hiked
-
స్పెషల్ బస్సు పేరుతో టీజీ ఆర్టీసీ నిలువు దోపిడీ
నల్గొండ, సాక్షి: ప్రత్యేక బస్సుల పేరుతో టీజీ ఆర్టీసీ నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయి. దసరా పండుగ ముగిసిన తర్వాత కూడా స్పెషల్ బస్సులు అంటూ రేట్లు పెంచి నేటికి అమలు చేస్తున్నారు. మామూలు రోజుల్లో మిర్యాలగూడ నుంచి హైదరాబాద్కు రూ. 290 చార్జ్ ఉండగా.. దసరా సందర్భంగా స్పెషల్ బస్సుల పేరుతో అదనంగా రూ. 70లను ఆర్టీసీ వసూలు చేసింది. ప్రస్తుతం మరో రూ. 40 పెంచి రూ. 110లు అదనంగా వసూలు చేస్తోంది. ప్రస్తుతం మిర్యాలగూడ నుంచి హైదరాబాద్కు టికెట్ ధర రూ. 400 వసూలు చేస్తున్నారు. ఇదేంటని ప్రయాణికులు ప్రశ్నిస్తే.. ఉన్నతాధికారులే అమలు చేయమన్నారని కండక్టర్లు సమాధానం ఇస్తున్నారు. ఈ వ్యవహారంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: రైతుల ద్రోహి కాంగ్రెస్: కేటీఆర్ -
షెల్ డీజిల్ లీటర్ 20 పెంపు
న్యూఢిల్లీ: షెల్ ఇండియా తన అవుట్లెట్ల ద్వారా విక్రయించే డీజిల్ ధరను లీటర్పై రూ.20 పెంచుతున్నట్టు ప్రకటించింది. వారం లోపే రెండో విడత ధరలను పెంచింది. దేశంలో అధిక వాటా కలిగిన ప్రభుత్వరంగ సంస్థలు మాత్రం ఎలాంటి మార్పుల్లేకుండా అవే రేట్లను కొనసాగిస్తున్నాయి. 2022 ఏప్రిల్ నుంచి ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు విక్రయ ధరల్లో ఎలాంటి సవరణలు చేయకపోవడం గమనించొచ్చు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మే నెలలో 75 డాలర్లలోపు ఉంటే, ప్రస్తుతం 95 డాలర్లపైకి చేరుకోవడం తెలిసిందే. షెల్ ఇండియా గత వారం కూడా లీటర్ డీజిల్పై రూ.4 చొప్పున పెంచింది. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 346 పెట్రోల్ స్టేషన్లు ఉన్నాయి. ముంబైలో లీటర్ డీజిల్ను రూ.130కు, చెన్నైలో రూ.129 చొప్పున విక్రయిస్తోంది. పెట్రోల్ లీటర్ ధర రూ.117–118గా ఉంది. అదే ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు లీటర్ డీజిల్ను రూ.95, లీటర్ పెట్రోల్ ధరను రూ.107 స్థాయిలో విక్రయిస్తుండడం గమనార్హం. ప్రాంతాలను బట్టి ఈ రేట్లలో స్వల్ప మార్పులు ఉంటాయి. -
ముడిచమురుపై విండ్ఫాల్ ట్యాక్స్ పెంపు
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపైన, డీజిల్ ఎగుమతులపైన కేంద్రం విండ్ఫాల్ ట్యాక్స్ను పెంచింది. దీనితో క్రూడాయిల్పై ట్యాక్స్ టన్నుకు రూ. 7,100 మేర పెరిగింది. అలాగే, డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని (ఎస్ఏఈడీ) లీటరుకు రూ. 1 చొప్పున కేంద్రం పెంచింది. దీంతో ఇది లీటరుకు రూ. 5.50కి చేరింది. అటు విమాన ఇంధనం (ఏటీఎఫ్)పై కూడా లీటరుకు రూ. 2 చొప్పున సుంకం విధించింది. ఇప్పటి వరకు ఏటీఎఫ్పై ఎస్ఏఈడీ లేదు. తాజా మార్పులు ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రం తెలిపింది. క్రూడ్ రేట్ల కారణంగా చమురు కంపెనీలు అసాధారణంగా ఆర్జిస్తున్న లాభాలపై కేంద్రం 2022 జూలై 1 నుంచి విండ్ఫాల్ ట్యాక్స్ను విధిస్తోంది. -
పెట్రోల్కు పెరిగిన డిమాండ్
న్యూఢిల్లీ: పెట్రోల్ విక్రయాలు జూలైలో గతేడాది ఇదే నెలతో పోల్చినప్పుడు 4 శాతం వరకు పెరిగాయి. 2.76 మిలియన్ టన్నుల అమ్మకాలు నమోదయ్యాయి. ముఖ్యంగా జూలై మాసంలో మొదటి 15 రోజుల్లో పెట్రోల్ వినియోగం తగ్గగా, తదుపరి 15 రోజుల్లో గణనీయంగా పుంజుకుంది. అయితే నెలవారీగా (జూన్తో పోలి్చనప్పుడు) చూస్తే పెట్రోల్ అమ్మకాలు 4.6 శాతం తగ్గాయి. మరోవైపు డీజిల్ అమ్మకాల్లో విరుద్ధమైన పరిస్థితి కనిపించింది. ప్రధానంగా డీజిల్ను రవాణా రంగంలో వినియోగిస్తారు. కనుక, వర్షాల ప్రభావం వినియోగంపై పడినట్టు తెలుస్తోంది. డీజిల్ అమ్మకాలు 4.3 శాతం తగ్గి 6.15 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. దేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే పెట్రోలియం ఉత్పత్తి ఇదే కావడం గమనార్హం. వర్షాల సమయంలో ఏటా డీజిల్ అమ్మకాలు తగ్గుతుండడం సాధారణంగానే కనిపిస్తుంటుంది. ఈ ఏడాది ఏప్రిల్లో 6.7 శాతం, మే నెలలో 9.3 శాతం చొప్పున డీజిల్ అమ్మకాలు పెరగడం గమనించొచ్చు. ఇక ఈ ఏడాది జూన్ నెలలోని అమ్మకాలతో పోల్చి చూసినా, జూలైలో డీజిల్ విక్రయాలు (7.13 మిలియన్ టన్నులు) 13.7 శాతం తగ్గాయి. భారత్లో ఆయిల్ డిమాండ్ రోజువారీగా 0.2 మిలియన్ బ్యారెళ్ల చొప్పున 2023లో ఉంటుందని చమురు ఉత్పత్తి దేశాల సమాఖ్య ఓపెక్ అంచనాగా ఉంది. ఇక విమాన సేవలకు డిమాండ్ గణనీయంగా పెరగడంతో ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) డిమాండ్ సైతం 10 శాతం పెరిగి జూలైలో 6,03,500 టన్నులుగా నమోదైంది. 2021 జూలైలో వినియోగంతో పోలిస్తే రెట్టింపు కాగా, కరోనా ముందు నాటి సంవత్సరం 2019 జూలైలో వినియోగంతో పోల్చి చూస్తే 2.9 శాతం తక్కువగా ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. జూలైలో వంటగ్యాస్ (ఎల్పీజీ) అమ్మకాలు క్రితం ఏడాది ఇదే నెలతో పోలి్చచూసినప్పుడు 1.7 శాతం తగ్గి 2.46 మిలియన్ టన్నులుగా నమోదైంది. జూన్ నెలతో పోల్చి చూస్తే కనుక 8 శాతం ఎల్పీజీ అమ్మకాలు పెరిగాయి. -
హైదరాబాద్లో పెరిగిన ప్రాపర్టీల ధరలు
న్యూఢిల్లీ: హైదరాబాద్ సహా దేశంలోని ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ఇళ్ల ధరలు జనవరి–మార్చి మధ్య పెరిగినట్టు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్హెచ్బీ) గణాంకాలు వెల్లడించాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్లో ధరలు 7.9 శాతం పెరిగాయి. అత్యధికంగా కోల్కతాలో 11 శాతం, అహ్మదాబాద్లో 10.8 శాతం, బెంగళూరులో 9.4 శాతం మేర ఇళ్ల ధరలు ఎగిశాయి. చెన్నైలో 6.8 శాతం, ఢిల్లీలో 1.7 శాతం, ముంబైలో 3.1 శాతం, పుణెలో 8.2 శాతం చొప్పున పెరిగినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా టాప్–50 పట్టణాల్లో కేవలం ఏడు పట్టణాల్లోనే ఇళ్ల ధరలు తగ్గాయి. గృహ రుణాలపై రేట్లు ఇప్పటికీ కరోనాకు ముందున్న నాటితో పోలిస్తే తక్కువలోనే ఉండడం, కొనుగోళ్లకు మద్దతుగా నిలుస్తోంది. 50 పట్టణాల్లో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంక్ల వద్దనున్న ప్రాపర్టీ వ్యాల్యూషన్లను ఎన్హెచ్బీ పరిగణనలోకి తీసుకుంది. ఈ పట్టణాల్లో ఇళ్ల ధరలు సగటున 5.8 శాతం మేర మార్చి త్రైమాసికంలో పెరిగినట్టు తెలుస్తోంది. (సరికొత్త ఫీచర్లతో ప్రీమియం హీరో బైక్ వచ్చేస్తోంది: ఎప్పుడంటే?) క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రేట్ల పెరుగుదల 5.3 శాతంగా ఉండడం గమనార్హం. టాప్–50లో అత్యధికంగా గాంధీనగర్లో ఇళ్ల ధరలు 19.6 శాతం పెరిగితే, లుధియానాలో 12.9 శాతం తగ్గాయి. ఇక త్రైమాసికం వారీగా చూస్తే.. అంటే 2022 చివరి మూడు నెలలతో పోలిస్తే, 2023 మొదటి మూడు నెలల్లో ఇళ్ల ధరలు 50 పట్టణాల్లో సగటున 1.3 శాతం పెరిగాయి. 2021 జూన్ నుంచి ప్రతీ త్రైమాసికానికి రేట్లు పెరుగుతూ వస్తుండడాన్ని ఉండడాన్ని నివేదిక ప్రస్తావించింది. ఇదీ చదవండి: 1200 లోన్తో మొదలై.. రూ 2.58 లక్షల కోట్లకు మరిన్ని రియల్టీ వార్తలు, బిజినెస్ అప్డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త ధరలు - ఇలా ఉన్నాయి
Ola Electric Price Hiked: భారతదేశంలో రోజు రోజుకి మంచి అమ్మకాలతో దూసుకెళ్తున్న 'ఓలా ఎలక్ట్రిక్' ఇప్పుడు కస్టమర్లకు ఒక షాకింగ్ న్యూస్ వెల్లడించింది. కంపెనీ ఇప్పుడు తన ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను అమాంతం పెంచినట్లు ప్రకటించింది. ఓలా ఎలక్ట్రిక్ కొత్త ధరలను గురించి మరికొన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కొత్త ధరలు.. నివేదికల ప్రకారం.. ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 & ఎస్1 ప్రో ధరలు మాత్రమే పెరిగాయి. ఎంట్రీ లెవెల్ మోడల్ అయిన 'ఎస్1 ఎయిర్' ధరలు మారలేదు. ఓలా మిడ్-స్పెక్ ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేరియంట్లనులో లభిస్తుంది. అవి ఒకటి 2 కిలోవాట్ బ్యాటరీ కలిగిన వేరియంట్, రెండు 3 కిలోవాట్ బ్యాటరీ కలిగిన వేరియంట్. గతంలో ఎస్1 3kWh ధర రూ. 1.15 లక్షలు కాగా, ఇప్పుడు ఈ స్కూటర్ ధర రూ. 15,000 పెరిగి రూ. 1.30 లక్షలు చేరింది. అదే సమయంలో S1 ప్రో ధర రూ. 1.40 లక్షలకు చేరింది. (ఇదీ చదవండి: ఇప్పుడు ప్రపంచ కుబేరుడు ఇతడే..) ఇక ఓలా ఎలక్ట్రిక్ ఎంట్రీ లెవెల్ మోడల్ ఎస్1 ఎయిర్ విషయానికి వస్తే, ఇది 2kWh, 3kWh, 4kWh అనే మూడు బ్యాటరీ ఫ్యాక్స్ కలిగి ఉంటుంది. వీటి ధరలు వరుసగా రూ. 84999, రూ. 99999, రూ. 1.10 లక్షలు. రేంజ్ విషయానికి వస్తే 85 కిమీ, 125 కిమీ, 165 కిమీ. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇవి చాలా ఉత్తమంగా ఉంటాయి. ధరల పెరుగుదల అమ్మకాలపైన ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నాము. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
బంగారం డిమాండ్కు ధర సెగ
ముంబై: దేశంలో బంగారం ధరలు తీవ్ర స్థాయికి చేరడంతో, జనవరి–మార్చి త్రైమాసికంలో డిమాండ్ భారీగా 17 శాతం పడిపోయింది. వినియోగదారులు తీవ్ర ధరల కారణంగా కొనుగోళ్లను వాయిదా వేసుకునే పరిస్థితి నెలకొంది. ‘మొదటి త్రైమాసికంలో పసిడి డిమాండ్ ట్రెండ్స్’ పేరుతో ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) విడుదల చేసిన ఒక నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు... ► ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో భారత్ పసిడి డిమండ్ 112.5 టన్నులు. 2022 ఇదే కాలంలో ఈ విలువ 135.5 టన్నులు. ► పసిడి ఆభరణాల డిమాండ్ ఇదే కాలంలో 94.2 టన్నుల నుంచి 78 టన్నులకు పడిపోయింది. 2010 నుంచి ఒక్క మహమ్మారి కరోనా కాలాన్ని మినహాయిస్తే పసిడి ఆభరణాల డిమాండ్ మొదటి త్రైమాసికంలో 100 టన్నుల దిగువకు పడిపోవడం ఇది నాల్గవసారి. ► విలువల రూపంలో చూస్తే, మొత్తంగా పసిడి కొనుగోళ్లు 9 శాతం క్షీణించి రూ.61,540 కోట్ల నుంచి రూ.56,220 కోట్లకు పడిపోయాయి. ► ఒక్క ఆభరణాల డిమాండ్ విలువల్లో చూస్తే, 9 శాతం పడిపోయి రూ.42,800 కోట్ల నుంచి రూ.39,000 కోట్లకు పడిపోయాయి. ► పెట్టుబడుల పరిమాణం పరంగా డిమాండ్ (కడ్డీలు, నాణేలు) 17 శాతం తగ్గి 41.3 టన్నుల నుంచి 34.4 టన్నులకు క్షీణించింది. ప్రపంచ పసిడి డిమాండ్ కూడా మైనస్సే.. ఇదిలావుండగా, ప్రపంచ వ్యాప్తంగా కూడా పసిడి డిమాండ్ మొదటి త్రైమాసికంలో బలహీనంగానే నమోదయ్యింది. 13 శాతం క్షీణతతో ఈ పరిమాణం 1,080.8 టన్నులుగా ఉంది. రూపాయి ఎఫెక్ట్... పసిడి ధరలు పెరడానికి అంతర్జాతీయ అంశాలు ప్రధాన కారణంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ ఫండ్ రేటు పెరుగుదలను ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. డాలర్ బలోపేతం, రూపాయి బలహీనత వంటి కారణాలతో గత ఏడాదితో పోల్చితే పసిడి ధర 19 శాతం పెరిగింది. పసిడి 10 గ్రాముల (స్వచ్ఛత) ధర రూ.60,000 పైన నిలకడగా కొనసాగుతోంది. ధర తీవ్రతతో తప్పనిసరి పసిడి అవసరాలకు వినియోగదారులు తమ పాత ఆభరణాల రీసైక్లింగ్, తద్వారా కొత్త కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పెట్టుబడులకు సంబంధించి డిజిటల్ గోల్డ్ ప్లాట్ఫామ్ను ఆశ్రయిస్తున్నారు. ఈ విభాగంలో కొనుగోళ్ల పరిమాణాలు కొంత మెరుగుపడుతున్నాయి. డిమాండ్ వార్షికంగా 750 నుంచి 800 టన్నలు శ్రేణిలో నమోదుకావచ్చు. – సోమసుందరం, డబ్ల్యూజీసీ భారత్ రీజినల్ సీఈఓ -
డెబిట్ కార్డు చార్జీల పెంపు!
ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ కస్టమర్లకు చేదు వార్త చెప్పింది. డెబిట్ కార్డ్ వార్షిక చార్జీలను రూ.60 మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బ్యాంక్ కస్టమర్లకు ఈ-మెయిల్ ద్వారా తెలియజేసింది. ఇదీ చదవండి: అనుకోకుండా అన్నా.. ‘డాలర్ ఫైనాన్సియల్ టెర్రరిస్ట్’ వ్యాఖ్యపై ఉదయ్ కోటక్ వివరణ రూ.60 బాదుడు కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇప్పటివరకు డెబిట్ కార్డ్ వార్షిక చార్జీ కింద రూ.199 వసూలు చేస్తోంది. దీనికి జీఎస్టీ అదనం. ఈ చార్జీని ఇప్పుడు రూ.259 లకు పెంచింది. దీంతో పాటు జీఎస్టీ అదనంగా ఉంటుంది. అంటే రూ.60 మేర చార్జీ పెరుగుతుందన్న మాట. పెరిగిన చార్జీలు మే 22 నుంచి అమలులోకి వస్తాయి. అలాగే ఈ చార్జీలు బ్యాంకులోని అన్ని రకాల ఖాతాలకు వర్తిస్తాయి. ఇక జూన్ 1 నుంచి సేవింగ్స్, శాలరీ అకౌంట్లకు సంబంధించి అమలయ్యే ఛార్జీలు ఇలా ఉన్నాయి.. అకౌంట్లో కనీస బ్యాలెన్స్ లేకుంటే.. 6 శాతం లేదా గరిష్టంగా రూ. 600 వరకు ఛార్జీ వసూలు చేస్తుంది. ఇష్యూ చేసిన చెక్ ఏదైనా నాన్ ఫైనాన్షియల్ కారణంతో రిటర్న్ అయితే రూ. 50 ఛార్జీ పడుతుంది. అలాగే చెక్ డిపాజిట్ అయిన తర్వాత రిటర్న్ అయితే రూ.200 చార్జీ ఉంటుంది. ఇదీచదవండి: International labour Day: 23 దేశాల్లో జీతాలు రూ.లక్షకుపైనే.. మరి భారత్లో...? -
వీసా దరఖాస్తు ఫీజులు పెంచిన అమెరికా
న్యూఢిల్లీ: అమెరికాకు వచ్చే వారి టూరిస్ట్, స్టూడెంట్ వీసా దరఖాస్తుల ఫీజును పెంచుతున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. విజిటర్ వీసాలు, నాన్ పిటిషన్ బేస్డ్ నాన్ ఇమిగ్రాంట్ వీసాల ఫీజును ప్రస్తుతమున్న 160 డాలర్ల నుంచి 185 డాలర్లకు పెంచుతున్నట్లు పేర్కొంది. అదేవిధంగా, తాత్కాలిక వృత్తిదారులు(టెంపరరీ వర్కర్స్)కిచ్చే కొన్ని రకాల నాన్ ఇమిగ్రాంట్ వీసాల ఫీజు ప్రస్తుతం ఉన్న 190 డాలర్ల నుంచి 205 డాలర్లకు పెరుగుతుందని తెలిపింది. ప్రత్యేక వృత్తినిపుణు(స్పెషలిజం ఆక్యుపేషన్)లకు ఫీజును 315 డాలర్లకు పెంచుతున్నట్లు పేర్కొంది. ఈ నిర్ణయం మే 30వ తేదీ నుంచి అమల్లోకి రానుందని ప్రకటించింది. కాన్సులర్ సేవల ఫీజుల్లో ఎటువంటి మార్పులు లేవని స్పష్టం చేసింది. -
ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలు.. భారీగా పెరగనున్న కార్లు, బైక్ల ధరలు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా అన్ని రకాల వాహనాల ధరలు ప్రియం కానున్నాయి. కాలుష్యాన్ని కట్టడి చేసే చర్యల్లో భాగంగా భారత్ స్టేజ్ - 6 రెండవ దశ ఉద్గార ప్రమాణాలు వచ్చే నెల నుంచి అమలులోకి వస్తుండడమే ఇందుకు కారణం. ప్యాసింజర్, ద్విచక్ర, వాణిజ్య వాహనాలకు ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలు వర్తించనున్నాయి. చాలా కంపెనీలు ఇప్పటికే ధరలను సవరిస్తున్నట్టు ప్రకటించాయి. మారుతీ సుజుకీ, హోండా కార్స్, టాటా మోటార్స్, హీరో మోటోకార్ప్ వంటి సంస్థలు వీటిలో ఉన్నాయి. ఖరీదు రూ.30,000 వరకు.. ప్రమాణాలకు అనుగుణంగా కంపెనీలు తమ వాహనాలను అప్గ్రేడ్ చేశాయి. దీంతో ప్యాసింజర్ కార్లు మోడల్, వేరియంట్నుబట్టి రూ.10,000 మొదలుకుని రూ.30,000 వరకు ధరలు పెరగనున్నాయి. ప్రారంభ స్థాయి ద్విచక్ర వాహనాలు రూ.2,500 దాకా భారం కానున్నాయి. ఇప్పటికే ముడిసరుకు వ్యయాలకు అనుగుణంగా కంపెనీలు వాహనాల ధరలను పెంచుతూ వస్తున్నాయి. అన్ని రకాల వాహన విభాగాల్లోనూ తయారీ కంపెనీలు ధరలను సవరించాయి. వాహనాల్లో మార్పులు.. నూతన ఉద్గార ప్రమాణాల కింద వాహనాలకు ఆధునిక సాంకేతికత వినియోగించాల్సి వస్తోంది. ప్రోగ్రామ్తో కూడిన ఫ్యూయల్ ఇంజెక్టర్స్, సెల్ఫ్ డయాగ్నోస్టిక్ డివైసెస్ ఏర్పాటు తప్పనిసరి అయింది. వాహనం నుంచి వెలువడే కాలుష్య స్థాయిని తెలిపే పరికరం అమర్చాల్సి ఉంటుంది. యూరప్లో అమలులో ఉన్న యూరో- 6 ప్రమాణాలకు సమానంగా భారత్ స్టేజ్- 6 రెండవ దశ ఉద్గార ప్రమాణాలను తీర్చిదిద్దారు. దీంతో వాహనాల్లోని ఇంజిన్లను అప్గ్రేడ్ చేయాల్సి వస్తోంది. ఇప్పటికే పరిశ్రమలో 7,00,000 ప్యాసింజర్ కార్లకు బుకింగ్స్ నమోదై ఉన్నాయి. ధర పెరగడం వల్ల డిమాండ్ తగ్గే అవకాశం లేదని కంపెనీలు ధీమాగా ఉన్నాయి. వ్యయ భారంతో.. ప్రమాణాలకు అనుగుణంగా ఇంజన్లలో మార్పుల ప్రక్రియ ఖర్చుతో కూడుకున్నది. అధికంగా డిమాండ్ ఉన్న మోడళ్లను మాత్రమే కంపెనీలు అప్గ్రేడ్ చేస్తున్నాయి. డిమాండ్ తక్కువ ఉన్న మోడళ్లకు స్వస్తి పలకడం తప్పడం లేదు. ఏప్రిల్ 1 నుంచి ఇటువంటివి కనుమరుగు కానున్నాయి. వీటిలో మారుతీ సుజుకీ ఆల్టో 800, హోండా జాజ్, డబ్ల్యూఆర్–వి, అమేజ్ డీజిల్, సిటీ జనరేషన్-4, సిటీ జనరేషన్-5 డీజిల్, మహీంద్రా ఆల్టరస్ జీ4, కేయూవీ100, మరజ్జో, స్కోడా అక్టావియా, సూపర్బ్, హ్యుండై ఐ20 డీజిల్, వెర్నా డీజిల్, రెనో క్విడ్ 800, నిస్సాన్ కిక్స్, టాటా ఆ్రల్టోజ్ డీజిల్, టయోటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్ మోడళ్లు ఉన్నాయి. -
ఒకటి తగ్గింది.. మరొకటి పెరిగింది: ఇదీ టయోటా హైలెక్స్ ధరల వరుస!
భారతదేశంలో కేవలం కార్లకు, బైకులకు మాత్రమే కాకుండా పికప్ ట్రక్కులకు కూడా మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని టొయోటా కంపెనీ గత ఏడాది 'హైలెక్స్' (Hilux) విడుదల చేసింది. అయితే కంపెనీ ఇప్పుడు ఒక వేరియంట్ ధరలను కొంత తగ్గించింది, మరో వేరియంట్ ధరలను పెంచింది. వేరియంట్స్ & ధరలు: నిజానికి టొయోటా హైలెక్స్ స్టాండర్డ్, హై అనే రెండు ట్రిమ్లలో లభిస్తుంది. ఇప్పుడు స్టాండర్డ్ మోడల్ మీద ఏకంగా రూ. 3.59 లక్షలు తగ్గించింది. కావున ప్రస్తుతం ఈ వేరియంట్ ధర రూ. 30.40 లక్షలు. అదే సమయంలో హై మ్యాన్యువల్, ఆటోమాటిక్ మీద వరుసగా రూ. 1.35 లక్షలు, రూ. 1.10 లక్షలు పెంచింది. దీని ప్రస్తుత ధరలు రూ. 37.15 లక్షలు, రూ. 37.90 లక్షలు. టయోటా ఈ ఏడాది ప్రారంభంలో తన రెండవ బ్యాచ్ బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కాగా ఇప్పుడు ఒక మోడల్ మీద భారీగా ధరలను తగ్గించి, మరో మోడల్ ధరలను పెంచింది. ధరల పెరుగుదల అమ్మకాల మీద ప్రభావం చూపే అవకాశం ఉందా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. డిజైన్ & ఫీచర్స్: టయోటా హైలక్స్ ఆధునిక డిజైన్ పొందుతుంది. ఇందులో పెద్ద హెక్సాగోనల్ ఫ్రంట్ గ్రిల్ ఉంటుంది, దీనికి రెండు వైపులా ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్లైట్లు ఇవ్వబడ్డాయి. ఈ పికప్ ట్రక్కు అల్లాయ్ వీల్స్తో పాటు వీల్ ఆర్చ్ల చుట్టూ ప్లాస్టిక్ క్లాడింగ్ పొందుతుంది. దీని డిజైన్ దాదాపు ఫార్చ్యూనర్ మాదిరిగానే ఉంటుంది. ఇది వర్టికల్ టెయిల్ లైట్ మరియు డబుల్ క్యాబ్ స్టైలింగ్ పొందుతుంది. (ఇదీ చదవండి: భార్య గురించి అలా ట్వీట్ చేసిన అష్నీర్ గ్రోవర్) ఇంటీరియర్ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో ఆపిల్ కార్ప్లే & ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 8.0 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మౌంటెడ్ కంట్రోల్లతో కూడిన మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. కొలతలు: టయోటా ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యూనర్ మాదిరిగానే ఈ కొత్త పికప్ ట్రక్కును కూడా IMV-2 ల్యాడర్ ఫ్రేమ్ ఛాసిస్పై నిర్మించబడింది. కావున దీని పొడవు 5,325 మి.మీ, వెడల్పు 1,855 మి.మీ, ఎత్తు 1,865 మి.మీ, వీల్బేస్ 3,085 మి.మీ వరకు ఉంటుంది. అదే సమయంలో దీని గ్రౌండ్ క్లియరెన్స్ 216 మి.మీ కాగా, బరువు 2.1 టన్నులు వరకు ఉంటుంది. మొత్తం మీద భారతదేశంలో అమ్ముడవుతున్న వాహనాల్లో ఇదే భారీ వాహనం అని చెప్పాలి. ఇంజిన్: టయోటా హైలక్స్ 2.8 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ ద్వారా 204 బిహెచ్పి పవర్ 420 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో జత చేయబడి ఉంటుంది. ఇందులో ఫోర్ వీల్ డ్రైవ్ స్టాండర్డ్గా అందుబాటులో ఉంటుంది. (ఇదీ చదవండి: విడుదలకు సిద్దమవుతున్న మారుతి కార్లు: కొత్త జిమ్నీ నుంచి ఫ్రాంక్స్ వరకు..) ప్రత్యర్థులు: దేశీయ మార్కెట్లో అమ్ముడవుతున్న టయోటా హైలక్స్ ఒక ప్రత్యేకమైన విభాగంలో ఉండటం వల్ల దీనికి ప్రధాన ప్రత్యర్థులు లేదు. అయిత్ ఇది 'ఇసుజు D-Max V-క్రాస్'కి అమ్మకాల్లో ప్రత్యర్థిగా నిలిచే అవకాశం ఉంది. కానీ దీని ధర హైలక్స్ కంటే చాలా తక్కువ. -
మరోసారి వడ్డీరేట్లు పెంచిన RBI
-
కేంద్ర ప్రభుత్వోద్యోగులకు... 4% డీఏ పెంపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక లభించింది. ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని (డీఏ), 4 శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈ పెరుగుదల జులై 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వంలోని 41.85 లక్షల మంది ఉద్యోగులకు, 69.76 లక్షల మంది ఫించనుదారులకు లబ్ధి చేకూరుతుంది. మూల వేతనంపై 34శాతంగా ఉన్న డీఏకి అదనంగా 4% పెంచడంతో 38శాతానికి చేరుకుంది. ఈ పెంపుతో ఖజానాపై ఏడాదికి 12.852 కోట్ల అదనపు భారం పడుతుంది. మరో మూడు నెలలు ఉచితంగా రేషన్ కరోనా సంక్షోభ సమయంలో లాక్డౌన్లతో ఉపాధి కోల్పోయిన నిరుపేదల్ని ఆదుకోవడానికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) పేరుతో ఉచితంగా ఇచ్చే రేషన్ పథకం ఈ శుక్రవారంతో ముగిసిపోనుంది. ధరల భారం, పండుగ సీజన్ వస్తూ ఉండడంతో మరో మూడు నెలలు ఉచితంగా రేషన్ అందించాలని కేంద్ర మంత్రిమండలి నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎంజీకేఏవై కింద ఉచిత రేషన్ పథకాన్ని మరో మూడు నెలలు కొనసాగించాలని నిర్ణయించింది. వివరాలను కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు గరీబ్ కళ్యాణ్ అన్న యోచన పథకం కింద నిరుపేదలు ఒక్కొక్కరికి ప్రతీ నెల 5 కేజీల బియ్యం, గోధుమలు ఉచితంగా అందిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఈ పథకాన్ని పొడిగించడంతో కేంద్రానికి అదనంగా రూ.44,762 కోట్లు ఖర్చు అవుతుంది. ప్రతీ నెల 80 కోట్ల మంది ఉచిత రేషన్ని తీసుకుంటున్నారు. రైల్వేల అభివృద్ధికి రూ.10వేల కోట్లు రైల్వేల అభివృద్ధి ప్రాజెక్టుకి రూ.10 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయింది. న్యూఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై సీఎస్ఎంటీ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కోసం రైల్వే చేసిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అత్యంత ఆధునిక టెక్నాలజీతో ఈ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ 2.5 నుంచి మూడున్నరేళ్లలో పూర్తి చేయనున్నట్టు రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ వెల్లడించారు. -
మూడు నెలల కనిష్టమే.. అయినా రెండంకెల పైనే!
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జూన్లో 15.18 శాతంగా నమోదయ్యింది. అంటే 2021 జూన్తో పోల్చితే ఈ బాస్కెట్ ధర 15.18 శాతం పెరిగిందన్నమాట. ఇది మూడు నెలల కనిష్ట స్థాయి. మే నెలతో పోల్చితే ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ, రెండంకెలపైనే ఈ రేటు కొనసాగడం ఇది వరుసగా 15వ నెల. ఆహార ధరలు మాత్రం తీవ్రంగా కొనసాగుతుండడం ఆందోళన కలిగించే అంశం. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం కొన్ని కీలక విభాగాలను పరిశీలిస్తే.. ► ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం జూన్లో 14.39 శాతం. మేతో ఈ రేటు 12.34 శాతంగా ఉంది. కూరగాయలు (56.75%), ఆలూ (39.38%), పండ్ల (20.33%) ధరలు భారీగా పెరిగాయి. ► ఖనిజాల ధరలు మాత్రం 8.55% తగ్గాయి. ► క్రూడ్ పెట్రోలియం, సహజవాయువు ధరలు 77.29 శాతం ఎగశాయి. ► కాగా, జూన్లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.01%గా నమోదైంది. -
ఎరుపెక్కుతున్న టమాటా.. కిలో రూ.100
సాక్షి, న్యూఢిల్లీ: టమాటా ఎరుపెక్కుతోంది. సరఫరా తగ్గడంతో పలు రాష్ట్రాల్లో టమాటా ధరలు కొండెక్కుతున్నాయి. కేరళలో రూ.100 మార్కును చేరింది. ఒడిశాలో రూ.90, కర్నాటకలో రూ.70, ఏపీ, తెలంగాణల్లోనూ రూ.60కి పైగా పెరిగినట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ నివేదిక చెప్తోంది. తీవ్ర ఎండలకు వేడిగాలులు తోడవడంతో టమాటా ఉత్పత్తి బాగా పడిపోయింది. టమాటా ఉత్పత్తిలో ముందున్న ఏపీ, ఒడిశాల్లో అసని తుఫాన్తో పంట బాగా దెబ్బ తింది. ఏపీలో విశాఖ, కర్నూలు, తిరుపతిల్లో కిలో రూ.50–70 పలుకుతున్నట్టు వినియోగదారుల శాఖ నిత్యావసర సరుకుల ధరల డేటా పేర్కొంది. -
ఎల్లుండి నిర్మాణ పనులు బంద్
సాక్షి, హైదరాబాద్: సిమెంట్, స్టీల్, అల్యూమి నియం, పీవీసీ పైపులు వంటి అన్ని రకాల నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదలను అన్ని డెవలపర్ల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ధరల పెరుగుదలకు నిరసనగా ఈనెల 4న (సోమవారం) హైదరాబాద్ వ్యాప్తంగా ఒక్క రోజు నిర్మాణ పనులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ధరలు పెరగడం వల్ల నగదు ప్రవాహానికి ఇబ్బందిగా మారడంతో పాటు డెవలపర్లకు వర్కింగ్ క్యాపిటల్ సమస్య కూడా వస్తుందని సంఘాలు ముక్తకంఠంతో తెలిపాయి. నిర్మాణ వ్యయాలు గణనీయంగా పెరగడం వల్ల 600కు పైగా డెవలపర్లపై తీవ్ర ప్రభావం పడుతుందని, దీంతో గృహాల ధరలు 10–15 శాతం మేర పెరుగుతాయని తెలిపాయి. క్రెడాయ్, ట్రెడా , టీబీఎఫ్, టీడీఏ ప్రతినిధులు శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) తెలంగాణ చైర్మన్ సీహెచ్ రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ.. అనిశ్చితి పరిస్థితులలో కొంతమంది బిల్డర్లు ప్రాజెక్ట్ల నిర్మాణాలను ఆపేశారని, ముడి పదార్థాల ధరలు తగ్గిన తర్వాత ప్రాజెక్ట్లను పునః ప్రారంభించడానికి యోచిస్తున్నారన్నారు. దేశంలో రెండో అతిపెద్ద ఉపాధి రంగమైన స్థిరాస్తి రంగంలో నిర్మాణ పనులను నిలిపివేస్తే.. ఈ రంగంపై ఆధారపడిన వారి జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. అలాగే ఆర్థిక వ్యవస్ధ వృద్ధిపై కూడా ప్రభావం చూపుతుందన్నారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లపై ఇన్పుట్ ట్యాక్స్ తగ్గించడంతో పాటు జీఎస్టీని సరళీకృతం చేయాలని ఆయన సూచించారు. నిర్మాణ రంగ ముడి పదార్థాల ప్రస్తుత ధరలను హేతుబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ తెలంగాణ ప్రెసిడెంట్ డీ మురళీ కృష్ణారెడ్డి, హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ పీ రామకృష్ణారావు, జనరల్ సెక్రటరీ వీ రాజశేఖర్ రెడ్డిలు కూడా పాల్గొన్నారు. వీళ్లేమన్నారంటే.. ► తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) అధ్యక్షులు సునీల్ చంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఇన్పుట్ వ్యయాలు పెరగడం, మార్జిన్లు తగ్గడంతో డెవలపర్లకు ఆర్థిక కష్టాలు పెరిగాయి. పెరిగిన నిర్మాణ సామగ్రి ధరల నేపథ్యంలో డెవలపర్లకు ప్రస్తుత ప్రాజెక్ట్లలో ధరలు పెంచడం మినహా వేరే అవకాశం లేదని ఆయన తెలిపారు. ► తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్) అధ్యక్షులు సీ ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. మార్కెట్లో తిరిగి సానుకూల వాతావరణం నెలకొనాలంటే.. కేంద్ర జీఎస్టీ రేట్లను తగ్గించి ఇన్పుట్ క్రెడిట్ను అందించాలని, అలాగే రాష్ట్ర ప్రభు త్వం స్టాంప్ డ్యూటీ తగ్గించాలన్నారు. ► తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ (టీడీఏ) ప్రెసిడెంట్ జీవీ రావు మాట్లాడుతూ.. ఇన్పుట్ వ్యయం పెరిగిన నేపథ్యంలో డెవలపర్లు ధరలను పెంచక తప్పదని అయితే ఈ పెంపు అన్ని రకాల గృహాలపై పడుతుందన్నారు. పర్సంటేజీ పరంగా చూస్తే అందుబాటు ధరల విభాగంలోని గృహాలపై ధరల పెరుగుదల ప్రభావం ఉంటుందన్నారు. -
14 కేజీల వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెంపు
-
సంపద పెరిగింది.. సంతోషం తగ్గింది!
ముంబై: దేశీయంగా డాలర్ మిలియనీర్ల (రూ. 7 కోట్ల పైగా వ్యక్తిగత సంపద ఉన్న వారు) సంఖ్య 2021లో 4.58 లక్షల కుటుంబాల స్థాయికి చేరింది. అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే ఇది 11 శాతం అధికం. హురున్ రిపోర్ట్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2026 నాటికి భారత్లో డాలర్ మిలియనీర్ల సంఖ్య 30 శాతం పెరిగి 6 లక్షల కుటుంబాల స్థాయికి చేరనుంది. ముంబైలో అత్యధికంగా 20,300 కుటుంబాలు, ఢిల్లీలో 17,400, కోల్కతాలో 10,500 కుటుంబాలు డాలర్ మిలియనీర్ల కేటగిరీలో ఉన్నాయి. మరోవైపు, ఇటు వ్యక్తిగత అటు వృత్తిగత జీవితాల్లో సంతోషంగా ఉన్న వారి సంఖ్య మాత్రం 72 శాతం నుంచి 66 శాతానికి తగ్గింది. ఈ అంశానికి సంబంధించి హురున్ నిర్వహించిన సర్వేలో 350 మంది డాలర్ మిలియనీర్లు పాల్గొన్నారు. ‘భారత మార్కెట్లో అడుగు పెట్టడానికి లేదా ఇప్పటికే ఉన్న తమ కార్యకలాపాలను మరింత పటిష్టం చేసుకోవడానికి లగ్జరీ బ్రాండ్లు, సర్వీస్ ప్రొవైడర్లకు వచ్చే దశాబ్ద కాలంలో ఎన్నో అర్థవంతమైన అవకాశాలు లభించగలవు‘ అని హురున్ ఇండియా ఎండీ, చీఫ్ రిసర్చర్ అనాస్ రెహ్మాన్ జునైద్ చెప్పారు. 130 కోట్ల పైగా జనాభా గల దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్న ప్రస్తుత తరుణంలో కుబేరులపై హురున్ నివేదికలోని అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. స్వచ్ఛంద సంస్థ ఆక్స్ఫామ్ ఇటీవలి నివేదిక ప్రకారం భారత్లోని టాప్ 100 మంది సంపన్నుల సంపద ఏకంగా 775 బిలియన్ డాలర్లుగా ఉంది. 2021లో ప్రపంచం మొత్తం మీద కడు పేదరికంలోకి జారిపోయే వారి సంఖ్యలో దాదాపు సగభాగం (4.6 కోట్ల మంది) భారత్లోనే ఉంటారని ఆక్స్ఫామ్ అంచనా వేసింది. సర్వేలోని ఇతర విశేషాలు.. ► పన్నులు చెల్లించడమనేది తమ సామాజిక బాధ్యతకు నిదర్శనంగా భావించే వారి సంఖ్య.. సర్వేలో పాల్గొన్న వారిలో మూడో వంతుకన్నా తక్కువే ఉంది. ► సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని అభిప్రాయపడిన వారి సంఖ్య కేవలం 19 శాతమే. ► మూడింట రెండొంతుల మంది తమ సంతానాన్ని ఉన్నత విద్య కోసం విదేశాలు పంపించేందుకు ప్రాధాన్యమిస్తామని చెప్పారు. ఫేవరెట్ గమ్యంగా అమెరికా ఉండగా, బ్రిటన్, న్యూజిలాండ్, జర్మనీ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ► ఇక వినియోగంపరమైన అంశాల విషయానికొస్తే.. నాలుగో వంతు మంది తమ కార్లను ప్రతి మూడేళ్లకోసారి మార్చేస్తున్నారు. చాలా మందికి మెర్సిడెస్ బెంజ్ కార్లు ఫేవరెట్గా ఉంటున్నాయి. ఇంకా మిలియనీర్లకు అత్యంత ఇష్టమైన హాబీల్లో.. వాచీల కలెక్షన్ కూడా ఉంది. సర్వేలో పాల్గొన్న మూడింట రెండొంతుల మంది.. తమ దగ్గర కనీసం నాలుగు వాచీలైనా ఉన్నట్లుగా తెలిపారు. మళ్లీ వీటిలో రోలెక్స్ అత్యంత ఇష్టమైన బ్రాండ్గా ఉంది. ► ఆతిథ్యానికి సంబంధించి అత్యధిక శాతం మంది ఇష్టపడే హోటల్గా ఇండియన్ హోటల్స్కి చెందిన తాజ్, ఫేవరెట్ ఆభరణాల రిటైలర్గా తనిష్క్ (రెండూ టాటా గ్రూప్నకు చెందివే) అగ్రస్థానంలో ఉన్నాయి. లగ్జరీ ఉత్పత్తుల బ్రాండ్ లూయి విటన్, ప్రైవేట్ జెట్ బ్రాండ్ గల్ఫ్స్ట్రీమ్.. అత్యధిక శాతం మంది డాలర్ మిలియనీర్లకు ఫేవరెట్గా ఉన్నాయి. ► చెల్లింపుల కోసం యూపీఐని ఉపయోగిస్తున్న డాలర్ మిలియనీర్ల సంఖ్య 2021లో రెట్టింపై 36 శాతానికి చేరింది. -
ఈ ఏడాదీ మొబైల్ టారిఫ్ల మోత!
న్యూఢిల్లీ: మొబైల్ కాల్ టారిఫ్ల మోత మోగించేందుకు టెలికం సంస్థలు సిద్ధమవుతున్నాయి. అవసరమైతే రేట్ల పెంపు విషయంలో మిగతా సంస్థల కన్నా ముందుండాలని భారతీ ఎయిర్టెల్ భావిస్తోంది. ‘2022లో టారిఫ్లు పెరగవచ్చని అంచనా వేస్తున్నాను. వృద్ధి అవసరాలు, కనెక్షన్ల స్థిరీకరణ వంటి అంశాల కారణంగా వచ్చే 3–4 నెలల్లో ఇది జరగకపోవచ్చు కానీ.. ఈ ఏడాది ఏదో ఒక సమయంలో రేట్ల పెంపు మాత్రం ఉండవచ్చు. పోటీ సంస్థల పరిస్థితిపై కూడా ఇది ఆధారపడి ఉంటుంది. ఇటీవల చేసినట్లుగా ఈ విషయంలో (రేట్ల పెంపు) అవసరమైతే నేతృత్వం వహించేందుకు మేము సందేహించబోము‘ అని అనలిస్టుల సమావేశంలో భారతీ ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విఠల్ తెలిపారు. 2021 నవంబర్లో టారిఫ్లను అన్నింటికన్నా ముందుగా 18–25 శాతం మేర ఎయిర్టెల్ పెంచింది. ఇటీవల ప్రకటించిన మూడో త్రైమాసికం ఆర్థిక ఫలితాల ప్రకారం యూజర్పై కంపెనీకి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) రూ. 163గా ఉంది. వార్షికంగా చూస్తే 2.2 శాతం తగ్గింది. సంస్థ లాభదాయకతను సూచించే ఏఆర్పీయూను రూ. 200కి పెంచుకోవాలని ఎయిర్టెల్ భావిస్తోంది. ఇందులో భాగంగానే టారిఫ్ల పెంపును పరిశీలిస్తోంది. ‘2022లోనే పరిశ్రమ ఏఆర్పీయూ రూ. 200 స్థాయికి చేరగలదని.. ఆ తర్వాత మరికొన్నేళ్లకు రూ. 300 చేరవచ్చని ఆశిస్తున్నాం. అప్పుడు పెట్టుబడిపై రాబడి దాదాపు 15 శాతంగా ఉండగలదు‘ అని విఠల్ చెప్పారు. నెట్వర్క్లు .. డివైజ్ల అప్గ్రెడేషన్, క్లౌడ్ వ్యాపారాన్ని మెరుగుపర్చుకునేందుకు 300 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2,250 కోట్లు) వెచ్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
టయోటా వాహన కొనుగోలుదారులకు షాకింగ్ న్యూస్..!
టయోటా వాహనాలను కొనుగోలుచేసే కస్టమర్లకు కంపెనీ భారీ షాకిచ్చింది. భారత్లోని అన్ని రకాల మోడల్ వాహనాల ధరలను పెంచుతూ టయోటా నిర్ణయం తీసుకుంది. వాహనాల ధరల పెంపు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి రానుంది. దీంతో టయోటాలోని బెస్ట్ సెల్లర్స్ ఫార్చ్యూనర్ ఎస్యూవీ, ఇన్నోవా క్రిస్టాల ధరలు భారీగా పెరగనున్నాయి. కారణం ఇదే..! ఇప్పటికే పలు ఆటోమొబైల్ కంపెనీలు వచ్చే ఏడాది నుంచి వాహనధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వారితో పాటుగా టయోటా కూడా చేరింది. ముడి పదార్థాలతో సహా ఇన్పుట్ ఖర్ఛులు స్థిరంగా పెరగడం కారణంగా ధరల పెంపు అనివార్యమైందని టయోటా ఒక ప్రకటనలో వెల్లడించింది. తమ కస్టమర్లపై ఖర్చుల పెరుగుదల ప్రభావం వీలైనంత తక్కువగా ఉండేలా చర్యలు తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. చిప్ కొరత..పడిపోయిన అమ్మకాలు..! ప్రపంచవ్యాప్తంగా పలు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీల తయారీ ఇన్పుట్లు ధరలు భారీగా పెరగడం, సెమీకండక్టర్ చిప్ కొరత కారణంగా అనేక కంపెనీలకు పెద్ద సవాళ్లు ఎదురయ్యాయి.దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు తగ్గుముఖం పట్టడంతో వాహనాలకు డిమాండ్ పెరిగింది. అయితే ఉత్పాదకలో, సరఫరా సమస్యలు 2022లో కూడా వెంటాడే అవకాశం ఉన్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) అభిప్రాయపడింది. గడిచిన నెలలో పలు కంపెనీల కార్ల అమ్మకాలు అత్యంత దారుణంగా ఉందని పేర్కొంది. చిప్ కొరత ఆయా కంపెనీలకు ఉత్పత్తిలో ప్రభావితం చేశాయి. ప్యాసింజర్ వాహనాల రిజిస్ట్రేషన్లు 3,24,542 యూనిట్లుగా ఉండగా.., గత ఏడాది నవంబర్ నెలలో 4,39,564 యూనిట్ల నుంచి 26 శాతం మేర తగ్గాయి. చదవండి: టయోటా దూకుడు.. లైనప్లో 30 ఎలక్ట్రిక్ మోడళ్లు -
సామాన్యుడి షాక్..క్యూ కట్టిన బ్యాంకులు..!
New Atm Withdrawal Charges From 2022: కొత్త ఏడాది నుంచి సామాన్యులపై చార్జీల మోత మోగించేందుకు బ్యాంకులు సిద్ధమయ్యాయి. జనవరి 1 నుంచి ఎవరైతే ఏటీఎం సెంటర్ల నుంచి డబ్బులు డ్రా చేస్తారో వారి వద్ద నుంచి బ్యాంకులు అదనపు ఛార్జీల్ని వసూలు చేయనున్నాయి. ఇప్పటికే ఆర్బీఐ సైతం జనవరి 1నుంచి ఏటిఎం నగదు విత్ డ్రాకు సంబంధించిన కొత్త నిబందనలు అమలులోకి తెస్తున్నట్లు తెలిపింది. తాజా నిబంధనలు వచ్చే ఏడాది కొత్త సంవత్సరం నుంచి ప్రారంభం కానున్నాయి. పలు నివేదికల ప్రకారం..నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని యాక్సిస్ బ్యాంక్ ఆర్బీఐ నిబంధనల్ని అమలు చేయనుంది. ప్రతి నెల బ్యాంక్ అకౌంట్ హోల్డర్లు ఏటీఎం సెంటర్లలో ఐదు లావాదేవీలు దాటితే యాక్సిక్ బ్యాంక్ అదనపు ఛార్జీలను విధించనుంది. పరిమితి దాటితే ప్రతి ట్రాన్సాక్షన్పై రూ.20 ఎటీఎం చార్జీ వసూలు చేయనుంది. ఇప్పుడు యాక్సిక్ బ్యాంక్ బాటలో మరో ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ సైతం సేవింగ్ అకౌంట్ పై సర్వీస్ ఛార్జీలతో పాటు, ఏటీఎం నగదు లావా దేవీలలో పరిధి దాటితో ప్రతి ట్రాన్సాక్షన్పై రూ.20 ఎటీఎం చార్జీ వసూలు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మెట్రో నగరాల్లో నెలకు మూడుసార్లు, ఇతర నగరాల్లో ఐదుసార్లు విత్డ్రా చేసుకోవచ్చు. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం వివిధ బ్యాంకుల ఖాతాదారులు తమ సొంత బ్యాంకుతోపాటు ఇతర బ్యాంకుల ఏటీఎంల వద్ద పరిమితికి మించి చేసే విత్డ్రాయల్స్పై చార్జీలు పెరుగనున్నాయి. చదవండి : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త..! -
వరుసగా ఏడో రోజు పెంపు.. రూ. 120 దిశగా పెట్రోలు రేటు
పెట్రోలు ధరలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. దీంతో వరుసగా ఏడో రోజు కూడా పెట్రోలు ధరలు భగ్గుమన్నాయి. మరోసారి లీటరు పెట్రోలుపై 35 పైసల వంతున ధరను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఈసారి పెంపు నుంచి డీజిల్కి మినహాయింపు ఇచ్చాయి. పెరిగిన ధరలతో హైదరాబాద్లో లీటరు పెట్రోలు ధర రూ 114.47 కి చేరుకుంది. ఈ ఏడాదిలో రూ.27 పెట్రోలు ధరలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఈ ఏడాది జనవరి 1న లీటరు పెట్రోలు ధర రూ. 87.06 ఉండగా... ఇప్పుడు ఏకంగా రూ.114.37కి చేరుకుంది. జనవరి నుంచి మార్చి వరకు పెట్రోలు రేట్లు పెంచుకుంటూ పోయిన చమురు సంస్థలు బెంగాల్ ఎన్నికల కారణంగా మార్చి, ఏప్రిల్లో ధరల పెంపుకు విరామం ఇచ్చాయి. ఆ తర్వాత మే నుంచి జూన్ వరకు తాజాగా అక్టోబరులో ఎడాపెడా రేట్లు పెంచుతూ వస్తున్నాయి. -
వరుసగా ఐదో రోజు పెరిగిన చమురు ధరలు
-
పసిడి దిగుమతులు జూమ్..
న్యూఢిల్లీ: దేశీయంగా డిమాండ్ పెరగడంతో ఈ ఏడాది ఏప్రిల్ – సెప్టెంబర్ మధ్య కాలంలో పసిడి దిగుమతులు భారీగా పెరిగాయి. ఏకంగా 24 బిలియన్ డాలర్లకు చేరాయి. గతేడాది ఇదే వ్యవధిలో బంగారం దిగుమతుల విలువ సుమారు 6.8 బిలియన్ డాలర్లు. కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. నెలవారీగా చూస్తే గతేడాది సెపె్టంబర్లో 601.4 మిలియన్ డాలర్లుగా ఉన్న పసిడి దిగుమతులు ఈ ఏడాది సెపె్టంబర్లో 5.11 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. మరోవైపు, ఏప్రిల్ – సెప్టెంబర్ మధ్య కాలంలో వెండి దిగుమతులు 15.5 శాతం తగ్గి 619.3 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అయితే, కేవలం సెప్టెంబర్ నెలే పరిగణనలోకి తీసుకుంటే 9.23 మిలియన్ డాలర్ల నుంచి 552.33 మిలియన్ డాలర్లకు చేరాయి. పసిడి దిగుమతులు ఎగియడంతో దేశ వాణిజ్య లోటు సెప్టెంబర్ లో (దిగుమతులు, ఎగుమతుల మధ్య వ్యత్యాసం) 2.96 బిలియన్ డాలర్ల నుంచి 22.6 బిలియన్ డాలర్లకు చేరింది. భారత్ ఏటా 800–900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా పండుగ సీజన్, భారీ డిమాండ్ తదితర అంశాలు పసిడి దిగుమతులు పెరగడానికి కారణమని రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) చైర్మన్ కొలిన్ షా తెలిపారు. -
రెండు రెట్లు పెరిగిన ఇళ్ల విక్రయాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు ఈ ఏడాది జూలై–సెపె్టంబర్ కాలంలో రెండు రెట్లు పెరిగాయి. మొత్తం 62,800 యూనిట్లు విక్రయమైనట్టు అనరాక్ సంస్థ తెలిపింది. గృహ రుణాలపై తక్కువ రేట్లు, ఐటీ/ఐటీఈఎస్ రంగాల్లో నియామకాలు పెరగడం డిమాండ్ పెరిగేందుకు కారణమైనట్టు ఈ సంస్థ విశ్లేíÙంచింది. క్రితం ఏడాది సరిగ్గా ఇదే కాలంలో ఇళ్ల విక్రయాలు 29,520 యూనిట్లుగా ఉన్నట్టు తెలిపింది. అలాగే, క్రితం త్రైమాసికం ఏప్రిల్–జూన్లో ఇళ్ల విక్రయాలు 24,560 యూనిట్లుగా ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్కతా, ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం (ఎంఎంఆర్), ఢిల్లీ–ఎన్సీఆర్, పుణే పట్టణాల్లోని విక్రయాలపై ఓ నివేదికను అనరాక్ బుధవారం విడుదల చేసింది. ఇళ్ల ధరలు ఈ పట్టణాల్లో సగటున 3 శాతం మేర పెరిగాయి. చదరపు అడుగు రూ.5,760గా ఉంది. 2020 సెపె్టంబర్ త్రైమాసికంలో సగటు చదరపు అడుగు ధర రూ.5,600గా ఉండడం గమనార్హం. ఇళ్ల నుంచే కార్యాలయ పని విధానం (డబ్ల్యూఎఫ్హెచ్) నివాస గృహాల డిమాండ్ను నిర్ణయించనున్నట్టు అనరాక్ పేర్కొంది. టీకాలను పెద్ద మొత్తంలో వేస్తుండడంతో ప్రాజెక్టుల నిర్మాణ ప్రదేశానికి వచ్చి ఇళ్లను చూసే వారి సంఖ్య పెరిగినట్టు తెలిపింది. హైదరాబాద్లో నాలుగు రెట్లు అధికం 2021 జూలై–సెపె్టంబర్ కాలంలో హైదరాబాద్లో ఇళ్ల విక్రయాలు నాలుగు రెట్లు అధికంగా నమోదయ్యాయి. 2020 జూలై సెపె్టంబర్లో 1,650 యూనిట్లే అమ్ముడుపోగా.. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ మధ్య 6,735 యూనిట్లు విక్రయమయ్యాయి. చెన్నైలో విక్రయాలు రెట్టింపై 3,405 యూనిట్లుగా ఉన్నాయి. ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రాంతంలో విక్రయాలు 10,220 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 5,200 యూనిట్లుగా ఉన్నాయి. ముంబై ఎంఎంఆర్ ప్రాంతంలోనూ అమ్మకాలు నూరు శాతానికి పైగా పెరిగి 20,965 యూనిట్లుగా ఉన్నాయి. బెంగళూరులో 58 శాతం అధికంగా 8,550 యూనిట్లు అమ్ముడుపోయాయి. -
ఆగస్ట్లో డీల్స్ జూమ్
ముంబై: గత నెల(ఆగస్ట్)లో దేశీ కార్పొరేట్ ప్రపంచంలో డీల్స్ భారీగా ఎగశాయి. మొత్తం 219 డీల్స్ జరిగాయి. 2005 తదుపరి ఇవి అత్యధికంకాగా.. 2020 ఆగస్ట్తో పోల్చినా రెట్టింపయ్యాయి. వీటి విలువ 8.4 బిలియన్ డాలర్లు. కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్ థార్న్టన్ అందించిన వివరాలివి. అయితే ఈ(2021) జులైతో పోలిస్తే లావాదేవీలు పరిమాణంలో 21 శాతం ఎగసినప్పటికీ విలువలో 36 శాతం క్షీణించాయి. ఇందుకు విలీనాలు, కొనుగోళ్ల(ఎంఅండ్ఏ) విభాగంలో యాక్టివిటీ ఆరు రెట్లు పడిపోవడం కారణమైంది. ఆగస్ట్లో ప్రధానంగా ప్రయివేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ ద్వారానే అత్యధిక డీల్స్ నమోదయ్యాయి. 182 లావాదేవీల ద్వారా 7.6 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశాయి. దేశీ కంపెనీలు, యూనికార్న్(స్టార్టప్లు) ఇందుకు వేదికయ్యాయి. లాభదాయక అవకాశాలు, ఆర్థిక రికవరీపై విశ్వాసం, పరిశ్రమల స్థాపనలో నైపుణ్యం వంటి అంశాలు ప్రభావం చూపాయి. యూనికార్న్ల స్పీడ్ పారిశ్రామిక పురోగతి, బలపడుతున్న డిమాండ్, ఆర్థిక రికవరీ నేపథ్యంలో ఇకపై సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశమున్నట్లు గ్రాంట్ థార్న్టన్ నిపుణులు శాంతి విజేత పేర్కొన్నారు. వ్యాక్సినేషన్లు, విధానాల మద్దతు, ప్రపంచ దేశాల పురోభివృద్ధి ఇందుకు మద్దతుగా నిలవనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఎంఅండ్ఏ విభాగంలో 86.7 కోట్ల డాలర్ల విలువైన 37 డీల్స్ జరిగాయి. 2020 ఆగస్ట్లో 90.8 కోట్ల డాలర్ల విలువైన 30 లావాదేవీలు నమోదయ్యాయి. టెక్, ఎడ్యుకేషన్, ఫార్మా, ఎనర్జీ రంగాలలో అధిక డీల్స్ జరిగాయి. గత నెలలో ఏడు స్టార్టప్లో యూనికార్న్ హోదాను అందుకున్నాయి. బిలియన్ డాలర్ల విలువను సాధించిన స్టార్టప్లను యూనికార్న్లుగా వ్యవహరించే సంగతి తెలిసిందే. దేశీ స్టార్టప్ వ్యవస్థ 115 డీల్స్ ద్వారా 1.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకట్టుకుంది. -
నెలవారీ ఎగుమతుల్లో భారత్ రికార్డు
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు జూలైలో 50 శాతం పెరిగి 35.43 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఒక నెల్లో విలువలో ఎగుమతులు ఇంత భారీ స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి. పెట్రోలియం, ఇంజనీరింగ్, రత్నాలు–ఆభరణాల ఎగుమతులు మంచి ఫలితాన్ని నమోదుచేసుకున్నాయి. ఇక ఇదే నెల్లో దిగుమతులు 63 శాతం పెరిగి 46.40 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వెరిసి ఎగుమతులు–దిగుమతుల మధ్య వ్యత్యాసం– వాణిజ్యలోటు 10.97 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వాణిజ్య మంత్రిత్వశాఖ శుక్రవారం విడుదల చేసిన తాజా గణాంకాల్లో ముఖ్యాంశాలు చూస్తే.. ► పెట్రోలియం (3.82 బిలియన్ డాలర్లు), ఇంజనీరింగ్ (2.82 బిలియన్ డాలర్లు), రత్నాలు–ఆభరణాల (1.95 బిలియన్ డాలర్లు) ఎగుమతుల్లో భారీ పెరుగుదల మొత్తం గణాంకాలపై సానుకూల ప్రభావం చూపింది. ► చమురు దిగుమతులు 97.45 శాతం పెరిగి 12.89 బిలియన్ డాలర్లకు చేరాయి. ► పసిడి దిగుమతులు 1.78 బిలియన్ డాలర్ల నుంచి (2020 జూలై నెల్లో) 4.2 బిలియన్ డాలర్లకు చేరాయి. ► ఆయిల్సీడ్స్, బియ్యం, మాంసం, డెయిరీ, పౌల్ట్రీ ఉత్పత్తుల ఎగుమతులు క్షీణించాయి. ► కాగా ముత్యాలు, ప్రీసియన్, సెమీ–ప్రీసియస్ రాళ్ల దిగుమతుల విలువ 1.68 బిలియన్ డాలర్లుగా ఉంది. ► రవాణా పరికరాలు, ప్రాజెక్ట్ గూడ్స్, వెండి దిగుమతులు క్షీణించాయి. ► అమెరికా (2.4 బిలియన్ డాలర్లు), యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (1.21 బిలియన్ డాలర్లు), బెల్జియం (489 మిలియన్ డాలర్లు) దేశాలకు ఎగుమతులు పెరిగాయి. నాలుగు నెలల్లో... కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూలై మధ్య ఎగుమతులు 74.5 శాతం పెరిగి 130.82 బిలియన్ డాలర్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంలో ఈ ఎగుమతులు 75 బిలియన్ డాలర్లు. ఇక దిగుమతులు ఇదే కాలంలో 94 శాతం పెరిగి 172.5 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ఒక్క చమురు దిగుమతులను చూస్తే విలువ 123.84 శాతం పెరిగి 19.61 బిలియన్ డాలర్ల నుంచి 43.90 బిలియన్ డాలర్లకు ఎగసింది. కాగా, వాణిజ్య మంత్రిత్వశాఖ ఒక ప్రకటన చేస్తూ, ‘‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్ డాలర్ల ఎగుమతులు లక్ష్యం. మరో ఎనిమిది నెలల్లో (2021 ఆగస్టు–మార్చి 2022) 269.44 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని సాధించాల్సి ఉంది. అంటే నెలకు సగటును 33.68 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరపాల్సి ఉంది’’ అని పేర్కొంది. గ్లోబల్ డిమాండ్ బాగుంది... గ్లోబల్ డిమాండ్ ఏప్రిల్–జూలై మధ్య పటిష్టంగా ఉంది. ఎగుమతిదారుల ఆర్డర్ బుకిం గ్ పరిస్థితి ఎంతో మెరుగుపడింది. ఆగస్టు మొద టివారంలో 7.4 బిలియన్ డాలర్ల ఎగుమతులు నమోదుకావడం మరో హర్షణీయ పరిణామం. – ఏ శక్తివేల్, ఎఫ్ఐఈఓ ప్రెసిడెంట్ -
అన్నీ ధరలు పెరుగుతున్నాయ్, కార్ల ధరల్ని పెంచుతున్నాం
ముంబై: మారుతీ సుజుకీ ఈ ఏడాదిలో మరోసారి కార్ల ధరల్ని పెంచేందుకు సిద్ధమైంది. వచ్చే నెల(జూలై) నుంచి తమ పోర్ట్ఫోలియోలోని అన్ని మోడళ్ల కార్ల ధరలను పెంచుతామని కంపెనీ ప్రకటించింది. ప్రపంచ మార్కెట్లో కమోడిటీలు, స్టీల్తో సహా ముడిసరుకుల వ్యయాలు పెరగడంతో తమ ఉత్పత్తులపై ధరల పెంపు అనివార్యమైందని కంపెనీ వివరణ ఇచ్చింది. ధరల పెంపు మోడళ్ల ఆధారంగా ఉంటుందని, ఏ మోడల్పై ఎంత ధర పెంచుతామనేది త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. మారుతీ సుజుకీ ఈ ఏడాదిలో జనవరిలో ఒకసారి, ఏప్రిల్లో మరోసారి కార్ల ధరల్ని పెంచిన సంగతి తెలిసిందే. చదవండి: సాఫ్ట్వేర్ ఉద్యోగం మీకలనా, అయితే ఈ టెక్నాలజీ నేర్చుకోండి -
ధరదడ: నిత్యావసరాల ధరలతో గుండెపోటే
బరంపురం: విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఒడిశా ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటడంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. ప్రధానంగా రోజూ వినియోగించే కందిపప్పు, ఉల్లి, కూరగాయలు, నూనెల రేట్లు వినియోగదారులను బెదిరేలా చేస్తున్నాయి. నిత్యావసర సరుకుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాల చెబుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఉడకని పప్పులు మార్కెట్లో పప్పుల ధరలు ఆందుబాటులో లేకుండా పోయాయి. కొద్ది రోజుల వ్యవధిలో కిలో కందిపప్పు రూ.150 కు చేరింది. గత ఏడాది ఇదే సమయంలో దీని ధర రూ.90 నుంచి రూ.95 ఉండేది. నెల రోజుల కిందట రూ.90 ఉండేది. అయితే వారం రోజుల కిందట రూ.120లకు పెరిగి, ప్రస్తుతం కిలో రూ.140కి ఎగబాకింది. ఇక కిలో మినపప్పు ధర రూ.150కి చేరింది. దీంతో సామాన్యులు ఇడ్లీ, దోశ వంటి వాటిని వండుకోవడం మానేశారు. వంటనూనె సలసల వంట నూనెల ధర మార్కెట్లో సలసల కాగుతున్నాయి. పేదలు, సామాన్యులు అధికంగా వినియోగించే పామోలిన్ లీటర్ ధర రూ.130కి చేరింది. గతంలో దీని ధర రూ.80 ఉండగా ప్రస్తుతం రూ.130కి చేరింది. ఇక సన్ఫ్లవర్ నూనె లీటర్ రూ.200కు పెరిగింది. మిగిలిన వంట నూనెలు వందకు పైగా ధరలు పెరగడంతో పేదలు, సామాన్య ప్రజల బతుకు జీవనం కష్టంగా మారింది. కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి ఉల్లి లేనిదే కూర రుచించదు. అన్ని తరగతుల వారు వినియోగించే దీనికి డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. అయితే దీనిధర కొండెక్కడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. రిటైల్ బహిరంగ మార్కెట్లో ఉల్లి కిలో రూ.30 నుంచి రూ.40 వరకూ పలుకుతోంది. కూరగాయల ధరలు ఆకాశానికి ఇక టమాటో కిలో రూ.30, బంగాళదుంపలు కిలో రూ.35, ఇతర కురగాయలు కిలో రూ.50 నుంచి రూ.60 వరకు ధరలు అమాంతం పెరిగిపోవడంతో ప్రజలు వాటిని కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో అమలవుతున్న లాక్డౌన్, షట్డౌన్ కారణంగా దిగుమతులు తగ్గడాన్ని అసరాగా చేసుకున్న వ్యాపారస్తులు డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ధరలు మరింతగా పెంచుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి బ్లాక్మార్కెట్ను అరికట్టి ధరలు తగ్గించే ఏర్పాట్లు చేయాలని వినియోగదారులు కోరుతున్నారు. -
లాక్డౌన్ ఎఫెక్ట్: చుక్కల్లో ‘కూరలు’
సాక్షి, హైదరాబాద్: కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. లాక్డౌన్తో మార్కెట్కు సరిపడా రాకపోవడంతో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. దీనికితోడు లాక్డౌన్ సడలింపు సమయం నాలుగు గంటలే ఉండటంతో రైతులు కూడా ఇంటికి వెళ్లాలనే తొందరలోనే తక్కువ ధరకే మార్కెట్లో వ్యాపారులకు విక్రయించేసి వెళ్లిపోతున్నారు. అయితే, రైతుల నుంచి చౌకగా కొనుగోలు చేసిన కూరగాయలను రిటైల్ మార్కెట్లో మూడింతలు పెంచి విక్రయిస్తున్నారు. మరోవైపు.. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతయ్యే బంగాళదుంప, క్యాబేజీ, కీర, బీట్రూట్ల ధరలు గణనీయంగా పెరిగాయి. స్థానికంగానే అమ్ముకుంటున్న రైతులు కూరగాయల రవాణాపై ఎలాంటి ఆంక్షలు లేనప్పటికీ, గ్రామీణా ప్రాంతాల నుంచి మార్కెట్కు తరలించేందుకు రవాణా చార్జీలు రైతులకు భారంగా మారాయి. హైదరాబాద్లోని బోయిన్పల్లి, గుడిమల్కాపూర్, ఎన్టీఆర్ నగర్, మాదన్నపేట, మీరాలం, మోండా మార్కెట్లకు నగర శివార్లలోని రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్, భువనగిరి, నల్లగొండ, సిద్దిపేట జిల్లాల నుంచి కూరగాయలు వస్తాయి. ఇప్పుడు రవాణా సౌకర్యం సరిగా లేకపోవడం.. వచ్చినా వెనువెంటనే వెనక్కి వెళ్లే పరిస్థితి కానరాకపోవడంతో చాలా మంది రైతులు తమ ఉత్పత్తులను స్థానికంగానే విక్రయించుకుంటున్నారు. దీని ప్రభావం హైదరాబాద్ మార్కెట్లపై పడింది. ఈ నేపథ్యంలోనే కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయని అంటున్నారు. తగ్గిన సరఫరా ప్రతి రోజు జంటనగరాలకు 3వేల క్వింటాళ్ల కూరగాయలు దిగుమతి అయ్యేవి. ప్రస్తుతం ఇందులో సగం కూడా మార్కెట్లకు రావడంలేదు. మార్కెటింగ్ శాఖ గణాంకాల ప్రకారం బోయిన్పల్లి హోల్సేల్ మార్కెట్కు సాధారణ రోజుల్లో సగటున 1,500 క్వింటాళ్ల కూరగాయలు వచ్చేవి. శనివారం కేవలం వేయి క్వింటాళ్లు మ్రాతమే సరఫరా అయింది. ఇదే సీను మిగతా మార్కెట్లల్లోనూ కనిపిస్తోంది. -
పెట్రో సెగ: మరోసారి సెంచరీ కొట్టిన పెట్రోలు
సాక్షి, ముంబై: దేశ వ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన ధరలు వాహన దారులకు చుక్కలు చూపిస్తున్నాయి. వరుసగా నాలుగో రోజు కూడా పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ ధరను లీటరుకు 29 పైసలు, డీజిల్పై 31 పైసలు చొప్పున పెంచుతూ చముర కంపెనీలు నిర్ణయించాయి. తాజా పెంపుతో రాజస్థాన్, మధ్యప్రదేశ్లో లీటరు పెట్రోలు ధర మరోసారి సెంచరీ కొట్టింది. దేశంలో పెట్రోలు ధర రూ.100 మార్కును దాటడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. ఈ ఏడాది ఫిబ్రవరి మధ్యలో మొదటిసారి 100 రూపాయలను దాటి వాహన దారులను బెంబేలెత్తించింది. రాజస్థాన్ శ్రీ గంగానగర్ జిల్లాలో పెట్రోల్ లీటరుకు రూ .102.15 ను తాకింది. ఇక్కడ డీజిల్ రేటు రూ .94.62 గా ఉంది. మధ్యప్రదేశ్లోని అనుప్పూర్లో ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ .101.86 వద్ద ఉండగా, లీటరు డీజిల్ రేటు రూ. 92.90గా ఉంది. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధర లీటరుకు 102 రూపాయలను తాకడం గమనార్హం. ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు ఢిల్లీలో పెట్రోల్ రూ. 91.27, డీజిల్ రూ. 81.73 ముంబైలో పెట్రోల్ రూ .97.61, డీజిల్ రూ .88.82 కోల్కతాలో పెట్రోల్ రూ .91.41, డీజిల్ రూ .84.57 చెన్నైలో పెట్రోల్ రూ .93.15, డీజిల్ రూ .86.65 హైదరాబాద్లో పెట్రోల్ రూ .94.86, డీజిల్ రూ .89.11 అమరావతిలో పెట్రోల్ రూ .97.42 డీజిల్ రూ .91.12 -
సొంత కారు కలకు షాకిచ్చిన మారుతి
సాక్షి, ముంబై: సొంత కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వినియోగదారులకు దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ షాకిచ్చింది. ఎంపిక చేసిన మోడళ్ల కార్ల ధరలను మరోసారి పెంచింది. కొన్ని మోడళ్ల కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. సవరించిన కొత్త ధరలు తక్షణం (శుక్రవారం) అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. ఇన్పుట్ వ్యయాలు పెరగడంతో ధరల్ని పెంచక తప్పలేదని కంపెనీ వివరణ ఇచ్చింది. ధరల పెంపు నిర్ణయంతో స్విఫ్ట్, సెలెరియా మినహా అన్ని మోడళ్లకు చెందిన వాహన ధరలు రూ.22,500 వరకు పెరిగే అవకాశం ఉంది.మోడల్ను బట్టి 1.6 శాతం మేర ధరల పెంపుదల ఉంటుంది. ఈ ఏడాది జనవరి 18న ధరలు పెంచిన కంపెనీ... కేవలం మూడు నెలల వ్యవధిలోనే రెండోసారి ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకుంది. -
బైక్ ధరలను పెంచేసిన హీరో మోటో
సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ బైక్ లవర్స్కి షాకిచ్చింది. వచ్చే నెలనుంచి తన మోటార్ సైకిళ్ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులరీత్యా తమ అన్ని మోడళ్ల బైక్లు, స్కూటర్ల ధరలను పెంచాల్సి వస్తోందని ప్రకటించింది. సవరించిన ధరలు అన్ని షోరూంలలో 2021 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తాయని ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో సంస్థ వెల్లడించింది. (మారుతి కార్ల ధరలకు రెక్కలు) వినియోగదారుల మీద తక్కువ భారం పడేలా, తమ ఖర్చులను తగ్గించుకునే కార్యక్రమాన్ని వేగవంతం చేసినట్టు హీర మోటో తెలిపింది. అయితే ధరల పెరుగుదల పరిమాణంపై కంపెనీ నిర్దిష్ట వివరాలు ఇవ్వలేదు. కానీ, ఈ పెరుగుదల రూ .2500 వరకు ఉంటుందని, మోడల్, నిర్దిష్ట మార్కెట్ ఆధారంగా ఉంటుందని హీరో తెలిపింది. కాగా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇన్పుట్ ఖర్చుల భారం నేపథ్యంలో అన్నిమోడళ్ల కార్ల ధరలను పెంచుతున్నట్టు మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
మళ్లీ రాజుకున్న పెట్రో సెగ
సాక్షి,ముంబై: దేశవ్యాప్తంగా ఇంధన ధరల మంటలు కొనసాగుతున్నాయి. రెండు రోజుల విరామం తరువాత మంగళవారం పెట్రోల్, డీజిల్ మళ్లీ పరుగందుకున్నాయి. పెట్రోలుపై 25 పైసలు, డీజిల్పై 35 పైసల చొప్పున పెరిగింది. దీంతో ఈ నెలలో ఇప్పటివరకు పెట్రోల్ ధరలు 15 సార్లు పెరిగి రికార్డు స్థాయిల వద్ద వాహనదారులను బెంబే లెత్తిస్తున్నాయి. ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థల తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటరుకు రూ.90.83, డీజిల్ ధర రూ. 81.32 కు చేరింది. ముంబైలో పెట్రోల్ లీటర్కు రూ.97.34కు చేరగా, డీజిల్ రూ.88.44 వద్ద ఉంది పలునగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు చెన్నైలో పెట్రోల్ రూ.92.90, డీజిల్ రూ.86.31 కోల్కతాలో పెట్రోల్ రూ.91.12, డీజిల్ రూ.84.20 హైదరాబాద్లో పెట్రోల్ రూ.94.54, డీజిల్ రూ.88.69 అమరావతిలో పెట్రోల్ రూ.97.08, డీజిల్ రూ.90.69 కాగా వినియోగదారుల నడ్డి విరుస్తున్న పెట్రో మంటపై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనకు దిగాయి. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. శివసేన కూడా పెరుగుతున్న పెట్రో ధరలపై కేంద్రంపై విమర్శలు గుప్పించింది. మరోవైపు పశ్చిమ బెంగాల్, అసోం, రాజస్థాన్, మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధన ధరలపై పన్ను తగ్గింపును ప్రకటించిన సంగతి తెలిసిందే. -
బాబోయ్ పెట్రోలు : 11వ రోజూ వాత
సాక్షి, న్యూఢిల్లీ: వరుసగా 11వ రోజు కూడా ఇంధన ధరలను పెంచుతూ చమురు సమస్థలు నిర్ణయించాయి. శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు పెట్రోల్పై 31 పైసలు పెంచగా, డీజిల్ 33 పైసలు చొప్పున పెరిగింది. దీంతో దేశంలోని అన్ని మెట్రో నగరాల్లోరికార్డు స్థాయిల వద్ద పెట్రో ధరలు మండిపోతున్నాయి. దేశ రాజధానిలో పెట్రోల్ ధర లీటరుకు 90.19 కు చేరుకుంది. డీజిల్ రేటు లీటరుకు. 80.60 పలుకుతోంది. రూ. 100 దాటిన రాష్ట్రాలు మరోవైపు ఇప్పటికే రాజస్థాన్లో పెట్రోల్కు లీటరుకు రూ.100 స్థాయిని దాటేసింది. కాగా గురువారం మధ్యప్రదేశ్లో కూడా పెట్రోల్ ధర లీటరుకు సెంచరీ మార్క్ను అధిగమించింది. మధ్యప్రదేశ్లోని అనుప్పూర్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.100.25 దాటి పరుగులు తీయడం గమనార్హం. నేడు (శుక్రవారం) ఇక్కడ పెట్రోలు ధర రూ.100.57 వద్ద, డీజిల్ 91.04 వద్ద కొనసాగుతున్నాయి. పలు నగరాల్లో పెట్రోల్,డీజిల్ ధరలు లీటరుకు ముంబైలో పెట్రోల్ రూ. 96.32 కు, డీజిల్ రూ. 87.32 చెన్నై పెట్రోల్ రూ. 92.25, డీజిల్ రూ. 85.63 బెంగళూరు పెట్రోల్ రూ. 93.21, డీజిల్ రూ. 85.44 హైదరాబాద్ పెట్రోల్ రూ. 93.78, డీజిల్ రూ. 87.91 అమరావతి పెట్రోల్ రూ. 96.34, డీజిల్ రూ. 89.94 -
పెట్రో బాదుడు : రూ.100 దాటేసింది
సాక్షి, జైపూర్: దేశవ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు వాహన దారులను బెంబేలెత్తిస్తున్నాయి. వరుస పెంపుతో రికార్డు స్థాయిలనుచేరుతున్నాయి. ఇప్పటికే జైపూర్లో పెట్రోలు ధర రూ.100 మార్క్ను టచ్ చేసింది. తాజాగా 100 రూపాయలను అధిగమించి వినియోగదారుల గుండెల్లో బాంబు పేల్చింది. వరుసగా 9వ పెంపు నేపథ్యంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గణాంకాల ప్రకారం రాజస్థాన్లోని గంగానగర్ జిల్లాలో పెట్రోల్ ధర బుధవారం (ఫిబ్రవరి 17) రూ .100.13 పలుకుతోంది. డీజిల్ ధర లీటరుకు 92.13 రూపాయలుగా ఉంది. పెట్రోలు ధరకు సంబంధించి దేశవ్యాప్తంగా ఇదే అత్యధిక ధర. (భగ్గుమంటున్న పెట్రోలు, డీజిల్ ధర) -
భగ్గుమంటున్న పెట్రోలు, డీజిల్ ధర
సాక్షి, ముంబై : పెట్రోలు, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. వరుసగా తొమ్మిదవ రోజు ఈ రోజు (బుధవారం, ఫిబ్రవరి 17) కూడా ఇంధన ధరలు పరుగందుకున్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్పై లీటరుకు మరో 25 పైసల మేర ధరలను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయించాయి. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతూ వాహనదారుల గుండెల్లో బాంబులు పేల్చుతున్నాయి . దీంతో వాహనాలను బయటకు తీయాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. దేశంలోని వివిధ నగరాలలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు హైదరాబాద్ పెట్రోల్ ధర రూ.93.10 డీజిల్ ధర రూ.87.20 అమరావతి పెట్రోలు ధర రూ. 95.69 డీజిల్ ధర రూ. 98.52 ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 89.54, డీజిల్ ధర రూ. 79.95 కొలకత్తాలో పెట్రోల్ ధర రూ. 90.78, డీజిల్ ధర రూ.83.54 ముంబైలో పెట్రోల్ ధర రూ. 96.00, డీజిల్ ధర రూ. 86.98 చెన్నైలో పెట్రోల్ ధర రూ. 91.68, డీజిల్ ధర రూ.85.01 బెంగుళూరులో పెట్రోల్ ధర రూ. 92.54, డీజిల్ ధర రూ. 84.75 -
పెట్రో మంట : వాహనదారులకు చుక్కలే!
సాక్షి, ముంబై: వరుసగా రికార్డు స్థాయికి చేరుతున్న ఇంధన ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను శుక్రవారం (ఫిబ్రవరి 12) వరుసగా నాలుగో రోజూ పెంచారు. దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ రేటును లీటరుకు 26-29 పైసలు పెంచగా, డీజిల్ ధర 34-38 పైసలు చొప్పున పెరిగి పెరిగింది. గత 12 రోజుల్లో దేశ రాజధానిలో పెట్రోల్ లీటరుకు రూ.4.13, డీజిల్ రూ.4.26 పెరిగింది. ఫిబ్రవరిలో ధరలు పెరగడం ఇది ఆరోసారి. దీంతో ఢిల్లీలో పెట్రోలు 88 రూపాయల మార్క్ను అధిగమించాయి. (మూడో రోజూ బాదుడు : వాహనదారులు బెంబేలు) ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు ఢిల్లీలో పెట్రోల్ లీటర్కు 88.14, డీజిల్ రూ.78.38 ముంబైలో పెట్రోల్ రూ.94.64, డీజిల్ రూ.85.32, చెన్నైలో పెట్రోల్ రూ.రూ.90.44, డీజిల్ రూ.85.32, బెంగళూరులో పెట్రోల్ రూ.91.09, డీజిల్ రూ.83.09 కోల్కతాలో పెట్రోల్ రూ రూ. 89.44, డీజిల్ ధర రూ .81.96 హైదరాబాద్లో పెట్రోలు రూ. 91.65, డీజిల్ రూ.85.50 అమరావతిలో పెట్రోలు రూ. 94.28, డీజిల్ రూ. 87.62 -
ఢిల్లీ: జనంపై గ్యాస్ బండ
-
మూడో రోజూ రూపాయి రయ్
ముంబై: డాలర్తో రూపాయి మారకం విలువ బుధవారం 52 పైసలు పుంజుకొని రూ.75.66 వద్ద ముగిసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లపై నిర్ణయం నేపథ్యంలో విదేశీ కరెన్సీలతో పోల్చితే డాలర్ బలహీనపడటం, మన స్టాక్ మార్కెట్ భారీ లాభాలు సాధించడం, వివిధ దేశాల్లో లాక్డౌన్ దశలవారీగా తొలగనుండటం దీనికి కారణాలు. గత మూడు రోజుల్లో రూపాయి 80 పైసలు(దాదాపు 1 శాతం మేర) బలపడింది. నెల గరిష్ట స్థాయికి చేరింది. మంగళవారం డాలర్తో రూపాయి మారకం విలువ 76.18 వద్ద ముగిసింది. బుధవారం ఫారెక్స్ మార్కెట్లో డాలర్తో రూపాయి మారకం విలువ 34 పైసల లాభంతో 75.94 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 75.60–75.96 గరిష్ట–కనిష్ట స్థాయిల మధ్య కదలాడింది. చివరకు 52 పైసల లాభంతో 75.66 వద్ద ముగిసింది. -
పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ పెంపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల తగ్గుదల ఫలితం ఇకపై దేశీయ వినియోగదారుకు అందదు. ఎందుకంటే, ఆ మేరకు కేంద్రం పెట్రోల్, డీజిల్పై లీటరుకు రూ.3 చొప్పున ఎక్సైజ్ డ్యూటీ పెంచింది. ఈ నిర్ణయంతో పెట్రో ధరల్లో ఎలాంటి మార్పు ఉండదు. దీని ఫలితంగా కేంద్రానికి రూ.39వేల కోట్ల ఆదాయం అదనంగా సమకూరనుందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ మొత్తాన్ని అభివృద్ధి పథకాలు, మౌలికరంగ వసతుల కోసం వెచ్చించనున్నట్లు కేంద్రం తెలిపింది. తాజా పెంపుతో లీటరు పెట్రోల్పై స్పెషల్ ఎౖక్సైజ్ డ్యూటీ రూ.8 వరకు చేరుకోగా డీజిల్పై స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ రూ.4కు పెరిగినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ శనివారం జారీ చేసిన నోటిఫికేషన్ పేర్కొంది. అదనంగా రోడ్ సెస్సు.. పెట్రోల్, డీజిల్పై లీటరుకు రూ.1 చొప్పున పెరిగి రూ.10కి చేరింది. అంతిమంగా ఎక్సైజ్ డ్యూటీ లీటరు పెట్రోల్పై రూ.22.98కు, డీజిల్పై 18.83కు చేరుకున్నట్లయింది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.69.87, డీజిల్ రూ.62.58కి అందుబాటులో ఉంది. మోదీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన సమయంలో పెట్రోల్పై ఎక్సైజ్ పన్ను లీటరుకు రూ.9.48, డీజిల్పై రూ.3.56గా ఉంది. కాంగ్రెస్ మండిపాటు పెట్రోల్, డీజిల్పై ఎక్జైజ్ డ్యూటీ పెంపును కాంగ్రెస్ విమర్శించింది.అంతర్జాతీయంగా తగ్గిన ధరల ప్రభావం ఆ మేరకు వినియోగదారుకు అందేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరింది. -
పెరిగిన వంటగ్యాస్ ధర
సాక్షి, న్యూఢిల్లీ: వంట గ్యాస్ ధరలు మరోసారి పెరిగాయి. ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థ సబ్సిడీ, సబ్సిడీయేతర సిలిండర్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సబ్సిడీ సిలిండర్ ధర రూ.2.08లు, నాన్ సబ్సిడీ సిలిండర్ ధరను రూ.42.50 చొప్పున పెంచుతున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసిఎల్) ప్రకటించింది.అంతర్జాతీయంగా చమురు ధరలు, డాలరు మారకంలో రూపాయి ఒడిదుడుకుల నేపథ్యంలో దేశీయంగా కూడా గ్యాస్ ధరలు ప్రభావితమైనట్టు పేర్కొంది. నేటి (మార్చి 1) నుంచి ఈ సవరించిన రేట్లు అమలు కానున్నాయి. -
వార్ ఎఫెక్ట్ : భారీగా పెరిగిన విమాన చార్జీలు
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగడం, పాక్ తన కమర్షియల్ ఆపరేషన్స్ను రద్దు చేయడంతో భారత్లో దేశీయ విమాన సర్వీసులు ముఖ్యంగా పశ్చిమ సెక్టార్లో పెనుభారమయ్యాయి. ఢిల్లీ-ముంబై వన్వే ప్రయాణానికి గురువారం పలు ఎయిర్లైన్లలో విమాన చార్జీలు రూ 20,000 నుంచి ప్రారంభమయ్యాయి. పాక్తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో బుధవారం పలు విమానాశ్రయాల్లో విమాన రాకపోకలు నిలిచిన క్రమంలో చార్జీలు భారీగా పెరిగాయని చెబుతున్నారు. ఒక స్టాప్తో ఢిల్లీ-ముంబై మధ్య విమానాలకు రూ 8500 నుంచి పలు విమానయాన సంస్థలు చార్జ్ చేస్తున్నాయి. ఇక న్యూఢిల్లీ-గోవా రూట్లో విమాన చార్జీలు రూ 12,000 నుంచి ప్రారంభమయ్యాయి. మరోవైపు ఢిల్లీ-శ్రీనగర్ రూట్లో కేవలం ఒకటి రెండు ఎయిర్లైన్స్ మాత్రమే విమాన సర్వీసులను నడుపుతుండగా ఈ రూట్లో విమాన సర్వీసులకు తీవ్ర విఘాతం ఏర్పడింది. -
మళ్లీ పసిడి ‘డ్రీమ్ రన్’!
అటు అంతర్జాతీయంగా ఇటు దేశీయంగా పసిడి ధర మళ్లీ పరుగుపెడుతోంది. అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్ న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర గురువారం ఒకానొకదశలో 1,330 డాలర్ల పైకి ఎగసింది. ఒకేరోజు దాదాపు 15 డాలర్లు పెరగడం గమనార్హం. గత ఏడాది మే తర్వాత పసిడి ఈ స్థాయిని చూడ్డం ఇదే తొలిసారి. 2018 ఏప్రిల్లో పసిడి 1,365 డాలర్ల గరిష్ట స్థాయిని చూసింది. అటు తర్వాత క్రమంగా పడిపోతూ, ఆగస్టు నెల మధ్యకు వచ్చే సరికి 1,167 డాలర్ల కనిష్ట స్థాయిని చూసింది. అయితే వెంటనే కోలుకుని 1,200 డాలర్ల స్థాయిని చూసినా, 20 డాలర్ల ప్లస్, మైనస్లతో దాదాపు రెండు నెలలు కదిలింది. తాజాగా మళ్లీ ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఆకర్షించడం ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి కొనసాగితే అంతర్జాతీయంగా పసిడి పరుగు మున్ముందు ఖాయమన్న వాదన వినిపిస్తోంది. ఇక దీనికితోడు రూపాయి బలహీనత తోడయితే, దేశీయంగానూ పసిడి ధర చుక్కలను చూసే అవకాశం ఉంది. పసిడి కదలికలను గమనిస్తే... పతన బాటలో... ► అమెరికా వృద్ధి ఊపందుకుందని, ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుత శ్రేణి 2.25–2.50 శాతం) పెంపు జోరుగా ఉంటుందని, డాలర్ కూడా బలోపేతమవుతుందని గత ఏడాది మే తర్వాత వెలువడిన విశ్లేషణలు పసిడి పరుగును అడ్డుకున్నాయి. ► వృద్ధి బాగుంటుందన్న అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్ల పరుగుసైతం పసిడిలోకి పెట్టుబడులపై ప్రతికూలత చూపింది. ► అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు, ప్రపంచ వృద్ధిపై ఆందోళనలు ఒకవైపు ఉన్నప్పటికీ, మరోవైపు ఆ రెండు దేశాల మధ్య జరుగుతున్న చర్చలు, ఆర్థిక వృద్ధికి సవాళ్లు తొలుగుతాయన్న సానుకూలతలు పసిడిని ఆగస్టులో 52 వారాల కనిష్ట స్థాయి 1,167 డాలర్ల కనిష్ట స్థాయికి పడేశాయి. పరుగు వెంట... ► అయితే పసిడికి 1,167 డాలర్ల ఉన్న సానుకూల పరిస్థితులు, మరింత ముదిరిన వాణిజ్య యుద్ధ భయాలు బంగారానికి బలమయ్యాయి. ► 1,200 డాలర్లు పసిడికి స్వీట్ స్టాప్ అన్న విశ్లేషణలు వెలువడ్డాయి. ఈ దిగువకు పడిపోతే మైనింగ్ సంస్థలకు గిట్టుబాటు ధర రాదనీ, దీనితో పసిడి ఉత్పత్తి ఆగిపోతుందని, తిరిగి పసిడి 1,200 డాలర్లపైకి రావడం ఖాయమని వార్తలు వచ్చాయి. ఇది నిజమే అన్నట్లు 1,200 డాలర్ల దిగువకు పసిడి సంబంధిత సమీక్ష కాలంలో ఎప్పుడు పడినా, మళ్లీ ఆ ధర పైకి వెంటనే ఎగసేది. ► అదే సమయంలో చైనా ఫండ్స్సహా కొన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులూ పసిడి కొనుగోళ్లు జరిపాయి. ► అమెరికా– చైనా వాణిజ్య యుద్ధం సవాళ్లు అందరూ భావించినట్లుగా తగ్గకపోగా మరింత తీవ్రమయ్యాయి. ఇటీవల దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో ఈ విషయం మరింత సుస్పష్టమైంది. ► మరోవైపు అమెరికా వృద్ధి అనుకున్నంత వేగంగా లేదని, ఫెడ్ ఫండ్రేటు పెంపు దూకుడు తగ్గవచ్చని సంబంధిత అధికారుల నుంచి సంకేతాలు అందాయి. దీనితో డాలర్ ఇండెక్స్ (ప్రస్తుతం 95 స్థాయిలో) దూకుడు కూడా తగ్గింది. ► ఆయా వార్తల నేపథ్యంలో అమెరికాసహా అంతర్జాతీయంగా పలు దేశాల్లో ఈక్విటీ మార్కెట్లూ గరిష్ట స్థాయిల నుంచి వెనక్కు తగ్గడం ప్రారంభమైంది. ► ఈ అంశాలు పసిడి తాజా పరుగుకు కారణమయ్యాయి. పసిడి అంతర్జాతీయ మార్కెట్ల తీవ్ర నిరోధ స్థాయి 1,300 డాలర్లను దాటింది. ► ఇవే పరిస్థితులు కొనసాగితే, పసిడి దూకుడు మున్ముందూ ఖాయమని ఆర్థిక, బ్యాంకింగ్, రిటైల్, వ్యవస్థాగత ఇన్వెస్టర్లు విశ్లేషిస్తున్నారు. 2018లో 4 శాతం పెరిగిన డిమాండ్: డబ్ల్యూజీసీ పసిడి డిమాండ్ 2018లో అంతర్జాతీయంగా 4% పెరిగింది. ఈ పరిమాణం 4,159.9 టన్నుల నుంచి 4,345.1 టన్నులకు పెరిగినట్లు తాజాగా విడుదల చేసిన నివేదికలో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) పేర్కొంది. నివేదిక ప్రకారం... 2018లో వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకుల పసిడి కొనుగోళ్లు 74% పెరిగాయి. 2017లో ఈ కొనుగోళ్లు 374.8 టన్నులయితే, 2018లో ఈ పరిమాణం 651.5 టన్నులకు చేరింది. భారత్లో తగ్గింది...: భారత్లో డిమాండ్ 1.4% తగ్గింది. 2017లో దేశం పసిడి డిమాండ్ 771.2 టన్నులయితే, 2018లో ఈ మొత్తం 760కి తగ్గింది. రూపాయి పతనంతో అధిక ధరలు, కరెంట్ అకౌంట్లోటు పెరక్కుండా చూసేందుకు పసిడి ఫిజికల్ కొనుగోళ్లను తగ్గించడానికి ప్రభుత్వ చర్యలు, పథకాలు దీనికి కారణం. దేశంలో 2019లో 750 నుంచి 850 టన్నుల బంగారం డిమాండ్ ఉండవచ్చన్నది అంచనా అని కౌన్సిల్ ఇండియా ఎండీ సోమసుందరం తెలిపారు. కాగా, విలువ రూపంలో బంగారం డిమాండ్ 2018లో 5% వృద్ధితో రూ.15.84 లక్షల కోట్ల నుంచి రూ.16.66 లక్షల కోట్లకు ఎగసింది. మొత్తం పెట్టుబడుల డిమాండ్4% తగ్గి 169 టన్నుల నుంచి 162 టన్నులకు పడింది. దేశీయంగా రూ.38,000 వైపు! ఇక దేశీయ మార్కెట్లోనూ పసిడి పటిష్టంగా ఉంది. అంతర్జాతీయంగా సానుకూల అంశాలతో పాటు, దేశీయంగా రూపాయి బలహీనతా దేశీయ మార్కెట్లో పసిడి బలానికి తోడవుతోంది. డాలర్ మారకంలో రూపాయి పతనం 71పైన కొనసాగి, అంతర్జాతీయంగా ధర ఏడాది గరిష్ట స్థాయిని తాకితే, దేశంలో పసిడి 10 గ్రాముల ధర సమీపకాలంలోనే తేలిగ్గా రూ.38,000 దాటే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్ ధరలు అంతర్జాతీయంగా అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో... క్రమంగా కోలుకుంటూ వచ్చింది. తాజాగా ప్రధాన మార్కెట్లన్నింటిలో పసిడి ధర రూ.34,000 దాటిపోవడం గమనార్హం. భారత్లో 2013 ఆగస్టులో పసిడి ధర గరిష్టస్థాయి రూ.35,000ని తాకింది. అప్పట్లో రూపాయి డాలర్ మారకంలో 68.85 స్థాయిలో ఉంటే, అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర 1,425 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. కాగా అంతర్జాతీయంగా పసిడి ఔన్స్ ధర 2011 ఆగస్టులో గరిష్ట స్థాయిని నమోదుచేసుకుంది. ఈ ధర 1,917 డాలర్లు. కొనసాగనున్న బంగారం మెరుపు ఫెడ్ సరళతర ద్రవ్య విధానం నేపథ్యంలో పసిడి ధర మరింత పెరుగుదల అవకాశాలు కనిపిస్తున్నాయి.20 రోజుల మూవింగ్ సగటు 1,291 డాలర్ల వద్ద పటిష్ట మద్దతు ఉంది. కరెన్సీల బలహీనతల నేపథ్యంలో సెంట్రల్ బ్యాంకులు కూడా పసిడి కొనుగోళ్ల వైపు మొగ్గుచూపుతున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, ‘ఆర్థిక మాంద్యం’ భయాలనూ సృష్టిస్తోంది. ఇవన్నీ ఫిజికల్ గోల్డ్ డిమాండ్కు సానుకూల అంశాలే. సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లతోనే పసిడి తేలిగ్గా 1,425 డాలర్లను చేరే అవకాశం ఉంది. మా తక్షణ టార్కెట్ ధర 1,450. – గోల్డ్మెన్ శాక్స్ -
రికార్డు స్థాయికి చేరిన చికెన్ ధర
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ మార్కెట్లో చికెన్ ధర అనూహ్యంగా పెరిగింది. కార్తీకమాసం ముగియడం, పెథాయ్ తుఫానుతో పెరిగిన చలి, క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో చికెన్ రేటు పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. రెండు వారాల క్రితం కిలో రూ.170 ఉన్న ధర ఇప్పుడు రూ.250కి చేరింది. చలికాలంలో సాధారణంగా చికెన్ ధరలు తక్కువగా ఉంటాయి. కానీ ఈసారి గతంలో ఎన్నుడూ లేని విధంగా ధరలు ఆకాశాన్నంటాయి. సాధారణ రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల కిలోల వరకు చికెన్ విక్రయాలు జరుగుతాయి. ఆదివారం మాత్రం 70 లక్షల కిలోల విక్రయాలు జరుగుతాయని అంచనా. ఈ క్రిస్మస్కు మాత్రం 1.5 కోట్ల కిలోల విక్రయాలు దాటాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నగర హోల్సేల్ మార్కెట్లో కోడి కిలో రూ.135 నుంచి రూ.140 మధ్య ఉంది. రిటైల్ మార్కెట్లో రూ.150 వరకు ఉంది. డ్రెస్డ్ ధర రూ.200 వరకు ఉండగా, స్కిన్లెస్ రూ.240 దాటుతోంది. మరికొద్ది రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. డిమాండ్ తగ్గ సరఫరా లేదు రాష్ట్ర అవసరాలకు తగ్గట్టు కోళ్ల సరఫారా లేకపోవడంతో చికెన్ ధరలు పెరిగుతున్నాయి. న్యూయర్ దాకా ధరలు ఇలాగా ఉంటాయి. ఫారంరేట్ కోడి ధర కిలో రూ.110 దాటింది. ఇందులో 33 శాతం ధరలు కలుపుకొని హోల్సెల్ వ్యాపారులు కిలో రూ.135 వరకు విక్రయిస్తారు. స్కిన్లెస్ కిలో హోల్సేల్ రూ.220 దాటింది. వినియోగదారులు ఎప్పటికప్పుడు పేపర్ రేటును గమనిస్తూ దాని ప్రకారమే చికెన్ కొనాలి. అంతకు మించి అధికంగా చెల్లించవద్దు. – డా.రంజీత్ రెడ్డి, తెలంగాణ బ్రీడర్స్ అసోసియోషన్ అధ్యక్షుడు -
తాజ్ మహల్ను చూడాలనుకుంటే..ఇకపై
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యద్భుతమైన కట్టడాల్లో ఒకటైన తాజ్మహల్ దర్శించాలనుకునేవారికి షాకింగ్ న్యూస్. ప్రపంచ వింతల్లో చోటు సంపాదించుకున్న తాజ్మహల్ టికెట్ రేటును అధికారులు భారీగా పెంచేశారు. ఏకంగా ఐదు రెట్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ముంతాజ్ ప్రేమకు గుర్తుగా షాజహాన్ ఆగ్రాలో నిర్మించిన పాలరాతి కట్టడం తాజ్మహల్కోసం టూరిస్టులు ఇకపై రూ. 250 (0.70డాలర్లు) చెల్లించాలి. అలాగే అంతర్జాతీయ పర్యాటకులు ఇప్పటివరకు చెల్లించే 16డాలర్లుకు బదులుగా ఇకపై 19డాలర్లు (సుమారు రూ.1,364) చెల్లించాలి. టూరిస్టులను పరిమితం చేసేందుకు ఈపెంపు నిర్ణయం తీసుకున్నామని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన అధికారి వెల్లడించారు. తాజ్మహల్ సందర్శకుల సంఖ్యను 40వేలకు పరిమితం చేయాలన్న నిర్ణయం నేపథ్యంలో ఈ చర్య. గతంలో ఈ సంఖ్య 70వేలుగా ఉంది. కాగా రోజుకు సగటున 10నుంచి 15వేల మంది పర్యాటకులు తాజ్మహల్ను సందర్శిస్తారట. 2016లో సుమారు 6.5 మిలియన్ల మంది 17శతాబ్దానికి చెందిన ఈ ప్రేమమందిరాన్ని వీక్షించినట్టు లెక్కలు చెబుతున్నాయి. -
గుడ్న్యూస్ : పొదుపు ఖాతాలపై పెరిగిన వడ్డీ రేట్లు
సాక్షి, న్యూఢిల్లీ : చిన్నతరహా పొదుపు ఖాతాల్లో మదుపు చేసే వారికి కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. జాతీయ పొదుపు సర్టిఫికెట్, పీపీఎఫ్ వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి 0.4 శాతం మేర పెంచింది. బ్యాంకుల్లో డిపాజిట్లపై పెరిగిన వడ్డీరేట్లకు అనుగుణంగా పొదుపు ఖాతాలపై వడ్డీరేట్లను సర్కార్ సవరించింది. చిన్నతరహా పొదుపు పథకాలపై వడ్డీరేట్లను ప్రతి త్రైమాసికంలో నోటిఫై చేస్తారు. 2018-19 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను సవరించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. వడ్డీ రేట్ల సవరణతో అయిదేళ్ల కాలపరిమితి డిపాజిట్పై వడ్డీరేటును 7.8 శాతానికి, సీనియర్ సిటిజెన్ పొదుపు పథకంపై వడ్డీరేటును 8.7 శాతానికి, రికరింగ్ డిపాజిట్పై వడ్డీ రేటు 7.3 శాతానికి పెరిగాయి. 4 శాతంగా ఉన్న సేవింగ్ డిపాజిట్లపై వడ్డీరేటును యథాతథంగా ఉంచారు. ఇక ప్రస్తుతం పీపీఎఫ్, ఎన్ఎస్సీపై 7.6 శాతం ఉన్న వడ్డీరేటు 8 శాతానికి పెరిగింది. సుకన్య సమృద్ధి ఖాతాలపై 0.4 శాతం వడ్డీరేటు అధికమై 8.5కు చేరింది. ఒకటి నుంచి మూడేళ్ల కాలపరిమితి డిపాజిట్లపై వడ్డీ రేటును 0.3 శాతం పెంచారు. -
మహీంద్రా ధరల పెంపు!
న్యూఢిల్లీ: పెరిగిన ముడివస్తువుల ధరల భారాన్ని వినియోగదారులకు బదిలీచేసే యోచనలో ఉన్నట్లు యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా వెల్లడించింది. పలు ప్యాసింజర్ వాహనాల ధరలను రూ.30,000 వరకూ (2 శాతం) పెంచే అవకాశం ఉందని ఎం అండ్ ఎం ఆటోమోటివ్ సెక్టార్ ప్రెసిడెంట్ రాజన్ వధెరా అన్నారు. పెరిగిన ధరలు ఆగస్టు నుంచి అమలయ్యే అవకాశం ఉందని తెలిపారు. టాటా మోటార్స్ సైతం ఆగస్టు నుంచి 2.2 శాతం మేర ధరలు పెరిగేందుకు అవకాశం ఉందని వెల్లడించిన విషయం తెలిసిందే. -
వెజిట్రబుల్స్!
మిర్యాలగూడ : కూరగాయల ధరలు చుక్కలనంటుతున్నాయి. వేసవికాలంలో జిల్లా వ్యాప్తంగా కూరగాయల సాగు తగ్గింది. దీంతో జిల్లా జనాభాకు సరిపోకపోవడంతో వ్యాపారులు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దిగుమతి ఖర్చులు పెరిగిపోవడం వల్ల అదే రీతిలో ధరలు పెంచారు. గత నెలకు ప్రస్తుత ధరలతో పోల్చితే మరింతగా పెరిగాయి. వ్యాపారులు కూరగాయలన్నీ విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాలనుంచి దిగుమతి చేసుకుంటున్నారు. కేవలం ఆకుకూరలు పట్టణాల శివారు ప్రాంతాల్లో సాగు చేయడం వల్ల వాటికి మాత్రమే తక్కువగా ధరలు ఉన్నాయి. అవి కూడా కేవలం ఉదయం వేళలోనే లభిస్తున్నాయి. పచ్చిమిర్చి మరింత ప్రియం జిల్లాలో 3,200 ఎకరాల్లో వివిధ రకాల కూరగాయల సాగు ఉంది. వేసవి కావడంతో సాగు సగానికిపైగా తగ్గింది. జూలైలో కొత్తగా నార్లు పోసుకుంటారు. జూన్ నుంచి కొత్త పంటలు సాగు చేయనున్నారు. అక్టోబర్ వరకు వానాకాలం పంటలు బెండకాయ, దోసకాయ, గోకర, బీర, కాకర తదితర పంటలు సాగు చేస్తారు. ఈ క్రమంలో మే నెలలో ఎండల తీవ్రతకు రైతులు పంటలు సాగు చేయలేదు. ఈ ప్రభావం ధరలపై తీవ్రంగా పడింది. పచ్చిమిర్చి మరింత ప్రియంగా మారింది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాలలో పచ్చి మిర్చి లభించడం లేదు. వ్యాపారులు గోవా, బెంగళూరు ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. రోజుకు ఒక లారీ పచ్చిమిర్చిని మిర్యాలగూడకు దిగుమతి చేసుకుంటే మార్కెట్లోని వ్యాపారులంతా తీసుకొని వినియోగదారులకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం పచ్చిమిర్చి కిలో 40 నుంచి 50 రూపాయలుగా ఉంది. అదే విధంగా టమాట కూడా స్థానికంగా లేకపోవడం వల్ల కనిగిరి నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. కిలో టమాట 15 రూపాయలకు విక్రయిస్తున్నారు. వారంలో పెరగనున్న ధరలు.. మరో వారం రోజుల్లో కూరగాయల ధరలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. కూరగాయలు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతులు చేసుకోవడం వల్ల దిగుమతి ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. సామాన్యులకు ధరలు భారమే కూరగాయల ధరలు విపరీతంగా ఉన్నాయి. సామాన్యులు అంత ధర పెట్టే పరిస్ధితి లేదు. ఉల్లిగడ్డ, టమాట తప్ప అన్నింటికీ ధరలు బాగానే ఉన్నాయి. ఎండా కాలం కావడం వల్ల కూరగాయలు కూడా రుచిగా లేవు. రోజు రోజుకూ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. – నాగలక్ష్మి, దొండవారిగూడెం వ్యాపారం బాగానే ఉంది గత నెల కంటే ఈ నెలలో కొంత వరకు వ్యాపారం బాగానే ఉంది. కానీ ఎండలు విపరీతంగా ఉండటంతో గ్రామీణ ప్రాంతాల నుంచి జనం రాకపోవడంతో కొంత ఇబ్బందిగానే ఉంది. మిర్చి గోవా, బెంగళూరు నుంచి వస్తుంది. దూరం నుంచి తీసుకరావడం వల్ల భారీ ఖర్చు అవుతుంది. టమాటను మాత్రం కనిగిరి నుంచి తీసుకవస్తున్నాం. – సత్తిరెడ్డి, వ్యాపారి (మిర్యాలగూడ) భగ్గు మంటున్న ధరలు మార్కెట్లో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. మిర్చి, కాకర, బీరకాయలు కొనలేని పరి స్థితి ఉంది. దీంతో సామాన్యులకు చాలా ఇబ్బందిగా మారి పోయింది. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న కూరగాయలు కావడం వల్ల వారం రోజు లకు సరిపడా కొనుగోలు చేసి నిల్వ ఉంచుకుంటే చెడిపోతున్నాయి. – ప్రమీల, మిర్యాలగూడ -
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
-
‘మునిసిపల్’ వేతనాలు పెంపు!
సాక్షి, హైదరాబాద్ : మునిసిపల్ ఔట్ సోర్సింగ్ కార్మికులకు శుభవార్త. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని 73 మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలు పెరగనున్నాయి. పారిశుధ్య కార్మికుల వేతనాలు రూ.8,300 నుంచి రూ.12,000లకు, డ్రైవర్ల వేతనాలు రూ.15 వేలకు, కంప్యూటర్ ఆపరేటర్లు/సీనియర్ అసిస్టెంట్లు/ఇతర కార్యాలయ సిబ్బంది వేతనాలు రూ.17,500కు పెరగనున్నాయి. ఈ మేరకు కార్మిక సంఘాల జేఏసీతో పురపాలక శాఖ కమిషనర్ టీకే శ్రీదేవి జరిపిన చర్చల్లో అంగీకారం కుదిరింది. పెరిగిన వేతనాలను ఏప్రిల్ నుంచే అమలు చేయనున్నారు. పెంపు ద్వారా 17,022 మంది కార్మికులకు ప్రయోజనం కలగనుంది. వీరిలో 11,497 మంది పురుషులు.. 5,525 మంది మహిళలున్నారు. జీవో నంబర్ 14 ప్రకారం.. రాష్ట్రంలోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచుతూ 2016 ఫిబ్రవరి 19న ఆర్థిక శాఖ జీవో నం.14 జారీ చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం కార్మికుల వేతనాలు పెంచుతామని శ్రీదేవి హామీ ఇచ్చినట్లు కార్మిక సంఘాల జేఏసీ ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ తెలిపారు. వేతనాల పెంపుతో పాటు బకాయి వేతనాల చెల్లింపు, ఎన్ఎంఆర్ ఫిక్స్డ్ పే కార్మికుల క్రమబద్ధీకరణ, అంత్యక్రియల ఖర్చుకు రూ.20 వేలు, చెప్పులు, నూనెలు తదితర డిమాండ్లపై త్వరలో ఆదేశాలు జారీ చేస్తామన్నారని తెలిపారు. వేతనాల పెంపు కోసం ఈ నెల 25 నుంచి సమ్మె బాట పట్టిన కార్మికులు.. పెంపునకు ప్రభుత్వం అంగీకరించడంతో సమ్మె విరమించి ఆదివారం విధులకు హాజరయ్యారు. జీహెచ్ఎంసీలో రెండేళ్ల కిందట ఔట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలు పెంచిన విషయం తెలిసిందే. పురపాలికల తీర్మానాలతో.. ఔట్ సోర్సింగ్ కార్మికుల వేతనాల పెంపునకు అనుకూలంగా ఇప్పటికే 56 పురపాలికలు కౌన్సిల్ సమావేశాల్లో తీర్మానం చేశాయి. పెంపును వ్యతిరేకిస్తూ నర్సంపేట మునిసిపల్ కౌన్సిల్ తీర్మానం చేసింది. మిగిలిన 16 పురపాలికలు ఒకటి రెండు రోజుల్లో సమావేశమై నిర్ణయం తీసుకోనున్నాయి. అన్ని పురపాలికల్లో ఈ నెల 30లోగా కౌన్సిల్ సమావేశాలు నిర్వహించి పెంపుపై తీర్మానం చేయాలని మునిసిపల్ కమిషనర్లను పురపాలక శాఖ ఆదేశించింది. పెంపునకు వ్యతిరేకంగా తీర్మానించిన నర్సంపేటలో మళ్లీ సమావేశం నిర్వహించి అనుకూలంగా తీర్మానం చేయాలని అక్కడి అధికారులను ఆదేశించినట్లు పురపాలక శాఖ వర్గాలు తెలిపాయి. కొత్త పురపాలికల్లోనూ.. ప్రస్తుతం గ్రామ పంచాయతీ హోదా గల 136 గ్రామాల విలీనంతో రాష్ట్రంలో 68 కొత్త పురపాలికలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే ఉన్న 45 పురపాలికల్లో మరో 173 గ్రామాలు విలీనమవనున్నాయి. వచ్చే ఆగస్టు నుంచి అమల్లోకి రానున్న ఈ ప్రాంతాల్లోని ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాల పెంపు కూడా తక్షణమే అమల్లోకి రానుంది. ఇతర పురపాలికలతో సమానంగా కొత్త పురపాలికల్లోనూ వేతనాలు చెల్లించాలని కార్మిక సంఘాల జేఏసీ పేర్కొంది. -
సహజవాయువు ధర పెంపు: వంటగ్యాస్ మంటలేనా?
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరోసారి సహజవాయువు ధరను పెంచేసింది. చమురు మంత్రిత్వ శాఖలోని పెట్రోలియం ప్లానింగ్ అండ్ ఎనాలిసిస్ సెల్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం సహజ వాయువు ధర 6శాతం పెరిగింది. దీంతో సహజవాయువు ధర రెండేళ్ల గరిష్టానికి చేరింది. ఈ చర్య మూలంగా సీఎన్జీ, పీఎన్జీ పైప్డ్ వంటగ్యాస్ ధరలు భారీగా పెరగనున్నాయని విశ్లేషకుల అంచనా. తాజా పెంపుతో మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్(ఎంఎంబీటీయూ) ధర 3.06 డాలర్లు చొప్పున పెరగనుంది. ధరలు పెంచకముందు ఇది 2.89 డాలర్లుగా ఉంది. సవరించిన ధరలు ఏప్రిల్ 1నుంచి అమల్లోకి రానున్నాయి. ఆరు నెలల పాటు అక్టోబర్ దాకా ఈ ధరలు అమల్లో ఉంటాయి. అధిక లోతు, అధిక వేడి, అధిక పీడనం ఉన్న ప్రాంతాల నుంచి వెలికితీసే గ్యాస్ ధరను 9 శాతం అంటే ఎంఎంబీటీయూకు 6.78 డాలర్ల చొప్పున పెంచింది. దేశీయ గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ధర కూడా 3శాతం పెరగనుంది. అలాగే సీఎన్జీ, వంటగ్యాస్ లు ధరలు 50-55 పైసలు , స్టాండర్డ్ క్యూబిక్ మీటర్కు 35-40 పైసలు పెరగనున్నట్టు అంచనా. మరోవైపు కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో సహజ వాయువును ఉత్పత్తి చేస్తున్న ఓఎన్జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్లాంటి సంస్థలకు భారీగా లబ్ధి చేకూరనుంది. కాగా అమెరికా, రష్యా , కెనడా వంటి గ్యాస్ మిగులు దేశాలలోని సగటు రేట్లు ఆధారంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి సహజ వాయువు ధరల సమీక్ష ఉంటుంది. -
ఒక్కసారిగా 67 శాతం ఛార్జీలు పెరిగాయి
సాక్షి, చెన్నై : దాదాపు ఆరేళ్ల తర్వాత తమిళనాడులో బస్సు ఛార్జీలు పెరిగాయి. ఊహించని రీతిలో 67 శాతం పెంచి రవాణా శాఖ పెద్ద షాకే ఇచ్చింది. కాగా, శనివారం నుంచే పెంచిన ధరలు అమలులోకి వచ్చాయి. ఇక పెరిగిన ధరలను ఓసారి పరిశీలిస్తే... చెన్నై నగర పరిధిలోని మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ పరిధిలో టికెట్ కనిష్ఠ ధరను 5 రూపాయలుగా నిర్ణయించింది. ఇంతకు ముందు అది 3 రూపాయలుగా ఉండేది. గరిష్ఠ ధరను 14-23 రూపాయలుగా సవరించింది. నాన్-మెట్రో ఛార్జీల విషయంలో 3రూ. నుంచి 5. రూలకు పెంచి.. గరిష్ఠ ధరను 12 నుంచి 19 రూపాయలకు సవరిచింది. గ్రామీణ సర్వీసులు, ఆర్టీనరీ సర్వీసులపై మినమిమ్ టికెట్ ధరను ఒక రూపాయి పెంచి 6 రూ. గా నిర్ణయించింది. ఎక్స్ ప్రెస్ బస్సుల మినిమమ్ టికెట్ ధరను 17 నుంచి 24 రూ. లకు పెంచేసింది. నాన్-స్టాప్ డీలక్స్ బస్సులపై 18 నుంచి 27 రూ., అల్ట్రా డీలక్స్ బస్సుల ధరను 21 నుంచి 33 రూపాయలకు పెంచేసింది. ఏసీ బస్సు, వోల్వెల సర్వీసులపై ఈ బాదుడు అదే స్థాయిలో కనిపిస్తోంది. ఏసీ బస్సులపై 27 రూపాయల నుంచి 42 రూపాయలకు.. వోల్వో సర్వీసులపై 33 నుంచి 51 రూపాయలకు పెంచేసింది. కొండ ప్రాంత సర్వీసులపై కూడా రేట్లు పెరిగిపోయాయి. ఆర్డీనరీ బస్సుపై మూడు రూపాయలు పెంచి 7రూ.20పై. గా నిర్దారించింది. ఎక్స్ప్రెస్ బస్సులపై 12 రూపాయలు పెంచి 32 రూపాయలు చేసింది. గతంలో ఇది 20రూ. గా ఉండేది. దీనికితోడు టోల్ ఛార్జీలు, యాక్సిడెంట్ సెటిల్ మెంట్ క్లెయిమ్స్ కోసం ప్రయాణికులు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రమాదాల్లో గాయపడినా, ప్రాణాలు కోల్పోయినా.. బాధితులకు చెల్లించే ఇన్సూరెన్స్ విధానాల్లో కూడా ప్రభుత్వం గణనీయమైన మార్పులు చేసింది. చివరిసారిగా 2011లో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఛార్జీలు పెంచారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే... కాగా, ఛార్జీల పెంపుపై తమిళనాడు రవాణా మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. రవాణా వ్యవస్థ ఇప్పటికే నష్టాల్లో ఉండగా.. జీతాలు పెంచాలని రవాణ సంస్థ ఉద్యోగులు చేసిన సమ్మెతో అవి భారీ స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలను అనుసరించి ధరలను పెంచాల్సి వచ్చింది’’ అని తమిళనాడు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాలతో పోలిస్తే ఈ పెంపు చాలా తక్కువేనని, ఈ రాష్ట్రాలు మూడేళ్లు ముందే బస్సు ఛార్జీలను గణనీయంగా పెంచాయని రవాణా శాఖ వివరించింది. రాష్ట్రంలో 8 ప్రభుత్వ రవాణా సంస్థలు, ప్రైవేటు రవాణా సంస్థలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, తప్పని పరిస్థితుల్లోనే ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని రవాణా శాఖ వివరణ ఇచ్చుకుంది. -
పెరిగిన ఎల్పీజీ గ్యాస్, కిరోసిన్ ధరలు
న్యూఢిల్లీ : సబ్సిడైజ్డ్ వంట గ్యాస్(ఎల్పీజీ) ధరలు పెరిగాయి. సిలిండర్ కు రెండు రూపాయల పెరిగినట్టు తెలిసింది. అదేవిధంగా కిరోసిన్ రేటు కూడా లీటరుకు 26 పైసలను పెరిగింది. చిన్న చిన్నగా ధరలు పెంచుతూ ప్యూయల్ పై అందిస్తున్న సబ్సిడీలను ప్రభుత్వం తొలగించనున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థల సమాచారం మేరకు ఎల్పీజీ ధరలు ఢిల్లీలో 14.2కేజీల సిలిండర్ కు రూపాయి 87 పైసలు పెరిగినట్టు వెల్లడైంది. దీంతో ఒక్కో సిలిండర్ రూ.442.77కు చేరింది. ఏప్రిల్ 1నే ఆయిల్ కంపెనీలు సబ్సిడీ గ్యాస్ ఎల్పీజీపై ధరలను పెంచాయి. అప్పుడు రూ.5.57 పెంచుతూ 14.2కేజీల సిలిండర్ ధరను రూ.440.90గా నిర్ణయించాయి. ప్రతినెలా క్రమానుగుణంగా సిలిండర్ రేట్లను పెంచుతూ సబ్సిడీలను తగ్గించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా నాన్-సబ్సిడైజ్డ్ వంట గ్యాస్ పై అంతర్జాతీయ ట్రెండ్ ల ప్రకారం 92 రూపాయలను ప్రభుత్వం తగ్గించింది. దీంతో ఏప్రిల్ 1 నుంచి ఆ సిలిండర్ పై రేటు రూ.14.50 తగ్గింది. ప్రస్తుతం కిరోసిన్ పై పెంచిన 26 పైసలతో ముంబైలో లీటరు కిరోసిన్ ధర రూ.19.55గా ఉంది. ప్రతినెలా కిరోసిన్ పై కూడా ప్రభుత్వం 25పైసలు చొప్పున సబ్సిడీకి కోత పెట్టాలని యోచిస్తోంది. -
మళ్ళీ పెట్రో మోత!
న్యూఢిల్లీః పెట్రోల్ ధరలు మళ్ళీ పెరిగాయి. పెట్రోల్ పై లీటరుకు 5 పైసలు చొప్పున పెరుగగా... డీజిల్ పై లీటర్ కు రూ.1.26 పైసలు పెరిగింది. ప్రస్తుతం సవరించిన ధరలు బుధవారం అర్థరాత్రినుంచి అమల్లోకి రానున్నాయి. సవరించిన ధరల తర్వాత రాజధాని నగరంలో పెట్రోల్ లీటరుకు రూ.65.65 పైసలు కాగా, డీజిల్ లీటర్ ధర రూ.55.19 పైసలకు చేరినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది. ప్రతినెలా ఒకటి, 16 తేదీల్లో ధరలను సవరించడంలో భాగంగా ప్రస్తుతం మరోసారి ధరలు పెరిగాయి. ఏప్రిల్ 16 నుంచి ఇప్పటివరకూ పెరిగిన ధరలను బట్టి చూస్తే, పెట్రోల్ పై లీటరుకు రూ.9.04 పైసలు పెరుగగా, మార్చి నెలనుంచి డీజిల్ లీటరుకు రూ.11.05 పైసలు పెరిగింది. -
ఆయన జీతం.. రూ. 74 కోట్లు!
బెంగళూరు: ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా జీతం భారీగా పెరిగింది. తాజాగా ఇన్ఫోసిస్ విడుదల చేసిన ఫలితాల్లో కంపెనీ మంచి లాభాలు ఆర్జించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఏడాదికి ఆయన దాదాపు 74 కోట్ల రూపాయలను జీతభత్యాలుగా అందుకోనున్నారు. 2016 ఆర్థిక సంవత్సరంలో సిక్కా ఇన్ఫోసిస్ ఆదాయాన్ని 63,446 కోట్ల రూపాయలకు చేర్చారు. అక్కడితో ఆగిపోకుండా నాస్ కామ్ అంచనాలను తలక్రిందులు చేస్తూ 13.3 శాతం వృద్ధిని కూడా నమోదు చేసింది. దీంతో కంపెనీ సీఈవోగా సిక్కా పదవీ కాలాన్ని మరో రెండేళ్ల పాటు పెంచింది. అంటే 2021 వరకు సిక్కానే ఇన్ఫోసిస్ సీఈవోగా కొనసాగనున్నారు. సిక్కా పే స్కేల్లో మార్పులతో కంపెనీ సీనియర్ల జీతభత్యాల్లో కూడా మార్పులు రానున్నాయి. అయితే, మిగతా ఉద్యోగుల జీతాలను కంపెనీ వెల్లడించలేదు. రెండేళ్ల క్రితం ఇన్ఫోసిస్ భారీ నష్టాలను చవిచూసిన విషయం తెలిసిందే. -
దిగ్విజయ్ సింగ్ కు కలిసొచ్చింది...!
మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కు భారీగా కలిసొచ్చింది. వేతనాలు పెంచాలంటూ గతంలో బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు చేసిన డిమాండ్ పై ప్రభుత్వం స్పందించింది. వేతనాలను పెంచుతూ ప్రకటన వెలువరించింది. దీంతో మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కు కూడ ఏడు రెట్లు జీతం పెరిగింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వేతనాలు పెంపుపై శనివారం ప్రకటన చేశారు. వేతనాలను పెంచాలంటూ బిజెపి, కాంగ్రెస్ చట్టసభ సభ్యుల డిమాండ్ కు శివరాజ్ సింగ్ ప్రభుత్వం ఈ సంవత్సరం ఏప్రిల్ మొదటివారంలోనే ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రులు, స్పీకర్, ఎమ్మెల్యేలకు జీతం పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ తాజా నిర్ణయంతో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కు కూడ భారీగా ప్రయోజనం కలిగింది. తాజా నిర్ణయంతో మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ జీతం కూడ ఏడు రెట్టు పెరిగింది. దీంతో ప్రస్తుతం 26,000 రూపాయలు జీతాన్ని అందుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి ఇకపై నెలకు 1.7 లక్షలు పొందే అవకాశం ఉంది. -
ఏడాదిన్నరలోనే రెండోసారి చార్జీలమోత
-
రాష్ట్రంలో చీప్ లిక్కర్కు గేట్లు బార్లా
-
రాష్ట్రంలో చీప్ లిక్కర్కు గేట్లు బార్లా
- దసరా ముందు రోజు ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చీప్ లిక్కర్కు రాష్ట్ర ప్రభుత్వం గేట్లు బార్లా తెరిచింది. వీలైనంత ఎక్కువగా మద్యాన్ని తాగించడం ద్వారా ఎక్కువ ఆదాయం అర్జించడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. చౌక మద్యం పేరుతో చీప్ లిక్కర్కు దసరా ముందు రోజు గేట్లు తెరిచింది. అందుకనుగుణంగా తక్కువ రకం మద్యం ధరలపై ఎక్సైజ్ డ్యూటీని, వ్యాట్ను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని రకాల మద్యంపై ఎక్సైజ్ డ్యూటీని, వ్యాట్ను పెంచుతూ ఉత్తర్వులిచ్చింది. దీంతో తక్కువ రకం మద్యం ధరలు మరింత తక్కువ కానుండడంతో పాటు విక్రయాలు పెరిగి ప్రభుత్వానికి మరింత ఆదాయం పెరగనుంది. ప్రస్తుతం 90 మిల్లీ లీటర్ల మద్యం బాటిల్స్ మాత్రమే అందుబాటులో ఉండగా కొత్తగా 60 మిల్లీ లీటర్ల మద్యం బాటిల్స్ను కూడా మార్కెట్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక నుంచి 60 మిల్లీ లీటర్ మద్యం రూ.20 లకే లభ్యం కానుంది. -
మద్యం ధరల పెంపు
హైదరాబాద్: ప్రయాణికుల నడ్డి విరిగేలా ఆర్టీసీ బస్ చార్జిలు పెంచిన కొద్ది సేపటికే మద్యం ధరలను కూడా పెంచుతున్నట్లు చంద్రబాబు సర్కార్ ప్రకటించింది. ఖరీదైన ప్రీమియం మద్యంతోపాటు సామాన్యుడు సేవించే చీప్ లిక్కర్ ధర కూడా పెరిగింది. ఈ మేరకు జీవో నంబర్ 394, 395 లను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. పెంచిన ధరలు నేటి నుంచే అమలులోకి వస్తాయని పేర్కొంది. ధరల పెరుగుదలలోని ముఖ్యాంశాలు ప్రీమియం మద్యం ధరలు: కనిష్ఠంగా రూ. 25 నుంచి గరిష్ఠంగా రూ. 100 పెంపు చీప్ లిక్కర్: కనిష్ఠంగా రూ.5 నుంచి గరిష్ఠంగా రూ.10 పెంపు బీరు, వైన్ ధరల్లో స్వల్ప తగ్గుదల పెరిగిన ధరలతో ప్రభుత్వానికి ఏటా రూ.200 కోట్ల అదనపు ఆదాయం -
పెరిగిన డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: దాదాపు నాలుగు నెలల తర్వాత మరోసారి చమురు ధరలు పెరిగాయి. ఒక లీటరు డీజిల్ ధరను 50 పైసలు పెంచుతున్నట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. పెరిగిన ధరలు బుధవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తాయి. కాగా, పెట్రోల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. గడిచిన నాలుగు దఫాల ధరల మార్పుల్లో డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. -
ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు!
సాక్షి, విజయవాడ బ్యూరో: ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఆర్టీసీని గట్టెక్కించేందుకు బస్సు చార్జీల పెంపు, ప్రయాణికుల సంఖ్య పెంపు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని సంస్థ ఎండీ జె.పూర్ణచంద్రరావు ఆదివారం తెలిపారు. ఆర్టీసీకి రూ.2,500 కోట్ల మేర అప్పులున్నాయన్నారు. గత ఐదేళ్లలో బంద్లు, ఆందోళనలు, సమ్మెల కారణంగా మరో రూ.2,233 కోట్ల నష్టం వచ్చిందని వివరించారు. 40 శాతం ఆర్టీసీ బస్సులను గ్రామీణ ప్రాంతాల్లోనే తిప్పుతున్నామని, వీటి వల్ల కేవలం 28 శాతమే ఆదాయం వస్తోందన్నారు. ఆర్టీసీని రిలయన్స్కు అప్పగించనున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ భవనాల నిర్మాణానికి కనీసం 50 ఎకరాలు అవసరమవుతాయన్నారు. ఆర్టీసీ నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాల కోసం అవకాశం ఉన్న అన్ని వనరులను తప్పనిసరి పరిస్థితుల్లో ఉపయోగించుకోవాల్సి వచ్చిందని, అందులో భాగంగానే సీసీఎస్ సొమ్మును ఖర్చు చేశామని ఎండీ పూర్ణచంద్రరావు వెల్లడించా రు. ఆర్టీసీ ఉద్యోగులు దాచుకున్న సీసీఎస్ సొమ్ము చెల్లింపు, ఇతర సమస్యలపై ఎంప్లాయీస్ యూనియన్ సమ్మె నోటీసు ఇవ్వటంపై స్పందిస్తూ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సమ్మె నివారణకు చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. -
‘ఆమ్నీ’లో చార్జీల మోత
రాష్ట్రంలో మళ్లీ ఆమ్నీ బస్సుల్లో చార్జీలు పెరగనున్నాయి. రూ.50 నుంచి రూ.70 మేరకు టికెట్ల ధరను ఆయా ట్రావెల్స్ యాజమాన్యాలు పెంచేందుకు సిద్ధమయ్యాయి. దీంతో ప్రయాణికుల మీద అదనపు భారం పడనుంది. డీజిల్ ధరల పెరుగుదల, టోల్ ట్యాక్స్ల పెంపు వెరసి చార్జీలను పెంచక తప్పడం లేదని ఆమ్నీ యాజమాన్యాల సంఘం కోశాధికారి మారన్ స్పష్టం చేశారు. సాక్షి, చెన్నై:రాష్ట్ర రాజధాని నగరం చెన్నై నుంచి దక్షిణాది జిల్లాలకు, నగరాలకు, పట్టణ కేంద్రాలకు అటు ప్రభు త్వ, ఇటు ప్రైవేటు బస్సులు నిత్యం పరుగులు తీస్తుం టాయి. పక్క రాష్ట్రాల్లోని బెంగళూరు, మైసూరు, విజ యవాడ, విశాఖ పట్నం, హైదరాబాద్, కర్నూలుతోపాటు ముంబై వంటి ఉత్తరాది నగరాలకు ఈ బస్సులు నడుస్తున్నాయి. ప్రభుత్వ బస్సుల మీద కన్నా, ప్రైవేటు బస్సులను ఆశ్రయించే వారు అధికం. సౌకర్యం, సుఖమయ ప్రయాణం ఓవైపు, అతి వేగంగా దూసుకెళుతూ త్వరితగతిన గమ్యస్థానాలకు చేర్చడం మరో వైపు వెరసి అత్యధిక శాతం ప్రయాణికుల దృష్టిలో ఆమ్నీ బస్సులు పడ్డాయి. ఓల్వో, హైటెక్, డీలక్స్, సూపర్, సెమి డీలక్స్ ఇలా ప్రైవేటు హంగులతో ఉండే ఈ బస్సుల్లో చార్జీలు వసతులకు తగ్గట్టుగానే ఉంటాయి. ఇటీవల ప్రమాదాల నివారణ అడ్డుకట్ట లక్ష్యంగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు, ఆంక్షల మేరకు బస్సుల్లో సౌకర్యాలు మరింత పెరిగాయి. దీన్ని సాకుగా చూపుతూ మేలో రూ.20 నుంచి రూ.50 వరకు చార్జీలను ఈ బస్సుల యాజమాన్యాలు వడ్డించాయి. తాజాగా డీజిల్ ధరల పెంపు, పెరిగిన టోల్ చార్జీలు తదితర కారణాలను ఎత్తి చూపుతూ మరోమారు చార్జీల్ని పెంచేందుకు ఆమ్నీ యాజమాన్యాలు సిద్ధమయ్యాయి. చార్జీల వడ్డన : సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి కొత్త టోల్ చార్జీలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో దక్షిణాది జిల్లాల వైపుగా వెళ్లే బస్సులకు నాలుగు లేదా ఐదు టోల్ గేట్లు ఎదురవుతాయి. ఈ టోల్ ఫీజులతో పాటుగా డీజిల్ ధర తరచూ పెరుగుతుండడంతో చార్జీల్ని పెంచాలన్న నిర్ణయానికి ఆమ్నీ యాజమాన్యాలు వచ్చాయి. డీలక్స్ ఓల్వో, బెర్త్ సౌకర్యం కలిగిన బస్సుల్లో రూ.50 నుంచి 70 వరకు చార్జీల్ని పెంచేందుకు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం చెన్నై నుంచి మదురైకు డీలక్స్ బస్సుల్లో రూ.600, ఓల్వోల్లో రూ.800, బెర్త్ సీట్స్కు రూ.860 వసూలు చేస్తున్నారు. ఈ చార్జీలకు అదనంగా రూ. 50 నుంచి 70 వరకు పెరగనున్నాయి. ఇదే రకంగా మిగిలిన ప్రాంతాలకు చార్జీలు వడ్డించనున్నారు. దీపావళి ముందస్తు రిజర్వేషన్ పేరిట ఈ చార్జీలను అమల్లోకి తీసుకురాబోతున్నామని యాజమాన్య సంఘాలు పేర్కొంటున్నా, ఇప్పటికే ట్రావెల్స్ యాజమాన్యాల చార్జీల్లో రూ.పది నుంచి ఇరవై వరకు పెంచి ఉన్నాయి. తాజా పెంపు నిర్ణయంతో మరింతగా వసూళ్లు పెరగనున్నాయి. తప్పడం లేదు: చార్జీల పెంపు తప్పడం లేదని ఆమ్నీ బస్సు యాజమాన్యాల సంఘం కోశాధికారి మారన్ స్పష్టం చేశారు. డీజిల్ ధరలు తరచూ పెరుగుతున్నాయని వివరించారు. తాజాగా, టోల్ ఫీజులను 35 శాతం మేరకు పెంచారని పేర్కొన్నారు. ఇది వరకు ఓ టోల్ గేట్లో రూ.150 చెల్లించే వాళ్లమని, ప్రస్తుతం రూ.225 చెల్లించాల్సి వస్తోందన్నారు. ఇన్సూరెన్స్ రుసుం పెరగడం, కేంద్ర ప్రభుత్వం ఐదు శాతం సేవా పన్ను విధించడం వెరసి తమ మీద అదనపు భారం పడుతోందని వివరించారు. అనేక యాజమాన్యాలు బస్సులను నడిపేందుకు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆమ్నీ బస్సులు రోడ్డెక్కలేని పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని, అన్ని సమస్యలు, పరిస్థితుల్ని అధిగమించి బస్సులు నడపాలా? అన్న డైలమాలో ఎందరో యజమానులు ఉన్నారని వివరించారు. కొందరు యాజమాన్యాలు సంక్లిష్ట పరిస్థితుల్లో బస్సులు నడుపుతుంటే, ప్రభుత్వాల నిర్ణయాలు నష్టాల్లోకి నెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాజా పరిస్థితులతో చార్జీల వడ్డన తప్పడం లేదన్నారు. ప్రస్తుత చార్జీలకు రూ.50 అదనంగా పెంచాలని నిర్ణయించామని, దీపావళి ముందస్తు రిజర్వేషన్ సమయంలో ఈ పెంపు వర్తింప చేయబోతున్నామని పేర్కొన్నారు. దీపావళి రిజర్వేషన్ అని యాజమాన్యాలు పేర్కొంటున్నా, దీపావళికి హౌస్ఫుల్ బోర్డులతో మరింత అదనపు చార్జీలను వడ్డించడం ఆమ్నీ యాజమాన్యాలకు పరిపాటే. ఈ దృష్ట్యా, తాజా చార్జీల వడ్డన అమల్లోకి వచ్చినట్టే! -
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
-
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోల్ ధర లీటర్కు 1.69 రూపాయిలు పెరిగింది. డీజిల్ ధరను లీటర్కు 50 పైసలు పెంచారు. సోమవారం అర్ధరాత్రి నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయి. ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టాక కఠిన నిర్ణయాలు తప్పవని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల రైల్వే చార్జీలను భారీగా పెంచగా, తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీనివల్ల ప్రజలపై నేరుగా భారం పడనుంది. -
రెలైక్కలేం
-
పెట్రోల్ 70పైసలు.. డిజిల్ 50 పైసలు