Gujarat Chief Minister
-
ప్రజా సేవలో 23 ఏళ్లు
న్యూఢిల్లీ: వికసిత్ భారత్ లక్ష్యం సాకారమయ్యే వరకు మరింత దీక్షతో, అవిశ్రాంతంగా కృషి చేస్తానని ప్రధాని మోదీ ప్రజలకు హామీ ఇచ్చారు. ఎంతో సాధించినా చేయాల్సింది ఇంకా చాలా ఉందన్నారు. గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా ప్రజా ప్రస్థానంలో సోమవారంతో 23 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్న మోదీ సోమవారం ఈ మేరకు ‘ఎక్స్’లో పలు పోస్టులు పెట్టారు. ప్రభుత్వాధిపతిగా తనకు బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా, 23 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న మోదీని బీజేపీ ప్రశంసల్లో ముంచెత్తింది. ‘ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిగా ప్రధాని మోదీ ప్రజా జీవితానికి నేటితో 23 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సుదీర్ఘ ప్రజా సేవ ప్రయాణం ఒక వ్యక్తి తన జీవితాంతం దేశం, ప్రజల సంక్షేమం కోసం ఎలా అంకితం చేయగలడనే అపూర్వ అంకితభావానికి, సజీవ చిహ్నం’అని హోం మంత్రి అమిత్ షా ‘ఎక్స్’లో పేర్కొన్నారు. 2001 అక్టోబర్ 7న మోదీ మొట్టమొదటిసారిగా గుజరాత్ సీఎంగా ప్రమాణం చేశారు. 2014లో ప్రధానిగా పగ్గాలు చేపట్టక మునుపు సీఎం పోస్టులో 13 ఏళ్లపాటు కొనసాగారు. ఈ ఏడాది జూన్లో మూడో విడత ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. -
నా పై వచ్చిన అతి పెద్ద ఆరోపణ అదే: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: గుజరాత్ సీఎంగా ఉన్నపుడు తాను ధరించే దుస్తుల విషయంలో మాజీ సీఎం ఒకరు తనపై చేసిన ఆరోపణలను ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. ‘మోదీకి 250 జతల దుస్తులు ఉన్నాయంటూ మాజీ సీఎం అమర్సిన్హా చౌధరీ అప్పట్లో ఆరోపించారు. అది నా రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న అతిపెద్ద ఆరోపణ. నాపై వచ్చిన ఆరోపణలను అంగీకరిస్తున్నట్లు ఓ బహిరంగ సభలో చెప్పాను. రూ. 250 కోట్లు దోచుకునే సీఎం కావాలా? 250 జతల దుస్తులున్న సీఎం కావాలా? అని ప్రజలను అడిగాను. ప్రజలు మాత్రం 250 జతల దుస్తులున్న సీఎం పనిచేస్తాడంటూ ముక్తకంఠంతో నినదించారు. ఆ తర్వాత నాపై ఆరోపణలు చేసే ధైర్యం ప్రత్యర్థులు చేయలేదు’ అని మోదీ పాత స్మృతులను పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ తాజాగా గుర్తు చేసుకున్నారు. -
Vibrant Gujarat Summit: 2036 ఒలింపిక్స్కు భారత్ బిడ్..?
వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కార్యక్రమానికి హాజరయ్యారు. గ్లోబల్గా వివిధ దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీ సీఈవోలతో భారత్లోని వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోనున్నారు. ఈ సందర్భంగా గుజరాత్ ముఖ్యమంత్రి మాట్లాడుతూ వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024లో 50 శాతం మేర ‘గ్రీన్ ఎంఓయూ’లు కుదరనున్నట్లు తెలిపారు. జీ20 వంటి అంతర్జాతీయ సదస్సులకు భారత్ ప్రాతినిధ్యం వహించడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సమ్మిట్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 34 దేశాలు పాల్గొననున్నట్లు చెప్పారు. గుజరాత్లో పెట్టుబడి అవకాశాలను పెంచడానికి సేల్స్ఫోర్స్, అబాట్, బ్లాక్స్టోన్, హెచ్ఎస్బీసీ, యూపీఎస్, మైక్రోన్, సిస్కో, ఎస్హెచ్ఆర్ఎం వంటి దాదాపు 35 ఫార్చ్యూన్ అమెరికన్ కంపెనీలు ఈ సదస్సుకు హాజరవుతున్నాయని తెలిపారు. ఈ సదస్సులో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్అంబానీ మాట్లాడుతూ ప్రపంచంలో ప్రధాని నరేంద్ర మోదీ మాటకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. ఈ సదస్సును 20 ఏళ్ల నుంచి విజయవంతంగా నిర్వహించడం గొప్పవిషయం అన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ గుజరాత్లో భారీ పెట్టుబడులు పెడుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా రూ.12 లక్షలకోట్లు పెట్టుబడి పెట్టినట్లు వివరించారు. అందులో మూడోవంతు గుజరాత్లోనే ఉన్నట్లు తెలిపారు. దాంతో ప్రభుత్వ సహకారంతో చాలామందికి ఉపాధికల్పిస్తున్నట్లు చెప్పారు. 2036 ఒలింపిక్స్ కోసం భారత్ బిడ్ వేయాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: 2036 నాటికి 9.3 కోట్ల ఇళ్లకు గిరాకీ.. ఎక్కడో తెలుసా.. ‘వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్’ 2003లో ప్రారంభించారు. ప్రస్తుతం జరుగుతున్న పదో ఎడిషన్ సదస్సుతో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సదస్సులో భాగంగా వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ ట్రేడ్ షో 2024లో డిజిటల్ ఇండియా కార్యక్రమాలు, ఇండియా స్టాక్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ (ఇండస్ట్రీ 4.0, స్మార్ట్ మ్యాన్యుఫ్యాక్ట్, స్మార్ట్ మ్యాన్యుఫ్యాక్ట్), ఛాంపియన్ సర్వీసెస్ సెక్టార్, డిస్ట్రప్టివ్ టెక్నాలజీస్ను ప్రదర్శించనున్నారు. -
Gujarat Election 2022: రేపే భూపేంద్రకు పట్టం
గాంధీనగర్: గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ (60) వరుసగా రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. శనివారం జరిగిన సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలంతా ఆయన్ను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయం ‘కమలం’లో జరిగిన ఈ భేటీకి పార్టీ కేంద్ర పరిశీలకులుగా సీనియర్ నేతలు రాజ్నాథ్సింగ్, యడ్యూరప్ప, అర్జున్ ముండా హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు 2021లో విజయ్ రూపానీ స్థానంలో సీఎంగా భూపేంద్ర పగ్గాలు చేపట్టారు. గురువారం వెలువడ్డ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 182 స్థానాలకు గాను ఏకంగా 156 సీట్లను కొల్లగొట్టి బీజేపీ రికార్డు విజయం సొంతం చేసుకోవడం తెలిసిందే. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా మంత్రివర్గంతో పాటుగా భూపేంద్ర శుక్రవారం రాజీనామా చేశారు. శనివారం ఎల్పీ నేతగా ఎన్నికయ్యాక గవర్నర్ ఆచార్య దేవవ్రత్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత తెలిపారు. సోమవారం ఆయన రాష్ట్ర 18వ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గాందీనగర్లోని హెలిప్యాడ్ మైదానంలో జరిగే కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరవుతారు. ఇదీ చదవండి: హిమాచల్ సీఎంగా సుఖు -
గుజరాత్కు బీజేపీ కేంద్ర పరిశీలకులు.. సీఎం ఎంపికపై దృష్టి
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ఇక నూతన ముఖ్యమంత్రి ఎంపికపై దృష్టి సారించింది. తాజా ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ ఎమ్మెల్యేలు శనివారం ఉదయం గాంధీనగర్లో సమావేశమై, తమ పార్టీ శాసనసభా పక్ష(సీఎల్పీ) నేతను ఎన్నుకోనున్నారు. ఈ ప్రక్రియను పూర్తిచేయడానికి కేంద్ర పరిశీలకులుగా సీనియర్ నేతలు రాజ్నాథ్ సింగ్, బీఎస్ యడియూరప్ప, అర్జున్ ముండాను బీజేపీ అధిష్టానం నియమించింది. సీఎల్పీ నేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ కొనసాగుతారని బీజేపీ అధిష్టానం గతంలోనే ప్రకటించింది. భూపేంద్ర పటేల్ రాజీనామా గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని రాజ్భవన్లో గవర్నర్ ఆచార్య దేవవ్రత్కు అందజేశారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా ఆయన మంత్రివర్గం సైతం రాజీనామా సమర్పించింది. బీజేపీ నిర్ణయం ప్రకారం.. భూపేంద్ర పటేల్ ఈ నెల 12వ తేదీన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారు. ఇదీ చదవండి: ఇంతకీ.. గెలిచింది ఎవరు! మూడు రాష్ట్రాల తీర్పు చెప్పిందేంటి? -
గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ రాజీనామా.. 12న ప్రమాణ స్వీకారం
గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ అఖండ విజయం సాధించి మరోసారి అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఆయన మంత్రివర్గం శుక్రవారం రాజీనామా చేశారు. గాంధీనగర్లోని రాజ్భవన్కు చేరుకుని రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్కు రాజీనామా పత్రాలను సమరించారు. సీఎం భూపేంద్ర పటేల్తో పాటు గుజరాత్ బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్, పార్టీ చీఫ్ విప్ పంకజ్ దేశాయ్లు హాజరయ్యారు. గురువారం వెలువడిన ఫలితాల్లో 182 స్థానాలకు గానూ బీజేపీ 156 సీట్లు గెలుపొంది రికార్డులు తిరగరాసింది. భూపేందర్ పటేల్ మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపడతారని ఎన్నికలకు ముందే ప్రకటించింది బీజేపీ. ఫలితాలు వెలువడిన క్రమంలో గురువారం బీజేపీ రాష్ట్ర చీఫ్ సైతం అదే విషయాన్ని వెల్లడించారు. ఈ క్రమంలో ఫార్మాలిటీ కోసం రాజీనామాలు చేశారు. మరోమారు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 12న ప్రమాణ స్వీకారం ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ‘ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఆయన మంత్రివర్గం రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు పటేల్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. గాంధీనగర్లోని కమలం పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం ఉదయం 10 గంటలకు పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమవుతారు. మధ్యాహ్నానికి పార్టీ శాసనసభాపక్ష నేత ఎన్నికపై గవర్నర్కు తెలియజేస్తాం. గవర్నర్ సూచనల మేరకు సీఎం, కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుంది.’ అని తెలిపారు పార్టీ చీఫ్ విఫ్ పంకజ్ దేశాయ్. మరోవైపు.. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం గాంధీనగర్లోని హెలిపాడ్ గ్రౌండ్లో సోమవారం ఉంటుందని పార్టీ చీఫ్ సీఆర్ పాటిల్ ప్రకటించారు. సీఎం ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు హాజరవుతారని చెప్పారు. ఇదీ చదవండి: Gujrat Polls 2022: మున్సిపాలిటీ సభ్యుడి నుంచి సీఎం స్థాయికిపాలిటీ సభ్యుడి నుంచి సీఎంగా -
National Games 2022: సర్వీసెస్కు అగ్రస్థానం
అహ్మదాబాద్: జాతీయ క్రీడల్లో మళ్లీ సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఎస్ఎస్సీబీ) జట్టే సత్తా చాటుకుంది. ‘సెంచరీ’ని మించిన పతకాలతో ‘టాప్’ లేపింది. సర్వీసెస్ క్రీడాకారులు మొత్తం 128 పతకాలతో అగ్రస్థానంలో నిలిచారు. ఇందులో 61 స్వర్ణాలు, 35 రజతాలు, 32 కాంస్యాలున్నాయి. అట్టహాసంగా ఆరంభమైన 36వ జాతీయ క్రీడలకు బుధవారం తెరపడింది. 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 8000 పైచిలుకు అథ్లెట్లు ఈ పోటీల్లో సందడి చేశారు. ట్రాక్ అండ్ ఫీల్డ్లో 38, అక్వాటిక్స్లో 36 జాతీయ క్రీడల రికార్డులు నమోదయ్యాయి. ఆఖరి రోజు వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ముఖ్య అతిథిగా విచ్చేయగా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు పాల్గొన్నారు. తదుపరి జాతీయ క్రీడలకు వచ్చే ఏడాది గోవా ఆతిథ్యమిస్తుంది. ► వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఈ జాతీయ క్రీడలు గోవాలో జరగాలి. కానీ అనూహ్యంగా గుజరాత్కు కేటాయించగా... నిర్వాహకులు వంద రోజుల్లోపే వేదికల్ని సిద్ధం చేయడం విశేషం. పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ్ ఇండోర్ స్టేడియంలో ముగింపు వేడుకలు జరిగాయి. ► పురుషుల విభాగంలో ఎనిమిది పతకాలు సాధించిన కేరళ స్విమ్మర్ సజన్ ప్రకాశ్ (5 స్వర్ణాలు, 2 రజతాలు, 1 కాంస్యం) ‘ఉత్తమ క్రీడాకారుడు’గా... మహిళల విభాగంలో ఏడు పతకాలు సాధించిన కర్ణాటకకు చెందిన 14 ఏళ్ల స్విమ్మర్ హషిక (6 స్వర్ణాలు, 1 కాంస్యం) ‘ఉత్తమ క్రీడాకారిణి’గా పురస్కారాలు గెల్చుకున్నారు. గత జాతీయ క్రీడల్లోనూ (2015లో కేరళ) సజన్ ప్రకాశ్ ‘ఉత్తమ క్రీడాకారుడు’ అవార్డు అందుకోవడం విశేషం. ► చివరిరోజు తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ ‘పసిడి పంచ్’తో అలరించాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన హుసాముద్దీన్ సర్వీసెస్ తరఫున ఈ క్రీడల్లో పాల్గొన్నాడు. 57 కేజీల ఫైనల్లో హుసాముద్దీన్ 3–1తో సచిన్ సివాచ్ (హరియాణా)పై గెలిచాడు. ► ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఓవరాల్ చాంప్ సర్వీసెస్కు ‘రాజా భళీంద్ర సింగ్’ ట్రోఫీని అందజేశారు. సర్వీసెస్ నాలుగోసారి ఈ ట్రోఫీ చేజిక్కించుకుంది. 39 స్వర్ణాలు, 38 రజతాలు, 63 కాంస్యాలతో కలిపి మొత్తం 140 పతకాలు సాధించి రెండో స్థానంలో నిలిచిన మహారాష్ట్రకు ‘బెస్ట్ స్టేట్’ ట్రోఫీ లభించింది. ఓవరాల్గా సర్వీసెస్కంటే మహా రాష్ట్ర ఎక్కువ పతకాలు సాధించినా స్వర్ణాల సంఖ్య ఆధారంగా సర్వీసెస్కు టాప్ ర్యాంక్ దక్కింది. ► తెలంగాణ 8 స్వర్ణాలు, 7 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి మొత్తం 23 పతకాలతో 15వ స్థానంలో... ఆంధ్రప్రదేశ్ 2 స్వర్ణాలు, 9 రజతాలు, 5 కాంస్యాలతో కలిపి మొత్తం 16 పతకాలతో 21వ స్థానంలో నిలిచాయి. 2015 కేరళ జాతీయ క్రీడల్లో తెలంగాణ 8 స్వర్ణాలు, 14 రజతాలు, 11 కాంస్యాలతో కలిపి మొత్తం 33 పతకాలతో 12వ స్థానంలో... ఆంధ్రప్రదేశ్ 6 స్వర్ణా లు, 3 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి మొత్తం 16 పతకాలతో 18వ స్థానంలో నిలిచాయి. హషికకు ట్రోఫీ ప్రదానం చేస్తున్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా -
అసెంబ్లీ ఎన్నికల వేళ గుజరాత్లో కీలక పరిణామం.. ఆ మంత్రులకు షాక్!
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది ఆఖర్లో జరగనున్నాయి. ఈ తరుణంలో బీజేపీ నేతృత్వంలోని గుజరాత్ ప్రభుత్వంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఇద్దరు కీలక కేబినెట్ మంత్రులకు కేటాయించిన శాఖలను తగ్గించారు. ఇద్దరు రాష్ట్ర మంత్రుల శాఖలను తగ్గిస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి రాజేంద్ర త్రివేది పోర్టిఫోలియోల నుంచి కీలక శాఖ అయిన రెవెన్యూను, పూర్ణేశ్ మోదీ శాఖల్లోని కీలకమైన రోడ్డు, భవనాల శాఖను ముఖ్యమంత్రి తొలగించారు. కొద్ది నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అకస్మాత్తుగా ఇలా మంత్రివర్గంలో మార్పులు చేయటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాజేంద్ర త్రివేది, పుర్ణేశ్ మోదీల నుంచి తొలగించిన రెండు శాఖలను ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పర్యవేక్షించనున్నారు. రాజేంద్ర త్రివేది వద్ద న్యాయ, విపత్తు నిర్వహణ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖలు ఉన్నాయి. మరోవైపు.. పూర్ణేశ్ మోదీ వద్ద రవాణా, పౌర విమానయాన, పర్యటకం, దేవాదాయ అభివృద్ధి శాఖలు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. భూపేంద్ర పటేల్ ప్రభుత్వంలోని 10 కేబినెట్ ర్యాంక్ మంత్రుల్లో త్రివేది, మోదీలు ఉన్నారు. అయితే, రోడ్లు, భవనాల విభాగం, రెవెన్యూ విభాగల పనితీరు సరిగా లేదని సీఎంకు ప్రభుత్వ వర్గాలు సూచించిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. హర్ష రమేశ్కుమార్ సంఘ్వీకి రెవెన్యూ శాఖ సహాయ మంత్రిగా, జగదీశ్ ఐశ్వర్ పంచల్కు రోడ్లు, భవనాల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు సీఎం భూపేంద్ర పటేల్. గత ఏడాది సెప్టెంబర్లో విజయ్ రూపానీ స్థానంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు భూపేంద్ర పటేల్. ఇప్పుడు సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు జరిగిన తాజా పరిణామం వెనుకున్న కారణం ఏంటన్నది మాత్రం తెలియరాలేదు. Gujarat | In state cabinet rejig before Assembly elections, Revenue ministry taken from Rajendra Trivedi while Road and Building Ministry take from Purnesh Modi, both the ministries will now be handled by CM Bhupendra Patel pic.twitter.com/2VavVSJQBI — ANI (@ANI) August 20, 2022 ఇదీ చదవండి: ‘ఈ జిమ్మిక్కులు ఏమిటి.. మోదీ జీ?’.. ట్రావెల్ బ్యాన్పై మనీశ్ సిసోడియా విమర్శలు -
మార్పు మంత్రం ఫలించేనా?
ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే ఏకంగా సీఎం పీఠం ఎక్కితే అది విశేషమే. అందులోనూ ఆ వ్యక్తి ఏ సొంత పార్టీకో అధినేత కాకుండా, సామాన్య రాజకీయ నేత అయితే అది మరీ విశేషం. బీజేపీ పాలిత గుజరాత్లో ఆ రాష్ట్ర 17వ ముఖ్యమంత్రిగా సోమవారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేసిన 58 ఏళ్ళ భూపేంద్ర ఇప్పుడు అలా వార్తల్లో వ్యక్తి అయ్యారు. కార్పొరేటర్గా మొదలై ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎదిగారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా గెలిచిన గాంధీనగర్ లోక్సభా స్థానంలో ఒక భాగమైన ఘాట్లోడియా నియోజకవర్గపు ఎమ్మెల్యే భూపేంద్ర. ఒకప్పుడు అదే నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహించి, ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ గవర్నరైన గుజరాత్ తొలి మహిళా ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్కు అనుయాయుడు. నియోజకవర్గ అభివృద్ధిపై తన ప్రాంత ఎమ్మెల్యేలతో అమిత్ షా సమీక్షా సమావేశాలు జరిపినప్పుడు ఆ కీలక నేత దృష్టిలో పడ్డారు. షా సారథ్యంలో పైకి ఎదిగారు. ఇప్పుడు షా, మోడీ ద్వయం ఆశీస్సులతోనే కొత్తవాడైనప్పటికీ కిరీటం దక్కించుకున్నారు. అదే సమయంలో మరో 15 నెలల్లో జరిగే గుజరాత్ ఎన్నికలలో పార్టీని గెలిపించే బరువు భూపేంద్ర భుజాలపై పడింది. అలా గుజరాత్ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ప్రపంచంలో శాశ్వతమైనది మార్పు ఒక్కటే! ఈ మార్పు మంత్రాన్ని బీజేపీ ఇప్పుడు బాగా నమ్ముతున్నట్టుంది. పరిస్థితులను బట్టి అధికార పీఠంపై కూర్చోబెడుతున్న మనుషులను మారిస్తేనే వివిధ ఎన్నికల్లో విజయతీరాలు చేరవచ్చని ఆ పార్టీ భావిస్తోంది. జార్ఖండ్లో ఓటమితో, మళ్ళీ తప్పు చేయదలుచుకోలేదు. ఎన్నికల్లో ఓటమి కన్నా సీఎంలను మార్చడమే మేలనుకుంది. అధికార యంత్రాంగంతో సఖ్యత లేకపోగా, కరోనా వేళ ప్రభుత్వ వైఫల్యం లాంటివన్నీ నిన్నటి దాకా గుజరాత్ పీఠంపై ఉన్న విజయ్ రూపాణీకి ప్రతికూలమయ్యాయి. అమిత్ షా లానే కీలకమైన జైన్ వర్గానికి చెందినవాడైనప్పటికీ, రూపాణీ సారథ్యంలో ఎన్నికలకు వెళితే ఇబ్బందే అని అధిష్ఠానం గ్రహించింది. ఇప్పుడిలా గుజరాత్ గద్దెపైకి కొత్త సీఎంను తెచ్చింది. గత 6 నెలల్లో బీజేపీ ఇలా వేర్వేరు రాష్ట్రాలలో నలుగురు ముఖ్యమంత్రులను మార్చిందన్నది గమనార్హం. వేర్వేరు కారణాలతో ఉత్తరాఖండ్, అస్సామ్, కర్ణాటక, గుజరాత్లు నాలుగూ మార్పులు చూశాయి. నిజానికి, రెండున్నర దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా నిలిచి, కేంద్రంలో ఆ పార్టీ అధికార విస్తరణకు బాటలు వేసిన రాష్ట్రం గుజరాత్. అధికార చక్రం తిప్పుతున్న మోదీ, షాల సొంత రాష్ట్రం. ఇన్నేళ్ళ పాలన తర్వాత సహజంగానే ఓటర్లలో అధికారపక్ష వ్యతిరేకత తలెత్తుతుంది. పైపెచ్చు, పాటీదార్ల (పటేల్) రిజర్వేషన్ల ఉద్యమ ప్రభావంతో గత ఎన్నికల్లో ఓట్లు, సీట్లు తగ్గాయి. ఎలాగోలా అప్పట్లో అధికారం నిలబెట్టుకున్న బీజేపీ ఈసారి మాత్రం రిస్కు తీసుకోదలుచుకోలేదు. పాటీదార్ ఉద్యమకారుడు హార్దిక్ పటేల్ను కాంగ్రెస్, సూరత్కు చెందిన వ్యాపారవేత్త మహేశ్ సవానీని ఆమ్ ఆద్మీ పార్టీ తమ నేతలుగా చూపెడుతున్నాయి. దాంతో, పాటీదార్ల ఓట్లు ఆ పార్టీలకు చీలిపోకుండా చూడాలని బీజేపీ నిర్ణయించుకుంది. గుజరాత్లో గణనీయ స్థానాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే పాటీదార్ల వర్గపు భూపేంద్రను కొత్త సీఎంను చేసింది. అనేక రాష్ట్రాలలో ఓబీసీ రాజకీయాలు చేస్తున్న బీజేపీ గుజరాత్లో గణనీయ సంఖ్యలో ఓబీసీలున్నా ఆ పని చేయలేదు. కర్ణాటకలో లింగాయత్ వర్గానికి చెందిన ఎస్సార్ బొమ్మైని సీఎంను చేసినట్టే, గుజరాత్ మధ్యతరగతిలో, వృత్తినిపుణుల్లో ఎక్కువున్న పాటీదార్లకు పట్టం కట్టింది. ఓబీసీ బిల్లు, కమిషన్ లాంటి చర్యలతో ఠాకూర్లు, ప్రజాపతులు, బక్షీపంచ్ లాంటి ఓబీసీల నమ్మకాన్నీ నిలబెట్టుకుంటానని భావిస్తోంది. 2014 తర్వాత నుంచి ఎన్నికలలో గెలుపే ధ్యేయంగా బీజేపీ మారిపోయిందని ఓ విమర్శ. ఆ మాటెలా ఉన్నా కాంగ్రెస్ పార్టీనీ, దాని హైకమాండ్ సంస్కృతినీ ఒకప్పుడు దుమ్మెత్తిపోసిన బీజేపీ తీరా ఇప్పుడు అదే కాంగ్రెస్ బాటలో నడుస్తోంది. ప్రజలో, ప్రజాప్రతినిధులో ఎన్నుకున్న నేతల కన్నా అధిష్ఠానానికి విధేయులనే సీఎం కుర్చీలో కూర్చోబెట్టడమనే సీల్డ్ కవర్ సంప్రదాయానికే బీజేపీ ఓటేస్తోంది. గుజరాత్లో పోటీలో ఉన్న పెద్ద పెద్దవాళ్ళందరినీ పక్కనపెట్టి, భూపేంద్ర లాంటి పేరు లేని పెద్దమనిషి పేరును తెర మీదకు తేవడమే అందుకు నిదర్శనం. దశాబ్దాలుగా పార్టీనే నమ్ముకొని, ఉప ముఖ్యమంత్రి దాకా ఎదిగిన నితిన్ పటేల్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన సీఆర్ పాటిల్ సహా ఉద్దండులకు నో చెప్పి, తనదైన ఎంపికకు వారితోనే జై కొట్టించింది. అలా అధిష్ఠానం రాష్ట్ర స్థాయిలోనూ తన భల్లూకపు పట్టును మరోసారి నిరూపించుకుంది. సివిల్ ఇంజనీరింగ్ చదివి, భవన నిర్మాణాన్ని వృత్తిగా ఎంచుకున్న భూపేంద్ర సైతం సీఎం అవుతాననుకోలేదు. అనుకోకుండా దక్కిన అధికార పీఠం ఆయనకు పెను సవాలు. ఇప్పుడాయన ఒక్కో ఇటుక పేర్చుకుంటూ, ఎన్నికల బరిలో పార్టీని విపక్ష దుర్భేద్యమైన కోటగా మార్చాల్సి ఉంది. మొత్తం 182 స్థానాలున్న గుజరాత్లోకెల్లా అత్యధికంగా లక్ష ఓట్ల పైగా మెజారిటీతో గత 2017 ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచారాయన. ఈసారి ఆయన తనతో పాటు పార్టీకీ రాష్ట్రంలో మెజారిటీ దక్కేలా చూడాల్సి ఉంది. అనుభవం లేకున్నా, వ్యాపార వర్గాలతో ఆయనకున్న సత్సంబంధాలు ఓ సానుకూల అంశం. మరోపక్క కనీసం బీజేపీ ఇబ్బందుల్ని సొమ్ము చేసుకొనే పరిస్థితుల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ లేదు. అక్కడ పూర్తిస్థాయి పునర్వ్యవస్థీకరణను ఆ పార్టీ చేపట్టనే లేదు. ఈ పరిస్థితుల్లో సీఎం పీఠంపై మనుషులు శాశ్వతం కాదు. వాళ్ళను మార్చడం వల్ల అధికారం శాశ్వతంగా నిలుస్తుందనేది ఇప్పుడు అధికార బీజేపీ నమ్ముతోంది. మరి, సీఎం మార్పు మంత్రం ఫలిస్తుందా? -
గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం
భోపాల్: గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ (59) సోమవారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా, గుజరాత్ 17వ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ను అదృష్టం వరించింది. ఆదివారం సమావేశమైన బీజేపీ శాసనసభా పక్షం ఆయనను తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలుండగా, 112 మంది బీజేపీ సభ్యులున్నారు. శాసనసభా పక్ష సమావేశానికి వీరంతా హాజరయ్యారు. తదుపరి సీఎంగా భూపేంద్ర పటేల్ పేరును శనివారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విజయ్ రూపానీ ప్రతిపాదించారు. ఇందుకు బీజేపీ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. 2017లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉత్తరప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ ఆనందీబెన్ గతంలో ప్రాతినిధ్యం వహించిన ఘట్లోడియా స్థానం నుంచే భూపేంద్ర 2017 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. 2015-2017 మధ్య అహ్మదాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్గా పనిచేశారు. 2010-2015 మధ్య అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్గానూ వ్యవహరించారు. -
భూపేంద్ర పటేల్: ప్రోఫైల్
-
కాసేపట్లో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం
-
ఏడాదిలో నలుగురు సీఎంలను మార్చిన బీజేపీ
-
22 కి.మీ... లక్ష మంది
అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించేందుకు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్రూపానీ గాంధీనగర్లో ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 24న ట్రంప్, ప్రధాని మోదీ అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి 22 కిలోమీటర్ల మేర నిర్వహించే రోడ్షోలో పాల్గొంటారు. ప్రస్తుతం ఉన్న ప్రణాళిక ప్రకారం స్వాతంత్య్రోద్యమ కాలంలో జాతిపిత మహాత్మాగాంధీ నడయాడిన సబర్మతి ఆశ్రమాన్ని ట్రంప్, మోదీలు సందర్శిస్తారు. తర్వాత ఆశ్రమం నుంచి ఇందిర బ్రిడ్జి పైనుంచి ఎస్పీ రింగు రోడ్డు మీదుగా ఎయిర్పోర్టు వద్దనున్న మొటెరా స్టేడియంకు చేరుకుంటారు. రోడ్షోలో భద్రతా ఏర్పాట్లూ, ట్రాఫిక్ తదితర అంశాలు సహా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు గుజరాత్ హోంమంత్రి ప్రదీప్సిన్హా జడేజా చెప్పారు. రోడ్ షోకి ఒక లక్ష మంది రోడ్షోలో సుమారు లక్ష మంది ప్రజలు భాగస్వాములవుతారని భావిస్తున్నారు. రోడ్షోలో 70 లక్షల మంది జనం పాల్గొంటున్నారని ట్రంప్ చెప్పారు. అయితే లక్ష మంది వరకు రోడ్షోలో పాల్గొనే అవకాశం ఉన్నట్టు అహ్మదాబాద్ మున్సిపల్ కమిషనర్ విజయ్ నెహ్రా వెల్లడించారు. మొటెరాలో కొత్తగా నిర్మిస్తోన్న క్రికెట్ స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సభను ఉద్దేశించి ఇరువురు నేతలూ ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో దాదాపు లక్షా పదివేల మంది ప్రజలు పాల్గొననున్నారు. సర్వాంగ సుందరంగా ఆగ్రా తాజ్మహల్ని ట్రంప్, ఆయన భార్య మెలానియా దర్శించనున్న నేపథ్యంలో తాజ్మహల్ పరిసర ప్రాంతాలను యూపీ ప్రభుత్వం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. తాజ్మహల్, పరిసర ప్రాంతాలనూ ముస్తాబు చేస్తున్నారు. తాజ్మహల్ పక్కనున్న యమునా తీర ప్రాంతంలోని భారీచెత్తను గత రెండు రోజులుగా తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఖెరియా ఎయిర్పోర్టు నుంచి తాజ్మహల్ వరకు ఎంజీ రోడ్డుపైన భిక్షాటన చేసేవారిని అక్కడి నుంచి ఖాళీచేయించారు. దారిపొడవునా గోడలకు రంగులు వేశారు. భద్రతాకారణాల రీత్యా దారిలో ఉన్న చెట్లను నరికివేశారు. 20వేల మంది విద్యార్థులు జెండాలతో స్వాగతం పలుకుతారు. రామ్లీలా, రాస్లీలా, పంచకుల, నౌతంకి సహా ఆగ్రా, మధుర, బృందావన్ల నుంచి కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. ప్రభుత్వ పాఠశాలను సందర్శించనున్న మెలానియా మెలానియా దక్షిణ ఢిల్లీలో ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రవేశపెట్టిన ‘హ్యాపీనెస్ కరికులమ్’ పాఠశాలను సందర్శించనున్నారు. 25న ఢిల్లీకి చేరుకోనున్న ట్రంప్, మెలానియాలకు సీఎం కేజ్రీవాల్ స్వాగతం పలుకుతారు. పిల్లల్లో ఒత్తిడిని తగ్గించేందుకు గతంలో ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ‘హ్యపీనెస్’ పాఠ్యప్రణాళికను ప్రవేశపెట్టారు. ఇందులో 40 నిముషాల పాటు మెడిటేషన్, విశ్రాంతి తదితర కార్యక్రమాలుంటాయి. రోడ్ షోకు డీఆర్డీఓ డ్రోన్ నిరోధక వ్యవస్థ ట్రంప్, మోదీ పాల్గొనే రోడ్ షోలో డీఆర్డీఓ(డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) అభివృద్ధి చేసిన డ్రోన్ నిరోధక వ్యవస్థను వాడనున్నారు. అగ్రనేతల భద్రత కోసం స్థానిక పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, యాంటి టెర్రరిస్ట్ స్క్వాడ్, చేతక్ కమాండో, స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ల సేవలను వినియోగించుకుంటున్నారు. రోడ్ షో జరిగే ప్రాంతంలోని కీలక, వ్యూహాత్మక ప్రదేశాల్లో వీరిని మోహరిస్తామని క్రైమ్ బ్రాంచ్కు చెందిన స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అజయ్ తోమర్ గురువారం తెలిపారు. డ్రోన్ను గుర్తించడంతో పాటు, దాన్ని నాశనం చేసేలా ఈ వ్యవస్థను రూపొందించారు. రోడ్ షో సందర్భంగా ఇరువురు నేతలు ఒకే కారులో ప్రయాణిస్తారా? అన్న విషయంపై తమకు సమాచారం లేదని తోమర్ తెలిపారు. అలాగే, ఓపెన్ వెహికిల్ను వారు వాడకపోవచ్చన్నారు. ట్రంప్ పర్యటన నేపథ్యంలో తాజ్మహల్ పరిసరాలను ముస్తాబుచేస్తున్న దృశ్యం. -
వారు వెళ్లేందుకు 150 దేశాలున్నాయ్..
సాక్షి, న్యూఢిల్లీ : ముస్లింలు జీవించేందుకు ప్రపంచవ్యాప్తంగా 150 ఇస్లామిక్ దేశాలున్నాయని, హిందువులకు మాత్రం కేవలం భారతదేశంలోనే తలదాచుకోవాల్సిన పరిస్ధితి ఉందని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ అన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని సమర్ధిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ల నుంచి వచ్చే ముస్లిమేతర శరణార్ధులకు భారత పౌరసత్వ కల్పించే చట్టాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని దుయ్యబట్టారు. సబర్మతి ఆశ్రమం వద్ద పౌర చట్టానికి మద్దతుగా జరిగిన భారీ ర్యాలీని ఉద్దేశించి గుజరాత్ సీఎం మాట్లాడారు. ఈ అంశంపై జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ల వైఖరులకు విరుద్ధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దేశ విభజన జరిగిన సమయంలో పాకిస్తాన్లో 22 శాతంగా ఉన్న భారత జనాభా వారిపై దౌర్జన్యం, హింసాకాండ, లైంగిక దాడుల కారణంగా ప్రస్తుతం కేవలం మూడు శాతానికి పడిపోయిందని అన్నారు. అందుకే హిందువులు భారత్కు తిరిగిరావాలని కోరుకుంటున్నారని, వారు మాతృదేశంలో గౌరవంగా జీవించేందుకు తాము చేస్తున్న ప్రయత్నాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని దుయ్యబట్టారు. ముస్లింలు ప్రపంచంలో 150 దేశాల్లో ఎక్కడైనా తలదాచుకోవచ్చని హిందువులకు కేవలం భారత్ ఒక్కటే ఆశ్రయం ఇచ్చే దేశమని, హిందువులు ఇక్కడకు తిరిగి రావాలనుకుంటే సమస్య ఏమిటని ప్రశ్నించారు. -
సీఎం కార్యక్రమంలో రైతు ఆత్మహత్యాయత్నం
అహ్మదాబాద్: గుజరాత్ సీఎం విజయ్ రూపానీ బహిరంగ సభలో ఓ రైతు పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.ఈ సంఘటన గిర్ సోమ్నాథ్ జిల్లా ప్రాన్స్లీ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. మశ్రీ భాయ్ దోడియా అనే రైతు తన పొలం వద్ద ఉన్న పంచాయతీ భూమిని ఎవరో ఆక్రమించుకున్నారని, దీన్ని తొలగించడంలో స్థానిక అధికారులు విఫలం చెందడంతో కలత చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని గిర్ సోమ్నాథ్ ఎస్పీ రాహుల్ త్రిపాఠి వెల్లడించారు. ‘ఆ రైతు పొలం వద్ద ఉన్న పంచాయతీ భూమిని ఎవరో ఆక్రమించుకున్నారు. ఆక్రమణను తొలగించాలని ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ స్థానిక అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు’ అని తెలిపారు. దోడియాను వెంటనే వెరవల్లోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా, వైద్యులు అతని పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. -
అహ్మదాబాద్.. ఇకపై కర్ణావతి!
అహ్మదాబాద్: చాలాకాలంగా కాషాయ వర్గాలు డిమాండ్ చేస్తున్న గుజరాత్లోని అహ్మదాబాద్ పేరులో మార్పు జరిగే అవకాశం కనిపిస్తోంది. అహ్మదాబాద్ పేరును కర్ణావతిగా మార్చే డిమాండ్ను పరిగణనలోకి తీసుకున్నామని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ గురువారం తెలిపారు. రాష్ట్ర రాజధాని గాంధీనగర్లో రూపానీ మీడియాతో మాట్లాడారు. లోక్సభ ఎన్నికలలోపే ఈ నిర్ణయం అమలవుతుందని తెలిపారు. ‘అహ్మదాబాద్ అన్న పేరు బానిసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. కర్ణావతి పేరు మన ఆత్మాభిమానాన్ని, సంస్కృతిని, స్వయం ప్రతిపత్తిని సూచిస్తుంది’’ అని డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ వ్యాఖ్యానించారు. -
హింసాత్మక చర్యలకు పాల్పడకండి
అహ్మదాబాద్: హిందీ మాట్లాడే వలసదారుల భద్రత కోసం అదనపు బలగాలను మోహరించామనీ, సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయిన హిందీ భాషీయులు తిరిగి గుజరాత్కు రావాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విజ్ఞప్తి చేసింది. హిందీ మాట్లాడేవారిపై దాడులకు పాల్పడిన 431 మందిని ఇప్పటికే అరెస్టు చేశామంది. ఎలాంటి హింసాత్మక చర్యలకూ పాల్పడొద్దని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ప్రజలను కోరారు. గుజరాత్లో జరిగిన ఓ అత్యాచార ఘటన వల్ల అక్కడక్కడ జరిగిన దాడుల నేపథ్యంలో దాదాపు 20 వేల మంది హిందీ మాట్లాడే వలస కూలీలు రాష్ట్రం వదిలి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. అయితే గత 48 గంటల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటుచేసుకోలేదని రూపానీ తెలిపారు. వలస కూలీల భద్రత కోసం పరిశ్రమల ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించినట్లు రాష్ట్ర హోంమంత్రి ప్రదీప్సిన్హా జడేజా తెలిపారు. సెప్టెంబర్ 28న గుజరాత్లోని సాబర్కాంఠా జిల్లాలో 14 నెలల బాలికపై అత్యాచారం జరిగింది. రూపానీతో మాట్లాడిన నితీశ్ గుజరాత్లో హిందీ మాట్లాడేవారిపై జరుగుతున్న దాడుల విషయమై సీఎం విజయ్ రూపానీతో బిహార్ సీఎం నితీశ్కుమార్ మాట్లాడారు. ఈ దాడులపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాలికపై జరిగిన దాడిని ఖండించారు. నిందితుడికి శిక్ష పడాల్సిందేనని, అయితే ఒక్కరు చేసిన తప్పునకు మొత్తం వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని దాడుల చేయడం సరికాదన్నారు. దాడుల గురించి గుజరాత్ సీఎంతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫోన్ చేసి మాట్లాడారు. వారి భద్రతపై అక్కడి ప్రభుత్వం పూర్తి భరోసా ఇచ్చిందని యోగి చెప్పారు. -
‘మా రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవదు’
అహ్మదాబాద్: ‘వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్లో మా రాష్ట్రంలో కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేద’ని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అన్నారు. 2014 లోక్సభ ఎన్నికల ఫలితాలే గుజరాత్లో పునరావృత మవుతాయని వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వచ్చే సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో (26 ఎంపీ స్థానాలు) బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పటీదార్, దళితుల నిరసనల వంటి ఇబ్బందులు ఉన్నా, ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకే పట్టం కట్టారని గుర్తుచేశారు. వస్తు సేవల పన్ను అమల్లోకి తేవడాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ జీఎస్టీని ‘గబ్బర్సింగ్ ట్యాక్స్’ అంటూ ఎద్దేవా చేసినప్పటికీ వ్యాపారులు బీజేపీపై నమ్మకముంచారని రూపానీ అన్నారు. పెద్ద నోట్ల రద్దుపై మొదట్లో కొంత వ్యతిరేకత వచ్చినప్పటికీ రాష్ట్రంలోని వర్తక, వ్యాపార వర్గం తమ పార్టీకి మద్దతు ప్రకటించిందని తెలిపారు. వారి మద్దతుతో గత అసెంబ్లీ ఎన్నికల్లో సూరత్, వడోదర, అహ్మదాబాద్ ప్రాంతాల్లో ఎక్కువ సీట్లు గెలుపొందామని వెల్లడించారు. ఆదివారం నాడు రాజ్కోట్లో దళితుడని కొట్టి చంపిన ఘటనపై రూపానీ స్పందిస్తూ.. ఈ ఘటనపై విచారణ చేపట్టి, బాధ్యులను అరెస్టు చేశామని అన్నారు. మృతుని కుటుంబానికి 8 లక్షల రూపాయలు నష్ట పరిహారం అందించామని తెలిపారు. -
రూపానీదే గుజరాత్ పీఠం
గాంధీనగర్: గుజరాత్ ముఖ్యమంత్రి ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు అత్యంత విధేయుడైన విజయ్ రూపానీనే రెండోసారీ గుజరాత్ సీఎం పీఠం వరించింది. శుక్రవారం గుజరాత్ బీజేపీ శాసనసభా పక్షం రూపానీని తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. కొత్తగా ఎన్నికైన బీజేపీ శాసన సభ్యులతో భేటీ తర్వాత పార్టీ కేంద్ర పరిశీలకుడు అరుణ్ జైట్లీ వివరాలు వెల్లడిస్తూ.. శాసనసభా పక్ష నేతగా రూపానీని, ఉప నేతగా నితిన్ పటేల్ను ఎన్నుకున్నారని తెలిపారు. బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గుజరాత్ ఎన్నిక ల్లో వరుసగా ఆరోసారి బీజేపీ అధికారం కైవ సం చేసుకున్నా తక్కువ మెజార్టీతో గట్టెక్కింది. ఈ నేపథ్యంలో రూపానీని మరోసారి సీ ఎంగా కొనసాగించే అంశంపై ఊహాగానాలు కొనసాగాయి. అయితే పార్టీ అగ్ర నాయకత్వంతో రూపానీకి ఉన్న సాన్నిహిత్యం.. ఎలాంటి మచ్చలేని రాజకీయ జీవితం, తటస్థ కుల వైఖరి వంటి అంశాలు పూర్తిగా ఆయన వైపు మొగ్గు చూపేలా చేశాయి. బీజేపీ శాసనసభాపక్ష నేత, ఉప నేత పదవులకు రూపానీ, పటేల్ పేర్లను ఎమ్మెల్యే భూసేంద్ర సిన్హ్ చుదాసమ సూచించారని.. మరో ఐదుగురు సభ్యులు చుదాసమ ప్రతిపాదనను సమర్ధించారన్నారు. నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ముందు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో రూపానీ సంప్రదింపులు జరుపుతారని జైట్లీ చెప్పారు. 182 మంది సభ్యులున్న అసెంబ్లీలో బీజేపీ 99 సీట్లతో.. 1995 అనంతరం తొలిసారి అతి తక్కువ స్థానాలు సాధించింది. ఇక మూడు దశాబ్దాల అనంతరం మొదటిసారి కాంగ్రెస్ 77 స్థానాల్ని సొంతం చేసుకుంది. మిత్రపక్షాలతో కలిసి కాంగ్రెస్ 80 స్థానాల్లో విజయం సాధించింది. గుజరాత్లో స్వతంత్ర అభ్యర్థి రతన్ సిన్హ్ రాథోడ్ బీజేపీకి మద్దతు ప్రకటించారు. హిమాచల్ బీజేపీ ఎమ్మెల్యేలతో పార్టీ పరిశీలకుల భేటీ మరోవైపు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతోంది. పార్టీ కేంద్ర పరిశీలకులైన కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నరేంద్ర సింగ్ తోమర్ పాటు హిమాచల్ ప్రదేశ్ బీజేపీ ఇన్చార్జ్ మంగళ్ పాండేలు శుక్రవారం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. తర్వాత మీడియాను కలవకుండానే ఢిల్లీ బయల్దేరారు. శాసనసభా పక్ష భేటీలో ఎమ్మెల్యేలు వ్యక్తం చేసిన అభిప్రాయాల్ని ఈ బృందం పార్టీ అధినాయకత్వానికి సమర్పించనుంది. ఆ నివేదిక ఆధారంగా సీఎం పేరుపై త్వరలో నిర్ణయం వెలువడుతుందని పార్టీ వర్గాలు పేర్కొన్నారు. కంగ్రా ఎంపీ శాంతా కుమర్, మండీ ఎంపీ రామ్ స్వరూప్, సిమ్లా ఎంపీ కశ్యప్, మరో సీనియర్ నేత సురేశ్ భరద్వాజ్లు... పార్టీ కేంద్ర పరిశీలకుల్ని కలిసి తమ అభిప్రాయాలు చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ సీఎం రేసులో కేంద్ర మంత్రి నడ్డా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఠాకూర్లు ముందు వరుసలో ఉన్నారు. మయన్మార్ టు భారత్ విజయ్ రూపానీ(61) మయన్మార్ రాజధాని యాంగాన్(అప్పట్లో రంగూన్)లో జన్మించారు. ఆ దేశంలో రాజకీయ అనిశ్చితి కారణంగా 1960లో రూపానీ కుటుంబం గుజరాత్కు తరలివచ్చి రాజ్కోట్లో స్థిరపడింది. విద్యార్థి దశలోనే ఆయన ఆర్ఎస్ఎస్లో చేరారు. కొన్నాళ్లు ఏబీవీపీలో పనిచేశాక బీజేపీలో చేరి వివిధ హోదాల్లో పనిచేశారు. జైన వర్గానికి చెందిన రూపానీ గుజరాత్లో బీజేపీ పటిష్టానికి ఎంతో కృషి చేశారు. 2006 నుంచి 2012 వరకూ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. 2014లో గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ వజూభాయ్ వాలా కర్ణాటక గవర్నర్గా వెళ్లడంతో.. రాజ్కోట్ వెస్ట్కు జరిగిన ఉప ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందారు. ఫిబ్రవరి 19, 2016లో గుజరాత్ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అయితే ఆగస్టు, 2016లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ రాజీనామాతో ఆయనను సీఎం పీఠం వరించింది. 2006లో గుజరాత్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న సమయంలో రాష్ట్రంలో పర్యాటక రంగం ప్రోత్సాహానికి చేసిన కృషి ప్రశంసలు అందుకుంది. -
గుజరాత్ సీఎంగా విజయ్ రూపాణీ
-
సీఎం రేసుపై స్మృతి క్లారిటీ
న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీని కొనసాగిస్తారా? లేదా కొత్త ముఖాన్ని తెర మీదకు తీసుకోస్తారా? దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో ఆరోసారి అధికారాన్ని కైవసం చేసుకున్న బీజేపీ ఎవరికి ముఖ్యమంత్రి పదవి కట్టబెడుతుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలో పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. కేంద్ర జౌళి, ప్రసార శాఖ మంత్రి స్మృతీ ఇరానీ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాల, మరో మంత్రి మాన్సుఖ్ మాందివా పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే తాను సీఎం రేసులో లేనని స్మృతీ ఇరానీ స్పష్టం చేశారు. తనను వివాదంలోకి లాగేందుకే ఇటువంటి వదంతులు సృష్టిస్తున్నారని ఆమె అన్నారు. కాగా, కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ ఆర్. వాలా పేరు కూడా వినిపిస్తోంది. 2012 నుంచి 2014 వరకు ఆయన గుజరాత్ అసెంబ్లీ స్పీకర్గా పనిచేశారు. పలుమార్లు రాజ్కోట్ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికైయ్యారు. 1997 నుంచి 2012 వరకు గుజరాత్ మంత్రిగా పలు రకాల శాఖలు నిర్వహించారు. మరోవైపు విజయ్ రూపానీతో ఉప ముఖ్యమంత్రిగా నితిన్ పటేల్ను కొనసాగించేందుకే బీజేపీ అధిష్టానం సుముఖంగా ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. 2019 సాధారణ ఎన్నికలు జరగనున్నందున ముఖ్యమంత్రిని మార్చడం మంచిదికాదన్న అభిప్రాయంతో కమలం పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. గుజరాత్ కేబినెట్లో 12 కొత్త ముఖాలకు చోటు దక్కనుందని సమాచారం. ఈనెల 25న కొత్త ప్రభుత్వం కొలువుతీరే అవకాశముంది. -
విజయ్ రుపానీకి జై కొడతారా? ఝలక్ ఇస్తారా??
అహ్మద్బాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బొటాబోటీ మెజారిటీ బీజేపీ గట్టెక్కిన సంగతి తెలిసిందే. బీజేపీ అధినేత అమిత్ షా గుజరాత్లో 'మిషన్-150' టార్గెట్గా పెట్టుకున్నారు. కానీ, బీజేపీ సెంచరీ మార్కు దాటలేకపోయింది. 182 స్థానాలు ఉన్న గుజరాత్లో ఆ పార్టీ 99 స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రి ఎవరు అవుతారన్నది ఆసక్తిగా మారింది. సహజంగానే సీఎం పదవికి విజయ్ రుపానీ ఫెవరెట్ అని వినిపిస్తున్నా.. అనూహ్యంగా కొత్త పేరు తెరపైకి వచ్చే అవకాశముందని వినిపిస్తోంది. మరో పర్యాయం కూడా ముఖ్యమంత్రిగా విజయ్ రుపానీనే కొనసాగిస్తామని గత ఏడాది అమిత్ షా తమకు చెప్పినట్టు బీజేపీ అగ్రనేతలు అంటున్నారు. బీజేపీ తాజా ఎన్నికల్లో అనుకున్నంతగా ఫలితాలు రాబట్టలేకపోయిన నేపథ్యంలో నాయకత్వాన్ని మారిస్తే తప్పుడు సంకేతాలు పంపినట్టు అవుతుందని, ఈ విషయంలో అధినాయకత్వం ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశముందని కమలం నేతలు అంటున్నారు. ఒకవేళ రుపానీని కాదని సీఎం పదవికి మరొకరిని తెరపైకి తెస్తే.. రాష్ట్ర నాయకత్వంపై ఆయన నమ్మకం కోల్పోయినట్టు అవుతుందని బీజేపీ గుజరాత్ నేతలు అంటున్నారు. అంతేకాకుండా రుపానీ అమిత్ షాకు సన్నిహితుడు. క్లీన్ ఇమేజ్ ఉండి.. కులముద్రలేని నాయకుడు. కాబట్టి ఈసారి కూడా ఆయననే సీఎం పదవి వరించవచ్చునని అంటున్నారు. అయితే, అమిత్ షా వైఖరి బాగా తెలిసినవాళ్లు మాత్రం రుపానీ ఫెవరేట్ అని ఇప్పుడే అనడం సరికాదని పేర్కొంటున్నారు. అనూహ్యంగా నిర్ణయాలను తీసుకొని ప్రజలను సర్ప్రైజ్ చేయడంలో అమిత్ షాకు మంచి పేరుంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఘనవిజయం తర్వాత యోగిఆదిత్యనాథ్ పేరును, హరియాణాలో మనోహర్లాల్ ఖట్టర్ పేరును ఇలా అనూహ్యంగా తెరపైకి తెచ్చి ఆయన ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆనందిబేన్ రాజీనామా తర్వాత విజయ్ రుపానీ పేరును కూడా సర్ప్రైజ్ రూపంలోనే షా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా గుజరాత్ సీఎంగా కొత్త పేరు తెరపైకి వచ్చే అవకాశం లేకపోలేదని, చివరినిమిషం వరకు సస్పెన్స్ కొనసాగించి.. సర్ప్రైజ్ నిర్ణయాన్ని బీజేపీ అధినాయకత్వం ప్రకటించినా ప్రకటించవచ్చునని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే గుజరాత్ సీఎం ఎంపిక కోసం కేంద్రమంత్రి అరుణ్ జైట్లీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ నెల 25లోపు గుజరాత్ సీఎంను ఖరారుచేయవచ్చునని తెలుస్తోంది. -
వ్యాట్తో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయ్
మోతెక్కుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీకి కోత పెడుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్పై 5 శాతం మేర వ్యాట్ తగ్గించాలంటూ పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు ఇంధనాలపై 4 శాతం వ్యాట్ను తగ్గిస్తూ గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంధన ధరలపై వ్యాట్ను తగ్గించిన తొలి రాష్ట్రం కూడా ఇదే. వ్యాట్ తగ్గడంతో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా కిందకి దిగొచ్చాయి. వ్యాట్ను తాము 4 శాతం తగ్గించామని, ఈ మేరకు లీటరు పెట్రోల్ రూ.2.93, లీటరు డీజిల్ రూ.2.72 కిందకి దిగొచ్చాయని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని చెప్పారు. గుజరాత్తో పాటు మహారాష్ట్ర కూడా వ్యాట్ను తగ్గించింది. లీటరు పెట్రోల్ ధరను రూ.2, లీటరు డీజిల్ ధరను రూ.1 తగ్గించినట్టు ప్రకటించింది. వ్యాట్ నుంచి రాష్ట్రాలు ఎక్కువగా లబ్ది పొందుతుంటాయి. వ్యాట్ సేకరణతో పాటు 42 శాతం ఎక్సైజ్ డ్యూటీ కలెక్షన్లు వీరికి అందుతాయి. రాష్ట్రాలకు ఇవ్వగా మిగిలిన మొత్తాన్ని కేంద్రం, రాష్ట్రాల్లో అమలుచేస్తున్న పథకాలకు వినియోగిస్తోంది. కాగ, పెట్రోల్పై ఉన్న ఎక్సైజ్ డ్యూటీని రూ.21.48 నుంచి రూ.19.48కు, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీని రూ.17.33 నుంచి రూ.15.33కు తగ్గించింది. ఈ ప్రభావంతో లీటరు పెట్రోల్ ధర రూ.2.5, లీటరు డీజిల్ ధర రూ.2.25 తగ్గాయి. -
గుజరాత్లో బ్లూవేల్ బ్యాన్
అహ్మదాబాద్: చిన్నారులను బలిగొంటున్న బ్లూవేల్ గేమ్ను తమ ప్రభుత్వం నిషేధిస్తుందని గుజరాత్ సీఎం విజయ్ రూపాని చెప్పారు. రాష్ట్రంలో ఈ మృత్యు క్రీడను నిషేధించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని హోంశాఖకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ గేమ్ ఫలితంగా చిన్నారులు, యువత ఆత్మహత్యలకు పాల్పడుతుండటం ఆందోళనకరమని, ఇలాంటి గేమ్లకు అడ్డుకట్ట వేయాల్సి ఉందని సీఎం మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. గుజరాత్లో ఈ క్రీడను బ్యాన్ చేసేందుకు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ను తీసుకువస్తుందన్నారు. బ్లూవేల్ ఛాలెంజ్ గేమ్తో చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడే పరిస్థితిని అనుమతించబోమని, వీలైనంత త్వరలో దీన్ని నిషేధించేందుకు అవసరమైన అన్ని చర్యలూ సత్వరమే చేపట్టాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. -
రాహుల్ పై దాడిని ఖండించిన గుజరాత్ సీఎం..
అహ్మదాబాద్: గుజరాత్లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై జరిగిన దాడిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్రూపాణి ఖండించారు. దురదృష్టకరమైన దాడిగా అభివర్ణిస్తూ దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వం డీజీ ర్యాంకు హోదా కలిగిన అధికారిని విచారణ అధికారిగా నియమించిందని, ఘటనకు సంబంధించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని విజయ్ రూపాణి ఘటనానంతరం ట్వీట్ చేశారు. వరద ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాల పరిశీలనకు వచ్చిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వాహనంపై శుక్రవారం రాళ్లదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రాహుల్ కారు అద్దాలు పగిలిపోగ,. ప్రత్యేక భద్రత దళం(ఎస్పీజీ) వెంటనే అప్రమత్తమవటంతో ఆయన ఎలాంటి గాయాల్లేకుండానే క్షేమంగా బయటపడ్డారు. పిరికిపందల చర్యలకు తాను భయపడనని రాహుల్ అన్నారు. అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఘటనలపై మండిపడింది. బీజేపీ గుండాలే ఈ దాడికి పాల్పడ్డారని విమర్శించింది. కాంగ్రెస్ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. రాహుల్ అవకాశవాద రాజకీయాలకు విసిగి ప్రజలే దాడి చేశారని పేర్కొంది. అంతకు ముందు రూపానీ రాహుల్ పర్యటను ఉద్దేశించి కఠిన పరిస్థితుల్లో కాంగ్రేస్ ఎమ్మెల్యేలు ఎక్కడా అని ప్రజలు రాహుల్ నిలదీస్తారని, పార్టీ కోసం రాహుల్ కృషి చేస్తుంటే గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సేదతీరుతున్నారని ట్వీట్ చేశారు. గుజరాత్ రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంగళూరు క్యాంపులో ఉన్న విషయం తెలిసిందే. The Govt has appointed Add DG rank officer to investigate the incident in detail & will take strict action against those found responsible. https://t.co/v58ltUs4ZS — Vijay Rupani (@vijayrupanibjp) 4 August 2017 -
నేడు సీఎంగా రూపానీ ప్రమాణ స్వీకారం
గాంధీనగర్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన విజయ్ రూపానీ శనివారం గవర్నర్ ఓపీ కోహ్లిని కలసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరారు. ఈ సందర్భంగా రూపానీ వెంట డిప్యూటీ సీఎంగా ఎన్నిక కానున్న నితిన్ పటేల్, ఇతర నేతలు ఉన్నారు. గవర్నర్తో భేటీ అనంతరం బీజేపీ రాష్ర్ట ఇన్చార్జి దినేశ్ శర్మ విలేకరులతో మాట్లాడుతూ రూపానీ ఆదివారం మధ్యాహ్నం 12.40 గంటలకు సీఎంగా ప్రమాణం చేస్తారని తెలిపారు. -
అమిత్ షాది విజయమా, అపజయమా?
న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రిగా తన విధేయుడైన విజయ్ రుపానిని ఎంపిక చేయడంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా విజయం సాధించారు. కానీ ఆయనకు ఇది నిజంగా విజయమేనా? అపజయం నుంచి వచ్చిన విజయం కాదా? గత కొన్ని రోజులుగా గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలను పరిశీలిస్తే ఈ తాజా పరిణామం ఆయన విజయం కాదని, ప్రత్యామ్నాయాన్ని సూచించడంలో మాత్రమే ఆయన విజయం సాధించినట్లు అర్థమవుతోంది. గత ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ను అమిత్ షా తప్పించాలనుకోవడం కొత్త విషయం కాదు. కానీ ఆమెను ఇప్పుడే తప్పించాలని భావించలేదు. ఆమెకు 75 (నవంబర్ 21వ తేదీన ఆమె పుట్టిన రోజు) ఏళ్లు నిండిన తర్వాత, అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఆమెను ముఖ్యమంత్రి పదవిని తప్పించాలని అమిత్షా భావించారు. అప్పటికి రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు పూర్తవుతాయి. ఆ తర్వాత ఆమెను తప్పించి ఎన్నికలకు సారథ్యం వహించడంలో భాగంగా తానే గుజరాత్ సీఎం బాధ్యతలు స్వీకరించాలని ఆయన భావించారు. అందుకనే ఆయన తదుపరి పార్టీ అధ్యక్షుడికి వదిలేయాలనే ఉద్దేశంతో పార్టీ కేంద్ర కమిటీలను పునరుద్ధరించలేదు. ఈ విషయం ఇటు బీజేపీలో, అటు సంఘ్ పరివార్లో ముఖ్య నాయకులందరికి తెల్సిందే. అమిత్ షా అంచనాలను ఆనందిబెన్ పటేల్ తన రాజీనామా నిర్ణయం ద్వారా తలకిందులు చేశారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే ఆమె సీఎం పదవి నుంచి తప్పుకుంటారని పార్టీ పెద్దలు భావించారు. కానీ పటేల్ అధిష్టానంతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే సోషల్ మీడియా ద్వారా తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రికి అమిత్ షా పేర్లు చక్కర్లు కొట్టింది. అందుకు కారణం అంతుకుముందు పటేల్ స్థానంలో అమిత్ షానే ముఖ్యమంత్రి అవుతారని పార్టీ నాయకులు భావించడమే. యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే గుజరాత్ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించడం పార్టీ అధ్యక్షుడిగా రాజకీయ తప్పిదనం అవుతుందని ఆయన భావించారు. అందుకని కొన్ని రోజులపాటు పార్టీ పెద్దలతో తర్జనభర్జనలు పడి చివరకు తన విధేయుడైన విజయ్ రుపానీని ఎంపిక చేశారు. ఆయన కూడా అమిత్ షాలాగా జైనుడే. బీసీలు, పటేళ్ల ఆందోళనతో రగిలిపోతున్న గుజరాత్లో ఆయన వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయ పథంలో నడిపిస్తారా, అన్నది ప్రస్తుతానికి సమాధానంలేని ప్రశ్నే. -
గుజరాత్ సీఎంగా విజయ్ రూపానీ
• మరో సంఘ్ నేతకు పట్టంగట్టిన బీజేపీ అధిష్టానం • ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు • 2017 ఎన్నికలకు ముందు కమలదళం కీలక నిర్ణయం అహ్మదాబాద్ : గుజరాత్ ముఖ్యమంత్రిగా.. బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ రూపానీ ఎంపికయ్యారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి గడ్కారీల సమక్షంలో జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు ఆనందీబెన్ వారసుడిగా.. రూపానీని ఎన్నుకున్నారు. చివరి నిమిషందాకా సీనియర్ నేత నితిన్ పటేల్ పేరు ప్రముఖంగా వినిపించింది. అటు అమిత్ కూడా పార్టీ ముఖ్యనేతలతో తీవ్ర చర్చలు జరిపారు. రూపానీని ప్రకటించేంతవరకు రెండు పేర్లపై (నితిన్, రూపానీ) తర్జనభర్జనలు జరిగాయి. అయితే భేటీ ప్రారంభమైన వెంటనే.. రూపానీ పేరును గడ్కారీ ప్రతిపాదించారు. దీనికి ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. నితిన్ను డిప్యూటీ సీఎంగా ఎంపిక చేశారు. ఆనందీబెన్ పటేల్ రాజీనామా ప్రకటించిన తర్వాత సీఎం ఎంపికపై బీజేపీ అధిష్టానం తీవ్ర కసరత్తు చేశాక శుక్రవారం రూపానీ పేరును ప్రకటించింది. వచ్చే ఏడాది(2017 చివర్లో) జరిగే ఎన్నికల్లో పార్టీని నడిపించేందుకు సమర్థుడు, వివాదరహితుడు ఉండాలనే రూపానీని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. 2 దశాబ్దాలకు పైగా గుజరాత్లో అధికారంలో ఉన్న బీజేపీకి పటేళ్ల కోటా, ఉనా దళితులపై దాడి వంటివి తలనొప్పిగా మారాయి. దీనికి తోడు 2015 చివర్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో మెజారిటీ సీట్లు గెలుచుకోవటం, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాష్ట్రంలో పర్యటిస్తూ.. కంటిలో నలుసులా మారటం బీజేపీకి ఇబ్బందికరంగా మారింది. సమర్థతకు పట్టం బీజేపీ గుజరాత్ అధ్యక్షుడిగా ఉన్న విజయ్ రూపానీ మయన్మార్లోని రంగూన్లో ఆగస్టు 2, 1956న జైన వైశ్య(గుజరాత్లో మైనారిటీలు) కుటుంబంలో జన్మించారు. తర్వాత వీరి కుటుంబం సౌరాష్ట్రకు వలస వచ్చింది. విద్యార్థిగా ఉన్నప్పటినుంచే ఆరెస్సెస్, ఏబీవీపీల్లో చురుకుగా ఉన్న రూపానీ.. సౌరాష్ట్ర వర్సిటీ నుంచి బీఏ, ఎల్ఎల్బీ పట్టాపొందారు. 1971లో జన్సంఘ్లో.. ఆ తర్వాత బీజేపీలో ఆవిర్భావం నుంచి పనిచేస్తూ వచ్చారు. రాజ్కోట్లో కార్పొరేటర్గా, మేయర్గా కూడా పనిచేశారు. ఎటువంటి క్లిష్ట సమస్యనైనా స్నేహపూర్వకంగా పరిష్కరిస్తాడని కార్యకర్తలు చెప్పుకునే విజయ్ రూపానీకి ప్రధాని మోదీ, అమిత్షాతో చాలా సాన్నిహిత్యం ఉంది. గుజరాత్ పర్యాటక కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు ఈయన చేపట్టిన ‘ఖుష్బూ గుజరాత్కీ’ ప్రచారం దేశాన్ని ఆకర్షించింది. 2006 నుంచి 2012 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉండి.. జలవనరులు, ఆహారం, ప్రజాపంపిణీ వ్యవస్థ వంటి కమిటీల్లో క్రియాశీలకంగా పనిచేశారు. 2014లో రాజ్కోట్ సిట్టింగ్ ఎమ్మెల్యే వాజూభాయ్ వాలా రాజీనామా చేసి కర్ణాటక గవర్నర్గా వెళ్లడంతో ఖాళీ అయిన స్థానంలో గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈయన సమర్థత, చతురత కారణంగా ఆనందీబెన్ పటేల్ కేబినెట్లో కీలక శాఖల బాధ్యతలు అప్పగించారు. బలమైన సామాజిక వర్గం నేపథ్యం లేకపోయినా పటేళ్ల ఉద్యమం తీవ్రంగా ఉన్న సౌరాష్ట్ర నుంచి ప్రాతినిధ్యం వహించటం కలిసొచ్చింది. దీనికి తోడు ఆరెస్సెస్తో సుదీర్ఘ అనుబంధం, సమస్యల వలయంలో ఉన్న పార్టీని 2017 ఎన్నికల్లో నడిపే సమర్థత ఉందని పార్టీ అధిష్టానం భావించటం రూపానీని సీఎం పీఠం ఎక్కించాయి. -
గుజరాత్ సీఎం మరో సంచలన నిర్ణయం
సూరత్: గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన రెండు రోజుల తర్వాత ఆనందీబెన్ పటేల్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన మరణాంతరం తన శరీరాన్ని దానం చేయాలని ఆమె కోరారు. సూరత్ యూనివర్శిటీ క్యాంపస్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆనందీబెన్ ఈ విషయాన్ని ప్రకటించారు. అవయవాలు దానం చేసిన వారి కుటుంబ సభ్యులను, ఇందుకు సేవలందిస్తున్న వైద్యులను ఆనందీబెన్ సన్మానించారు. ఓ ఎన్జీవో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. 70 ఏళ్లు రాగానే మనం ఇంట్లో కూర్చుని విశ్రాంతి తీసుకోవాలని భావిస్తామని, కానీ అంతేకంటే ఎక్కువ వయసులో కూడా డాక్టర్లు అవయమార్పిడి ఆపరేషన్లు విజయవంతం చేయడానికి కృషిచేస్తున్నారని ప్రశంసించారు. పలుకార్యక్రమాల్లో పాల్గొన్న ఆనందీబెన్ రాజకీయ విషయాలను మాత్రం ప్రస్తావించలేదు. గత బుధవారం వయోభారం కారణంగా గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆమె ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆనందీబెన్ రాజీనామాను గుజరాత్ గవర్నర్ ఆమోదించారు. కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టేవరకు పదవిలో కొనసాగాల్సిందిగా గవర్నర్ ఆమెను కోరారు. -
అమిత్ షాకు ఇంకా చాన్స్ ఉన్నట్లేనా?
గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ రాజీనామా చేయడంతో.. కొత్త ముఖ్యమంత్రి ఎవరో నిర్ణయించేందుకు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా గురువారం ఉదయం అహ్మదాబాద్ చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా తన ఇంటికి వెళ్లారు. అక్కడ పార్టీ సంయుక్త కార్యదర్శి వి.సతీష్, గుజరాత్ వ్యవహారాల ఇన్చార్జి, ప్రధాన కార్యదర్శి దినేష్ శర్మలతో సమావేశమయ్యారు. త్వరలో ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందువల్ల ఈ కీలక తరుణంలో అమిత్ షాను గుజరాత్ ముఖ్యమంత్రిగా చేసే అవకాశం లేనే లేదని పార్టీ అధిష్ఠానం బుధవారమే స్పష్టం చేసింది. అయినా, గుజరాత్ ఆయన సొంత రాష్ట్రం కావడంతో.. సీఎం చేసే చాన్స్ ఉందని కొందరు నాయకులు అంటున్నారు. గుజరాత్ ఎమ్మెల్యేలు మాత్రమే తమ నాయకులెవరన్నది ఎన్నుకుంటారని వెంకయ్యనాయుడు చెప్పారు. కానీ.. ఒకవేళ ఇప్పటికే పోటీలో ఉన్న పటేళ్ల కంటే అమిత్ షా వైపు మొగ్గు ఎక్కువగా ఉందని, అందువల్ల ఎమ్మెల్యేలు ఆయననే ఎన్నుకున్నారని తర్వాత చెప్పుకోవచ్చని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు. సాధారణంగా లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి పెద్దగా ప్రాధాన్యం ఉండదని.. కానీ ఈసారి మాత్రం శుక్రవారం సాయంత్రం జరిగే సమావేశానికి చాలా ప్రాధాన్యం ఇస్తున్నారని ఇలా ఎందుకు జరుగుతోందోనని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అమిత్ షా అహ్మదాబాద్ నగరంలోని నారన్పురా అసెంబ్లీ స్థానం నుంచి గత ఎన్నికల్లో గెలిచారు. అందువల్ల ఆయనను సీఎం చేయడానికి సాంకేతికంగా ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. -
ఆనందీ బెన్ రాజీనామా ఆమోదం
అహ్మదాబాద్ : గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ రాజీనామాకు రాష్ట్ర గవర్నర్ ఓపీ కోహ్లీ ఆమోదం తెలిపారు. ఆనందీ బెన్ బుధవారం సాయంత్రం గవర్నర్ను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. కాగా గుజరాత్ కొత్త సీఎం అభ్యర్థి ఎంపిక గురువారం ఖరారు కానుంది. ఇందుకోసం పార్టీ పరిశీలకులుగా నితిన్ గడ్కరీ, సరోజ్ పాండే గుజరాత్ వెళ్లనున్నారు. మరోవైపు సీఎం రేసులో పలువురు ముఖ్యనేతల పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. గుజరాత్ ఆరోగ్య మంత్రి నితిన్ పటేల్, రాష్ట్ర బీజేపీ చీఫ్ విజయ్ రూపానీ, సౌరభ్ పటేల్ పేర్లు ముందంజలో ఉన్నాయి. ఇక నరేంద్రమోదీ ప్రధానమంత్రి పదవి చేపట్టిన నేపథ్యంలో ఆనందీ బెన్ 2014లో గుజరాత్ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. ఇటీవల రాష్ట్రంలో రాజకీయంగా పలు సవాళ్లతో సతమతమవుతున్న సంగతీ తెలిసిందే. ఈ నేపథ్యంలో.. తన వయసు 75 ఏళ్లకు చేరుతున్నందున ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటానంటూ రెండు నెలల కిందటే పార్టీ నాయకత్వానికి తాను లేఖ రాశానని ఆనందీబెన్ సోమవారం ఫేస్బుక్లో తెలిపారు. -
ఆయన వల్లే ఆనందీ బెన్ రాజీనామా!
అహ్మదాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ సన్నిహిత మద్దతుదారులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె వయోభారంతో రాజీనామా చేయలేదని, దాని వెనుక అమిత్ షా ఉన్నారని అన్నారు. వాస్తవానికి ఆమెకు పాలనా స్వేచ్ఛను ఇస్తే వచ్చే నవంబర్ లో ఆమె 75 వసంతంలోకి అడుగుపెట్టాక స్వచ్ఛందంగా తాను సీఎం బాధ్యతల నుంచి తప్పుకునేవారని, కానీ, ఆమెతో రాజీనామా చేసే పరిస్థితులు సృష్టించి ఆ పనిచేయించారని వారు అంటున్నారు. వాస్తవానికి ప్రధాని మోదీ సీఎంగా ఆనందీ బెన్ కు బాధ్యతలు అప్పగించినప్పటికీ.. కమాండింగ్ మాత్రం అమిత్ షా చేతిలో ఉందంట. రాష్ట్ర పాలనా యంత్రాంగంలోని సీనియర్ అధికారులు సైతం అమిత్ షానే ముఖ్య విషయాలపై కలుస్తూ ఉన్నారంట. దీనిపై ఆనందీ బెన్ అసంతృప్తితో ఉన్నారని సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆమె రాజీనామా చేసినట్లు వారు చెబుతున్నారు. -
ఆమె ఎందుకు సోషల్ మీడియాలో రాజీనామా చేశారు?
గాంధీనగర్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘డిజిటల్ ఇండియా’ ప్రాజెక్టు ఆయన ఊహించిన దానికన్నా బాగా పనిచేస్తున్నట్లు ఉంది. గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ సోమవారం తన రాజీనామాను సోషల్ మీడియా ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. దేశంలో ఇలా రాజీనామా ఆఫర్ చేసిన తొలి ముఖ్యమంత్రి బహూశ ఆమె అయివుంటారు. సాధారణంగా ఏ పార్టీ ముఖ్యమంత్రి అయిన తమ రాజీనామా లేఖను ముందుగా పార్టీ అధిష్టానంకు స్వయంగా అందజేస్తారు లేదా ఫ్యాక్స్ చేస్తారు. అలా చేయకుండా పటేల్ మాత్రం ఎందుకు సోషల్ మీడియా మాధ్యమాన్ని ఎన్నుకున్నారు? దానిలో ఉన్న ఆంతర్యం ఏమిటీ? తనకు 75 ఏళ్ల వయస్సు సమీపిస్తున్నందున పదవికి రాజీనామా చేస్తున్నానని ఆమె ప్రకటించుకున్నారు. పార్టీలో ఈ నియమం పెట్టిందీ స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనే. ఆమెకు రాజీనామా చేయక తప్పదనే విషయాన్ని ఏడాది ముందే సూత్రప్రాయంగా మోదీనే సంకేతం ఇచ్చారు. 75 ఏళ్లలో అడుగుపెట్టిన తన మంత్రి వర్గ సభ్యులను తొలగించాల్సిందిగా మోదీయే స్వయంగా ఆమెను ఆదేశించారు. ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి వారిని కేంద్ర కేబినెట్లోకి తీసుకోక పోవడానికి వారి వయస్సే కారణమని కూడా సమర్థించుకున్నారు. మోదీ ఆదేశాల మేరకు ఆమె 75వ వడిలో అడుగు పెట్టిన ఇద్దరు మంత్రులను కేబినెట్ నుంచి తొలగించారు. ఈ నవంబర్ నెలలో 75వ ఏటలో అడుగుపెడుతున్న తనకు కూడా రాజీనామా చేయక తప్పదని ఆనాడే భావించారు. అయితే కేంద్ర కేబినెట్ విస్తరణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న యూపీకి అధిక ప్రాధాన్యం కల్పించేందుకు తాను పెట్టిన నియమాన్నే మోదీ అతిక్రమించి వృద్ధులను కేంద్ర కేబినెట్లోకి కొత్తగా తీసుకున్నారు. గుజరాత్లో ఉవ్వెత్తున లేచిన పటేళ్ల రిజర్వేషన్ల ఆందోళన, ప్రస్తుతం కొనసాగుతున్న దళితుల ఆందోళన ఆనందిబెన్ పటేల్ పాలనకు చెడు పేరును తీసుకొచ్చిందనడంలో సందేహం లేదు. ఈ కారణంగానే ఆమెను పదవి నుంచి తప్పించడం లేదు. అలా తప్పించదల్చుకుంటే ఆనందిబెన్ పటేల్ పదవిని దుర్వినియోగం చేసి ఆమె పిల్లలు అవినీతికి పాల్పడుతున్నారంటూ రాష్ట్రంలో గగ్గోలు ఎత్తినప్పుడే ఆమెను తొలగించి ఉండాల్సింది. ఆమెను పదవి నుంచి తప్పించడం వెనక రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీని గెలిపించే నాయకత్వం కావాలన్నదే బిజేపీ అధిష్టానం అభిమతం. ఆ అభిమతం ప్రకారమే ఇప్పుడామే స్పందించారు. రాజీనామా కోసం సోషల్ మీడియాను ఆశ్రయించడమే పార్టీలోని అందరిని ఆశ్చర్య పరుస్తోంది. నాయకత్వం పట్ల ఒకరకమైన అసంతృప్తిని వ్యక్తం చేయడమే ఆమె అభిమతమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమె రాజీనామాపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ లాంటి రాజకీయ నాయకులు ఒకరిద్దరు మినహా సోషల్ మీడియా యూజర్లు ఎక్కువ మంది తమదైన శైలిలోనే స్పందించారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఆప్ పార్టీ విజయం ఇదని కేజ్రివాల్ స్పందించారు. ఫేస్బుక్లో కూడా రిజైన్ బటన్ను ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని కొందరు, ‘నేను దీన్ని ఆమోదిస్తున్నాను’ అంటూ రాష్ట్ర గవర్నర్ కామెంట్ చేస్తే సరిపోతుందని మరికొందరు. లైకింగ్ హర్ పోస్ట్ ద్వారా బీజేపీ నాయకత్వం ఆమె రాజీనామాను ఆమోదిస్తే ఇంకా బాగుంటుందని ఇంకొందరు వ్యాఖ్యానాలు చేశారు. ‘ఆలసించినా ఆశాభంగం. తక్షణం ఆమోదించండి లేకపోతే రాజీనామా లేఖను ఫేస్బుక్ నుంచి వెనక్కి తీసుకునే అవకాశం ఉంది’ అంటూ ఒకరిద్దరు హెచ్చరించారు. లేఖను మోదీకి పంపించకుండా సోషల్ మీడియాను ఆశ్రయించడంలో ఆంతర్యం ఏమిటని, ఇది మోదీ విజయమని వ్యాఖ్యానించిన వారు కూడా లేకపోలేదు. రాజకీయ పదవుల్లో ఉన్నవారు ఫేస్బుక్ ద్వారా రాజీనామా చేయాలని, ట్విట్టర్ ద్వారా ప్రమాణ స్వీకారం చేయాలని, వాట్సాప్ ద్వారా కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని చలోక్తులు విసిరిన వారు కూడా ఉన్నారు. -
గుజరాత్ కొత్త సీఎం ఎవరు?
న్యూఢిల్లీ: గుజరాత్ తొలి మహిళా ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ రాజీనామా ప్రకటన చేయడంతో ఆమె స్థానంలో ఎవరిని నియమిస్తారనే దానిపై చర్చ మొదలైంది. రెండుమూడు రోజుల్లో నూతన ముఖ్యమంత్రి పేరు ప్రకటించే అవకాశముంది. గుజరాత్ కొత్త సీఎంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తో పాటు పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. నారన్పురా అసెంబ్లీ నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న అమిత్ షా... గతంలో గుజరాత్ హోంమంత్రిగా పనిచేశారు. ఉత్తరప్రదేశ్, గోవా, గుజరాత్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అమిత్ షా పార్టీ అధ్యక్ష పదవి వదులుకోవడాన్ని ప్రధాని మోదీ అంగీకరిస్తారా, లేదా అనేది చూడాలి. అమిత్ షా తర్వాత పురుషోత్తం రూపాల(62), నితిన్ పటేల్(60), విజయ్ రూపాని(60), భికుభాయ్ దాల్సానియా(52), శంకర్ చౌదరి(46) పేర్లు బలంగా విన్పిస్తున్నాయి. అమిత్ షాను గుజరాత్ సీఎంగా పంపకపోతే వీరిలో ఒకరిని ఎంపిక చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. కేంద్ర సహాయక మంత్రిగా ఉన్న పురుషోత్తం రేసులో ముందున్నారు. సౌరాష్ట్రలోని కడవా పటేల్ సామాజిక వర్గానికి చెందిన ఆయన గుజరాత్ బీజేపీలో మోదీ తర్వాత మంచి వక్తగా పేరు గాంచారు. అమిత్ షా కంటే సీనియర్ అయిన ఆయన కొన్నేళ్లుగా ప్రాధాన్యం కోల్పోయారు. గుజరాత్ ప్రభుత్వంలో అధికారికంగా నంబర్ టూగా కొనసాగుతున్న ఆరోగ్య శాఖ మంత్రి నితిన్ పటేల్ కూడా సీఎం పదవిపై ఆశ పెట్టుకున్నారు. ఆర్ఎస్ఎస్ తో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. ఆనందీబెన్ వారసుడిగా గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు విజయ్ రూపాని పేరు కూడా విన్పిస్తోంది. జైన్ సామాజిక వర్గానికి చెందిన ఆయన రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొవడంలో సిద్ధహస్తుడు. సంఘ పరివార్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్న రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి భికుభాయ్ దాల్సానియా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మోదీ హాయంలో శక్తివంతమైన నేతగా ఉన్న ఆయన బీజేపీకి, ఆర్ఎస్ఎస్ కు సంధానకర్తగా కీలకభూమిక పోషించారు. ఉత్తర గుజరాత్ కు చెందిన బీసీ నాయకుడు శంకర్ చౌదరి పేరు విన్పిస్తున్నా ఆయన ముఖ్యమంత్రి అవకాశాలు తక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
రాజీనామాకు సిద్ధపడ్డ ముఖ్యమంత్రి!
-
రాజీనామాకు సిద్ధపడ్డ ముఖ్యమంత్రి!
అహ్మాదాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి ఆనంది బెన్ అనూహ్యరీతిలో రాజీనామాకు సిద్ధపడ్డారు. ముఖ్యమంత్రి పదవి నుంచి తనను తప్పించాలని ఆమె సోమవారం బీజేపీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. గుజరాత్లో దళితులపై దాడులను నివారించడంలో ఆనందిబెన్ సర్కారు విఫలమైందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. తనకు వయస్సు మీద పడుతున్నదని, ఈ నేపథ్యంలో తనను సీఎం పదవి నుంచి తప్పించాలని ఆనందిబేన్ తన ఫేస్బుక్ పేజీలో బీజేపీ అధినాయకత్వాన్ని కోరారు. ఆనందిబెన్ వచ్చే నవంబర్లో 75వ ఏట అడుగుపెట్టబోతున్నారు. మరోవైపు వచ్చే ఏడాది గుజరాత్లో కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో గుజరాత్ అభివృద్ధి నమూనాను దేశమంతటా ప్రచారం చేసి నరేంద్రమోదీ ప్రధానిగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టడంతో ఆయన స్థానంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆనందిబెన్ ప్రమాణం స్వీకరించారు. ఆనందిబెన్ హయాంలోనే పటేళ్ల రిజర్వేషన్ల ఆందోళన గుజరాత్ను కుదిపేసింది. దీనికితోడు గుజరాత్ ఉనాలో దళిత యువకులపై జరిగిన దాడి దేశమంతటా గగ్గోలు రేపింది. ఈ నేపథ్యంలో ఆనందిబెన్ రాజీనామాకు సిద్ధపడటం గమనార్హం. -
గుజరాత్ సీఎంను తొలగించే ధైర్యం లేదా?
గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ను తప్పించాలని, ఆమె స్థానంలో కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఎప్పటి నుంచో యోచిస్తున్నారు. పటేళ్ల రిజర్వేషన్ల ఆందోళనను అణచివేయడంలో ఆమె వైఫల్యమే అందుకు కారణం. ఆమె నాయకత్వాన వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పోటీ పడినట్లయితే పటేళ్లందరూ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారన్నది ఇద్దరి నేతల భయం. అయితే పటేళ్ల ఆందోళనకారణంగా సీఎం పదవి నుంచి తప్పిస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించే సాహసం బీజేపీ అధిష్టానం చేయలేదు. మరెలా తప్పించాలి? అందుకు మోదీకి ఓ తరుణోపాయం చిక్కింది. 75 ఏళ్లు వయస్సు మీద పడిన వాళ్లు ఇటు ప్రభుత్వ నాయకత్వానికి, అటు పార్టీ నాయకత్వానికి దూరంగా ఉండాలన్నది మోదీ ఎప్పటి నుంచో చెబుతున్న అభిమతం. ఈ అభిమతం లేదా సాకుతోనే నాడు పార్టీ సీనియర్ నాయకులు అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను పార్టీకి, నాయకత్వానికి దూరంగా పెట్టారు. ఏజ్బార్నే సాకుగా చూపించి ఆనందిబెన్ పటేల్ను తప్పించాలని నరేంద్ర మోదీ ఇంతకాలం భావిస్తూ వచ్చారు. దీన్ని సమర్థించుకోవడానికి ఆయనకు ఓ తాజా ఉదాహరణ కూడా ఉంది. 75 ఏళ్లు పైబడిన వారిని మంత్రివర్గం నుంచి తొలగించాల్సిందిగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు బీజేపీ అధిష్టానం ఆదేశించింది. దాంతో రాష్ట్ర హోం మంత్రి బాబూలాల్ గౌర్ (86)ను, రాష్ట్ర ప్రజా పనుల శాఖ మంత్రి సర్తార్ సింగ్ (76)ను శివరాజ్ సింగ్ కేబినెట్ నుంచి తొలగించారు. ఇదే సూత్రాన్ని అనుసరిస్తూ నవంబర్లో 75వ ఏట అడుగుపెడుతున్న గుజరాత్ సీఎం ఆనందిబెన్ను తప్పించాలని అనుకున్నారు. ఈ విషయాన్ని సూచనప్రాయంగా ఆమెను ఢిల్లీకి పిలిపించి మరీ చెప్పారు. ఆమె గత మే నెలలో మోదీని, అమిత్షాను కలసుకున్నప్పుడు త్వరలో ఆమెకు ఉద్వాసన తప్పదని మీడియాలో కూడా ఉహాగానాలు చెలరేగాయి. ఇప్పుడు అనుకోకుండా ఆనందిబెన్కు ఓ అదృష్టం కలసివచ్చింది. 75 ఏళ్ల అనంతరం కూడా కేంద్ర కేబినెట్లో మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లా, సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమల శాఖ మంత్రి కల్రాజ్ మిశ్రాలను మోదీ కేబినెట్లో కొనసాగించడమే పటేల్కు కలసివచ్చే అదృష్టం. వాస్తవానికి కేంద్ర కేబినెట్ పునర్వవ్యవస్థీకరణలో భాగంగా 75వ ఏటలో పడిన వీరిద్దరిని తప్పించాలని మోదీ భావించారట. అయితే ఉత్తరప్రదేశ్ బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి అవడం వల్లనే కల్రాజ్ మిశ్రాను తొలగిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని పార్టీ అధిష్టానం భావించిందని విశ్వసనీయ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. యూపీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనుండడం, ఓటర్లలో 9 శాతం మంది బ్రాహ్మణులు ఉండడం తెల్సిందే. నరేంద్ర మోదీ తన ఏజ్ బార్ నిబంధనను తన కేబినెట్కే వర్తింప చేయనప్పుడు ఆనందిబెన్ పటేల్కు ఎలా వర్తింప చేస్తారని ఆమెకు విశ్వాసపాత్రుడైనా ఓ మంత్రి వ్యాఖ్యానించారు. ఈ కారణంగా ఆమెను తొలగించే దమ్ము మోదీకి లేదని ఆయన సవాల్ చేశారు. -
సీఎం ఉద్వాసనకు రంగం సిద్ధం!
న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి ఆనంది బెన్ పటేల్ ఉద్వాసనకు రంగం సిద్ధమవుతోందా? అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమెను మార్చాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. గుజరాత్ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు జాతీయ నాయకత్వానికి తలనొప్పిగా మారాయి. వచ్చే ఎన్నికల వరకు ఇదే పరిస్థితి కొనసాగితే నెగ్గుకురావడం కష్టమని కాషాయ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఆనంది బెన్ పటేల్ ను తొలగించి నితిన్ భాయ్ పటేల్ ను సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని బీజేపీ యోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆనంది బెన్ పటేల్ ను గవర్నర్ గా నియమించే అవకాశముందని తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికల కోసం అవలంభించాల్సిన వ్యూహంపై రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి నివేదిక సమర్పించారని తెలుస్తోంది. గుజరాత్ సీఎం మార్పిడితో పాటు కేంద్ర కేబినెట్ లోనూ మార్పులు, చేర్పులు జరగనున్నాయని ఢిల్లీలో జోరుగా ఊహాగానాలు విన్పిస్తున్నాయి. -
ముఖ్యమంత్రికి మోదీ అభినందనలు
అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్కు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. ఆమెతో పాటు టీం గుజరాత్ మొత్తాన్ని ఆయన తన ట్వీట్ ద్వారా అభినందించారు. సుపరిపాలనతో పాటు ఏడాది కాలంలో మంచి పురోగతి సాధించారంటూ ప్రశంసలతో ముంచెత్తారు. రాబోయే కాలానికి శుభాభినందనలు కూడా తెలిపారు. అందుకు సీఎం ఆనందిబెన్ పటేల్ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఒక ట్వీట్ ఇచ్చారు. భారతదేశాన్ని 'ప్రపంచానికే గురువు' చేసేందుకు తమ శక్తివంచన లేకుండా సామర్థ్యం మేరకు కృషిచేస్తామని, ఈ దిశగా గుజరాత్ తన సేవలు అందిస్తుందని ఆమె తెలిపారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నరేంద్రమోదీ.. గత సార్వత్రిక ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజారిటీ సాధించి ప్రధాని అవ్వడంతో గుజరాత్ సీఎం పదవికి ఆనందిబెన్ పటేల్ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. I congratulate Gujarat CM @anandibenpatel & entire Team Guj on completing a successful year of progress & good governance. My best wishes. — Narendra Modi (@narendramodi) May 22, 2015 Thank you PM @narendramodi for your kind wishes. Gujarat will continue to contribute to the best of its capacity to make India 'Vishwa Guru' — Anandiben Patel (@anandibenpatel) May 22, 2015 -
' అమిత్ హత్య కేసులో జోక్యం చేసుకోండి'
అహ్మాదాబాద్: యూఎస్లో గుజరాతీ వ్యాపారవేత్త అమిత్ పటేల్ హత్య కేసులో జోక్యం చేసుకోవాలని ఆ రాష్ట్ర సీఎం ఆనందీబెన్ పటేల్ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ హత్య కేసుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి త్వరతగతిన పూర్తి చేసి.. నిందితులను కఠినంగా శిక్షించేలా యూఎస్ ప్రభుత్వాన్ని కోరాలని ఆమె నరేంద్ర మోదీని కోరారు.ఈ మేరకు ఆనందీబెన్ పటేల్ మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు.గుజరాత్ కైదా జిల్లాలోని ఉత్తరసంద్ గ్రామానికి చెందిన పటేల్ యూఎస్ ఎడిసన్ పట్టణంలోని ఇర్వింగ్టన్లో వైన్ షాపు నిర్వహిస్తున్నాడు. ఆ క్రమంలో కొందరు దుండగులు సోమవారం అమిత్ పటేల్ షాపులోకి ప్రవేశించి... విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు.దీంతో అమిత్ రక్తపుమడుగులో కుప్పకూలి ప్రాణాలు విడిచారు.ఆ సమాచారాన్ని వారి కుటుంబసభ్యులకు తెలిపారు. దాంతో వారు స్థానిక ఎమ్మెల్యేను కలసి ఈ కేసులో మోదీ జోక్యం చేసుకుని యూఎస్ అధికారులు త్వరితగతిన విచారణ చేపట్టేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. దీంతో సదరు ఎమ్మెల్యే సీఎం ఆనందీబెన్ పటేల్ను కలిసి పరిస్థితిని వివరించారు.దీంతో ఆమెపై విధంగా స్పందించారు. -
'ప్రతి మహిళ ముఖ్యమంత్రే'
తాను ముఖ్యమంత్రి పదవి అలంకరించడంతో రాష్ట్రంలోని ప్రతి మహిళ ఆ పదవిని చేపట్టినట్లు భావిస్తున్నారని గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ వెల్లడించారు. గురువారం గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆనందీ బెన్ పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆమె విలేకర్లతో మాట్లాడారు. బీజేపీ అగ్రనాయకత్వం తనకు పెద్ద బాధ్యత అప్పగించిందన్నారు. ఆ బాధ్యతను త్రీకరణశుద్ధీతో పని చేస్తానని తెలిపారు. గురువారం గుజరాత్ రాజధాని గాంధీనగర్లోని మహాత్మా మందిర్లో ఆ రాష్ట్ర గవర్నర్ కమల బెనివల్... ఆనందీ బెన్ పటేల్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ కార్యక్రమానికి ఆనందీ భర్త మఫత్లాల్, ఆమె కుమార్తె అనార్లు హాజరైయ్యారు. అనార్ మాట్లాడుతూ ... తల్లి సీఎం పీఠం అధిష్ఠించిన తరుణం తనకు చాలా గర్వంగా ఉందన్నారు. తనకు, తన కుటుంబానికి ఈ విషయం గర్వంగా భావిస్తున్నామని ఆనందీ భర్త మఫత్లాల్ తెలిపారు. గతంలో నరేంద్ర మోడీ మంత్రివర్గంలో పలు కీలక శాఖలలో పని చేసిన ఆనందీ బెన్ పటేల్ గురువారం గుజరాత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ బుధవారం గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 26న మోడీ భారతదేశ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం విదితమే. -
గుజరాత్ సీఎం పదవికి మోడీ రాజీనామా
గాంధీనగర్: గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి బీజేపీ నాయకుడు నరేంద్ర మోడీ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ కమల బేణివాల్కు ఆయన సమర్పించారు. భారత 14వ ప్రధానిగా నరేంద్ర మోడీ ఈ నెల 26న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోడీ స్థానంలో గుజరాత్ సీఎంగా రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఆనందీ బెన్ పటేల్ పేరు దాదాపు ఖరారైంది. 2001, అక్టోబర్ లో కేశూభాయ్ పటేల్ స్థానంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. వరుసగా మూడు పర్యాయాలు బీజేపీని గుజరాత్లో గెలిపించి సత్తా చాటారు. ఇప్పుడు దేశానికే ప్రధాని అయ్యాయి. -
గుజరాత్ కొత్త సీఎంగా ఆనందీ బెన్ పటేల్ ?
-
గుజరాత్ కొత్త సీఎంగా ఆనందీ బెన్ పటేల్ ?
సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ అఖండ విజయం సాధించింది. దాంతో ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రధాని పీఠం అధిష్టించనున్నారు. అందుకోసం ఈ నెల 21న గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి మోడీ రాజీనామా చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఆ రోజే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు అధ్యక్షత వహించేందుకు కొత్త సీఎంను ఎంపిక చేయాలి. ఈ నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రి ఎంపికపై బీజేపీ అగ్రనాయకత్వం కసరత్తు తీవ్రతరం చేసింది. అందులోభాగంగా ఆ పార్టీ పరిశీలకులు ఇప్పటికే గుజరాత్ చేరుకున్నారు. మోడీ మంత్రి వర్గంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళ మంత్రి ఆనందీ బెన్ పటేల్ ఎంపికపై రాష్ట్ర పరిశీలకులు అటు పార్టీ రాష్ట్ర నాయకులు ఇటు కేంద్ర నాయకులతో చర్చిస్తున్నారు. ఆనందీబెన్ పటేల్ను గుజరాత్ సీఎంగా ఎంపిక చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఆనందీబెన్ పటేల్ రోడ్లు, భవనాలు, పట్టణాభివృద్ధి, విపత్తు నిర్వహణ మంత్రిగా మోడీ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
బీజేపీవి నెత్తుటి రాజకీయాలు
రాహుల్ గాంధీ నిప్పులు కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు కోర్టులు ఆదేశిస్తే తప్ప మోడీ లోకాయుక్త ఏర్పాటు చేయలేదు అవినీతి వ్యతిరేక బిల్లులకు బీజేపీ సహకరించ లేదు అందుకే ఆర్డినెన్స్లుగా తేవాలనుకుంటున్నాం డెహ్రాడూన్: ఏ రకంగానైనా సరే అధికారంలోకి రావాలన్న పదవీ వ్యామోహంతో బీజేపీ నెత్తుటి రాజకీయాలు చేస్తోందని కాం గ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ‘‘అది(బీజేపీ) నెత్తుటి రాజకీయాలు చేస్తోంది. ఎలాగైనా అధికారంలోకి వచ్చేయాలన్న ఆలోచన తప్ప వాళ్ల కంటికి మరొకటి కనిపించడంలేదు. అధికారంలోకి రావడానికి అవసరం అనుకుంటే ఒక మతంపైకి మరో మతాన్ని, ఒక కులంపైకి మరో కులాన్ని ఉసిగొల్పి రక్తం కళ్లచూడ్డానికి కూడా వెనుకాడరు వారు’’ అని ఆయన అన్నారు. అదే కాంగ్రెస్ అయితే ప్రజల బాధలను అర్థం చేసుకుని వారి కోసం కృషి చేస్తుందన్నారు. ఆదివారం డెహ్రాడూన్లోని పరేడ్ గ్రౌండ్లో జరిగిన సభలో రాహుల్ మాట్లాడారు. కొన్ని సార్లు ప్రజల ఆకాంక్షలకు తగినట్టుగా తమ పాలన ఉండకపోవచ్చని, అయితే దేశం అభివృద్ధి పథంలో పయనించాలంటే దానికి అవసరమైన దూరదృష్టి కాంగ్రెస్కు మాత్రమే ఉందని చెప్పారు. మోడీపైనా విమర్శలు..: బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీపై రాహుల్ విరుచుకుపడ్డారు. ‘‘ఆ గుజరాత్ ముఖ్యమంత్రి అవినీతి గురించి మాట్లాడుతున్నారు. తీరా చూస్తే ఆయన తన రాష్ట్రంలో లోకాయుక్త ఏర్పాటుకే ముందుకురాలేదు. జ్యుడీషియల్ ఉత్తర్వులు వెలువడితేగాని ఏర్పాటు చేయలేదు. అయినప్పటికీ గుజరాత్లో ఒకే ఒక్క మనిషి మాత్రం లోకాయుక్త పరిధిలోకి రాలేదు. అందరూ వచ్చారుగాని.. ఆ ఒక్కరూ మాత్రం కాదు’’ అంటూ మోడీపై రాహుల్ గాంధీ విమర్శలు ఎక్కుపెట్టారు. పెండింగ్లో ఉన్న ఆరు అవినీతి వ్యతిరేక బిల్లులను ఆమోదించే విషయంలో బీజేపీ సహకరించడం లేదన్నారు. దీంతో వేరే దారిలేక తాము ఆర్డినెన్స్ల రూపంలో వాటిని తేవడానికి యత్నిస్తున్నామన్నారు. కాంగ్రెస్ రహిత భారత్ అంటూ మోడీ దుష్ర్పచారం చేస్తున్నారని, కానీ తమ పార్టీని దేశం నుంచి వేరు చేయలేరని అన్నారు. ‘‘మేం ఆలోచనల గురించి మాట్లాడతాం. వాళ్లేమో కాంగ్రెస్ను రూపుమాపాలని అంటారు. వాళ్లు భగవద్గీత చదవాలి. కానీ చదవరు. మానవత్వంతో ఇతరుల కోసం పని చేయాలని గీత చెబుతోంది. బుద్ధుడిని, అశోకుడిని, అక్బర్ను రూపుమాపలేరు.. అలాగే కాంగ్రెస్ను కూడా చెరిపేయలేరు. మేం పోరాడతాం. గెలుస్తాం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం’’ అని అన్నారు. బీజేపీ వారెప్పుడూ సమస్యల గురించి, ప్రజల గురించి మాట్లాడరని, తమ నేతను ప్రధానిని చేస్తే చాలు అన్ని సమస్యలూ పరిష్కారమైపోతాయని చెబుతుంటారని దుయ్యబట్టారు. -
బాధ్యతారాహిత్యమే కారణం: మోడీ
ప్రభుత్వ విధానాల వల్లనే ఈ ఆర్థిక దుస్థితి యూపీఏపై నరేంద్ర మోడీ ధ్వజం గాంధీనగర్/అహ్మదాబాద్: ప్రస్తుత ప్రభుత్వ బాధ్యతారాహిత్యమే దేశ ఆర్థిక దుర్దశకు ప్రధాన కారణమని బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఆరోపించారు. బాధ్యత తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేకపోవడం వల్లనే దేశంలో నిరాశ అలముకుని ఉందన్నారు. ‘ఇక్కడే నాయకత్వ ప్రాధాన్యత కనిపిస్తుంది. స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అన్నారు. ఫిక్కీ సమావేశంలో బుధవారం మాట్లాడుతూ.. ఆయన యూపీఏ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై విమర్శలు గుప్పించారు. ‘ప్రధానమంత్రి తరచూ సమ్మిళిత అభివృద్ధి అంటుంటారు. విద్య, తదితర అవకాశాలను అందించడం ద్వారా పేదల్లో సామర్థ్యాన్ని పెంపొందించనంతవరకు అదెలా సాధ్యం?’ అని ప్రశ్నించారు. అభివృద్ధిలో సామాన్యుడిని భాగస్వామిని చేయాలని మోడీ సూచించారు. విలువైన ఖనిజాలను ఎగుమతి చేస్తూ పోతే, ఉపాధి అవకాశాలు లభించబోవన్నారు. దేశంలో పారిశ్రామిక అభివృద్ధికి చాలా అవకాశాలున్నప్పటికీ.. ప్రణాళికాలోపం వల్ల సామర్థ్యానికి తగ్గట్లుగా విజయాలు సాధిం చలేకపోతున్నామన్నారు. ప్రజలు, పారిశ్రామిక వర్గాల్లో విశ్వాసాన్ని పాదుకొల్పడం ద్వారానే ఆ పరిస్థితిని అధిగమించవచ్చని పేర్కొన్నారు. ‘అభివృద్ధి కావాలంటే మౌలిక వసతులు కల్పించాలి. మౌలిక వసతులు ఇంధనరంగంపై ఆధారపడి ఉంటాయి. ఇంధనం లభించక పరిశ్రమలు మూతపడ్తున్నాయి. ఇలాంటప్పుడు ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి. ఎవరూ అందుకు ముందుకు రాకపోవడమే బాధాకరం’ అని అన్నారు. వ్యవసాయ, సేవారంగాలు అత్యంత ప్రధానమైనవని, వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మానవ వనరుల అవసరం ఎక్కువగా ఉన్న రక్షణ, రైల్వే రంగాలు తమ అవసరాలకనుగుణంగా సొంతంగా వర్సిటీలను స్థాపించుకోవాలని సూచించారు. తాను సానుకూల దృక్పథం కలిగిన వాడినని చెప్తూ.. సగం నీరున్న గ్లాసును చూపిస్తే.. మిగతా సగం ఖాళీగా లేదని, గాలితో నిండి ఉందని చెబుతానన్నారు. తన వ్యక్తిత్వం గురించి చెబుతూ.. ‘పాట్నా పేలుళ్ల సమయంలో మీరెందుకు పారిపోలేదని కొందరు అడిగారు. పారిపోయే వాడే అయితే మోడీ అసలు జన్మించకపోయేవాడు అని వారికి చెప్పాను’ అన్నారు. -
నరేంద్ర మోడీకి అహ్మదాబాద్ కోర్టులో ఊరట
అహ్మదాబాద్:2002 అల్లర్ల కేసులో బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి అహ్మదాబాద్ కోర్టులో ఊరట లభించింది. మోడీకి వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్ ను అహ్మదాబాద్ కోర్టు తోసి పుచ్చింది. దీనిపై ఎహసాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ కోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అల్లర్లకు సంబంధించి సిట్ క్లీన్చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేసిన జకియా అహ్మదాబాద్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు సిట్ నిర్ణయాన్ని సమర్ధించింది. ఫిబ్రవరి 28వ తేదీన జరిగిన అల్లర్లలో మరణించిన 68 మందిలో కాంగ్రెస్ ఎంపీ ఎహసాన్ జాఫ్రీ ఒకరు. -
కాంగ్రెస్ నాపై సీబీఐని ఉసిగొల్పుతోంది: నరేంద్ర మోడీ
బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అధికార కాంగ్రెస్ పార్టీపై దాడిని ముమ్మరం చేశారు. కేంద్ర ప్రభుత్వం తనను లక్ష్యంగా చేసుకుని సీబీఐని ఉసిగొల్పుతోందని ఆరోపించారు. సోమవారం ఇక్కడ జరిగిన సమావేశంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తూ.. ఇలాంటి బెదిరింపులకు తాను బయపడనని చెప్పారు. తాము అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని కేంద్రం భావిస్తోందని విమర్శించారు. తమను బయపెట్టేందుకు సీబీఐని దుర్వినియోగం చేస్తోందన మండిపడ్డారు. ములయాం సింగ్ యాదవ్, మాయావతి కేసుల్లో మౌనంగా ఉన్న సీబీఐ తన విషయంలో మరోలా వ్యవహరిస్తోందని మోడీ ఆరోపించారు. సీబీఐ, ఐబీ రాకే కాదు ప్రపంచంలోని ఏ దర్యాప్తు సంస్థకూ తాను బయపడనని వ్యాఖ్యానించారు. ప్రజల కష్టసుఖాల్లో అండగా ఉన్న పార్టీలనే ఆదరిస్తారన్నారు. మోడీ ప్రసంగానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. -
ఆర్టీఐ, సోషల్ మీడియాలతో కాంగ్రెస్ గద్దె దించండి: మోడీ
కాంగ్రెస్ పాలనలో అటు కేంద్రంలో, ఇటు ఆ పార్టీ అధికారంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు అవినీతిలో కురుకుపోయాయని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఆరోపించారు. బుధవారం సాయంత్రం తిరువనంతపురంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులతో మోడీ సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారి ఉద్దేశించి ప్రసంగిస్తూ... తొమ్మిదేళ్ల పాలనలో ఆ పార్టీ అవినీతి భాగోతాన్ని దేశ ప్రజలకు వివరించేందుకు బీజేపీ శ్రేణులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అవినీతిని వెలుగులోకి తీసుకువచ్చేందుకు సమాచార హక్కు (ఆర్టీఐ), సామాజిక అనుసంధాన వేదిక (సోషల్ మీడియా)ను ప్రచార అస్త్రాలుగా ఉపయోగించుకోవాలని వారికి మోడీ సూచించారు. ప్రజలకు చేరువ అయ్యేందుకు ఆ రెండు అత్యుత్తమైన ప్రచార సాధనాలని మోడీ అభివర్ణించారు. కుంభకోణాలమయమైన కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. దేశ ప్రజలకు మిగిలిన ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీనే అని శ్రేణులకు మోడీ వివరించారు. 2014లో జరగనున్న ఎన్నిల ద్వారా అధికారంలోకి వచ్చేందుకు బీజేపీకి ఇదే సరైన సమయం అని ఆయన వారితో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వి.మురళీధరన్, సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి ఒ.రాజగోపాల్, పార్టీ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ తదితరులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. -
మోడీకి మద్దతు ఇస్తాం: శివసేన
దేశ ప్రధాని అభ్యర్థిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని భారతీయ జనతాపార్టీ ఎంపిక చేస్తే తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని శివసేన శుక్రవారం ముంబయిలో వెల్లడించింది. ప్రధాన పదవికి బీజేపీ ఎవరిని ఎంపిక చేసిన తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. శుక్రవారం ముంబయిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో శివసేన పార్టీ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్ ఈ విషయాన్ని తెలిపారు. గత అర్థరాత్రి తమ పార్టీ అధినేత ఉద్దవ్ ఠాక్రే, గుజరాత్ సీఎం నరేంద్రమోడీ మధ్య ఫోన్లో ఆ అంశంపై సుధీర్ఘంగా చర్చ జరిగినట్లు ఆయన వివరించారు. అయితే ఆ ఇద్దరు నేతల మధ్య వచ్చిన సంభాషణలను వెల్లడించేందుకు నిరాకరించారు. 2017 వరకు తాను గుజరాత్ సీఎంగా ఉంటానని ఇటీవల నరేంద్రమోడీ చేసిన బహిరంగ ప్రకటనపై గత శనివారం శివసేన పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో వచ్చిన విషయాన్ని విలేకర్లు ఈ సందర్బంగా సంజయ్కు గుర్తు చేశారు. కాగా ఆ అంశంపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. ఆ అంశం బీజేపీ అంతర్గత విషయంగా సంజయ్ వ్యాఖ్యానించారు. అయితే ఇప్పటి వరకు బీజేపీ ప్రధాని అభ్యర్థిగా సుష్మాస్వరాజ్ను ఎంపిక చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్లు ఊహగానాలు ఊపందుకున్న విషయం తెలిసిందే. -
మోడీపై రాణే విమర్శనాస్త్రాలు
ముంబై: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ అబద్ధాలకోరు అంటూ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్ రాణే విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి అంతా ఉత్తిత్తిదేనన్నారు. గుజరాత్ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందంటూ మోడీ చెబుతున్నారని, అయితే మహారాష్ట్రతో పోలిస్తే అది ఏ రంగంలోనూ ముందులేదన్నారు. మహారాష్ర్ట జీడీపీ రూ. 12 లక్షల కోట్లని, గుజరాత్లో అది రూ. 6 లక్షల కోట్లు మాత్రమేనన్నారు. ఇక వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి విషయంలో బీజేపీ గుంభనంగా వ్యవహరిస్తోందని, అయితే ప్రతి ఎన్నికల సమయంలోనూ వారు ప్రధాని అభ్యర్థి విషయంలోనే తీవ్రంగా పోటీపడతారన్నారు. అరుణ్జైట్లీ, సుస్మాస్వరాజ్లు కూడా ప్రధాని అభ్యర్థి రేసులో ఉన్నారన్నారు. గోపీనాథ్ ముండేని అడిగినా తాను బరిలో లేననే చెబుతారన్నారు. బీజేపీ అంతర్గత పోరు తమ పార్టీకి లాభి స్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతఃకలహాలను విడనాడి సమష్టిగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. 2014 లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో అత్యధికస్థానాలను కైవసం చేసుకునేందుకు పాటుపడాలన్నారు. బీఎంసీలో శివసేన పనితీరు ఎంతమాత్రం బాగాలేదన్నారు. ముంబైని షాంఘై న గరంగా మార్చడం వారి తరం కాదన్నారు. -
జనభేరి
ఆదివారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం కాషాయవర్ణమైంది. ‘యువభేరి’కి యువత హోరెత్తింది. వెల్లువలా తరలివచ్చిన జనంతో స్టేడియం కిక్కిరిసింది. ఆదివారం నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో ‘నవభారత యువభేరి’ జరిగింది. గుజరాత్ సీఎం నరేంద్రమోడీ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆయన ప్రసంగం వినేందుకు జనం ఆసక్తి చూపారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ‘నవభారత యువభేరి’ సభకు హాజరైన జనం.. వారిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న మోడీ ‘నవభారత యువభేరి’ సభకు హాజరైన జనం.. వారిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న మోడీసుస్వాగతం: ఆదివారం ఉదయం బేగంపేట విమానాశ్రయంలో మోడీ అభివాదంకేశవ్ మెమోరియల్ ఐటీలో మోడీ చిత్రపటాన్ని ఆయనకే బహూకరిస్తున్న విద్యార్థిని సభకు హాజరైన జనం.. వారిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న మోడీ సభకు హాజరైన యువతులు మోడీ. వేదికపై దత్తాత్రేయ, వెంకయ్యనాయుడు, కిషన్రెడ్డిఆదివారం హైదరాబాద్లో కేశవ్ స్మారక పాఠశాలలో సర్దార్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న గుజరాత్ సీఎం నరేంద్రమోడీ స్టేడియంలో మహిళల నృత్యాలు... యువభేరీ సభలో పాల్గొనేందుకు పంజాబ్ నుంచి వచ్చిన మేరీబెల్ను వేదికపైకి ఆహ్వానించి పాదాభివందనం చేస్తున్న మోడీ. చిత్రంలో పార్టీ నేతలు కె.లక్ష్మణ్, దత్తాత్రేయ తదితరులు స్టేడియం నిండిపోవడంతో బయట ఏర్పాటు చేసిన తెరపై మోడీ ప్రసంగం చూస్తూ...మోడీని కలిసిన ఆర్.కృష్ణయ్య, మందకృష్ణ మాదిగ. చిత్రంలో యెండల, వెంకయ్య తదితరులు సాంస్కృతిక ప్రదర్శనలో యువత... యువత కేరింత... ఎ గేట్ వద్ద తొక్కిసలాట... వివేకానందుడి వేషధారణలో చిన్నారి సభా ప్రాంగణంలో కాషాయజెండా రెపరెపలు వెళ్లొస్తా...: ఆదివారం రాత్రి బేగంపేట విమానాశ్రయంలో తిరుగుప్రయాణంలో... -
యువభేరికి తరలిన జిల్లా నాయకులు
ఆదిలాబాద్ టౌన్, న్యూస్లైన్ : గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార సారథి నరేంద్ర మోడీ హాజరైన యువభేరి కార్యక్రమానికి జిల్లా నుంచి దాదాపు 20 వేల మందికి పైగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆదివారం తరలివెళ్లారు. హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియంలో జరిగిన యువభేరి సభకు ఆదిలాబాద్ నుంచి పలు ప్రత్యేక వాహనాల్లో వందల సంఖ్యలో ప్రజలను ఆ పార్టీ నాయకులు తరలించారు. కార్యక్రమానికి వెళ్లిన వారిలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రాజేశ్వర్, నాయకులు జనగం సంతోష్, మటోలియ, గందే కృష్ణకుమార్, విజయ్కుమార్, గన్నోజి కృష్ణకుమార్, వేణుగోపాల్, జోగు రవి, సురేష్జోషి, నారాయణరెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రాజేశ్వర్ మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని పేర్కొన్నారు. అధిక ధరల కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. కేంద్ర మంత్రులు కుంభకోణాల్లో కూరుకపోయి అవినీతిమయంగా మారుతున్నారని ఆరోపించారు. 2014లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నరేంద్రమోడీని ప్రజలు పీఎంగా చూడాలనుకుంటున్నారని పేర్కొన్నారు. నిర్మల్, ఖానాపూర్ నుంచి జిల్లా నాయకులు, కార్యకర్తలు సుమారు 12వేల మంది తరలివెళ్లారు. భైంసా నుంచి మోడీ సభకు జిల్లా ఉపాధ్యక్షుడు విజయ్కుమార్ ఆధ్వర్యంలో 2వేల మంది కార్యకర్తలు హైదరాబాద్ తరలివెళ్లారు -
మోడీని కలిసిన తెలుగు సినీ ప్రముఖులు.
-
మోడీని కలిసిన తెలుగు సినీ ప్రముఖులు
-
హైదరాబాద్ చేరుకున్న మోడి
-
హైదరాబాద్ చేరుకున్న నరేంద్ర మోడీ
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ఉదయం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. బీజేపీ నేతలు కిషన్రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డిలతోపాలు పలువురు ప్రముఖులు మోడీకి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన నగరంలోని పార్క్హయత్ హోటల్ చేరుకున్నారు. నగరంలోని ఎల్ బీ స్టేడియంలో ఈ రోజు మధ్నాహ్నం జరగనున్న నవభారత్ యువభేరి సదస్సులో మోడీ పాల్లొని ప్రసంగించనున్నారు. దేశంలో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ ప్రచార కమిటీ సారథ్య బాధ్యతలను భారతీయ జనతాపార్టీ అధిష్టానం మోడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసేందుకు దేశావ్యాప్తంగా వివిధ నగరాల్లో మోడీ 100 సభల్లో పాల్గొనున్నారు. అందులోభాగంగా హైదరాబాద్లో ఈ రోజు ఏర్పాటు చేసిన నవభారత్ యువభేరి సభ మొట్టమొదటిది. నారాయణగూడలోని కేశవ మెమోరియల్ విద్యాసంస్థల ప్రాంగణంలో సర్దార్ పటేల్ విగ్రహావిష్కరణలో పాల్గొనే నరేంద్ర మోడీ విద్యార్థులు, మేధావులతో భేటీ అవుతారు. స్టేడియంలో సదస్సు అనంతరం నేరుగా ఆయన అక్కడకు వెళతారు. 15 మంది పీఠాధిపతులు, మరికొంతమంది సాధువులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపి ఆశీర్వాదం తీసుకుంటారని తెలిసింది. -
మోడీ పర్యటనకు చకచక ఏర్పాట్లు