google doodle
-
గూగుల్కు ఓటింగ్ శోభ!
లోక్సభ ఎన్నికల నాల్గవ దశ పోలింగ్ ఈరోజు ప్రారంభమైంది. దేశంలోని ప్రతి ఓటరు చూపుడు వేలు ఇంక్తో మెరిసే తరుణమిది. ఈ ప్రజాస్వామ్య పండుగ గూగుల్కు కొత్త శోభ తెచ్చింది. ఇంక్ అద్దిన వేలుతో సరికొత్త గూడుల్ను గూగుల్ సెర్చ్ పేజీపై ప్రదర్శిస్తోంది.దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 96 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో నాల్గవ దశ ఓటింగ్ ప్రారంభమైంది. అదనంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలోని మొత్తం 175 స్థానాలు, ఒడిశాలోని 28 స్థానాలకు కూడా ఈరోజు పోలింగ్ జరగనుంది. 4వ దశ ఎన్నికలలో మొత్తం 1,717 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.సార్వత్రిక ఎన్నికలలో నాల్గవ దశ ఓటింగ్పై నేటి గూగుల్ డూడుల్ భారత్లోని యూజర్లకు మాత్రమే కనిపిస్తుంది. అంతకుముందు, ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7 తేదీలలో జరిగిన మునుపటి దశల పోలింగ్ అప్పుడు కూడా ఇంక్డ్ ఫింగర్ ఐకాన్ లోగోతో గూగుల్ డూడుల్ మెరిసింది.ఈరోజు పోలింగ్ జరుగుతన్న మొత్తం 96 లోక్సభ స్థానాల్లో ఆంధ్రప్రదేశ్లో 25, తెలంగాణలో 17, ఉత్తరప్రదేశ్లో 13, మహారాష్ట్రలో 11, మధ్యప్రదేశ్లో 8, పశ్చిమ బెంగాల్లో 8, బీహార్లో 5, జార్ఖండ్లో 4, ఒడిశాలో 4, జమ్మూ కాశ్మీర్లో 1 ఉన్నాయి. -
‘నన్నోడించిన వాడ్నే పెళ్లి చేసుకుంటా’
‘‘బరిలో దూకండి. నన్ను ఓడించండి. ఆ దమ్మున్న మగవాడినే నేను పెళ్లి చేసుకుంటా’’.. పురుషాధిపత్యం కొనసాగుతున్న రోజుల్లో ఓ మహిళ విసిరిన సవాల్ ఇది. సాధారణ మహిళ అయితే చర్చకు అంతగా ఆస్కారం ఉండేది కాదు. కానీ, ఆ సవాల్ విసిరింది హమీదా బాను. ఇంతకీ ఇవాళ గూగుల్ హోం పేజీని గమనించారా?.. అందులో ఉంది ఆమెనే.1940-55 మధ్య.. కుస్తీ పోటీల్లో వందల మందిని ఓడించానని తనకు తానుగా ప్రకటించుకుంది హమీదా బాను. కళ్లారా ఆమె పాల్గొన్న పోటీలు చూసి అప్పటి మీడియా పొగడ్తలతో ఆమెను ఆకాశానికి ఎత్తేసింది. భారతదేశంలో తొలి మల్ల యోధురాలిగా హమిదా బాను పేరు చరిత్రకెక్కింది. ఇప్పుడు.. డూడుల్ రూపంలో ఆ యోధురాలికి గౌరవం ఇచ్చింది గూగుల్.సంప్రదాయ కుటుంబంలో పుట్టి.. హేతుబద్ధమైన పెద్దల్ని ఎదురించి.. ఇంటి నుంచి బయటకు వచ్చేసింది హమీదా. ఉత్తర ప్రదేశ్ మీర్జాపూర్ ఆమె స్వస్థలం. అక్కడి నుంచి ఆమె అలీఘడ్ వలస వెళ్లింది. అక్కడే సలాం పహిల్వాన్ ఆమెకు పరిచయం అయ్యాడు. ఆయన దగ్గర కుస్తీ శిక్షణ తీసుకుంటూ పలు పోటీల్లో పాల్గొందామె. అయితే 1954 ఫిబ్రవరిలో ఆమె ఇచ్చిన ఒక బహిరంగ ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తనను ఓడించిన వాళ్లను వివాహం చేసుకుంటానని ప్రకటించి అటు ప్రజలు, ఇటు మీడియా దృష్టిని ఆకర్షించింది.ఛాలెంజ్లో భాగంగా.. పంజాబ్లో ఒకరిని, కోల్కతాలో ఒకరిని బాను ఓడించింది. ఆ తర్వాత గుజరాత్ బరోడాకు చేరుకున్న ఆమెకు ఘన స్వాగతం లభించింది. అప్పటికి ఆమె వయసు 34 ఏళ్లు. ఆ సవాల్ విసిరిన నాటికి ఆమె 300 మ్యాచ్లు పూర్తి చేసుకుందట. అయితే ఆమెతో తలపడాల్సిన చోటే గామా పహిల్వాన్ ఆఖరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఆమె బాబా పహిల్వాన్తో తలపడి.. కేవలం నిమిషం వ్యవధిలోనే ఆమె నెగ్గింది.బాను పాపులారిటీ ఏ స్థాయికి చేరిందో.. 1944లో బాంబే క్రానికల్ రాసిన ఒక కథనం చూస్తే తెలుస్తుంది. బాంబేలో ఆమె పాల్గొన్న ఒక మ్యాచ్ చూసేందుకు 20 వేల మంది ప్రేక్షకులు వచ్చారట. అయితే ప్రత్యర్థి గూంగా పహిల్వాన్ అసంబంద్ధమైన డిమాండ్లతో ఆ మ్యాచ్ జరగకుండా పోయింది. దీంతో ఆగ్రహించిన ప్రేక్షకులు స్టేడియంలో బీభత్సం సృష్టించారట.అమెజాన్ ఆఫ్ అలీగఢ్.. ముద్దుగా హమీదా బానుకు అప్పటి మీడియా పెట్టుకున్నపేరు. ఐదడుగల మూడు అంగుళాలు, 108 కేజీల బరువుతో.. రోజుకు ఐదున్నర లీటర్ల పాలు, రెండు లీటర్ల పండ్ల రసేఆలు, కేజీ మటన్, అరకేజీ బటర్, ఆరు గుడ్లు, రెండు ప్లేట్ల బిర్యానీ.. ఇలా ఆమె డైట్ గురించి కూడా అప్పట్లో పేపర్లు కథనాలు రాసేవి.హమిదా బాను కెరీర్ సగానికి పైగా వివాదాలతోనే సాగింది. మగవాళ్లతో ఆమె తలపడడాన్ని పలువురు బహిరంగంగానే వ్యతిరేకించారు. మొరార్జీ దేశాయ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె పోటీలపై నిషేధం విధించారు. అందుకు ఆమె బహిరంగంగానే ఆయనపై విమర్శలు గుప్పించింది. అలాగే.. ఆమె పాల్గొన్న పోటీల్లోనూ ప్రేక్షకుల నుంచి దాడులు తప్పలేదట. 1954 దాకా దేశ, విదేశీ రెజ్లర్లతో ఆమె తలపడింది. అయితే అదే ఏడాది విదేశాలకు వెళ్లే అవకాశం వచ్చినా.. ఆర్థిక స్తోమత లేకపోవడం, స్పానర్లు ఎవరూ ముందుకు రాలేదన్న కారణాలతో ఆమె ఆగిపోయింది. అయితే ఆ ఆగిపోవడం.. బరికి శాశ్వతంగా హమిదా బానును దూరం చేసింది కూడా. 1987లో మహేశ్వర్ దయాల్ అనే రచయిత ఆమె జీవితం మీద రాసిన పుస్తకంలో సంచలన విషయాల్ని పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్, పంజాబ్లో ఆమె కుస్తీ పోటీల్లో పాల్గొందని, మగ పోటీదారులతో మాత్రమే ఆమె తలపడేదని, అయితే కొన్ని చోట్ల ఆమె రహస్య ఒప్పందాలు కూడా చేసుకునేదని ఆయన రాశారు.రెజ్లింగ్ కెరీర్ మాత్రమే కాదు.. వ్యక్తిగత జీవితం కూడా ఒడిదుడుకుల నడుమ సాగింది. కోచ్ సలాం పహిల్వాన్తో కలిసి అప్పటిదాకా ప్రొఫెషనల్ రిలేషన్ సాగించిన ఆమె.. ఆ తర్వాత ఆయనతో సహజీవనం చేసింది. ఈ క్రమంలోనే ఆమెను విదేశీ పోటీలకు వెళ్లకుండా సలామే అడ్డుకున్నాడనన్న ఆరోపణ ఒకటి ఉంది. ఇంకోవైపు ఉత్తర భారతం నలుమూలల పోటీల్లో పాల్గొన్న హమిదాను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. ముంబై కల్యాణ్ ప్రాంతంలో ఉంటూ.. సలాంతో కలిసి పాల వ్యాపారం మొదలుపెట్టింది.సలాం కూతురు సహారా, బానును పినమ్మగా చెబుతుంటుంది. అయితే సలాం ఆమెను శారీరకంగానూ ఎంతో వేధించేవాడని బాను మనవడు ఫిరోజ్ షేక్(ఆమె దత్తపుత్రుడి కొడుకు) ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. యూరప్కు వెళ్లకుండా బానును నిలువరించిన సలాం.. ఆమెను చిత్రహింసలకు గురి చేశాడని, ఈ క్రమంలోనే ఆమె కాళ్లు, చేతులు విరిగియాని ఆరోపించారాయన. కొన్నాళ్లకు సలాం, బానులు విడిపోయారు. సలాం కల్యాణ్లోనే ఉంటూ పాల వ్యాపారం కొనసాగించింది. డబ్బు సరిపోని సమయంలో పిండి వంటలు చేసి రోడ్ల మీద అమ్ముకునేది. అలా మల్లు యోధురాలిగా పేరున్న హమీదా బాను.. చివరి రోజులు మాత్రం కష్టంగానే గడిచాయని పలు కథనాలు వెల్లడించాయి. -
శ్రీదేవికి అరుదైన గౌరవం.. 60వ బర్త్డే స్పెషల్!
అతిలోక సుందరి శ్రీదేవి.. సినీ ప్రేక్షకుల్లో గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నటి. ఇంత స్పెషల్ ఎందుకంటే ఈమె చరిష్మా అలాంటిది. హీరోయిన్గా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేయడం సంగతి అటుంచితే.. ఆడియెన్స్ గుండెల్లో చెరిగిపోని చోటు సంపాదించింది. 2018లో ప్రమాదవశాత్తు ఈమె మరణించినప్పటికీ సందర్భం వచ్చిన ప్రతిసారీ ఆమెని గుర్తుచేసుకుంటున్నారు. అలా శ్రీదేవి 60 బర్త్ డే (జయంతి) సందర్భంగా ఇప్పుడు ఆమెకు గూగుల్ అరుదైన రీతిలో గౌరవించింది. (ఇదీ చదవండి: 'జైలర్'కి మరో హీరో అనిరుధ్.. రెమ్యునరేషన్ అన్ని కోట్లు!) తమిళనాడులో పుట్టిన శ్రీ అమ్మ యాంగర్ అయ్యప్పన్.. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తన పేరు మార్చుకుని శ్రీదేవి అయ్యింది. టీనేజ్లోనే హీరోయిన్ అయిపోయి.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో వందలాది చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది. ఈమెకు మన దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలిన శ్రీదేవి.. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ని పెళ్లి చేసుకుంది. జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ ఈమె కుమార్తెలు. ఇకపోతే తన నటనతో సినీ ప్రేక్షకుల్ని అలరించిన శ్రీదేవికి ఇప్పుడు అరుదైన గౌరవం లభించింది. ఈ బ్యూటీ 60వ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం, గూగుల్ తన డూడుల్గా శ్రీదేవి ఫొటోని డిస్ప్లే చేసింది. మంచి కలర్ఫుల్ లుక్లో డ్యాన్స్ చేస్తున్నట్లు ఉన్న శ్రీదేవిని చూస్తే.. 'దేవత' సినిమాలోని 'ఎల్లువచ్చే గోదారమ్మ' పాటనే గుర్తొస్తోంది. ఇలా గూగుల్ శ్రీదేవిని గౌరవించడం ఆమె ఫ్యాన్స్ని ఫుల్ ఖుషీ చేస్తోంది. ఇప్పుడీ విషయం వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: సిద్ధార్థ్... నాతో నటించడానికి భయపడ్డాడు: ప్రముఖ నటుడు) -
గూగుల్ డూడుల్లో ఆ ఐ ఫ్రేమ్ ఏంటి? ఆమె ఎవరూ..?
గూగుల్ డూడుల్ చారిత్రక ఘట్టల రోజును, ప్రముఖులను, సెలబ్రెటీలను తన లోగో పేజితో సత్కరిస్తుంది. అందరికీ తెలిసిందే. కానీ ఈ రోజు గుగూల్ ఏకంగా ఐ ఫ్రేమ్తో సహా ఓ మహిళతో కూడిన డూడిల్ని రూపొందించింది. అసలు ఏంటీ ఆ ఐ ఫ్రేమ్? ఆ మహిళెవరూ? గూగుల్ ఈ రోజు చాలా వినూత్న రీతిలో డూడిల్ని రూపొందించింది. ఐ ఫ్రేమ్ చుట్టూ బాణాలు మధ్యలో ఓ మహిళ రూపు ఉండేలా రూపొందించింది. ఆమె నూయర్క్కి చెందిన ఆల్టినా షినాసి. ఈ రోజ ఆ మహిళ 116వ పుట్టిన రోజు సందర్భంగా ఇలా డూడుల్తో ఘనంగా సత్కరించింది. ఆమె క్యాట్ ఐ ఫ్రేమ్ సృష్టికర్త. షినాసి ఆగస్టు4, 1907లో న్యూయార్క్ మాన్హట్టన్లో జన్మించింది. ఉన్నత పాఠశాల విద్య అనంతంర చిత్రేఖనం అభ్యసించేందుకు పారిస్ వెళ్లింది. అప్పుడే ఆమెకు కళలపై ఆసక్తి ఏర్పడటం మొదలైంది. ఆమె యూఎస్కి తిరిగి వచ్చిన తర్వాత పీటర్ కోప్ల్యాండ్తో కలిసి పనిచేయడం ప్రారంభించింది. ఒక రోజు వీధుల గుండా నడుచుకుంటూ వెళ్తుండగా..హఠాత్తుగా అక్కడ ఉన్న గాజు ఫ్రేమ్లవైపు దృష్టి మళ్లింది. అక్కడ ఉన్నవన్నీ గుండ్రటి ఆకారంలో పెద్ద ఆసక్తికరంగా లేకపోవటాన్ని గమనించింది. ఆ కాలంలో మహిళలు ధరించే కళ్ల జోడులు కేవలం గుండ్రటి ఫ్రేమ్ ఆకారంలోనే ఉండేవి. దీంతో షినాస్ మహిళలకి సరికొత్త స్టయిల్ గ్లాస్లతో.. తమ గ్లామర్ని మరింత పెంచేలా చేసేవి రూపొందించాలని అనుకుంది. అందుకోసం తన సృజనాత్మకతకు పదును పెట్టింది. కోణాల అంచులతో కూడిన ఫ్రేమ్లు మహిళ లుక్ని మరింత అందంగా కనిపించేలా చేస్తుందని షినాసి విశ్వసించింది. అందుకోసం తయారీదారులు వద్దకు కాగితపు ముక్కలో ఫ్రేమ్ డిజైన్ డెమోలు ఇచ్చింది. అయితే వాళ్లంతా ఇందులో ప్రత్యేకత ఏమిలేదని కొట్టిపారేశారు. అయినా వెనక్కి తగ్గక తన ప్రయత్నాలు చేసుకుంటూనే పోతూ ఉంది. ఎవరో ఒకరికి నచ్చావా! అన్న ఆశతో ధైర్యంగా ముందుకు వెళ్లింది. చివరి ప్రయత్నంగా స్థానిక దుకాణ యజమానులను ఆశ్రయించి.. వారికి తన కాగితపు ఫ్రేమ్ డిజైన్ గురించి వివరించింది. వారు ఆమె నైపుణ్యాన్ని గుర్తించి మార్కెట్లోకి ఆమె తయారు చేసిన ఫ్రేమ్లని 'హర్లెక్విన్ గ్లాసెస్' పేరుతో తీసుకువచ్చారు. అది విజయవంతమైంది. దీంతో షినాసి పేరు యూఎస్ అంతటా నలుదిశలా వ్యాపించింది. అలా ఆమె సినీరంగంలోకి కూడా ప్రవేశించింది. అంతేగాదు 1960లో తన గురువు, మాజీ టీచర్ జార్జ్ గ్రోజ్తో కలిసి ఒక డాక్యుమెంటరీని నిర్మించింది. షినాసి 1995లో 'ది రోడ్ ఐ హావ్ ట్రావెల్డ్' అనే పేరుతో తన జ్ఞాపకాలకు సంబంధించి ఓ పుస్తకాన్ని ప్రచురించింది. ఆమె ఆగస్టు 19, 1999న మరణించారు. (చదవండి: ఆపిల్ మ్యాప్లో వినిపించే వాయిస్..ఏ మహిళదో తెలుసా!) -
మలయాళ మొదటి హీరోయిన్ ఆమెనే.. గుర్తు చేసిన గూగుల్
ఇప్పుడు సినిమా అంటే రంగుల ప్రపంచం. స్క్రీన్పై మాయ చేసే ఓ కలర్పుల్ ప్రపంచం. మరీ అప్పట్లో సినిమాలు ఎలా ఉండేవో తెలుసా. అప్పటి నటీనటులు బ్లాక్ అండ్ వైట్ తెరపై ఎలా కనిపించారో మీరు కూడా చూసే ఉంటారు. అయితే ఆ కాలంలోనూ అత్యంత అణగారిన వర్గాల నుంచి వెలుగులోకి వచ్చిన నటి పీకే రోజీ. దళితులపై కఠినమైన ఆంక్షలున్న ఆ రోజుల్లో తెరపై కనిపించిన మొట్ట మొదటి మలయాళ నటి ఆమెనే. ఇవాళ ఆమె 120 బర్త్డే సందర్భంగా గూగుల్ ఆమెను గౌరవించింది. గూగుల్ డూడుల్ మొదటి మలయాళ నటిని బర్త్ డే సందర్భంగా ప్రదర్శించింది. ఆ సమయంలో అనేక అడ్డంకులను అధిగమించి సినిమాల్లో నటించింది. పీకే రోజీ 1903లో కేరళలోని త్రివేండ్రంలో(తిరువనంతపురం) రాజమ్మగా జన్మించింది. ఆమెది పేద కుటుంబం. చాలా చిన్న వయస్సులో ఉన్నప్పుడే ఆమె తండ్రి మరణించారు. ఆమె సంగీతం, నటనను గుర్తించిన రోజీ మేనమామ ప్రోత్సాహం అందించారు. నాటకాలు వేస్తూ తనలోని ప్రతిభను చాటుకుంది. ఆ విధంగా కక్కరిసీ అనే నాటకంపై గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నాటకం ఎక్కడ ప్రదర్శించినా అపూర్వ స్పందన వచ్చేది. ఈ క్రమంలోనే అప్పటి ఫిల్మ్ మేకర్ జేసీ డేనియల్ దృష్టిని ఆకర్శించారామె. ఆ తర్వాత తాను తీయబోయే విగతుకుమారన్ అనే చిత్రానికి రోజీని తన సినిమాలో హీరోయిన్గా తీసుకున్నారు. దీంతో మొట్టమొదటి దళిత హీరోయిన్గా రోజీ నిలిచింది. అయితే ఈ సినిమాలో పీకే రోజీ అగ్ర వర్ణ కులానికి చెందిన మహిళగా నటించారు. దీన్ని ఆ వర్గం వారు కొందరు వ్యతిరేకించారు. అంతేకాదు కాకుండా సినిమా ప్రారంభోత్సవానికి ఆమెను ఆహ్వానించొద్దని కూడా నిరసన చేశారు. సినిమా ప్రదర్శన సమయంలో తెరపై కొందరు రాళ్లు విసిరేశారట. అప్పటికీ కోపం తగ్గని వారంతా కలిసి రోజీ ఏదో నేరం చేసిందన్నట్టుగా ఇంటికి నిప్పు పెట్టారు. ఆ తర్వాత రోజీ ఓ లారీలో తమిళనాడుకు పారిపోయారని.. అక్కడ లారీ డ్రైవర్ కేశవన్ పిళ్లైని పెళ్లి చేసుకొని రాజమ్మాళ్ పేరుతో అక్కడే స్థిరపడిపోయారని సమాచారం. ఆమె ఒక నటి అన్న సంగతి కూడా ఆమె పిల్లలకు తెలియదని చెబుతారు. తాజాగా ఇవాళ (ఫిబ్రవరి 10) ఆమె జయంతి సందర్భంగా గూగుల్ డూడుల్తో గుర్తుకు తెచ్చింది. -
గూగుల్ను మెప్పించి.. విజేతగా నిలిచిన శ్లోక్
దేశవ్యాప్తంగా వందకిపైగా నగరాలు.. లక్షా పదిహేను ఎంట్రీలు.. ఆ మొత్తంలో గూగుల్ను మెప్పించి విజేతగా నిలిచాడు ఓ కుర్రాడు. ఆ డూడుల్ ఇప్పుడు బాలల దినోత్సవం సందర్భంగా.. గూగుల్ హోం పేజీలో దర్శనమిస్తోంది. గూగుల్ సోమవారం ఉదయం డూడుల్ ఫర్ గూగుల్ 2022 పోటీల ఫలితాలను ప్రకటించింది. ఈ పోటీలో పశ్చిమ బెంగాల్ కోల్కతాకు చెందిన శ్లోక్ ముఖర్జీగా విజేతగా నిలిచాడు. ఇండియా ఆన్ ది సెంటర్ స్టేజ్ అనే డూడుల్ను రూపొందించాడు శ్లోక్. అది స్ఫూర్తిదాయకంగా ఉందని ప్రకటించింది గూగుల్. సోమవారం ఆ డూడుల్ Google.co.inలో ప్రదర్శితమవుతోంది. న్యూటౌన్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాడు శ్లోక్. ‘‘రాబోయే పాతికేళ్లలో.. మానవాళి అభివృద్ధికి నా దేశ శాస్త్రవేత్తలు తమ సొంత పర్యావరణ అనుకూల రోబోట్ను అభివృద్ధి చేస్తారు. భారతదేశం భూమి నుంచి అంతరిక్షానికి క్రమం తప్పకుండా ఇంటర్ గెలాక్టిక్ ప్రయాణాలను చేస్తుంటుంది. యోగా, ఆయుర్వేదంలో దేశం మరింత అభివృద్ధి చెందుతుంది. రాబోయే రోజుల్లో దేశం మరింత బలపడుతుంది’’ అంటూ తన డూడుల్ సందేశంలో పేర్కొన్నాడు. దేశవ్యాప్తంగా మొత్తం వంద నగరాల నుంచి లక్షా 15వేల ఎంట్రీలు వచ్చాయి ఈ పోటీకి. ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులు ఈ పోటీకి అర్హులు. మొత్తం ఎంట్రీల నుంచి చివరగా 20 మందిని ఎంపిక చేశారు. చివరికి శ్లోక్ను విజేతగా ప్రకటించారు. గూగుల్ డూడుల్ టీంతో పాటు న్యాయనిర్ణేతల ప్యానెల్లో ప్రముఖ నటి, ఫిల్మ్ మేకర్ నీనా గుప్తాతో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారు. డూడుల్ ఫర్ గూగుల్ పోటీలు.. యువతరంలో సృజనాత్మకతను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. -
62 ఏళ్లపాటు అలరించిన అమృత గానం ఆయనది
ట్రెండింగ్.. ఇవాళ గూగుల్ ఓపెన్ చేశారా?. పైన హార్మోనియం వాయిస్తున్నట్లు ఓ చిత్రం కనిపించిందా?. ఆ చిత్రంలో ఉంది ఎవరో కాదు.. భారత దేశం గర్వించదగ్గ ప్రముఖ సంగీత విద్వాంసుడు.. భూపేన్ హజారికా. ఇవాళ ఆయన జయంతి. అందుకే గూగుల్ అలా డూడుల్తో గౌరవించింది. భూపేన్ హజారికా.. సుధాకాంత(కోకిల)గా పాపులర్ అయిన ప్రముఖ సంగీత దర్శకుడు. ఆరు దశాబ్దాలపాటు తన గాత్రంతో సంగీత ప్రియుల్ని అలరించారాయన. వందల కొద్దీ పాటలు పాడి గాయకుడిగానే కాకుండా ఫిల్మ్మేకర్గా, రచయితగా కూడా సాహిత్య లోకానికి సేవలందించారు. మరోవైపు ఎమ్మెల్యేగానూ ఆయన రాజకీయ రంగంలో రాణించారు. అంతేనా.. నటుడిగా కూడా వందల చిత్రాల్లో అస్సామీ ఆడియెన్స్ను అలరించారు ఆయన. ఇద్దరూ గానకోకిలలే.. లతా మంగేష్కర్తో హజారికా (పాత చిత్రం) ► హజారికా.. సెప్టెంబర్ 8, 1926లో అస్సాంలో జన్మించారు. బ్రహ్మపుత్ర తీరం వెంట ఆయన బాల్యం గడిచింది. ఆ తీరం వెంటే జానపద కథలు, గేయాలు వినుకుంటూ పెరిగారాయన. విశేషం ఏంటంటే.. హజారికా తన పదేళ్ల వయసులోనే తొలి పాటను రికార్డ్ చేశారు. ► అస్సాంకు చెందిన ప్రముఖ రచయిత జ్యోతిప్రసాద్ అగర్వాల ప్రోత్సాహంతో హజారికా రాటుదేలారు. ► 1946లో బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి ఆయన ఎంఏ పూర్తి చేశారు. న్యూయార్క్లో కొంతకాలం జీవించిన ఆయన.. 1952 కొలంబియా యూనివర్సిటీ నుంచి మాస్ కమ్యూనికేషన్లో పీహెచ్డీ అందుకున్నారు. ► హజారికా గాన ప్రస్థానం గువాహతి ఆల్ఇండియా రేడియో నుంచి మొదలైంది. బెంగాలీ పాటలను హిందీలోకి అనువదించి.. గాత్రం అందించారు. ► ఆయన అందించిన సాహిత్యం.. గాత్రంలో నవరసాలు పండేవి. ► రుడాలి, మిల్ గయి మాంజిల్ ముఝే, సాజ్, దార్మియారీ, గజగామిని, దామన్, క్యూన్ తదితర చిత్రాల్లో ఆయన పాడిన సూపర్ హిట్ సాంగ్స్ కల్ట్ క్లాసిక్గా మిగిలాయి. ► ఈశాన్య భారతం నుంచి.. అస్సాం జానపద సాహిత్యాన్ని యావత్ దేశానికి పరిచయం చేసింది ఈయనే. ► రాజకీయాల మీద ఆసక్తితో ఆయన అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు 1967లో పోటీ చేశారు. నౌబోయిచా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. అయితే.. తిరిగి 2004లోనూ లోక్సభ ఎన్నికలకు బీజేపీ తరపు నుంచి పోటీ చేసి.. కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ► సంగీతానికి, సంప్రదాయానికి ఆయన అందించిన సేవలకుగానూ.. సంగీత నాటక అకాడమీ అవార్డుతో పాటు దాదాసాహెబ్ పాల్కే అవార్డు, పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. ► 1998 నుంచి ఐదేళ్లపాటు సంగీత నాటక అకాడమీ చైర్మన్గా ఆయన పని చేశారు. ► 2011లో అనారోగ్యంతో ముంబై కోకిలాబెన్ ఆస్పత్రిలో చేరారు. ఐసీయూలో ఐదు నెలలపాటు చికిత్స పొందుతూ.. చివరికి అవయవాల పని ఆగిపోవడంతో నవంబర్ 5వ తేదీన కన్నుమూశారు. అస్సాంకు గౌరవం తీసుకొచ్చిన ఆయన అంత్యక్రియలకు లక్షల మంది హాజరయ్యారు. ► మరణాంతరం.. 2012లో ఆయనకు పద్మభూషణ్ పురస్కారం దక్కింది. ► 2019లో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న గౌరవం ఆయనకు దక్కింది. ► అస్సామీ భాషలో మానవత్వం, సోదరభావం పెంపొందించేలా ఆయన పాటలు రాసి.. పాడారు. ► తన జీవితంలో తొలినాళ్లలో.. కోయిబర్టా కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని సంగీత విద్వాంసుడిగా అంగీకరించని అగ్రవర్ణ కులతత్వానికి వ్యతిరేకంగా పోరాడారు ఆయన. అయితే ఈ చర్యకు బదులుగా.. ఆయన ప్రేమించిన బ్రహ్మణ యువతిని ఆయనకు దూరం చేశారు. చివరికి.. కుల-వ్యతిరేక సమాజంపై ఆయన ప్రతీకారం తీరింది. అదెలాగంటే.. ఓ బ్రహ్మణ యువతిని వివాహం చేసుకోవడం ద్వారానే!. ► ముంబైకి చెందిన గెస్ట్ ఆర్టిస్ట్ రుతుజా మాలి, హజారికా 96వ జయంతి సందర్భంగా ఈ డూడుల్ను క్రియేట్ చేశారు. -
Anna Mani: నాన్నా.. నేనెందుకు చదువుకోకూడదు?!
ఒకప్పటి పరిస్థితులు వేరే!. పురుషాధిక్య సమాజంలో పలు రంగాల్లోనూ మహిళలకు ప్రాధాన్యం తక్కువగానే ఉండేది. అయితే అలాంటి తారతమ్యాలను నిలదీసి.. తాను ఎందులోనూ ఎవరికీ తీసిపోనని నిరూపించుకున్నారు అన్నా మణి. విచిత్రమేంటంటే.. ఆమె పోరాటం మొదలైంది ఇంటి నుంచే!. అన్నా మణి.. భారత వాతావరణ సూచన తల్లి mother of Indian weather forecast గా పేర్కొంటారు. 1918 కేరళ పీర్మేడ్లో సిరియన్-క్రిస్టియన్ కుటుంబంలో పుట్టారామె. చాలా ఉన్నత కుటుంబం, విద్యావంతుల కుటుంబం ఆమెది. కానీ, ఆడబిడ్డలు వివాహానికే పరిమితం కావాలనే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. ఆ సంప్రదాయానికి స్వస్తి చెప్పే పోరాటం చేసింది అన్నా మణి. తాను చదువుకోవాలని.. చదువు తన హక్కుగా పేర్కొంటూ తండ్రిని ఒప్పించి.. స్కూల్లో చేరింది. బాల మేధావిగా, భౌతిక శాస్త్రవేత్తగా, ఉపన్యాసకురాలిగా, వాతావరణ నిపుణురాలిగా.. అన్నింటికి మించి భారత వాతావరణ శాఖకు ఆమె అందించిన సేవలు.. ఈనాటికీ చిరస్మరణీయం. అన్నా మణి జయంతి నేడు(ఆగస్టు 23). ఈ 104వ జయంతి ఉత్సవాల సందర్భంగా.. భారత వాతావరణ సూచన తల్లికి గౌరవార్థం గూగుల్ డూడుల్ రిలీజ్ చేసింది గూగుల్. ► తన ఎనిమిదవ పుట్టినరోజుకు ఇంట్లో వాళ్లు డైమండ్ ఇయర్ రింగ్స్ కానుకగా ఇచ్చారు. కానీ, అన్నా మణి మాత్రం వాటిని తీసుకోలేదు. వాటికి బదులు.. Encyclopædia Britannica కావాలని ఆమె పెద్ద గొడవే చేసిందట. ► పబ్లిక్ లైబ్రరీలో పుస్తకాలను పన్నెండేళ్ల వయసులోనే తిరగేసింది. బాల మేధావిగా గుర్తింపు. ► మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఖాదీ ఉద్యమంలో పాల్గొన్నారు. నారీ శక్తికి ఉదాహరణగా.. దేశభక్తిని ప్రదర్శించింది. ► చెన్నైలో ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారామె. ► ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో.. రీసెర్చ్ స్కాలర్షిప్ గెల్చుకుంది. ► లండన్ ఇంపీరియల్ కళాశాలలో ఫిజిక్స్ అభ్యసించింది. కానీ, ఆ తర్వాత వాతావరణ శాస్త్రం పట్ల ఆసక్తికనబర్చింది. ► పీహెచ్డీ కల మాత్రం కలగానే మిగిలిపోయింది అన్నా మణికి. ► డబ్యూసీసీలో ఉపన్యాసకురాలిగా పని చేయడంతో పాటు.. సీవీ రామన్ దగ్గర ఐఐఎస్లో స్పెక్ట్రోస్కోపీ అభ్యసించారామె. ► 1948లో భారత్ను తిరిగొచ్చిన ఆమె.. ఆమె భారతదేశంలో ఉత్పత్తి చేయడానికి దాదాపు 100 వాతావరణ పరికరాలను ప్రామాణికం చేసింది. ► వాయు వేగం, సోలార్ ఎనర్జీ కొలమానం కోసం పరికరాలను తయారు చేసి.. వాటితో ఒక వర్క్షాప్ను ఏర్పాటు చేశారు. ► పురుషాధిక్య సమాజం.. రంగంలోనూ ఆమె తన ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. ► భారత వాతావరణ శాఖ ఐఎండీకి డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా ఆమె విధులు నిర్వహించారు. ► 1987లో ఐఎన్ఎస్ఏ కేఆర్ రామనాథన్ మెడల్తో ఆమెను సత్కరించింది ప్రభుత్వం. ► గుండె సంబంధిత సమస్యలతో.. 2001, ఆగస్టు 16న ఆమె కన్నుమూశారు. ► సోలార్ రేడియేషన్, ఓజోన్, విండ్ ఎనర్జీ కొలమానం కోసం ఎన్నో పరిశోధనలు చేసి.. వ్యాసాలు రాశారు. ► కేవలం తన విద్యా-విజ్ఞాన సుముపార్జన, ఆసక్తి ఉన్న రంగంపైనే దృష్టి పెట్టిన ఆమె వివాహానికి దూరంగా ఉన్నారు. ► ప్రపంచ వాతావరణ సంస్థ 100వ జయంతి సందర్భంగా ఆమెను గుర్తుచేసుకుంది మరియు అన్నా ఇంటర్వ్యూతో పాటు ఆమె జీవిత ప్రొఫైల్ను ప్రచురించింది. -
ప్చ్.. ఆస్కార్కు ఆస్కార్ మాత్రం రాలేదు!
సినీ ప్రపంచంలో ఆయనొక సంచలనం. ఒకరకంగా ఎలక్ట్రానిక్ మ్యూజిక్కు మార్గదర్శకుడు. అయినా ఆయనకు ప్రతిష్టాత్మక ‘ఆస్కార్’ మాత్రం రాలేదు. ఆయనే ఆస్కార్ సాలా. ఇవాళ ఆయన జయంతి. ఈ సందర్భంగా గూగుల్ డూడుల్తో నివాళి ఇచ్చింది. బెర్లిన్: భౌతిక శాస్త్రవేత్త, ఎలక్ట్రానిక్ సంగీత స్వరకర్త ఆస్కార్ సాలా 112వ జయంతి వేడుకలను గూగుల్ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రత్యేక డూడుల్ ద్వారా ఆస్కార్ సాలాకు నివాళులర్పించింది. జర్మనీలోని గ్రీజ్లో 1910లో జన్మించిన ఆస్కార్ను ఎలక్ట్రానిక్ మ్యూజిక్కు మార్గదర్శకుడిగా పిలుస్తారు. ఆయన 1930లో ఎలక్ట్రానిక్ సింథసైజర్తో చేసిన 'ట్రాటోనియం' అనే పరికరాన్ని వాయించేవారు. ఆస్కార్ సాలా తల్లి గాయని కాగా.. తండ్రి సంగీతంలో ప్రావీణ్యం ఉన్న వ్యక్తి.. కంటి డాక్టర్ కూడా. సంగీతంలోనే పుట్టి పెరిగారు ఆస్కార్ సాలా. చిన్న వయసులోనే పియానో వాయిస్తూ కన్సెర్ట్లు ఇచ్చేవారు. బెర్లిన్కు చెందిన వయోలిస్ట్ పాల్ హిందెమిత్ వద్ద పియోనో వాయించటం నేర్చుకున్నారు. ఆ తర్వాత ఫ్రెడరిక్ ట్రాట్వీన్ కనిపెట్టిన ఎలక్ట్రానిక్ సింథసైజర్ ట్రాటోనియంపై ఆసక్తి పెంచుకున్నారు. దాంతో పాటు భౌతికశాస్త్రం, స్వరకల్పనపై ఆసక్తి పెరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకు మిక్సర్ ట్రాటోనియంను అభివృద్ధి చేశారు. ప్రత్యేక డిజైన్లో ఒకేసారి పలు రకాల శబ్దాలు, మాటలను వినిపించేలా ఉండటం దాని ప్రత్యేకత. ఒక స్వరక్తరగా, ఎలక్ట్రో ఇంజినీర్గా ఎలక్ట్రానిక్ మ్యూజిక్లో విశేష సేవలందించారు. సినిమాలకు సంగీతం.. 1940-50 మధ్య చాలా సినిమాలకు పని చేశారు ఆస్కార్ సాలా. ఆ తర్వాత తన సొంత స్టూడియోలో చాలా సినిమాలకు ఎలక్ట్రానిక్ సౌండ్ట్రాక్స్ను అందించారు. అలాగే.. రేడియో, టీవీ కార్యక్రమాలతో పాటు రోస్మ్యారీ(1959), ద బర్డ్స్(1962) చిత్రాలకు సంగీతం అందించారు. ఆ తర్వాత.. క్వార్టెట్ ట్రాటోనియం, కన్సెర్ట్ ట్రాటోనియం, వోల్క్స్ట్రాటోనియంలను అభివృద్ధి చేశారు. 1995లో జర్మనీ మ్యూజియంకు తన మిక్సర్ ట్రాటోనియంను విరాళంగా ఇచ్చారు. ఎలక్ట్రానిక్ మ్యూజిక్లో ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు.. ఒక్క ఆస్కార్ తప్ప.! ఇదీ చదవండి: గూగుల్ని తిట్టిపోస్తున్న నెటిజన్లు...నివాళి ఇచ్చే పద్ధతి ఇదేనా! -
గూగుల్ మెచ్చిన డైరీ... నాటి అమానవీయ పరిస్థితులకు అద్దం పట్టేలా..
ప్రత్యేకత సంతరించుకున్నరోజులను గూగుల్ తన డూడుల్ స్లైడ్ షోతో తెలియపరుస్తుంది. ఆ రోజు ప్రాముఖ్యతను ఈ డూడుల్ షో మనకు స్పురింపజేస్తుంది. ఇంతవరకు మనం ఎన్నో పుస్తకాల గురించి విన్నాం. ఎందరో రచయితలు ఎన్నో గొప్ప గొప్ప పుస్తకాలు రాశారు.. వాటిల్లో అత్యధికంగా అమ్ముడైన పుస్తకాలూ ఉన్నాయి. కానీ ఈరోజు గూగుల్ స్లైడ్ షో ఒక యువతి రాసిన డైరీని దాని సారాంశం గురించి తెలియజేసింది. ఏంటా డైరీ? ఏమిటీ దాని ప్రత్యేకత? ఎందుకు గూగుల్ సైతం ఆ డైరీకి ప్రాముఖ్యత ఇచ్చిందో తెలుసుకుందాం! వివరాల్లోకెళ్తే...హోలో కాస్ట్ బాధితురాలు (జాతి ప్రక్షాళన లేదా సాముహిక విధ్వంసం) అన్నే ఫ్రాంక్ జ్ఞాపకాలకు సంబంధించిన డైరీ. ఈ డైరీ ప్రచురణకు 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా గూగుల్ ఈ అందమైన డూడుల్ షోతో తెలియపరిచింది. ఈ డూడుల్ని ఆర్ట్ డైరెక్టర్ థోకా మేర్ రూపొందించారు. అన్నే ఫ్రాంక్ కేవలం15 ఏళ్ల వయసులో ఈ డైరీని రాసింది. ఆమె యూదు డచ్ జర్మన్. అన్నే ఫ్రాంక్ జూన్ 12, 1929న జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో ఒట్టో, ఎడిత్ ఫ్రాంక్లకు జన్మించారు. ఐతే ఆమె కుటుంబం నాజీ పార్టీ చేస్తున్న హింస, వివక్షత నుంచి తప్పించుకోవడానికి నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్కు తరలివెళ్లింది. ఆమెకు 10 ఏళ్ల వయసులో ఉండగా రెండోవ ప్రపంచ యుద్ధం రాజుకుంది. దీంతో అన్నే కుటుంబం ఆమె తండ్రి కార్యాలయంలోని రహస్య ప్రదేశంలో తలదాచుకుంది. ఐతే నాజీ సీక్రెట్ సర్వీస్ వారిని గుర్తించి నిర్బంధానికి తరలించింది. ఆమె 15 ఏళ్ల వయసులో ఎదుర్కొన్న అవమానీయ పరిస్థితులును, సంఘటనలను తన డైరీలో పొందుపరిచింది. ఆ తర్వాత ఆ డైరీని పుస్తకంగా ప్రచురించారు. కాలక్రమేణ నాన్ ఫిక్షన్ రచనలలో ఒకటిగా మారింది. అంతేకాదు 80 కంటే ఎక్కువ భాషల్లో అనువదింపబడిన అన్నే ఫ్రాంక్ జ్ఞాపకాల దొంతర. నాటి వివక్ష, దౌర్జన్యం, భయంకరమైన ప్రమాదాల గురించి రానున్న తరాలు తెలుసుకునేలా అవగాహన కల్పించడానికి ఒక ముఖ్య సాధనంగా ఉపకరిస్తుంది. Dear Kitty, Today, we are revisiting the day #AnneFrank’s greatest wish came true. Our #GoogleDoodle marks the day ‘The Diary of a Young Girl’ was published, which held a first-hand account of Anne about the years she spent in hiding: https://t.co/kNmBipFoUb. pic.twitter.com/je8SkNuqpF — Google India (@GoogleIndia) June 25, 2022 -
డియర్ ఐన్స్టీన్ సార్.. నేనెవరో మీకు తెలీదు
అల్బర్ట్ ఐన్స్టీన్.. ఓ ప్రపంచం మేధావి. అలాంటిది అపరిచితుడిగా పరిచయం చేసుకుంటూనే ఆయన నుంచి ‘శెభాష్’ అనిపించుకున్నాడు భారత్కు చెందిన యువ శాస్త్రవేత్త. ఆయనే సత్యేంద్ర నాథ్ బోస్. భౌతిక శాస్త్రం(ఫిజిక్స్)లో వీళ్లిద్దరి కృషికి బోస్-ఐన్స్టీన్ గణాంకాలుగా గుర్తింపు దక్కించుకుంది. ఆ గుర్తింపు దక్కి నేటికి 98 ఏళ్లు అవుతుంది. 1924, జూన్ 4వ తేదీన జర్మనీ భౌతిక శాస్త్రవేత్త ఐన్స్టీన్.. భారత్కు చెందిన సత్యేంద్రనాథ్ బోస్ కృషిని గుర్తించారు. క్వాంటమ్ మెకానిక్స్లో బోస్ కనిపెట్టిన థియరీతో ఏకీభవించారు ఐన్స్టీన్. అంతేకాదు స్వయంగా ఆయనే జర్మన్లోకి అనువదించి మరీ.. బోస్ పేరిట వ్యాసం ప్రచురించారు. భౌతిక శాస్త్రంలో అరుదైన ఈ ఘట్టానికి 98 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. గూగుల్ సత్యేంద్రనాథ్ బోస్ గౌరవార్థం డూడుల్ను రిలీజ్ చేసింది. ‘‘డియర్ సర్, మీ పరిశీలన, అభిప్రాయం కోసం నేను మీకు ఈ కథనాన్ని పంపించాను. క్లాసికల్ ఎలెక్ట్రోడైనమిక్స్ నుండి స్వతంత్రంగా ప్లాంక్ నియమం లోని గుణకం 8π ν2/c3ను తగ్గించడానికి నేను ప్రయత్నించాను. దశ-అంతరాళంలో అంతిమ ప్రాథమిక ప్రాంతంలో కంటెంట్ h3 ఉందని మాత్రమే ఊహిస్తారు. ఈ పరిశోధనా పత్రాన్ని అనువదించడానికి నాకు తగినంత జర్మన్ భాష తెలియదు. ఈ పత్రం ప్రచురణ విలువైనదని మీరు అనుకుంటే, మీరు దాని ప్రచురణను "జైట్స్క్రిఫ్ట్ ఫర్ ఫిజిక్" లో వచ్చేటట్లు చేస్తే నేను కృతజ్ఞుడను. నేను ఎవరో మీకు తెలియదు. అలాంటి అభ్యర్థన చేయడంలో నాకు ఏమాత్రం సంకోచం లేదు. ఎందుకంటే మీ రచనల ద్వారా మీ బోధనల ద్వారా లాభం పొందిన మేమంతా మీ విద్యార్థులం. సాపేక్షతపై మీ పత్రాలను ఆంగ్లంలో అనువదించడానికి కలకత్తాకు చెందిన ఎవరైనా మీ అనుమతి కోరినట్లు మీకు ఇంకా గుర్తుందో,లేదో నాకు తెలియదు. మీరు ఆ అభ్యర్థనను అంగీకరించారు. అప్పటి నుండి ఆ పుస్తకం ప్రచురించబడింది. సాధారణీకరించిన సాపేక్షతపై మీ పరిశోధనా పత్రాలను నేనే అనువదించాను. మీరు ఏమనుకుంటున్నారో తెలుసుకోవటానికి నేను ఆత్రుతగా ఉన్నాను’’ అంటూ లేఖ పంపారు సత్యేంద్రనాథ్ బోస్. ► ఇండియన్ ఫిజిక్స్ త్రిమూర్తులుగా.. సర్ సీవీరామన్, మేఘనాథ్ సాహా, సత్యేంధ్రనాథ్ బోస్లకు పేరుంది. ► ఫిజిక్స్ కణ భౌతికశాస్త్రంలో వినిపించే హిల్స్ బోసన్(దైవకణాలు) అనే పదంలో.. బోసాన్ అంటే ఏంటో కాదు.. బోస్ పేరు మీదే బ్రిటిష్ సైంటిస్ట్ పాల్ డిరాక్ అలా నామకరణం చేశారు. ► బోస్-ఐన్స్టీన్ స్టాటిక్స్కుగానూ.. 1956లో నోబెల్ బహుమతికి నామినేట్ అయ్యారు. ఫిజిక్స్పై ఆయన పరిశోధలను, రచనలను నోబెల్ కమిటీ పట్టించుకోలేదు. ► కానీ, బోస్ ప్రతిపాదించిన బోసన్, బోస్-ఐన్స్టీన్ థియరీల ఆధారంగా చేపట్టిన పరిశోధనలకు ఏడు నోబెల్ బహుమతులు వచ్చాయంటే ఆయన కృషి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ► 1954లో భారత ప్రభుత్వం సత్యేంద్రనాథ్ బోస్ను పద్మవిభూషణ్తో సత్కరించింది. ► పలు యూనివర్సిటీలలో బోధకుడిగా, పరిశోధనా కమిటిలలోనూ ఆయన పని చేశారు. ► సత్యేంద్రనాథ్బోస్.. పశ్చిమ బెంగాల్ కోల్కతా(కలకత్తా)లో ఓ సాధారణ కుటుంబంలో జన్మించారు. ► ప్రఫుల్ల చంద్రరాయ్, జగదీశ్చంద్రబోస్లు ఈయనకు గురువులు. ► లూయిస్ డి బ్రోగ్లీ, మేరీ క్యూరీ , ఐన్స్టీన్లతో కలిసి పని చేసే అవకాశం దక్కింది ఈయనకు. ► అనువర్తిత గణితశాస్త్రంలో ఎమ్మెస్సీ కలకత్తా యూనివర్సిటీ నుంచి పూర్తి చేశాడాయన. ► 1974 ఫిబ్రవరి 4వ తేదీన 80 ఏళ్ల వయసులో కలకత్తాలోనే ఆయన కన్నుమూశారు. ► కేవలం ఫిజిక్స్ మాత్రమేకాదు.. మ్యాథ్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఆర్ట్స్లోనూ ఆయన ఎంతో కృషి చేశారు. ► నోబెల్ దక్కకపోతేనేం.. ఈ మేధావి మేధస్సును గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు కొనియాడారు. మాతృదేశం గుర్తించింది. నేడు భౌతిక శాస్త్రంలో పరిశోధనలు చేస్తున్న పరిశోధకులు.. తమ పరిశోధనలతో ఆయన కృషిని నిరంతరం గుర్తు చేస్తూ ఉన్నారు. -
ఓటమి ఎరుగని వీరుడు.. గామా ది గ్రేట్!
ఆదివారం (నిన్న) గూగుల్ డూడుల్ చూశారా? ఆయనెవరో గుర్తుపట్టారా? తన జీవితంలో ఒక్కసారి కూడా ఓటమి ఎరుగని రెజ్లింగ్ చాంపియన్ ‘గామా పహిల్వాన్’.. ఇంకా చెప్పాలంటే ‘గామా ది గ్రేట్’. మనోడే.. ఆయనను చూస్తేనే ప్రపంచంలోని ప్రఖ్యాత రెజ్లర్లు గడగడా వణికిపోయేవారంటే.. గామా పహిల్వాన్ రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఆదివారం ఆయన 144వ జయంతి సందర్భంగా గూగుల్ ప్రత్యేకమైన ‘డూడుల్’తో నివాళి అర్పించింది. సోమవారం (మే 23) ఆయన 62వ వర్ధంతి కూడా.. ఈ నేపథ్యంలో ఆ మహాబలుడి గురించి తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ గామా పహిల్వాన్ అసలు పేరు గులామ్ మహమ్మద్ భక్ష్ భట్. పంజాబ్లోని జబ్బోవల్ గ్రామంలో 1878 మే 22న జన్మించాడు. చిన్నవయసు నుంచే వ్యాయామాలు అలవాటు చేసుకున్న ఆయన.. 1888లో జరిగిన స్క్వాట్స్ పోటీలో పాల్గొన్నాడు. దేశవ్యాప్తంగా 400 మందికిపైగా రెజ్లర్లు పాల్గొన్న ఆ పోటీలో గెలవడం ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించాడు. 15 ఏళ్లకే రెజ్లింగ్ మొదలుపెట్టాడు. 1910లో 22 ఏళ్ల వయసులోనే భారత ప్రపంచ హెవీ వెయిట్ రెజ్లింగ్ చాంపియన్షిప్ గెలుచుకున్నాడు. 1927లో ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్ సాధించాడు. ఓటమి మాటే తెలియకుండా.. సాధారణంగా బాక్సర్లకు తమ ఎత్తు బాగా కలిసొస్తుంది. మరి గామా పహిల్వాన్ ఎత్తు 5.7 అడుగులే. 120 కిలోల బరువు ఉండేవాడు. రోజుకు 5 వేల స్క్వాట్స్ (గుంజిళ్ల వంటివి), మరో మూడు వేల పుషప్స్ చేసేవాడు. రాళ్లతో తయారుచేసిన 96 కిలోల బరువున్న చక్రాన్ని ఎత్తుకుని స్క్వాట్స్ చేసేవాడు. మరెన్నో ప్రత్యేక వ్యాయామాలనూ రూపొందించాడు. తాను 22 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే.. 1,200 కిలోల గుండ్రాయిని ఎత్తి రికార్డు సృష్టించాడు. అది ఇప్పటికీ బరోడా మ్యూజియంలో ఉంది. ♦ పోటీ ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా సరే.. గామా పహిల్వాన్ కొద్ది నిమిషాల్లోనే ముగించేవాడు. 1927 ప్రపంచ చాంపియన్షిప్ పోటీల్లో, ఆ తర్వాత జరిగిన విదేశీ టోర్నీల్లో.. అప్పటి ప్రపంచ ప్రఖ్యాత యూరప్, అమెరికన్ రెజ్లర్లు ఫ్రాంక్ గోట్చ్, బెంజమిన్ రోలర్, మౌరిస్ డెరిజ్, జోహన్ లెమ్, జెస్సీ పీటర్సన్ వంటివారిని వరుసగా ఓడించాడు. ♦ తర్వాత కూడా తనతో పోటీకి రావాలని అమెరికా, యూరప్ రెజ్లర్లతోపాటు జపాన్కు చెందిన టారో మియాకె, రష్యాకు చెందిన జార్జ్ హకెన్షిమిట్ వంటివారికీ గామా పహిల్వాన్ సవాల్ చేశాడు. కానీ ఎవరూ ముందుకురాలేదు. చివరికి ఒకరి తర్వాత ఒకరుగా 20 మంది రెజ్లర్లు వచ్చినా అందరితో పోరాడుతానని.. తాను ఓడిపోతే ప్రపంచ చాంపియన్షిప్ ప్రైజ్మనీని కూడా తిరిగిచ్చేస్తానని సవాల్ చేశాడు. అయినా గామాతో పోటీ పడేందుకు ఎవరూ ధైర్యం చేయకపోవడం గమనార్హం. నిజాం యోధులనూ ఓడించి 1940లో నిజాం రాజు గామా పహిల్వాన్ను హైదరాబాద్కు పిలిపించి పోటీలు నిర్వహించాడు. నిజాం జనానాలోని మల్లయోధులందరినీ గామా పహిల్వాన్ ఓడించాడు. దీనితో నిజాం అతడిని సన్మానించి పంపాడు. గామాకు బ్రూస్లీ ఫ్యాన్.. గామా పహిల్వాన్కు ప్రపంచ ప్రఖ్యాత మార్షల్ ఆర్టిస్ట్ బ్రూస్లీ పెద్ద ఫ్యాన్. గామా నుంచి స్ఫూర్తి పొంది కొన్ని వ్యాయామాలను తాను అనుసరించినట్టు బ్రూస్లీ చాలాసార్లు చెప్పడం గమనార్హం. ♦ గామా పహిల్వాన్ శకం నడిచినప్పుడు భారత్ బ్రిటీషు పాలనలో ఉంది. బ్రిటిష్ రాచ కుటుంబానికి చెందిన ప్రిన్స్ ఆఫ్ వేల్స్ గామాను సన్మానించి.. ఒక వెండి గదను బహూకరించాడు. హిందువులను కాపాడి.. దేశ విభజన సమయంలో గామా పహిల్వాన్ పాకిస్తాన్కు వెళ్లిపోయాడు. ఆ సమయంలో అక్కడి హిందువులు ఎంతో మందిని ఆయన కాపాడారని చెప్తారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భార్య కుల్సుమ్ గామా పహిల్వాన్ మనవరాలే. 50 ఏళ్లకుపైగా రెజ్లింగ్లో ఎదురులేని వీరుడిగా నిలిచి.. 74 ఏళ్ల వయసులో 1952లో రిటైరయ్యాడు. తర్వాత ఎనిమిదేళ్లకు 1960 మే 23న లాహోర్లో కన్నుమూశాడు. పారిపోయిన ప్రపంచ చాంపియన్ 1910 లండన్ ప్రపంచ చాంపియన్షిప్ పోటీల్లో అప్పటివరకు ప్రపంచ చాంపియన్గా ఉన్న బ్రిటిష్ స్టానిస్లస్ జిబిజ్కో.. గామా పహిల్వాన్ ధాటిని తట్టుకోలేకపోయాడు. ఓటమిని అంగీకరించకుండా.. తరచూ బోర్లా పడుతూ మ్యాట్ను పట్టుకుని ఉండిపోతూ వచ్చాడు. ఇలా రెండున్నర గంటలకుపైగా సాగిన మ్యాచ్ను డ్రాగా ప్రకటించారు. తర్వాత వారం రోజులకే వారిద్దరి మధ్య మళ్లీ పోటీ పెట్టారు. జిబిజ్కో భయంతో మ్యాచ్కు రాకపోవడంతో.. గామా పహిల్వాన్ను విజేతగా ప్రకటించారు. తర్వాత 1928లో మన దేశంలోని పటియాలాలో జరిగిన చాంపియన్షిప్లో జిబిజ్కో–గామా పహిల్వాన్ మధ్య పోటీ పడింది. జిబిజ్కోను గామా కేవలం రెండు నిమిషాల్లో మట్టికరిపించాడు. అప్పుడే ‘గామా పహిల్వాన్ పులి’ అంటూ జిబిజ్కో ప్రకటించాడు. (క్లిక్: చరిత్ర సృష్టించిన ఐపీఎల్ 2022..) -
గూగుల్.. ఆడవాళ్లు మీకు జోహార్లు
వివక్ష.. ఇది కనిపించని రంగమంటూ లేదు. అయితే ఈ పరిస్థితిని మార్చే ప్రయత్నాలు మాత్రం జరుగు... తూనే ఉన్నాయి. ఈ తరుణంలో మహిళల క్రికెట్కు ఆదరణ గతకొంతకాలంగా పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఐసీసీ మహిళల ప్రపంచ కప్ పోటీలు మొదలుకాగా.. ఈ టోర్నీకి మద్ధతుగా గూగుల్ డూడుల్తో ప్లేయర్లకు జోహార్లు చెప్పింది. 12వ ఎడిషన్ మహిళా క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు మార్చి 4న ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ 3వ తేదీ దాకా జరగబోయే ఈ టోర్నీ కోసం గూగుల్ డూడుల్ను రిలీజ్ చేసింది. ఆరుగురు ప్లేయర్లు ప్రేక్షకుల మధ్య గేమ్లో మునిగిపోయినట్లు ఉండే డూడుల్ ఇది. గూగుల్ హోం పేజీలో ఈ డూడుల్ను మీరూ గమనించొచ్చు. క్లిక్ చేయగానే స్కోర్ బోర్డుకు వెళ్లడంతో పాటు బాల్స్ ఎడమ నుంచి కుడికి దూసుకెళ్లడం చూడొచ్చు. New Google Doodle has been released: "Women's Cricket World Cup 2022 Begins!" :)#google #doodle #designhttps://t.co/oM7i79OJ1E pic.twitter.com/UeRDYk14qt — Google Doodles EN (@Doodle123_EN) March 3, 2022 ప్రపంచంలో తొలి ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ 1844లో కెనడా, అమెరికా మధ్య జరిగింది. అయితే మహిళల ప్రపంచ కప్ మాత్రం 1973 నుంచి మొదలైంది. కొవిడ్ కారణంగా కిందటి ఏడాది జరగాల్సిన టోర్నీ.. ఈ ఏడాదికి వాయిదా పడింది. న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు తలపడుతున్నాయి. తొలి మ్యాచ్ శుక్రవారం ఆతిథ్య న్యూజిలాండ్, వెస్టిండీస్ మధ్య మొదలైంది. విండీస్ 259 పరుగులు సాధించగా.. 260 పరుగుల లక్క్ష్యంతో న్యూజిలాండ్ బరిలోకి దిగింది. మహిళల ప్రపంచ కప్లో భాగంగా భారత్ తన తొలి మ్యాచ్ దాయాది పాక్తో మార్చ్ 6వ తేదీన(ఆదివారం) తలపడనుంది. ఉదయం 6.30ని. మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఆసీస్, ఇంగ్లండ్లు ఫేవరెట్గా ఉన్నాయి ఈసారి టోర్నీలో. -
గూగుల్లో ఇది చూశారా? దాని వాల్యూ ఎంతో తెలుసా?
Google Doodle Celebrating Pizza: ఇవాళ గూగుల్ ఓపెన్ చేశారా? చేస్తే.. డూడుల్లో ఉన్న పిజ్జా మార్క్ను చూశారా?.. కనీసం క్లిక్ చేసి చూశారా?.. ప్రపంచంలో మోస్ట్ పాపులర్ డిష్ అయిన పిజ్జాకు ఇదేరోజున ఓ అరుదైన గుర్తింపు దక్కింది. 2017 డిసెంబర్లో పిజ్జా సంప్రదాయ తయారీ విధానం Neapolitan "Pizzaiuolo"(నేపుల్స్-ఇటలీ)కు యునెస్కో తరపున అరుదైన గుర్తింపు దక్కింది. అందుకే గూగుల్ డూడుల్ ద్వారా మినీ గేమ్ను నిర్వహిస్తోంది. ఈ మినీ పజిల్ గేమ్ ఉద్దేశం ఏంటంటే.. పిజ్జాను కట్ చేయడం. సాధారణంగా పిజ్జాలను వాటిలోని వెరైటీల ఆధారంగా డిఫరెంట్ షేప్స్లో కట్ చేసి(కస్టమర్ల సంఖ్యకు తగ్గట్లుగానే).. సర్వ్ చేస్తుంటారు. అయితే ఈ గేమ్ ఆడేవాళ్లు అక్కడ చూపించే పిజ్జా వెరైటీని సరిగ్గా అక్కడ చూపించే నెంబర్స్కి.. సరిపోయేలా సరైన విధానంలో చేయాలి. కరెక్ట్గా కట్ చేస్తేనే పాయింట్లు(స్టార్స్) దక్కుతాయి. అలా లెవెల్స్ను దాటుకుంటూ కాయిన్స్ కలెక్ట్ చేసుకుంటూ వెళ్లాలి. ►పిజ్జా.. ఇటాలియన్ డిష్ అనే ప్రచారం వందల ఏళ్ల నుంచి ఉంది. ఎందుకంటే ఆ డిష్ పుట్టింది ఇటలీలోనే అని నమ్ముతారు కాబట్టి!(ఈజిప్ట్ అనే ప్రచారం కూడా ఉంది). ►నెపోలిటన్ పిజ్జాయ్యువొలొ.. అనేది పిజ్జాను సంప్రదాయ పద్దతిలో(నాలుగు దశల్లో) కట్టెలతో కాల్చే ఒవెన్ ద్వారా తయారు చేయడం. ►నేపుల్స్(కాంపానియా రీజియన్ రాజధాని)లో 3 వేలమంది పిజ్జా తయారీదారులు ఉన్నారు. ►పిజ్జాను తయారు చేసే వ్యక్తిని ‘పిజ్జాయ్యువొలొ’ అంటారు. ►పిజ్జా పరిశ్రమ ప్రపంచ స్థాయిలో బిలియన్ డాలర్ల బిజినెస్ చేస్తుంటుంది. ►2020 పిజ్జా గ్లోబల్ బిజినెస్లో.. వెస్ట్రన్ యూరప్ వాటా అత్యధికంగా ఉంది. ఏకంగా 49.3 బిలియన్ డాలర్ల వ్యాపారం చేసింది. ►ఉత్తర అమెరికా 48.6 బిలియన్ డాలర్లు. ►ఆసియా దేశాల్లో 11.7 బిలియన్ డాలర్లు ►ఆస్ట్రేలియా పరిధిలో అతితక్కువగా 1.9 బిలియన్ డాలర్ల బిజినెస్ చేసింది. ►ప్రతీ ఏడాది ఐదు బిలియన్ల పిజ్జాలు అమ్ముడుపోతుంటాయి (సెకనుకి ఒక్క అమెరికాలోనే 350 పిజ్జాల ఆర్డర్) వెళ్తుంటాయి. ►2019 నుంచి పిజ్జా మార్కెటింగ్ గ్లోబల్ వైడ్గా విపరీతంగా జరుగుతోంది. ►2023 నాటికి పిజ్జా బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 233.26 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందనేది ఒక అంచనా. ►సోషల్మీడియా అడ్వర్టైజింగ్ కీలక పాత్ర వహించబోతోందని మార్కెటింగ్ నిపుణుల అంచనా. ►నార్వే, స్వీడన్లలో ఫ్రొజెన్, గ్లూటెన్ పిజ్జాలకు ఫుల్ డిమాండ్ ఉంటోంది ఇప్పుడు. ►యూరప్, నార్త్ అమెరికా, ఆసియా-ఫసిఫిక్, లాటిన్ అమెరికా ఖండాల రీజియన్లను పరిశీలిస్తే.. ఇటలీ, యూకే, జర్మనీ, కెనడా, చైనా, భారత్, బ్రెజిల్.. పిజ్జా మార్కెట్ను మరో లెవల్కు తీసుకెళ్లనున్నాయి. ►భారత్లో కరోనా సీజన్లోనూ కిందటి ఏడాది పిజ్జా బిజినెస్ మార్కెట్ వాల్యూ 1.52 బిలియన్ డాలర్లు దాటేసింది. ► యువత, పిల్లలు, మధ్య, ఎగువ తరగతి వర్గాల ప్రజల నుంచి పిజ్జాకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా ఉత్తర భారతంలో ఆర్డర్లు ఎక్కువగా వస్తుంటాయి. ►మొత్తం భారత్ పిజ్జా మార్కెట్లో డొమినోస్ వాటా 55 శాతంగా ఉంటోంది. పైగా డొమినోస్ 70 శాతం హోం డెలివరీలతోనే ఆదాయం వెనకేసుకుంటోంది. ►ఈ ఏడాది జూన్ 1వ తేదీ నాటికి భారత్లో 45 మిలియన్ల మంది పిజ్జా డెలివరీ యాప్లను డౌన్లోడ్ చేసుకున్నారు. ►అయితే భారత్లో బ్రాండెడ్ పిజ్జా బిజినెస్తో పోలిస్తే.. స్ట్రీట్ పిజ్జా మార్కెట్ బిజినెస్ విపరీతంగా నడుస్తోంది. ఆ ఆదాయం లెక్కలోకి తీసుకుంటే బ్రాండెడ్ పిజ్జా మార్కెట్కు మూడు రెట్లు ఎక్కువే ఉంటుందనేది నిపుణుల అంచనా. ►ఎదురయ్యే ఛాలెంజ్.. పిజ్జా తయారీలో వాడే ముడిసరుకుల ధరలు ఆకాశాన్ని అంటడం.. ఇండిపెండెంట్ ఆపరేటర్లతో పాటు ఔట్లెట్లు, ఫ్రాంఛైజీలను సమర్థవంతంగా నిర్వహించడంలో ఎదురయ్యే సవాళ్లు. -సాక్షి వెబ్స్పెషల్ -
గూగుల్ డూడుల్లో కనిపిస్తున్న ఈ వైద్యురాలు ఎవరంటే..
Google Doodle Dr Kamal Ranadive : మానవాళి సంక్షేమం కోసం కృషి చేసిన వారికి, వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు గాంచిన వారిని గూగుల్ ప్రత్యేక డూడుల్తో గౌరవించుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా గూగుల్ ఓ భారతీయ వైద్యురాలిని స్మరించికుంది. ఈ మేరకు సోమవారం నాడు ఆమెకు సంబంధించి ప్రత్యేక డూడుల్ని క్రియేట్ చేసింది. ఈ డూడుల్లో కనిపిస్తున్న వైద్యురాలి పేరు డాక్టర్ కమల్ రణదీవ్. నవంబర్ 8న డాక్టర్ కమల్ రణదీవ్ 104వ జయంతి. ఈ నేపథ్యంలో గూగుల్ ప్రత్యేక డూడుల్తో స్మరించుకుంది. డాక్టర్ రణదీవ్, ఒక భారతీయ కణ జీవశాస్త్రవేత్త. సంచలనాత్మక క్యాన్సర్ పరిశోధనలతో గుర్తింపు తెచ్చుకున్నారు. డాక్టర్ రణదీవ్ సైన్స్, విద్య ద్వారా మరింత సమానమైన సమాజాన్ని సృష్టించేందుకు కృషి చేశారు. రణదీవ్ డూడుల్ని భారతదేశానికి చెందిన అతిథి కళాకారుడు ఇబ్రహీం రేయింటకత్ చిత్రీకరించారు. (చదవండి: ‘ఝాన్సీ కీ రాణి’.. ఈ పాఠం రాసింది ఈమెనే!) డాక్టర్ రణదీవ్ గురించి.. కమలా సమరాథ్ అలియాస్ కమలా రణదీవ్ 1917, నవంబర్ 8న పుణెలో జన్మించారు. తండ్రి ప్రోత్సాహంతో చదువులో రాణించిన కమలా రణదీవ్.. వైద్య విద్యను అభ్యసించారు. కాకపోతే తనుకు బయాలజీ అంటే చాలా ఇష్టమని ఒకానొక సందర్భంలో తెలిపారు. ఇండియన్ క్యాన్సర్ రిసెర్చ్ సెంటర్లో పని చేస్తూ కణ శాస్త్రంలో చేసిన పరిశోధనలకు గాను ఆమెకు డాక్టరేట్ వచ్చింది. అనంతరం అమెరికా మేరిల్యాండ్, బాల్టిమోరిలోని జాన్స్ హోప్కిన్స్ యూనివర్శిటీలో ఫెలోషిప్ పొందారు. ఆ తర్వాత ముంబై తిరిగి వచ్చి.. ఐసీఆర్సీలో చేరారు. అక్కడ డాక్టర్ రణదీవ్ దేశంలోని తొలి టిష్యూ కల్చర్ లాబరేటరీని ఏర్పాటు చేశారు. ఐసీఆర్సీ డైరెక్టర్గా పని చేస్తూనే క్యాన్సర్ వ్యాధిపై పరిశోధన చేశారు. ఈ క్రమంలో రొమ్ము క్యాన్సర్కి, వంశపారంపర్యానికి మధ్య గల సంబంధాన్ని గుర్తించడమే కాక కొన్ని వైరస్లకు, క్యాన్సర్కు మధ్య లింక్ను గుర్తించిన మొదటి పరిశోధకురాలిగా రణదీవ్ గుర్తింపు పొందారు. (చదవండి: వారెవ్వా.. పేన్లను దంచి వ్యాక్సిన్ తయారు చేశాడు) ఓ వైపు ఈ పరిశోధన చేస్తూనే.. మరోవైపు రణదీవ్ కుష్టు వ్యాధిని కలిగించే మైకోబాక్టీరియం లెప్రేపై పరిశోధనలు చేయడమే కాక వ్యాక్సిన్ని అభివృద్ధి చేశారు. శాస్త్రీయ రంగంలో మహిళలకు మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో రణదవ్, మరో 11 మంది సహోద్యోగులతో కలసి 1973లో సి ఇండియన్ వుమెన్ సైంటిస్ట్ అసోసియేషన్ని ప్రారంభించినట్లు గూగుల్ డూడుల్ పేజ్లో పేర్కొంది. రణదీవ్ 1989లో రిటైర్ అయ్యారు. పదవీవిరమణ అనంతరం ఆమె మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లో పని చేశారు. అక్కడి మహిళలను ఆరోగ్యకార్యకర్తలుగా శిక్షణ ఇచ్చారు. ఆరోగ్యం, పోషకాహార విద్యను నేర్పించారు. అంతేకాక విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు, ఇండియన్ స్కాలర్స్ని భారతదేశం తిరిగి వచ్చి.. వారి చదువు, జ్ఞానాన్ని తమ దేశ పౌరుల అభివృద్ధి కోసం వినియోగించాల్సిందిగా కోరేవారు. చదవండి: చీరకట్టులో విమానం నడిపింది.. ఈ గౌరవం అందుకే! -
గ్లోబల్ స్టార్డమ్ దక్కిన తొలి ఇండియన్ హీరో ఎవరో తెలుసా?
Sivaji Ganesan Birth Anniversary Google Doodle: భారీ బడ్జెట్లు, హై టెక్నికల్ వాల్యూస్, క్వాలిటీ మేకింగ్, స్టార్ కాస్టింగ్, పాన్ ఇండియన్ సినిమాలు.. ఇవన్నీ ఇండియన్ సినిమాను గ్లోబల్ లెవల్లో నిలబెతున్నాయి. వెండితెరపై తమ కటౌట్లతో విదేశీ అభిమానం సైతం సంపాదించుకుంటున్నారు మన నటులు ఇప్పుడు. అయితే కొన్ని దశాబ్దాల క్రితమే కేవలం ‘నటన’ ద్వారా తన స్టార్డమ్ను ఖండాంతరాలు దాటించిన వ్యక్తి శివాజీ గణేషన్. ఈరోజు ఆయన 93వ జయంతి (అక్టోబర్ 1, 2021). ► మెథడ్ యాక్టర్గా పేరున్న శివాజీ గణేషన్.. తన నటన ద్వారా కమల్ హాసన్, రజినీకాంత్లాంటి వాళ్లెందరిపైనో ప్రభావం చూపించిన వ్యక్తి. ► అసలు పేరు గణేస(ష)మూర్తి.. పుట్టింది తమిళనాడు విల్లుపురంలో అక్టోబర్ 1, 1928న. ► ఏడేళ్ల వయసుకే థియేటర్ ఆర్టిస్ట్ అవతారం.. నాటకాల్లో ఆడ పాత్రలతో మంచి గుర్తింపు ► 1945లో శివాజీ కంద హిందూ రాజ్యం అనే నాటకంలో శివాజీ పాత్రను పోషించాడు. స్టేజీపై ఆయన నటనను చూసి మైమరిచిపోయిన ప్రముఖ సంఘసంస్కర్త ఈవీ రామస్వామి.. గణేసన్ను నటనలో ‘శివాజీ’గా అభివర్ణించాడు. అలా ఆయన పేరు అప్పటి నుంచి శివాజీ గణేసన్ అయ్యింది. ► 1952లో ప్రజాశక్తి సినిమా ద్వారా ఆయన తెరంగగ్రేటం చేశారు. అప్పటి నుంచి 300 సినిమాల్లో నటించారు. ► భావోద్వేగాలు పండించడంలో శివాజీ గణేషన్ దిట్ట. ప్రత్యేకించి కంచు కంఠంతో తమిళ సినిమాలో ఓ చెరగని ముద్ర వేసుకున్నారు ► విశేషం ఏంటంటే.. భారత సినీ రంగం నుంచి అంతర్జాతీయంగా గుర్తింపు దక్కించుకున్న తొలి నటుడు ఈయనే!. ► 1960 ఈజిప్ట్ రాజధాని కైరోలో జరిగిన ఆఫ్రో-ఆసియన్ ఫిల్మ్ఫెస్టివల్లో బెస్ట్ యాక్టర్(వీరపాండియ కట్టబొమ్మన్కుగానూ) అవార్డును అప్పటి ఈజిప్ట్ అధ్యక్షుడు గమల్ అబ్దెల్ నాసర్ నుంచి అందుకున్నారు. ఈ చిత్ర డైలాగులు నేటికి తమిళ నాట ప్రతిధ్వనిస్తుంటాయి. ► అమెరికా గడ్డపై అడుగుపెట్టిన తొలి భారతీయ నటుడు కూడా ఈయనే!. 1962లో కల్చరల్ ఈవెంట్ కోసం శివాజీ గణేషన్ హాజరయ్యారు. అంతేకాదు అప్పటి అమెరికా ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనెడీ, శివాజీని కల్చరల్ అంబాసిడర్గా గుర్తించారు కూడా. ఆ తర్వాత ఎన్నో దేశాల్లో భారతీయ నటుడి హోదాల్లో పర్యటించారు శివాజీ గణేషన్. ► 1961లో ‘పాశమలర్’ కుటుంబ సమేత చిత్రంగా ఓ ట్రెండ్ సృష్టించగా.. 1964లో వచ్చిన ‘నవరాత్రి’ తొమ్మిది గెటప్లతో సరికొత్త రికార్డు సృష్టించాడు ► దైవ మగన్, పుదియా పరవై ..ఇలా ఎన్నో సినిమాలు దేశవ్యాప్తంగా నటుడిగా ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. ► తేవర్ మగన్(క్షత్రియ పుత్రుడు)లో క్యారెక్టర్కి నేషనల్ అవార్డు(స్పెషల్ జ్యూరీ) దక్కింది శివాజీ గణేసన్కి. కానీ, ఎందుకనో ఆయన ఆ అవార్డును సున్నితంగా తిరస్కరించారు. ► 1995లో ఫ్రాన్స్ గౌరవం, 1997లో దాదాసాహెబ్ పాల్కే అవార్డు అందుకున్నారు శివాజీ గణేషన్. ► తమిళ సీనియర్ నటుడు ప్రభు ఈయన తనయుడే. ఇక మనవడు విక్రమ్ ప్రభు(తెలుగులో వచ్చిన గజరాజు హీరో) కోలీవుడ్లో యంగ్ హీరోగా ఉన్నాడు. ► ది లాస్ ఏంజెల్స్ టైమ్స్ శివాజీ గణేషన్ను ‘మార్లోన్ బ్రాండో ఆఫ్ సౌత్ఇండియన్’గా అభివర్ణించింది. ► ఓ స్టార్ హీరో సినిమాలో పాటలు లేకపోవడం జరిగింది కూడా శివాజీ గణేసన్ విషయంలోనే. ఆయన నటించిన ‘అంధ నాల్’లో ఒక్క పాట కూడా ఉండదు. ► పరదేశీ(1953), పెంపుడు కొడుకు, మనోహర, బొమ్మల పెళ్లి, పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం, రామదాసు, బంగారు బాబు, భక్త తుకారాం, జీవన తీరాలు, చాణక్య చంద్రగుప్త(అలెగ్జాండర్ పాత్ర), నివురు గప్పిన నిప్పు, బెజవాడ బొబ్బులి, విశ్వనాథ నాయకుడు(నాగమ నాయక పాత్ర), అగ్ని పుత్రుడు లాంటి తెలుగు సినిమాలతోనూ అలరించారు. ► ఆత్మబంధువు లాంటి తమిళ డబ్బింగ్ సినిమా, అందులోని పాటల్ని తెలుగు ప్రేక్షకులు చాలామంది ఇష్టపడుతుంటారు. ► 1999 సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన పడయప్ప(నరసింహా) శివాజీ గణేసన్ తెర మీద కనిపించిన చివరి సినిమా. ► శ్వాసకోశ సంబంధిత సమస్యలతో జులై 21, 2001న ఆయన కన్నుమూశారు. ► కలైమామణి, పద్మ శ్రీ, పద్మ భూషణ్, చెవలియర్(ఫ్రాన్స్), దాదా సాహెబ్ పాల్కే అవార్డు, ఎన్టీఆర్ నేషనల్ అవార్డులు అందుకున్నారు శివాజీ గణేషన్. ► శివాజీ గణేషన్ జయంతి సందర్భంగా గూగుల్ ఇవాళ డూడుల్తో ఆయన్ని గుర్తు చేసింది. ► బెంగళూరుకు చెందిన నూపూర్ రాజేష్ చోక్సీ.. ఈ డూడుల్ను క్రియేట్ చేశాడు. - సాక్షి, వెబ్స్పెషల్ -
హాయ్ గూగుల్.. హ్యాపీ బర్త్డే టు యూ
Google Birthday 2021: వరల్డ్ నంబర్ వన్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ తన 23వ పుట్టిన రోజుని జరుపుకుంటోంది. అందకే ఈ రోజు డూడుల్లో 23 ప్రత్యేకంగా కనిపింపించేలా డిజరైన్ చేసింది. ఐస్క్రీమ్స్, కేక్స్, క్యాండిల్స్తో ఈ రోజు డూడుల్ కొత్తగా కనిపిస్తోంది. 23 ఏళ్లు పూర్తి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ విద్యార్థులు సెర్జే బ్రిన్, లారీపేజ్లో ఓ చిన్న స్టార్టప్గా 1998లో ప్రారంభించారు. వాస్తవానికి 1998 సెప్టెంబరు 4న గూగుల్ సెర్చ్ ఇంజన్ అందుబాటులోకి వచ్చింది. మొదటి ఏడేళ్ల పాటు సెప్టెంబరు 4నే గూగుల్ వార్షిక వేడుకుల నిర్వహించే వారు. ఏడేళ్ల తర్వాత 1998లో గూగుల్ ప్రారంభించినా తొలి ఏడేళ్ల తర్వాత రికార్డు స్థాయిలో పేజ్ వ్యూస్ రావడంతో 2005లో గూగుల్ యానివర్సరీ డేట్ని సెప్టెంబరు 4 నుంచి సెప్టెంబరు 27కి మార్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే తేదిని గూగుల్ పుట్టినరోజుగా జరుపుతున్నారు. చదవండి: గూగుల్లో వెతికిన తొలి పదం ఇదే! 23 స్పెషల్ డూడుల్ గూగుల్ సంస్థ నుంచి వచ్చిన స్మార్ట్ఫోన్లో సాఫ్ట్వేర్ అప్డేట్స్ అన్నీ జింజర్బ్రెడ్, ఐస్క్రీం శాండ్విచ్, కిట్కాట్, లాలిపాప్, మార్ష్మాలో, ఓరియో, పై ఇలా ఐస్క్రీంల పేర్లతోనే ఉంటాయి. తన థీమ్కి తగ్గట్టే ఈ రోజు డూడుల్లో కూడా ఐస్క్రీంలకు పెద్ద పీట వేస్తూనే కేక్ను డూడుల్లో పెట్టింది, ఎల్ అక్షరం స్థానంలో క్యాండిల్ని ఉంచి వేడుకల ఫ్లేవర్ని తెచ్చింది గూగుల్. బర్నింగ్ మ్యాన్ నెవడాలోని బ్లాక్ రాక్ సిటీలో జరిగిన బర్నింగ్మ్యాన్ ఈవెంట్ థీమ్తో తొలిసారి 1998లో గూగుల్ డూడుల్ని రూపొందించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల డూడుల్స్ని ఈ సెర్చ్ ఇంజన్ రూపొందించింది. చదవండి : మొండి గూగుల్.. ఆ ఫోన్లలో కరెక్ట్ పాస్వర్డ్ కొట్టినా వేస్టే! ఎందుకంటే.. -
గ్రీన్ టీ తాగుతున్నారా? ఇది మీ కోసమే..
Michiyo Tsujimura Google Doodle: గ్రీన్ టీ.. కరోనాకి కొంతమందికి.. కరోనా తర్వాత చాలామందికి లైఫ్లో ఇదొక పార్ట్గా మారింది. ఆరోగ్యానికి ఆరోగ్యంతో పాటు లావు ఉన్న వాళ్లు సన్నబడేందుకు ఇదొక ప్రత్యామ్నాయంగా ఫీలైపోతుంటారు. అయితే గ్రీన్ టీ గొప్పదనం గురించి ప్రపంచానికి చెప్పిన ఆవిడ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి కదా. ఆమె పేరే మిచియో సుజిమురా. మిచియో సుజిమురా.. జపనీస్ ఎడ్యుకేషననిస్ట్, బయోకెమిస్ట్. గ్రీన్ టీలోని మూలకాల్ని ప్రపంచానికి తన పరిశోధనల ద్వారా తెలియజేసింది ఈమేనే. ఆ పరిశోధనలకుగానూ మిచియోకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఇవాళ ఆమె 133వ జయంతి. అందుకే గూగుల్ ఆమెను గుర్తు చేస్తూ డూడుల్ను రిలీజ్ చేసింది. ► మిచియో సుజిమురా.. జపాన్లో వ్యవసాయంలో డిగ్రీ పట్టా పుచ్చుకున్న మొదటి మహిళగా రికార్డుకెక్కారు. ► గ్రీన్ టీలో ఉండే పోషక విలువ గురించి గుర్తించింది. వాటిని ప్రపంచానికి తెలియజేసింది ఆమెనే. ► సుజిమురా 1888 సెప్టెంబర్ 17న సైతామా రీజియన్లోని ఓకేగావాలో పుట్టారు. ఖాళీ కడుపుతో గ్రీన్ టీ ఎక్కువ తాగితే గ్యాస్ట్రిక్, లివర్కి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి ► స్కూల్ చదువులు పూర్తయ్యాక టోక్యో ఇంపీరియల్ యూనివర్సిటీలో మిచియో బయోకెమిస్ట్రీలో రీసెర్చ్ చేశారు. ► గ్రీన్ టీపై పరిశోధనల్లో డాక్టర్ ఉమెటారో సుజుకీ ఆమెకు సహకరించారు. ► గ్రీన్ టీలో విటమిన్ బి-1 ఉంటుందని గుర్తించింది ఆయనే(సుజుకీ). వారానికి మూడు సార్లు గ్రీన్ టీ తాగితే మనిషి జీవితకాలం పెరగడంతో పాటు గుండెపోటు ముప్పును నివారించవచ్చు. ► సుజుకీ-సుజిమురా పరిశోధనల్లో మైక్రోస్కోప్ పరిశోధనల్లో విటమిన్ సీని గ్రీన్ టీలో గుర్తించారు ► 1929లో తన ఒంటరి పరిశోధనల్లో గ్రీన్ టీలో ఫ్లవనాయిడ్ కాటెచిన్, 1930లో టానిన్లు ఉన్నట్లు సుజిమురా గుర్తించారు. ► ఈ పరిశోధనలన్నింటిని మేళవించి ‘ఆన్ ది కెమికల్ కాంపోనెన్ట్స్ ఆఫ్ గ్రీన్ టీ’ పేరుతో థీసిస్ రూపొందించారు. ► 1932లో వ్యవసాయంలో డాక్టరేట్ గౌరవపట్టా పొందిన తొలి జపాన్ మహిళగా మిచియో సుజిమురా ఘనత సాధించారు. ► గ్రీన్ పరిశోధనలతో పాటు విద్యావేత్తగా ఆమె పేరు సంపాదించుకున్నారు. ► టోక్యో హోం ఎకనమిక్స్ యూనివర్సిటీకి ఆమె మొట్టమొదటి డీన్ కూడా. గ్రీన్-టీలోని ఎపిగాలోకేటెచిన్-3 గ్యాలేట్ (ఈజీసీజీ) అనే పోషకం ఇలా మొటిమల పెరుగుదలకు దోహదం చేసే ప్రాంతంలోనూ బ్యాక్టీరియా పెరగకుండా చేస్తుందట. దీనికి తోడు ఆ పోషకంలోని వాపు, మంట తగ్గించే (యాంటీ ఇన్ఫ్లమేటరీ) గుణం సైతం మొటిమలు రాకుండా ఉండేలా చేస్తుంది. ► ప్రొఫెసర్గా పని చేసిన మిచియో సుజిమురా .. 1955లో రిటైర్ అయ్యారు. కానీ, ఆ తర్వాత కూడా పార్ట్ టైం వృత్తిలో చాలా కాలం కొనసాగారు. ► 1969, జూన్ 1న 81ఏళ్ల వయసులో వృద్ధాప్య సమస్యలతో మిచియో కన్నుమూశారు. ► ఓకేగావా సిటీలో ఆమె స్మరణానర్థం పరిశోధనలకు సంబంధించిన విషయాలతో ఒక స్థూపాన్ని నిర్మించారు. గర్భవతులు రెండు కప్పుల కంటే ఎక్కువ గ్రీన్ టీ తాగితే... గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉందని జపాన్ రీసెర్చర్లు చెప్తున్నారు. గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్తో హృదయం పదిలంగా ఉండటంతో పాటు ఎక్కువకాలం ఆరోగ్యకరంగా జీవించేందుకు దోహదపడుతుంది ఈ టైంలో వద్దు.. రాత్రి పడుకునే ముందు గ్రీన్టీతో మందులు వేసుకోకూడదు మధ్యాహ్న భోజనం తరువాత గ్రీన్టీ సేవిస్తే భోజనం నుంచి లభించే పోషక వలువలు తగ్గి, పోషకాహార లోప సమస్యలు తలెత్తె అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు ముందుగా చెప్పుకున్నట్లు కొలెస్ట్రాల్ కరిగించడానికి, బరువు తగ్గించడానికి గ్రీన్ టీ చాలా ఉపయోగపడుతుంది -సాక్షి, వెబ్స్పెషల్ ఈ గ్రీన్ టీ రుచుల గురించి మీకు తెలుసా? -
వారెవ్వా.. పేన్లను దంచి వ్యాక్సిన్ తయారు చేశాడు
Google Doodle Rudolf Weigl: వ్యాక్సిన్లు.. రకరకాల జబ్బుల నుంచి మనిషికి రక్షణ అందించే కవచాలు. కరోనా తర్వాత వీటి గురించి దాదాపు పూర్తి సమాచారం అందరికీ తెలుస్తోంది. గతంలో ఎలాంటి ఎలాంటి వ్యాక్సిన్లు ఉండేవి, వాటిని ఎలా తయారు చేస్తున్నారు, సైడ్ ఎఫెక్ట్స్, వాక్సిన్లతో రక్షణ ఎలా అందుతుంది.. ఇలాంటి వివరాలన్నీ తెలిసిపోతున్నాయి. అయితే వైరస్, బ్యాక్టీరియాల నుంచే వాటిని అభివృద్ధి చెందిస్తారని.. అందుకు ఓ పోలాండ్ సైంటిస్ట్ చేసిన ప్రయోగాలే మూలమని మీలో ఎంతమందికి తెలుసు? .. ఇవాళ గూగుల్లో డూడుల్గా కనిపిస్తోంది కూడా ఆయనే. పోలాండ్కు చెందిన రుడాల్ఫ్ వెయిగ్ల్.. అతిపురాతనమైన, ప్రమాదకరమైన టైఫస్ అంటువ్యాధికి సమర్థవంతమైన వ్యాక్సిన్ను తయారు చేసిన మొదటి సైంటిస్ట్. ఈయన వ్యాక్సిన్ను ఎలా తయారుచేశారో తెలుసా? పేన్లను దంచి.. ఆ పేస్ట్తో. అవును.. వెగటుగా అనిపించినప్పటికీ ఇది నిజం. ఈ ప్రయోగమే ఆ తర్వాతి కాలంలో చాలా వ్యాక్సిన్ల తయారీకి ఒక మార్గదర్శకంగా మారిందంటే అతిశయోక్తికాదు. ►రుడాల్ఫ్ స్టెఫాన్ జన్ వెయిగ్ల్.. 1883, సెప్టెంబర్ 2న ఆస్స్ర్టో హంగేరియన్ టౌన్ ప్రెరవు(మోరావియా రీజియన్)లో పుట్టాడు. తండడ్రి టీచర్.. తల్లి గృహిణి. పుట్టింది జర్మనీలోనే అయినప్పటికీ పోలాండ్లో స్థిరపడింది ఆ కుటుంబం. ►పోలాండ్ ఎల్వీవ్లోని యూనివర్సిటీలో బయోలాజికల్ సైన్స్ చదివాడు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అస్ట్రో-హంగేరియన్ ఆర్మీ కోసం 1914 నుంచి పారాసిటాలజిస్ట్గా పని చేశాడు. ►పోలాండ్ను జర్మనీ ఆక్రమించుకున్నాక.. లెంబర్గ్ ఇనిస్టిట్యూట్లో రీసెర్చర్గా కొంతకాలం పని చేశాడు. ఆ టైంలో తూర్పు యూరప్లో లక్షల మంది టైఫస్ బారిన పడగా, దానికి వ్యాక్సిన్ కనిపెట్టే పనిలోకి దిగాడు. ఆపై ఎల్వీవ్లో తన పేరు మీద ఒక ఇనిస్టిట్యూట్ను నెలకొల్పి.. ఆపై అక్కడే టైఫస్ మీద, వైరల్ ఫీవర్ మీద ఆయన పరిశోధనలు మొదలయ్యాయి. ►తొలి దశ ప్రయోగాల్లో జబ్బును తగ్గించే ఫలితం రానప్పటికీ.. లక్షణాల్ని తగ్గించి ఉపశమనం ఇచ్చింది ఆయన తయారు చేసిన వ్యాక్సిన్. ఆ తర్వాత రాకీ మౌంటెన్ స్పాటెడ్ ఫీవర్కు సైతం వ్యాక్సిన్ తయారు చేశాడాయన. ►1909లో ఛార్లెస్ నికోలె.. లైస్(పేను)వల్ల టైఫస్ అంటువ్యాధి ప్రబలుతుందని గుర్తించాడు. అందుకు రికెట్ట్సియాప్రోవాజెకి బ్యాక్టీరియా కారణమని కనిపెట్టాడు. ఆ తర్వాత టైఫస్ వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. ►టైఫస్ వ్యాక్సిన్ కోసం అప్పటిదాకా ఎవరూ చేయని ప్రయోగం చేపట్టాడు వెయిగ్ల్. జబ్బు కారణమైన పేను కడుపులోనే రికెట్ట్సియా ప్రోవాజెకి ని ప్రవేశపెట్టి వాటిని పెంచి.. ఆ పేన్లను చిత్తు చేసి వ్యాక్సిన్ పేస్ట్ తయారు చేశాడు. ముందు ఆరోగ్యవంతమైన పేన్లను పన్నెండు రోజులపాటు పెంచాడు. వాటికి టైఫస్ బ్యాక్టీరియాను ఇంజెక్ట్ చేశాడు. ఆపై మరో ఐదు రోజులపాటు వాటిని పెంచాడు. చివరికి వాటిని చిత్తు(గ్రైండ్ చేసి).. ఆ పేస్ట్ను వ్యాక్సిన్గా ఉపయోగించాడు. ►పేన్లను పెంచడానికి మనుషుల రక్తం కావాలి. కాబట్టి.. ఒక ప్రత్యేకమైన తెర ద్వారా వాటిని మనుషుల రక్తం పీల్చుకునే విధంగా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వందల మంది జబ్బు పడగా.. వాళ్లను చికిత్స ద్వారా మామూలు స్థితికి తీసుకొచ్చాడు. 1918లో గినియా పందుల మీద, మనుషుల మీద వాటిని ట్రయల్స్ నిర్వహించాడు. ►1930లో వ్యాక్సిన్ అధికారికంగా మార్కెట్లోకి రిలీజ్ అయ్యింది. ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టింది. ►అయితే దేశ విద్రోహ కార్యాకలాపాలకు నెలవైందన్న ఆరోపణలతో 1944లో సోవియట్యూనియన్ ఆయన ఇనిస్టిట్యూట్ను మూసేసింది. ►1936-43 మధ్య చైనాలో ఈ తరహా వ్యాక్సిన్లను ప్రయోగించి సక్సెస్ అయ్యారు. కష్టం-ప్రమాదకరమైనదైనప్పటికీ.. ఆ వ్యాక్సిన్ ప్రయోగాలు విజవంతం అయ్యాయి. ►1957 ఆగష్టు 11న 73 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశాడు ►1942, 1978(మరణానంతరం)లో నోబెల్ బహుమతికి వెయిగ్ల్ పేరు నామినేటఅయ్యింది. కానీ, అవార్డు దక్కలేదు. అయితే ఇతర దేశస్తులతో పని చేశాడన్న ఆరోపణలు ఆయనకు అవార్డు దక్కనివ్వలేదు. ►2003లో ప్రపంచం ఆయన పరిశోధనల్ని ‘రైటస్ ఎమాంగ్ ది నేషన్స్ ఆఫ్ ది వరల్డ్’ గౌరవంతో స్మరించుకుంది. రుడాల్ఫ్ వెయిగ్ల్ 138వ పుట్టినరోజు సందర్భంగా.. గూగుల్ డూడుల్ ద్వారా ఆయన్ని గుర్తు చేస్తోంది గూగుల్. రెండో ప్రపంచ యుద్ద సమయంలో పోలాండ్ను జర్మనీ ఆక్రమించుకున్నాక.. వెయిగ్ల్ను బలవంతంగా వ్యాక్సిన్ ప్రొడక్షన్ ప్లాంట్లోకి దించారు. అక్కడ ఆయన తెలివిగా పనివాళ్లను తన ప్రయోగాలకు ఉపయోగించుకున్నాడు. అంతేకాదు తనకు తాను లైస్ ద్వారా టైఫస్ను అంటిచుకుని రిస్క్ చేసి మరీ పరిశోధనలు చేశాడు. తన పరిశోధనలు, ప్రయోగాలతో వ్యాక్సిన్ను రూపొందించి.. వేల మంది ప్రాణాలు కాపాడాడిన వెయిగ్ల్ను ఒక సైంటిస్ట్గా మాత్రమే కాదు.. హీరోగా ప్రపంచం ఆయన్ని కొనియాడుకుంటోంది. - సాక్షి, వెబ్ స్పెషల్ -
‘ఝాన్సీ కీ రాణి’.. ఈ పాఠం రాసింది ఈమెనే!
విషయం ఎంతటి సంక్లిష్టమైనది అయినా సరే.. వివరణ సరళంగా ఉంటేనే ఎక్కువ మందికి అర్థం అయ్యేది. ఆ సూత్రాన్ని ఒడిసిపట్టి తన కవితలతో ఎందరిలోనో బ్రిటిష్ వ్యతిరేక పోరాట స్ఫూర్తిని నింపింది సుభద్ర కుమారి చౌహాన్. మధ్య తరగతి కుటుంబానికి చెందిన సుభద్ర.. స్వాతంత్ర సంగ్రామంలో అరెస్ట్ కాబడ్డ మొదటి మహిళా సత్యాగ్రహి!. ఈరోజు(ఆగష్టు 16న) ఆమె జయంతి. అందుకే గూగుల్ డూడుల్తో ఆమెను గుర్తు చేస్తోంది గూగుల్. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల స్కూల్ సిలబస్ పుస్తకాల్లో కనిపించే పాఠం.. ‘ఝాన్సీ కీ రాణి’. వీరనారి ఝాన్సీ లక్ష్మి భాయ్(మణికర్ణిక) పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే కవిత్వం అది. ఆ హిందీ కవితను రాసింది ఎవరో కాదు.. సుభద్ర కుమారి చౌహాన్. ప్రముఖ హిందీ కవయిత్రిగా, స్వాతంత్ర సమర యోధురాలిగా ఆమె పేరు భారత చరిత్రలో సుస్థిరంగా నిలిచింది. అరెస్టైన మొదటి సత్యాగ్రహి 1904, ఆగష్టు 16న యూపీ ప్రయాగ్రాజ్ నిహల్పూర్ గ్రామంలో ఓ రాజ్పుత్ కుటుంబంలో పుట్టింది సుభద్ర కుమారి చౌహాన్. స్కూల్ విద్య కొనసాగించిన సుభద్ర.. తొమ్మిదేళ్లకే ‘నీమ్’ కవితతో సాహిత్య ప్రపంచంతో ‘చిచ్చురపిడుగు’ బిరుదు అందుకుంది. పదిహేనేళ్ల వయసులో థాకూర్ లక్క్ష్మణ్ సింగ్ చౌహాన్ను వివాహం చేసుకుని.. జబల్పూర్కు కాపురం వెళ్లింది. ఆపై భర్త ప్రోత్సాహంతో కవిత్వాలు రాస్తూ.. బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమంలో చురుకుగా పాల్గొంది. నాగ్పూర్లో బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా జరిపిన నిరసన ప్రదర్శనకు గానూ ఆమెను అరెస్ట్ చేయమని నాగ్పూర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ టైంలో ఆమె గర్భవతి కావడంతో కొన్నాళ్లపాటు జైళ్లో నుంచి వదిలేశారు. ఆపై 1941లో సుభద్ర కుమారి భర్త థాకూర్, మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమంలో పాలుపంచుకున్నాడు. ఆ సమయంలో ఐదుగురు పిల్లలున్నా.. భర్తతో పాటు ఆమె కూడా ఉద్యమంలో చురుకుగా పాల్గొంది. ఈ క్రమంలో 1942లో ఆమె రెండోసారి అరెస్ట్ అయ్యారు. అంతేకాదు అంటరానీతనం, కుల వ్యవస్థ, పర్దా పద్ధతులకు వ్యతిరేకంగా ఆమె పోరాడింది కూడా. పిల్లలకు సైతం అర్థం అయ్యేలా.. హిందీ కవిత్వంలో ఆమెది ఎంతో సరళమైన శైలి. మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాలను, ముఖ్యంగా పిల్లలను దృష్టిలో పెట్టుకుని ఆమె తన రచనలు చేసేది. వీరనారి ఝాన్సీ రాణి పోరాటాన్ని పొగుడుతూ రాసిన కవిత్వం ‘ఝాన్సీ కీ రాణి’.. హిందీ సాహిత్యంలో సుస్థిరంగా నిలిచింది. ‘జలియన్ వాలా బాగ్ మే వసంత్’, ‘వీరోన్ కా కైసా హో బసంత్’, ‘రాఖీ కీ చునౌతీ’, ‘విదా’ తదితర కవిత్వాలు స్వాతంత్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించాయి. ఆమె రాసిన చిన్నకథలు పిల్లలను బాగా ఆకట్టుకునేవి. ఆపై సెంట్రల్ ప్రావిన్స్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమె.. 1948, ఫిబ్రవరి 15న అసెంబ్లీ సమావేశాలకు నాగ్పూర్ వెళ్లి జబల్పూర్కు తిరిగి వస్తుండగా సియోని(మధ్యప్రదేశ్) వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. గూగుల్ డూడుల్స్ గౌరవం సుభద్ర కుమారి చౌహాన్ మరణాంతరం ఎన్నో గౌరవాలు దక్కాయి. ఇండియన్ కోస్ట్గార్డ్ షిప్కు ‘ఐసీజీఎస్ సుభద్ర కుమారి చౌహాన్’ పేరు పెట్టారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం జబల్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. 1976లో భారత పోస్టల్ శాఖ.. ఓ పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేసింది. ఈ ఏడాది 117వ పుట్టినరోజు సందర్భంగా గూగుల్ ఇండియా.. గూగుల్ డూడుల్తో గౌరవించింది. ఆమె కూతురు సుధా చౌహాన్ను భర్త ఎవరో కాదు.. లెజెండరీ రైటర్ ప్రేమ్ చంద్ కొడుకు అమృత్ రాయ్. తల్లిదండ్రుల జీవిత చరిత్ర ఆధారంగా సుధా ‘మిలా తేజ్ సే తేజ్’ అనే పుస్తకం రాసింది. సుధా-అమృత్ల కొడుకు అలోక్ రాయ్ ఇంగ్లీఫ్ ప్రొఫెసర్.. ప్రస్తుతం ఆయన భారత రాజకీయాలు, కల్చర్ మీద కాలమ్స్ రాస్తున్నారు. -
చీరకట్టులో విమానం నడిపింది.. ఈ గౌరవం అందుకే!
Google Doodle Sarla Thukral: ఆమె చీర కట్టింది. కాక్పిట్లో కూర్చుంది. ధైర్యంగా ఎయిర్క్రాఫ్ట్ నడిపింది. వెయ్యి గంటల ప్రయాణం తర్వాత దేశంలోనే తొలిసారి ‘ఏ’ గ్రేడ్ లైసెన్స్ దక్కించుకుంది. ఆ టైంకి ఆమె వయసు 21 ఏళ్లు మాత్రమే. అందుకే పైలెట్ సరళ పేరు చరిత్రకెక్కింది. సరళ త(తు)క్రల్.. భారత తొలి మహిళా పైలెట్. ఎయిర్క్రాఫ్ట్ను.. అదీ సంప్రదాయ చీరకట్టులో నడిపిన మొదటి మహిళా పైలెట్ ఈమె. ఇవాళ (ఆగష్టు 8న) ఆమె 107 జయంతి. అందుకే గూగుల్ ఆమె డూడుల్తో గుర్తు చేసింది. సాధారణంగా గూగుల్ డూడుల్ రెండుసార్లు రిపీట్ అయిన సందర్భాలు లేవు. నిజానికి కిందటి ఏడాదే సరళ పేరు మీద డూడుల్ రిలీజ్ కావాల్సి ఉంది. ఆ టైంలో కేరళలో విమాన ప్రమాదం జరిగింది. అందుకే ఆ టైంలో సహాయక చర్యలకు గుర్తుగా డూడుల్ను నిలిపివేశారు. At the age of 21, Sarla Thukral soared to new heights by taking her first solo flight and becoming India’s first woman pilot 👩✈️ Today's #GoogleDoodle honours this incredible pilot, designer, and entrepreneur, on her 107th birth anniversary. ➡️ https://t.co/5dF5JBxUY2. pic.twitter.com/UBeh7LuJkz — Google India (@GoogleIndia) August 8, 2021 ఈసారి ఆమె మీద గౌరవార్థం 107వ జయంతి సందర్భంగా డూడుల్ను ఉంచినట్లు గూగుల్ ప్రకటించింది. ‘వైమానిక రంగంలో మహిళల ప్రవేశానికి స్ఫూర్తినిస్తూ చరిత్రలో ఆమె ఒక చెరగని ముద్ర వేశారు. అందుకే ఆమె కోసం రెండోసారి డూడుల్ని సృష్టించాం’ అని ప్రకటించింది గూగుల్. ఎయిర్క్రాఫ్ట్లో చీరకట్టులో ఉన్న ఈ డూడుల్ను వ్రిందా జవేరీ రూపకల్పన చేశారు. 16 ఏళ్ల వయసుకే పెళ్లి.. సరళ.. 1914లో పుట్టారు. 16 ఏళ్ల వయసులో ఆమెకి పెళ్లైంది. ఆమె భర్త పైలెట్. ఆయన స్ఫూర్తితోనే పైలెట్ అవ్వాలనుకుంది. నాలుగేళ్ల పాప ఉండగానే.. 21 ఏళ్ల వయసులో చీర కట్టులో విమానం నడిపి ఏ గ్రేడ్ లైసెన్స్ దక్కించుకుంది. లాహోర్ ఫ్లైయింగ్ క్లబ్ తరపున ఈ ఘనత సాధించాక.. కమర్షియల్ పైలెట్ శిక్షణ కోసం జోధ్పూర్ వెళ్లింది. అయితే 1939లో ఆమె భర్త చనిపోవడం, రెండో ప్రపంచ యుద్ధం రావడంతో కమర్షియల్ పైలెట్ కావాలనే కల చెదిరింది. ఆపై లాహోర్కు వెళ్లి ఫైన్ ఆర్ట్స్, పెయింటింగ్ కోర్సులు చేసింది. విభజన తర్వాత ఢిల్లీకి వచ్చి ఆర్పీ త(తు)క్రల్ను వివాహం చేసుకుంది. ఆపై ఆభరణాల డిజైనింగ్, బట్టల డిజైనింగ్ వ్యాపారంతో ఎంట్రప్రెన్యూర్గా పెద్ద సక్సెస్ అయ్యింది. 2008లో సరళ తక్రల్ అనారోగ్యంతో కన్నుమూసింది. -
గూగుల్లో కనిపిస్తున్న ఆ పెద్దాయన ఎవరో తెలుసా?
గొప్ప వ్యక్తులకు, మేధావులకు, సెలబ్రిటీలకు గూగుల్ డూడుల్తో గౌరవం ఇస్తున్న సంగతి తెలిసిందే. అలాంటిది ఇవాళ(జులై 3న) ఓ జర్మన్ డాక్టర్కి గూగుడ్ డూడుల్ దర్శనమిచ్చింది. ఆయన పేరు సర్ లుడ్విగ్ గట్ట్మన్. న్యూరోసర్జన్. పారాఒలింపిక్స్కు ఆద్యుడు ఈయనే. అంతేకాదు జర్మనీలో నాజీల చేతిలో అవమానాలు అనుభవిస్తూనే.. వందల మంది పేషెంట్ల ప్రాణాలు నిలబెట్టాడు. ఒకానొక టైంలో హిట్లర్కు ఆయన మస్కా కొట్టిన తీరు ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించింది కూడా. వెబ్డెస్క్: జర్మనీలోని టాస్ట్(ఇప్పుడది టోస్జెక్ పేరుతో పోలాండ్లో ఉంది)లో 1899 జులై 3న జన్మించాడు లుడ్విగ్. యూదుల పట్ల నాజీలు కర్కశంగా వ్యవహరించే సమయం అది. 18 ఏళ్ల వయసులో కోల్మైన్ యాక్సిడెంట్లో గాయపడ్డ ఓ వ్యక్తి తన కళ్ల ముందే మరణించడం లుడ్విగ్ మనసును కలిచివేసింది. అలా ఎవరూ చనిపోకూడదనే ఉద్దేశంతో మెడిసిన్ చదవాలని నిర్ణయించుకున్నాడు. బ్రెస్లావు యూనివర్సిటీ నుంచి డాక్టర్ పట్టా, ఫ్రెయిబర్గ్ యూనివర్సిటీ నుంచి మెడిసిన్లో డాక్టరేట్ను అందుకున్నాడు. ఆ తర్వాత న్యూరోసర్జన్గా ఒట్ఫ్రిడ్ ఫోరెస్టర్ దగ్గర శిష్యరికం చేశాడు. అయితే పేదలకు ఉచితంగా సేవలు చేయాలన్న ఆయన సంకల్పం.. ఫోరెస్టర్కు నచ్చలేదు. దీంతో ఆయన్ని వెలేశాడు. ఆ తర్వాత నాజీలు అధికారంలోకి వచ్చాక యూదులను మెడిసిన్ ప్రాక్టీస్కు అనుమతించలేదు. దీంతో బ్రెస్లావు జూయిష్ ఆస్పత్రిలో సేవలందించాడు లుడ్విగ్. ఆ టైంలో నాజీల చేతిలో యూదులు బలికాకుండా ఉండేందుకు.. వాళ్లను తన ఆస్పత్రుల్లో పేషెంట్లుగా చేర్పించుకుని నాటకంతో వాళ్ల ప్రాణాలను నిలబెట్టాడు. క్రిస్టాలెనెచ్ట్ మారణ హోమం టైంలో గాయపడ్డ వాళ్లెవరనేది చూడకుండా ఉచిత చికిత్స అందించి మనుసున్న మంచి డాక్టర్గా పేరు దక్కించుకున్నాడు. హిట్లర్కు మస్కా కొట్టి.. యూదుల సానుభూతిపరుడు అయినప్పటికీ.. వైద్యమేధావి అనే ఉద్దేశంతో హిట్లర్, లుడ్విగ్ గట్ట్మన్ జోలికి పోలేదు. ఆ టైంలో హిట్లర్ తన మిత్ర రాజ్యం పోర్చుగల్ నియంత అయిన అంటోనియో డె సాలాజార్కు చికిత్స కోసం గట్ట్మన్ను ఏరికోరి మరీ పంపించాడు. అయితే తిరుగు ప్రయాణంలో లుడ్విగ్ నాజీ సైన్యానికి మస్కా కొట్టాడు. లండన్లోనే తన కుటుంబంతో సహా విమానం దిగిపోయి.. యూకే శరణు వేడాడు. దీంతో యూకే ప్రభుత్వం ఆయనకు ఆశ్రయం కల్పించింది. అక్కడే ఆయనకు 250 పౌండ్ల సాయంతో శరణార్థిగా ఉండిపోయాడు. హిట్లర్కు లుడ్విగ్ మస్కా కొట్టిన తీరును దాదాపు అన్ని మీడియా ఛానెళ్లన్నీ అప్పట్లో ప్రముఖంగా ప్రచురించాయి కూడా. యుద్ధవీరుల కోసం ఆటలు ఇక యూకే వ్యాప్తంగా పలు వైద్య కళాశాలల్లో సేవలందించిన లుడ్విగ్.. రెండో ప్రపంచ యుద్ధంలో లార్డ్ లిండ్సేకి మకాం మార్చాడు. 1943లో ప్రభుత్వ ప్రోత్సాహంతో బకింగ్హాంషైర్లో స్టోక్ మండ్విల్లే ఆస్పత్రిని నెలకొల్పాడు. ఇది వెన్నెముకలు దెబ్బతిన్న పేషెంట్ల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేయించింది. ఈ సెంటర్కు లుడ్విగ్నే మొదటి డైరెక్టర్గా నియమించింది యూకేప్రభుత్వం. 1945లో గట్ట్మన్కు బ్రిటన్ పౌరసత్వం దక్కింది. ఆ టైంలో స్టోక్ మండ్విల్లే గేమ్స్ను నిర్వహించాడు లుడ్విగ్. ఈ ఈవెంట్లో సైన్యంలో సేవలందిస్తూ కాళ్లు, చేతులుకోల్పోయిన వాళ్లు, నడుం చచ్చుపడిపోయి వీల్ చైర్కు పరిమితమైనవాళ్లతో ఆటలు నిర్వహించాడు. విశేషం ఏంటంటే.. సరిగ్గా అదే రోజున జులై 29, 1948 లండన్ ఒలింపిక్స్ మొదలయ్యాయి. దీంతో ఈ ఆటలకు పారా ఒలింపిక్ గేమ్స్ అనే పేరు దక్కింది. అలా డిజేబిలీటీ ఉన్నవాళ్లతో ఒలింపిక్స్ నిర్వహించడం తర్వాతి కాలంలో క్రమం తప్పకుండా నడుస్తోంది. అందుకే లుడ్విగ్ గట్ట్మన్ను ‘ఫాదర్ ఆఫ్ పారా ఒలింపిక్స్’ అని పిలుస్తారు. గుండెపోటుతో ఐదు నెలలు.. ఆ తర్వాత ‘ఇంటర్నేషనల్ స్పైనల్ కార్డ్ సొసైటీ’ని నెలకొల్పాడు గట్ట్మన్. 1966లో క్లినికల్ వర్క్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ కొన్నాళ్లపాటు ఆటగాళ్ల కోసం పని చేశాడాయన. ఆ తర్వాత హార్టికల్చర్తో ‘పొప్పా జీ’ అనే బిరుదు దక్కించుకున్నాడు. భారీ క్యాలిప్లవర్లు పండించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 1979 అక్టోబర్లో ఆయనకు గుండెపోటు రాగా.. ఐదు నెలలపాటు ఆస్పతత్రిలో పొందుతూ.. చివరికి 1980, మార్చి18న కన్నుమూశాడు. ఆయన గౌరవార్థం.. 2012లో స్టోక్ మండ్విల్లే స్టేడియం బయట కాంస్య విగ్రహాన్ని ఉంచారు. అదే ఏడాది జరిగిన లండన్ పారా ఒలింపిక్స్ కమిటీకి ఆయనకూతురు ఎవా లోయిఫ్లెర్ను మేయర్గా నియమించారు. జర్మనీ ప్రభుత్వం ఆయనకు మెడికల్ సొసైటీ ప్రైజ్తో సత్కరించింది. రష్యా ప్రభుత్వం 2013లో స్టాంప్ రిలీజ్ చేసింది. ఇప్పుడు గూగుల్ 122వ పుట్టినరోజు సందర్భంగా డూడుల్తో స్మరించుకుంది. చదవండి: అంతరిక్షంలోకి తెలుగు ధీర.. శిరీష బండ్ల -
కరోనా: ‘మీ అందరికీ కృతజ్ఞతలు’
మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) కోరల నుంచి ప్రజలను కాపాడేందుకు వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది ఎంతగానో శ్రమిస్తున్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ.. తమ ప్రాణాలను పణంగా పెట్టి అహర్నిశలు సేవలు అందిస్తున్నారు. తాము కన్నవారిని, తమను కన్నవారిని నేరుగా కలుసుకోలేక తీవ్ర వేదనను అనుభవిస్తున్నప్పటికీ.. బాధను పంటి బిగువన అదిమిపెట్టి వెలకట్టలేని త్యాగానికి పూనుకున్నారు. అలాంటి వైద్య సిబ్బందికి కొందరు చప్పట్లు కొట్టి కృతజ్ఙతా భావం చాటుకుంటే.. మరికొందరు పాటలు, సంగీతం, దీపకాంతులతో వారి క్షేమాన్ని ఆకాంక్షించారు. తాజాగా సెర్చింజన్ దిగ్గజం గూగుల్ డూడుల్తో కరోనా యుద్ధ హీరోలకు ధన్యవాదాలు తెలిపింది. ‘‘వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది అందరికీ కృతజ్ఙతలు’’అంటూ హార్ట్ ఎమోజీతో హృదయపూర్వకంగా వారి సేవలను కొనియాడింది.(కరోనాపై పోరు: ‘మీ మద్దతు కావాలి’) ఇక కరోనా లాక్డౌన్తో ప్రపంచం స్తంభించిపోయిన వేళ అత్యవసర సేవలు అందిస్తున్న సిబ్బందికి గూగుల్ ప్రతి రోజూ ప్రత్యేక డూడుల్తో నీరాజనం పలుకుతోంది. ‘‘ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 విస్తరిస్తూ తన ప్రభావం చూపుతోంది. మనుపటితో పోలిస్తే పెద్ద సంఖ్యలో ప్రజలు ఒకరికొకరు అండగా నిలిచేందుకు ముందుకు వస్తున్నారు. కరోనాపై పోరులో ముందుండి సేవలు అందిస్తున్న ప్రతీ ఒక్కరికి డూడుల్ సిరీస్తో గౌరవిస్తున్నాం’’అని గూగుల్ డూడుల్ తన పేజీలో పేర్కొంది. ఈ క్రమంలో రైతులు, రైతు కూలీలు, పారిశుద్ధ్య కార్మికులు, అత్యవసర సేవల విభాగం సిబ్బంది అందరి సేవలను ప్రశంసిస్తూ యానిమేటెడ్ చిత్రాలు ప్రదర్శించింది. కాగా చైనాలోని వుహాన్ నగరంలో గతేడాది డిసెంబరులో పురుడు పోసుకున్న ప్రాణాంతక కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తోంది. దీని ధాటికి ప్రపంచవ్యాప్తంగా లక్ష మందికి పైగా మరణించగా.. లక్షలాది మంది దీని బారిన పడి విలవిల్లాడుతున్నారు. ఈ క్రమంలో మహమ్మారిని కట్టడి చేసేందుకు పలు దేశాలు లాక్డౌన్ అమల్లోకి తీసుకువచ్చాయి.(అమ్మా వచ్చేయమ్మా : నర్సు కూతురి కంటతడి) -
రిపబ్లిక్ డేపై గూగుల్ స్పెషల్ డూడుల్
సాక్షి, న్యూఢిల్లీ : భారత 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక డూడుల్తో గూగుల్ తనదైనశైలిలో శుభాకాంక్షలు తెలిపింది. దేశంలోని విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు ఉట్టిపడేలా దీనిని తీర్చిదిద్దింది. ఈ ప్రత్యేక డూడుల్ను సింగపూర్కు చెందిన మెరో సేథ్ అనే కళాకారుడు రూపుదిద్దారు.అందులో ప్రఖ్యాత ప్రదేశాలను, తాజ్మహల్,ఇండియా గేట్, కూడా ప్రతిబింబించేలా తయారు చేశారు. ఇంకా భారత దేశానికి చెందిన శాస్త్రీయ సంగీతం, కళలు, మన జాతీయ పక్షి.. దేశంలోని వస్త్ర పరిశ్రమను కూడా చిత్రంలో చేర్చుతూ.. ప్రత్యేక డూడుల్ను ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక డూడుల్ అందర్నీ ఆకట్టుకుంటుంది. -
మీరు వేసిన డూడుల్..గూగుల్లో..!
సాక్షి, హైదరాబాద్: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని గూగుల్.. ఈ ఏడాది భారతీయ చిన్నారుల కోసం డూడుల్ పోటీ నిర్వహిస్తోంది. ‘నేను పెరిగి పెద్దవాడినయ్యేటప్పటికి నేను ఆశిస్తుంది.. అనే థీమ్తో ఒకటి నుంచి పదవ తరగతి విద్యార్థులు ఎంట్రీస్ పంపాలని గూగుల్ ఆహ్వానిస్తోంది. ఉదాహరణకు ఎగరగలిగే షూస్? కాలుష్యరహిత ప్రపంచం, చందమామపై మానవ జీవితం తదితర అంశాలను విద్యార్థులు స్కెచ్ లేదా పెయింటింగ్లో అందంగా చిత్రీకరించాలి. అంతేకాకుండా ప్రతి గూగుల్ డూడుల్పై ఉన్నట్లే వారి పెయింటింగ్పై గూగుల్ అని ఉండాల్సిందిగా తెలిపింది. విద్యార్థులు వారి థీమ్ను డూడుల్ ఎంట్రీ ఫారమ్తో కొరియర్ లేదా ఆన్లైన్ doodles.google.co.in/d4g ద్వారా పంపించాలని పేర్కొంది. దరఖాస్తులు పంపడానికి చివరి గడువు సెప్టెంబర్ 30. ఈ పోటీలో గెలుపొందిన విజేతకు రూ. 5 లక్షల ఉపకారవేతనం, ఆ విద్యార్థి పాఠశాలకు రూ.2 లక్షల సాంకేతిక ప్యాకేజీతో పాటు మరిన్ని బహుమతులను గూగుల్ సంస్థ ఇవ్వనుంది. అంతేకాకుండా ఈ పోటీలో గెలుపొందిన విజేత ఆర్ట్ను గూగుల్ డాట్ కామ్లో డూడుల్గా ఉపయోగించనున్నారు. -
స్త్రీ విముక్తి చేతనం
సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా స్త్రీల హక్కుల కోసం ప్రపంచవ్యాప్తంగా జరుగుతోన్న చర్చలూ, పోరాటాలూ, ఉద్యమాలూ మనం చూస్తున్నాం.కానీ వందేళ్ల క్రితమే మహిళల హక్కుల కోసం, స్త్రీల విముక్తికోసం అలుపెరుగని పోరాటం చేసిన ఓ స్త్రీ శక్తిని ఈ రోజు గూగుల్ డూడిల్ జ్ఞాపకం చేసింది. అంతేనా.. ప్రజారోగ్యం కోసం, స్త్రీపురుష సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డి 133 వ జయంతి సందర్భంగా ఆమె పుట్టిన రోజును ప్రతియేటా ప్రతి ప్రభుత్వాసుపత్రిలోనూ ‘హాస్పిటల్ డే’ గా జరుపుకోనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. వందేళ్ల క్రితమే వైద్యరంగంలోకి! తమిళనాడులోని పుదుకొటై్ట జిల్లాలో ముత్తులక్ష్మీరెడ్డి 1886లో జన్మించారు. కేవలం పురుషులకే పరిమితమైన వైద్యరంగంలోకి అడుగుపెట్టి వంద యేళ్ల క్రితమే 1912లో తొలి మహిళా వైద్యురాలుగా తనదైన చరిత్ర సృష్టించారు. అంతేకాక సర్జరీ విభాగంలో అడుగుపెట్టిన తొలి భారతీయ యువతి కూడా ఈమే. మద్రాసు మెడికల్ కాలేజీలో చదివి మద్రాసులోని ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో తొలి హౌస్ సర్జన్గా ఆమె నియమితులయ్యారు. కేవలం వైద్య రంగంలోనే కాక రాజకీయంగానూ ఆమె తనదైన ముద్ర వేశారు. 1918లో ఇండియన్ ఉమన్స్ అసోసియేషన్కి సహ వ్యవస్థాపకులుగా పనిచేశారు. మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యురాలిగా ఎంపికై దేశంలోనే తొలి మహిళా శాసనసభ్యురాలిగా స్త్రీల జీవితాల్లో మార్పుకి ఎనలేని కృషి చేశారు. ఆ రోజుల్లో బాల్యవివాహాల నుంచి బాలికలకు విముక్తి కల్పించాలనే లక్ష్యంతో బాలికలకు కనీస వివాహ వయస్సు అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తారు. దేవదాసీ వ్యవస్థ నిర్మూలనకు ముత్తులక్ష్మీరెడ్డి.. చంద్రమ్మాళ్ అనే దేవదాసీ కూతురు. తమిళనాడులోని పుదుకొట్టే మహారాజా కాలేజీ ప్రిన్సిపల్ నారాయణ స్వామిని ముత్తులక్ష్మీరెడ్డి వివాహం చేసుకున్నారు. మహారాజా హై స్కూల్కి ఓ బాలిక రావడం ఆ రోజుల్లో పెద్ద వింత. ముత్తు లక్ష్మీరెడ్డి వస్తే తమ పిల్లలను స్కూల్కి పంపించేదే లేదని మగపిల్లల తల్లిదండ్రులు హెచ్చరించినా లెక్కచేయకుండా చదువుని కొనసాగించారు. దేవదాసీ అయిన చంద్రమ్మాళ్ని వివాహం చేసుకోవడంతో ముత్తులక్ష్మీరెడ్డి తండ్రిని ఆయన కుటుంబం వెలివేసింది. దీంతో అమ్మమ్మ ఇంట్లో పెరిగిన ముత్తులక్ష్మీరెడ్డి దేవదాసీల పరిస్థితిని అత్యంత సమీపం నుంచి చూశారు. ఊరుమ్మడి సొత్తుగా భావించి దేవుడి పేరుతో దగాపడ్డ దేవదాసీల జీవితాలను అధ్యయనం చేశారు. వందలాదిమంది దేవదాసీలను ఇంటర్వ్యూ చేసి, ఈ సామాజిక వెనుకబాటుతనానికి సమూలంగా స్వస్తి పలకాలని దేవదాసీ వ్యవస్థ రద్దు బిల్లుని ప్రవేశపెట్టారు. 1930లో ఇద్దరు దేవదాసీ మహిళలు ముత్తులక్ష్మీరెడ్డి ఆశ్రయం కోరారు. నిలువనీడలేని ఆ దేవదాసీ బాలికలను కొద్ది రోజులు తనతో ఉంచుకొని, ఆ తరువాత ఎక్కడైనా వారికి ఆశ్రయం కల్పించే ప్రయత్నం చేశారు. అయితే వారికి ఆశ్రయమిచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో ముత్తులక్ష్మీరెడ్డి దేవదాసీ బాలికల కోసం ప్రత్యేకించి ‘అవ్వై హోం’ అనే షెల్టర్ హోంలను నిర్మించి, అక్కడే దేవదాసీ బాలికలకు విద్యాబోధనా ఏర్పాట్లు చేశారు. స్వాతంత్య్ర సంగ్రామంలో.. స్వాతంత్య్ర సంగ్రామంలో సైతం ముత్తులక్ష్మీరెడ్డి పాత్ర మరువలేనిది. ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొన్న ముత్తులక్ష్మీరెడ్డి అదే ఉద్యమంలో గాంధీ అరెస్టుకి నిరసనగా శాసనసభస్యత్వానికి రాజీనామా చేసి, దేశభక్తిని చాటుకున్నారు. అయితే 1947 డిసెంబర్లో మద్రాసు లెజిస్లేటివ్ అసెంబ్లీలో దేవదాసీ (ప్రివెన్షన్ ఆఫ్ డెడికేషన్) బిల్లు పాస్ అవడంతో ముత్తులక్ష్మీరెడ్డి చిరకాల పోరాటం ఫలించింది. 1954లో చెన్నైలో క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించిన ముత్తులక్ష్మిని 1956 లో ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. తన యావత్ జీవితాన్నీ స్త్రీ సంక్షేమం కోసం, స్రీల హక్కుల కోసం, స్త్రీ విముక్తి కోసం అర్పించిన ముత్తులక్ష్మీరెడ్డి చివరకు 1968లో తన 81వ యేట కన్నుమూశారు. – అరుణ అత్తలూరి -
గూగుల్ ప్రత్యేక డూడుల్.. గుర్తు పట్టారా..!
చెన్నై: అభాగ్యుల కోసం ఇంటినే ఆశ్రయంగా మార్చిన మనసున్న మారాణి.. లింగ అసమానత్వంపై అలుపెరగని పోరాటం చేసిన ధీర వనిత.. దేవదాసి కుటుంబంలోనే పుట్టి ఆ వ్యవస్థనే నామరూపల్లేకుండా మార్చేందుకు కంకణం కట్టుకున్న పోరాట యోధురాలు.. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ముత్తులక్ష్మి రెడ్డి 133వ జయంతి నేడు.. తన సేవలను గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం జూలై 30ను ‘హస్పిటల్ డే’గా సోమవారం ప్రకటించింది. ఆమె అందించిన వైద్య సేవలకు గుర్తుగా ఇక మీదట ప్రతి యేటా ఈ రోజును ‘హస్పిటల్ డే’ను ఘనంగా నిర్వహించనున్నారు. భారత మొదటి మహిళా సర్జన్ ముత్తులక్ష్మి రెడ్డి జయంతిని పురస్కరించుకుని గూగుల్ ప్రత్యేక డూడుల్ను రూపొందించింది. చేతిలో పుస్తకం పట్టుకున్న మహిళ మిగతావారికి దిశానిర్దేశం చేస్తున్నట్టుగా ఈ ఫొటో ప్రతిబింబిస్తుంది. నిజ జీవితంలోనూ ఆమె జీవన విధానం ఆదర్శదాయకమే! మొట్ట మొదటి మహిళా సర్జన్.. పుదుకొట్టాయ్ గ్రామంలో 1886వ సంవత్సరంలో దేవదాసీ కుటుంబంలో ముత్తులక్ష్మి జన్మించారు. దేవదాసీ వ్యవస్థలో ఉండే కష్టాలను కళ్లారా చూశారు. ఆడవారికి చదువు దండగ అనుకునే కాలంలో ఉన్నత విద్య వైపు అడుగులు వేశారు. ఆ క్రమంలోనే మహరాజ్ కళాశాలలో అడ్మిషన్ సంపాదించి బాలుర ఇన్స్టిట్యూట్లో అడుగు పెట్టిన మొదటి మహిళగా రికార్డు సృష్టించారు. ఆ తర్వాత మద్రాస్ మెడికల్ కళాశాలలో అడ్మిషన్ పొందిన మొదటి మహిళగా ఖ్యాతి గడించారు. సమాజం ఎన్ని అడ్డంకులు సృష్టించినా వైద్య విద్యను పూర్తి చేసి భారత మొట్టమెదటి మహిళా సర్జన్గా పేరు సంపాదించుకున్నారు. ఇంటినే ఆశ్రయంగా.. ముత్తులక్ష్మి డాక్టర్ మాత్రమే కాదు, విద్యావేత్త, చట్టసభ సభ్యురాలు, సామాజిక సంస్కర్త కూడా! 1954లో రోగుల కోసం ‘అడయార్ క్యాన్సర్ సెంటర్’ను ఏర్పాటు చేశారు. దీనిలోని రోగులకు మానసిక సంతోషాన్ని అందించటానికి వైద్య నిపుణులతో ప్రత్యేక ఏర్పాట్లు చేయించారు. కాగా ఆమె భారత మొదటి మహిళా శాసనసభ్యురాలు కూడా! తర్వాతి కాలంలో మద్రాస్ లెజిస్లేచర్ కౌన్సిల్కు డిప్యూటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సమయంలో ఆమె ఎన్నో సామాజిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. పబ్లిక్, ప్రైవేట్ ఫంక్షన్లలో దేవదాసి ప్రదర్శనలను నిర్వహించటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దేవదాసి వ్యవస్థ రద్దుకు, కనీస వివాహ వయసు పెంపు, లింగ అసమానతలు తదితర విషయాలపై పోరాడారు. లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న బాధితుల కోసం ఆశ్రమాన్ని నెలకొల్పారు. అందుకోసం అడయార్లోని తన ఇంటినే ఆశ్రయంగా మార్చారు. దండి సత్యాగ్రహం కోసం 1930లో శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. ఆమె అందించిన విశిష్ట సేవలకుగానూ భారత ప్రభుత్వం 1956లో పద్మభూషణ్తో సత్కరించింది. 1968 జూలై 22న ముత్తులక్ష్మి కన్నుమూశారు. -
‘డాక్టర్ వి’కి గూగుల్ ప్రత్యేక నివాళి
న్యూఢిల్లీ : ప్రఖ్యాత కంటి వైద్య నిపుణులు (ఆప్తమాలజిస్ట్) డాక్టర్ గోవిందప్ప వెంకటస్వామికి గూగుల్ ఘననివాళి అర్పించింది. ఆయన శతజయంతి సందర్భంగా నేడు (అక్టోబర్1, 2018) ప్రత్యేక డూడుల్ని రూపొందించి వెంకటస్వామికి అంకితమిచ్చింది. ‘డాక్టర్ వి’ సుపరిచితమైన డాక్టర్ గోవిందప్ప వెంకటస్వామి అక్టోబర్ 1, 1918న తమిళనాడులోని వడమలపురంలో జన్మించారు. మద్రాస్ లోని స్టాన్లీ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించి.. 1951 లో మద్రాసులోని గవర్నమెంట్ ఆప్తాల్మిక్ ఆస్పత్రిలో ఆప్తమాలజీలో ఎమ్మెస్సీతో అర్హత సాధించారు. ఆ తరువాత ప్రభుత్వ వైద్యుడిగా పనిచేశారు. అరవింద్ ఐ అస్పత్రిని నిర్మించి కంటి జబ్బులతో బాధపడేవారికి మంచి వైద్యం అందించేందుకు కృషి చేశారు. కేవలం 11 బెడ్లు, ఓ నలుగురు వైద్యులతో ప్రారంభమైన అరవింద్ అస్పత్రి ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత కంటి ఆసుపత్రుల్లో ఒకటిగా మారింది. డాక్టర్ వెంటకస్వామి తన జీవిత మొత్తాన్ని అంధత్వాన్ని నిర్మూలించడానికి అంకితం చేశారు. డాక్టర్ వెంకటస్వామి 30 ఏళ్ళ వయసులో రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధితో శాశ్వతంగా వికలాంగులయ్యారు. అయితేనేం మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో దేశంలోనే ప్రముఖ కంటి వైద్యుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన వ్యక్తిగతంగా లక్షకు పైగా కంటి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. ఒకేరోజు 100 కంటి శస్త్ర చికిత్సలు చేసి చరిత్ర సృష్టించారు. ఆయన 1973లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. జూలై 7, 2006లో వెంటకస్వామి మరణించారు. -
హ్యాపీ బర్త్డే గూగుల్ తల్లి
గూగుల్.. ఈ పదం తెలియని వ్యక్తి లేడంటే అతిశయోక్తి కాదు. చిన్నపాటి స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతివ్యక్తికి ఈ పదం సుపరిచితమే. ఈరోజుల్లో ఏ సమాచారం కావాలన్నా ‘జై గూగుల్ తల్లి’ అనాల్సిందే. ఎటువంటి సమాచారాన్నయినా క్షణాల్లో యూజర్లకు అందించే గూగుల్ సెర్చ్ ఇంజన్ 20వ పుట్టిన రోజు నేడు. ఈసందర్భంగా గూగుల్ ఆవిర్భావం, 20 ఏళ్ల దాని ప్రస్థానంపై గూగుల్ డూడుల్, ఓ వీడియోను రిలీజ్ చేసింది. సమాచారాన్నంతా ఒకే వేదిక ద్వారా ప్రపంచానికి అందించాలన్న ఆలోచనతో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు పీహెచ్డీ విద్యార్థులు సర్జీ బ్రిన్, లారీ పేజ్లు 1998లో గూగుల్ సెర్చ్ ఇంజిన్ను ప్రారంభించారు. ప్రస్తుతం 150 భాషల్లో 190 దేశాల్లో గూగుల్ సెర్చ్ ఇంజిన్ సేవలందిస్తుంది. -
‘అప్గార్ స్కోర్’ సృష్టికర్తకు గూగుల్ ఘన నివాళి
అమెరికా ప్రముఖ అనస్తీయాలజిస్ట్, ‘అప్గార్ స్కోర్’ పరికర సృష్టికర్త డాక్టర్ వర్జీనియా అప్గార్కు దిగ్గజ సెర్చ్ ఇంజన్ గూగుల్ ఘనంగా నివాళులు అర్పించింది. గురువారం(జూన్7) అప్గార్ 109వ జయంతిని పురస్కరించుకొని గూగుల్ తన డూడుల్తో ఆమెను మరోసారి ప్రపంచానికి గుర్తు చేసింది. ఆమె ప్రాధాన్యతను గుర్తించి ఆమెకు చిహ్నంగా ఓ డాక్టర్, చిన్న బేబీ ఫొటోలతో గూగుల్ అక్షరాలను రూపొందించి, కింద అప్గార్ అనే అక్షరాలను పొందుపరిచింది. 1909 జూన్ 7న అమెరికాలోని న్యూజెర్సిలో వర్జీనియా అప్గార్ జన్మించారు. కొలంబియా యూనివర్సీటీలోని ఫిజీషియన్ అండ్ సర్జరీ విభాగం మొదటి మహిళా ప్రొఫెసర్గా పనిచేశారు. పుట్టిన వెంటనే పిల్లలను ‘అప్గార్ స్కోర్’తో పరిశీలిస్తారు. వారు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అని వైద్యులు తేల్చుకోవడానికి ఉపకరించే పరిశీలన ఇది. దీని సృష్టికర్తే డాక్టర్ వర్జీనియా అప్గార్. పుట్టిన వెంటనే పిల్లలు ఊపిరి ఎలా పీల్చుకుంటున్నారు, వారి శరీర ఛాయతో పాటు హృదయ స్పందన ఎలా ఉన్నాయి.. తదితర విషయాలను అప్గార్ స్కోర్ ద్వారా పరిశీలిస్తారన్న విషయం తెలిసిందే. దీని ప్రకారం 2 మార్కుల చొప్పున గ్రేడింగ్ ఇస్తూ 5-10 లోపల చేస్తారు. శిశువుకి 8-10 మార్కులు వస్తే ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. శిశువు 0-5 మార్కులు వస్తే బిడ్డ పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు గుర్తిస్తారు. వర్జీనియా కనుగొన్న అప్గార్ సూచీ వల్ల వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులొచ్చాయి. -
ఉమెన్స్ డే.. గూగుల్ స్పెషల్ డూడుల్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ ప్రత్యేక డూడుల్ను రూపొందించి. ఇందు కోసం ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో ప్రముఖులైన 12 మంది కళాకారుల సంబంధించిన ఫోటోలతో డూడుల్ ఉంచింది. 12 డూడుల్స్లో బెంగళూరుకు చెందిన కామిక్స్ ఆర్టిస్ట్ కావేరి గోపాలకృష్ణన్ రాసిన అప్ ఆన్ ది రూఫ్ కూడా ఉంది. టెర్రస్ మీద కూర్చుని పుస్తకాలు చదువుతూ ఉంటోంది ఓ బాలిక. ప్రతి పేజీ చదవడం పూర్తైన తర్వాత ఆమెకు రెక్కలు వచ్చి స్వేచ్ఛగా ఎగిరిపోతుందనేది.. ఈ స్టోరీలోని సారాంశం. గోపాలకృష్ణన్తో పాటు అన్నా హైఫిష్, టిల్లీ వాల్డెన్, ఇజురి, ఫిలిప్పా రైస్, చిహిరో టకయూచి.. ఇలా 12 మంది మహిళలకు సంబంధించిన ఇన్క్రెడిబుల్ స్టోరీలతో గూగుల్ డూడుల్స్ రూపొందించింది. అంతాకాకుండా నెటిజన్లు తమ లైఫ్ స్టోరీలను హ్యాష్ట్యాగ్ #HerStoryOurStoryతో జతచేసి సోషల్మీడియాలో పంచుకోవాలని గూగుల్ సంస్థ కోరింది. Like many great stories, Kaveri's story started with "once upon a time” too. On #IWD2018, we’d love to hear about how you continue to make a difference everyday. Share your story using #HerStoryOurStory. #GoogleDoodle https://t.co/gWwpPaOgsk pic.twitter.com/WeujTcV2Vn — Google India (@GoogleIndia) March 8, 2018 -
సూపర్స్టార్ను జ్ఞాపకం చేసిన గూగుల్
బెంగళూరు: కన్నడ సూపర్స్టార్ రాజ్కుమార్కు గూగుల్ ఘన నివాళి అర్పించింది. ఆయన 88వ జయంతి సందర్భంగా ప్రత్యేక డూడుల్తో ఆకట్టుకుంది. ఓ తెరమీద బ్యాక్ గ్రౌండ్లో గూగుల్ అని ఉండి యువకుడిగా రాజ్కుమార్ చిరునవ్వు చిందిస్తుండగా ఎదురుగా ప్రేక్షకులు కూర్చొని ఆయనను చూస్తున్నట్లుగా ఆ డూడుల్ ఉంది. 1929లో అంబరీష్ సింగనల్లూరు పుట్టస్వామయ్య ముత్తురాజుగా జన్మించిన ఆయన వెండి తెర వెలుగుపైకి రాగానే రాజ్కుమార్గా మారిపోయారు. దాదాపు నాలుగు దశాబ్దాలు కన్నడ చిత్ర పరిశ్రమను ఏలారు. 1954 బేదారా కన్నప్పా అనే కన్నడ చిత్రం ద్వారా సినీలోకంలో అడుగుపెట్టిన ఆయన దాదాపు 200 చిత్రాల్లో నటించింది. ఆయన జీవితం మొత్తం కన్నడ చిత్ర పరిశ్రమకే అంకితం చేశారు. ఆయన మంచి గాయకుడిగా కూడా పేరు సంపాధించుకున్నారు. 300వందల పాటలు కూడా పాడారు. పద్మభూషణ్, దాదా సాహేబ్ పాల్కే వంటి అవార్డులు కూడా పొందారు. ప్రస్తుతం ఆయన కుమారులు శివరాజ్కుమార్, పునీత్ రాజకుమార్ కూడా కన్నడ చిత్ర సీమలో ప్రముఖులుగా ఉన్నారు. -
తొలి మహిళా గురువుపై నాడు రాళ్లేసారు
ఆమె భారత దేశంలోనే తొలి మహిళా గురువు. 1848లోనే విద్యాబుద్ధులు నేర్పేందుకు నడుంకట్టారు. ప్రత్యేక బాలికల పాఠశాలను స్థాపించి ఎంతో మందికి ఆదర్శప్రాయులయ్యారు. ఆమె చేస్తున్న మంచి పనులు చూసి ఓర్వలేక రాళ్లు విసిరినవారు ఉన్నారు.. ఆమె వెళ్లే మార్గంలో పేడను వేసినవారు ఉన్నారు. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో భర్త ప్రముఖ సామాజిక వేత్త జ్యోతిరావ్ పూలే ఇచ్చిన అండదండలతో ముందుకు సాగి నేడు దేశంలోని తొలి మహిళా గురువుగా నిలిచారు. దేశ వ్యాప్తంగా ప్రతి ఏటా ఆమె జన్మదినం జరుపుకునే స్థాయిలో ఉన్నారు. ఆమె ఎవరో కాదు. సావిత్రీబాయి పులే. ఆమె 186వ జయంతి నేడు. ఈ సందర్భంగా ప్రతిష్టాత్మక నెటిజన్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఆమెకు డూడుల్ ద్వారా ఘన నివాళి అర్పించింది. కులమతాలకు అతీతంగా సావిత్రీబాయి విద్యాబోధన చేశారు. వితంతువులకు ఆశ్రయం కల్పించారు. సొంతంగా క్లినిక్ స్థాపించి వైద్య సేవలు కూడా అందించారు. -
'సైకో' పితామహుడికి గూగుల్ ఘన నివాళి
'ఫాదర్ ఆఫ్ మోడ్రన్ సైకాలజీ'గా ఖ్యాతి పొందిన ప్రముఖ సైకాలజిస్ట్ సిగ్మండ్ ఫ్రాయిడ్ కు దిగ్గజ సెర్చ్ ఇంజన్ గూగుల్ ఘనంగా నివాళులు అర్పించింది. శుక్రవారం (మే 6న) ఫ్రాయిడ్ 160వ జయంతిని పురస్కరించుకుని ఆయన డూగుల్ ను రూపొందించింది. 'మనిషి మనస్సులో 'అ చేతనం' (అన్ కాన్షెసినెస్) అనేది ఉంటుంది. అది మన ప్రవర్తనను మనకు తెలియకుండానే ప్రభావితం చేస్తుంది' అన్న ఫ్రాయిడ్ విశ్లేషణ.. మనస్తత్వ విశ్లేషణలో తారకమంత్రమైంది. సిగ్మండ్ ఫ్రాయిడ్ 1856, మే 6న జెకేస్లోవేకియాలోని ఫ్రీ బెర్గ్లో జన్మించారు.1860లో వారి కుటుంబ మంతా వియన్నాకు తరలిపోయింది. పేదరికంలోనూ కష్టపడి చదివి గ్రీస్, లాటిన్, గణితం, ప్రకృతి శాస్త్రాలు,చరిత్రలను వంటపట్టించుకున్న ఫ్రాయిడ్.. 1873లో వియన్నా విశ్వవిద్యాలయంలో వైద్యశాస్త్రంలో చేరాడు. నాటికి అదే వైద్యశాస్త్రంలో ప్రపంచ రాజధాని. మానసిక రుగ్మతులకు సరైన చికిత్స చేయడానికి దోహదపడే క్లినికల్ న్యూరాలజీకి సంబంధించి చాలా రకాల అధ్యయనం చేసిన ఫ్రాయిడ్.. న్యూరాలజీ, మెదడు పని చేసే విధానం గురించి అనేక పరిశోధక పత్రాలు ప్రచురించారు.'సైకో అనాలసిస్' అన్న పదం వాడిందీ, ఆ అంశం ఒక సబ్జెక్టుగా అభివృద్ధి చేసిందీ ఫ్రాయిడ్. 1905లో ఫ్రాయిడ్ ప్రతిపాదించిన థియరీ ఆఫ్ సెక్యువాలిటీ అంశం మీద ప్రచురించబడిన మూడు వ్యాసాలు తీవ్రమైన ప్రతిఘటనను ఎదుర్కొన్నాయి. అదే సమయం లో సైకో అనాలసిస్ను ఫ్రాయిడ్ ఒక థెరపీగా ప్రతిపాదిస్తూ వ్యాసాలు రాశారాయన. మెదడు పనితీరుమీద అనేక పరిశోధనలు చేసిన ఆయన 1939, సెప్టెంబరు 23న కన్నుమూశారు. -
అభిమానులకే కాదు గూగుల్కూ క్రికెట్ ఫీవర్
టి-20 ప్రపంచ కప్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మంగళవారం నుంచే జరిగే ఈ మెగా ఈవెంట్ ప్రధాన మ్యాచ్లు అభిమానులను కనువిందు చేయనున్నాయి. భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీకి ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ కూడా ఎంతో ప్రాధాన్యమిస్తూ ఆమితాసక్తి చూపుతోంది. మంగళవారం భారత్, న్యూజిలాండ్ల మధ్య జరిగే ఆరంభ మ్యాచ్కు స్వాగతం పలుకుతూ గూగుల్ హోం పేజీలో కొత్త డూడుల్ను పోస్ట్ చేసింది. రెండు క్రికెట్ బ్యాట్ల మధ్య బంతి ఉన్న దృశ్యం గూగుల్ డూడుల్లో కనిపిస్తుంది. టి-20 ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ పోటీలు ఆరంభానికి ముందు రోజు కూడా గూగుల్ కొత్త డూడుల్ను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. స్టేడియంలో క్రికెట్ ఆడుతున్నట్టుగా ఉన్న దృశ్యాన్ని హోం పేజీలో పోస్ట్ చేసింది. ఏప్రిల్ 3 వరకు జరిగే ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు నాగ్పూర్లో జరిగే మ్యాచ్లో భారత్, న్యూజిలాండ్ తలపడుతున్నాయి. -
గూగుల్ కూడా పండగ చేసుకుంది
న్యూఢిల్లీ: క్రికెట్ అభిమానులకు వేసవికాలమంతా వినోదమే వినోదం. ఆసియా కప్ ముగిసింది. వెంటనే మరో పరుగుల పండగ వచ్చేసింది. అభిమానుల్లో ఇప్పుడు టి-20 ప్రపంచ కప్ ఫీవర్. మంగళవారం ఆరంభమయ్యే ఈ మెగా ఈవెంట్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టి-20 ప్రపంచ కప్నకు స్వాగతం పలుకుతూ ఆరంభానికి ఒక్క రోజు ముందు ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ హోం పేజీలో కొత్త డూడుల్ను పోస్ట్ చేసింది. స్టేడియంలో క్రికెట్ ఆడుతున్నట్టుగా ఉన్న దృశ్యం గూగుల్ డూడుల్లో కనిపిస్తుంది. ఏప్రిల్ 3 వరకు జరిగే ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఏడు వేదికలపై మ్యాచ్లను నిర్వహిస్తారు. 16 జట్లు పాల్గొంటున్నాయి. -
రిపబ్లిక్ డేపై గూగుల్ స్పెషల్ డూడుల్
న్యూఢిల్లీ: భారత 67వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక డూడుల్తో గూగుల్ తనదైనశైలిలో శుభాకాంక్షలు తెలిపింది. సరిహద్దు భద్రతా దళానికి (బీఎస్ఎఫ్) చెందిన ఒంటెల దళం కవాత్తును తన సెర్చ్ పేజీలో డూడుల్గా ప్రచురించింది. ఢిల్లీలోని రాజ్పథ్లో జరుగుతున్న గణతంత్ర వేడుకలను తలపించేలా.. అందంగా తీర్చిదిద్దిన ఒంటెలు, వాటిపై కూర్చుని మార్షియల్ సంగీతాన్ని అందిస్తున్న బ్యాండ్మేళాతో కూడిన డూడుల్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ డూడుల్లోని ఆరు ఒంటెలపై కప్పిన బంగారురంగు జరీవస్త్రంపై గూగుల్ అని ఆంగ్ల అక్షరాలు ఎరుపు రంగంలో రాసి ఉన్నాయి. దేశంలో బీఎస్ఎఫ్కు మాత్రమే అందంగా తీర్చిదిద్దిన ఒంటెల దళం ఉంది. -
పక్షులతో హ్యాపీ న్యూయర్
న్యూఢిల్లీ: ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ విభిన్న 'డూడుల్'తో వీక్షకులకు ముందుగానే నూతన శుభాకాంక్షలు తెలిపింది. యానిమేటెడ్ డూడుల్ తో హ్యాపీ న్యూయర్ చెప్పింది. కొమ్మపై కూర్చున్న ఐదు పక్షులు 2016 పేరుతో ఉన్న గుడ్డును పొదిగేందుకు రాత్రి 12 గంటలు ఎప్పుడమవుతుందా అని చూస్తున్నట్టుగా డూడుల్ తయారు చేసింది. గూగుల్ వెబ్ సైట్ ఓపెన్ చేయగానే ఈ డూడుల్ వీక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రముఖ వ్యక్తులు, ముఖ్య సంఘటనలకు సంబంధించిన వాటితో డూడుల్ రూపొందించి గూగుల్ తన వెబ్ సైట్ లో పెడుతున్న సంగతి నెట్ వీక్షకులకు సుపరిచితం. -
యోగా గురువుకు గూగుల్ సెల్యూట్
ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన యోగా గురువు బీకేఎస్ అయ్యంగార్ జయంతి సందర్భంగా గూగుల్ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించింది. కర్ణాటకకు చెందిన బెల్లూరు కృష్ణమాచార్ సుందరరాజ అయ్యంగార్ 97వ జయంతిని పురస్కరించుకుని గూగుల్ తన లోగోలో ఒక 'ఓ' అనే అక్షరాన్ని తీసి.. ఆ స్థానంలో అయ్యంగార్ యోగా చేస్తున్నట్లు ఉన్న బొమ్మను పెట్టింది. అయ్యంగార్ యోగా పేరుతో బీకేఎస్ అయ్యంగార్ ప్రవేశపెట్టిన యోగాకు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం లభించింది. 1918లో కర్ణాటకలో పుట్టిన అయ్యంగార్.. 2014 ఆగస్టు 20వ తేదీన పుణెలో మరణించారు. పద్మశ్రీ నుంచి పద్మ విభూషణ్ వరకు అన్ని రకాల అవార్డులు ఆయనను వరించాయి. -
సామాన్యుని సృష్టికర్తకు గూగుల్ నివాళి
'కామన్ మేన్' సృష్టికర్త, ప్రఖ్యాత కార్టూనిస్టు ఆర్కే లక్ష్మణ్ కు ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఘనంగా నివాళి అర్పింపించింది. ఆర్కే లక్ష్మణ్ 94వ జయంతిని పురస్కరించుకుని ఆయన ఫోటోను 'డూడుల్'గా పెట్టింది. తన డెస్క్ వద్ద దీక్షగా పనిచేసుకుంటున్న ఆర్కే లక్ష్మణ్, ఆయన కార్టూన్ కేరెక్టర్ 'కామన్ మేన్' లు కలిసి ఉన్న చిత్రాన్ని డూడుల్ గా రూపొందించింది. ఆర్కే లక్ష్మణ్ గా సుపరిచితులు అయిన ఈ కామన్ మేన్ సృష్టికర్త పూర్తి పేరు రాశిపురం కృష్ణ స్వామి అయ్యర్ లక్ష్మణ్, ఆయన అక్టోబర్ 23, 1924లో మైసూర్ లో జన్మించారు. ఆయన తండ్రి ఉపాధ్యాయుడు. కుటుంబంలోని ఆరుగురు కుమారుల్లో లక్ష్మణ్ చివరి వారు. మాల్గుడి సృష్టి కర్త ఆర్ కే నారాయణ్, లక్ష్మణ్ ఇద్దరూ సోదరులు కావడం విశేషం. ముంబాయి నుంచి ప్రచురించే ఇంగ్లీష్ దిన పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా లో కార్టూనిస్టుగా పనిచేశారు. కన్నడ వ్యంగ్య పత్రిక కొరవంజిలో ఇలస్ట్రేటర్ గా ఆయన కెరీర్ ప్రారంభించారు. ఆయన పద్మవిభూషణ్, మెగసెసే , తదితర విశేష పురస్కారాలు ఎన్నోఅందుకున్నారు. కామన్ మేన్ పాత్రను సృష్టించి, దానికి తన వ్యంగ్య చిత్రాల్లో స్థానంకల్పించిన లక్ష్మణ్ సామాన్యుని పక్షాన నిలచి రాజకీయ నాయకులపై వ్యంగ్యాస్ర్తాలు సంధించేవారు. ఆయన జనవరి 26న పూనేలో మరణించారు. -
పాకిస్థానీ గాయకుడికి గూగుల్ నివాళి
ఢిల్లీ: ప్రముఖ పాకిస్థానీ గాయకుడు నస్రత్ ఫతే అలీఖాన్ కు ఇంటర్నెట్ సెర్చ్ దిగ్గజం గూగుల్ తనదైన శైలిలో నివాళి అర్పించింది. ఫతే అలీ ఖాన్ జయంతిని పురస్కరించుకుని ఆయన ఫోటోను 'డూడుల్'గా పెట్టింది. తన బృందంతో కలిసి ఆయన కచేరీ చేస్తున్న చిత్రాన్ని పోస్ట్ చేసింది. ఫతే అలీ ఖాన్ తన్మయత్వంతో పాటుతున్నట్టుగా ఈ ఫోటోలో ఉంది. గానంలో లీనమై పైకి ఎత్తిన ఆయన ఎడమ చేతిని గూగుల్ లోని 'ఎల్' అక్షరానికి బదులుగా డూడుల్ లో చూపించింది. ఫతే అలీ ఖాన్ 1948, అక్టోబర్ 13న జన్మించారు. ఖవ్వాలీ గాయకుడిగా ఆయన ప్రఖ్యాతి గాంచారు. 49 ఏళ్ల వయసులో 1997, ఆగస్టు 16న గుండెపోటుతో కన్నుమూశారు. -
ఇంకు చుక్కలతో మనసు బొమ్మ- గూగుల్ డూడుల్
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మనోవైజ్ఞానికశాస్త్ర నిపుణుడు, విశ్లేషకుడు హెర్మాన్ రోర్షచ్ 129 జయంతిని పురస్కరించుకుని ఇంటర్నెట్ సెర్జ్ ఇంజిన్ గూగుల్ ఆయనకు ఘన నివాళి అర్పించింది. రోర్షచ్ గౌరవార్థం ఆయన బొమ్మతో డూడుల్ పెట్టింది. నోట్ ప్యాడ్, కలం పట్టుకుని రోర్షచ్ కూర్చున్న ఫోటోతో నలుపు, తెలుపు రంగుల్లో డూడుల్ను గూగుల్ ఉంచింది. ఇంక్ బ్లాటిల్ పేపర్పై రకరకాల చిత్రాలు మారుతున్నట్టుగా ఉన్న బొమ్మను మధ్యలో పెట్టింది. ఇందులో మనకు నచ్చిన చిత్రాన్ని గూగుల్ ప్లస్, ఫేస్బుక్, ట్విటర్లో షేర్ చేసే ఆప్షన్ కూడా ఇచ్చారు. క్లెక్సోగ్రఫీ(ఇంక్ చుక్కలతో బొమ్మలు వేసే పద్ధతి)ని మనోవైజ్ఞానిక శాస్త్రం ద్వారా విశ్లేషించడాన్ని హెర్మాన్ రోర్షచ్ ప్రవేశపెట్టారు. ఇంక్బ్లాట్ పేపర్పై వేసిన చిత్రాల ఆధారంగా మనుషుల మాసినక స్థితిని విశ్లేషించడం దీని ప్రత్యేకత. ఈ విధానం ద్వారా ముందుగా ఆయన పాఠశాల విద్యార్థుల స్పందనలను విశ్లేషించారు. తర్వాత కాలంలో కొన్నేళ్ల పాటు దీనిపై ఆయన ఎన్నో ప్రయోగాలు చేశారు. మనోవైజ్ఞానిక శాస్త్రంలో ఇంక్బ్లాట్ పరీక్షలు ఏవిధంగా ఉపయోపడతాయో తెలుపుతూ 'సైకోడయాగ్నస్టిక్' పేరుతో ఆయన పుస్తకం రాశారు. హెర్మాన్ రోర్షచ్... 1884లో నవంబర్ 8న స్విట్జర్లాండ్లోని జ్యురిచ్ల్ జన్మించారు. చిన్నతనంలో ఆయనకు క్లెక్సోగ్రఫీ మీద ఉన్న అభిరుచి కారణంగా ఆయనను 'క్లెక్స్' అని పిలిచేవారు. గ్రాడ్యయేషన్ పూర్తయిన తర్వాత ఆయన ప్రముఖ మానసికశాస్త్ర నిపుణుడు యూజెన్ బ్లూలర్ శిష్యరికంలో మనోవైజ్ఞానిక శాస్త్రం అభ్యసించారు. మనోవైజ్ఞానిక శాస్త్రానికి ఆద్యుడయిన సిగ్మండ్ ఫాయిడ్ కు సమానంగా పేరు గడించిన కార్ల్ యూంగ్ కూడా యూజెన్ బ్లూలర్ శిష్యులే కావడం విశేషం. మనోవైజ్ఞానిక శాస్త్రం తనదైన ముద్ర వేసిన హెర్మాన్ రోర్షచ్ 37 ఏళ్ల ప్రాయంలోనే 1922, ఏప్రిల్ 1న ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. -
శకుంతలాదేవికి గూగుల్ నివాళులు
మానవ కంప్యూటర్.. గణిత మేధావి శకుంతలాదేవి 84వ జయంతి సందర్భంగా గూగుల్ తన డూడుల్ తో ఆమెకు ఘనంగా నివాళులు అర్పించింది. కాలుక్యులేటర్లోని డిజిటల్ అంకెల రూపంలో గూగుల్ అనే అక్షరాలను రూపొందించి, పక్కనే ఎస్ డి అనే రెండు అక్షరాలు, శకుంతలా దేవి బొమ్మను ఉంచింది. లెక్కల్లో తిరుగులేని శకుంతలా దేవి పలుమార్లు అత్యంత వేగవంతమైన కంప్యూటర్లను సైతం చిటికెలో ఓడించి భారతీయుల గణిత మేధస్సును ప్రపంచానికి చాటి చెప్పారు. ఇదే అంశంపై ఆమె 1982లో గిన్నెస్ బుక్ రికార్డును కూడా సాధించారు. చిన్నతనంలో ఇంకా స్కూలుకు వెళ్లకముందే అంకెలతో ఆమె చేస్తున్న మేజిక్.. సర్కస్ లో పనిచేసే ఆమె తండ్రి కంట పడింది. అప్పటికి శకుంతలాదేవి వయస్సు మూడేళ్లే!! అప్పటినుంచి గణితంలో తిరుగులేని ప్రతిభను కనబరుస్తూ ప్రపంచప్రఖ్యాతి పొందారామె. 1977లో అమెరికాలో ఓ కంప్యూటర్ తో శకుంతలా దేవికి పోటీ పెట్టారు. 188132517 అనే సంఖ్యకు మూడో వర్గం కనుక్కోవడంలో ఈ పోటీ పెట్టగా, ఆమె కంప్యూటర్ ను ఓడించేశారు. ఇక 1980 జూన్ నెలలో 13 అంకెలున్న రెండు సంఖ్యలు తీసుకున్నారు. 76,86,36,97,74,870 అనే సంఖ్యతో 24,65,09,97,45,779 అనే సంఖ్యను హెచ్చవేస్తే ఎంత వస్తుందని లండన్ ఇంపీరియల్ కాలేజిలోని కంప్యూటర్ విభాగంలోని ఓ సూపర్ కంప్యూటర్ శకుంతలా దేవిని ప్రశ్నించింది. దానికి ఆమె కేవలం 28 సెకన్లలో సమాధానం ఇచ్చారు. ఆ సమాధానం.. 18,947,668,177,995,426,462,773,730. ఆ దెబ్బకు గిన్నెస్ రికార్డు ఆమె పాదాక్రాంతమైంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన మానసిక శాస్త్ర ప్రొఫెసర్ ఆర్థర్ జెన్సెన్ స్వయంగా శకుంతలా దేవి గణిత ప్రతిభను పరిశీలించి అవాక్కయ్యారు. ఇంత ప్రతిభావంతురాలైన శకుంతలాదేవి.. తన 83వ ఏట 2013 ఏప్రిల్ నెలలో గుండె, మూత్రపిండాల సమస్యలతో బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆమె ఫన్ విత్ నంబర్స్, ఆస్ట్రాలజీ ఫర్ యు, పజిల్స్ టు పజిల్ యు, మాథెబ్లిట్ లాంటి పుస్తకాలు రాశారు. ఆరేళ్ల వయసులో తొలిసారి శకుంతలా దేవి యూనివర్సిటీ ఆఫ్ మైసూరులో తన గణిత ప్రతిభను బహిరంగంగా ప్రదర్శించారు. రెండేళ్ల తర్వాత.. అంటే ఎనిమిదేళ్ల వయసులో అన్నామలై యూనివర్సిటీలో ఆమె ప్రదర్శనతో శకుంతలాదేవిని బాలమేధావిగా గుర్తించారు. గత శతాబ్ద కాలంలో ఏ తేదీ చెప్పినా అది ఏ వారం అవుతుందో చిటికెలో ఆమె చెప్పేవారు. 1977లో 201 అంకెలున్న సంఖ్యకు 23వ వర్గం ఎంతో కేవలం 50 సెకండ్లలో చెప్పేశారు. -
గూగుల్ డూడెల్తో పారాచ్యూట్ జంప్ చేద్దామా?
కొన్ని చారిత్రాత్మకమైన, చిరస్మరణీయమైన సంఘటనల్ని గూగుల్ తన డూడెల్ ద్వారా గుర్తుకు తెస్తుంటుందని తెలిసిందే. మంగళవారం నాటి గూగుల్ డూడెల్ మరో సరికొత్త ప్రయోగం చేసింది. 1797 అక్టోబర్ 22న, అంటే సరిగ్గా 216 ఏళ్ల క్రితం ఆంద్రి- జాక్స్ గర్నెరిన్ అనే ఓ ఫ్రెంచ్ సాహసి మొట్టమొదటిసారి పారాచ్యూట్ జంప్ చేసి చరిత్ర సృష్టించాడు. నీలాకాశంలో మబ్బులానో, గాలిలో దూదిపింజలానో తేలిపోవాలని మనుషులు కన్న కలలకి రెక్కలు తొడిగింది గర్నెరిన్ సఫల సాహసమే. ఆ స్ఫూరిదాయక సంఘటనని కేవలం గుర్తుకు తేవడానికే పరిమితం కాకుండా, నెటిజెన్లు కూడా అందులో పాలుపంచుకునే ఇంటరాక్టివ్ డూడెల్ని రూపొందించింది గూగుల్. దానితో, ఎంచక్కా వీడియో గేమ్ ఆడినట్లు, గూగుల్ ఓపెన్ చేసిన నెటిజెన్లు తాము కూడా రెండొందల ఏళ్లు వెనక్కి వెళ్లి పారాచ్యూట్ జంప్ చేస్తున్న గర్నెరిన్ దిశని కీబోర్డు ద్వారా (స్మార్ట్ఫోన్లో అటూఇటూ టిల్ట్ చేయడం ద్వారా) నిర్దేశించవచ్చు. మరో విధంగా చెప్పాలంటే, గర్నెరిన్ పాటు యూజర్లు కూడా వర్చువల్గా పారాచ్యూట్ జంప్ చేసేలా గూగుల్ తన హోమ్పేజీ డూడెల్ని రూపొందించింది. ఆనాడు ఆ పారాచ్యూట్ను కనిపెట్టింది కూడా గర్నెరినే. కేవలం 28 ఏళ్ల వయసులో ఆయన సాధించిన విజయానికి ప్రతిఫలంగా ఫ్రాన్స్ వైమానిక అధికారిగా నియమించబడ్డాడు. 1769 జనవరి 31న పుట్టిన గర్నెరిన్ ఫిజిక్స్ చదువుకొని, ఫ్రెంచ్ సైన్యంలో ఇన్స్పెక్టర్గా 1793లో చేరాడు. 1797 పారాచ్యూట్ జంప్ తర్వాత, 1798లో ఇదే సాహసాన్ని ఒక మహిళతో కలిసి చేస్తానని ఆయన ప్రకటించడం చాలా వివాదానికి దారితీసింది. మహిళలు అంతటి వాతావరణ ఒత్తిడిని తట్టుకోలేరని ఆయన్ని అందరూ విమర్శించారు. కానీ, జూలై 8, 1798లో సితొయిన్ని హెన్రీ అనే స్త్రీతో కలిసి ఆయన విజయవంతంగా పారాచ్యూట్ జంప్ చేసి సంచలనం సృష్టించారు. 1823 ఆగస్టు 18న పారిస్లో ఒక బెలూన్ తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు దూలం గుద్దుకొని ఆంద్రి-జాక్స్ గర్నెరిన్ చనిపోయినప్పటికీ, అమేయమైన మానవ ప్రయత్నాలకి ఉదాహరణగా నిల్చిన వారిలో ఆయన ఒకడిగా చరిత్ర పుటల్లో నిలిచిపోయాడు.