేకపోయినా... 15 పదవుల్లో ఆయన వర్గానికి చెందిన 13 మంది పదవుల్ని చేజిక్కించుకున్నారు. అధ్యక్ష పదవి ఎన్నికలో ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ సంఘం ఉపాధ్యక్షుడైన సంజయ్... 2010 కామన్వెల్త్ క్రీడల స్వర్ణ పతక విజేత అనిత షెరాన్పై 40–7 ఓట్ల తేడాతో గెలిచాడు. అనిత వర్గానికి చెందిన ప్రేమ్చంద్ లోచబ్ ప్రధాన కార్యదర్శి పదవి పొందడం... సీనియర్ ఉపాధ్యక్షుడిగా దేవేందర్ సింగ్ కడియాన్ ఎన్నికవడం ఒక్కటే ఊరట. మిగతా 4 ఉపాధ్యక్ష పదవులు బ్రిజ్భూషణ్ క్యాంప్లోని జైప్రకాశ్ (ఢిల్లీ), అశిత్ సాహా (బెంగాల్), కర్తార్ సింగ్ (పంజాబ్), ఫొని (మణిపూర్)లే సొంతం చేసుకున్నారు. ఉపాధ్యక్ష బరిలో దిగిన మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి, మాజీ రెజ్లర్ మోహన్ యాదవ్కు కేవలం ఐదు ఓట్లు లభించడం గమనార్హం. కోశాధికారిగా సత్యపాల్ (ఉత్తరాఖండ్), ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులందరూ బ్రిజ్భూషణ్ వర్గం వారే ఎన్నికయ్యారు. నిరసన దీక్ష చేపట్టిన రెజ్లర్లపై ఎలాంటి వివక్ష చూపం. ప్రతీకారం తీర్చుకోం. రెజ్లర్లందరిని సమానంగా చూస్తాం. వారికి కావాల్సిన సహకారాలు అందిస్తాం. మేం రెజ్లింగ్ ఆటపైనే దృష్టి పెడతాం. రెజ్లర్ల పొరపాట్లపై కాదు. ఎన్నికైన కొత్త కార్యవర్గమే డబ్ల్యూఎఫ్ఐని నడిపిస్తుంది. రోజువారీ వ్యవహారాల్లో నా ప్రమేయం ఉండదు. వారు కోరితేనే సలహాలిస్తా. –మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ -
బీజేపీకి గౌతమి గుడ్బై
సాక్షి, చైన్నె : సినీ నటి గౌతమి బీజేపీకి గుడ్ బై చెప్పేశారు. పార్టీ నుంచి వైదొలగుతున్నట్లు ఆమె మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీలోని నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తనను మోసం చేసిన మోసగాడికి అండగా బీజేపీ నాయకులు ఉన్నారని తెలిసి తీవ్ర మనో వేదనకు గురైనట్టు పేర్కొన్నారు. గౌతమి విడుదల చేసిన ప్రకటనలోని వివరాలు.. ‘బరువెక్కిన హృదయంతో , తీవ్ర అసంతృప్తితో బీజేపీ నుంచి వైదొలగేందుకు నిర్ణయించాను. గత 25 సంవత్సరాలుగా పార్టీకి సేవలు అందిస్తూ వస్తున్నాను , ఈ పయనంలో ఎన్నో సవాళ్లు, ఒడి దొడుగులు ఎదుర్కొన్నాను. అయినా, తన పని తాను సక్రమంగా చేస్తూ ముందుకు సాగినట్టు పేర్కొన్నారు. పార్టీ నుంచి, నాయకుల నుంచి తనకు ఎలాంటి మద్దతు, సహకారం లేక పోవడమే కాకుండా నన్ను మోసం చేసిన అలగప్పన్కు అండగా తమ పార్టీ వాళ్లే ఉన్నట్టుగా వచ్చిన సమాచారం తీవ్రంగా కలచి వేసింది. 37 సంవత్సరాలు సినిమా, టీవీ, రేడియో, డిజిటల్ మీడియాలో కష్టపడి సంపాదించిన సొమ్ముతో కుమార్తెతో తన జీవితం ఉజ్వలమయంగా ఉండాల్సిందన్నారు. అయితే అలగప్పన్ తనను ఆర్థికంగా మోసం చేశాడని, నగదు, ఆస్తులను అపహరించాడని ఇటీవలే తన దృష్టి వచ్చిందన్నారు. ఈ విషయంగా పోలీసులను ఆశ్రయించానని గుర్తుచేశారు. అయితే ఆ మోసగాడికి బీజేపీలోని కొందరు నేతలు అండగా ఉండడం తనను కలిచి వేసిందని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, పోలీసులు, న్యాయం వ్యవస్థ మీద నమ్మకంతో తాను చేసిన ఫిర్యాదుపై న్యాయం దక్కుతుందనే ఎదురు చూపులో ఉన్నాను. 2021 ఎన్నికల్లో రాజపాళయం సీటు తనకే అని చెప్పడంతో పార్టీ బలోపేతానికి తీవ్ర కృషి చేశానని, చివరి క్షణంలో సీటు దక్కకుండా చేశారని గుర్తుచేస్తూ, ఎలాంటి మద్దతు , సహకారం, ఆదరణ లేని పార్టీలో కొనసాగలేను. నన్ను మోసం చేసిన వ్యక్తి 40 రోజులుగా బీజేపీ సీనియర్ల సహకారంతో అజ్ఞాతంలో ఉన్నట్టు వచ్చిన సమాచారం తనను మరింతగా కుంగదీసింది. అందుకే పార్టీ నుంచి బయటకు వెళ్తున్నాను’ అని ప్రకటించారు. ఇదిలా ఉండగా, గౌతమి నిర్ణయంపై బీజేపీ మహిళానేత,నటి కుష్భు విచారం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఇటీవల బీజేపీ నుంచి బయటకు వచ్చిన నటి గాయత్రి రఘురాం మరో మారు తెర మీదకు వచ్చి, బీజేపీలో మహిళలకు గుర్తింపు లేదని, న్యాయం దక్కదని ఆవేదన వ్యక్తం చేశారు. -
అయ్యయ్యో.. ఆ శకం ముగుస్తోందా? నిజమేనా?
Reynolds 045 Fine Carbure భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బాల్ పెన్ రేనాల్డ్స్. 90వ దశకంలో రేనాల్డ్స్ పెన్స్ బ్రాండ్ ఒక ట్రెండ్ సృష్టించింది. బ్లూ క్యాప్, వైట్ కలర్ బాడీతో మొదలై పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పవచ్చవు. 90వ దశకంలో ఉపాధ్యాయుల నుండి విద్యార్థులు, ఉద్యోగస్తుల వరకూ అలనాటి పెన్స్ పరిచయం లేనివారెవ్వరూ ఉంటారు. రేనాల్డ్స్ పేరుతో వచ్చిన ఉత్పత్తులలో బాల్ పాయింట్, జెల్, రోలర్బాల్ , ఫౌంటెన్ పెన్నులు , మెకానికల్ పెన్సిల్స్ ఉన్నాయి. ఇపుడా రేనాల్డ్స్ పెన్ ఇప్పుడు మార్కెట్లో మాయమైపోతోందట. ఈ మేరకు పలు కథనాలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో నెటిజన్లు కూడా స్పందించారు. రెనాల్డ్స్ పెన్.. అంటే ఒక నోస్టాల్జియా. చిన్ననాటి జ్ఞాపకాలు ఒక్కసారిగా అలా మదిలో మెదులుతాయి. ఇపుడా రెనాల్డ్స్ పెన్నుల కంపెనీ మూసివేస్తున్నారనేవార్త దావానంలా వ్యాపించింది. కేవలం 5 రూపాయలకు లభించే ఈ పెన్ను దేశంలో బాగా పాపులర్ అయింది. ప్రధానంగా రీఫిల్ లీక్లకు చెక్ పెడుతూ ప్రత్యర్థి కంపెనీలకు ధీటుగా వినియోగదారులను బాగా ఆకట్టుకుంది. Reynolds 045 Fine Carbure పెన్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు పేర్కొంటూ @memorable_90s యూజర్ చేసిన ట్విటర్ పోస్ట్ వైరల్ అయింది. ఈ ప్రత్యేక బ్రాండ్ రేనాల్డ్స్ మిలీనియల్స్లో కల్ట్ ఫాలోయింగ్. ఎరుపు, నలుపు, నీలం రంగులలో వచ్చిన క్లాసిక్.ఖరీదైన 'పైలట్' పెన్నులతో పోల్చినప్పుడు సామాన్యులకు ఈజీగా అందుబాటులో వచ్చాయి. దీంతో తమకు ఇష్టమైన కలం ఉత్పత్తి ఆగి పోయిందనే విషాద వార్తపై నెటిజన్లు స్పందించారు. తమ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఇప్పటికీ ఈపెన్ వాడు తున్నామంటూ కొందరు పేర్కొన్నారు. రేనాల్డ్స్ 045 ఫైన్ కార్బ్యూర్ని ది నేషనల్ పెన్ ఆఫ్ ఇండియా అంటూ ఒకరు కమెంట్ చేశారు. పెన్ బెస్ట్ సెల్లర్గా ఎలా అమ్ముడయ్యిందో చెబుతూ మరొక యూజర్ ట్వీట్ చేశారు. 'చౌక, గొప్ప, మన్నికైన , ఫాడూ పెన్గా అభవర్ణించారు. అయితే ప్రస్తుతం ఉన్న రెనాల్డ్స్ పెన్నుల చివరి బ్యాచ్ అమెజాన్లో అందుబాటులో ఉందంటూ మరికొందరు సూచించారు. అయితే ఇది ఫేక్ న్యూస్ అంట ఒక యూజర్ ఒకప్రకటనను షేర్ చేశారు. అసలు నిజం ఏమిటంటే వివిధ మీడియాలో ప్రచురించిన తప్పుడు సమాచారంపై రెనాల్డ్స్ ఇన్స్టాగ్రామ్లో వివరణ ఇచ్చింది ఖచ్చితమైన సమాచారం కోసం తమ వెబ్సైట్, సోషల్ మీడియా ఛానెల్స్ను పరిశీలించాలని కోరింది. రేనాల్డ్స్కు భారతదేశంలో 45 ఏళ్ల వారసత్వం ఉంది దాన్ని కొనసాగిస్తాం. దేశంలో రైటింగ్ బిజినెస్ను వృద్ధి చేయాలనే దృక్పథంతో ఉన్నామని స్పష్టం చేసింది. View this post on Instagram A post shared by Reynolds (@originalreynoldsindia) I still use the same..ordered 15 of these for my office. I think they will be the last ones now. pic.twitter.com/jdy0wrHVZx — A.K (@HaddHaiYaar) August 24, 2023 Reynolds 045 Fine Carbure will no longer be available in market, end of an era..💔 pic.twitter.com/pSU4WoB5gt — 90skid (@memorable_90s) August 24, 2023 what 😭😭😭😭 I use this pen for all of my artworks , bro 😰😢😢😢 pic.twitter.com/LrkABExkWM — Tales, Legends & Stories ♪ (@byindianwriters) August 24, 2023 -
క్రికెట్కు మనోజ్ తివారీ వీడ్కోలు
కోల్కతా: భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ అన్ని ఫార్మాట్లకు గుడ్బై చెప్పాడు. ఈ బెంగాలీ క్రికెటర్ 2008 నుంచి 2015 వరకు అంతర్జాతీయ కెరీర్లో 12 వన్డేలు, మూడు టి20లు ఆడాడు. వన్డేల్లో ఒక సెంచరీ, అర్ధసెంచరీ ఉన్నాయి. కానీ మూడు టి20ల్లో ఒకసారి మాత్రమే బ్యాటింగ్ అవకాశం దక్కగా 15 పరుగులే చేశాడు. దేశవాళీ క్రికెట్లో 141 మ్యాచ్ల్లో 48.56 సగటుతో 9908 పరుగులు చేశాడు. ఐపీఎల్లో కోల్కతా, పంజాబ్, రైజింగ్ పుణేలకు ఆడాడు. 2012లో మనోజ్ తివారీ విన్నింగ్ షాట్తో కోల్కతా నైట్రైడర్స్ విజేతగా నిలిచింది. 37 ఏళ్ల తివారీ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ కేబినెట్లో రాష్ట్ర యువజన, క్రీడా శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నాడు. -
టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్కు మరో ఎదురుదెబ్బ!
సాక్షి,ముంబై:భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మరో ఎదురు దెబ్బ తగిలింది. కంపెనీలో కీలక ఎగ్జిక్యూటివ్ల వరుస రాజీనామాల పరంపర కొనసాగుతోంది. తాజాగా కంపెనీ చీఫ్ ఇన్ఫర్మేషన్ స్ట్రాటజీ ఆఫీసర్(CISO)ఉన్న విశాల్ సాల్వి ఇన్ఫోసిస్కు గుడ్ బై చెప్పారు.అంతేకాదు సైబర్ సెక్యూరిటీ సంస్థకు సీఈవోగా బాధ్యతలు చేపట్టారు కూడా. (రూ. 2 వేల నోట్లు: ఆర్బీఐ కీలక ప్రకటన) ఈ రంగంలో 29 ఏళ్ల అనుభవం ఉన్న సాల్వి గత ఏడేళ్లుగా ఇన్ఫోసిస్కు CISOగా ఉన్నారు. సైబర్ సెక్యూరిటీ కంపెనీ క్విక్హీల్ కి నూతన సీఈవోగా బాధ్యతలు చేపట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. సైబర్ సెక్యూరిటీ పరిశ్రమలో విశ్వసనీయ సంస్థగా ఉన్న క్విక్ హీల్ టీంకు నాయకత్వం వహించడం చాలా సంతోషకరమైన విషయమని విశాల్ ఒక ప్రకటనలో తెలిపారు.సైబర్ భద్రతను అందరికీ ప్రాథమిక హక్కుగా మార్చే భాగస్వామ్య లక్ష్యానికి తాను పూర్తిగా కట్టుబడి ఉన్నాన్నారు. సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అపారమైన అనుభవం ఉన్న సాల్వి ఇన్ఫోసిస్కంటే ముందు PwC, HDFC బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్, క్రాంప్టన్ గ్రీవ్స్ లాంటి సంస్థల్లో కీలక పాత్రల్లో పనిచేశారు. అలాగే క్విక్ హీల్ కైలాష్ కట్కర్ సీఎండీగా ఉంటారు.మరోవైపు కొత్త నాయకత్వ నియామకంపై కైలాష్ కట్కర్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కస్టమర్ సెంట్రిసిటీ ఇన్నోవేషన్తో మా చోదక శక్తిగా, క్విక్ హీల్ వ్యక్తులు, సంస్థలు, దేశాలకు తమ భద్రతా సేవల్ని కొనసాగుతుయన్నారు. విశాల్ సాల్వితో కలిసి, దేశంలోని సైబర్ సెక్యూరిటీ ఎకోసిస్టమ్ని మార్చేందుకు గ్లోబల్ మ్యాప్లో తమ స్థానాన్ని పటిష్టం చేయడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. (జియో మరో సంచలనం: రూ. 999కే ఫోన్, సరికొత్త ప్లాన్ కూడా) కాగా ఈ మధ్య కాలంలో ఐటీ కంపెనీ నుంచి ఉన్నతాధికారి వైదొలగడం ఇదే తొలిసారి కాదు. జూన్ నెలలో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మన్నేపల్లి నర్సింహారావు కూడా కంపెనీకి (టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు) రాజీనామా చేశారు. 20 ఏళ్ల క్రితం ఇన్ఫోసిస్లో చేరిన మన్నేపల్లి హైదరాబాద్ సెంటర్కి హెడ్గా ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రెసిడెంట్ మోహిత్ జోషి ఇన్ఫోసిస్ను వీడి టెక్ మహీంద్రా సీఈవోగా నియమితులయ్యారు. అంతకుముందు ప్రెసిడెంట్ రవికుమార్ ఎస్ కాగ్నిజెంట్ సీఈవోగా చేరారు. ఇక ఇన్ఫోసిస్కు గుడ్బై చెప్పిన సుదీప్ సింగ్ ఇన్ఫోటెక్ సీఈవోగా చేరిన సంగతి తెలిసిందే. -
పెళ్లి తరువాత కరియర్కు గుడ్బై చెప్పిన బ్యూటీస్
-
52 కొత్త ముఖాలకు టిక్కెట్లు.. కర్ణాటక బీజేపీలో భగ్గుమన్న అసమ్మతి
బెంగళూరు: కర్ణాటక బీజేపీలో అసమ్మతి భగ్గుమంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 52 కొత్త ముఖాలకు టిక్కెట్లు ఇస్తూ విడుదల చేసిన తొలి జాబితా పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. టికెట్ రాని అసంతృప్త నాయకులు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై కొడుతున్నారు. మరికొందరు పార్టీ నుంచి వెళ్లిపోతామంటూ బెదిరింపులకి దిగుతున్నారు. ఆశావహుల మద్దతుదారులు బీజేపీ కార్యాలయం వద్ద నిరసనలకు కూడా దిగారు. సీనియర్ నేత లక్ష్మణ్ సావాది, మాజీ ఎమ్మెల్యే దొడ్డప్పగౌడ పాటిల్ నారిబోల్లు పార్టీకి బుధవారం గుడ్బై కొట్టేశారు. సలియా నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గి ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఎస్. అంగారా టికెట్ రాకపోవడంతో ఏకంగా రాజకీయ సన్యాసం స్వీకరిస్తున్నట్టుగా ప్రకటించారు. లక్ష్మణ్ సావాది మాజీ సీఎం బీఎస్ యడ్డీయూరప్పకి అత్యంత విధేయుడు, శక్తిమంతమైన లింగాయత్ నాయకుల్లో ఒకరు. 2018 ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ, ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి ఫిరాయింపుదారుల్ని ఆకర్షించడంలో పకడ్బందీగా వ్యూహాలు పన్నారు. ఈసారి టికెట్ రాకపోవడంతో సావాది తాను ఎవరినీ బిచ్చమడగనని, తనకి ఆత్మ గౌరవం ఉందని వ్యాఖ్యానించారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన కాంగ్రెస్లోకి వెళతారంటున్నారు. మాజీ ఎమ్మెల్యే దొడ్డప్ప గౌడ కూడా రాజీనామా చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టార్ పేరు తొలిజాబితాలో లేకపోయేసరికి ఆగ్రహావేశాలతో ఢిల్లీకి వెళ్లి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. టికెట్ వస్తుందని ఆశాభావంతో ఉన్నారు. ఇక మంత్రి అంగారా పార్టీ తనను తీవ్రంగా అవమానించిందంటూ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. -
బిగ్బీ పుట్టినరోజు స్పెషల్: హ్యాపీ బర్త్డే సాంగ్ చూశారా?
యంగ్ హీరోలతో పోటీపడి నటిస్తున్న సీనియర్ స్టార్ అమితాబ్ బచ్చన్. వయసు మీద పడుతున్నా ఏమాత్రం హుషారు తగ్గకుండా రెట్టింపు ఉత్సాహంతో సినిమాలు చేస్తూనే ఉన్నారు. 80వ పడిలో అడుగుపెట్టినా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్నారు. నేడు (అక్టోబర్ 11న) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా గుడ్ బై చిత్రయూనిట్ అమితాబ్కు స్పెషల్ విషెస్ తెలియజేస్తూ హ్యాపీ బర్త్డే సాంగ్ రిలీజ్ చేసింది. సినిమాలో బిగ్బీ బర్త్డే విజువల్స్ చూపించడంతో పాటు సెట్స్లో అతడితో కేక్ కట్ చేయించిన క్లిప్పింగ్ను కూడా ఇందులో యాడ్ చేశారు. ఈ వీడియోలో నటీనటులతో పాటు దర్శకుడు వికాస్ కూడా ఉన్నాడు. కాగా గుడ్ బై సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. నీనా గుప్తా, సునీల్ గ్రోవర్, పవైల్ గులాటి ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం అక్టోబర్ 7న విడుదలైంది. చదవండి: ఆస్కార్ ఎంట్రీకి ఆర్ఆర్ఆర్.. నెటిజన్ ట్వీట్పై మంచు విష్ణు రియాక్షన్ లైంగిక ఆరోపణలు.. అలాంటి వ్యక్తిని అప్పుడు చూపిస్తారా? -
పుష్ప 2పై అప్డేట్ ఇచ్చిన రష్మిక, ‘అప్పుడే సెట్లో అడుగుపెడతా’
‘‘ఫలానా స్క్రిప్ట్ను ఎంచుకుంటే అది జరుగుతుందేమో! ఫలానా స్క్రిప్ట్ను ఎంచుకోకపోతే మరొకటి జరుగుతుందేమో అని హైరానా పడను. జరిగేదే జరుగుతుందనుకుని నా గట్ ఫీలింగ్తో స్క్రిప్ట్స్ ఎంచుకుంటాను’’ అన్నారు రష్మికా మందన్నా. అమితాబ్ బచ్చన్, రష్మికా మందన్నా ప్రధాన పాత్రల్లో నటింన హిందీ చిత్రం ‘గుడ్ బై’. వికాశ్ బాల్ దర్శకత్వంలో రపొందిన ఈ సినివ అక్టోబరు 7న థియేటర్స్లో రిలీజ్ కానుంది. హిందీలో రష్మికా మందన్నాకు ఇదే తొలి చిత్రం. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న రష్మికా మందన్నాను ‘మీరు ఏ విషయానికి గుడ్ బై చెప్పాలనుకుంటున్నారు’ అని ఓ విలేకరి అడగ్గా.. ‘‘నెగిటివిటీకి గుడ్ బై చెప్పాలనుకుంటున్నాను. చదవండి: ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ నాకు మైనస్ అయ్యింది: సంగీత షాకింగ్ కామెంట్స్ నేను చాలా పాజిటివ్ పర్సన్ని. మనందరం నెగిటివిటీకి గుడ్ బై చెప్పాలని, ప్రపంచం అంతా పాజిటివ్నెస్తో నిండిపోవాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకువర్ దర్శకత్వంలో రపొందిన ‘పుష్ప: ది రైజ్’ మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినివ విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా నెక్ట్స్ పార్ట్ ‘పుష్ప: ది రైజ్’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇంకా రెండో భాగం చిత్రీకరణ ఆరంభం కాలేదు. అయితే ఈ సినిమా షూటింగ్లో మరో రెండు రోజుల్లో జాయిన్ అవుతున్నట్లుగా రష్మిక అప్డేట్ ఇచ్చారు. చదవండి: చై-సామ్ విడాకులపై సమంత తండ్రి ఎమోషనల్ -
'గుడ్బై' మూవీ ట్రైలర్ లాంచ్ వేడుక (ఫొటోలు)
-
అమితాబ్తో రష్మిక గొడవ.. ఆసక్తిగా ‘గుడ్బై’ ట్రైలర్
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా బాలీవుడ్లో నటించిన లేటెస్ట్ మూవీ గుడ్బై. బాలీవుడ్ బిగ్బి అమితాబ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఇటీవల షూటింగ్ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ మూవీ అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. మనిషి పోతే అంత్యక్రియలను వేడుకగా జరిపించాలనే కథాంశంతో ఈ మూవీని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. చదవండి: చై-సామ్ విడాకులపై సమంత తండ్రి ఏమోషనల్ పోస్ట్ ఇక ఇందులో అమితాబ్ తండ్రి పాత్రలో కనిపించగా.. రష్మిక కూతురిగా కనిపించింది. తల్లి పాత్రలో నటించిన నటి నీనా గుప్తా చావు, అంత్యక్రయల చూట్టు ఈ మూవీ తిరగనుంది. ఆమె అంత్యక్రయలకు రాకుండ విదేశాల్లో ఉన్న కొడుకులు తప్పించుకోవడం, తల్లి శవాన్ని ఇంట్లో ఉండగానే రష్మిక తండ్రితో గొడవ పడటం ఇలా పలు భావోద్వేగ సన్నివేశాలతో ట్రైలర్ను మలిచారు. పూర్తి ఫ్యామిలీ, ఎమోషనల్ డ్రామాగా ఉన్న ఈ ట్రైలర్ సాంతం ఆకట్టుకుంటోంది. కాగా వికాస్ బాహ్ల్ దర్వకత్వం వహించిన ఈ చిత్రాన్ని శోభా కపూర్, ఏక్తాకపూర్లు నిర్మించారు. -
‘గుడ్బై’ రిలీజ్ ఎప్పుడో చెప్పిన రష్మిక
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటుంది. కన్నడ నుంచి తెలుగు వచ్చిన రష్మిక ఇటీవల బాలీవుడ్లో అడుగుపెట్టింది. అక్కడ తన తొలి చిత్రం విడుదల కాకముందే వరుసగా రెండు సినిమాలకు సంతకం చేసింది. ఏకంగా బిగ్బి అమితాబ్ బచ్చన్తో నటించే చాన్స్ కొట్టేసింది. అమితాబ్తో గుడ్బై, రణ్బీర్ కపూర్ సరసన ఎనిమల్ చిత్రాలు చేస్తుంది. తాజా గుడ్బై చిత్రం నుంచి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. రష్మిక మందన్నా శనివారం ఈ మూవీ ఫస్ట్లుక్ పోస్టర్ను రిలీజ్ చేస్తూ రిలీజ్ డేట్ను ప్రకటించింది. అక్టోబర్ 7న ఈ చిత్రం విడుదల చేస్తున్న చెప్పింది. ఈ ఫస్ట్లుక్ పోస్టర్ను రిలీజ్ చేస్తూ.. ‘మీ కుటుంబాన్ని కలిసేందుకు మా నాన్న-నేను అక్టోబర్ 7న వస్తున్నాం’ అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్టర్లో అమితాబ్-రష్మికలు కలిసి పతంగులు ఎగురవేస్తూ కనిపించారు. ఈ సినిమాలో రష్మిక అమితాబ్ కూతురిగా కనిపించనుందని తెలుస్తోంది. కాగా వికాస్ బహల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఏక్తా కపూర్ నిర్మించింది. నీనా గుప్తా, సాహిల్ మెహతా, శివిన్ నారంగ్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) -
ఆ రోజు 'గుడ్ బై' చెప్పనున్న రష్మిక మందన్నా!
కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్నా (Rashmika Mandanna) వరుస సినిమాలు చేస్తూ తగ్గేదే లే అంటోంది. టాలీవుడ్తో స్టార్డమ్ సంపాందించుకున్న ఈ అమ్మడు కోలీవుడ్, బాలీవుడ్లో ఫుల్ బిజీగా ఉంది. 'పుష్ప' మూవీతో తెలుగు, తమిళం, హిందీ ఆడియెన్స్ల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్లో విజయ్ నటిస్తున్న 'వారీసు' (వారసుడు) చిత్రంలో నటిస్తోంది. అలాగే 'పుష్ప 2'తోపాటు మరికొన్ని హిందీ, కోలీవుడ్ ప్రాజెక్టులు చేస్తోంది. ఇక హిందీలో చేసిన 'మిషన్ మజ్ను', 'గుడ్ బై' సినిమాల చిత్రీకరణ పూర్తి అయింది. తాజాగా 'గుడ్ బై' సినిమా విడుదల తేదిని ఖరారు చేసింది మూవీ యూనిట్. కామెడీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నీనా గుప్తా, ఎల్లీ అవ్రాం, సునీల్ గ్రోవర్, సాహిల్ మెహతా తదితరులు కీలక పాత్రల్లో అలరించనున్నారు. ఈ మూవీ వరల్డ్వైడ్గా అక్టోబర్ 7న విడుదల కానుంది. ఏక్తా కపూర్ నిర్మించిన ఈ సినిమాకు వికాస్ బహల్ దర్శకత్వం వహించారు. అంత్యక్రియల చుట్టూ 'గుడ్ బై' మూవీ కథ జరుగుతుందని బాలీవుడ్ మీడియా అంటోంది. చదవండి: నూలుపోగు లేకుండా రణ్వీర్ సింగ్.. మానసిక రోగి అంటూ బ్యానర్లు కేటీఆర్ గారూ.. త్వరగా కోలుకోవాలంటే ఈ చిత్రం చూడండి.. I finally get to say this 🥰 My Hindi debut film - GOODBYE!🤍 with @SrBachchan sir 🔥 @Neenagupta001 ma’am 🤍 #VikasBahl and a maaaaaad cool cast @pavailkgulati #SahilMehta#abhishek and so many such amazing actors and technicians .. 🔥❤️ Is releasing on October 7-2022 💃🏻💃🏻 pic.twitter.com/6HnxtA9891 — Rashmika Mandanna (@iamRashmika) July 23, 2022 చదవండి: జాన్వీకి తల్లి శ్రీదేవి చెప్పిన బ్యూటీ సీక్రెట్ ఇదే.. -
‘గుడ్బై’ చెప్పడం ఇష్టం లేదు : రష్మిక
నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగు, తమిళంలోనే కాకుండా హిందీలోనూ వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ఇప్పటికే ఆమె సిద్ధార్థ్ మల్హోత్రా తో కలిసిన నటించిన‘మిషన్ మజ్ను’ విడుదలకు సిద్దంగా ఉంది. త్వరలోనే మరో చిత్రం ‘గుడ్బై’ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని రష్మిక తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ ఫోటోని షేర్ చేసింది. (చదవండి: ద్యేవుడా.. ఆ హీరోయిన్ కింద పడితే సినిమా హిట్!) ‘గుడ్ బై' సినిమాకు గుడ్ బై చెప్పడం నాకిష్టం లేదు. రెండేళ్లుగా కోవిడ్తో పాటు ఏదీ కూడా మమ్మల్ని పార్టీ చేసుకోకుండా అడ్డుకోలేకపోయాయి. అమితాబ్ బచ్చన్ సార్తో కలిసి పనిచేసే అవకాశం దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రపంచంలో ఆయనే అత్యుత్తమ మనిషి. ఇంత మంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన డైరెక్టర్ వికాస్ బహల్కు కృతజ్ఞతలు. నన్ను ఎందుకు ఈ చిత్రంలో తీసుకున్నారో ఆ దేవుడికే తెలియాలి. మీరు గర్వపడేలా ఈ చిత్రంలో నటించానని అనుకుంటున్నాను. నా బేబీ ‘గుడ్బై’ని చూసేందుకు అందరు రెడీగా ఉండాలి.. దీని కోసం నేను వేచి ఉండలేకపోతున్నాను’అంటూ రష్మిక తన ఇన్స్టాలో రాసుకొచ్చింది. తండ్రీకూతుళ్ల బ్యాక్డ్రాప్లో రూపొందిన ఈ చిత్రానికి వికాస్ బాల్ దర్శకుడు. ఈ చిత్రం కూడా ఈ ఏడాదే విడుదల కానుంది View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
టైమ్ చూసి... హ్యాండిస్తున్నారు..!
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పోలింగ్ తేదీకి గడువు దగ్గరకొస్తున్న కొద్దీ, కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు పార్టీని మరింత బలహీన పరిచేలా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ మినహా మిగతా హస్తిన నేతలు ఎవరూ పట్టనట్లుగా వ్యవహరిస్తుండడంతో పార్టీ నేతలు ఒక్కొక్కరుగా గుడ్బై చెప్పేస్తున్నారు. పార్టీని వీడుతున్న నేతలను బుజ్జగించే చర్యలు ఏవీలేకపోవడం, పార్టీలో ప్రాధాన్యంపై ఎలాంటి హామీలు ఇవ్వకపోవడం, పార్టీ గెలిచే అవకాశాలపై నమ్మకంలేకపోవడంతో పార్టీ విధేయులే ఇతర పార్టీల్లోకి జారుకుంటున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, యూపీ ఇంఛార్జ్గా ప్రియాంకా గాంధీ బాధ్యతలు చేపట్టిన తర్వాత, పార్టీ పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తుందని భావించినా, ఇప్పటికే 20 మందికి పైగా కీలక నేతలు పార్టీని వీడడం తలనొప్పి వ్యవహారంలా మారింది. కేంద్ర మాజీ మంత్రి, పార్టీ అధిష్టానానికి సన్నిహితుడైన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన జితిన్ ప్రసాదతో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఎన్నికల షెడ్యూల్కు ముందే పార్టీని వీడగా, షెడ్యూల్ విడుదలయ్యాక పశ్చిమ యూపీలో కీలక ముస్లిం నేత, గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన ఇమ్రాన్ మసూద్ ఎస్పీలో చేరారు. తాజాగా స్టార్ క్యాంపెయినర్ జాబితా ప్రకటించిన మరుసటిరోజే మాజీ కేంద్రమంత్రి ఆర్పీఎన్ సింగ్ కాషాయ కండువా కప్పుకున్నారు. ఎన్నికల సమయంలో పేరున్న నేతలే కాకుండా, క్షేత్రస్థాయిలోనూ పార్టీని వదిలివెళ్లేవారిని ఆపలేకపోవడం పార్టీ అవకాశాలను దెబ్బతీస్తోంది. కాంగ్రెస్ను వీడిన కొందరు కీలక నేతలు వీరు.. -
అంతర్జాతీయ క్రికెట్కు డ్వయాన్ బ్రావో గుడ్బై
-
షూటింగ్స్ బంద్
ఇప్పటికే కరోనా కోరల్లో చిక్కుకుని పలువురు హిందీ స్టార్స్ క్వారంటైన్ లో టైమ్ గడుపుతున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఇటీవలే థియేటర్స్లో సినిమాల ప్రదర్శన నిలిచిపోయింది. దీంతో రిలీజ్కు దగ్గరైన సినిమాలు వాయిదా పడ్డాయి. తాజాగా సినిమా, టీవీ షూటింగ్స్ను కూడా నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ‘బ్రేక్ ది చైన్ ’ పేరుతో ఏప్రిల్ 14 సాయంత్రం నుంచి మే 1 ఉదయం వరకు లాక్డౌన్ విధించించి, కొత్త మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం వెల్లడించింది. దీంతో కోవిడ్ జాగ్రత్తల నడుమ జరుగుతున్న కొద్ది సినిమాల షూటింగ్స్ కూడా నిలిచిపోనున్నాయి. షారుక్ ఖాన్ ‘పఠాన్ ’, సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’, అమితాబ్బచ్చన్ – రష్మికల ‘గుడ్ బై’ , కార్తీక్ ఆర్యన్ ‘భూల్ భులయ్యా 2’ చిత్రాలతో పాటు ముంబయ్లో జరుగుతున్న ఇతర సినిమాల షూటింగ్స్కి కూడా బ్రేక్ పడింది. ‘‘మేం అన్ని రూల్స్ పాటిస్తున్నాం. అయినా షూటింగ్స్ కారణంగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుందని అనుకోవడం లేదు. త్వరలో ప్రభుత్వాన్ని కలిసి షూటింగ్స్కు అనుమతి ఇవ్వాల్సిందిగా విన్నవించుకుంటాం’’ అని ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ అధ్యక్షుడు బీఎన్ తివారీ పేర్కొన్నారు. -
అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు
క్రైస్ట్చర్చ్: ఒకవైపు తరచూ గాయాల బారిన పడుతుండటం... మరోవైపు కాబోయే భార్యతో అమెరికాలో స్థిరపడే అవకాశం రావడం... వెరసి న్యూజిలాండ్ ఆల్రౌండర్ కోరె అండర్సన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకాలని... క్లబ్ క్రికెట్లో కొనసాగాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు అమెరికాలోని మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ)తో అండర్సన్ మూడేళ్లపాటు ఒప్పందం చేసుకున్నాడు. న్యూజిలాండ్ తరఫున 13 టెస్టులు, 49 వన్డేలు, 31 టి20 మ్యాచ్ల్లో పాల్గొన్న అండర్సన్ మొత్తం 2,277 పరుగులు చేశాడు. 90 వికెట్లు తీశాడు. ‘ఈ నిర్ణయాన్ని సులువుగా తీసుకోలేదు. రాబోయే కాలంలో ఏం చేయాలనుకుంటున్నానో ఇప్పుడే నిర్ణయించుకున్నాను. నా కాబోయే భార్య మేరీ మార్గరెట్ అమెరికాలో పుట్టి పెరిగింది. నా కోసం ఆమె ఎన్నో త్యాగాలు చేసింది. మేజర్ లీగ్ క్రికెట్ రూపంలో అమెరికాలో ఉండేందుకు, వీలైతే అక్కడే స్థిరపడేందుకు నాకు అవకాశం లభించింది. దాంతో భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని 29 ఏళ్ల అండర్సన్ తెలిపాడు. 2014 జనవరి 1న విండీస్పై అండర్సన్ 36 బంతుల్లో సెంచరీ సాధించి వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్గా రికార్డు నెలకొల్పాడు. 2015లో వెస్టిండీస్పైనే డివిలియర్స్ 31 బంతుల్లోనే శతకం బాది ఈ రికార్డును బద్దలు కొట్టాడు. -
సుశాంత్ సోదరి శ్వేత ఆకస్మిక నిర్ణయం
సాక్షి, ముంబై: దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోదరుడు సుశాంత్ మరణం తరువాత సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ వస్తున్న ఆమె సడన్ గా సోషల్ మీడియా నుంచి నిష్క్రమించారు. ట్విటర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను బుధవారం తొలగించారు. జస్టిస్ ఫర్ సుశాంత్ అంటూ పోరాడుతున్న శ్వేతా తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం వెనుక కారణాలు ఇంకా వెలుగులోకి రాలేదు. సుశాంత్ తమను వీడి నేటితో (అక్టోబర్14) నాలుగు నెలల అయిన సందర్భంగా "నిజమైన ప్రేరణ" అంటూ ఒక వీడియోను కూడా ఆమె షేర్ చేశారు. ఇంతలోనే ఆమె తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. అయితే ఫేస్ బుక్ అకౌంట్ మాత్రం యాక్టివ్ గానే ఉంది. మరోవైపు సుశాంత్ అనుమానాస్పద మరణం కేసులో రాబ్తా డైరెక్టర్ దినేష్ విజన్ కార్యాలయం, ఇంటిపైనా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం దాడులు చేసింది. మనీలాండరింగ్ కోణంపై దర్యాప్తులో భాగంగా దినేష్ విజన్తో సంబంధం ఉన్న నాలుగు చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. 2016 లో రాబ్తా మూవీకిగాను సుశాంత్కు చేసిన చెల్లింపులపై దర్యాప్తు చేస్తోంది. -
కాంగ్రెస్కు నటి కుష్బూ గుడ్బై
చెన్నై : సీనియర్ నటి కుష్బూ ఆదివారం రాత్రి కాంగ్రెస్కు గుడ్బై చెప్పారు. రేపు ఉదయం ఆమె బీజేపీలో చేరనున్నారు. కాగా కుష్బూ కాంగ్రెస్ పార్టీలో జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న సమయంలో కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా పాలసీని సమర్థిస్తూ ట్వీట్ చేశారు. కుష్బూ చేసిన ట్వీట్పై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయింది.అప్పటి నుంచి కాంగ్రెస్కు దూరంగా ఉంటున్న కుష్బూ బీజేపీలో చేరబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా కుష్బూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. కాంగ్రెస్కు రాజీనామా చేసిన కుష్బూ రేపు మధ్యాహ్నం బీజేపీలో చేరబోతున్నారు. భారత పౌరురాలిగా ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాలను ప్రశంసించించే హాక్కు తనకు ఉందని కుష్బూ తెలిపారు. -
బీబీసీకి బాయ్కాట్ గుడ్బై
లండన్: బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ)తో 14 ఏళ్ల అనుబంధాన్ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జెఫ్రీ బాయ్కాట్ తెంచుకున్నాడు. ‘బీబీసీ టెస్టు మ్యాచ్ ప్రత్యేక కామెంటరీ బృందం’ నుంచి 79 ఏళ్ల బాయ్కాట్తప్పుకున్నాడు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో నా ఆరోగ్యం గురించి వాస్తవికంగా, నిజాయితీగా ఆలోచించాలి. కరోనా కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నా. ఇటీవలే బైపాస్ సర్జరీ కూడా జరిగింది. 79 ఏళ్ల వయస్సులో ఇంకా వ్యాఖ్యాతగా వ్యవహరించడం కష్టమే’ అని బాయ్కాట్ తెలిపాడు. -
అందం అల్విదా చెప్పింది
ఆటతో పాటు అందం కూడా కలిసి నడిచే మహిళల టెన్నిస్లో ఒక శకం ముగిసింది. 16 ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను అలరించిన రష్యన్ బ్యూటీ మారియా షరపోవా టెన్నిస్కు గుడ్బై చెప్పింది. ఐదు గ్రాండ్స్లామ్ టైటిల్స్ నెగ్గినా... వరల్డ్ నంబర్వన్ ర్యాంక్ సాధించినా... తన అందంతోనే ఎక్కువగా ఆకర్షించిన ఈ బుట్టబొమ్మ తన రాకెట్ను పక్కన పెడుతున్నట్లు ప్రకటించింది. తన పేరుతో పెట్టిన క్యాండీ ‘షుగర్పోవా’లాగే ఎన్నో తీపి జ్ఞాపకాలను పదిలపర్చుకొని వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించింది. పారిస్: రష్యా టెన్నిస్ స్టార్, మాజీ వరల్డ్ నంబర్వన్ మారియా షరపోవా ఆట నుంచి తప్పుకుంది. ‘టెన్నిస్–నేను గుడ్బై చెబుతున్నా’ అంటూ ప్రకటించింది. నాలుగు వేర్వేరు గ్రాండ్స్లామ్లను నెగ్గిన అతి కొద్ది మంది ప్లేయర్లలో ఆమె కూడా ఉండటం విశేషం. 32 ఏళ్ల షరపోవా కొన్నేళ్లుగా వరుస గాయాలతో సతమతమవుతోంది. కోలుకొని అప్పుడప్పుడూ బరిలోకి దిగుతున్నా ఫలితాలు అన్నీ ప్రతికూలంగా వచ్చాయి. ఒకప్పుడు వరల్డ్ నంబర్వన్గా నిలిచిన ఆమె ఇప్పుడు 373వ ర్యాంక్కు పడిపోయింది. దాంతో ఆట నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుంది. ఒకప్పటి సోవియట్ యూనియన్లో పుట్టినా... ఏడేళ్ల వయసులోనే ఆమె కుటుంబం అమెరికాకు వలస వెళ్లిపోయింది. ఆటలో మాత్రం రష్యాకు ప్రాతినిధ్యం వహించడాన్ని షరపోవా కొనసాగించింది. 2004 వింబుల్డన్ ఫైనల్లో అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్ను ఓడించి 17 ఏళ్ల వయసులోనే తొలి గ్రాండ్స్లామ్ టైటిల్ నెగ్గి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఈ భామ ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆమె చక్కటి ఆటకు అందం తోడై అత్యంత పాపులర్ ప్లేయర్గా షరపోవాకు గుర్తింపు తెచ్చి పెట్టాయి. వరుసగా 11 ఏళ్ల పాటు అత్యధిక ఆర్జన ఉన్న మహిళా క్రీడాకారిణిగా ‘ఫోర్బ్స్’ జాబితాలో నిలిచింది. 28 ఏళ్ల ఆట, 5 గ్రాండ్స్లామ్ల తర్వాత గుడ్బై చెబుతున్నా. వేరే రంగంలో పోటీ పడి మరింత ఎత్తుకు ఎదిగే సత్తా నాలో ఇంకా ఉంది. నేను నా జీవితాన్ని టెన్నిస్కు ఇస్తే టెన్నిస్ నాకు జీవితాన్ని ఇచ్చింది. ఎంతగా శ్రమిస్తే అంత గొప్ప ఫలితాలు సాధించవచ్చని నేను నమ్మా. గతం గురించో, భవిష్యత్తు గురించో అతిగా ఆలోచించకుండా వర్తమానంలో కష్టపడటం వల్లే ఈ విజయాలు దక్కాయనేది నా భావన. టెన్నిస్ కోర్టుకు సంబంధించి అన్ని జ్ఞాపకాలూ పదిలంగా నా మనసులో ఉంటాయి. అవి కోల్పోతున్న బాధ నాకూ ఉంది. టెన్నిస్ అనేది నాకు శిఖరంలాంటిది. అక్కడికి చేరే క్రమంలో ఎన్నో ఎత్తుపల్లాలు చవి చూసినా ఒక్కసారిగా పైకి ఎక్కిన తర్వాత వచ్చే ఆనందమే వేరు. ఇక ముందు కూడా జీవితంలో కొత్త లక్ష్యాలు పెట్టుకొని శ్రమిస్తా. మరిన్ని విజయాలు అందుకున్నా. –వీడ్కోలు సందేశంలో షరపోవా మొత్తం గెలిచిన మ్యాచ్లు: 645 మొత్తం ఓడిన మ్యాచ్లు: 171 కెరీర్లో సాధించిన ప్రైజ్మనీ: 3,87,77,962 డాలర్లు (రూ. 277 కోట్ల 76 లక్షలు) షరపోవా సాధించిన గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్స్: 5 (2004–వింబుల్డన్; యూఎస్ ఓపెన్–2006; ఆస్ట్రేలియన్ ఓపెన్–2008; ఫ్రెంచ్ ఓపెన్–2012, 2014) కెరీర్లో నెగ్గిన సింగిల్స్ టైటిల్స్ సంఖ్య: 36 అత్యుత్తమ ర్యాంకింగ్ (ఆగస్టు 22, 2005): 1 ప్రొఫెషనల్గా మారిన ఏడాది: 2001 ప్రస్తుత ర్యాంక్: 373 కెరీర్లో నంబర్వన్ ర్యాంక్లో కొనసాగిన వారాలు: 21 -
టీడీపీకి కావ్య కృష్ణారెడ్డి గుడ్బై
కావలి: టీడీపీ సీనియర్ నాయకుడు కావ్య కృష్ణారెడ్డి(దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి) బుధవారం ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. కావలిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీలో తనకు తీవ్ర అవమానాలు జరిగాయని, కానీ వాటిని తాను ఏ రోజూ బయట చెప్పలేదన్నారు. తన ఆత్మీయులు ఉదయగిరి, కావలి నియోజకవర్గాల్లో ఉన్నారని, వారందరి అభిప్రాయం మేరకు తాను వైఎస్సార్సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. గురువారం నెల్లూరుకు రానున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతానని ప్రకటించారు. టీడీపీ ఉదయగిరి అసెంబ్లీ అభ్యర్థి బొల్లినేని వెంకటరామారావును ఓడించి తీరుతానని, ఉదయగిరి ఎమ్మెల్యేగా మేకపాటి చంద్రశేఖర్రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అలాగే కావలి ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డిని చారిత్రాత్మకమైన మెజార్టీతో గెలిపించడానికి కృషి చేస్తానని అన్నారు. ప్రధానంగా నెల్లూరు ఎంపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. కేవలం ఆరు రోజులు మాత్రమే ఉండడంతో ఉదయగిరి, కావలి నియోజకవర్గాల్లో ప్రతి గ్రామంలో, వార్డుల్లో తన ఆత్మీయులు స్వచ్ఛందంగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడి ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఇటీవల తన తండ్రి మరణించినందున తాను ప్రతి ఇంటికి రాలేకపోతున్నానని, కానీ ప్రతి గ్రామం, వార్డులకు వచ్చి వైఎస్సార్సీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తానని తెలిపారు. తన సొంత మండలమైన జలదంకిలో ఆదాల, మేకపాటిలకు భారీ మెజారిటీ తీసుకొస్తానని తెలిపారు. ఎంపీ వేమిరెడ్డి చర్చలు ఇటీవల కావ్య కృష్ణారెడ్డి తండ్రి మరణించిన నేపథ్యంలో ఆయనను పరామర్శించడానికి కావలిలోని కృష్ణారెడ్డి నివాసానికి వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనతో వేమిరెడ్డి రాజకీయ చర్చలు జరిపారు. అంతకుముందు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, నెల్లూరు ఎంపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్రెడ్డి, ఉదయగిరి అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర్రెడ్డి చర్చలు జరిపారు. -
ప్రపంచకప్ తర్వాత... వన్డేలకు తాహిర్ గుడ్బై
జొహన్నెస్బర్గ్: వచ్చే వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ వన్డే క్రికెట్కు వీడ్కోలు పలికే క్రికెటర్ల జాబితాలో మరో పేరు చేరింది. ఇప్పటికే వెస్టిండీస్ డాషింగ్ బ్యాట్స్మన్ క్రిస్ గేల్ వన్డే వరల్డ్ కప్ తర్వాత ఈ ఫార్మాట్కు గుడ్బై చెబుతానని ప్రకటించగా... తాజాగా దక్షిణాఫ్రికా వెటరన్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ కూడా రిటైర్మెంట్ బాటలో నడవనున్నాడు. ఈనెల 27వ తేదీన 40 ఏళ్లు పూర్తి చేసుకోనున్న తాహిర్ ఇప్పటికి 95 వన్డేలు ఆడి 156 వికెట్లు పడగొట్టాడు. వన్డే వరల్డ్ కప్ తర్వాత తాను టి20 ఫార్మాట్లో కొనసాగుతానని తెలిపాడు. పాకిస్తాన్లోని లాహోర్లో జన్మించి దక్షిణాఫ్రికాలో స్థిరపడిన తాహిర్ 2011, 2015 వన్డే వరల్డ్ కప్లలో... 2014, 2016 టి20 ప్రపంచకప్లలో దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2016లో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో తాహిర్ 45 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టి వన్డేల్లో ఈ ఘనత సాధించిన తొలి దక్షిణాఫ్రికా బౌలర్గా గుర్తింపు పొందాడు. అంతేకాకుండా దక్షిణాఫ్రికా తరఫున వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్గా తాహిర్ (58 వన్డేల్లో) ఘనత వహించాడు. -
ప్రపంచకప్ తర్వాత.... వన్డేలకు గేల్ గుడ్బై
జమైకా: ఈ ఏడాది జరుగనున్న ప్రపంచ కప్ తర్వాత వన్డేలకు వీడ్కోలు పలకనున్నట్లు వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్మన్ క్రిస్ గేల్ ప్రకటించాడు. 39 ఏళ్ల గేల్... 1999 సెప్టెంబరులో భారత్పై టొరంటోలో జరిగిన వన్డే ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన (2015 ప్రపంచ కప్లో జింబాబ్వేపై) ఏకైక వెస్టిండీస్ క్రికెటర్ గేల్ కావడం విశేషం. ఈ ఫార్మాట్లో బ్రియాన్ లారా (10,405) తర్వాత అత్యధిక పరుగులు చేసిన విండీస్ బ్యాట్స్మన్ గేలే. దాదాపు 20 ఏళ్ల కెరీర్ ఉన్నా... బోర్డుతో విభేదాలు, ప్రపంచ వ్యాప్తంగా లెక్కకు మిక్కిలి టి20 లీగ్ల్లో పాల్గొంటూ సొంత జట్టుకు తక్కువగా ప్రాతినిధ్యం వహించాడు. పొట్టి ఫార్మాట్లో సుడిగాలి ఇన్నింగ్స్లతో అందరికీ ఇష్టుడయ్యాడు. 20వ శతాబ్దంలో అరంగేట్రం చేసి ఇప్పటికీ అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న ఇద్దరిలో గేల్ ఒకడు. మరొకరు పాకిస్తాన్ బ్యాట్స్మన్ షోయబ్ మాలిక్. -
ఆ ఐకానిక్ కారుకు ‘టాటా
సాక్షి, ముంబై: లక్ష రూపాయల కారుగా పేరొందిన భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తీసుకొచ్చిన నానో కారు ప్రస్థానానికి త్వరలో ఫుల్ స్టాప్ పడనుంది. రతన్ టాటా కలల కారు నానోకు టాటా మోటార్స్ గుడ్ బై చెప్పనుంది. వాహనాల భద్రతకు సంబంధించి ప్రభుత్వం తీసుకొస్తున్న భద్రత, కాలుష్య నియంత్రణపై తాజా నిబంధనల ప్రకారం ఈ కారును రూపొందించలేమన్న సంకేతాలను కంపెనీ గురువారం వెల్లడించింది. 2020 ఏప్రిల్ నాటికి ఈ కారు తయారీని పూర్తిగా నిలిపేయనున్నట్లు కంపెనీ ప్రతినిధి పరోక్షంగా ప్రకటించారు. బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా నానోను తీర్చిదిద్దడానికి తాము మరిన్ని పెట్టుబడులు పెట్టే పరిస్థితిలో లేమని టాటా మోటార్స్ ప్యాసెంజర్ వెహికిల్స్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ మయాంక్ పరీక్ చెప్పారు. నానోతోపాటు మరికొన్ని టాటా ప్యాసెంజర్ వెహికిల్స్ తయారీని కూడా నిలిపేయాలని భావిస్తున్నట్లు పరీక్ చెప్పారు. దేశంలోని మధ్య తరగతి ప్రజలకోసం, ఎంట్రీ లెవల్ కారుగా బడ్జెట్ ధరలో లాంచ్ చేసిన నానో కారు అమ్మకాలు, ఉత్పత్తికి నిలిపివేయనున్నామని మయాంక్ వెల్లడించారు. ఈ కారును సనద్ ప్లాంట్లో తయారు చేస్తున్నాం...జనవరిలో కొత్తగా కొన్ని భద్రతా నిబంధనలు వచ్చాయి, ఏప్రిల్లో మరికొన్ని రానున్నాయి. అలాగే అక్టోబర్లో మరికొన్ని..ఇలా 2020 ఏప్రిల్ నాటికి బీఎస్-6 ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నానో కార్ల ఉత్పత్తిని కొనసాగించలేమని పేర్కొన్నారు. ఇప్పటికే విక్రయాలు దారుణంగా పడిపోయిన నానో కారు ఆవిర్భావం 2009 సంవత్సరంలో జరిగింది. రూ.లక్ష ధరతో ఈ కారు మార్కెట్లోకి వచ్చినా వినియోగదారులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో దాదాపు పదేళ్లలోనే ఈ కారు కథ కంచికి చేరనుంది. మరోవైపు రతన్ టాటా కలల ప్రాజెక్టు ‘నానో’ కారు మూలంగా పైసా లాభం రాకపోగా, కంపెనీకి గుదిబండగా మారిందని, వేయికోట్ల రూపాయల వరకు నష్టపోయామని టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. -
ఎన్డీఏకు కుష్వాహా గుడ్బై
న్యూఢిల్లీ: రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(ఆర్ఎల్ఎస్పీ) అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా అధికార ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్నారు. కేంద్ర మానవ అభివృద్ధి వనరుల సహాయ మంత్రిగా ఉన్న కుష్వాహా సోమవారం తన పదవికి రాజీనామా చేయడంతోపాటు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ నుంచి వైదొలుతున్నట్లు ప్రకటించారు. మంత్రి వర్గాన్ని ప్రధాని మోదీ రబ్బర్ స్టాంపుగా మార్చేశారనీ, వెనుకబడిన వర్గాలను నిర్లక్ష్యం చేశారని తన రాజీనామా లేఖలో ఆరోపించారు. తమ పార్టీ బిహార్లోని ఆర్జేడీ, కాంగ్రెస్లతో కూడిన ప్రతిపక్ష కూటమిలో చేరేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభానికి ఒక రోజు ముందు ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఊహించిన పరిణామమే వచ్చే లోక్సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై బీజేపీతో విబేధాలు తలెత్తిన నేపథ్యంలో ఆర్ఎల్ఎస్పీ అధ్యక్షుడు కుష్వాహా ఎన్డీఏ నుంచి వైదొలుగుతారంటూ కొంతకాలంగా వస్తున్న వార్తలు నిజమయ్యాయి. సోమవారం కుష్వాహా తన రాజీనామా లేఖను మీడియాకు విడుదల చేశారు. ‘ప్రధాని మోదీ నాయకత్వంలో నిర్లక్ష్యానికి, మోసానికి గురైనట్లు భావిస్తున్నా. పేదల సంక్షేమం కోసం పనిచేయడం మాని, రాజకీయ విరోధులను అణచి వేయడమే ఈ ప్రభుత్వం పనిగా పెట్టుకుంది. ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ అజెండాను అమలు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో బిహార్లో ఒక్క సీటు కూడా ఎన్డీఏకు దక్కదు’ అని అందులో పేర్కొన్నారు. ఆర్ఎల్ఎస్పీకి ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండగా ఇప్పటికే ఎమ్మెల్యేలిద్దరూ పార్టీని వీడారు. కుష్వాహా ప్రభావం ఎంత? కుష్వాహా చేసిన రాజీనామా ఉత్తరప్రదేశ్, బిహార్ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న కోయిరీ(కుష్వాహా) కులానికి చెందిన నేత కుష్వాహా. బీసీ వర్గమైన కోయిరీలు ఈ రెండు రాష్ట్రాలతోపాటు మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ ఉన్నారు. బిహార్లో ఆర్జేడీ నేతృత్వంలోని కూటమిలో ఆర్ఎల్ఎస్పీ చేరి, తర్వాత బీజేపీ వ్యతిరేక జాతీయ కూటమిలో చేరితే హిందీ ప్రాంతాల్లోని కోయిరీలపై ఎంత వరకు ప్రభావం ఉంటుందో చెప్పడం కష్టం. అదే బాటలో మరో పార్టీ! ఎన్డీఏలోని మరో పక్షం అసోం గణపరిషత్ (ఏజీపీ) నడిచే అవకాశముంది. పౌరసత్వ సవ రణ బిల్లును పార్లమెంట్ ఆమోదిస్తే ఎన్డీఏ నుంచి వైదొలుగుతామంటూ హెచ్చరించింది. -
కాంగ్రెస్కు మాజీమంత్రి గుడ్బై
సాక్షి, వికారాబాద్: తన అనుచరులు, అభిమా నుల ఆకాంక్షల మేరకే తాను స్వతంత్ర అభ్య ర్థిగా బరిలోకి దిగుతున్న ట్లు మాజీ మంత్రి డాక్టర్ ఎ.చంద్రశేఖర్ వెల్లడించారు. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బుధవారం నామినేషన్ దాఖలు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలం గాణ ఉద్యమంలో రంగారెడ్డి జిల్లాలో తానే మొట్టమొదటగా పాల్గొ న్నానని తెలిపారు. రాష్ట్ర సాధన కోసం మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశానన్నారు. తెలంగాణ ఇచ్చిన ఘనత ఏఐసీసీ అధి నేత్రి సోనియాగాంధీనేనని, ఆమెకు ఢిల్లీ వెళ్లి కృతజ్ఞతలు కూడా తెలిపాన న్నారు. వికారాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్ రాకపోవడం తో నిరాశ చెంది ఇండిపెండెంట్గా పోటీకి దిగుతున్నానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా సమర్పించినట్లు తెలిపారు. -
ఫార్ములావన్కు రోస్బర్గ్ గుడ్బై
వియన్నా: ఈ ఏడాది ఫార్ములావన్ (ఎఫ్1) రేసింగ్ ప్రపంచ చాంపియన్ నికో రోస్బర్గ్ శుక్రవారం సంచలన నిర్ణయం ప్రకటించాడు. తన కెరీర్కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు. గత ఆదివారమే తొలిసారి ఎఫ్1 ప్రపంచ చాంపియన్గా అవతరించిన 31 ఏళ్ల రోస్బర్గ్ మెర్సిడెస్ జట్టు తరఫున బరిలోకి దిగాడు. జర్మనీకి చెందిన రోస్బర్గ్ పదేళ్లపాటు ఫార్ములావన్లో ఉన్నాడు. కెరీర్లో 206 రేసుల్లో పాల్గొన్న అతను 23 రేసుల్లో విజేతగా నిలిచాడు. 57 రేసుల్లో టాప్-3లో స్థానాన్ని పొందాడు. 2006లో ఎఫ్1లో బరిలోకి దిగిన రోస్బర్గ్కు తొలి విజయం మాత్రం 2012లో చైనా గ్రాండ్ప్రిలో లభించింది. -
విశాలాక్షికి కన్నీటి వీడ్కోలు
కరుణ సంతాపం సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే సీనియర్ మహిళా నేత, పార్టీ నిర్వాహక కార్యదర్శి విశాలాక్షి నెడుంజెలియన్(93) భౌతిక కాయానికి మంగళవారం అంత్యక్రియలు జరిగారుు. అన్నాడీ వర్గాలు, ఆప్తులు ఆమెకు కన్నీటి వీడ్కోలు పలికారు. సీనియర్ నేతగా ఉన్న దివంగత వీ ఆర్ నెడుంజెలియన్ సతీమణి విశాలాక్షి అన్న విషయం అందరికీ తెలిసిందే. నెడుంజెలియన్ మరణానంతరం అన్నాడీఎంకేలో కీలక పాత్ర ను ఆమె పోషిస్తూ వచ్చారు. పార్టీ నిర్వాహక కార్యదర్శిగా వ్యవహరిస్తూ వచ్చిన ఆమె సోమవారం అనారోగ్యంతో మరణించారు. ఆమె మృతి సమాచారంతో అన్నాడీఎంకే వర్గాలు చెన్నై ఆళ్వార్ పేటలోని ఇంటికి వెళ్లి ఆమె భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఇక, సీఎం జయలలిత స్వయంగా తనను ఫోన్ ద్వారా పరామర్శించినట్టుగా విశాలక్షి కుమారుడు మదివానన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆమె మరణ సమాచారంతో డీఎంకే అధినేత ఎం కరుణానిధి , కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ సంతాపం తెలియజేశారు. నెడుంజెలియన్ సేవల్ని వివరిస్తూ, విశాలక్ష్మి నెడుంజెలియన్ ఆత్మకు శాంతి కల్గాలని ప్రార్థించారు. ఇక, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్, అధికార ప్రతినిధి పొన్నయ్య ఆమె ఇంటి వద్దే ఉండి, అంత్యక్రియలకు తగ్గ ఏర్పాట్లను పర్యవేక్షించారని చెప్పవచ్చు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ఆళ్వార్పేట సీతమ్మ కాలనీలోని ఇంటి నుంచి విశాలక్షి భౌతిక కాయాన్ని ఊరేగింపుగా బీసెంట్నగర్ స్మశాన వాటికకు తీసుకొచ్చారు. పెద్ద సంఖ్యలో అన్నాడీఎంకే వర్గాలు, కుటుంబీకులు, ఆప్తులు తరలివచ్చారు. అక్కడి విద్యుత్ దహన వాటికలో ఆమె భౌతిక కాయానికి అంత్యక్రియలు జరిగారుు. -
గుండెను పిండేస్తున్న విషాద చిత్రం
న్యూయార్క్: వివాహం చేసుకునే సమయంలోనే జీవితాంతం కలిసుండాలని ఆ నూతన దంపతులతో ప్రమాణం చేయిస్తారు. విడాకులప్పుడు.. అనూహ్య మరణం సమయంలో మాత్రమే ఈ ప్రమాణానికి ప్రాణం పోతుంది. ఆ సమయంలో కూడా ఆ రెండు గుండెల్లో ఏదో ఒకటి నీరుగారుస్తుంది. కానీ, పైన పేర్కొన్న రెండు సంఘటనలు లేకుండానే దాదాపు దశాబ్దాలుగా కలిసుంటున్న భార్యాభర్తలు విధి ఆడిన వింత ఆటతో దూరం కావాల్సి వస్తే.. ఏక్షణం కన్నుమూస్తారో తెలియని వయసుకొచ్చేసరికి వారిద్దరిని వేర్వేరు చేసి ఉంచాల్సి వస్తే.. ఆ వృద్ధ దంపతుల బాధను ఎవరైనా అంచనా వేయగలరా.. ఈ సంఘటన లండన్ లో చోటుచేసుకుంది. వాల్ఫ్రమ్ గోట్స్ చాక్(83), అనిత(81) అనే వాళ్లు ఓ వృద్ధ దంపతులు. వారిద్దరు జర్మనీలో 1954లో కలుసుకున్నారు. అనంతరం వివాహం చేసుకున్నారు. అక్కడి నుంచి కెనడాకు వలస వెళ్లారు. దాదాపు 60 ఏళ్లుగా కలిసి ఉంటున్న ఆ భార్యభర్తల కడసారి జీవితంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. వాల్ఫ్రర్ కు మతి మరుపు జబ్బు వచ్చింది. పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. దీంతో అతడిని తన భార్య నుంచి వేరు చేసి వేరే ప్రత్యేక నర్సింగ్ హోమ్ కు తరలించి చికిత్స అందించాల్సి వచ్చింది. భార్య అనితకు క్యాన్సర్ లాంటి జబ్బు చేసింది. దీంతో కొద్ది రోజుల తర్వాత ఆమెను కూడా వేరే ఆస్పత్రిలో చేర్పించాల్సిన పనిలేదు. ఈ మధ్య ఓ అరగంటపాటు వారిద్దరిని కలిపేందుకు వాల్ప్రమ్ ఉంటున్న కేర్ హోమ్ కు తీసుకెళ్లగా వారిద్దరి మధ్య భావోద్వేగమైన క్షణాలు ఆవిష్కృతమయ్యాయి. వారిద్దరు ఒకరి చేతిలో ఒకరి చేయి వేసుకొని కంటతడిపెట్టారు. దానికి సంబంధించిన ఫొటోను వారి మనవరాలు తీసి ఆన్ లైన్లో పెట్టగా అంతర్జాతీయ దృష్టి పడింది. ప్రస్తుతం వారిద్దరిని ఒకే చోట చేర్చి వైద్యం ఇప్పించే అవకాశం ఉన్న చోటుకోసం వెతుకుతున్నారు. -
'ఇదే నా చివరి క్రికెట్ సిరీస్'
-
ఆటకు దిల్షాన్ టాటా
ఆస్ట్రేలియాతోనే ఆఖరి వన్డే, టి20లు మూడేళ్ల క్రితమే టెస్టులకు వీడ్కోలు కొలంబో: శ్రీలంక స్టార్ ఓపెనర్ తిలకరత్నే దిల్షాన్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు వీడ్కోలు పలకనున్నాడు. ఇదివరకే టెస్టు కెరీర్కు బైబై చెప్పిన 39 ఏళ్ల లంక బ్యాట్స్మన్ ఇప్పుడు పరిమిత ఓవర్ల క్రికెట్కూ రిటైర్మెంట్ ప్రకటించినట్లు లంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) తెలిపింది. దంబుల్లాలో ఆస్ట్రేలియాతో ఈ నెల 28న జరిగే మూడే వన్డేనే అతని కెరీర్లో ఆఖరి 50 ఓవర్ల మ్యాచ్. నాలుగు, ఐదు వన్డేలు ఆడడు. అనంతరం వచ్చే నెల 6, 9 తేదీల్లో ఆస్ట్రేలియాతో రెండు టి20మ్యాచ్లు జరుగుతాయి. 9న జరిగే రెండో టి20తో దిల్షాన్ 17 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్ ముగియనుంది. 1999లో జింబాబ్వేలో లంక పర్యటనతో అతను టెస్టు, వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఈ ఆదివారం అతను ఆడే చివరి వన్డే తన కెరీర్లో 330వ మ్యాచ్. ఇప్పటివరకు 302 ఇన్నింగ్స్లలో దిల్షాన్ 39.26 సగటుతో 10, 248 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు, 47 అర్ధసెంచరీలున్నాయి. అత్యధిక స్కోరు 161 నాటౌట్. తన ఆఫ్ బ్రేక్ బౌలింగ్తో వన్డేల్లో 106 వికెట్లు కూడా పడగొట్టాడు. ఇక టి20 కెరీర్లో 78 మ్యాచ్ల్లో 77 ఇన్నింగ్స్లాడిన దిల్షాన్ 28.98 సగటుతో 1884 పరుగులు చేశాడు. ఒక సెంచరీతో పాటు 13 అర్ధసెంచరీలు సాధించాడు. బౌలింగ్లో ఏడు వికెట్లు తీశాడు. మూడేళ్ల క్రితం 2013లో టెస్టుల నుంచి తప్పుకున్న ఈ లంక ఓపెనర్ 87 మ్యాచ్లాడాడు. 145 ఇన్నింగ్స్లో 40.98 సగటుతో 5492 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 193 కాగా మొత్తం 16 సెంచరీలు, 23 అర్ధసెంచరీలు సాధించాడు. -
ఘనంగా స్వాగతం.. సాదరంగా వీడ్కోలు
విమానాశ్రయానికి తరలివచ్చిన గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, ప్రముఖులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మోదీ హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి వచ్చారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, మేయర్ రామ్మోహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ, డీజీపీ అనురాగ్శర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఆ పార్టీ నేతలు జి.కిషన్రెడ్డి,నాగం జనార్దన్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, బద్దం బాల్రెడ్డి, కృష్ణంరాజు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్... అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మండ లి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్యేలు జి.సాయన్న, తీగల కృష్ణారెడ్డి, మాగంటి గోపీనాథ్, వివేక్ తదితరులను ప్రధానికి పరిచయం చేశారు. అనంతరం గవర్నర్, కేసీఆర్, వెంకయ్యనాయుడు, కె.లక్ష్మణ్తో కలిసి గజ్వేల్కు వెళ్లేం దుకు రక్షణ శాఖ హెలికాప్టర్ వరకు వె ళ్లారు. గజ్వేల్లో మిషన్ భగీరథ కార్యక్రమంతోపాటు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం ప్రధాని మోదీ సాయంత్రం తిరిగి బేగంపేట ఎయిర్పోర్టుకు వచ్చారు. అక్కడ్నుంచి ఎల్బీ స్టేడియంలో బీజేపీ మహా సమ్మేళనం కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆ పార్టీ నాయకులు, కేంద్ర మంత్రులతో కలిసి వెళ్లారు. బీజేపీ మహా సమ్మేళనం అనంతరం రాష్ట్ర పర్యటనను ముగించుకొని రాత్రి 7.45 గంటల ప్రాంతంలో వాయుసేన విమానంలో ప్రధాని ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్తోపాటు వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ, మధుసూదనాచారి, నేతి విద్యాసాగర్, బొంతు రామ్మోహన్ తదితరులు ప్రధానికి ఘనంగా వీడ్కోలు పలికారు. -
ఫేస్బుక్ మరో సంచలన నిర్ణయం
వాషింగ్టన్ : సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం ఫేస్ బుక్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక ఎఫ్ బీఎక్స్ సర్వీసులను ఉపసంహరించు కున్నట్టు ఈ మెయిల్ ద్వారా తెలిపింది. డెస్క్ టాప్ ప్రకటనలకు గుడ్ బై చెప్పినట్టు మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ మాట్ ఇదెమా తెలిపారు. వ్యాపారమంతా అరచేతిలోనే అన్నట్టుగా మారడంతో ఫేస్ బుక్ డెస్క్ టాప్ ప్రకటనలను రద్దుచేసింది. తమ సేవలను మొబైల్ ద్వారా అందించే వ్యూహంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ రంగానికి పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫేస్ బుక్ వెల్లడించింది. 2012లో లాంచ్ చేసిన ఎఫ్ బీఎక్స్ ద్వారా డెస్క్టాప్ ప్రకటనలను కొనుగోలుకు విక్రయదారులకు అనుమతిస్తుంది. ప్రభావవంతమైన మార్కెటింగ్ ప్రచారాల్లో మొబైల్ అద్భుతమైన ఫలితాలను సాధిస్తోందని కంపెనీ తెలిపింది. డైనమిక్ ప్రకటనలు కస్టమ్ ఆడియన్స్ కోసం మొబైల్ ప్రకటనల వైపు మళ్లనున్నట్టు పేర్కొంది. ముఖ్యంగా పెరుగుతున్న మొబైల్ ఆదరణ నేపథ్యంలో విక్రయదారుల ప్రకటనలకు సమర్థవంతంగా ఫార్మాట్లను అందించడంలో నూతన ఆవిష్కరణలకు వేదిక కావాలనే వ్యూహంలో భాగమే ఈ చర్య అని స్పష్టం చేసింది. కాగా తన వ్యాపారాన్ని మరింత విస్తరించుకునే క్రమంలో తన ఆడియన్స్ నెట్ వర్క్ ప్లాట్ ఫాం ద్వారా వీడియో సెల్లింగ్ పద్ధతిని ఫేస్ బుక్ ఇప్పటికే మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. -
ఆ అవతారం ఇక చాలించా...
ముంబై: విలక్షణ నటుడు, బాలీవుడ్ హీరో రణదీప్ హుడా సరభ్ జిత్ సింగ్ అవతారాన్ని ఇక చాలించాడట.. ఈ విషయాన్ని స్వయంగా రణదీప్ ట్విట్టర్ లో షేర్ చేశాడు. తను నటిస్తున్నబయోపిక్ 'సరభ్ జిత్' లో సరబ్జిత్ సింగ్ అవతారానికి ఇక వీడ్కోలు చెప్పానన్నాడు. యాదార్ధ గాథ ఆధారంగా నిర్మితమవుతున్న ఈ చిత్రంలో తన పాత్ర షూటింగ్ ముగిసిన సంకేతాలను అందించాడు. మీసాలు గడ్డంతో కాకుండా ఓ ఫ్రెష్ ఫోటో ఒకదాన్ని షేర్ చేశాడు. ఈ సందర్బంగా దర్శకుడు ఒమంగ్ కుమార్ , సందీప్ సింగ్, రిచా చద్దా, ఐశ్వర్య రాయ్ సహా ఇతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపాడు. దీంతో పాటుగా ఒక వీడియోను కూడా పోస్ట్ చేశాడు. కాగా కండలు తిరిగిన దేహంతో ఫ్రెష్ గా కనిపించే రణదీప్ గత ఏడాది అక్టోబర్ లో షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం కోసం గెడ్డాన్ని పెంచాడు. అంతేకాదు ఛాలెంజింగ్ గా తీసుకున్న ఈ పాత్రకోసం బాగా బరువు తగ్గి ఎముకల గూడులా మారి అందరినీ ఆకట్టుకున్నాడు. హైవై సినిమాలో హర్యానీ యాస ద్వారా ఆకట్టుకున్న రణదీప్ హుడా, సరబ్జిత్ సింగ్ పాత్రలో పంజాబీ మాండలికాన్ని పరిపూర్ణంగా పలికించాడంటూ విమర్శకుల ప్రశంసలందుకున్నాడు. సోదరుడు సరభ్ జిత్ సింగ్ విడుదల కోసం పోరాడిన అక్క దల్బీర్ కౌర్ గా బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్, సరభ్ భార్యగా రిచా చద్దా నటించారు. మే 20 న ఈసినిమా థియేటర్లను పలకరించనున్నసంగతి తెలిసిందే. Goodbye #Sarbjit.Gratitude to @OmungKumar @Vanita_ok @SandeepSinghOne @RichaChadda_ @kirandeohans #AishwaryaRai CREW pic.twitter.com/1tC4CiCwBN — Randeep Hooda (@RandeepHooda) March 15, 2016 -
విజయంతో వీడ్కోలు
వన్డే కెరీర్ను ముగించిన మెకల్లమ్ఆసీస్తో చివరి మ్యాచ్లో కివీస్ గెలుపు 2-1తో సిరీస్ కైవసం హామిల్టన్: న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ బ్రెండన్ మెకల్లమ్కు వన్డేల్లో ఘనమైన వీడ్కోలు లభించింది. సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో న్యూజిలాండ్ జట్టు 55 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను కివీస్ 2-1తో దక్కించుకుంది. ఎనిమిదేళ్ల అనంతరం ఆసీస్పై కివీస్ సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. మరోవైపు ఈ మ్యాచ్ మెకల్లమ్కు ఆఖరి అంతర్జాతీయ వన్డే కావడం విశేషం. 12 నుంచి వెల్లింగ్టన్లో జరగబోయే రెండు టెస్టుల అనంతరం తను అంతర్జాతీయ క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకోనున్నాడు. ఇక ఈ మ్యాచ్లో ఎప్పటిలాగే తన సహజశైలిలోనే చెలరేగిన మెకల్లమ్ 27 బంతుల్లోనే 47 పరుగులు సాధించాడు. ఇందులో 6 ఫోర్లు; 3 సిక్సర్లున్నాయి. అలాగే వన్డేల్లో 200 సిక్సర్లు పూర్తి చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. తొలిస్థానంలో ఆఫ్రిది (351) ఉన్నాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్ అయ్యింది. గప్టిల్ (61 బంతుల్లో 59; 4 ఫోర్లు; 3 సిక్సర్లు), ఎలియట్ (62 బంతుల్లో 50; 1 ఫోర్; 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. మిషెల్ మార్ష్కు మూడు.. హాజెల్వుడ్, హేస్టింగ్స్, బోలండ్లకు రెండేసి వికెట్లు దక్కాయి. బ్యాట్స్మెన్ వైఫల్యంతో ఆసీస్ 43.4 ఓవర్లలో 191 పరుగులకే కుప్పకూలింది. ఖవాజా (36 బంతుల్లో 44; 4 ఫోర్లు; 2 సిక్సర్లు), మార్ష్ (42 బంతుల్లో 41; 4 ఫోర్లు; 1 సిక్స్) మాత్రమే ఆడగలిగారు. హెన్రీకి మూడు.. అండర్సన్, సోధి రెండేసి వికెట్లు తీశారు. మెకల్లమ్ వన్డే కెరీర్ మ్యాచ్లు : 260 పరుగులు : 6,083 అర్ధసెంచరీలు : 32 సెంచరీలు : 5 క్యాచ్లు : 262 సగటు : 30.41 -
ఫేస్ బుక్కు సుప్రీం మాజీ న్యాయమూర్తి గుడ్బై
న్యూఢిల్లీ: తన అనూహ్య నిర్ణయాలు, ఎవరూ ఊహించలేని అభిప్రాయాలు నిర్మొహమాటంగా చెబుతూ నిత్యం వార్తల్లో నిలిచే భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ మరోసారి వార్తల్లో నిలిచే ప్రకటన చేశారు. తాను ఫేస్ బుక్కు గుడ్బై చెప్తున్నట్లు ప్రకటించారు. గణతంత్ర దినోత్సవం రోజు రాత్రి(మంగళవారం రాత్రి) తన ఫేస్ బుక్ పేజీలో తాను ఫేస్ బుక్ నుంచి ఇక సెలవు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అందుకు కారణం కూడా ఆయన వివరించారు. తన సమూల తెలివి తేటలను అందరికి పంచాలనుకున్నారని, కానీ దానివల్ల తిట్లు, విమర్శల రూపంలో స్పందన వెనక్కు వచ్చిందని కట్జూ చెప్పారు. అందుకే భారతీయులకు బోధించాలనుకోవడం తప్పని తనకు అర్థమైనట్లు తెలిపారు. అందుకే ఫేస్ బుక్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన వివరణ ఇచ్చారు. -
హెవిట్ గుడ్ బై
ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండోరౌండ్లో ఫెరర్ చేతిలో ఓడిన తర్వాత ప్రపంచ మాజీ నంబర్వన్ లీటన్ హెవిట్ (ఆస్ట్రేలియా) టెన్నిస్కు గుడ్బై చెప్పాడు. మ్యాచ్ అనంతరం ఆసీస్ జాతీయ పతాకంతో రూపొందించిన షర్ట్ను ధరించిన హెవిట్... తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి కోర్టులోకి వచ్చాడు. భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. -
టెస్టులకు గుడ్బై?
ఏదో ఒక ఫార్మాట్ నుంచి తప్పుకోనున్న డివిలియర్స్ డర్బన్: అన్ని ఫార్మాట్లలోనూ అత్యంత నిలకడగా ఆడే దక్షిణాఫ్రికా విధ్వంసక బ్యాట్స్మన్ ఏబీ డివిలియర్స్ త్వరలోనే టెస్టులకు వీడ్కోలు పలికే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగు మ్యాచ్ల సిరీస్ తనకు చివరి టెస్టు సిరీస్ కావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. మూడు ఫార్మాట్లలోనూ ఆడుతున్నందున డివిలియర్స్పై పనిభారం పెరిగిందని, ఇలాగే ఆడితే ఎక్కువకాలం ఆటలో కొనసాగలేడనే చర్చ చాలాకాలంగా దక్షిణాఫ్రికా క్రికెట్లో జరుగుతూ ఉంది. ఇటీవల జట్టు మేనేజ్మెంట్ కూడా ఏదో ఒక ఫార్మాట్ను వదులుకోమని డివిలియర్స్కు సలహా ఇచ్చినట్లు సమాచారం. ‘మూడేళ్లుగా నా గురించి అనేక వార్తలు వస్తున్నాయి. ఎప్పటికప్పుడు నన్ను నేను తాజాగా ఉంచుకుంటూ క్రికెట్లో కొనసాగుతున్నాను. ఆటను ఆస్వాదించడం ముఖ్యం. ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ను దృష్టిలో ఉంచుకుంటే అన్ని ఫార్మాట్లలోనూ కొనసాగడం కష్టం’ అని డివిలియర్స్ చెప్పాడు. దీంతో టెస్టులకు వీడ్కోలు పలుకుతాడనే భావన పెరిగింది. ప్రస్తుతం టి20ల్లో ఓపెనర్గా, వికెట్ కీపర్గా అతను బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఆదాయం పరంగా చూస్తే ఐపీఎల్ లాంటి టోర్నీని వదులుకోలేడు. -
బై.. బై... సంగ
శ్రీలంక దిగ్గజానికి ఘనంగా వీడ్కోలు కొలంబో: పదిహేనేళ్లుగా శ్రీలంక క్రికెట్కు అతడు వెన్నెముక.. జట్టు సాధించిన ఎన్నో విజయాల్లో అతడి పాత్ర మరువలేనిది.. ఇన్నాళ్లుగా తన అసమాన ఆటతీరుతో జట్టును సమున్నతంగా నిలిపి అభిమానులను ఉర్రూతలూగించిన కుమార సంగక్కర.. తన కెరీర్కు ఫుల్స్టాప్ పెట్టాడు. భారత్తో జరిగిన రెండో టెస్టు తన చివరిదని ఇంతకుముందే ప్రకటించిన ఈ సీనియర్ బ్యాట్స్మన్ సోమవారం మ్యాచ్ ముగిసిన అనంతరం ఘనమైన వీడ్కోలు తీసుకున్నాడు. ఇంతకాలం వెన్నంటి ప్రోత్సహించిన కుటుంబ సభ్యులతో పాటు కోచ్లు, ఆటగాళ్లు, బోర్డు, ఆదరించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ చివరిసారిగా ప్రసంగించాడు. లంక తరఫున క్రికెట్ ఆడడం జీవితంలో అన్నింటికన్నా మధురమైన జ్ఞాపకమని చెప్పాడు. తమ నాయకుడిని ఆటగాళ్లు భుజాలపై ఎత్తుకొని మైదానంలో తిప్పారు. 37 ఏళ్ల సంగకు వీడ్కోలు పలికేం దుకు లంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, ప్రధాని రణిల్ విక్రమసింఘే, మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్, మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ, సునీల్ గవాస్కర్ హాజరయ్యారు. అంతకుముందు మ్యాచ్ ముగిసిన అనంతరం భారత క్రికెట్ ఆటగాళ్ల సంతకాలతో కూడిన జెర్సీని కెప్టెన్ కోహ్లి.. సంగక్కరకు అందించాడు. సంగక్కర భావోద్వేగ వీడ్కోలు ప్రసంగం అతడి మాటల్లోనే... అందరికీ కృతజ్ఞతలు: నాకు వీడ్కోలు పలికేందుకు వచ్చిన శ్రీలంక అధ్యక్షుడు, ప్రధాని, కుటుంబసభ్యులకు, భారత, లంక జట్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముఖ్యంగా నా క్రికెట్ కెరీర్ ఆరంభానికి క్యాండీలోని ట్రినిటీ కాలేజి ఎంతగానో చేయూతనందించింది. ఇక నాకు చాలా మంది కోచ్లున్నారు. ఎందుకంటే నేను టీనేజ్లో ఉన్నప్పుడు మా నాన్న చాలా మంది దగ్గర శిక్షణ ఇప్పించేవాడు. డ్రెస్సింగ్ రూమ్ కబుర్లు మిస్ అవుతా: నా గత కెప్టెన్లు, తోటి ఆటగాళ్లు నా అభివృద్ధికి తోడ్పడినవారే. డ్రెస్సింగ్ రూమ్లో వారి కబుర్లను ఎంతగానో మిస్ అవుతాను. నాది అద్భుతమైన కుటుంబం. 30 ఏళ్లుగా నన్ను అభిమానించిన వారంతా మ్యాచ్ చివరి రోజు హాజరయ్యారు. ఇదే నేను సాధించిన గొప్ప ఘనత. చాలా మంది జీవితంలో మిమ్మల్ని ప్రభావితం చేసింది ఎవరని అడుగుతుంటారు. నిజానికి దీని కోసం నేనెక్కడా చూసింది లేదు. నా తల్లిదండ్రులే నన్ను విపరీతంగా ప్రభావితం చేశారు. ఈ కుటుంబంలో పుట్టడం నా అదృష్టం. అభిమానులకు రుణపడి ఉంటా: లంక తరఫున ఇన్నేళ్లుగా ఆడేందుకు నాకు మనోధైర్యాన్నిచ్చిన అభిమానులకు ఎంతగానో రుణపడి ఉంటాను. నా గురించి మాట్లాడిన విరాట్ కోహ్లి, భారత జట్టుకు కూడా అభినందనలు. చాలా ఏళ్లుగా ఆ జట్టు లంకకు పటిష్ట ప్రత్యర్థిగా ఉంది. ఈరోజు మేం ఓడిపోయినందుకు ఏమీ బాధపడడం లేదు. తర్వాతి మ్యాచ్ మేమే గెలుస్తాం. లంక జట్టు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా దేశం గర్వించేలా ఆడుతుందని ఆశిస్తున్నాను. జహీర్, స్వాన్ బౌలింగ్లో కష్టపడ్డా: ఈ సిరీస్లో అశ్విన్ నన్ను ఇబ్బంది పెట్టినా ఓవరాల్గా నా కెరీర్లో పేసర్ జహీర్ ఖాన్, ఇంగ్లండ్ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ బౌలింగ్ సవాల్గా నిలిచింది. నేను యువకుడిగా ఉన్నప్పుడు వసీం అక్రమ్ బంతులను ఎదుర్కోవడంలోనూ ఇబ్బంది పడ్డా. హైకమిషనర్ పదవిపై ఆలోచిస్తా... కుమార సంగక్కరకు ఇంగ్లండ్లో శ్రీలంక హైకమిషనర్ పదవిని అధ్యక్షుడు సిరిసేన ఆఫర్ చేశారు. అయితే దీనిపై ఆలోచించాకే తుది నిర్ణయం తీసుకుంటానని సంగక్కర చెప్పాడు. ‘అధ్యక్షుడి విజ్ఞప్తిని నేను గౌరవిస్తాను. ఈ విషయం గురించి ఆయనతో లోతుగా చర్చించాల్సి ఉంది. ఎందుకంటే అలాంటి అనుభవం నాకు లేదు. ఆ పదవికి ప్రత్యేక పరిజ్ఞానం అవసరం. అందుకే ఆలోచించాకే తుది నిర్ణయం తీసుకుంటాను’ అని సంగ అన్నాడు. లంక దిగ్గజం సంగక్కర ఆడిన శకంలోనే తాను కూడా క్రికెట్ ఆడినందుకు గర్వపడుతున్నానని భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ట్విట్టర్లో పేర్కొన్నాడు. ‘ఓ వ్యక్తిగానే కాకుండా క్రికెటర్గా నీగురించి చెప్పడానికి మాటలు లేవు. చాలామందికి ప్రేరణగా నిలిచావు. నీ శకంలోనే నేను కూడా ఆడుతున్నందుకు అదృష్టంగా భావిస్తున్నాను. జీవితంలో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను’ అని కోహ్లి చెప్పాడు. మాజీ ఆటగాళ్ల క్లబ్కు స్వాగతం: గవాస్కర్ సంగక్కర జీవితంలో రెండో ఇన్నింగ్స్ అద్భుతంగా సాగాలని మాజీ కెప్టెన్ గవాస్కర్ కోరుకున్నారు. ‘క్రికెట్లో సాగించిన ఇన్నింగ్స్కంటే రెండో ఇన్నింగ్స్ ఇంకా బాగా సాగాలి. ఇన్నేళ్లుగా లంక ఆశలను సమర్థవంతంగా మోశావు. చివరిగా మాజీ ఆటగాళ్ల క్లబ్కు నీకు స్వాగతం పలుకుతున్నాను’ అని గవాస్కర్ అన్నారు. గొప్ప ఆటగాడు: ఐసీసీ గత 15 ఏళ్లుగా సంగక్కర అంతర్జాతీయ క్రికెట్లో గొప్ప ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్సన్ అన్నారు. కెప్టెన్గా, వికెట్ కీపర్గా, ఆటగాడిగా జట్టుకు అతడు అందించిన సేవలను తక్కువగా చూడలేమని కొనియాడారు. -
‘దేశం’ ఆగమాగం!
- అయోమయంలో తెలుగుతమ్ముళ్లు - ఎమ్మెల్యేల నిష్ర్కమణతో నైరాశ్యం - గులాబీ దళంలో ‘పాత’మిత్రులదే హవా సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ముఖ్యనేతలు సైకిల్దిగి కారెక్కుతుండడంతో తెలుగుదేశం పార్టీ పూర్తిగా డీలా పడింది. పార్టీని నమ్ముకున్న ద్వితీయ శ్రేణి, కార్యకర్తల స్థాయిలో నైరాశ్యం అలుముకుంది. ఏకంగా ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్బై చెబుతుండడంతో ‘దేశం’ ఆయువుపట్టును కోల్పోతోంది. సుమారు రెండుదశాబ్దాలుగా పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి పార్టీని వీడుతుండడం తమ్ముళ్లను అయోమయంలో పడేసింది. పార్టీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన కిషన్రెడ్డి గులాబీ గూటికి చేరాలనే నిర్ణయాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న రంగారెడ్డి జిల్లాలో గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ సీట్లు దక్కాయి. ఆ తర్వాత వరుసగా జరుగుతున్న పరిణామాలతో జిల్లాలో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. నాలుగునెలల క్రితం మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి గులాబీ కం డువా కప్పుకోగా.. తాజాగా మంచిరెడ్డి కూడా కారెక్కేందుకు రెడీ అయిపోయారు. ఇంకోవైపు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా వీరి బాటలోనే పయనించే అవకాశంలేకపోలేదనే ప్రచారమూ జరుగుతోంది. డైల మాలో శ్రేణులు ఎమ్మెల్యే కిషన్రెడ్డి పార్టీకి రాజీనామా చేసి.. గులాబీ తీర్థంపుచ్చుకుంటున్నారనే వార్తలతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో టీడీపీ శ్రేణు లు డైల మాలో పడ్డాయి. జిల్లా పార్టీ సారథి కూ డా వ్యవహరిస్తున్న ఆయన అనూహ్యంగా కారెక్కాలని నిర్ణయం తీసుకోవడం ముఖ్యనేతలను నివ్వెరపరిచింది. సిట్టింగ్ సీటును కాదని సీపీఎం ను ఒప్పించి కిషన్రెడ్డికి టికెట్ ఇప్పించిన చంద్రబాబును వదిలివెళ్లడం దారుణమని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు రొక్కం భీమ్రెడ్డి వ్యాఖ్యానించారు. పసుపు పోయి.. గులాబీ వచ్చే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలకనేతలుగా వ్యవహరించినవారే ఇప్పుడు గులాబీ పార్టీలో చ క్రం తిప్పుతున్నారు. మంత్రి మహేందర్రెడ్డి మొదలు హరీశ్వర్రెడ్డి, సుధీర్రెడ్డి, రత్నం, సంజీవరావు, తీగల, తాజాగా కిషన్రెడ్డి ఇలా టీడీపీలో ఒక వెలుగు వెలిగిన నాయకులంతా టీఆర్ఎస్ గూటికి చేరారు. ప్రస్తుతం ఆ పార్టీలో వీరి హవానే కొనసాగుతోంది. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించినవారంతా తెర వెనుకకు పోగా... వలసనేతలే కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇదిలావుండగా, గతంలో టీడీపీలోనూ రెండువర్గాలుగా వ్యవహరించిన ఈ నేతలు ఇప్పుడు కూడా గ్రూపులుగా విడిపోయే అవకాశంలేకపోలేదు. మంత్రి మేహ ందర్రెడ్డి.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్రెడ్డికి మొదట్నుంచి అభిప్రాయభేదాలున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కిషన్రెడ్డి పార్టీలో చేరే అంశంపై అధిష్టానం మహేందర్తో చర్చించలేదని తెలుస్తోంది. కిషన్రెడ్డి కూడా దీనిపై మంత్రితో సంప్రదించలేదని సమాచారం. కిషన్రెడ్డితో రాయబా రం నడిపిన సీనియర్ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, హరీశ్రావు బుధవారం సీఎం క్యాంపు ఆఫీసుకు రావాలని మహేందర్కు కబు రు పంపినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. జిల్లాలో ఇప్పటికే రెండువర్గాలుగా చీలిపోయిన గులాబీదళంలో మరో పవర్సెంటర్కు కిషన్రెడ్డి నాయకత్వం వహిస్తారనే ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గ ‘మంచి’ కోసమే.. సీఎంతో భేటీ.. రేపు గులాబీ తీర్థం గట్టి హామీ లభించడంతో కారెక్కడానికి రెడీ ఉత్కంఠ వీడింది. ఊహాగానాలకు తెరదించుతూ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి టీఆర్ఎస్ గూటికి చేరారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్తో భేటీ అయిన కిషన్రెడ్డి ఈనెల 24న గులాబీ తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయించారు. అంతకుముందు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, హరీశ్రావు సంప్రదింపులు జరిపిన ఆయన అక్కడి నుంచి సీఎం క్యాంపు ఆఫీసుకు వెళ్లారు. నియోజకవర్గ అభివృద్ధికి చేయూతనిస్తానని సీఎం హామీ ఇచ్చినందునే టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నట్లు మంచిరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. నాగార్జునసాగర్ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించడం, జాపాల్- రంగాపూర్ అబ్జర్వేటరీ అభివృద్ధి, ఇబ్రహీంపట్నం పెద్ద చెరువును కృష్ణాజలాలతో నింపడం, మూసీ మురుగునీటి శుద్ధికి సీఎం సహకరిస్తానని భరోసా ఇచ్చినట్లు చెప్పారు. కార్యకర్తలు, నాయకుల ఒత్తిడి మేరకే టీఆర్ఎస్లో చేరుతున్నా తప్ప ఎలాంటి వ్యక్తిగత ఏజెండా లేదని స్పష్టం చేశారు. కేవలం ప్రజాప్రతినిధులతో కలిసి 24న టీఆర్ఎస్లో చేరుతున్నాని, త్వరలో ఇబ్రహీంపట్నంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని, దీనికి సీఎం రానున్నారని ఆయన చె ప్పారు. -
నిజమైన రైతుకు తగిన గుర్తింపేది...?
వీడ్కోలు సమావేశంలో జస్టిస్ నర్సింహారెడ్డి ఆవేదన ఘనంగా వీడ్కోలు పలికిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: పదోన్నతిపై పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ లింగాల నర్సింహారెడ్డికి ఉమ్మడి హైకోర్టు సోమవారం ఘనంగా వీడ్కోలు పలికింది. జస్టిస్ నర్సింహారెడ్డికి వీడ్కోలు పలికేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్జ్యోతి సేన్గుప్తా నేతృత్వంలో న్యాయమూర్తులందరూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ఇరు రాష్ట్రాల అడ్వకేట్స్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి, పి.వేణుగోపాల్, న్యాయవాదులు, జస్టిస్ నర్సింహారెడ్డి కుటుంబ సభ్యులు, హైకోర్టు రిజిష్ట్రార్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరువురు ఏజీలు కూడా న్యాయవ్యవస్థకు జస్టిస్ నర్సింహారెడ్డి చేసిన సేవలను కొనియాడారు. జస్టిస్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ... వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వారు పలు విషయాలను సరిగ్గా అర్థం చేసుకోలేరన్న భావన తప్పన్నారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టడం వల్లే తాను న్యాయమూర్తిగా పలు సమస్యలను, వివాదాలను స్పష్టతతో అర్థం చేసుకోగలిగే స్థితిలో ఉన్నానని, ఈ విషయం గర్వంగా చెప్పగలనని తెలిపారు. అన్ని వృత్తుల్లోకెల్లా వ్యవసాయమే అత్యుత్తమైనదని తన నమ్మకమన్నారు. అయితే దురదృష్టవశాత్తూ ప్రభుత్వాల ఏకపక్ష విధానాల వల్ల, సమాజంలో మారిన విలువల వల్ల వ్యవసాయ రంగం తన మనుగడ కోసం పోరాటం చేస్తోందని చెప్పారు. ఒక మోసకారి వ్యాపారవేత్తకు గుర్తింపును ఇచ్చే మీడియా, సమాజం.. ఓ విజయవంతమైన రైతుకు గుర్తింపునివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు సరస్వతి నమస్తుభ్యం.. పాఠ్యపుస్తకాల నుంచి సంస్కృతిని, విలువను తీసిపారేస్తున్న మన ఆధునిక విద్యావేత్తలకు ధన్యవాదాలు చెప్పాలంటూ జస్టిస్ నర్సింహారెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఒకప్పుడు చిన్నారులు సరస్వతి నమస్తుభ్యమంటూ చదువులు ప్రారంభిస్తే, ఇప్పుడు బాబా బ్లాక్ షిప్, ఈటింగ్ షుగర్ టెల్లింగ్ లైస్ అంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. హైకోర్టుతో తనకున్న మూడున్నర దశాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. న్యాయవాద వృత్తిలో తన గురువు, ప్రముఖ న్యాయవాది పి.బాబుల్రెడ్డి తనకు మెళకువలు నేర్పితే, ఆయన కుమారుడు పి.ప్రభాకర్రెడ్డి వృత్తిలో ఎదిగేందుకు ప్రోత్సహించారని తెలిపారు. న్యాయవాదులు, హైకోర్టు సిబ్బంది సహకారం, మద్దతువల్లే తాను అత్యుత్తమైన తీర్పులను ఇవ్వడం సాధ్యమైందన్నారు. తన తీర్పుల్లో ఉండే దయా, సానుభూతి గుణాలున్నాయంటే అందుకు తన తల్లే కారణమని చెప్పారు. తనకు విధి నిర్వహణలో సహకరించిన వారందరికీ ఆయన పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. హైకోర్టు న్యాయవాదుల సంఘం జస్టిస్ నర్సింహారెడ్డిని సన్మానించింది. -
ఎస్పీ నాగేంద్రకుమార్కు వీడ్కోలు
పాలమూరు: బదిలీపై హైదరాబాద్కు వెళ్తున్న ఎస్పీ డి.నాగేంద్రకుమార్కు జిల్లా ఉన్నతాధికారులు బుధవారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఎస్పీగా పనిచేసిన కాలంలో వృత్తిపట్ల ప్రదర్శించిన అంకితభావాన్ని కొనియాడారు. ముఖ్యంగా పోలీసు శాఖకు చేసిన సేవలను ప్రశసించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్పరేడ్ మైదానంలో నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జీడీ ప్రియదర్శిని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కొత్త ఎస్పీ శివప్రసాద్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో శాంతిభద్రతలు నెలకొల్పడంలో పోలీసుల పాత్ర ఎంతో ముఖ్యమని, జిల్లా ఎస్పీగా పనిచేసి బదిలీపై వెళ్లిన నాగేంద్రకుమార్ మాదిరిగానే, కొత్త ఎస్పీ శివప్రసాద్ కూడా శాంతి భద్రతలపై ప్రత్యేకదృష్టి సారించాలని కోరారు. జిల్లాలో ఆయన చేపట్టిన వివిధ కార్యక్రమాలను ఈ సందర్భంగా కలెక్టర్ ప్రస్తావించారు. జేసీ ఎల్.శర్మన్ మాట్లాడుతూ.. ఎస్పీ నాగేంద్రకుమార్ పోలీసుశాఖ పరంగా చేసిన సేవలను ప్రశంసించారు. డీఆర్వో రాంకిషన్ మాట్లాడుతూ..జిల్లాలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో నాగేంద్రకుమార్ ప్రత్యేకదృష్టి సారించారని, ముఖ్యంగా ఉద్యమాలు, ఆందోళనలు చేపట్టిన సందర్భంలో పోలీసులను అప్రమత్తం చేసి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించారని కొనియాడారు. ఏఎస్పీ మల్లారెడ్డి, ఓఎస్డీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. బదిలీపై వెళ్లిన నాగేంద్రకుమార్కు వీడ్కోలు పలుకుతూ కొత్త ఎస్పీ పి.శివప్రసాద్కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాత, కొత్త ఎస్పీలను కలెక్టర్, జేసీ, డీఆర్వోతోపాటు పోలీసుశాఖలోని వివిధ స్థాయిల అధికారులు ఘనంగా సన్మానించారు. స్వామి వివేకానంద సేవాసమితి తరఫున ఎ.నటరాజ్, రామకృష్ణ, విశ్వహిందూ పరిషత్ తరఫున పటోళ్ల లకా్ష్మరెడ్డి, ఇతర సంస్థల ప్రతినిధులు సన్మానించారు. కార్యక్రమంలో డీఎస్పీలు రామేశ్వర్, కృష్ణమూర్తి, చెన్నయ్య, ద్రోణాచార్య, గోవర్ధన్, శ్రీనివాసరెడ్డి, భరత్, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి ఉత్సవం
-
కాబోయే ప్రధానికి కన్నతల్లి ఆశీస్సులు
-
భారంగా గుజరాత్ ను వీడి.. దేశ రాజధానికి మోడీ!
ప్రధాని పదవిని చేపట్టేందుకు మాజీ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ గుజరాత్ వీడి భారంగా దేశ రాజధానికి బయలుదేరారు. ఆవ్ జో గుజరాత్ (గుడ్ బై గుజరాత్) అంటూ మోడీ న్యూఢిల్లీకి బయలుదేరారు. ఢిల్లీకి బయలుదేరే ముందు..గుజరాత్ సాంప్రదాయ ప్రకారం 6.25 కోట్ల ప్రజలకు ఆవ్ జో (గుడ్ బై) చెప్పదలచుకున్నాను అంటూ ఆవ్ జో గుజరాత్ అంటూ ఆహ్మదాబాద్ విమానాశ్రయం నుండి ఢిల్లీకి బయలుదేరారు. గుజరాత్ నుంచి బయలదేరే ముందు ప్రింట్, టెలివిజన్, ఎడిటర్స్, కాలమిస్ట్ లతోపాటు మీడియాలో పనిచేసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. 13 ఏళ్లపాటు మీడియా అందించిన సహకారం మరువలేనిదని మోడీ అన్నారు. అంతకుముందు తన కుటుంబ సభ్యులతో కాసేపు మోడీ గడిపారు. తన తల్లి ఆశీర్వాదం తీసుకుని దేశరాజధానికి బయలుదేరారు. -
కార్యాలయ సిబ్బందికి మన్మోహన్ వీడ్కోలు
న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్ సింగ్ మంగళవారం తన కార్యాలయ సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పదేళ్లుగా ప్రధాని పదవిలో ఉన్న మన్మోహన్ తనకు సహకరించిన ఉద్యోగులందరికీ వీడ్కోలు పలికారు. సౌత్బ్లాక్లో జరిగిన ఈ సమావేశానికి110 మంది వ్యక్తిగత సిబ్బంది, 400 మంది ఇతర ఉద్యోగులు హాజరయ్యారు. మన్మోహన్ ప్రతి ఒక్కరినీ పలకరించి కృతజ్ఞతలు తెలియజేశారు. 2004లో తొలిసారి ప్రధాని అయిన మన్మోహన్ పదేళ్లుగా పదవిలో కొనసాగుతున్నారు. లోక్సభ ఎన్నికల కౌంటింగ్ శుక్రవారం జరగనుంది. శనివారం మన్మోహన్ చివరిసారిగా కేబినెట్ సమావేశం నిర్వహిస్తారు. అనంతరం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలసిన అనంతరం చివరిసారి దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఎన్నికల అనంతరం కొత్త ప్రధానికి బాధ్యతలు అప్పగిస్తానని గత జనవరిలో మన్మోహన్ ప్రకటించారు. ఆ తర్వాత మన్మోహన్ తన అధికార నివాసం రేస్ కోర్సు రోడ్డులోని ఏడో నెంబర్ బంగ్లా నుంచి మోతీలాల్ నెహ్రూ రోడ్డులోని ఇంటికి మారవచ్చని భావిస్తున్నారు. ఇదిలావుండగా, తాజా ఎన్నికల్లో బీజేపీ కూటమికి పూర్తి మెజార్టీ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. -
గుడ్ బై
-
టీఆర్ఎస్కు పరమేశ్వర్ గుడ్బై?
వరంగల్ సిటీ, న్యూస్లైన్ : టీఆర్ఎస్ పొలిట్బ్యూరో సభ్యుడు, దళిత సామాజి క వర్గానికి చెందిన డాక్టర్ రామగళ్ల పరమేశ్వర్ ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. పార్టీలో తగిన గుర్తింపు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఆయ న పార్టీకి గుడ్బై చెప్పనున్నట్లు తెలిసింది. ఈ విషయం గులాబీ వర్గాలను కలవరపరుస్తోంది. చేర్యాల ప్రాం తానికి చెందిన పరమేశ్వర్ మొదటి నుంచి టీఆర్ఎస్లో చురుకైన నేతగా ఉన్నారు. కేసీఆర్ను నమ్ముకొని పార్టీలో కొనసాగుతున్నట్లు పలుసార్లు ప్రకటించారు. 2009 సాధారణ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానం నుంచి పోటీచేసి కాంగ్రెస్ అభ్య ర్థి సిరిసిల్ల రాజయ్య చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా పోటీచేసినప్పటికీ పొత్తును కాదని టీడీపీ అభ్యర్థిగా దొమ్మాటి సాంబయ్యను రంగంలోకి దింపడంతో పరమేశ్వర్ ఓటమి చవిచూశారు. తదుపరి వచ్చే ఎన్నికలపై గంపెడాశతో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటించా రు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమయ్యారు. ఈ దఫా తప్పకుండా అవకాశం దక్కుతుందనే నమ్మకంతో ఉన్నారు. అయి తే ఇటీవల టీడీపీ నుంచి కడియం శ్రీహరి టీఆర్ఎస్లో చేరడంతో కొంత ఇబ్బందిని ఎదుర్కొన్నారు. స్టేషన్ఘన్పూర్ బహిరంగ సభలో ఏకంగా కడియం శ్రీహరిని వరంగల్ పార్లమెంట్ నియోజ కవర్గ అభ్యర్థిగా ప్రకటించడంతో పరమేశ్వర్ ఆశలు గల్లంతయ్యా యి. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నా రు. పార్టీలో ప్రాధాన్యం తగ్గిందనే ఆవేదన.. పార్టీ నాయకులెవరూ తనను పట్టించుకోకపోవడంతో టీఆర్ఎస్కు గుడ్బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ విసయాన్ని గురువారం ప్రకటించనున్నట్లు తెలిసింది. అయితే అతను ఏ పార్టీలో చేరుతారనే చర్చ సాగుతోంది. ఇప్పటికే టీడీపీ వర్గాలతో మాట్లాడినట్లు సమాచారం. అందులో చేరే అవకాశం ఉందని వినికిడి.