high court
-
Kurnool Bench: హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ విచారణకు స్వీకరించిన కోర్టు
-
AP High Court: న్యాయం అందరికీ ఒకటే..
-
ఫుటేజీలు మాయమైపోతుంటే ఐజీ, ఎస్సీలు ఏం చేస్తున్నట్లు?
-
పోలీసులకు మా ఆదేశాలంటే.. గౌరవం లేదు: హైకోర్టు
-
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
-
బీఆర్ఎస్ నల్లగొండ రైతు దీక్షకు హైకోర్టు అనుమతి
-
దోషి సంజయ్ రాయ్ కు మరణశిక్ష విధించాలంటూ దీదీ సర్కార్ పిటిషన్
-
నేడు కేటీఆర్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ
-
సినిమా టికెట్ ధరలు, ప్రత్యేక షోలపై హైకోర్టులో విచారణ
-
మరోసారి హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్
-
కేటీఆర్ కు మూడు ఆప్షన్స్!
-
కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై ఉత్కంఠ..
-
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై హైకోర్టు ఆగ్రహం
-
మోహన్బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత!
-
చీఫ్ కోర్టులో లంచ్ మోషన్ వేసిన కేటీఆర్ న్యాయవాదులు
-
ఏపీ హైకోర్టులో సజ్జల భార్గవ్ రెడ్డి క్వాష్ పిటిషన్లపై విచారణ
-
High Court: భార్గవ్ రెడ్డిపై చర్యలోద్దు..
-
పర్సనల్ బాండ్ తీసుకుని విడుదల చేయాలని ఆదేశం
-
క్వాష్ పిటిషన్ పై విచారణ సాయంత్రం 4 గంటలకు వాయిదా
-
ఏపీ హైకోర్టు కీలక తీర్పు
-
AP: హెల్మెట్ నిబంధన అమలు చేయకపోవడంపై ఆగ్రహం
-
హైకోర్టులో సోషల్ మీడియా యాక్టివిస్ట్ వెంకటరామిరెడ్డి పిటిషన్
-
మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు: RGV
-
High Court: కథనాలు, పోస్టులు తొలగించే వ్యవహారంలో నోటీసులు
-
జగన్ పరువు నష్టం దావాపై స్పందించిన ఢిల్లీ హైకోర్టు
-
ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఢిల్లీ హైకోర్టు సమన్లు
-
ఆర్జీవీపై ముందస్తు బెయిల్ పిటిషన్పై రేపు విచారణ
-
TG Highcourt: ఏటూరు నాగారం ఎన్కౌంటర్పై హైకోర్టు తీర్పు
-
చెక్ బౌన్స్ కేసు.. అనిత పిటిషన్పై హైకోర్టు అసంతృప్తి
-
వారిపై సెక్షన్ 111 వర్తించదు: పొన్నవోలు
-
ఏపీ హైకోర్టులో రాంగోపాల్ వర్మకు ఊరట
-
తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై హైకోర్టు తీర్పు
-
హైకోర్టులో వర్రా రవీందర్ రెడ్డి హెబియస్ కార్పస్ పిటిషన్ పై విచారణ
-
రాజ్ తరుణ్పై లావణ్య కేసు.. హైకోర్టు కీలక నిర్ణయం!
టాలీవుడ్లో సంచలనంగా మారిన లావణ్య కేసులో టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్కు బిగ్ రిలీఫ్ దక్కింది. ఈ కేసులో రాజ్ తరుణ్కు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. లావణ్యతో రాజ్ తరుణ్కు పెళ్లి జరిగినట్లు ఆధారాలు లేక పోవడంతో బెయిలిచ్చింది. ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారని రాజ్ తరుణ్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.కాగా.. తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి హైదరాబాద్లోని నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్తో దాదాపు 11 ఏళ్ల పాటు రిలేషన్లో ఉన్నట్లు వెల్లడించింది. రాజ్ తరుణ్ తన భర్త అని చాలాసార్లు మీడియా ముందు మాట్లాడింది. నాకు భర్త కావాలి అంటూ ఇటీవల ప్రసాద్ ల్యాబ్ వద్ద హల్చల్ చేసింది. అయితే రాజ్ తరుణ్ సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా.. రాజ్ తరుణ్ ఇటీవలే ‘పురుషోత్తముడు’, ‘తిరగబడరసామీ’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. -
కేసీఆర్ పిటిషన్పై ‘సుప్రీం’లో విచారణ..పాస్ ఓవర్ కోరిన న్యాయవాది
సాక్షి,ఢిల్లీ: కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు ఇవాళ (జులై 15) విచారణ చేపట్టింది. అయితే విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో కేసీఆర్ తరుపు న్యాయవాది మోహిత్ రావు పాస్ ఓవర్ కోరారు. దీంతో ఇతర కేసులు ముగిసిన తర్వాత కేసీఆర్ పిటిషన్ను అత్యున్నత న్యాయ స్థానం విచారణ చేపట్టనుంది.గతంలో ఈ విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలని కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. దీంతో తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అత్యున్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు మాజీ సీఎం కేసీఆర్. మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై.చంద్ర చూడ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేసీఆర్ తరుపు న్యాయవాది మోహిత్ రావు పాస్ ఓవర్ కోరారు. -
ఏడేళ్ల తర్వాత సవాల్ చేస్తారా?
సాక్షి, హైదరాబాద్: పలు ఫిల్మ్ సిటీలకు ప్రభుత్వ భూ కేటాయింపు సమర్థనీయమైనప్పుడు.. ఆనంద్ సినీ సర్వీసెస్కు ఇవ్వడం తప్పెలా అవుతుందని పిటిషనర్, మాజీ మంత్రి హరీశ్రావును హైకోర్టు ప్రశ్నించింది. అలాగే 2001లో తొలిసారి జీవో జారీ చేస్తే.. 2008లో సవాల్ చేయడం సరికాదని, ఆలస్యానికి కారణాలు కూడా తెలుపలేదని వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్లో ఎలాంటి మెరిట్స్ కనిపించనందున కొట్టివేస్తున్నామని స్పష్టం చేసింది. 2001, ఆగస్టు 21న సాధారణ పరిపాలన (ఐఅండ్పీఆర్) విభాగం జీవో 355ను జారీ చేసింది. హైదరాబాద్ షేక్పేట్లోని సర్వే నంబర్ 403లో 5 ఎకరాల భూమిని ఆనంద్ సినీ సర్వీసెస్కు ఎకరం రూ.8,500లకు కేటాయించాలని ఏపీ రాష్ట్ర ఫిల్మ్, టీవీ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్డీసీ)కు ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత ఎందుకో భూమి అప్పగింతను నిలిపివేస్తూ ప్రభుత్వం ఏపీఎస్ఎఫ్డీసీకి లేఖ రాసింది. వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం వచ్చాక డిసెంబర్, 2008లో మరో జీవో 744ను జారీ చేసి.. భూమిని అప్పగించింది. ఈ రెండు జీవోలను సవాల్ చేస్తూ మాజీ మంత్రి హరీశ్రావు 2008లో పిటిషన్ దాఖలు చేశారు. భూ కేటాయింపు చట్టవిరుద్ధమని, జీవోలను కొట్టివేయడంతో పాటు ఈ అంశంపై విచారణ జరిపించాలని కోరారు.ఈ పిటిషన్పై జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్కుమార్ జూకంటి ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఏపీఎస్ఎఫ్డీసీకి 1982లో ప్రభుత్వం 50 ఎకరాలు కేటాయించింది. అలాగే పద్మాలయా స్టూడియోకు 9.5 ఎకరాలు, సురేశ్ ప్రొడక్షన్స్కు 5 ఎకరాలతో పాటు ఆనంద్ సర్వీసెస్కు కూడా 5 ఎకరాలు కేటాయించారు. దీన్ని సవాల్ చేస్తూ 2004లో దాఖలైన పిల్ను హైకోర్టు కొట్టివేసింది.ఇది సినీ రంగ అభివృద్ధికి 1982లో ప్రభుత్వం తీసుకువచ్చిన ఓ అద్భుతమైన పాలసీ. 2011లోనూ పలు పిటిషన్లు డిస్మిస్ అయ్యాయి. సుప్రీంకోర్టు కూడా ఈ పిటిషన్లను కొట్టివేసింది. అంతేకాదు దర్శకుడు ఎన్.శంకర్కు 5 ఎకరాల కేటాయింపును ఇదే హైకోర్టు సమర్థించింది’ అని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. జీవో ఇచ్చిన ఏడేళ్ల తర్వాత పిటిషన్ వేయడం సరికాదని స్పష్టం చేసింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం విచక్షణాధికారాన్ని వినియోగించుకుని జాప్యానికి కారణం లేనందున ఈ పిటిషన్ను కొట్టివేస్తున్నామని తెలిపింది. -
‘కీచక న్యాయం’పై కొరడా!
ఎన్ని చట్టాలున్నా, ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటున్నా మహిళలకు వేధింపులు తప్పడం లేదని తరచు రుజువవుతూనే వుంది. ఆఖరికి న్యాయదేవత కొలువుదీరే పవిత్ర స్థలం కూడా అందుకు మినహాయింపు కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్కు ఉత్తర ప్రదేశ్లోని బాందా జిల్లా మహిళా సివిల్ జడ్జి రాసిన బహిరంగ లేఖ స్పష్టం చేస్తోంది. జిల్లా జడ్జి, ఆయన అనుచరుల నుంచి ఆమె ఎదుర్కుంటున్న వేధింపులు ఎలాంటివో, అవి ఎంత ఆత్మ న్యూనతకు లోనయ్యేలా చేశాయో మహిళా జడ్జి వాడిన పదజాలమే పట్టిచూపుతోంది. ‘నన్నొక వ్యర్థపదార్థంగా చూస్తున్నారు. పురుగుకన్నా హీనంగా పరిగణిస్తున్నారు’ అని అన్నారంటే ఆమె వేదనను అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు... ‘గత ఏడాదిన్నరగా నడిచే శవంగా బతుకీడుస్తున్నాను. ఇక జీవరహితమైన ఈ కాయాన్ని కొనసాగించలేను. ఆత్మహత్యకు అనుమతించండి’ అని కూడా ఆమె రాశారు. ‘మీరంతా ఆటబొమ్మగా, ప్రాణరహిత పదార్థంగా మారటం నేర్చుకోండి’ అని మహి ళలనుద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. తనను రాత్రిపూట ఒంటరిగా కలవమంటూ వేధిస్తున్నారని మొన్న జూలైలో ఆమె చేసిన ఫిర్యాదుపై హైకోర్టులోని అంతర్గత ఫిర్యాదుల కమిటీ విచారించింది. కానీ కింది ఉద్యోగులు ధైర్యంగా సాక్ష్యం చెప్పాలంటే ఆ జడ్జిని విచారణ సమయంలో బదిలీ చేయాలన్న వినతిని పట్టించుకున్నవారు లేరు. దీనిపై సుప్రీంకోర్టులో రిట్ దాఖలు చేస్తే ఈ దశలో జోక్యం చేసుకోలేమంటూ ధర్మాసనం తోసిపుచ్చటం ఆమె తట్టుకోలేక పోయారు. నిరుడు దేశవ్యాప్తంగా మహిళలపై 4.45 లక్షల నేరాలు చోటు చేసుకున్నాయని జాతీయ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక చెబుతోంది. లైంగిక నేరాలకు సంబంధించి సగటున ప్రతి 51 నిమిషాలకూ ఒక ఎఫ్ఐఆర్ నమోదవుతున్నదని ఆ నివేదిక వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ 65,473 కేసులతో మొదటి స్థానంలో వుంటే మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ ఆ తర్వాత స్థానాల్లో వున్నాయి. పనిచేసే చోట మహిళలను వేధించటంలో ఢిల్లీ అగ్రస్థానంలో వుంది. నిజానికి వాస్తవ ఘటనలతో పోలిస్తే కేసుల వరకూ వెళ్లే ఉదంతాలు తక్కువనే చెప్పాలి. అందరి దృష్టిలో పడతామని, ఉపాధి కోల్పోతామని, ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు ప్రతీకారానికి దిగొచ్చని భయపడి చాలామంది ఫిర్యాదు చేయటానికి వెనకాడతారు. ఈ వేధింపుల పర్యవసానంగా చాలామంది మహిళలు ఆత్మాభిమానం దెబ్బతిని, మానసిక క్షోభకు లోనయి వృత్తిపరంగా ఎదగలేని నిస్సహా యస్థితిలో పడుతున్నారు. ఇలాంటì కేసులు తమముందు విచారణకొచ్చినప్పుడు నేరగాళ్లను కఠి నంగా శిక్షించి, బాధితులకు ఉపశమనం కలగజేయాల్సిన చోటే... మహిళా న్యాయమూర్తులకు వేధింపులుంటే ఇంతకన్నా ఘోరమైన స్థితి ఉంటుందా? నిజానికి న్యాయవ్యవస్థలో లైంగిక వేధింపులుంటున్నాయని ఆరోపణలు రావటం ఇది మొదటిసారేమీ కాదు. సాక్షాత్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులపైనే ఫిర్యాదులొచ్చిన సందర్భా లున్నాయి. ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తరుణ్ గొగోయ్పై 2019లో ఒక మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేసినప్పుడు ఆమెను మొదట బదిలీ చేసి,ఆ తర్వాత సర్వీసునుంచి తొలగించి చివరకు చీటింగ్ కేసు కూడా పెట్టారు. గొగోయ్ పదవీ విరమణ చేశాక ఆ మహిళకు తిరిగి ఉద్యోగం లభించింది. జస్టిస్ గొగోయ్కి మాత్రం ఏం కాలేదు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లా అదనపు సెషన్స్ జడ్జిగా పనిచేసిన మహిళ కూడా ఇలాంటిస్థితినే ఎదుర్కొన్నారు. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి తనను వేధించిన తీరు గురించి ఆమె ఫిర్యాదు చేశారు. తన గోడు అరణ్యరోదన కావటంతో గత్యంతరం లేక 2014లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆయన వేధింపులు ఎలావుండేవో సోదాహరణంగా వివరించారు కూడా. ‘నీ పని తీరు చాలా బాగుంది. నీ అందం మరింత బాగుంది’ అనటం, ఒక శుభకార్యంలో నృత్యం చేయాలంటూ భార్యతో ఫోన్ చేయించటం, ‘ఒంటరిగా ఓసారి నా బంగ్లాకు రా’ అని ఫోన్ చేయటం తేలిగ్గా కొట్టిపారేయదగ్గ ఆరోపణలు కాదు. కానీ విషాదమేమంటే ఆ ఫిర్యాదుకు అతీగతీ లేక పోయింది. ఆ న్యాయమూర్తి నిక్షేపంగా తన పదవీకాలం పూర్తిచేసుకున్నారు. ఆయన రిటైర్ కావటంతో తిరిగి ఉద్యోగం ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో ఆమె 2018లో పిటిషన్ పెట్టుకున్నారు. చివరకు ఆ మహిళా జడ్జి స్వచ్ఛందంగా రాజీనామా చేయలేదని సర్వోన్నత న్యాయస్థానం నిర్ధారించుకుని నిరుడు ఉద్యోగంలో చేరడానికి అనుమతించింది. చదువూ సంస్కారం లేనివాళ్లూ, జులాయిలుగా తిరిగేవాళ్లూ మహిళలపై, బాలికలపై వేధింపులకు దిగుతారనే అపోహ వుంది. కానీ పెద్ద చదువులు చదువుకుని, ఉన్నత పదవులు వెలగబెడు తున్న వారిలో కొందరు ఆ తోవలోనే ఉంటున్నారని అప్పుడప్పుడు వెల్లడవుతూనే వుంది. ఇలాంటి కేసుల్లో అసహాయ మహిళలకు ఆసరాగా నిలవాల్సిన మహిళా న్యాయమూర్తులకు సైతం వేధింపులుంటే ఇక దిక్కెవరు? కాలం మారింది. యువతులు చదువుల్లో ఎంతో ముందుంటున్నారు. ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తున్నారు. వేరే వృత్తి ఉద్యోగాలను కాదనుకుని న్యాయవ్యవస్థ వైపు వచ్చే వారిలో చాలామంది సమాజానికి ఏదో చేద్దామన్న సంకల్పంతో వస్తారు. అలాంటి వారికి సమస్య లుండటం దురదృష్టకరం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ఆ మహిళా జడ్జి లేఖపై వెనువెంటనే స్పందించటం, అలహాబాద్ హైకోర్టు నుంచి నివేదిక కోరటం హర్షించదగ్గ అంశం. గతంలో మాదిరి కాక దోషులపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తే తప్ప ఈ కీచకపర్వం ఆగదు. -
ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ల పై ఏపీ హైకోర్టు సీజే ధర్మాసనం తీర్పు
-
'టైగర్ నాగేశ్వరరావు' రియల్ స్టోరీ.. ఇంతకీ అతడెవరో తెలుసా?
'టైగర్ నాగేశ్వరరావు'.. ఇప్పటి జనరేషన్కి పెద్దగా తెలియని పేరు. మహా అయితే స్టువర్టుపురం గజదొంగ అని తెలిసి ఉంటుందేమో! ఇతడి జీవితం ఆధారంగా తెలుగులో ఓ సినిమా తీశారు. రవితేజ హీరోగా 'టైగర్ నాగేశ్వరరావు' పేరుతోనే దీన్ని థియేటర్లలో రిలీజ్ చేశారు. పాజిటివ్ టాక్ కూడా వచ్చింది. ఇంతకీ 'టైగర్ నాగేశ్వరరావు' ఎవరు? ఆయన మంచోడా? చెడ్డోడా? ఎవరీ నాగేశ్వరరావు? విజయవాడ-చెన్నై రూట్లో బాపట్లకు దగ్గర్లో స్టువర్టుపురం అనే ఊరు ఉంటుంది. అప్పట్లో అంటే 1874 టైంలో దొంగల్ని, ఇతర నేరాలు చేసే వాళ్లపై నిఘా పెట్టేందుకు.. వాళ్లందరినీ తీసుకొచ్చి ఈ ఊరిలో నివాసం కల్పించారు. అలా దొంగతనాలు చేసుకునే కుటుంబంలో 1953-56 మధ్యలో నాగేశ్వరరావు పుట్టాడు. ఇతడికి ఇద్దరు అన్నలు ప్రసాద్, ప్రభాకర్. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో ప్రసాద్, ప్రభాకర్ దొంగతనాలు చేసేవారు. (ఇదీ చదవండి: టైగర్ నాగేశ్వరరావు టీజర్పై హైకోర్టు అసహనం) అలా దొంగగా మారి అయితే ఓ సారి ప్రభాకర్ ఆచూకీ కోసం ప్రయత్నించి విఫలమైన పోలీసులు.. నాగేశ్వరరావుని స్టేషన్కి తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారు. చేయని నేరానికి చిత్రవధ అనుభవించిన ఇతడు.. తండ్రి, అన్నల బాటలో అది కూడా 15 ఏళ్లకే దొంగగా మారాడు. 1970లో తమిళనాడుకు వెళ్లిపోయి మారుపేర్లతో దొంగతనాలు చేశాడు. అన్న ప్రభాకర్ జైలు నుంచి బయటకొచ్చాక, అతడి గ్యాంగ్లో చేరిపోయాడు. చెప్పి మరీ దొంగతనాలు ఓసారి ఈ అన్నదమ్ముల్ని తమిళనాడులో తిరువళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. తనని చిత్రహింసలు పెడితే రెండు రోజుల్లో జైలు నుంచి పారిపోతానని.. నాగేశ్వరరావు సవాలు విసిరాడు. అన్న చెప్పినా సరే వినకుండా అలానే రెండు రోజుల తర్వాత జైలులో పోలీసులని కొట్టి మరీ పరారయ్యాడు. 'వచ్చే నెల మద్రాసులో దొంగతనం చేస్తాను, దమ్ముంటే పట్టుకోండి' అని సవాలు విసిరి మరీ దొంగతనాలు చేశాడు. దీంతో నాగేశ్వరరావు కాస్త టైగర్ నాగేశ్వరరావుగా మార్మోగిపోయాడు. (ఇదీ చదవండి: 'జైలర్' విలన్పై లైంగిక వేధింపుల ఆరోపణలు) 15 ఏళ్లపాటు దొంగతనాలు పోలీసుల తీరు వల్ల దొంగగా మారిన టైగర్ నాగేశ్వరరావు.. దాదాపు 15 ఏళ్లపాటు ఆంధ్రా, తమిళనాడు, కర్ణాటకలో దొంగతనాలు, దోపీడీలకు పాల్పడ్డాడు. పోలీసులని ముప్పతిప్పలు పెట్టాడు. 1974లో బనగానపల్లె బ్యాంకు దోపీడీ అయితే వేరే లెవల్. పోలీసు స్టేషన్ దగ్గరే ఉన్న ఆ బ్యాంక్ని నాగేశ్వరరావు ముఠా కొల్లగొట్టింది. మత్తు మందు ఇచ్చి అయితే నాగేశ్వరరావు వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డ పోలీసులు.. అతడిని ఎలా అయినాసరే మట్టుబెట్టాలని ఓ మహిళతో కలిసి అతడిని చంపడానికి ప్లాన్ చేశారు. అలా 1980 మార్చి 24న తెల్లవారుజామున.. ఆ మహిళ ఇంటికి వచ్చిన నాగేశ్వరరావు మత్తుమందు కలిపిన పాలు తాగాడు. అలా నిద్రపోతుండగా పోలీసులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. తర్వాత దాన్ని ఎన్కౌంటర్గా మార్చేశారు. (ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవి రాఖీ సెలబ్రేషన్స్) దొంగనే కానీ మంచోడు అయితే స్టువర్టుపురం గజదొంగగా పేరు మోసిన టైగర్ నాగేశ్వరరావు.. పెద్దోళ్ల దోచుకున్నదంతా పేదలకు పంచిపెట్టేవాడు. చదువు, పెళ్లి, వైద్యం లాంటిది ఏదైనా సరే అవసరానికి మించిన సహాయం చేసేవాడు. అయితే ఎన్ని దొంగతనాలు, దోపీడీలు చేసినా సరే మహిళల పట్ల ఏనాడు అసభ్యంగా ప్రవర్తించలేదు. ఈ విషయాన్ని స్వయంగా అతడి అన్నయ్య ప్రభాకర్.. ఓ సందర్భంలో చెప్పాడు. (ఇదీ చదవండి: హీరోయిన్తో ఐఆర్ఎస్ అధికారి రిలేషన్.. గిఫ్ట్గా బంగారం, భవనాలు) -
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలపై హైకోర్టులో విచారణ
-
ట్రాన్స్జెండర్లను గౌరవించాలి
ఖలీల్వాడి: ట్రాన్స్జెండర్లను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీసుధ అన్నారు. శనివారం జిల్లా కోర్టు భవన సముదాయంలో న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ట్రాన్స్జెండర్లు, సెక్స్ వర్కర్లకు పోస్టల్ శాఖ ద్వారా అమలవుతున్న గ్రూప్ యాక్సిడెంటల్ పాలసీ బాండ్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడారు. ట్రాన్స్జెండర్ల సమస్యలను చిత్రీకరిస్తూ అష్ట గంగాధర్ రూపొందించిన వీడియోతో కూడిన పాటను ఆవిష్కరించారు. జస్టిస్ శ్రీసుధ మాట్లాడుతూ ట్రాన్స్జెండర్ల పట్ల వివక్ష చూపడం తగదన్నారు. వారికి అన్ని రంగాల్లో అవకాశాలు లభించేలా కృషి చేయాలన్నారు. పోస్టల్ శాఖ ద్వారా కేవలం రూ.399 ప్రీమియంతో రూ.10 లక్షల ప్రమాద బీమాతో పాటు అనేక ప్రయోజనాలు ఉంటాయన్నారు. గ్రూప్ యాక్సిడెంటల్ పాలసీ గార్డ్ను ట్రాన్స్జెండర్లు, సెక్స్ వర్కర్లకు అందించడం అభినందనీయమన్నారు. దీనికి సహకరించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులను ప్రశంసించారు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనాలు అందిస్తున్న పోస్టల్ ప్రమాద బీమా గురించి ప్రచారం కల్పించాలన్నారు. జిల్లా జడ్జి సునీత మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్లు, సెక్స్ వర్కర్లకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. దాతలు ముందుకు వచ్చి రూ.30 వేలు విరాళం అందించినట్లు తెలిపారు. దీనిని 50 మందికి ప్రీమియం కోసం ఖర్చు చేసినట్లు చెప్పా రు. ఈ కార్యక్రమం అనంతరం హైకోర్టు జడ్జి, న్యాయాధికారులతో భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు. హైకోర్టు జడ్జికి స్వాగతం పలికిన జిల్లా జడ్జి, కలెక్టర్ హైకోర్టు జడ్జి శ్రీసుధ జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు ఆమెకు ఘన స్వా గతం పలికారు. ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద జిల్లా జడ్జి సునీత, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, ట్రెయినీ కలెక్టర్ కిరణ్మయి, నిజామాబాద్ ఆర్డీవో రవి, డీసీపీ(అడ్మిన్)మధుసూదన్ రావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పద్మావతి తదితరులు స్వాగతం పలికారు. ఆమె పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. -
12 మంది ఐఏఎస్, ఐపీఎస్ ల కేటాయింపులపై నేడు హైకోర్టులో విచారణ
-
IAS,IPS బదిలీల విచారణ అత్యవసరంగా చేపట్టాలని తెలంగాణ హైకోర్టును కోరిన కేంద్రం
-
కోర్ట్ లో టిప్పులు.. యూనిఫామ్ పై QR కోడ్..
-
బీజేపీ నేత బీఎల్ సంతోష్ కు ఊరట
-
అమరావతి పాదయాత్రపై సవరణ పిటిషన్లు కొట్టివేత
-
అమరావతి పాదయాత్రపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
సైబరాబాద్ పోలీసుల పిటిషన్ పై హైకోర్టు లో విచారణ
-
జనసేనకు హైకోర్టు షాక్...
-
నవయుగ సంస్థకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ
-
జస్టిస్ ఫర్ శ్రీమతి: పోస్ట్మార్టం పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: తమిళనాడులో సంచలనం సృష్టించిన పాఠశాల విద్యార్థి ఆత్మహత్య కేసుకి సంబంధించి ఘటన జరిగిన మరుసటి రోజే మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థి మృతి నిరశిసిస్తూ మరోసారి పోస్ట్మార్టం నిర్వహించాలని ఆదేశించింది. అంతేగాక అల్లర్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవల్సిందిగా కోర్టు తీర్పు ఇచ్చింది. ఐతే మెడికల్ ప్యానెల్లో తమకు తెలిసిన వైద్యుడిని చేర్చాలన్న తల్లిదండ్రుల అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. దీంతో వారు తమకు తెలిసిన వైద్యుడితోనే శవపరీక్షలు నిర్వహించాలంటూ బాలిక తండ్రి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అంతేగాదు ఈ కేసును అత్యవసరంగా విచారించాలంటూ సుప్రీంకోర్టుని బాలిక కుటుంబం పట్టుబట్టింది. ఐతే ధర్మాసనం రెండోసారి నిర్వహించే పోస్ట్మార్టం పై స్టే ఇచ్చేందుకు నిరాకరిచడమే కాకుండా రేపు విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు తెలిపింది. ఐతే బాలిక తండ్రి తరపు న్యాయవాది రాష్ట్రంలో ఈ విషయమై చాలా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది, పైగా ఈ రోజే పోస్ట్మార్టం ప్రారంభమవుతుంది కాబట్టి దయచేసి దానిపై స్టే విధించండి అంటూ పట్టుబట్టారు. దీనికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ స్పందిస్తూ...‘ఈ అంశాన్ని ఇప్పటికే హైకోర్టు సీజ్ చేసింది. మీకు హైకోర్టుపై నమ్మకం లేదా? అని మందలించడమే కాకుండా వారి అభ్యర్థనను తిరస్కరించారు. అదీగాక మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు అల్లర్లకు సంబంధించి దాదాపు 300 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. (చదవండి: జస్టిస్ ఫర్ శ్రీమతి: టీచర్లు హరిప్రియ, కృతిక అరెస్ట్) -
అనధికార భవనాలను కూల్చేయండి! కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు
ముంబై: అనధికార భవనాలు కారణంగా ఒక్క అమాయకుడి ప్రాణాలు పోయిన ఉరుకోమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. అటువంటి నిర్మాణాల వల్ల కలిగే ప్రమాదాలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. ముంబైలో అనేక కుటుంబాలు నివశిస్తున్న తొమ్మిది అనధికార భవనాలను కూల్చివేయాలంటూ... ధానేకి చెందిన ముగ్గురు నివాశితులు పిటిషిన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చీఫ్ జస్టీస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎంఎస్ కార్నిక్లతో కూడిన ధర్మాసనం విచారించిన సందర్భంగా ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. 1998 నాటి ప్రభుత్వ తీర్మానం ఇప్పటికీ అమలులో ఉందన్న విషయాన్ని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తుచేసింది. అయినా వర్షాల సమయంలో అనధికార నిర్మాణాలను పౌర అధికారులు ఎందుకు కూల్చివేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఐతే థానే మునిసిపల్ కార్పొరేషన్ (టిఎంసీ) అనధికార నిర్మాణాలకు అనేక కూల్చివేత నోటీసులు అందించినప్పటికీ, నివాసితులు అక్కడ నివశిస్తున్నారని పిటిషనర్ల తరుపు న్యాయవాది నీతా కర్ణిక్ పేర్కొన్నారు. ఈ మేరకు టీఎంసీ తరుఫు న్యాయవాది రామ్ ఆప్టే, తొమ్మిది భవనాలను కూల్చివేతలకు పౌర సంఘం అనేక నోటీసులు పంపిందని, అయితే నివాసితులు ఖాళీ చేయడానికి నిరాకరించారని ధర్మాసనానికి తెలిపారు. ఇదిలా ఉండగా సంబంధిత భవనాల తరుఫు న్యాయవాది సుహాస్ ఓక్ మానవతా దృక్పథంతో వ్యవహరించి కనీసం వర్షాకాలం ముగిసే వరకు భవనాలను కూల్చివేయకుండా టీఎంసీని ఆపాలని కోర్టును కోరారు. దీనికి ప్రతి స్పందనగా ధర్మాసనం ..." మేము మానవతా దృక్పథంతో వ్యవహరించే అనధికారిక భవనాల వల్ల ఒక్క అమాయకుడి ప్రాణం పోకూడదని అనుకుంటున్నాం. వారంతా సురక్షిత ప్రదేశంలో ఉండాలని ఆశిస్తున్నాం. అంతేకాదు ఒక్క భవనం కూలిపోతే అనేక ప్రాణాలు పోవడమే కాదు, పక్కనున్న భవనాలను కూడా నేలమట్టం చేయవచ్చు అని వెల్లడించింది. అదీగాక డిసెంబరు 2021లోనే ఈ కేసుని సుమోటాగా తీసుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ భూముల్లో ఉన్న అనధికార భవనాలన్నింటినీ కూల్చివేయాలని..ఒక ఉత్తర్వును కూడా జారీ చేసినట్లు ధర్మాసనం పేర్కొంది. అయినప్పటికీ నివాసితులు దీన్ని అర్థం చేసుకోవడం లేదంటూ చివాట్లు పెట్టింది. అంతేకాదు సంబంధిత భవనాల్లో ఉంటున్న నివాసితులందరూ ఆగస్టు 31లోగా ఖాళీ చేస్తామని హామీ ఇవ్వాలని కూడా స్పష్టం చేసింది. మరోవైపు టీఎంసీని కూడా ఆగస్టు 31 దాక భవనాలను కూల్చివేయద్దని ధర్మాసనం ఆదేశించింది. సాధ్యమైనంతవరకు ఈ ఉత్తర్వును త్వరితగతిన అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఐతే ఇలాంటి అనధికార భవనాలు ముంబైలో సుమారు 30 దాక ఉన్నట్లు సమాచారం. (చదవండి: ఆ కారు రిజిస్ట్రేషన్ నెంబర్ చూసి షాక్ అయిన పోలీసులు: ఫోటోలు వైరల్) -
హఠాత్తుగా వాహనం దిగి.. హోంగార్డును అభినందించి.
సాక్షి, హైదరాబాద్: అది ఎల్బీ స్టేడియం పక్కన ఉన్న బాబూ జగ్జీవన్రామ్ విగ్రహం చౌరస్తా... రోజూ మాదిరిగానే శుక్రవారం కూడా అబిడ్స్ ట్రాఫిక్ ఠాణా హోంగార్డు అష్రఫ్ అలీ ఖాన్ విధుల్లో ఉన్నారు. ఉదయం 9.20 గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ వాహనం ఆ దారిలో వెళ్తోంది. హఠాత్తుగా సీజే తన వాహనాన్ని స్లో చేయించి అలీని దగ్గరకు పిలిచారు. వాహనం నుంచి కిందికి దిగిన జస్టిస్ సతీశ్చంద్ర.. అలీని ‘వెల్డన్ ఆఫీసర్’ అంటూ అభినందించి పుష్పగుచ్ఛం ఇచ్చారు. దీంతో అలీఖాన్తోపాటు అక్కడున్న వాళ్లూ ఆశ్చర్యపోయారు. విజయ్నగర్ కాలనీకి చెందిన అష్రఫ్ 24 ఏళ్ల క్రితం హోంగార్డుగా అడుగుపెట్టారు. రెండున్నరేళ్లుగా అబిడ్స్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నారు. అలీ నిత్యం బీజేఆర్ స్టాట్యూ చౌరస్తాలోని పాయింట్లో డ్యూటీ చేస్తుంటారు. జస్టిస్ సతీష్ చంద్ర శర్మ రాకపోకలు సాగించేది ఈ చౌరస్తా మీదుగానే. అత్యంత ప్రముఖుల జాబితాలో ఉండే ఆయనకు ట్రాఫిక్ పోలీసులు గ్రీన్చానల్ ఇస్తుంటారు. సీజే ప్రయాణించే సమయంలో, ఆ మార్గంలో మిగిలిన వాహనాలను ఆపి, ఆయన వాహనాన్ని ముందుకు పంపిస్తారు. బీజేఆర్ స్టాట్యూ వద్ద అలీ ఒక్క రోజు కూడా చిన్న ఇబ్బందీ రానీయలేదు. అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్న అలీని కొన్నాళ్లుగా గమనిస్తున్న సీజే శుక్రవారం అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. హోంగార్డు అలీ ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘ఇన్నేళ్లల్లో ఒక్కసారి కూడా సీజే స్థాయి వారిని దగ్గర నుంచి కూడా చూడలేదు. అలాంటిది సీజే నా వద్దకు వచ్చి అభినందించడంతో షాకయ్యా’ అని ఉబ్బితబ్బిబ్బయ్యారు. సీజే ఇచ్చిన స్ఫూర్తిని అలీ జీవితకాలమంతా గుర్తుపెట్టుకుంటారని డీజీపీ మహేందర్రెడ్డి ట్టిట్టర్లో పేర్కొన్నారు. -
‘ఐదు ఎకరాల్లోపే’ రైతుబంధు ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న వారికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయంగా రైతుబంధు పథకాన్ని వర్తింపజేసేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ, వ్యవసాయ, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులతోపాటు వ్యవసాయ శాఖ కమిషనర్లను ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి గతంలో రెండు పిటిషన్లు దాఖలయ్యాయని ప్రభుత్వ న్యాయవాది నివేదించారు. దీంతో ఈ వ్యాజ్యాన్ని వాటితో కలిపి విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేస్తూ తదుపరి విచారణను మార్చి 25కు వాయిదా వేసింది. హైదరాబాద్కు చెందిన న్యాయవాది తల్లాడ నందకిశోర్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని (పిల్) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్కుమార్ షావలితో కూడిన ధర్మాసనం ఇటీవల విచారించింది. ‘రాష్ట్రవ్యాప్తంగా 1.43 కోట్ల ఎకరాల భూమి సాగులో ఉంది. ఇందులో మెజారిటీ వ్యవసాయ భూములను కౌలుదారులే సాగుచేస్తున్నారు. వారికి ప్రభుత్వం ఎటువంటి పరిహారం ఇవ్వడం లేదు. కొందరు రాజకీయ నాయకులకు వందలాది ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. వీరికీ రైతుబంధు కింద ఆర్థికసాయం అందుతోంది. అర్హులైన ఐదెకరాలలోపు ఉన్న రైతులకు మాత్రమే ఆర్థిక సాయం అందేలా ఆదేశాలు జారీ చేయండి’ అని పిటిషన్లో కోరారు. -
రాజధాని ఎక్కడ ఉండాలనే అంశం జోలికెళ్లం: హైకోర్టు
సాక్షి, అమరావతి: రాజధాని ఏ ప్రాంతంలో ఉండాలన్న అంశం జోలికి తాము వెళ్లబోవడం లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఇక ఆ అంశంపై వాదనలు అవసరం లేదని స్పష్టం చేసింది. పాలనా వికేంద్రీకరణ చట్టంతో పాటు సీఆర్డీఏ రద్దు చట్టాన్ని కూడా ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఈ వ్యవహారంలో ఇప్పటికే దాఖలైన వ్యాజ్యాల్లో ఏ అభ్యర్థనలు మనుగడలో ఉంటాయి? వాటి విషయంలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వాలన్న అంశంపైనే తాము ప్రధానంగా దృష్టి సారించామని వెల్లడించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు, ప్రభుత్వ న్యాయవాదులు వాద ప్రతివాదనలను శుక్రవారం పూర్తి చేయడంతో ఈ వ్యాజ్యాలన్నింటిపై తీర్పును వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాంతంలో వద్దని చట్టబద్ధ కమిటీనే చెప్పింది.. విచారణ సందర్భంగా సీఆర్డీఏ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) కాసా జగన్మోహన్రెడ్డి వాదనలు వినిపిస్తూ అత్యంత సారవంతమైన భూములున్న కృష్ణా–గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేయడం సరికాదని కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ స్పష్టంగా చెప్పిందన్నారు. అంతేకాకుండా అది వరద, భూకంప ప్రభావిత ప్రాంతమని కూడా కమిటీ నివేదికలో ప్రస్తావించిందన్నారు. ఈ పరిస్థితులన్నీ పరిగణనలోకి తీసుకున్న తరువాత అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసిందన్నారు. అందులో భాగంగానే అమరావతి మాస్టర్ ప్లాన్ను సవరించాలని నిర్ణయం తీసుకుందని వివరించారు. గత ప్రభుత్వం ఈ–బ్రిక్స్, గ్రాఫిక్స్ చూపించి రాజధాని విషయంలో ప్రజలను మభ్యపెట్టిందన్నారు. పాలనా వికేంద్రీకరణ చట్టాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఈ అంశంపై దాఖలైన వ్యాజ్యాలన్నీ నిరర్థకమే అవుతాయని, వాటిపై ఎలాంటి విచారణ అవసరం లేదని తెలిపారు. హోదా హామీని కూడా నెరవేర్చాలి శాసన మండలి తరఫు న్యాయవాది మెట్టా చంద్రశేఖరరావు వాదనలు వినిపిస్తూ రాజధానిగా అమరావతి ఉండటంపై తమకు అభ్యంతరం లేదని అప్పటి ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి శాసనసభ సాక్షిగా చెప్పారని, ఆ మాటకు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత ఆయనపై ఉందని పిటిషనర్లు చెబుతున్నారన్నారు. ఆ మాటను అమలు చేయాల్సి వస్తే పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామంటూ ప్రధానమంత్రి హోదాలో నాడు మన్మోహన్సింగ్ ఇచ్చిన హామీని కూడా అమలు చేయాల్సి ఉంటుందన్నారు. సీఆర్డీఏ ఏర్పాటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగిందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజలదే అంతిమ నిర్ణయమన్నారు. మెజారిటీ ప్రజలు ప్రస్తుత ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగించారని, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు మెజారిటీ ప్రజల నిర్ణయాలే అవుతాయన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమరావతిని రాజధానిగా నిర్ణయించారని చెప్పారు. ఆ నివేదికలను కొట్టివేయండి... ప్రభుత్వం తరఫున బుధవారం నాడు అడ్వొకేట్ జనరల్, సీఆర్డీఏ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి, శాసనమండలి తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.ఎస్ ప్రసాద్ వినిపించిన వాదనలపై పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఉన్నం మురళీధరరావు, వాసిరెడ్డి ప్రభునాథ్ తదితరులు తిరుగు సమాధానం ఇచ్చారు. రైతుల వాదనలు వినకుండానే హైవర్ కమిటీ, బోస్టన్, జీఆర్ఎన్ రావు కమిటీలు నివేదికలు ఇచ్చాయని, అవేమీ చట్టబద్ధ నివేదికలు కాదని, అందువల్ల వాటిని కొట్టి వేయాలని అభ్యర్థించారు. చట్ట నిబంధనలకు లోబడే అమరావతిని రాజధానిగా నిర్ణయించారన్నారు.ల్యాండ్ పూలింగ్ పథకం కింద కల్పించాల్సిన ప్రయోజనాలన్నింటినీ రైతులకు అందించడంతోపాటు ఇతర మౌలిక సదుపాయాలన్నింటినీ పూర్తి చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. నిధుల కొరతను కారణంగా చూపి అభివృద్ధిని ఆపడానికి వీల్లేదన్నారు. ఇప్పటి వరకు శాశ్వత హైకోర్టును నిర్మించలేదని, ఇది న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బ తీయటమేనన్నారు. -
వారి విడుదలకు చర్యలు తీసుకోండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: హత్యలాంటి తీవ్రమైన నేరాల్లో కాకుండా ఇతర నేరాల్లో న్యాయ స్థానాలు బెయిల్ మంజూరు చేసినా పూచీకత్తు మొత్తాన్ని చెల్లించలేక జైళ్లలోనే మగ్గిపోతున్న విచారణ ఖైదీల విడుదలకు చర్యలు తీసుకోవాలని జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీలను హైకోర్టు ఆదేశించింది. ఆయా కోర్టుల్లో పిటిషన్లు వేయాలంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్కుమార్ షావలిల ధర్మాసనం శుక్రవారం తీర్పునిచ్చింది. తమ ఆదేశాల అమలుకు తీసుకున్న చర్యలను వివరిస్తూ నివేదిక సమర్పించాలని పేర్కొంటూ తదుపరి విచారణను ఏప్రిల్ 22కు వాయిదా వేసింది. బెయిల్ మంజూరైనా పేదరికంతో పూచీకత్తు మొత్తాన్ని చెల్లించలేక రాష్ట్రవ్యాప్తంగా 180 మంది కొన్ని నెలలుగా జైళ్లలో మగ్గుతున్నారని హైదరాబాద్కు చెందిన డాక్టర్ మురళి కరణం దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది. పూచీకత్తు చెల్లించలేని కారణంగా విచారణ ఖైదీలు జైళ్లలో మగ్గిపోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిందని పిటిషనర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. సొంత పూచీకత్తుపై వీరిని విడుదల చేసేలా ఆదేశించాలని అభ్యర్థించారు. పూచీకత్తు చెల్లించలేని విచారణ ఖైదీలను గుర్తించి వారి విడుదలకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ తరఫున న్యాయవాది అనిల్కుమార్ నివేదించారు. స్పందించిన ధర్మాసనం.. జిల్లాల లీగల్ సర్వీస్ అథారిటీల సహకారంతో ఇలాంటి వారి విడుదలకు చర్యలు తీసుకోవాలలని ఆదేశించింది. -
ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలు చట్టబద్ధమే: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: పండ్లను పక్వానికి వచ్చేలా చేసేందుకు ఎథిఫాన్, ఎన్రైప్ల వినియోగానికి అనుమతిస్తూ ఫుడ్సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) జారీచేసిన ఉత్తర్వులు చట్టబద్ధమేనని హైకోర్టు స్పష్టంచేసింది. అనేక పరిశోధనల తర్వాత ఎథిఫాన్, ఎన్రైప్ రసాయనాలు ప్రమాదకరం కాదనే విషయం తేలడంతో వాటి వినియోగానికి అనుమతి ఇచ్చిందని పేర్కొంది. ఎథిఫాన్, ఎన్రైప్ వినియోగానికి అనుమతిస్తూ జారీచేసిన ఉత్తర్వులు కొట్టేయాలంటూ కాలేజ్ ఆఫ్ పోస్టుగాడ్యుయేట్ స్టడీస్ డైరెక్టర్ నళిన్ వెంకట్ కిషోర్ కుమార్తోపాటు రిటైర్డ్ ఉద్యోగి ఎల్.రమేశ్బాబు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని, మరో రెండు పిటిషన్లను కోర్టు కొట్టేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్కుమార్ షావలిలతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. ‘‘పండ్లను మగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఎన్రైప్’వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. ఎన్రైప్ ద్వారా కూడా ఎథిలీన్ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఎన్రైప్ను మాత్రమే విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో ఎక్కడా పేర్కొనలేదు. పరిశోధనలు చేసిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం ఎథిఫాన్కు ప్రత్యామ్నాయంగా మాత్రమే ఎన్రైప్ను వినియోగించాలని కోరుతోంది. ఎథిఫాన్ను విక్రయించరాదని ఎక్కడా పేర్కొనలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టలేం’’అని ధర్మాసనం పేర్కొంది. -
డిస్ట్రిబ్యూటర్ల నకిలీ లేఖలు కలకలం
సాక్షి, విశాఖపట్నం: సినిమా టికెట్ ధరల వ్యవహారం విశాఖలో కాకరేపుతోంది. ప్రభుత్వంపై బురదజల్లడానికి ఒక వర్గం ప్రయత్నిస్తుందన్న వార్తలు ఇప్పుడు జిల్లాలో హాట్టాపిక్గా మారింది. చోడవరానికి చెందిన ఒక ఎగ్జిబిటర్ తమ ప్రమేయం లేకుండా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టులో కేసు వేశారంటూ మిగిలిన ఎగ్జిబిటర్లు మండిపడుతున్నారు. ఈ విషయాన్ని చెప్పకుండా తమతో సంతకాలు చేయించుకున్నారంటూ.. గత నెల 25న జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి ఫిర్యాదు చేయడం సినీవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పెద్ద... చిన్న సినిమాలనే తారతమ్యం లేకుండా అన్ని సినిమా థియేటర్లలో ఆడాలి.. ప్రజలకు అందుబాటు ధరల్లో టికెట్ ఉండే విధంగా ప్రభుత్వం జీవో–35 జారీ చేసింది. దీనిపై ఎగ్జిబిటర్లు వ్యతిరేకంగా ఉన్నారంటూ కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు నకిలీ లేఖలు సృష్టించి కేసులు వేశారు. ఆ సమయంలో కోర్టుకు సమర్పించిన లేఖల్లో నకిలీవని కొంతమంది ఎగ్జిబిటర్లు చెబుతుండడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోంది. డిస్ట్రిబ్యూటర్లలో ఒక వర్గం వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను, సినీ వర్గాల వారిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. జేసీ ఆదేశాల మేరకే టిక్కెట్ల రేట్లు జీవో 35 రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. సినిమా టికెట్ ధరలు పాత విధానంలో అమలు చేయాలా.. లేదా అనేది జేసీ ఆదేశాల మేరకు నిర్ణయించాలని పేర్కొంది. కోర్టుని ఆశ్రయించిన వారెవరూ ఇప్పటి వరకు తనని సంప్రదించలేదని జేసీ ఇప్పటికే వెల్లడించారు. మరోవైపు థియేటర్లలో అన్ని సౌకర్యాలు, టికెట్ల ధరలు సవ్యంగా ఉన్నాయో లేదో జిల్లా అధికారులు తనిఖీలు ముమ్మురంగా చేస్తున్నారు. థియేటర్లో తప్పక ఉండాల్సినవి ఇవే.. ►ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్, ఎలక్ట్రికల్ సర్టిఫికెట్ ►బిల్డింగ్ స్ట్రెంగ్త్ను తెలియజేసే ఆర్అండ్బీ అనుమతి ►ఫిలిమ్ డివిజన్ నుంచి అనుమతి పత్రం ►క్యాంటీన్ నిర్వహణ కోసం ఫుడ్లైసెన్స్ ►ఇవన్నీ రెవెన్యూ విభాగం వారికి సమర్పించి ‘ఫామ్–బి’సర్టిఫికెట్ పొందాలి. విచారణ చేస్తున్నాం హైకోర్టుని ఆశ్రయించామని చెప్పిన జిల్లాకి చెందిన 9 థియేటర్ల ఎగ్జిబిటర్లలో ఏడుగురు వారం రోజుల క్రితం తనకు ఫిర్యాదు చేశారు. తమకు అసలు విషయం చెప్పకుండా ఎగ్జిబిటర్ల అసోసియేషన్కి చెందిన చోడవరం థియేటర్ యాజమాని ఒకరు తమ దగ్గర సంతకాలు చేయించుకున్నారని చెప్పారు. ఇదంతా తమ ప్రమేయం లేకుండానే జరిగిందని, విచారణ చేయాలని కోరారు. ప్రభుత్వ జీవోకు తామంతా ఆమోదయోగమేనని కోర్టుకి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని ఫిర్యాదులో తెలిపారు. – వేణుగోపాల్రెడ్డి, జాయింట్ కలెక్టర్ చదవండి: Vizag Beach: ఎక్కువ ప్రమాదాలు ఆ నెలల్లోనే! -
ఒమిక్రన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు..
-
న్యాయవాదులు సమాజానికి మార్గ దర్శకులు
-
మదురై జైలులో రూ.100 కోట్లు హాంఫట్
సాక్షి, చెన్నై: మదురై కేంద్ర కారాగారంలో రూ. వంద కోట్లు అవినీతి జరిగినట్టు న్యాయవాది పుగలేంది మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ విచారణకు ఆదేశించాలని కోరారు. ఖైదీలు సిద్ధం చేసిన వస్తువుల్ని ప్రభుత్వ ఆస్పత్రులు తదితర ప్రాంతాలకు తరలించినట్టుగా గణాంకాల్లో జైళ్లశాఖపేర్కొని ఉన్నట్టు సమాచార హక్కు చట్టం మేరకు వివరాల్ని పుగలేంది సేకరించారు. (చదవండి: ప్రాణాలకోసం మూగ జీవీ పాకులాట.. మనసును కదిలించేలా..) ఈ లెక్కలు తప్పుల తడకగా ఉండడంతో కోర్టు తలుపు తట్టారు. మదురై కారాగారంలో 2016–2020 మార్చి వరకు రూ. వంద కోట్లు అవినీతి జరిగినట్టు, జైళ్ల శాఖలోని కొందరి మాయా జాలంతో ప్రభుత్వం నిధులు దుర్వినియోగమైనట్టు ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే హోం శాఖ, జైళ్ల శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సూచించారు. సమాచార హక్కు చట్టంలో పేర్కొన్న గణాంకాలే అవినీతి జరిగినట్టు స్పష్టం చేస్తున్నాయని, తక్షణం కేసును ఏసీబీ విచారణకు అప్పగించాలని కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్ సాధ్యమైనంతవరకు త్వరిగతిన విచారణకు వచ్చే అవకాశం ఉంది. (చదవండి: అయ్! బాబోయ్!.. ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది కదరా!) -
గణేశ్ ఉత్సవాలపై ప్రజల సెంటిమెంట్ను గౌరవించాలి: హైకోర్టు
-
Telangana: జీవో 111 పై హైకోర్టులో విచారణ
-
ఏలూరు కార్పొరేషన్ ఓట్ల లెక్కింపునకు హైకోర్టు పచ్చజెండా
-
మళ్లీ పెళ్లి చేసుకున్న మహిళకు ఆస్తి దక్కదు!
బిలాస్పూర్: చనిపోయిన భర్త తరఫు ఆస్తిపై మళ్లీ పెళ్లి చేసుకున్న మహిళ తన హక్కును కోల్పోతుందని చత్తీస్గఢ్ హైకోర్టు పేర్కొంది. అయితే, ఆ మహిళ మరో పెళ్లి చేసుకున్నట్లు చట్టప్రకారం నిరూపితం కావాలని స్పష్టం చేసింది. వరుసకు తనకు అన్న అయిన ఘాసీ భార్య కియబాయి.. ఘాసీ మరణానంతరం స్థానిక సంప్రదాయం ప్రకారం మరో పెళ్లి చేసుకుందని, అందువల్ల చనిపోయిన తన అన్న ఆస్తి ఆమెకు చెందకూడదని ఆదేశాలివ్వాలని కోరుతూ లోక్నాథ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ సంజయ్ కే అగర్వాల్ తాజాగా పై ఆదేశాలిచ్చారు. ‘హిందూ విడో రీమ్యారేజ్ యాక్ట్, 1856లోని సెక్షన్ 6 ప్రకారం పునర్వివాహానికి సంబంధించిన అన్ని ప్రక్రియలు నిరూపితం కావాల్సి ఉంటుంది. పునర్వివాహం చట్టప్రకారం నిరూపితమైతే.. ఆ మహిళకు తొలి భర్త ద్వారా లభించిన ఆస్తిపై హక్కు ఇకపై ఉండదు’ అని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. స్థానిక చుడి సంప్రదాయం(గాజులు ఇవ్వడం ద్వారా ఒక మహిళను పెళ్లి చేసుకోవడం) ప్రకారం కియాబాయి పునర్వివాహం చేసుకుందని లోక్నాథ్ వాదించారు. కియాబాయి మళ్లీ పెళ్లి చేసుకున్నట్లు ఎలాంటి చట్టబద్ధ ఆధారాలు లేవని ఈ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. -
ఓటుకు కోట్లు కేసు: రేవంత్కు చుక్కెదురు
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసుపై హైకోర్టులో రేవంత్రెడ్డికి చుక్కెదురైంది. ఓటుకు కోట్లు కేసు అవినీతి నిరోధక శాఖ పరిధిలోకి రాదని, ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందంటూ హైకోర్టులో రేవంత్రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ను విచారించకుండానే హైకోర్టు కొట్టి వేసింది. గతంలో ఏసీబీ కోర్టులో ఇదే పిటిషన్ రేవంత్రెడ్డి దాఖలు చేయగా అక్కడా ఇదే పరిస్థితి ఎదురైంది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఆరేళ్లుగా విచారణ 2015లో జరిగిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్సన్కు ప్రలోభపెట్టేందుకు టీడీపీ పార్టీ తరఫున రేవంత్రెడ్డి ప్రయత్నిస్తూ కెమెరాకు అడ్డంగా దొరికి పోయారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ నడుస్తోంది. ఇటీవలే ఈ కేసుకు సంబంధించి ఛార్జ్షీట్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసింది. దీంతో కేసు విచారణలో వేగం పుంజుకోనుంది. -
ఆనందయ్య మందుపై త్వరగా నిర్ణయం తీసుకోండి
సాక్షి, అమరావతి: ఆయుర్వేద వైద్యుడు బొనిగి ఆనందయ్య తయారుచేస్తున్న ఔషధం పంపిణీ విషయంలో వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఏపీ హైకోర్టు గురువారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కరోనా తీవ్రత నేపథ్యంలో ఆనందయ్య ఔషధంపై పరీక్షలు చేస్తున్నామంటూ జాప్యం చేయడం సరికాదంది. ఆనందయ్య ఔషధం తయారీ, దానికి అనుమతులు, పంపిణీ తదితర అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను తమముందుంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ దొనడి రమేశ్, జస్టిస్ కంచిరెడ్డి సురేశ్రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణ పట్నంలో ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ఇస్తున్న కోవి డ్ మందు పంపిణీలో జోక్యం చేసుకోకుండా అధికా రుల ను ఆదేశించాలని, ఆ మందు పంపిణీకి తక్షణమే అనుమ తులిచ్చేలా ఆదేశించాలని కోరుతూ న్యాయవాది పి.మల్లి కార్జునరావు, ఎం.ఉమామహేశ్వరనాయుడు హైకోర్టులో వేర్వేరుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై గురువారం జస్టిస్ రమేశ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. వాదనల సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ జోక్యం చేసుకుంటూ.. ఆనందయ్య మందు నమూనాలను ఆయుష్ విభాగం ల్యాబ్కు పంపిందని, ఈ నెల 29న నివేదిక అందుతుందని చెప్పారు. ఈ మందు ప్రజా వినియోగానికి అనువైనదని తేలితే పంపిణీకి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎన్.హరినాథ్ వాదనలు వినిపిస్తూ.. నిబంధనల ప్రకారం తయారీదారు దరఖాస్తు చేసుకుంటే ఆ ఔషధాన్ని పరీక్షించి, ప్రజా వినియోగానికి యోగ్యమైనదిగా భావిస్తే పంపిణీకి అనుమతినిస్తామని చెప్పారు. ఆనందయ్య మందువల్ల దుష్ప్రభావాలు లేవని మీడియాలో ప్రచారమే తప్ప అధికారిక నివేదిక ఏదీ లేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. సాంకేతిక అంశాల జోలికి వెళ్లొదని స్పష్టం చేసింది. ఆనందయ్య ఔషధానికి ఎవరు అనుమతులు ఇవ్వాలి? ఆ మందును ప్రజలకు ఇవ్వొచ్చా? లేదా? అన్న విషయాలను తదుపరి విచారణలో తమముందుంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఫార్ములా చెప్పాలని అధికారులు బెదిరిస్తున్నారు మరోవైపు.. తన ఔషధంలో ఉపయోగించే పదార్థాలు, ఫార్ములా చెప్పాలని నెల్లూరు జిల్లా అధికారులు బెదిరిస్తున్నారని కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తన ఔషధ పంపిణీ విషయంలో జోక్యం చేసుకోకుండా ఆదేశాలివ్వాలని, తనకు భద్రత కూడా కల్పించాలని కోరారు. ఈ వ్యాజ్యంపై గురువారం జస్టిస్ రమేశ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఆనందయ్య తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు. ఈ కేసు విచారణను కూడా ధర్మాసనం ఈ నెల 31కి వాయిదా వేసింది. -
వైన్స్, బార్ల వల్ల కరోనా వ్యాప్తి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బార్లు, మద్యం దుకాణాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుండవచ్చని, కానీ కరోనా వ్యాప్తికి ఈ కేంద్రాలు అడ్డాగా మారుతున్నాయని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో వైరస్ వ్యాప్తి కట్టడి నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయసేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రభుత్వం జారీ చేసిన కరోనా నిబంధనలు పాటించని బార్లు, మద్యం దుకాణాలు, పబ్బులు, క్లబ్బులు, ఫంక్షన్ హాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వాటి లైసెన్సులు, అనుమతులు రద్దు చేయాలని తేల్చిచెప్పింది. ఆయా సంస్థల నిర్వాహకులపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని ఆదేశించింది. కరోనా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ అందిన లేఖలను ప్రజాహిత వ్యాజ్యాలుగా పరిగణించి విచారణకు స్వీకరించిన ధర్మాసనం వాటిపై గురువారం మరోసారి విచారణ చేపట్టింది. పరీక్షలు ఇంతేనా? ఆర్టీ–పీసీఆర్ పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాలని తాము ఆదేశించినా ప్రభుత్వం వాటి సంఖ్యను ఆశించిన స్థాయిలో పెంచలేదని ధర్మాసనం ఈ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం పరీక్షల్లో 20 శాతంలోపే ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు చేస్తుండగా గ్రామీణ జిల్లాల్లో వాటి సంఖ్య 5 శాతానికి మించట్లేదని అసహనం వ్యక్తం చేసింది. కేంద్రం నిర్దేశించిన మేరకు ఆర్టీ–పీసీఆర్ పరీక్షలను 70 శాతానికి పెంచాలని ధర్మాసనం స్పష్టం చేసింది. కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు, డీజీపీ మహేందర్రెడ్డి నివేదిక సమర్పించారు. కరోనా కేసులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మాస్క్ ధరించని 1,16,467 మందికి జరిమానా విధించినట్లు డీజీపీ నివేదికలో పేర్కొనడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వాస్తవ పరిస్థితితో పోలిస్తే వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని, పాతబస్తీకి వెళ్తే 2 రోజుల్లో లక్షల మంది మాస్క్ లేకుండా దొరుకుతారని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. బార్లు, వైన్స్, పబ్బులు, క్లబ్బులు, మాల్స్, థియేటర్ల దగ్గర ప్రజలు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు పెట్టాలని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ను ధర్మాసనం ఆదేశించింది. వైద్య నిపుణులతో కమిటీ... రాష్ట్రంలో లాక్డౌన్ విధించాలని తాము చెప్పట్లేదని, అయితే కరోనా కేసుల ఆధారంగా మైక్రో, కంటైన్మెంట్ జోన్లను వెంటనే ప్రకటించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. శుభకార్యాలు, అంత్యక్రియలకు సంబంధించి పరిమిత సంఖ్యలోనే ప్రజలు హాజరయ్యేలా చూడాలని, విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్–17 కింద వెంటనే వైద్య నిపుణులతో అడ్వయిజరీ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో 100 మంది ఉద్యోగుల కంటే ఎక్కువ మంది ఉంటే వారికి కార్యాలయాల్లోనే వ్యాక్సిన్ ఇవ్వాలని సూచించింది. కరోనా చికిత్స అందిస్తున్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు అందుబాటులో ఉంచాలని పేర్కొంది. సీరో సర్వేలెన్స్ నివేదికతోపాటు కంటైన్మెంట్ జోన్ల వివరాలను తదుపరి విచారణలోగా సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. ఒక్క డోసు టీకా కూడా వృథా కాకుండా చూడాలని సూచించింది. రాష్ట్రానికి అందిన టీకా డోసుల సంఖ్య, వృథా అయిన వ్యాక్సిన్ల సంఖ్య, టీకా అందుకున్న లబ్ధిదారుల వివరాలను సమర్పించాలని ఆదేశించింది. ఇతర రాష్ట్రాల నుంచి వస్తే... పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేసుకోవాలనే నిబంధన పెట్టాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కరోనా నియంత్రణ చర్యలు, ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సౌకర్యాల కల్పనకు తీసుకున్న చర్యలను వివరిస్తూ ఈ నెల 14లోగా స్థాయీ నివేదికను సమర్పించాలని ఏజీని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. చదవండి: 10 మందిలో ఒకరిపై కరోనా దీర్ఘకాల ప్రభావం -
హఫీజ్పేట భూవివాదం: హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!
హైదరాబాద్: హఫీజ్పేట్లోని సర్వే నంబర్ 80లోని భూమి విషయంలో ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తులకు మధ్య గత కొన్నేళ్లుగా నడుస్తున్న వివాదానికి హైకోర్టు ముగి ంపు పలికింది. ఈ సర్వే నంబర్లోని 50 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులదేనని తేల్చిచెప్పింది. ఈ భూమిని వక్ఫ్బోర్డుకు చెందినదిగా పేర్కొంటూ చేసిన తీర్మానాన్ని కొట్టేసింది. అలాగే రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా పేర్కొనడాన్ని తప్పుబడుతూ ఎంట్రీలను రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎస్.రామచందర్రావు, జస్టిస్ టి.వినోద్కుమార్తో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పునిచ్చింది. తమ భూములను వక్ఫ్బోర్డు భూములుగా పేర్కొంటూ ఇచ్చిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ హైదరాబాద్కు చెందిన కటికనేని ప్రవీణ్కుమార్తో పాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. ‘గిఫ్ట్ సెటిల్మెంట్ డీడ్ ఆధారంగా పిటిషనర్ల పేర్లను రెవెన్యూ రికార్డుల్లో చేర్చండి. అలాగే పిటిషనర్ల భూమి పొజిషన్ విషయంలో ప్రభుత్వం, వక్ఫ్బోర్డు జోక్యం చేసుకోరాదు. పిటిషనర్లకు ఒక్కొక్కరికి రూ.50 వేలు ప్రభుత్వం, వక్ఫ్బోర్డు జరిమానాగా చెల్లించాలి’అని తీర్పులో పేర్కొంది. ఈ భూమి కోసమే కిడ్నాప్ యత్నం హఫీజ్పేటలోని ఈ భూమిని తమ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న కుట్రలో భాగంగానే ఏపీ మాజీ మంత్రి అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ్రామ్ మరికొందరితో కలసి కె.ప్రవీణ్కుమార్, ఆయన సోదరులను కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కిడ్నాపర్లు పరారయ్యారు. తర్వాత అఖిలప్రియతో పాటు కిడ్నాప్ కుట్రలో పాల్గొన్న మరికొందరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అఖిలప్రియ తదితరులకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయగా.. భార్గవ్రామ్ తదితరులు హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందిన విషయం తెలిసిందే. -
ఎమ్మెల్యే రాజాసింగ్కు హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్ : గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు హైకోర్టులో ఊరట లభించింది. ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పుపై స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 2016 ఉస్మానియా బీఫ్ ఫెస్టివల్ వ్యవహారంలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై సెక్షన్ 295 ఏ కింద బొల్లారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఐదేళ్ల తర్వాత ఈ కేసులో రాజా సింగ్కు ఒక సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ ఇటీవలె నాంపల్లి ప్రత్యేక కోర్టు తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ రాజాసింగ్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన అనంతరం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. (రాజాసింగ్కు షాక్.. ఏడాది జైలు శిక్ష) -
ఈ-వాచ్ యాప్పై వెనక్కు తగ్గిన ఎస్ఈసీ
సాక్షి, అమరావతి: ఎస్ఈసీ ప్రవేశపెట్టిన ఈ-వాచ్ యాప్పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. యాప్పై అనేక అభ్యంతరాలు నమోదు కావడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెనక్కు తగ్గింది. యాప్ను ఉపసంహరించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఎస్ఈసీ కోర్టుకు స్పష్టం చేసింది. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ సెక్యూరిటీ సర్టిఫికేషన్కు అభ్యంతరాలు తెలియజేసినందున, యాప్ను విత్డ్రా చేసుకుంటామని ఎస్ఈసీ తరఫు న్యాయవాది కోర్టులో పేర్కొన్నారు. దీంతో ఈ కేసుపై తదుపరి విచారణ ఈనెల 17కు వాయిదా పడింది. -
కేటీఆర్ ఫామ్హౌస్ వివాదంపై హైకోర్టు స్టే
సాక్షి, హైదరాబాద్ : కేటీఆర్ ఫామ్ హౌస్ వివాదంపై అక్టోబర్ 19 విచారణ జరిపేందుకు తెలంగాణ హైకోర్టు అంగీకరించింది. జన్వాడ ఫామ్ హౌస్ వివాదంపై మల్కాజ్గిరి ఎంపి రేవంత్ దాఖలు చేసిన పిటిషన్పై కేటీఆర్కు నోటీసులు జారీ చేసిన ఎన్జిటి ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను అక్టోబర్ 19కి వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. -
తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విచారణ సందర్భంగా ప్రభుత్వ తీరుపై హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను ఏ ఒక్కటి అమలు చేయలేదని హైకోర్టు సీరియస్ అయ్యింది. కరోనా చికిత్సకు ప్రైవేటు ఆసుపత్రులు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తూ ప్రజలను పీడిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరైన సీఎస్ సోమేశ్ కుమార్..కరోనాకు సంబంధించిన అఫిడవిట్ను కోర్టుకు సమర్పించారు. హైకోర్టు ఆదేశాలు అమలు చేశారా లేదా అని ప్రశ్నించగా..కరోనా పరీక్షలు ఎక్కువగా చేస్తున్నామని సీఎస్ బదులిచ్చారు. ఇప్పటికే 50 ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందని పేర్కొనగా..మరి మిగిలిన హాస్పిటల్స్ పరిస్థితి ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. అపోలో, బసవతారకం వంటి హాస్పిటల్స్ పై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పూర్తి వివరాలతో త్వరలోనే బులిటెన్ విడుదల చేస్తున్నామని సీఎస్ సోమేష్కుమార్ కోర్టుకు వివరించారు. ఇక రాష్ర్టంలో 8వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్ల ను తొలగించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటీషన్ దాఖలు అయ్యింది. గత నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఉద్యోగులను తొలగించడాన్ని సవాలు చేసిన ఉద్యోగులు పిటిషన్ దాఖలు చేశారు. నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ స్కీమ్ 2005 యాక్ట్ ప్రకారం పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను ఇటీవలె తొలిగించారు. పెండిండ్లో ఉన్న జీతాలను తిరిగి చెల్లించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు కోర్టుకు విన్నవించుకున్నారు. ఈ పిటిషన్పై హెకోర్టులో విచారణ కొనసాగుతుంది. -
కుల్భూషణ్ కేసు: లాయర్ను నియమించొచ్చు
ఇస్లామాబాద్: గూఢచర్యం ఆరోపణలపై పాకిస్తాన్ నిర్బంధంలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్కు వ్యతిరేకంగా పాక్ ప్రభుత్వం సమర్పించిన పిటిషన్ను ఆ దేశ హైకోర్టు సోమవారం విచారించింది. కుల్భూషణ్ తరఫున న్యాయవాదిని నియమించడానికి కోర్టు అనుమతిచ్చింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 3కు వాయిదా వేసింది. అంతేగాక పాక్ సమర్పించిన రివ్యూ పిటిషన్ను ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ గురువారం విచారిస్తుందని కోర్టు తెలిపింది. అనంతరం పాక్ అటార్నీ జనరల్ ఖలీద్ జావేద్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కులభూషణ్ తరఫున న్యాయవాదిని నియమించడానికి కోర్టు భారత్కు అనుమతినిచ్చింది. (అడుగడుగునా అడ్డుకున్నారు) కోర్టు రెండు ఆప్షన్స్ ఇచ్చింది. మేం కులభూషణ్ తరఫున న్యాయవాదిని మార్చవచ్చు. లేదా భారత్ అతడి తరఫున ఒక న్యాయవాదిని నియమించడానికి కోర్టు అంగీకారం తెలిపింది. అయితే కేవలం పాక్ న్యాయవాదులను మాత్రమే నియమించుకునేందుకు మాత్రమే కోర్టు అనుమతి ఇచ్చింది. మా దేశంలో ప్రాక్టీస్ చేయడానికి అర్హత ఉన్నవారిని మాత్రమే కుల్భూషణ్ తరఫున న్యాయవాదిగా నియమించడానికి కోర్టు అనుమతినిచ్చింది. ప్రస్తుతానికి భారత న్యాయ ప్రతినిధి ఇంకా ఎవరినీ నియమించలేదు. ఏం జరగనుందో చూడాలి’ అని తెలిపారు. కాగా, కులభూషణ్ తరఫున న్యాయవాదిని నియమించాలని కోరుతూ పాక్ జూలై 22న ఇస్లామాబాద్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు భారత ప్రభుత్వంతో సహా ప్రధాన పార్టీలను పాక్ సంప్రదించలేదు. -
నిమ్మగడ్డ పిటీషన్పై విచారణ రేపటికి వాయిదా
సాక్షి, అమరావతి: మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ పిటీషన్పై తదుపరి విచారణను ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలను కోర్టుకు వినిపించారు. ఎస్ఈసీ సర్వీస్ నింబంధనలను నియంత్రించే అధికారం ప్రభుత్వానికే ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వానికి చట్టాలను చేసే అధికారం ఉందని.. ప్రభుత్వ నిర్ణయాలను చట్ట విరుద్ధంగా చూడలేమన్నారు. కక్ష సాధింపు భాగంగానే ఆర్డినెన్స్ తీసుకొచ్చారనే పిటిషనర్ల వాదనలో వాస్తవం లేదన్నారు. (నిమ్మగడ్డ లేఖపై సీఐడీకి అందిన ఫోరెన్సిక్ నివేదిక) ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారిని ఎన్నికల కమిషనర్ గా నియమించడం పై విమర్శలు వ్యక్తమయ్యాయని తెలిపారు. గతం లో వివిధ కేసులు విచారణ సందర్బంగా హైకోర్టు కూడా ఎన్నికల కమిషన్ పని తీరు పట్ల అనుమానాలు వ్యక్తం చేసిందని కోర్టుకు వివరించారు. ఎన్నికల సంస్కరణల్లో భాగం గానే ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిందన్నారు. నిష్పక్షపాతం గా ఎన్నికలు నిర్వహించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. రాజ్యాంగ బద్ధ పదవి లో ఉన్న వారి పదవీ కాలాన్ని తగ్గించిన సందర్భాలు ఉంటే కోర్టు ముందుంచాలని అడ్వకేట్ జనరల్ ను ధర్మాసనం ఆదేశించింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. -
అనుభవం లేనివారు బస్సులు నడిపారు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రైవేటు డ్రైవర్లు, సిబ్బందితో బస్సులు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రవాణా శాఖ మంత్రి, రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి, ఆర్టీసీ ఎండీలకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నామని, ఈలోగా కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయవాది గోపాలకృష్ణ కళానిధి దాఖలు చేసిన పిల్ను సోమవారం ధర్మాసనం విచారించింది. వోల్వో ప్రైవేటు బస్సులు, ట్రక్కులు నడిపే వాళ్లను తాత్కాలిక ప్రాతిపదికపై నియమించడం వల్ల అనర్ధాలు చోటు చేసుకుంటున్నాయని గోపాలకృష్ణ వాదించారు. ప్రమాదాల వల్ల మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఆర్టీసీ యాజమాన్యం పరిహారం ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని, గాయపడిన వారికి ఆర్థికసాయం అందజేయాలని కోరారు. ప్రైవేటు వాహనాల బ్రేక్ సిస్టమ్ ఎయిర్ వాక్యూమ్ మీద ఆధారపడి ఉంటుందని, అయితే ఆర్టీసీ బస్సులు హైడ్రాలిక్–కమ్–ఎయిర్ బ్రేక్ పద్ధతుల్లో పనిచేస్తాయని, యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్ వంటి సాంకేతిక విషయాలపై ప్రైవేటు డ్రైవర్లకు అవగాహన ఉండదని, దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. 90 రోజుల శిక్షణ తర్వాతే విధుల్లోకి తీసుకోవాలన్నారు. మోటారు వాహన చట్టంలోని 19వ సెక్షన్ ప్రకారం కండక్టర్గా చేసే వారికి సర్టిఫికెట్ ఉండాలని, అయితే పదోతరగతి ఉత్తీర్ణులై ఆధార్ కార్డు ఉన్న వాళ్లను నియమిం చారని చెప్పారు. సమ్మె నేపథ్యంలో కేవలం సీఎం కేసీఆర్ మెప్పు కోసమే అధికారులు ఈ తరహా నియామకాలు చేశారని చెప్పారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. జీతాల చెల్లింపు కేసు రేపటికి వాయిదా ఆర్టీసీ సిబ్బంది పనిచేసిన సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించేలా ఆర్టీసీ యాజమాన్యానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన రిట్ పిటిషన్పై విచారణ బుధవారానికి వాయిదా పడింది. తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి హనుమంతు దాఖలు చేసిన రిట్ను సోమవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభినంద్కుమార్ షావిలి మరోసారి విచారించారు. ఆర్టీసీ యాజమాన్యం తరఫు వాదనలు వినిపించేందుకు గడువు కావాలని ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సిల్ కోరారు. ఇప్పటికే చాలాసార్లు వాయిదా కోరారని పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యంతరం చెప్పారు. ఇకపై వాయిదాలు కోరవద్దని సూచించిన హైకోర్టు, తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. -
‘రూట్ల ప్రైవేటీకరణ’పై స్టే పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 5,100 ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరణ చేయాలని మంత్రివర్గం చేసిన తీర్మానంపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని, మధ్యంతర స్టే ఉత్తర్వులను ఎత్తేయాలని ప్రభుత్వం చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. స్టే ఉత్తర్వుల వల్ల కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై తర్వాత ప్రక్రియ చేపట్టేందుకు వీలు లేకుండా పోయిందని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ చెప్పారు. స్టే రద్దు చేయాలన్న వినతిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్రెడ్డిల ధర్మాసనం తిరస్కరించింది. మోటారు వాహ న చట్టంలోని 102 సెక్షన్ ప్రకారం ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ ప్రక్రియ చాలా సుదీర్ఘంగా ఉంటుం దని, ఇప్పటికిప్పుడే సులభంగా చేసేది కాదని ధర్మాసనం తేల్చి చెప్పింది. రూట్ల ప్రైవేటీకరణకు కేబినెట్ తీర్మానం చేయడాన్ని సవాల్ చేస్తూ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన ప్రజా హిత వ్యాజ్యంపై విచారణను 22వ తేదీ శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించిం ది. అప్పటివరకు స్టే ఉత్తర్వులు అమలును కొనసాగిస్తున్నట్లు తెలిపింది. విచారణ సందర్భంగా ధర్మాసనం.. ఆర్టీసీకి సమాతరంగా ప్రైవేటు రూట్లకు అనుమతినివ్వాలని మంత్రివర్గ తీర్మానం చేయడం ప్రాథమిక దశలోని వ్యవహారమని, ఆ నిర్ణయానికి చట్టబద్ధత తెచ్చేందుకు ఆ తర్వాత చాలా ప్రక్రియ ఉంటుందని, ఇప్పుడే పిల్ దాఖలు చేయడం అపరిపక్వతే అవుతుందని వ్యాఖ్యానించింది. సహజ వనరుల వ్యవహారమా? సహజ వనరులను ప్రైవేటీకరణ చేసేందుకు వీల్లేదని సుప్రీంకోర్టు రిలయన్స్, టూజీ కేసుల్లో చెప్పిం దని పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభా కర్ చేసిన వాదనలు ఈ కేసుకు వర్తించవని కోర్టు చెప్పింది. సెక్షన్ 102 ప్రకారం ఆర్టీసీకి సమాంతరంగా ప్రైవేటు గ్యారేజీలకు రాష్ట్రాలకు కేంద్రమే అనుమతినిచ్చిందని గుర్తుచేసింది. రోడ్ల ప్రైవేటీకరణ సహజ వనరులుగా ఎలా పరిగణిస్తారని ప్రశ్నించింది. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నందున ప్రైవేటు ఆపరేటర్లకు రూట్లను ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయిస్తున్నట్లు ఆర్టీసీ, ప్రభుత్వం చెబుతుంటే, ఆర్టీసీ ఆస్తులనే ప్రైవేటుకు ఇచ్చేస్తారనే భయం ఏమైనా పట్టుకుందా? అనే సందేహాన్ని ధర్మాసనం లేవనెత్తింది. సమ్మెను అడ్డంపెట్టుకుని బస్సు రూట్లను ప్రైవేటీకరణ చేయాలని విశ్వాసరాహిత్యానికి పా ల్పడే చర్యగా పరిగణించాలని న్యాయవాది కోరా రు. నేరుగా చేయలేని దానిని పరోక్షంగా కూడా చేయకూడదు.. అని ఏనాడో సుప్రీంకోర్టు చెప్పిం దని గుర్తు చేశారు. సెక్షన్ 67, 67, 102, చాప్టర్ 5, 6ల్లోని అంశాలపై సాంకేతికపర వివరాల్ని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. చాప్టర్ 5, 6లు పరస్పర విరుద్ధంగా ఏమీ లేవని ధర్మాసనం చెప్పింది. ఈ దశలో వ్యాజ్యం చెల్లదు: ఏజీ ఏజీ వాదిస్తూ.. పిల్ దాఖలుపై ప్రాథమికంగానే ప్రభుత్వానికి తీవ్ర అభ్యంతరాలున్నాయని చెప్పా రు. బస్సు రూట్ల ప్రైవేటీకరణ విషయాన్ని ఆర్టీసీ పరిశీలించాలని మాత్రమే కేబినెట్ తీర్మానం చేసిం దని, ఈ దశలోనే పిల్ దాఖలు చేయడం చెల్లదన్నారు. ఆర్టీసీ అమలు చేసే రవాణా విధానాలను మార్పులు, చేర్పులు చేసేందుకు 102 సెక్షన్ వీలు కల్పిస్తోందని, కేంద్ర ప్రభుత్వం చేసిన చట్ట సవరణల ద్వారానే రాష్ట్రాలకు ప్రైవేటు రూట్లకు అనుమతినిచ్చే సర్వాధికారాలు సిద్ధించాయని తెలిపారు. కేబినెట్ నిర్ణయం పూర్తి రూపుదాల్చలేదని, ఆ తీర్మానంపై గవర్నర్ ఆమోదముద్ర వేశాక జీవో జారీ అయితేనే చట్టబద్ధత వస్తుందని, అప్పుడు ఎవరికైనా అభ్యంతరాలుంటే హైకోర్టును ఆశ్రయించేందుకు వీలుంటుందని ఏజీ వాదించారు. ఇప్పుడు గవర్నర్ మాత్రమే సమీక్ష చేయాలా? దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. కేబినెట్ నిర్ణయానికి గవర్నర్ ఆమోదం తెలిపాకే న్యాయ సమీక్ష చేయాలని అంటున్నారా.. ఇప్పుడు గవర్నరే సమీ క్షచేయాలా.. అని ప్రశ్నించింది. ఉత్తరాంచల్ హైకో ర్టు కేసులో రెండు ప్రభుత్వ శాఖల మధ్య జరిగిన లావాదేవీలను న్యాయ సమీక్ష చేయరాదని మాత్రమే సుప్రీంకోర్టు చెప్పిందని, ఇక్కడ కేబినెట్ తీసుకున్న నిర్ణయం రెండు శాఖల మధ్య లావాదేవీలుగా ఎలా పరిగణించాలో చెప్పాలని కోరింది. తిరిగి ఏజీ వాదనలు కొనసాగిస్తూ.. కేరళలో నలుగురు జడ్జీల నియామక విషయంలో వారి పేర్లను మంత్రివర్గం గవర్నర్కు సిఫార్సు చేసే దశలోనే కోర్టులో సవాల్ చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చిందని, ఈ తీర్పు ప్రకారం రూట్ల ప్రైవేటీకరణ నిర్ణయంపై హైకోర్టులో సవాల్ చేయడానికి వీల్లేదన్నారు. పిటిషనర్ అపోహలతో హైకోర్టును ఆశ్రయించారని, పిల్ను తోసిపుచ్చాలని కోరారు. స్టే ఎత్తివేసి మంత్రివర్గం తీర్మానంపై తదుపరి చర్యలకు న్యాయపరమైన అడ్డంకులు తొలగించాలని అభ్యర్థించగా, ధర్మాసనం తోసిపుచ్చింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నామని, అదే రోజున ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై దాఖలైన మరో పిల్ను కూడా విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీస్తున్నారు: సీఎస్ ఆర్టీసీ సమ్మె వల్ల కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నందున యూనియన్ నేతలతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వానికి ఉత్తర్వులివ్వాలని దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై న్యాయ సమీక్ష చేసేందుకు ఆస్కారం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి హైకో ర్టుకు తెలియజేశారు. ఆర్టీసీ యూనియన్తో ప్రభుత్వం చర్చలు జరిపేలా ఉత్తర్వులివ్వాలని, ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలను అడ్డుకోవాలని విశ్వేశ్వరరావు దాఖలు చేసిన మరో పిల్లో హైకోర్టు ఆదేశాల మేరకు సీఎస్ కౌం టర్ దాఖలు చేశారు. ఆర్టీసీ సమ్మెపై లేబర్ కోర్టు తేల్చాలని, పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్ 10 కింది కార్మికశాఖ కమిషనర్ తగిన నిర్ణయం తీసుకోవాలని ఇదే హైకోర్టు ఉత్తర్వులిచ్చిందని చెప్పారు. వేర్వేరు కారణాలతో కార్మికులు చనిపోతే ఆర్టీసీ సమ్మె కారణంగా చనిపోయారని పిల్లో ఆరోపించా రని చెప్పారు. సమ్మె–చర్చలు వంటి అంశాలపై ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా 2 వారాల్లో కార్మిక శాఖ కమిషనర్ తగిన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. -
ఆర్టీసీ సమ్మె విచారణ రేపటికి వాయిదా
-
వినియోగదారుల ఫోరాల్లో మహిళా సభ్యులు లేరు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర, జిల్లా వినియోగదారుల ఫోరాల్లో మహిళా సభ్యులు ఒక్కరు కూడా లేకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలియజేయాలని హైకోర్టు వివరణ కోరింది. రాష్ట్ర వినియోగదారుల ఫోరం 12 జిల్లాల్లోని వినియోగదారుల ఫోరాల్లో ఖాళీగా ఉన్న 24 మంది మహిళా సభ్యుల పోస్టులు భర్తీ చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ కరీంనగర్ వినియోగదారుల మండలి అధ్యక్షుడు ఎన్.శ్రీనివాస్ పిల్ దాఖలు చేశారు. ఫోరాల్లో మహిళా సభ్యుల నియామకాల భర్తీ విషయంపై వివరణ ఇవ్వాలని శుక్రవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్రెడ్డిలతో కూడిన ధర్మాసనం ప్రభుత్వాన్ని కోరింది.